Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Khammam507001

రుణమాఫీ చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా

Oct 29, 2024 05:29:17
Khammam, Telangana
రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాలని ఖమ్మం కలెక్టర్ వద్ద రైతు సంఘాలు ధర్నా చేసాయి. రుణమాఫీ కాకపోవడంతో రైతాంగం నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నట్లు రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం ఒక క్లారిటీతో లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాగం హేమంతరావు, మౌలానా పాల్గొన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Dec 27, 2025 11:38:24
Hyderabad, Telangana:

Giant Anaconda Video Watch: సోషల్ మీడియా యుగంలో వింతలు విశేషాలకు సంబంధించిన దృశ్యాలు మనం రోజు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా కొన్ని పాములతో పాటు జంతువులకు సంబంధించిన వింత వీడియోలు ఎంతో ఆసక్తిగా చూస్తాం. అలాగే కొంతమంది జంతువులను పట్టుకుంటున్న సమయంలో కూడా తీసిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. మరి కొంతమంది పాములను పట్టుకుంటున్న సందర్భంలో తీసిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తే జనాలు వైరల్ చేస్తున్నారు. ఇలా పాములకు సంబంధించిన వీడియోలైతే జనాలు ఎంతో ఇష్టంగా చూస్తున్నారు.. తాజాగా కూడా ఇలాంటి పాములకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే ద రెప్టైల్ జూ (The Reptile Zoo) అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన వీడియో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తుంది. చాలామంది చిన్న పాములను చూసి వాటికి ఆమెడ దూరం పరిగెడతారు.. అలాంటిది ఈ వీడియోలో ఓ మహిళ ఏకంగా ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ పాములను నీటిలో నుంచి బయటికి తీస్తోంది. అంతేకాకుండా వాటితో ఆమె ముద్దు ముద్దుగా ఆడుకుంటుంది. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

వీడియో వివరాల్లోకి వెళితే..జూ కీపర్ జూలియట్ బ్రూవర్ పాములకు ప్రత్యేకంగా తయారుచేసిన ఎన్‌క్లోజర్ నుంచి అత్యంత భారీ అనకుండా లను ఒక్కొక్కటిగా బయటికి తీసుకురావడం మీరు చూడొచ్చు. ఆమె మొదటగా ఆ ఎన్‌క్లోజర్‌లో ఉన్న నీటిలో నుంచి అత్యంత భారీ అనకుండాను బయటికి తీసింది. అంతేకాకుండా బయటికి తీస్తున్న సమయంలో వీడియోకి చూపించడం కూడా మీరు గమనించవచ్చు. అలాగే ఆ వెంటనే ఆశ్చర్యకరంగా మరో పామును బయటకు తీసింది. ఇలా ఆ యువతి వెంట వెంటనే వరుసగా ఐదు అనకొండ పాములను బయటికి తీసి నేలపై ఉంచింది. ఆమె వాటిని అందులో నుంచి ఎత్తి బయటికి తీయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని అని తెలుస్తోంది.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

అయితే, ఇదే సమయంలో ఆమె అనకొండ గురించి చెబుతూ వచ్చింది.. అనకొండల చర్మం కొంచెం నీలిరంగులో మెరుస్తూ ఉంటుందని.. అలాంటి సమయంలోనే కుబుసం విడిచేందుకు సిద్ధమైందని ఆమె వీడియోలో వివరించింది. వీడియో చివరిలో.. ఆ ఐదు పాములు ఒకే చోట పెద్ద కుప్పగా ఏర్పడడం చూస్తుంటేనే..ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇవి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నప్పటికీ ఆ యువతి ఏ మాత్రం భయపడకుండా స్వీట్ గర్ల్ అంటూ పిలుస్తూ ఎంతో ప్రేమగా చూసుకోవడం విశేషం. ఇప్పుడు ఈ దృశ్యాలు చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలు రకరకాలుగా కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 27, 2025 11:24:36
Hyderabad, Telangana:

Motorola Signature Series Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మోటోరోలా మరోసారి మార్కెట్‌ను కుదిపేసేందుకు సిద్ధమైంది. తమ కొత్త సిగ్నేచర్ సిరీస్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు వార్తలు విపరీతంగా వస్తున్నాయి. దీనిని కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది మోటార్లకు మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ ఫోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. అయితే, కంపెనీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా.. కొన్ని లీకైన ఫీచర్లు మాత్రం ఇది ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలియజేస్తోంది. అంతేకాకుండా ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్‌ బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా కనిపించడంతో విడుదలకు సిద్ధమైందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మోటరోలా సిగ్నేచర్ సిరీస్ మొబైల్స్ ఫ్లాగ్‌షిప్ డిజైన్‌తో పాటు ఫీచర్లతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన టీజర్ను ఫ్లిప్‌కార్ట్‌లో రన్ చేస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ సిరీస్‌కు సంబంధించిన డిజైన్ కూడా త్వరలో వెల్లడించబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సిగ్నేచర్ సిరీస్‌తో పాటు కంపెనీ మరికొన్ని పరికరాలను కూడా విడుదల చేసేందుకు యోచిస్తోందని సమాచారం.. ముఖ్యంగా ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కొన్ని ఫీచర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో విడుదల చేయబోతోంది. 

Also Read: Honor Power 2 5G మొబైల్ త్వరలో వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మొత్తం అదుర్స్‌!

అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ 8జిబి ర్యామ్ బేస్ వేరియంటులో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ డిజైన్ చూడడానికి ఇటీవల మార్కెట్లోకి విడుదలైన మోటరోలా ఎడ్జ్ 70 మొబైల్ మాదిరిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెనక భాగంలో త్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని మూడు కెమెరాలు 50MPతో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. దీనిని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా జనవరిలో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ ను కూడా అధికారికంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సిగ్నేచర్ సిరీస్ మొబైల్ ఫ్లాగ్ షిప్ ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది విడుదలైన వెంటనే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కి అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ధరపై ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.  ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదల అయితే సాంసంగ్, రెడ్మీ, రియల్ మీ, వన్ ప్లస్ ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్స్‌తో పోటీపడే అవకాశాలున్నాయి.

Also Read: Honor Power 2 5G మొబైల్ త్వరలో వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మొత్తం అదుర్స్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 27, 2025 08:01:29
Hyderabad, Telangana:

30-foot Python Video Watch Here: ప్రకృతిలో కొన్ని దృశ్యాలు నిత్యం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా ఓ అటవీ ప్రాంతంలో బయటపడిన అత్యంత భారీ కొండచిలువకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఊహించని స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో భారీ కొండచిలువను జెసిబి సహాయంతో తరలిస్తున్న దృశ్యాలు నెటిజన్లు చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ వీడియోలో ఆ ప్రాణంతో ఉన్న కొండచిలువ అటు ఇటు కదులుతుండడం చూసి భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎక్కడో కానీ ఓ నిర్మాణ స్థలంలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ భారీ కొండచిలువ కనిపించింది.  దీని పరిమాణం చూసి వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అంతేకాకుండా అక్కడ ఉన్న కొంతమంది భయాందోళనకు కూడా గురైనట్లు సమాచారం. ఈ వీడియోలో ఉన్న కొండచిలువ దాదాపు 30 అడుగుల కంటే ఎక్కువగానే పడుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పనిచేస్తున్న కార్మికులు అక్కడినుంచి ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇది అసాధారణమైన అనకొండ అని.. ఇలాంటి అరుదైన పాములు ప్రపంచంలో కొన్ని చోట్లనే జీవించగలుగుతాయని వీడియో చూసిన వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. 

అయితే అక్కడి నుంచి పారిపోయిన కార్మికులు వెంటనే వారికి సంబంధించినపై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి రెస్క్యూ బృందం చేరుకొని.. ప్రత్యేకమైన ఆపరేషన్ చేపట్టింది. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. చేసేదేం లేక చేతులతో పట్టుకోవడం అసాధ్యమని భావించి.. జెసిబి కి సంబంధించిన బకెట్ తో ఆ కొండచిలువని ఎంతో జాగ్రత్తగా పైకి ఎత్తి.. రెస్క్యూ చేసేందుకు అక్కడి నుంచి తరలించారు. అయితే, ఈ సమయంలో ఆ భారీ అనకుండా జెసిబి బాకెట్‌తో ఎత్తినప్పటికీ నేలకు అంటుతూ ఉండడం విశేషం. దీన్ని చూస్తే ఇది ఎంత బరువు ఉంది అనేది మీరు క్లియర్‌గా చెప్పొచ్చు.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

ఈ ఘటనను అక్కడే ఉన్న కొంతమంది కార్మికులు వారి స్మార్ట్‌ఫోన్స్‌లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియో ను యూట్యూబ్ షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోను కొన్ని లక్షలమంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇలా పోస్ట్ చేసిన వీడియోకు ప్రపంచంలోనే అతిపెద్ద కొండచిలువ పామని క్యాప్షన్ రాశారు. ఈ భారీ కొండచిలువను చూసిన వన్యప్రాణి సంరక్షకులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. కేవలం ఇలాంటి పాములు అమెజాన్ అడవికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో జీవించగలుగుతాయని వారి అభివర్ణిస్తున్నారు.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
BBhoomi
Dec 27, 2025 04:16:37
Secunderabad, Telangana:

Budget 2026 aam aadmi expectations: బడ్జెట్ 2026 సమీపిస్తున్న వేళ.. దేశవ్యాప్తంగా సామాన్యులు, మధ్యతరగతి ఆశతో ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నెలనెలా పెరుగుతున్న EMIల భారం, స్థిరంగా లేని ఉద్యోగ పరిస్థితులు.. వీటన్నింటి  మధ్య ప్రభుత్వం ఈసారి నేరుగా తమ జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటుందా అనే ప్రశ్న ప్రజల మనసుల్లో మెదులుతోంది. జీతాలు పెరగకపోయినా ఖర్చులు మాత్రం పెరుగుతున్న ఈ కాలంలో.. బడ్జెట్ 2026 సామాన్యుల జేబుకు ఎంత ఉపశమనం ఇస్తుందన్నదే ఆసక్తి నెలకొంది. 

ఈసారి బడ్జెట్‌లో ప్రధానంగా చర్చకు వచ్చే అంశం ఆదాయపు పన్ను ఉపశమనం. ముఖ్యంగా 30 శాతం పన్ను స్లాబ్‌పై చాలా కాలంగా మధ్యతరగతి నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ. 24 లక్షలు దాటితేనే నేరుగా 30 శాతం పన్ను వర్తిస్తోంది. ద్రవ్యోల్బణం, పిల్లల విద్య, వైద్య ఖర్చులు, గృహ రుణాలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితి పాతదైందన్న భావన బలంగా వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వం ఈ స్లాబ్‌ను రూ. 40 నుంచి రూ. 50 లక్షల వరకు పెంచవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇది అమలైతే, మధ్యతరగతిలోని జీతం పొందే వర్గానికి ప్రతి ఏడాది వేల రూపాయల మేర ప్రత్యక్ష లాభం చేకూరుతుంది. వారి చేతిలో మిగిలే డబ్బు పెరిగి, వినియోగం కూడా పెరుగుతుంది.

అదేవిధంగా.. కొత్త పన్ను విధానంలో ప్రామాణిక మినహాయింపును మరింత పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిమితిని రూ. 1 లక్ష వరకు పెంచితే, జీతం పొందే వారికి స్పష్టమైన ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో, సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు పరిమితిని కూడా పెంచవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇవన్నీ కలిసి ఒక సాధారణ కుటుంబానికి సంవత్సరానికి గణనీయమైన పొదుపు అందించగలవు.

Also Read: 8th Pay Commission latest: జీతమే కాదు.. స్కీములపైనా ప్రభావం? ఈ రెండు పథకాల భవిష్యత్ ఏంటీ? 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్..!!  

మధ్యతరగతికి మరో పెద్ద కల ఏంటంటే.. సొంత ఇల్లు. అయితే పెరిగిన వడ్డీ రేట్లు, ఖరీదైన ఇళ్ల ధరలు ఈ కలను మరింత దూరం చేస్తున్నాయి. బడ్జెట్ 2026లో ప్రభుత్వం సరసమైన గృహనిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త పన్ను విధానంలో స్వీయ నివాస గృహాలపై గృహ రుణ వడ్డీ మినహాయింపును తిరిగి తీసుకురావడం, దాని పరిమితిని పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంటే, అది ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి పెద్ద ఊరట అవుతుంది. తక్కువ, మధ్య ఆదాయ వర్గాలకు వడ్డీ సబ్సిడీ లేదా ప్రత్యేక రుణ పథకాలు ప్రవేశపెడితే, రియల్ ఎస్టేట్ రంగం కూడా చైతన్యం పొందుతుంది.

ఉపాధి సృష్టి కూడా ఈ బడ్జెట్‌లో కీలక అంశంగా మారనుంది. యువతకు ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలకు మద్దతు.. ఇవి ప్రభుత్వ ప్రాధాన్యాలుగా ఉండే అవకాశముంది. శ్రమాధారిత రంగాలకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, MSMEలకు సులభ రుణాలు అందిస్తే, కొత్త ఉద్యోగాలు ఏర్పడటంతో పాటు స్వయం ఉపాధి కూడా పెరుగుతుంది.

మొత్తానికి.. బడ్జెట్ 2026 సామాన్యులు, మధ్యతరగతి ఆశలను కేంద్రంగా చేసుకుని రూపొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పన్ను ఉపశమనం, గృహనిర్మాణ సౌలభ్యం, ఆరోగ్య భద్రత, ఉపాధి అవకాశాలు.. ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంటే, అది కోట్లాది కుటుంబాల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకురాగలదు. బడ్జెట్ రోజు ఏ నిర్ణయాలు వెలువడతాయో చూడాల్సిందే. కానీ ఆశలు మాత్రం బలంగానే ఉన్నాయి.

Also Read: Platinum: బంగారం, వెండి పక్కకు తప్పుకుంటే మంచిది.. వాటికి మించిన కింగ్‌ ఇక్కడ.. ఈ లోహంలో పెట్టుబడి పెడితే మీ తలరాత మారడం ఖాయం..!!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Dec 27, 2025 03:08:41
Secunderabad, Telangana:

Gold Rate Today:  అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా బంగారం.. వెండి మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పసిడి ధరలు ఇప్పటికే చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ఇప్పుడు మరోసారి రేట్ల కోతకు అవకాశం ఉందనే అంచనాలు వెలువడటంతో బంగారం, వెండి ధరలు మరింత వేగంగా పైకి దూసుకెళ్తున్నాయి. గత వారం రోజులుగా ఈ రెండు లోహాల ధరలు రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

డిసెంబర్ 27న బంగారం.. వెండి ధరలు మరోసారి భారీగా పెరిగి ఆల్ టైమ్ హైలను తాకాయి. ఫెడ్ వచ్చే ఏడాదిలో కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముందని సంకేతాలు రావడమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డాలర్ బలం తగ్గుతుంది. అలాగే ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడులు కూడా పడిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారంపై డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌ను పరిశీలిస్తే.. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,533 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. గత రోజు వరకు ఇది 4,500 డాలర్ల దిగువన ఉండటం గమనార్హం. మరోవైపు వెండి ధర మరింత వేగంగా పెరుగుతూ ఔన్సుకు 79.38 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఈ పెరుగుదల ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా శనివారం ఉదయం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం పెద్దగా మార్పులేకుండా రూ. 89.93 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ గణనీయంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 700 పెరిగి ప్రస్తుతం రూ. 1,28,350 వద్ద ఉంది. దీనికి ముందు కూడా వరుసగా కొన్ని రోజులు రూ. 300, రూ. 350, రూ. 1,800, రూ. 2,200 చొప్పున పెరుగుదల నమోదైంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 770 పెరిగి రూ. 1,40,020కు చేరుకుంది. ఇవి దేశీయ మార్కెట్‌లో నమోదైన అత్యధిక ధరలుగా నిలిచాయి.

బంగారాన్ని మించి వెండి ధరలు మరింత దూకుడుగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్క రోజులోనే వెండి ధర కిలోకు ఏకంగా రూ. 9,000 పెరగడంతో ప్రస్తుతం రూ. 2.54 లక్షల స్థాయికి చేరుకుంది. గత నెల రోజుల గమనిస్తే వెండి ధర దాదాపు రూ. 70 వేల వరకు పెరగడం విశేషం. గత నెల ఇదే సమయంలో కిలో వెండి ధర సుమారు రూ. 1.60 లక్షల వద్ద ఉండగా, ఇప్పుడు రూ. 2.30 లక్షలు దాటడం వెండి వేగాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

Also Read: 8th Pay Commission latest: జీతమే కాదు.. స్కీములపైనా ప్రభావం? ఈ రెండు పథకాల భవిష్యత్ ఏంటీ? 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్..!!  

బంగారం ధరలు ఇలా ఆకాశాన్ని తాకుతుండటంతో ఆభరణాల కొనుగోలు సామాన్యులకు భారంగా మారింది. గత కొన్ని రోజులుగా బంగారు దుకాణాల్లో కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే పెట్టుబడి కోణంలో చూస్తే బంగారం భవిష్యత్తులో కూడా బలంగా కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు 2026 వరకూ బంగారం ధరల్లో బుల్లిష్ ధోరణి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.

ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం కూడా బంగారం ధర పెరుగుదలకు కీలక కారణంగా మారింది. ట్రెజరీ బాండ్లపై రాబడులు తగ్గడంతో ఇన్వెస్టర్లు ఆ పెట్టుబడుల నుంచి బయటకు వచ్చి బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. భద్రమైన ఆస్తిగా గుర్తింపు పొందిన బంగారం ఇలాంటి అనిశ్చిత కాలాల్లో మరింత ఆకర్షణీయంగా మారుతోంది.

దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధాన నిర్ణయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు వెళ్లవచ్చన్న భయాలు కూడా ఇన్వెస్టర్లను బంగారం వైపు నడిపిస్తున్నాయి. ఈ అన్ని అంశాలు కలసి బంగారం, వెండి ధరలను రోజురోజుకు కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Also Read: Platinum: బంగారం, వెండి పక్కకు తప్పుకుంటే మంచిది.. వాటికి మించిన కింగ్‌ ఇక్కడ.. ఈ లోహంలో పెట్టుబడి పెడితే మీ తలరాత మారడం ఖాయం..!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
GSG Shekhar
Dec 27, 2025 01:53:56
Hyderabad, Telangana:

Telangana Global Summit Fail: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో జయేష్ రంజన్ ఒకరు..! కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆయన కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కొనసాగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి కేటీఆర్ కు అన్నితానై వ్యవహరించారు. ముఖ్యంగా అప్పట్లో కేటీఆర్ కు చాలా దగ్గరి వ్యక్తిగా జయేష్ రంజన్ కొనసాగారు. కానీ ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో..ఆయన్ను బదిలీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం జయేష్ రంజన్ కు బదిలీ చేయలేదు. ఆయనకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శిగా సుదీర్ఘ అనుభవం ఉండటంతో కంటిన్యూ చేసింది. కానీ ఇప్పుడు ఆయన్ను బదిలీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జయేష్ రంజన్ బదిలీపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇటీవల తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమాన్ని ప్రభుత్వం హాట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి దాదాపు 6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వం అంతకుమించి పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావించిందట. కానీ ప్యూచర్ సిటీలో నిర్వహించిన కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో జయేష్ రంజన్ పూర్తిగా విఫలం కావడంతోనే ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోందట. మరోవైపు సీఎంవోలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ రంజన్ తన పరిధి దాటి పరిశ్రమల శాఖ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారట. ఇటీవల పరిశ్రమల శాఖ మెయిల్ ఐడీని దగ్గర పెట్టుకుని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఇబ్బంది పెట్టారనే విమర్శలున్నాయి. ఈ వ్యవహారంపై సదరు పేషీ అధికారులు సీఎస్ కు ఫిర్యాదు సైతం చేశారట. ఇక పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్‌కు మళ్లించేలా ప్రభుత్వం రూపొందించిన హిల్ట్ పాలసీ వెనుక జయేష్ రంజన్ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గ్లోబల్ సమ్మిట్ ఊహించనంతన సక్సెస్ కాలేదని ప్రభుత్వం భావిస్తోందని అందుకే ఆయనపై బదిలీ వేటు వేశారని బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోందని తెలుస్తోంది. 

ఇదిలా ఎంటు అధికార పార్టీలో మాత్రం మరో రకం చర్చ జరుగుతోందట. ఇటీవల జీహెచ్ఎంసీని ప్రభుత్వం విస్తరించింది. నగరాన్ని ఓఆర్ఆర్ వరకు విస్తరించే.. 300 డివిజన్లు ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే గ్రేటర్ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కాబోతోంది. అయితే గ్రేటర్ కాంగ్రెస్ కు పెద్దగా బలంలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ఏరియాలో ఎక్కువగా సీట్లు సంపాదించిన కాంగ్రెస్ పార్టీ.. గ్రేటర్ లో మాత్రం ఒక్క సీటు గెలవలేకపోయింది. దాంతో గ్రేటర్ పీఠంపై ఈసారి పాగా వేయాలని భావిస్తోంది. కొత్త ఏడాదిలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అందుకే నగరంలో ఎంతో అనుభవం ఉన్న జయేష్ రంజన్ ను రంగంలోకి దింపారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే జయేష్ రంజన్ కు ఆదనపు బాధ్యతలు అప్పగించిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ప్రస్తుతం మెట్రో పాలిటన్ ఏరియా స్పెషల్ సీఎస్‌గా నియమించడంతో పాటు, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్‌గా కూడా ఆయన్నే కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మొత్తంమీద జయేష్ రంజన్ బదిలీపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ ముందుస్తు ప్లాన్ భాగంగానే జయేష్‌ రంజన్‌ను బదిలీ చేశారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అనుభావాన్ని వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం.. జయేష్ బదిలీ వెనుక పెద్ద కహానీ ఉందని అంటోంది. జయేష్ బదిలీ వెనుక హిల్ట్ పాలసీ, ప్రభుత్వంలో కీలక సమాచారం లీకుల వ్యవహారమే కారణంగా చెబుతోంది. ఏదీఏమైనా జయేష్ రంజన్ ట్రాన్స్ ఫర్ మాత్రం.. రెండు పార్టీలో రకరకాల చర్చకు కారణం అవుతోంది.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 27, 2025 01:34:53
HYDERABAD, Telangana:

Palamuru Politics: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గడ్డు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రేవంత్‌ రెడ్డి సొంత జిల్లా అయినా కూడా పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. తాజాగా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నవాబుపేట మండలం వెంకటేశ్వర తండాకు చెందిన సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు శుక్రవారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్‌ నాయకులు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు గ్రామస్తులందరూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాబు నాయక్, ప్రస్తుత కాంగ్రెస్ ఉపసర్పంచ్ తావూరియా, ఆరుగురు వార్డు సభ్యులు పార్టీ మారడం విశేషం. వెంకటేశ్వర తండా సర్పంచ్ సేవ్యా నాయక్, కొల్లూరు మాజీ సర్పంచ్ రాజు, నాయకులు చందర్ నాయక్ నేతృత్వంలో రెండు బస్సుల్లో గ్రామస్తులు ఎర్రవల్లి నివాసానికి తరలివచ్చారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తాము బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వంపై నమ్మకంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు చెప్పారు. స్థానిక నాయకత్వం, కేసీఆర్ విజన్‌పై గౌరవం ఉండడంతో గులాబీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటించారు. ఈ చేరికతో జడ్చర్ల నియోజకవర్గంలో  బీఆర్ఎస్ పార్టీ కొత్త ఉత్సాహం రాగా.. కాంగ్రెస్‌ పార్టీతోపాటు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 26, 2025 17:25:02
Erravalli, Telangana:

KCR Assembly Session: కృష్ణా జలాలపై భారీ మోసం చేస్తున్న రేవంత్‌ రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాలపై తీవ్ర అన్యాయం చేస్తుండడంపై ఇటీవల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకటించినట్టు 'ఐ యామ్‌ ద ఫీల్డ్‌'లో భాగంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ నాయకుల సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం

సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో శుక్రవారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కేసీఆర్‌ సమావేశం అయ్యారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ మూడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిం.దే ఈ సందర్బంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నాయకులతో సమావేశమై సభలను ఎప్పుడు? ఎక్కడ? ఏర్పాటు చేయాలనే దానిపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

Also Read: GHMC Gift: హైదరాబాద్‌ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గిఫ్ట్‌! ఏమిటో తెలుసా?

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణపై పార్టీ ముఖ్య నాయకులతో గులాబీ బాస్‌ కేసీఆర్‌ చర్చించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం బహిరంగ సభలు నిర్వహించే అంశాన్ని సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలోనే 29వ తేదీన శాసనసభకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పార్టీ నాయకులతో కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్‌.. వారికి కొత్త ఉద్యోగాలు

కాంగ్రెస్ నాటి నుంచీ తెలంగాణకు ఎప్పుడు ద్రోహమేనని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు ఉండదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్దాం.. ఉద్యమాన్ని  నిర్మిద్దామని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైనే ఉందని ప్రకటించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని పార్టీ నాయకులకు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహం, అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు చెబుదామని కేసీఆర్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 26, 2025 16:56:52
Hyderabad, Telangana:

Hyderabad: నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది. అధికారాన్నీ కేంద్రీకృతం చేయడంతో హైదరాబాద్‌ ప్రజలకు పట్టణ సేవలు సులభంగా లభించనున్నాయి. సులభంగా, వేగంగా పౌర సేవలు అందనుండడంతో ప్రజలు కష్టాలు తొలగిపోనున్నాయి. పరిపాలన వ్యవస్థీకరణతో హైదరాబాద్‌ మహానగరం అభివృద్ధి మరింత వేగిరం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) పరిధిలో 20 పురపాలికలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి మొత్తం 27 పట్టణ స్థానిక సంస్థలను (యూఎల్‌బీలు) విలీనం చేయడంతో హైదరాబాద్ పుర పాలనలో ఒక నూతన దశ ప్రారంభం కానుంది.

జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి విస్తృతం కానుంది. ఇప్పటివరకు ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. ఈ నిర్ణయంతో విస్తీర్ణం, జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ అవతరించనుంది. వార్డుల పునర్వ్యవస్థీకరణ 150 నుంచి 300కు పెరగనుంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా గెజిట్‌లో నోటిఫై చేసిన సమగ్ర డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచారు.

దీని ద్వారా ప్రజాప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడం తద్వారా విస్తరించిన పట్టణ ప్రాంతాల్లో పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. వికేంద్రీకృత పాలనకు జోన్లు, సర్కిళ్ల పునర్నిర్మాణం జరగనుంది. విలీనంతో పెరిగిన పరిపాలనా బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీని గత 6 జోన్లు, 30 సర్కిళ్ల నుంచి 12 జోన్లు, 60 సర్కిళ్లకు పునర్వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

జీహెచ్ఎంసీ జనాభా 1.34 కోట్లకు మించి ఉండడంతో ఈ మార్పులు వికేంద్రీకరణ, పరిపాలనా సమానత్వం, మెరుగైన సేవల అందించేందుకు దోహదం కానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జోనల్ కమిషనర్ల నియామకం చేపట్టింది. నూతన పరిపాలనా నిర్మాణానికి అనుగుణంగా జీహెచ్ఎంసీకి 12 మంది జోనల్ కమిషనర్లను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 26 వ తేదీన బాధ్యతలు స్వీకరించడంతో పునర్వ్యవస్థీకరించిన జోన్లలో పరిపాలన తక్షణమే అమల్లోకి రావడం గమనార్హం. దీంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పాలన మరింత బలోపేతం కానుంది.

కొత్తగా విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధితో భూలభ్యత, రవాణా, నివాసం, వర్షపు నీటి పారుదల, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సమగ్ర మెట్రోపాలిటన్ ప్రణాళికలు అమలు చేసే అవకాశం లభించింది. విలీనమైన ప్రాంతాలకు జీహెచ్ఎంసీ  నిధులు, సాంకేతిక నైపుణ్యం, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, దోమల నివారణ, అత్యవసర సేవలు వంటి ప్రామాణిక పౌర సేవలు అందనున్నాయని ప్రభుత్వం తెలిపింది. విస్తృత పన్నుల ఆధారం, సరళీకృత పరిపాలనతో జీహెచ్ఎంసీ ఆర్థిక, సంస్థాగత సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 

ఈ పునర్వ్యవస్థీకరణతో సమతుల్య పట్టణ అభివృద్ధి, మెరుగైన విపత్తుల,వరదల నిర్వహణ, నగర కేంద్రం నుంచి అంచు ప్రాంతాల వరకూ సమాన మౌలిక వసతుల అభివృద్ధి సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. విస్తరించిన, పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీ సమర్థ పాలన, సమగ్ర అభివృద్ధి, సుస్థిర పట్టణ వృద్ధి అనే లక్ష్యాలతో హైదరాబాద్ భవిష్యత్తుకు ఒక ఏకీకృత విధానాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రపంచస్థాయి మెట్రోపాలిటన్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా  నిపుణులు భావిస్తున్నారు.

0
comment0
Report
BBhoomi
Dec 26, 2025 15:05:06
Secunderabad, Telangana:

8th Pay Commission latest: 8 వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. వేతనాలు ఎప్పుడు పెరుగుతాయి? సిఫార్సులు ఎప్పుడు అమలవుతాయి? తమకు ఇప్పటివరకు అందుతున్న ముఖ్యమైన పథకాల భవిష్యత్తు ఏమవుతుంది? వంటి ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం,  గృహానికి సంబంధించిన పథకాలపై ఉద్యోగులు ఎక్కువగా దృష్టి పెట్టారు.8వ వేతన సంఘం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది కానీ.. ప్రస్తుతం అమలులో ఉన్న కీలక పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. 

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS)

CGHS అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లు.. వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన ఆరోగ్య సంరక్షణ పథకం ఇది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వెల్‌నెస్ సెంటర్లు, ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందిస్తుంది.  సాధారణ వైద్య పరీక్షలు.. నిపుణుల సంప్రదింపులు.. ల్యాబ్ టెస్టులు.. చికిత్సలు.. శస్త్రచికిత్సలు.. అవసరమైన మందులు ఈ పథకం కింద కవర్ అవుతాయి.

అంతేకాదు. CGHSలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి గరిష్ట బీమా పరిమితి ఉండదు. ప్యాకేజీ ఆధారిత విధానంలో చికిత్స అందిస్తుంది. లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో e-CGHS కార్డును సులభంగా పొందవచ్చు. తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండటం వల్ల ఈ పథకం కేంద్ర ఉద్యోగులకు ఎంతో కీలకంగా మారింది.

కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ అడ్వాన్స్ (HBA)

ఇల్లు కొనడం లేదా నిర్మించుకోవడం అనేది ప్రతి ఉద్యోగి కల. ఈ లక్ష్యాన్ని సులభం చేయడానికి కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మార్కెట్ వడ్డీ రేట్లతో పోలిస్తే చాలా తక్కువ వడ్డీకి గృహ రుణాన్ని పొందవచ్చు. ఇల్లు కొనుగోలు చేయడం.. ప్లాట్ నిర్మాణం.. ఇంటి పునరుద్ధరణ లేదా విస్తరణ వంటి అవసరాల కోసం ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు.

Also Read:  Copper Price: బంగారం కాదు, వెండి అంతకన్నా కాదు.. మార్కెట్‌లో ఇప్పుడు ఈ లోహమే కింగ్‌..!!

HBA కింద ఒక ఉద్యోగి తన ప్రాథమిక జీతం, డియర్‌నెస్ అలవెన్స్ (DA) కలిపిన మొత్తానికి గరిష్టంగా 34 రెట్లు లేదా గరిష్టంగా రూ. 25 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఈ లోన్ పై వడ్డీ రేటు సాధారణంగా 6 శాతం నుంచి 7.5 శాతం మధ్యలో ఉంటుంది. ఇది బ్యాంకు రుణాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ పథకం ప్రధానంగా శాశ్వత ఉద్యోగులకు వర్తిస్తుంది. అయితే కొన్ని షరతులతో తాత్కాలిక ఉద్యోగులకు కూడా అవకాశం ఉంటుంది. ఈ లోన్ పొందాలంటే ఉద్యోగి కనీసం ఐదు సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు పూర్తి చేసి ఉండాలి. అలాగే.. గతంలో ప్రభుత్వ గృహాన్ని పొందకూడదు లేదా ఇల్లు సంబంధిత ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను ఉపయోగించుకుని ఉండకూడదు.

మొత్తంగా.. CGHS,  HBA పథకాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతతో పాటు గృహ భరోసాను అందిస్తున్న కీలక ఆధారాలుగా ఉన్నాయి. 8 వేతన సంఘం సిఫార్సులు వచ్చిన తర్వాత వీటిలో ఏవైనా మార్పులు జరుగుతాయా? అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అప్పటివరకు ఈ పథకాలు ఉద్యోగుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయి.

Also Read: PM Jan Aushadhi VS Dawa India: పీఎం జన ఔషధి వర్సెస్ దవా ఇండియా.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఎందులో తక్కువ ధరకు ఔషధాలు లభిస్తాయి..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Dec 26, 2025 14:34:35
0
comment0
Report
BBhoomi
Dec 26, 2025 13:44:19
Secunderabad, Telangana:

CEO Gives rs.2,000 Crore in Bonus to Employees: ఉద్యోగులకు బోనస్  ఇవ్వడం అనేది సాధారణంగా అన్ని కంపెనీల్లో జరిగే వ్యవహారమే. కానీ తాజాగా ఒక సీఈవో తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసింది. తన ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు ఆయన చేసిన త్యాగం తెలిస్తే..మీరు గ్రేట్ సార్ అనక తప్పరు. ఏం చేశారో తెలుసా? ఏకంగా తన కంపెనీని అమ్మేశారు. అందులో వచ్చిన మొత్తంలో భారీ భాగాన్ని ఉద్యోగుల కోసం కేటాయించారు. ఫలితంగా వందలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా కోట్లాది రూపాయలు బోనస్ అందుకున్నారు. ఇది వినేందుకు కలలా అనిపించినా.. జరిగింది మాత్రం నిజమే. 

ఈ  సంఘటన జరిగింది అమెరికాలోని లూసియానాకు చెందిన ఫైబర్ బాండ్ అనే సంస్థలో. ఈ కంపెనీకి గ్రాహమ్ వాకర్ సీఈవోగా ఉన్నారు. ఆయన తండ్రి క్లాడ్ వాకర్ 1982లో ఈ సంస్థను స్థాపించారు. దశాబ్దాలుగా ఈ కంపెనీతో కలిసిన ఎదిగిన ఉద్యోగులను తమ కుటుంబమని గ్రాహమ్ భావిస్తుండేవారు. అదే భావన ఆయన తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణం అయ్యింది. 

అయితే ఇటీవల ఫైబర్ బాండ్ ను ప్రముఖ సంస్థ ఈటన్ సుమారు 1.7 బిలియన్ డాలర్లకు  కొన్నది. అయితే ఈ డీల్ పూర్తయ్యే ముందు గ్రాహమ్ వాకర్ ఓ కీలక కండిషన్ పెట్టారు. కంపెనీ అమ్మకపు మొత్తంలో 15 శాతం వాటా.. అంటే దాదాపు రూ. 2,000 కోట్లను.. కంపెనీలో పనిచేస్తున్న 540 మంది ఉద్యోగులకు బోనస్‌గా కేటాయించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగులు లేకుండా ఈ కంపెనీ ఇంత దూరం రాలేదని ఆయన అభిప్రాయం. ఆశ్చర్యకరంగా.. ఈటన్ సంస్థ కూడా ఆ షరతుకు అంగీకరించింది.

Also Read: PM Jan Aushadhi VS Dawa India: పీఎం జన ఔషధి వర్సెస్ దవా ఇండియా.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఎందులో తక్కువ ధరకు ఔషధాలు లభిస్తాయి..!!

దీంతో వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రతి ఉద్యోగికి సగటున రూ. 4 కోట్ల వరకు బోనస్ అందే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో బోనస్ మొత్తం జమ అవుతుండగా.. కొత్త యాజమాన్యంలో ఉద్యోగంలో కొనసాగితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మొదట ఈ వార్త బయటకు వచ్చినప్పుడు చాలామంది నమ్మలేకపోయారు.  ఇది లాటరీ గెలిచినట్లే ఉంది  అని ఒక ఉద్యోగి వ్యాఖ్యానించగా.. మరికొందరు ఈ డబ్బుతో తమ అప్పులు తీర్చుకోవచ్చని భావోద్వేగానికి లోనయ్యారు.

1990ల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని తమ జీవితంలో మర్చిపోలేని క్షణంగా అభివర్ణిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఇంతటి గిఫ్ట్ వస్తుందని ఎవరూ ఊహించలేదని వారు చెబుతున్నారు. డిసెంబర్ 31తో గ్రాహమ్ వాకర్ సీఈఓ పదవికి వీడ్కోలు పలకనున్నారు. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఎప్పటికీ ఉద్యోగుల హృదయాల్లో నిలిచిపోతుంది.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇలాంటి బాస్ ప్రతి ఉద్యోగికి కావాలి..  ఇది నిజమైన లీడర్‌షిప్..  ఉద్యోగులను కుటుంబంలా చూసే వ్యక్తి  అంటూ గ్రాహమ్ వాకర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. లాభాలకంటే మనుషుల విలువను ముందు పెట్టిన ఈ కథ ఇప్పుడు ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.

Also Read:  Copper Price: బంగారం కాదు, వెండి అంతకన్నా కాదు.. మార్కెట్‌లో ఇప్పుడు ఈ లోహమే కింగ్‌..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 26, 2025 12:33:52
Keraniganj, Dhaka Division:

Bangladesh Hindu Killed: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ఇటీవల మైమెన్‌సింగ్‌లో దైవదూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని దారుణంగా హత్య చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

మైనారిటీలే లక్ష్యంగా దాడులు..
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల తీవ్రతను భారత్ ఎత్తిచూపింది.  తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై 2,900 కంటే ఎక్కువ హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.

దీపు చంద్ర దాస్ హత్యను ఖండిస్తూ, బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇవి కేవలం మీడియా సృష్టి లేదా రాజకీయ హింస కాదని, ఇవి మైనారిటీలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులని జైస్వాల్ స్పష్టం చేశారు.

పొరుగు దేశంలో నెలకొన్న అస్థిరతపై భారతదేశం తన వైఖరిని స్పష్టంగా వివరించింది. తమ దేశంలోని మైనారిటీల ప్రాణాలకు, ఆస్తులకు, మతపరమైన స్థలాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానిదే అని భారత్ పునరుద్ఘాటించింది. బంగ్లాదేశ్‌లో ప్రచారంలో ఉన్న తప్పుడు భారత వ్యతిరేక కథనాలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. బంగ్లాదేశ్‌లో శాంతి, స్థిరత్వం నెలకొనాలని.. అక్కడ స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, అందరినీ కలుపుపోయే ఎన్నికలు జరగాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది.

బంగ్లాదేశ్ ప్రజలతో సంబంధాలు
బిఎన్‌పి (BNP) నాయకుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు తిరిగి రావడంపై స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ప్రజలతో తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని జైస్వాల్ పేర్కొన్నారు. అక్కడి పరిణామాలను భారతదేశం నిశితంగా గమనిస్తోందని ఆయన తెలిపారు.

చివరిగా.. పొరుగు దేశంలో మైనారిటీలపై జరుగుతున్న నిరంతర శత్రుత్వం చాలా ఆందోళనకరమైన విషయమని, తక్షణమే శాంతిభద్రతలను పునరుద్ధరించాలని భారతదేశం బంగ్లాదేశ్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.

Also Read: School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్లకు 9 రోజులు సెలవులు..ఎప్పుడూ లేనంతగా ఈ సంక్రాంతికి భారీ సెలవులు!

Also Read: Prabhas Billa Actress: ప్రభాస్ సినిమాలో గ్లామర్ క్వీన్..12 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ..బాంబు పేల్చిన హీరోయిన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Dec 26, 2025 12:30:57
Secunderabad, Telangana:

Govt employees cover medical treatment scheme upto 10 lakhs: కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన ఆరోగ్య భద్రతా పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆయుష్మాన్ తరహా నగదు రహిత వైద్య సేవలను 2026 నాటికి రాష్ట్రంలోని దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ పథకం ద్వారా ఉద్యోగులు,  వారి కుటుంబాలకు ఆసుపత్రుల్లో ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందే అవకాశం ఉంటుంది. 

ఈ ప్రతిపాదిత పథకానికి  ముఖ్యమంత్రి ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకం  అనే పేరు పెట్టారు. ఉద్యోగి సంఘాల సూచనలు, దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఈ పథకాన్ని రూపొందించారు. ఆయుష్మాన్ భారత్ తరహాలోనే రాష్ట్రంలోపల, రాష్ట్రం వెలుపల ఉన్న ప్రైవేట్,  ఎంపిక చేసిన ఆసుపత్రులతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. దీని వల్ల ఉద్యోగులు ఎక్కడైనా చికిత్స పొందే సౌలభ్యం కలుగుతుంది.

ఈ పథకం కింద సాధారణ వైద్య చికిత్సలు, OPD సేవలకు రూ.5 లక్షల వరకు ఉచిత కవరేజ్ అందించనున్నారు. తీవ్ర అనారోగ్యాల విషయంలో ఈ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచే ప్రతిపాదన ఉంది. ఈ ప్రయోజనాలు ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు, అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా వర్తించనున్నాయి.

ఈ ఆరోగ్య బీమా పథకానికి అవసరమైన నిధుల్లో ఒక భాగాన్ని ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీతం లేదా పెన్షన్ నుండి నెలకు రూ.250 నుంచి రూ.1,000 వరకు విరాళంగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 2020లో రాష్ట్ర ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అప్పట్లో ఆ పథకం అమలుకు నోచుకోలేదు. ఈసారి మాత్రం స్పష్టమైన విధివిధానాలతో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: 8th Pay Commission: 8వ వేతన సంఘం తర్వాత ప్యూన్ నుండి IAS వరకు ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయి? ఫిట్‌మెంట్‌ ఎంత డిమాండ్‌ చేస్తున్నారు?

ఈ పథకం ద్వారా శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులు, బోధనా కేడర్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామ ఉపాధి సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు వంటి విభిన్న విభాగాల ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. వీరి సంఖ్య 15 లక్షలకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ఉద్యోగులు వైద్య ఖర్చులను ముందుగా స్వయంగా భరిచి, తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. తీవ్రమైన అనారోగ్యాల సమయంలో ఈ విధానం వారికి భారీ ఆర్థిక భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, నగదు రహిత వైద్య సేవలు ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా మారనున్నాయి. ఉద్యోగి సంఘాలు ఈ పథకాన్ని స్వాగతిస్తున్నాయి.  పెన్షనర్లు, ఉద్యోగులు వైద్య ఖర్చుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయాలి  అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ ప్రతిపాదన త్వరలో క్యాబినెట్ ముందుకు వెళ్లనుందని, ఆమోదం లభిస్తే 2026లో అమలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

Also Read: Encumbrance Certificate: ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ డాక్యుమెంట్‌ సరిగ్గా లేకపోతే తిప్పలు తప్పవు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
Advertisement
Back to top