రుణమాఫీ చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
Khammam, Telangana:రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాలని ఖమ్మం కలెక్టర్ వద్ద రైతు సంఘాలు ధర్నా చేసాయి. రుణమాఫీ కాకపోవడంతో రైతాంగం నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నట్లు రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం ఒక క్లారిటీతో లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాగం హేమంతరావు, మౌలానా పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Allu Arjun Remuneration: 'రాకా' సినిమా కోసం అల్లు అర్జున్ పారితోషకం ఎంతో తెలుసా? భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు!
Hyderabad, Telangana:Allu Arjun Raaka Remuneration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతోన్న బారీ బడ్జెట్ చిత్రం 'రాకా'. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'రాకా' సినిమాలో ఫస్ట్లుక్ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో హీరోగా అల్లు అర్జున్ విలక్షణ పాత్ర పోషిస్తున్నట్లు.. తోడేలు చేతిని చూపిస్తూ కనిపించాడు. ఒక్క ఫస్ట్లుక్తో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది చిత్రబృందం. భారీగా విజువల్ ఎఫెక్ట్స్తో తెరకెక్కనున్న ఈ మూవీకి దాదాపుగా రూ.900 నుంచి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారన్న వార్తల నడుము నటీనటులు రెమ్యూనరేషన్ గురించి తెగ చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయి హంగులతో విజువల్ ఎఫెక్ట్స్తో అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కోసం నిర్మాతలు ఖర్చుకు వెనుకాడడం లేదట.
ఇంతటి భారీ బడ్జెట్ చిత్రంలో నటీనటుల రెమ్యునరేషన్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 'రాకా' సినిమా కోసం కథానాయకుడు అల్లు అర్జున్ దాదాపు రూ.175 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదే విధంగా ఈ సినిమాలోని హీరోయిన్ దీపికా పదుకొణె కూడా హీరోకి తగ్గట్టుగా రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో రష్మిక మంధన్న కీలక పాత్ర పోషిస్తుందని.. ఆమె కూడా రూ.5 నుంచి రూ.7 కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
'రాకా' సినిమాలో మృగం గెటప్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారట. ఈ లుక్ కోసం కాస్ట్యూమ్స్, మేకప్, గ్రాఫిక్స్ భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నాయని సమాచారం. ఈ చిత్రం 2027 సమ్మర్లో విడుదల చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dhar Murder Case: భర్త నల్లగా ఉన్నాడని హత్య చేసిన భార్య..ప్రియుడితో కలిసి దారుణంగా..
Dhar, Madhya Pradesh:Dhar Murder Case Update: నేటి ఆధునిక కాలంలో భర్తలను భార్యలు హత్య చేస్తోన్న ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని ఓ మహిళ.. తన భర్త నల్లగా ఉన్నాడని కారణంతో తన ప్రియుడితో కలిసి హతమార్చింది.Deepam Scheme: దీపం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏమిటంటే?
Amaravathi, Andhra Pradesh:LPG Covert To PNG: గ్యాస్ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు దీపం లబ్దిదారులకు శుభవార్త ప్రకటించారు. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారాలని అవగాహన కల్పించాలని.. అలా మారిన వారికి కూడా దీపం పథకం అమలవుతుందని తెలిపారు. పీఎన్జీ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎల్పీజీ సరఫరా ఏర్పడిన నేపథ్యంలో పీఎన్జీ ఎంతో దోహదం చేస్తుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
Also Read: Birthday As Death Day: బర్త్డేను డెత్ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే
రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించడానికి ఆయిల్ కంపెనీలు పీఎన్జీ కనెక్షన్లను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దాల కారణంగా తలెత్తిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్దతతో పనిచేయాలని ఆయిల్ కంపెనీలకు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీపం పథకం లబ్దిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలని.. దీపం పథకం లబ్దిదారులు పీఎన్జీకి మారితే వారికి కూడా దీపం పథకం కింద ఇచ్చే రాయితీ సొమ్మును జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని.. వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Also Read: KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్తో జీవన్ రెడ్డి
పీఎన్జీ కనెక్షన్ తీసుకున్నా దీపం పథకం ద్వారా కలిగే లబ్ది పొందవచ్చనే విషయం లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి సూచించారు. వచ్చే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని ఈ విషయంలో జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. టార్గెట్ ఎట్టిపరిస్థితుల్లో చేరుకోవాలని నిర్దేశించారు. గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ సరఫరాలో సమస్యలను అధిగమించామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. డొమస్టిక్ పంపిణీకి సంబంధించి సమస్యను తగ్గించామని.. త్వరలో సాధారణ స్థితికి తీసుకువస్తామని తెలిపారు.
Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
శ్రీకాకుళం - కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్ లైన్ పనుల్లో జాప్యంపై కూడా సీఎం చంద్రబాబు అధికారుల వివరణ కోరారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో వెంటనే సీఎం చంద్రబాబు ఆ సమావేశంలోనే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్ చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Chandrababu: క్వాంటం డీప్ టెక్లో అజేయ శక్తిగా అమరావతి: సీఎం చంద్రబాబు
Amaravathi, Andhra Pradesh:Amaravati Quantum Hub: సాంకేతికతతో కొత్త విప్లవం సృష్టించిన క్వాంటం టెక్నాలజీలో గ్లోబల్ లీడర్గా అమరావతి ఎదుగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకుని దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. క్వాంటం టెక్నాలజీలో పరిశోధనలు, ఆవిష్కరణల దిశగా అవసరమైన ఎకో సిస్టం సిద్ధమవుతోందని.. క్వాంటంలో ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్ ప్రపంచానికి చిరునామాగా మార్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
Also Read: KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్తో జీవన్ రెడ్డి
ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ల టెస్టింగ్ రిఫరెన్సు ఫెసిలిటీని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్తో పాటు రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1ఎస్, 1 క్యూ పేరిట రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్సు ఫెసిలిటీలు ప్రారంభం కానున్నాయి. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్సు ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించనుండడం విశేషం.
Also Read: Birthday As Death Day: బర్త్డేను డెత్ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే
ఈ స్వదేశీ నిర్మిత క్వాంటం రిఫరెన్స్ టెస్ట్ ఫెసిలిటీలు అమరావతిని ఓ అత్యాధునిక క్వాంటం ఎకోసిస్టమ్గా తీర్చిదిద్దనున్నాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో భారత్లోనే తొలిసారి క్వాంటం కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించే సౌకర్యాన్ని అమరావతిలో ఏర్పాటుచేశారనే విషయాన్ని గుర్తుచేశారు. క్వాంటం కంప్యూటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించేలా ఓపెన్ యాక్సెస్ రిఫరెన్స్ ఫెసిలిటీగా దీనిని ఏర్పాటుచేస్తున్నారు.
క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ టెస్ట్ బెడ్లు క్వాంటం హార్డ్వేర్ తయారీలో కీలకం కానున్నాయని సీఎం చంద్రబాబు ఆశిస్తున్నాయరు. ఈ రెండు చోట్లా మైనస్ 273 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో క్వాంటం కంప్యూటర్లు పనిచేయనుండగా.. క్వాంటం కంప్యూటర్లలో ఉపకరించే వివిధ పరికరాలను టెస్ట్ చేసేలా ఈ రిఫరెన్స్ ఫెసిలిటీలు తోడ్పాటు అందించనున్నాయి. క్వాంటం టెక్నాలజీలో కేవలం సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్ తో పాటు హార్డ్వేర్ తయారీలోనూ స్వయం సమృద్ధి సాధించాలన్నది సీఎం చంద్రబాబు ఆశయం పెట్టుకున్నారు. క్వాంటం కంప్యూటర్లకు అవసరమైన పరికరాలను తయారు చేయాలని కూడా లక్ష్యంగా నిర్దేశించారు. ఇటీవలే 30కి పైగా క్వాంటం హార్డ్ వేర్ తయారీ సంస్థలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ భారత్లో క్వాంటం హార్డ్వేర్ నెట్వర్క్కు యాంకర్ నోడ్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా సీఎం నిర్దేశించారు. ప్రెసిషన్ ఎలక్ట్రానిక్స్, క్వాంటం గ్రేడ్ ఫ్యాబ్రికేషన్ లాంటి రంగాల్లో స్వదేశీ క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాల తయారీకి కేంద్రంగా అమరావతి మారాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన ముఖ్య ఉద్దేశం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PM Modi Assassination: ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర..ముగ్గురు అరెస్టు..అమెరికాతో బేరసారాలు?!
Hyderabad, Telangana:PM Modi Assassination Attempt: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య కోసం పన్నిన కుట్ర ఇప్పుడు భగ్నమైంది. ప్రధాని మోదీని హత్య చేసేందుకు పన్నాగం పన్నిన ఆరోపణల కారణంగా బిహార్లో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు పోలీసులు సిమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిపై దాడి చేసి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడ్ని అమన్ తివారీగా గుర్తించారు. ఇతను సిమ్రిలోని ఆశా పడ్రి నివాసిగా నిర్ధారించారు. బక్సర్ ఎస్పీ శుభమ్ ఆర్య వెల్లడించిన వివరాల ప్రకారం.. అతను ప్రధానమంత్రిని హత్య చేసే లక్ష్యంగా చేసుకుని కుట్ర పన్నాడని, ఈ ప్రణాళికకు సంబంధించి ఒక విదేశీ ఏజెన్సీని సంప్రదించాడని ఆరోపణలు ఉన్నాయి.
దర్యాప్తులో భాగంగా నిందితుడు ఈ కుట్రను అమలు చేయడానికి ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బు కోరుతూ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA)కి ఒక ప్రతిపాదన పంపినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ ప్రణాళికను అమలు చేయడానికి అతను 22 రోజుల సమయం కూడా కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిందితుడు అమన్ తివారీ ఇంటిని సోదా చేసే సమయంలో నిందితుడి నివాసం నుంచి పోలీసులు ఒక ల్యాప్టాప్తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరోపిత కుట్రకు సంబంధించిన మరిన్ని ఆధారాలు సేకరించేందుకు ప్రస్తుతం ఈ పరికరాలను పరిశీలిస్తున్నారు.
ప్రధాన నిందితుడు అమన్ తివారీ అందించిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. ఈ కుట్ర పూర్తి స్థాయిని, దాని ఉద్దేశ్యాన్ని వెలికితీసేందుకు ఆ ముగ్గురినీ విచారిస్తున్నారు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని, ఆరోపిత కుట్రలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు మరిన్ని సంబంధాలపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు.
Also Read: BJP Manifesto 2026: మహిళలకు గుడ్న్యూస్..నెలకు రూ.3,000 అకౌంట్లో జమ..ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం!
Also REad: RR vs RCB Preview: నేడు ఐపీఎల్లో హోరాహోరీ పోరు..రాజస్థాన్ Vs బెంగళూరు..బుడ్డోడు అదరగొడతాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BJP Manifesto 2026: మహిళలకు గుడ్న్యూస్..నెలకు రూ.3,000 అకౌంట్లో జమ..ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం!
Chhotobainan, West Bengal:BJP Manifesto West Bengal 2026: రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ ఎన్నికల హామీలను విడుదల చేశారు.
రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు రూ.3,000 భత్యం ఇస్తామని తెలియజేసింది. 75 లక్షల మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని బీజేపీ తమ మేనిఫెస్టోలో ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి..అందులో నారీ సహాయతా డెస్క్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో కఠినమైన చట్టాన్ని అమలు చేయడంతో పాటు మహిళలపై నేరాలను ఏమాత్రం సహించబోమని బీజేపీ మానిఫెస్టోలో పేర్కొన్నారు. రద్దీగా ఉండే నగర ప్రాంతాలతో పాటు విద్యాసంస్థలు, హాస్టళ్లు, బహిరంగ ప్రదేశాలలో మహిళల భద్రత, గౌరవాన్ని మేము కాపాడతామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.
అయితే పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని కొన్ని కీలక పాయింట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1) ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని గర్భిణీ స్త్రీలకు రూ.21,000 నగదు సహాయంతో పాటు 6 పోషకాహార కిట్లు అందజేయడం.
2) రద్దీగా ఉండే నగర ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాలలో గస్తీ నిర్వహించేందుకు మహిళా అధికారుల గస్తీ బృందాలతో కూడిన మహిళలకే ప్రత్యేకమైన దుర్గా సురోఖ స్క్వాడ్లను ఏర్పాటు చేయడం.
3) రాష్ట్ర రిజర్వ్ పోలీస్ దళంలో మాతంగిని హజ్రా, రాణి శిరోమణి పేరిట రెండు మహిళా బెటాలియన్ల ఏర్పాటుకు హామీ.
4) పోలీసు బలగాలతో సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం.
5) ప్రైవేట్ రంగ సంస్థలను ప్రోత్సహించడం ద్వారా మహిళా కార్మికులకు ప్రాధాన్యతనిచ్చే కొత్త పారిశ్రామిక విధానం.
6) ప్రభుత్వ బస్సులన్నింటిలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం (కర్ణాటక, తెలంగాణ, ఏపీ మోడల్).
7) మహిళా శ్రామిక శక్తికి మద్దతుగా ప్రతి జిల్లాలో ఉద్యోగం చేసే మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టల్ను ఏర్పాటు చేయడం.
8) అంగన్వాడీ, ప్రాణీ మిత్ర, ఆశా కార్యకర్తలకు తగిన గౌరవప్రదమైన పరిహారం అందించేందుకు వారి నెలవారీ గౌరవ వేతనాన్ని పెంచడం.
9) బాల్య వివాహాలను నివారించడానికి, యువతుల భవిష్యత్తును పరిరక్షించడానికి బలంగా చర్యలను అమలు చేయడం.
10) ఉన్నత విద్యలో మహిళలకు మద్దతుగా, గ్రాడ్యుయేషన్ కోర్సులలో ప్రవేశం పొందే సమయంలో బాలికలకు రూ.50,000 అందజేయడం.
11) 40 ఏళ్ల లోపు బాలికలు, మహిళలందరికీ ఉచితంగా HPV టీకా అందించడం.
12) అట్టడుగు, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన 40 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ అందించడం, తద్వారా వ్యాధిని ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స పొందే అవకాశాన్ని మెరుగుపరచడం.
13) గతంలో మహిళలపై జరిగిన అన్యాయం, అఘాయిత్యాల కేసులన్నింటినీ తిరిగి తెరవడం, అవసరమైన చోట తగిన తక్షణ పరిహారంతో పాటు న్యాయ సహాయం అందించడం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jaipur woman Video: మరీ ఏంట్రా ఈ అరాచకం..?.. రన్నింగ్ బైక్ మీద యువతి ప్రైవేటు పార్ట్ లను టచ్ చేస్తు.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Woman molested on running bike in public busy road in Jaipur Rajasthan: ఇటీవల కామాంధులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పోలీసులు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, కఠిన చర్యలు తీసుకున్న వీరుమారడంలేదు . ప్రతిరోజు కూడా మహిళలు అత్యాచారాలు, అఘాయిత్యాలకు గురౌతున్నారు. ఇంట్లో నుంచి బైటకు వెళ్లిన మహిళలు తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా బాగా టెన్షన్ గా మారింది. ఈ క్రమంలో ఇటీవల పబ్లిక్ ప్రదేశాలు, రద్దీ ప్రదేశాలు అతి తేడా లేకుండా ప్రతి చోట మహిళలు అఘాయిత్యాలకు గురౌతున్నారు.
ఆడది కన్పిస్తే చాలు కామంతో కొంత మంది పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవర్ని వదలడంలేదు. ఈ క్రమంలో రాజస్తాన్ లోని జైపూర్ లో ఒక దారుణం చోటుచేసుకుంది. దీనికి చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
రాజస్తాన్ లోని జైపూర్ లో నడి రోడ్డు మీద పట్టపగలు యువతి పట్ల ఇద్దరునీచులు ఘోరంగా ప్రవర్తించారు. ఆమె తన మానాన తాను మరో యువకుడిపై వెళ్తుంగా ఆమె వెనకాల చెయ్యిపెట్టి ప్రైవేటు పార్ట్ లను తాకుతూ పైశాచీక ఆనందం పొందారు. యువతి బైక్ వెనకాల కూర్చుంది. మరో ఇద్దరుపక్కన బైకు మీద వెళ్తు యువతిని శరీరం వెనుకాల తాకారు. దీంతో యువతి షాక్ అయ్యింది. ఒక్కసారిగా కోపంతో తనను టచ్ చేసిన వారిని కొట్టేందుకు ప్రయత్నించింది.
యువతిని తాకి ఇద్దరు అక్కడి నుంచి వేగంగా ముందుకు వెళ్లిపొయారు. ఈ ఘటనతో యువతితో పాటు, బైకర్ రోడ్డు మీద చాలా సేపు ఆగి షాక్ కు గురయ్యారు. ఈ ఘటనను వీరి వెనకాల వెళ్తున్న కొంత మంది వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వారిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారు.
KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్తో జీవన్ రెడ్డి
Sivar Venkatapur, Telangana:Erravalli Farmhouse: తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతుండగా బీఆర్ఎస్ పార్టీ ఫుల్ జోష్లో ఉంది. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడం ఖాయమైన నేపథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. రాజకీయంగా సీనియర్ నాయకులైన కేసీఆర్, జీవన్ రెడ్డి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ను కలిసిన ఆనందంలో జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఫామ్హౌస్కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన కుటుంబసభ్యులతోపాటు తన ముఖ్య అనుచరులతో వచ్చారు. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ను కలిసి కౌగిలించుకున్నారు. పరస్పరం గౌరవించుకున్న అనంతరం తన కుటుంబసభ్యులు, ముఖ్య అనుచరులను కేసీఆర్కు జీవన్ రెడ్డి పరిచయం చేయించారు.
Also Read: Hyderabad: 14 సార్లు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చాం.. రేవంత్ రెడ్డిపై విమర్శలు సరికాదు
నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానినికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొనియాడారు. తెలంగాణ సాధకుడు, రైతు బాంధవుడు బీఆర్ఎస్ అధినేత కెసీఆర్తో కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. ‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు అన్నా' అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అన్నా’ అని కేసీఆర్తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. అనంతరం కేసీఆర్తో కలిసి జీవన్ రెడ్డి భోజనం చేశారు. కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. జీవన్ రెడ్డి వెంట ఆయన కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత, సురేశ్ దంపతులు తదితరులు ఉన్నారు.
కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ అవడంతో జగిత్యాలలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరినా క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం ఎవరూ పార్టీ మారలేదు. బీఆర్ఎస్ పార్టీ కేడర్ అలాగే ఉండిపోగా ఇప్పుడు జీవన్ రెడ్డి రాకతో మరింత పుంజుకోనుంది. కాగా ఎర్రవల్లి ఫామ్హౌజ్లో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ కె సంజయ్ కుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
RR vs RCB Preview: నేడు ఐపీఎల్లో హోరాహోరీ పోరు..రాజస్థాన్ Vs బెంగళూరు..బుడ్డోడు అదరగొడతాడా?
Hyderabad, Telangana:RR vs RCB Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. గౌహతి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుకు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తిరుగులేని ఆధిక్యం కనబరుస్తుంది. ఇటీవేల ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 27 పరుగులు తేడాతో విజయం సాధించిన రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మట్టి కరిపించి మంచి కసిమీద ఉంది. చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 250 పరుగులు చేసి.. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ భయంకరమైన ఫామ్లో ఉందని నిరూపించుకుంది.
అయితే విజయాల పరంగా చూసుకుంటే.. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన మూడు మ్యాచ్లలో మూడు విజయాలు సాధించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఆడిన రెండు మ్యాచ్లలో రెండు విజయాలు నమోదు చేసింది. అయితే వర్షం అడ్డంకి రాకపోతే వరుస విజయాలతో చెలరేగిపోతున్న ఈ టీమ్స్ మధ్య పోటీ రసవత్తరంగా జరగనుంది.
అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరగనున్న మ్యాచ్లో హేజిల్ వుడ్ ఆటతాడా లేదా? అనే అనుమానం అందరిలో వ్యక్తం అవుతోంది. తొలి రెండు మ్యాచ్లకు దూరమైన ఈ స్టార్ బౌలర్ జట్టులో చేరితే బ్యాటింగ్ లైనప్తో పాటు బౌలింగ్లోనూ కట్టుదిట్టంగా మారనుంది. గత మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 70 పరుగులు సాధించి ఈ సీజన్లో పవర్ హిట్టర్ల జాబితాలో చేరిపోయాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా బలమైన బ్యాటింగ్.. టాలెంటెడ్ బౌలింగ్ లైనప్తో మంచి ఫామ్లో ఉంది. అయితే ఈ రెండు బలమైన జట్లలో ఏది విజయం సాధిస్తుందో తెలియాల్సి ఉంది.
H2H రికార్డ్ ఎంత?
రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరు ఐపీఎల్ లీగ్లో ఇప్పటి వరకు 34 సార్ల తలపడ్డాయి. వాటిలో ఆర్సీబీ జట్టు 17 సార్లు గెలిచి ఆధిక్యంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ 14 సార్లు విజయం సాధించగా, 3 మ్యాచ్లు ఫలితం తేలకుండానే ముగిశాయి. అయితే హెడ్ టూ హెడ్ మ్యాచ్ కౌంట్లో ఆర్సీబీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. గౌహతి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు బలంగా కనిపిస్తోంది.
తుదిజట్లు అంచనా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, అభినందన్ సింగ్. (ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ).
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ. (ఇంపాక్ట్ ప్లేయర్: తుషార్ దేశ్పాండే).
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Stunt Video: పెట్రోల్ ట్యాంక్పై ఎద్దు.. వెనుక సీట్లో కుర్రాడు.. డేంజరస్ రైడ్ వీడియో!
Hyderabad, Telangana:Bull On Bike Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో వింతను మనమంతా చూస్తూ వస్తున్నాం.. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియా వినియోగదారులను ముక్కుపై వేలేసుకునేలా చేస్తోంది. సాధారణంగా బైక్ మీద ఇద్దరు లేదా ముగ్గురు వెళ్లడమే ప్రమాదకరం అనుకుంటే. ఇక్కడొక బుద్ధిలేని యువకుడు ఏకంగా ఒక ఎద్దును బైక్ పై ముందు కూర్చోబెట్టుకొని హైవేపై దూసుకుపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక యువకుడు తన బైక్ పై వెళ్తున్నాడు.. అయితే, ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బైక్ పెట్రోల్ ట్యాంకు ఉన్న ముందు భాగంలో ఒక భారీ ఎత్తును కూర్చోబెట్టుకున్నాడు. ఆ ఎద్దు కూడా ఏ మాత్రం భయం లేకుండా.. చాలా అలవాటు ఉన్నట్లుగా దర్జాగా కూర్చొని ప్రయాణాన్ని ఆస్వాదించడం కూడా మీరు వీడియోలో గమనించవచ్చు. యువకుడు మాత్రం సీటు వెనక భాగంలో కూర్చుని బైక్ను బ్యాలెన్స్ చేస్తూ వేగంగా హైవే పై నడుపుతూ ఉండడం మీరు చూడవచ్చు.
అదే దారిలో కారులో వెళ్తున్న కొందరు ప్రయాణికులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమ కళ్ళను తామే నమ్మలేక వెంటనే మొబైల్ తీసి.. ఈ వింత సవారిని అందులో చిత్రీకరించారు.. ఆ యువకుడు ఏ మాత్రం తడబడకుండా.. ఎద్దు ను బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళను చూసి కారులో ఉన్న వారంతా అవ్వక్కైపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. వీడు మామూలోడు కాదు.. యముడికి పోటీ ఇచ్చేలా ఉన్నాడని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు మూగజీవాల ప్రాణాలతో ఇలాంటి ఆటలేంటని వన్యప్రాణి నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
ఇది టాలెంటా లేక పిచ్చి పనా అని మరికొందరు కామెంట్లలో పెడుతున్నారు. చూడడానికి ఇది వింతగా ఉన్నప్పటికీ ఇందులో ప్రాణాపాయం పొంచి ఉందని కొంతమంది ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. బైక్ బ్యాలెన్స్ తప్పిన లేదా ఎద్దు ఒక్కసారిగా బెదిరిన ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. ఇలాంటి విన్యాసాలు చేయడం చట్టరిత్య నేరమని.. మూగజీవాలను ఇలా తరలించడం జంతు హింస కింద వస్తుందని సోషల్ మీడియా వినియోగదారులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడో దక్షిణాఫ్రికాలోని ఓ ప్రదేశంలో తీసినట్లు తెలుస్తోంది.
Also Read: Argentina: మేఘాల్లో ప్రయాణం.. అర్జెంటీనాలో ఆకాశాన్ని తాకే అద్భుత రైలు యాత్ర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Viral Video: పెళ్లి పీటల నుంచి నేరుగా అట్లకాడ పట్టారు.. అతిథుల ప్లేట్లు కడిగిన వధూవరులు.. వీడియో..
Hyderabad, Telangana:Inspirational Wedding Story Viral Video Watch: సాధారణంగా పెళ్లి అంటే వధూవరులు మహారాజుగా.. మహారాణిల ముస్తాబై పీటల మీద కూర్చుని ఉండటం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. బంధుమిత్రుల తాకిడికి.. ఫోటోషూట్లు, విందు వినోదాలతో ఆ రోజంతా బిజీగా గడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే జంట మాత్రం ఒక వింత పనిచేసింది. పెళ్లి బట్టల్లోనే వంట పాత్రలతో పాటు అతిధులు భోజనం చేసిన ప్లేట్లను శుభ్రం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఇది ఎక్కడ జరిగిందనే విషయం తెలియక పోయినప్పటికీ.. వీడియో మాత్రం వైరల్ అవ్వడం విశేషం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. వివాహ వేడుక ముగిసిన వెంటనే.. ఆ వధూవరులు విశ్రాంతి తీసుకోకుండా నేరుగా వంటలు వండిన చోటికి వెళ్లారు.. పట్టు చీరలో ఉన్న వధువు, పట్టు వస్త్రాల్లో ఉన్న వరుడు కలిసి పెళ్లిలో వాడిన పాత్రలను తోముతూ కనిపించారు. ఒకరు ప్లేట్లకు సబ్బు పెడుతుంటే.. మరొకరు వాటిని నీళ్లతో శుభ్రం చేస్తూ ఒకరినొకరు సాయం చేసుకున్నారు. ముఖంపై చెమటలు పడుతున్నప్పటికీ. భారీ ఆభరణాలు ఉన్న అవేమీ లెక్కచేయకుండా వారు చేస్తున్న పని చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్య పోయినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఇలాంటి పనులను చేయడానికి చాలామంది వెనక్కి వెళ్తూ ఉంటారు.. ముఖ్యంగా పెళ్లి రోజు ఇలాంటివి ఎవరూ ఊహించి ఉండరు. అయితే, ఈ జంట మాత్రం పనిలో ఏది తక్కువ కాదు అనే సందేశాన్ని ఇవ్వడానికే ఇలా చేసినట్లు సమాచారం. జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేసిన వారు.. ఇంటి పనుల్లో కూడా ఒకరికొకరు సమానంగా బాధ్యతలు పంచుకుంటామని ఈ ఘటన ద్వారా నిరూపితమైందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. ఇంతటి సాధారణంగా ఉన్న జంట మేము ఇప్పటికీ చూడలేమని కొంతమంది కామెంట్ చేస్తూ వస్తుంటే.. మరి కొంతమంది తమ పెళ్లిలో తామే పనిచేయడం వల్ల అహంకారం తగ్గుతుంద.. బంధం బలం మరింత బలపడుతుందని మరికొంతమంది రాస్తూ వస్తున్నారు. అలాగే ఇది కేవలం వైరల్ అవ్వడానికి చేశారా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మెజారిటీ సోషల్ మీడియా వినియోగదారులైతే ఈ వీడియో చూసి పాజిటివ్ గానే స్పందిస్తూ వస్తున్నారు.
Also Read: Argentina: మేఘాల్లో ప్రయాణం.. అర్జెంటీనాలో ఆకాశాన్ని తాకే అద్భుత రైలు యాత్ర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Male Fertility: ఎండలో బైక్ సీటు, ఒడిలో ల్యాప్టాప్.. పురుషుల సంతానోత్పత్తికి పొంచి ఉన్న ముప్పు!
Hyderabad, Telangana:Hot Bike Seats For Male Fertility News: దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా మండిబోతున్నాయి. భానుడి భగభగ లకు సాధారణ ప్రజలే కాదు వాహనదారులు కూడా అల్లాడిపోతున్నారు. అయితే, ఈ ఎండ వేడిమి కేవలం చర్మానికో దాహానికో పరిమితం కాకుండా.. పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా బైక్ సీట్ వేడితో పాటు లాప్టాప్ వాడకం వంటి అలవాట్లు భవిష్యత్తులో తండ్రి కావాలనుకునే వారికి శాపంగా మారే అవకాశం ఉందని ఆ అధ్యయనాలు చెబుతూ వస్తున్నాయి.
పురుషుల వీ*కణాల ఉత్పత్తి క్రమంగా జరగాలంటే.. వృషణాలు శరీర సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు లేదా మూడు డిగ్రీల సెల్సియస్ కంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. అందుకే ప్రకృతి సిద్ధంగా వృషణాలు శరీర వెలుపల అమర్చబడి ఉంటాయి. అయితే మనం చేసే కొన్ని చిన్నపాటి తప్పుల వల్ల అక్కడ ఉష్ణోగ్రత పెరిగి.. వీ*కణాల సంఖ్య, నాణ్యతతో పాటు కదలికలు దెబ్బతింటున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
ఎండలో పార్క్ చేసిన బైక్ సీట్లు విపరీతంగా వేడెక్కుతాయి.. అయితే, ఆ వేడి సీటు పై నేరుగా కూర్చొని ఎక్కువ దూరం ప్రయాణం చేయడం వల్ల వృషణాల వద్ద ఉష్ణోగ్రత ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయట. అంతేకాకుండా లాప్టాప్ నేరుగా ఒడిలో పెట్టుకుని గంటల తరబడి పనిచేయడం వల్ల దాని నుంచి వెలుబడి వేడి నేరుగా జననేంద్రియాలపై పడి ఎన్నో దుష్ప్రభావాలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయట. అలాగే టైట్ జీన్స్ లేదా కొన్ని ప్రత్యేకమైన దుస్తులను ధరించడం వల్ల వృషణాలకు గాలి ఆడక.. వీ*కణాలపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతూ వస్తున్నారు.
Also Read: Argentina: మేఘాల్లో ప్రయాణం.. అర్జెంటీనాలో ఆకాశాన్ని తాకే అద్భుత రైలు యాత్ర!
సంతాన ఉత్పత్తి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఎండల్లో ప్రయాణించేటప్పుడు సీటుపై తడిగుడ్డ వేయడం లేదా సీటు చల్లబడిన తర్వాతే కూర్చోవడం మంచిదని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు సంబంధించిన యూరాలజిస్ట్లు కూడా చెబుతూ వస్తున్నారు. ఎండాకాలంలో వీలైనంత వరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులు, కాటన్ ప్యాంట్లు వాడడం మంచిదట.. అంతేకాకుండా ల్యాప్టాప్ ను ఎప్పుడు టేబుల్ పై ఉంచి వాడటంతో పాటు తప్పని పరిస్థితుల్లో ఒడిలో పెట్టుకోవాల్సి వస్తే కూలింగ్ ప్యాడ్ వినియోగించాల్సి ఉంటుందని వారు తెలుపుతున్నారు. శరీరం లోపల ఉష్ణోగ్రత పెరగకుండా ఉండడానికి తప్పనిసరిగా నీరును తాగడమే కాకుండా అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లను తాగడం మంచిదని వారు చెబుతున్నారు.
Also Read: Argentina: మేఘాల్లో ప్రయాణం.. అర్జెంటీనాలో ఆకాశాన్ని తాకే అద్భుత రైలు యాత్ర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
DA Hike 2026 Update: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..డీఏ పెంపుపై క్యాబినెట్లో జరగని చర్చ..డీఏ పెంపు లేనట్టేనా?
Hyderabad, Telangana:DA Hike 2026 News: 8వ వేతన సంఘం ఈ ఏడాది జనవరి నుంచి అమలులోకి రావడం వల్ల కరవు భత్యం (డీఏ) పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా ఒక కొత్త వేతన సంఘం అమలులోకి వచ్చినప్పుడు ఆ నాటికి అమలులో ఉన్న డీఏను మూలవేతనంలో విలీనం చేసి.. దాన్ని సున్నాకు రీసెట్ చేస్తారు. ఇలా డీఏ సెట్ చేయడం వల్ల భవిష్యత్తులో జీతాలు, పెన్షన్ల సవరణలో డీఏ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ద్రవ్యోల్బణ నుంచి ఆర్థికంగా ఆదుకునే కరవు భత్యం పెంపుపై ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూపుల వేళ మరింత జాప్యం ప్రభావం చూపుతోంది.
ఇప్పటికే ఏప్రిల్ 10 వచ్చేసింది. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జనవరి-జూన్ కాలానికి సంబంధించిన కరువు భత్యం (డీఏ) పెంపు ప్రకటన కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా జనవరి డీఏ సవరణకు సంబంధించిన ప్రకటన దాదాపు ఎప్పుడూ మార్చిలోనే ఆమోదం పొందుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం డీఏ ప్రకటనలో మరింత ఆలస్యం జరుగుతోంది. అంతేకాకుండా ఈ వారంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో డీఏ పెంపు ప్రకటనపై ఎలాంటి చర్చ జరగకపోవడంతో, కోవిడ్-19 మహమ్మారి సమయంలో అనుసరించిన పద్ధతినే ప్రభుత్వం మళ్లీ అనుసరిస్తుందా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోయినా.. ప్రస్తుతానికి ఈ విషయం కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారంలో ఉంది. డీఏ ప్రకటనలో జాప్యం జరిగినా ప్రభుత్వం పూర్తిగా డీఏ పెంపు నిలుపుదల చేసినట్లు కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ డీఏ పెంపు ఎప్పుడు చేసినా..2026 జనవరి 1 నుంచి బకాయిలను చెల్లిస్తారు. ప్రస్తుతం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 58 శాతం కరవు భత్యాన్ని (డీఏ) పొందుతున్నారు. నివేదికల ప్రకారం.. డీఏ సుమారు 2 శాతం పెరిగి, దాదాపు 58 శాతం నుండి 60 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గత దశాబ్దానికి భిన్నంగా 2025లో డీఏ పెంపు ప్రకటనను మార్చి 28న.. అలాగే 2024లో మార్చి 7న చేశారు. 2023లో మార్చి 24న, 2022లో మార్చి 30న డీఏ పెంపు ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఇలాంటి ప్రకటనలు చేసిన తీరును బట్టి.. ప్రభుత్వం మార్చిలోనే డీఏ పెంపు ప్రకటిస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశించారు. కానీ అలా జరగలేదు. 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వం త్వరలోనే డీఏ పెంపును ప్రకటించవచ్చని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Argentina: మేఘాల్లో ప్రయాణం.. అర్జెంటీనాలో ఆకాశాన్ని తాకే అద్భుత రైలు యాత్ర!
Hyderabad, Telangana:Train To The Clouds Argentina Latest News: రైలు ప్రయాణం అంటేనే అందమైన ప్రకృతి దృశ్యాలతో పాటు కిటికీల పక్కన కూర్చుని చూసి పచ్చదనం గుర్తుకొస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా మేఘాలపైన రైల్లో ప్రయాణించారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. అర్జెంటీనాలోని ట్రెన్ ఎ లాస్ నుబెస్ (Tren a las Nubes) రైలు మార్గం ఈ అద్భుతమైన అనుభూతిన అందిస్తుంది. దీనిని స్పానిష్ భాషలో మేఘాల రైలుగా కూడా పిలుస్తారు. చూడడానికి ఇదే చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా.. ఆకాశం పై నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రీనులకుండా సాగే ఈ రైలు మార్గం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గంలో ఒకటిగా గుర్తింపు పొందింది.. ఇది సముద్ర మట్టానికి సుమారు 4220 కిలోమీటర్లు ఎత్తులు ఉండటమే కాకుండా.. అక్కడ రైలు వెళ్లేందుకు ప్రత్యేకమైన పట్టాలను కూడా ఏర్పాటు చేశారు. రైలు వెళ్తుంటే కిటికీలోంచి చూస్తే.. మబ్బులు మన పాదాల కింద తేలుతున్నట్లు అనిపిస్తాయి. అందుకే దీనికి ఆకాశాన్ని తాకే మార్గమని పేరు వచ్చింది..
దాదాపు 217 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రయాణం పర్యాటకులను ఒక మాయా లోకంలోకి తీసుకెళ్తుంది. ఈ మార్గంలో రైలు సురక్షితంగా ప్రయాణించడానికి ఇంజనీర్లు ఎంతగానో కష్టపడాల్సి వచ్చిందని సమాచారం.. లోతైన లోయలను కలుపుతూ.. నిర్మించిన ఈ వంతెన పై రైలు వెళుతుంటే వెన్నులో వణుకు పుట్టక మానదు. 29 ఎతైన వంతెనలతో మార్గాన్ని నిర్మించినట్లు సమాచారం. కొండలను తొలచి.. చేసిన 21 సొరంగాల మార్గం గుండా చీకటిని చీల్చుకుంటూ రైలు ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది..
కొండల ఎత్తున అధిరోహించడానికి రైలు ముందుకు వెనక్కి కదులుతూ ఎక్కించే ప్రత్యేకమైన సాంకేతికతను ఇక్కడ వాడినట్లు తెలుస్తోంది.. అంత ఎత్తులో ప్రయాణించినప్పుడు గాలిలో ఆక్సిజన్ స్థాయిని తక్కువగా ఉంటాయి. దీనివల్ల ప్రయాణకులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని.. రైలులో అత్యాధునిక వైద్య సదుపాయంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు నిరంతరం అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన వైద్య బృందం కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల రక్షణ ధ్యేయంగా ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారట..
Also Read: ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు.
సాల్టా నగరం నుంచి ప్రారంభమయ్యే.. ఈ ప్రయాణం పొల్వోరిల్లా వయాడక్ట్ వద్ద ముగుస్తుంది. మార్గ మధ్యలో కనిపించే మంచు కుంటలతో పాటు ఎడారి లాంటి పీఠభూములు పర్యాటకులకు ఎంతగానో కనిపిందు చేస్తాయి. సాహస యాత్రలు ఇష్టపడేవారు తమ జీవితంలో ఒక్కసారి అయినా ఈ మేఘాల రైలులో ప్రయాణించాల్సిందేనని పర్యాటకులు చెబుతూ ఉన్నారు. ప్రకృతి అందాలతో పాటు ఇంజనీరింగ్ వింతను కలిపే ఈ అద్భుతమైన యాత్ర పర్యాటక రంగంలో ఒక అద్భుతంగా భావించవచ్చు..
Also Read: ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Birthday As Death Day: బర్త్డేను డెత్ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే
Iskapalli, Andhra Pradesh:Snake Bite Death: బంధుమిత్రులు, కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా పుట్టినరోజు చేసుకున్న బాలిక అలసిపోయి రాత్రి తల్లితో కలిసి మంచంపై నిద్రించింది. కానీ అదే చివరి రాత్రి అవుతుందని కుటుంబసభ్యులతోపాటు ఆ బాలిక కూడా అనుకోలేదు. మంచంపైకి యమపాశంలా పాము దూసుకొచ్చింది. తల్లితోపాటు నిద్రిస్తున్న బాలికను కాటేసింది. ఆలస్యంగా గుర్తించడంతో విషం శరీరమంతా పాకడంతో బాలిక మృతి చెందింది. ఈ సంఘటన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో చోటుచేసుకుంది. బర్త్డే తెల్లవారుజామునే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ కోనపాపేట జగనన్న కాలనీకి చెందిన చప్ప మల్లేశ్వరి కుమార్తె దీపిక (14). కోనపాపేట హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న దీపిక గురువారం తన పుట్టినరోజు ఎంతో సంతోషంగా.. ఆనందోత్సాహాలతో చేసుకుంది. బర్త్ డే చేసుకున్న ఆనందంలో ఉన్న బాలిక రాత్రి ఇంట్లో తల్లి మల్లేశ్వరితో కలిసి మంచంపై నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున మంచంపై ఉన్న పరుపు కిందకు పాము దూరింది. కొద్దిసేపటికి దీపికను ఆ కాటు వేసింది. బాలికకు పాము కాటేసిన విషయాన్ని గమనించిన తల్లి వెంటనే పిఠాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పుట్టినరోజు తెల్లారే బాలిక మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. 14 ఏళ్లకే నూరేళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు లబోదిబోమంటూ రోదించారు. ఈ సంఘటనపై యు కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా బాలికను కాటేసిన పాము గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్లు చంపేశారు.
Also Read: YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్ జగన్
అత్తకు యముడిగా అల్లుడు
అత్తకు యముడిగా అల్లుడి మారిపోయి ఆమె ప్రాణం బలి తీసుకున్నాడు. వృద్ధాప్యంలో అత్తకు అండగా ఉండాల్సిన అల్లుడు అంతమెుందించాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని తారకరామనగర్లో తన భార్యను కాపురానికి రాకుండా అత్త పోల మంగమ్మ తప్పుదోవ పట్టిస్తుందని అల్లుడు కేదారి పుల్లయ్య భావించాడు. భార్యాభర్తల మధ్య అత్త అడ్డుగా ఉందని.. ఆమె అడ్డు తొలగించుకోవాలని అల్లుడు నిర్ణయించుకున్నాడు. మద్యానికి బానిసైన అల్లుడు అత్తను చంపితే తమ సంసార జీవితానికి అడ్డేమి ఉండదని భావించి అత్త నిద్రిస్తున్న సమయంలో కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
