ఖమ్మం గ్రీవెన్స్ భారీగా బాధితుల ఫిర్యాదులు
Khammam, Telangana:ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ డేకు ప్రజలు పెద్దసంఖ్యలో తమ సమస్యలు చెప్పుకోవడం కోసం వచ్చారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదు తనీఖీ చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కలెక్టర్ కు సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో భారీగా బాధితులు గ్రీవెన్స్ కు తరలివస్తున్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
RR vs RCB Preview: నేడు ఐపీఎల్లో హోరాహోరీ పోరు..రాజస్థాన్ Vs బెంగళూరు..బుడ్డోడు అదరగొడతాడా?
Hyderabad, Telangana:RR vs RCB Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. గౌహతి వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టుకు రియాన్ పరాగ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తిరుగులేని ఆధిక్యం కనబరుస్తుంది. ఇటీవేల ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 27 పరుగులు తేడాతో విజయం సాధించిన రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
రజత్ పాటిదార్ కెప్టెన్సీలోని డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గత మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మట్టి కరిపించి మంచి కసిమీద ఉంది. చెన్నైతో జరిగిన మ్యాచ్లో ఏకంగా 250 పరుగులు చేసి.. ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ భయంకరమైన ఫామ్లో ఉందని నిరూపించుకుంది.
అయితే విజయాల పరంగా చూసుకుంటే.. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన మూడు మ్యాచ్లలో మూడు విజయాలు సాధించగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఆడిన రెండు మ్యాచ్లలో రెండు విజయాలు నమోదు చేసింది. అయితే వర్షం అడ్డంకి రాకపోతే వరుస విజయాలతో చెలరేగిపోతున్న ఈ టీమ్స్ మధ్య పోటీ రసవత్తరంగా జరగనుంది.
అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరగనున్న మ్యాచ్లో హేజిల్ వుడ్ ఆటతాడా లేదా? అనే అనుమానం అందరిలో వ్యక్తం అవుతోంది. తొలి రెండు మ్యాచ్లకు దూరమైన ఈ స్టార్ బౌలర్ జట్టులో చేరితే బ్యాటింగ్ లైనప్తో పాటు బౌలింగ్లోనూ కట్టుదిట్టంగా మారనుంది. గత మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 70 పరుగులు సాధించి ఈ సీజన్లో పవర్ హిట్టర్ల జాబితాలో చేరిపోయాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా బలమైన బ్యాటింగ్.. టాలెంటెడ్ బౌలింగ్ లైనప్తో మంచి ఫామ్లో ఉంది. అయితే ఈ రెండు బలమైన జట్లలో ఏది విజయం సాధిస్తుందో తెలియాల్సి ఉంది.
H2H రికార్డ్ ఎంత?
రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరు ఐపీఎల్ లీగ్లో ఇప్పటి వరకు 34 సార్ల తలపడ్డాయి. వాటిలో ఆర్సీబీ జట్టు 17 సార్లు గెలిచి ఆధిక్యంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ 14 సార్లు విజయం సాధించగా, 3 మ్యాచ్లు ఫలితం తేలకుండానే ముగిశాయి. అయితే హెడ్ టూ హెడ్ మ్యాచ్ కౌంట్లో ఆర్సీబీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. గౌహతి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు బలంగా కనిపిస్తోంది.
తుదిజట్లు అంచనా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, అభినందన్ సింగ్. (ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ).
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ. (ఇంపాక్ట్ ప్లేయర్: తుషార్ దేశ్పాండే).
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Stunt Video: పెట్రోల్ ట్యాంక్పై ఎద్దు.. వెనుక సీట్లో కుర్రాడు.. డేంజరస్ రైడ్ వీడియో!
Hyderabad, Telangana:Bull On Bike Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో వింతను మనమంతా చూస్తూ వస్తున్నాం.. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియా వినియోగదారులను ముక్కుపై వేలేసుకునేలా చేస్తోంది. సాధారణంగా బైక్ మీద ఇద్దరు లేదా ముగ్గురు వెళ్లడమే ప్రమాదకరం అనుకుంటే. ఇక్కడొక బుద్ధిలేని యువకుడు ఏకంగా ఒక ఎద్దును బైక్ పై ముందు కూర్చోబెట్టుకొని హైవేపై దూసుకుపోతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక యువకుడు తన బైక్ పై వెళ్తున్నాడు.. అయితే, ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. బైక్ పెట్రోల్ ట్యాంకు ఉన్న ముందు భాగంలో ఒక భారీ ఎత్తును కూర్చోబెట్టుకున్నాడు. ఆ ఎద్దు కూడా ఏ మాత్రం భయం లేకుండా.. చాలా అలవాటు ఉన్నట్లుగా దర్జాగా కూర్చొని ప్రయాణాన్ని ఆస్వాదించడం కూడా మీరు వీడియోలో గమనించవచ్చు. యువకుడు మాత్రం సీటు వెనక భాగంలో కూర్చుని బైక్ను బ్యాలెన్స్ చేస్తూ వేగంగా హైవే పై నడుపుతూ ఉండడం మీరు చూడవచ్చు.
అదే దారిలో కారులో వెళ్తున్న కొందరు ప్రయాణికులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. తమ కళ్ళను తామే నమ్మలేక వెంటనే మొబైల్ తీసి.. ఈ వింత సవారిని అందులో చిత్రీకరించారు.. ఆ యువకుడు ఏ మాత్రం తడబడకుండా.. ఎద్దు ను బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళను చూసి కారులో ఉన్న వారంతా అవ్వక్కైపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. వీడు మామూలోడు కాదు.. యముడికి పోటీ ఇచ్చేలా ఉన్నాడని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు మూగజీవాల ప్రాణాలతో ఇలాంటి ఆటలేంటని వన్యప్రాణి నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
ఇది టాలెంటా లేక పిచ్చి పనా అని మరికొందరు కామెంట్లలో పెడుతున్నారు. చూడడానికి ఇది వింతగా ఉన్నప్పటికీ ఇందులో ప్రాణాపాయం పొంచి ఉందని కొంతమంది ట్రాఫిక్ నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. బైక్ బ్యాలెన్స్ తప్పిన లేదా ఎద్దు ఒక్కసారిగా బెదిరిన ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. ఇలాంటి విన్యాసాలు చేయడం చట్టరిత్య నేరమని.. మూగజీవాలను ఇలా తరలించడం జంతు హింస కింద వస్తుందని సోషల్ మీడియా వినియోగదారులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వీడియో ఎక్కడో దక్షిణాఫ్రికాలోని ఓ ప్రదేశంలో తీసినట్లు తెలుస్తోంది.
Also Read: Argentina: మేఘాల్లో ప్రయాణం.. అర్జెంటీనాలో ఆకాశాన్ని తాకే అద్భుత రైలు యాత్ర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Viral Video: పెళ్లి పీటల నుంచి నేరుగా అట్లకాడ పట్టారు.. అతిథుల ప్లేట్లు కడిగిన వధూవరులు.. వీడియో..
Hyderabad, Telangana:Inspirational Wedding Story Viral Video Watch: సాధారణంగా పెళ్లి అంటే వధూవరులు మహారాజుగా.. మహారాణిల ముస్తాబై పీటల మీద కూర్చుని ఉండటం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. బంధుమిత్రుల తాకిడికి.. ఫోటోషూట్లు, విందు వినోదాలతో ఆ రోజంతా బిజీగా గడుపుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే జంట మాత్రం ఒక వింత పనిచేసింది. పెళ్లి బట్టల్లోనే వంట పాత్రలతో పాటు అతిధులు భోజనం చేసిన ప్లేట్లను శుభ్రం చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఇది ఎక్కడ జరిగిందనే విషయం తెలియక పోయినప్పటికీ.. వీడియో మాత్రం వైరల్ అవ్వడం విశేషం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. వివాహ వేడుక ముగిసిన వెంటనే.. ఆ వధూవరులు విశ్రాంతి తీసుకోకుండా నేరుగా వంటలు వండిన చోటికి వెళ్లారు.. పట్టు చీరలో ఉన్న వధువు, పట్టు వస్త్రాల్లో ఉన్న వరుడు కలిసి పెళ్లిలో వాడిన పాత్రలను తోముతూ కనిపించారు. ఒకరు ప్లేట్లకు సబ్బు పెడుతుంటే.. మరొకరు వాటిని నీళ్లతో శుభ్రం చేస్తూ ఒకరినొకరు సాయం చేసుకున్నారు. ముఖంపై చెమటలు పడుతున్నప్పటికీ. భారీ ఆభరణాలు ఉన్న అవేమీ లెక్కచేయకుండా వారు చేస్తున్న పని చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్య పోయినట్లు తెలుస్తోంది.
సాధారణంగా ఇలాంటి పనులను చేయడానికి చాలామంది వెనక్కి వెళ్తూ ఉంటారు.. ముఖ్యంగా పెళ్లి రోజు ఇలాంటివి ఎవరూ ఊహించి ఉండరు. అయితే, ఈ జంట మాత్రం పనిలో ఏది తక్కువ కాదు అనే సందేశాన్ని ఇవ్వడానికే ఇలా చేసినట్లు సమాచారం. జీవితాంతం తోడుంటామని ప్రమాణం చేసిన వారు.. ఇంటి పనుల్లో కూడా ఒకరికొకరు సమానంగా బాధ్యతలు పంచుకుంటామని ఈ ఘటన ద్వారా నిరూపితమైందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. ఇంతటి సాధారణంగా ఉన్న జంట మేము ఇప్పటికీ చూడలేమని కొంతమంది కామెంట్ చేస్తూ వస్తుంటే.. మరి కొంతమంది తమ పెళ్లిలో తామే పనిచేయడం వల్ల అహంకారం తగ్గుతుంద.. బంధం బలం మరింత బలపడుతుందని మరికొంతమంది రాస్తూ వస్తున్నారు. అలాగే ఇది కేవలం వైరల్ అవ్వడానికి చేశారా అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మెజారిటీ సోషల్ మీడియా వినియోగదారులైతే ఈ వీడియో చూసి పాజిటివ్ గానే స్పందిస్తూ వస్తున్నారు.
Also Read: Argentina: మేఘాల్లో ప్రయాణం.. అర్జెంటీనాలో ఆకాశాన్ని తాకే అద్భుత రైలు యాత్ర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Male Fertility: ఎండలో బైక్ సీటు, ఒడిలో ల్యాప్టాప్.. పురుషుల సంతానోత్పత్తికి పొంచి ఉన్న ముప్పు!
Hyderabad, Telangana:Hot Bike Seats For Male Fertility News: దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా మండిబోతున్నాయి. భానుడి భగభగ లకు సాధారణ ప్రజలే కాదు వాహనదారులు కూడా అల్లాడిపోతున్నారు. అయితే, ఈ ఎండ వేడిమి కేవలం చర్మానికో దాహానికో పరిమితం కాకుండా.. పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా బైక్ సీట్ వేడితో పాటు లాప్టాప్ వాడకం వంటి అలవాట్లు భవిష్యత్తులో తండ్రి కావాలనుకునే వారికి శాపంగా మారే అవకాశం ఉందని ఆ అధ్యయనాలు చెబుతూ వస్తున్నాయి.
పురుషుల వీ*కణాల ఉత్పత్తి క్రమంగా జరగాలంటే.. వృషణాలు శరీర సాధారణ ఉష్ణోగ్రత కంటే రెండు లేదా మూడు డిగ్రీల సెల్సియస్ కంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉండాలి. అందుకే ప్రకృతి సిద్ధంగా వృషణాలు శరీర వెలుపల అమర్చబడి ఉంటాయి. అయితే మనం చేసే కొన్ని చిన్నపాటి తప్పుల వల్ల అక్కడ ఉష్ణోగ్రత పెరిగి.. వీ*కణాల సంఖ్య, నాణ్యతతో పాటు కదలికలు దెబ్బతింటున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
ఎండలో పార్క్ చేసిన బైక్ సీట్లు విపరీతంగా వేడెక్కుతాయి.. అయితే, ఆ వేడి సీటు పై నేరుగా కూర్చొని ఎక్కువ దూరం ప్రయాణం చేయడం వల్ల వృషణాల వద్ద ఉష్ణోగ్రత ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయట. అంతేకాకుండా లాప్టాప్ నేరుగా ఒడిలో పెట్టుకుని గంటల తరబడి పనిచేయడం వల్ల దాని నుంచి వెలుబడి వేడి నేరుగా జననేంద్రియాలపై పడి ఎన్నో దుష్ప్రభావాలకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయట. అలాగే టైట్ జీన్స్ లేదా కొన్ని ప్రత్యేకమైన దుస్తులను ధరించడం వల్ల వృషణాలకు గాలి ఆడక.. వీ*కణాలపై ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతూ వస్తున్నారు.
Also Read: Argentina: మేఘాల్లో ప్రయాణం.. అర్జెంటీనాలో ఆకాశాన్ని తాకే అద్భుత రైలు యాత్ర!
సంతాన ఉత్పత్తి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఎండల్లో ప్రయాణించేటప్పుడు సీటుపై తడిగుడ్డ వేయడం లేదా సీటు చల్లబడిన తర్వాతే కూర్చోవడం మంచిదని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు సంబంధించిన యూరాలజిస్ట్లు కూడా చెబుతూ వస్తున్నారు. ఎండాకాలంలో వీలైనంత వరకు వదులుగా ఉండే కాటన్ దుస్తులు, కాటన్ ప్యాంట్లు వాడడం మంచిదట.. అంతేకాకుండా ల్యాప్టాప్ ను ఎప్పుడు టేబుల్ పై ఉంచి వాడటంతో పాటు తప్పని పరిస్థితుల్లో ఒడిలో పెట్టుకోవాల్సి వస్తే కూలింగ్ ప్యాడ్ వినియోగించాల్సి ఉంటుందని వారు తెలుపుతున్నారు. శరీరం లోపల ఉష్ణోగ్రత పెరగకుండా ఉండడానికి తప్పనిసరిగా నీరును తాగడమే కాకుండా అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లను తాగడం మంచిదని వారు చెబుతున్నారు.
Also Read: Argentina: మేఘాల్లో ప్రయాణం.. అర్జెంటీనాలో ఆకాశాన్ని తాకే అద్భుత రైలు యాత్ర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
DA Hike 2026 Update: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..డీఏ పెంపుపై క్యాబినెట్లో జరగని చర్చ..డీఏ పెంపు లేనట్టేనా?
Hyderabad, Telangana:DA Hike 2026 News: 8వ వేతన సంఘం ఈ ఏడాది జనవరి నుంచి అమలులోకి రావడం వల్ల కరవు భత్యం (డీఏ) పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా ఒక కొత్త వేతన సంఘం అమలులోకి వచ్చినప్పుడు ఆ నాటికి అమలులో ఉన్న డీఏను మూలవేతనంలో విలీనం చేసి.. దాన్ని సున్నాకు రీసెట్ చేస్తారు. ఇలా డీఏ సెట్ చేయడం వల్ల భవిష్యత్తులో జీతాలు, పెన్షన్ల సవరణలో డీఏ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ద్రవ్యోల్బణ నుంచి ఆర్థికంగా ఆదుకునే కరవు భత్యం పెంపుపై ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూపుల వేళ మరింత జాప్యం ప్రభావం చూపుతోంది.
ఇప్పటికే ఏప్రిల్ 10 వచ్చేసింది. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు జనవరి-జూన్ కాలానికి సంబంధించిన కరువు భత్యం (డీఏ) పెంపు ప్రకటన కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా జనవరి డీఏ సవరణకు సంబంధించిన ప్రకటన దాదాపు ఎప్పుడూ మార్చిలోనే ఆమోదం పొందుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం డీఏ ప్రకటనలో మరింత ఆలస్యం జరుగుతోంది. అంతేకాకుండా ఈ వారంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో డీఏ పెంపు ప్రకటనపై ఎలాంటి చర్చ జరగకపోవడంతో, కోవిడ్-19 మహమ్మారి సమయంలో అనుసరించిన పద్ధతినే ప్రభుత్వం మళ్లీ అనుసరిస్తుందా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోయినా.. ప్రస్తుతానికి ఈ విషయం కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారంలో ఉంది. డీఏ ప్రకటనలో జాప్యం జరిగినా ప్రభుత్వం పూర్తిగా డీఏ పెంపు నిలుపుదల చేసినట్లు కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ డీఏ పెంపు ఎప్పుడు చేసినా..2026 జనవరి 1 నుంచి బకాయిలను చెల్లిస్తారు. ప్రస్తుతం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 58 శాతం కరవు భత్యాన్ని (డీఏ) పొందుతున్నారు. నివేదికల ప్రకారం.. డీఏ సుమారు 2 శాతం పెరిగి, దాదాపు 58 శాతం నుండి 60 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గత దశాబ్దానికి భిన్నంగా 2025లో డీఏ పెంపు ప్రకటనను మార్చి 28న.. అలాగే 2024లో మార్చి 7న చేశారు. 2023లో మార్చి 24న, 2022లో మార్చి 30న డీఏ పెంపు ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఇలాంటి ప్రకటనలు చేసిన తీరును బట్టి.. ప్రభుత్వం మార్చిలోనే డీఏ పెంపు ప్రకటిస్తుందని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశించారు. కానీ అలా జరగలేదు. 2026 సంవత్సరానికి గాను ప్రభుత్వం త్వరలోనే డీఏ పెంపును ప్రకటించవచ్చని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Argentina: మేఘాల్లో ప్రయాణం.. అర్జెంటీనాలో ఆకాశాన్ని తాకే అద్భుత రైలు యాత్ర!
Hyderabad, Telangana:Train To The Clouds Argentina Latest News: రైలు ప్రయాణం అంటేనే అందమైన ప్రకృతి దృశ్యాలతో పాటు కిటికీల పక్కన కూర్చుని చూసి పచ్చదనం గుర్తుకొస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా మేఘాలపైన రైల్లో ప్రయాణించారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. అర్జెంటీనాలోని ట్రెన్ ఎ లాస్ నుబెస్ (Tren a las Nubes) రైలు మార్గం ఈ అద్భుతమైన అనుభూతిన అందిస్తుంది. దీనిని స్పానిష్ భాషలో మేఘాల రైలుగా కూడా పిలుస్తారు. చూడడానికి ఇదే చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా.. ఆకాశం పై నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అర్జెంటీనాలోని ఆండీస్ పర్వత శ్రీనులకుండా సాగే ఈ రైలు మార్గం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు మార్గంలో ఒకటిగా గుర్తింపు పొందింది.. ఇది సముద్ర మట్టానికి సుమారు 4220 కిలోమీటర్లు ఎత్తులు ఉండటమే కాకుండా.. అక్కడ రైలు వెళ్లేందుకు ప్రత్యేకమైన పట్టాలను కూడా ఏర్పాటు చేశారు. రైలు వెళ్తుంటే కిటికీలోంచి చూస్తే.. మబ్బులు మన పాదాల కింద తేలుతున్నట్లు అనిపిస్తాయి. అందుకే దీనికి ఆకాశాన్ని తాకే మార్గమని పేరు వచ్చింది..
దాదాపు 217 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రయాణం పర్యాటకులను ఒక మాయా లోకంలోకి తీసుకెళ్తుంది. ఈ మార్గంలో రైలు సురక్షితంగా ప్రయాణించడానికి ఇంజనీర్లు ఎంతగానో కష్టపడాల్సి వచ్చిందని సమాచారం.. లోతైన లోయలను కలుపుతూ.. నిర్మించిన ఈ వంతెన పై రైలు వెళుతుంటే వెన్నులో వణుకు పుట్టక మానదు. 29 ఎతైన వంతెనలతో మార్గాన్ని నిర్మించినట్లు సమాచారం. కొండలను తొలచి.. చేసిన 21 సొరంగాల మార్గం గుండా చీకటిని చీల్చుకుంటూ రైలు ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది..
కొండల ఎత్తున అధిరోహించడానికి రైలు ముందుకు వెనక్కి కదులుతూ ఎక్కించే ప్రత్యేకమైన సాంకేతికతను ఇక్కడ వాడినట్లు తెలుస్తోంది.. అంత ఎత్తులో ప్రయాణించినప్పుడు గాలిలో ఆక్సిజన్ స్థాయిని తక్కువగా ఉంటాయి. దీనివల్ల ప్రయాణకులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని.. రైలులో అత్యాధునిక వైద్య సదుపాయంతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు నిరంతరం అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన వైద్య బృందం కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల రక్షణ ధ్యేయంగా ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారట..
Also Read: ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు.
సాల్టా నగరం నుంచి ప్రారంభమయ్యే.. ఈ ప్రయాణం పొల్వోరిల్లా వయాడక్ట్ వద్ద ముగుస్తుంది. మార్గ మధ్యలో కనిపించే మంచు కుంటలతో పాటు ఎడారి లాంటి పీఠభూములు పర్యాటకులకు ఎంతగానో కనిపిందు చేస్తాయి. సాహస యాత్రలు ఇష్టపడేవారు తమ జీవితంలో ఒక్కసారి అయినా ఈ మేఘాల రైలులో ప్రయాణించాల్సిందేనని పర్యాటకులు చెబుతూ ఉన్నారు. ప్రకృతి అందాలతో పాటు ఇంజనీరింగ్ వింతను కలిపే ఈ అద్భుతమైన యాత్ర పర్యాటక రంగంలో ఒక అద్భుతంగా భావించవచ్చు..
Also Read: ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Birthday As Death Day: బర్త్డేను డెత్ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే
Iskapalli, Andhra Pradesh:Snake Bite Death: బంధుమిత్రులు, కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా పుట్టినరోజు చేసుకున్న బాలిక అలసిపోయి రాత్రి తల్లితో కలిసి మంచంపై నిద్రించింది. కానీ అదే చివరి రాత్రి అవుతుందని కుటుంబసభ్యులతోపాటు ఆ బాలిక కూడా అనుకోలేదు. మంచంపైకి యమపాశంలా పాము దూసుకొచ్చింది. తల్లితోపాటు నిద్రిస్తున్న బాలికను కాటేసింది. ఆలస్యంగా గుర్తించడంతో విషం శరీరమంతా పాకడంతో బాలిక మృతి చెందింది. ఈ సంఘటన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో చోటుచేసుకుంది. బర్త్డే తెల్లవారుజామునే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ కోనపాపేట జగనన్న కాలనీకి చెందిన చప్ప మల్లేశ్వరి కుమార్తె దీపిక (14). కోనపాపేట హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న దీపిక గురువారం తన పుట్టినరోజు ఎంతో సంతోషంగా.. ఆనందోత్సాహాలతో చేసుకుంది. బర్త్ డే చేసుకున్న ఆనందంలో ఉన్న బాలిక రాత్రి ఇంట్లో తల్లి మల్లేశ్వరితో కలిసి మంచంపై నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున మంచంపై ఉన్న పరుపు కిందకు పాము దూరింది. కొద్దిసేపటికి దీపికను ఆ కాటు వేసింది. బాలికకు పాము కాటేసిన విషయాన్ని గమనించిన తల్లి వెంటనే పిఠాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పుట్టినరోజు తెల్లారే బాలిక మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. 14 ఏళ్లకే నూరేళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు లబోదిబోమంటూ రోదించారు. ఈ సంఘటనపై యు కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా బాలికను కాటేసిన పాము గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్లు చంపేశారు.
Also Read: YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్ జగన్
అత్తకు యముడిగా అల్లుడు
అత్తకు యముడిగా అల్లుడి మారిపోయి ఆమె ప్రాణం బలి తీసుకున్నాడు. వృద్ధాప్యంలో అత్తకు అండగా ఉండాల్సిన అల్లుడు అంతమెుందించాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని తారకరామనగర్లో తన భార్యను కాపురానికి రాకుండా అత్త పోల మంగమ్మ తప్పుదోవ పట్టిస్తుందని అల్లుడు కేదారి పుల్లయ్య భావించాడు. భార్యాభర్తల మధ్య అత్త అడ్డుగా ఉందని.. ఆమె అడ్డు తొలగించుకోవాలని అల్లుడు నిర్ణయించుకున్నాడు. మద్యానికి బానిసైన అల్లుడు అత్తను చంపితే తమ సంసార జీవితానికి అడ్డేమి ఉండదని భావించి అత్త నిద్రిస్తున్న సమయంలో కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Baas Electric Scooter: సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూ.44,990కే అందుబాటులో బ్రాండ్ EVలు! ఏది బెస్టో తెలుసా?
Hyderabad, Telangana:Electric Scooter Baas Price: ఎలక్ట్రిక్ వాహానాల భారీ ఖర్చుతో విక్రయిస్తున్న నేపథ్యంలో దాని కొనుగోలు సమయంలో సగానికి సగం ఖర్చు వినియోగదారులకు తగ్గించే మోడల్ ప్రవేశపెట్టారు. 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) మోడల్ అనేది ఎలక్ట్రిక్ వాహనాల అధిక ధరను తగ్గించడానికి ఒక వినూత్న పరిష్కారంగా మారాయి. ఈ విధానం బ్యాటరీ ఖర్చును వేరు చేసి, స్కూటర్ కొనుగోలు ధరను సగానికి తగ్గిస్తుంది. వినియోగదారులు బ్యాటరీని నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించి, తమ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ను మార్చుకోవచ్చు.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. పెట్రోల్ వెహికల్స్ అంతరించిపోయే విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈవీలు అధిక ధరలు ఉండడం వల్ల వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని.. బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ (BaaS) అనే విన్నూత్న నమూనాను తయారీ సంస్థలు ముందుకు తెచ్చాయి. అయితే బైక్ లేదా స్కూటర్ కొనే సమయంలో బ్యాటరీ ఖర్చును అందులో నుంచి మినహాయించి సగం ధరకే అమ్మకాలను చేసేందుకు నిర్ణయించారు. దీని వల్ల వినియోగదారులు వాటిని కొనేందుకు ఆసక్తి చూపే అవకాశం కనిపిస్తోంది. అయితే బ్యాటరీ కోసం కేవలం నెలవారీ సబ్స్క్రిప్షన్ మాత్రమే అవసరం పడుతుంది.
ఈ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం ధరను దాదాపు సగానికి తగ్గేలా చేస్తుంది. ముఖ్యంగా ఇది పే-యాజ్-యు-గో మోడల్ కావడం వల్ల.. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ మోడల్ కింద ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా TVS ఆర్బిటర్ V1 గురించి తెలుసుకుందాం. ఇది తక్కువ ధరకే మంచి ఫీచర్లను అందించే మోడల్గా మార్కెట్లో నిలుస్తుంది. సాధారణంగా దీని ధర రూ.84,500గా విక్రయిస్తున్నారు. BaaS సదుపాయంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను కేవలం రూ. 49,999కే అమ్మకం చేస్తున్నారు. ఇది ఒకసారి ఛార్జ్ చేయడం వల్ల సుమారు 86 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఇందులో LED హెడ్ల్యాంప్స్, స్మార్ట్ కనెక్టివిటీ, యాంటీ-థెఫ్ట్ అలారం, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన వీడా VX2 గో స్కూటర్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ BaaS మోడల్లో కేవలం రూ.44,990 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది తీసివేయగల బ్యాటరీతో వస్తుంది. ఇది ఒకే ఛార్జ్పై సుమారు 92 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. ఇందులో గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగం, డిజిటల్ డాష్బోర్డ్, రివర్స్ అసిస్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
మూడవది టీవీఎస్ ఐక్యూబ్.. ఇది ఇప్పటికే భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. BaaS పథకంతో.. దీని ప్రారంభ ధర రూ.59,999కి తగ్గింది. టాప్ వేరియంట్ 212 కిలోమీటర్ల వరకు రేంజ్ను అందజేస్తుంది. స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ.. TFT డిస్ప్లే, పెద్ద స్టోరేజ్ వంటి ఫీచర్లు దీనిని మరింత ఆకర్షణీయంగా నిలిపాయి. మొత్తంమీద ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో BaaS మోడల్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రారంభ ఖర్చును తగ్గించడం, వినియోగదారునికి సౌకర్యవంతమైన చెల్లింపు పద్ధతిని అందించడం దీని ప్రధాన ప్రయోజనంగా మారింది. భవిష్యత్తులో ఈ పథకం మరింత విస్తరించే అవకాశం ఉందని మార్కెట్లో నిపుణులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nayanthara: తిరుమలలో నయనతార, విఘ్నేష్ సందడి
Dharmavaram, Andhra Pradesh:Actress Nayanthara Visits Tirumala Temple Along With Husband Vignesh Watch VideoTirumala: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యే తిరుమలలో ప్రత్యక్షం
Dharmavaram, Andhra Pradesh:Telangana Congress MLAs Visits Tirumala Temple Watch VideoBest Used Cars: రూ.8.99 లక్షలకే మహీంద్రా థార్, టాటా హారియర్.. సెకండ్ హ్యాండ్ కార్ల ధమాకా!
Hyderabad, Telangana:Best Used Cars in Delhi Pitampura: తక్కువ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త.. మధ్యతరగతి ప్రజల ధరలకు కూడా అద్భుతమైన కండిషన్తో కూడిన సెకండ్ హ్యాండ్ కార్లు ఢిల్లీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలోని పీతంపురా ఏరియాలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలో అత్యంత తక్కువ ధరలకే మంచి మంచి కండిషన్ కలిగిన కార్లు లభిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ అద్భుతమైన కార్లు రూ.2.60 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఎస్యూవీ (SUV), సెడాన్, హ్యాచ్బ్యాక్ కార్లు చీపు ధరలకే లభించడం విశేషం. ముఖ్యంగా ఇక్కడ డీజిల్, పెట్రోల్, సిఎన్జి (CNG) ఆప్షన్లలో లభిస్తున్న కార్లను ఎక్కువగా వినియోదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్లో అందుబాటులో ఉన్న కార్లు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ కార్ల మార్కెట్లో టాటా హారియర్ (Tata Harrier) వంటి లగ్జరీ కార్లు రూ. 7.75 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 2021కి సంబంధించిన మోడల్ హారియర్ కేవలం రూ. 8.99 లక్షలకే అందుబాటులో ఉండడం విశేషం. అలాగే ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం 2021 మోడల్ మహీంద్రా థార్ (Mahindra Thar) 4x4 వేరియంట్ రూ. 8.99 లక్షలకే అందుబాటులో ఉంది. అలాగే మధ్యతరగతి వారికి ఇష్టమైన మారుతి స్విఫ్ట్ డిజైర్ (Swift Dzire) ఆటోమేటిక్ వేరియంట్ రూ. 3.99 లక్షలకే లభిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల మోడల్స్ అత్యంత తక్కువ ధరల్లో లభిస్తూ ఉన్నాయి.
ఇవే కాకుండా 2019 మోడల్ కు సంబంధించిన మహీంద్రా KUV ఆన్-పేపర్ సిఎన్జితో కలిపి రూ. 2.95 లక్షలకే అందుబాటులో ఉండడం విశేషం.. అదేవిధంగా 2015 కు సంబంధించిన ఫోర్డ్ ఫిగో కేవలం రూ. 2.60 లక్షలతో మొదలు కాబోతోంది. దీంతోపాటు 2016 మోడల్ కు సంబంధించిన హ్యుందాయ్ క్రెటా ధర రూ. 5.50 లక్షలకే లభిస్తోంది. అలాగే ఈ సిఎన్జి ఫిట్టింగ్తో అందుబాటులో ఉంది. ఇది హైవేపై దాదాపు 30 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా 2018 మోడల్ హ్యుందాయ్ వెర్నా (Verna) కేవలం రూ. 6.25 లక్షలకు అందుబాటులో ఉంది.
Also Read: ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు..
దీంతోపాటు కస్టమర్ల కోసం తాడుపాటి మెకానిక్ చెకప్ లేదా ఇన్ఫెక్షన్ చేసుకునే వెసులుబాటును కూడా ఈ మార్కెట్లో కొన్ని సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ వారు వారే ప్రత్యేకంగా అందిస్తున్నారు. అంతేకాకుండా వీటితోపాటు ఫ్యాన్ ఇండియా లోన్ సదుపాయం, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికోసం ఎన్ఓసీతో పాటు ట్రాన్స్ఫర్ వంటి బాధ్యతలను కూడా ఇక్కడున్న షోరూమ్ యజమానులే చూసుకుంటున్నట్లు సమాచారం. కాబట్టి తక్కువ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఢిల్లీలోని పీతంపురా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లు షోరూమ్స్ చాలా బెస్ట్ గా భావించవచ్చు..
Also Read: ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Karimnagar: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ!
Hyderabad, Telangana:Karimnagar Telugu Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈరోజు BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ కాబోతున్నారు. ఎర్రబెల్లిలోని కేసీఆర్ నివాసానికి తన అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి వెళ్లనుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.. ఈరోజు జీవన్ రెడ్డి కెసిఆర్ ని కలవడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ సమావేశాన్ని కేవలం మర్యాదపూర్వక భేటీగా జీవన్ రెడ్డి వర్గీయులు తెలిపినప్పటికీ.. దీని వెనక లోతైన రాజకీయ వ్యూహాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులతో పాటు సొంత పార్టీలో నెలకొన్న అనిచ్చితి నేపథ్యంలో జీవన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ తో భేటీ అనంతరం ఆయన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ భేటీకి జీవన్ రెడ్డితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కీలక Brs నేతలు కూడా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్తో పాటు గంగుల కమలాకర్, టిఆర్ఎస్ సీనియర్ నేత ఎల్ రమణ, దామోదర్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ వీరికి దిశా నిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం.
Also Read: ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు..
జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత కేసిఆర్ చెంతకు చేరడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో BRS కేడర్లో కొత్త ఉత్సాహం నెలకుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాము మాత్రం గా ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే ఈ భేటీ ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కొప్పుల ఈశ్వర్ తో పాటు గంగుల కమలాకర్ వంటి సీనియర్ నేతల సమక్షంలో జరిగే ఈ సమావేశం జిల్లా రాజకీయ చిత్రపటాన్ని మార్చే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..
Also Read: ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Shani Dev: ఏప్రిల్ 12 నుంచి శని గ్రహ మార్పు.. ఆ రాశుల వారికి ఆర్థిక కష్టాలు తప్పవా?
Hyderabad, Telangana:Shani Dev Effect On 4 Zodiac Signs Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిగ్రహం మార్పుల కారణంగా మానవ జీవితాల్లో ఎన్నో రకాల ఊహించని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. న్యాయదేవతగా పిలుచుకునే ఈ శని తన స్థితిని మార్చుకున్నప్పుడల్లా ద్వాదశ రాశుల వారిపై శుభ, అశుభ ప్రభావం పడుతూ ఉంటుంది. 2026 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన శని దేవుడు మీన రాశిలో ఉదయించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం తిరోగమన నుంచి సక్రమ మార్గంలోకి రావడం వల్ల అనేక మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా శని గ్రహం శనివారం రోజున సక్రమ మార్గంలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారు అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా ఆయా రాశుల వారి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఈ రాశుల వారిపై శని ప్రభావం..
మేషరాశి
మేషరాశిలో జన్మించిన వ్యక్తులపై శని ప్రభావం విపరీతంగా పడబోతోంది. వీరికి ఊహించని స్థాయిలో ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు అనవసరపు వివాదాల్లో కూడా దూరి పేరును నాశనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యల భారిన కూడా పడే అవకాశాలు ఉన్నాయి.
కన్యరాశి
కన్యా రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాల్లో అనేక ఇబ్బందులు రావడం ప్రారంభమవుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో వీరి తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా మంచిది.. దీంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ వహించకపోవడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో సంతానపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన పడకుండా ఎంతో జాగ్రత్తగా ఉండి ముందుకు సాగడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ సమయంలో విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాల్లో కూడా ఆలోచించి వ్యక్తిగత జీవితానికి ఏది బాగుంటుందని అనే అంశాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగండి..
మీన రాశి
శని మీన రాశిలో ఉదయించడం వల్ల రాశి వారికి మానసిక ఆందోళన పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అన్ని రకాల పనుల్లో విపరీతంగా జాప్యం జరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించడం వల్ల ముందుకు సాగకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో కాస్త నెమ్మది నెమ్మదిగా పనులు చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. దీంతోపాటు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IPL 2026 LSG vs KKR: ఓటమి నుంచి లక్నో విజయం.. బౌలర్ల వైఫల్యంతో కలకత్తా హ్యాట్రిక్ ఓటమి
Kolkata, West Bengal:KKR vs LSG Highlights: ఇది అసలైన క్రికెట్ ఆట.. ఇది అసలైన ఐపీఎల్ మజా. వరుసగా జరుగుతున్న మ్యాచ్లు నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగుతుండగా.. లక్నో సూపర్ జియాంట్స్, కలకత్తా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా అదే స్థాయిలో జరిగింది. ఒక్కో బంతి ఒక్కో మలుపు తిరుగుతూ.. ఫలితం అటు ఇటు తారుమారు అవుతూ చివరకు విజయం లక్నో వైపు నిలవగా.. మరో ఓటమిని ఖాతాలో వేసుకుని ఈ సీజన్లో కలకత్తా హ్యాట్రిక్ పరాభవం మూటగట్టుకుంది.
Also Read: Gas Cylinder Theft: ఖమ్మంలో సరికొత్త దొంగతనం.. బంగారం కన్నా గ్యాస్ సిలిండర్ ఎక్కువ
వరుస ఓటములతో సతమతమవుతున్న కలకత్తా నైట్రైడర్స్ మరో ఓటమిని చవిచూసింది. లక్నో సూపర్ జియాంట్స్తో జరిగిన మ్యాచ్లో ఏమాత్రం పోరాటం చేయలేదు. మోస్తరు లక్ష్యాన్ని బౌలర్లు కాపాడడంలో విఫలమయ్యారు. కానీ లక్నో సూపర్ జియాంట్స్ అద్భుతంగా ఆడి ఓటమి నుంచి విజయం వైపుగా మ్యాచ్ను మలుపు తిప్పింది. కలకత్తా వేదికగా జరిగిన మ్యాచ్లో కలకత్తాపై మూడు వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించి పాయింట్లను మెరుగుపర్చుకోగా.. కలకత్తా హ్యాట్రిక్ ఓటములతో చెన్నై సరసన నిలిచింది.
Also Read: Gas Cylinder Theft: ఖమ్మంలో సరికొత్త దొంగతనం.. బంగారం కన్నా గ్యాస్ సిలిండర్ ఎక్కువ
సొంతగడ్డపై టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కత్తా నైట్రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహనే 24 బంతుల్లో 41 పరుగులు చేయగా.. వాటిలో 4 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఫిన్ అలెన్ (9) తక్కువ స్కోర్కే పరిమితమవగా.. అంగ్క్రిష్ రఘువంశీ అద్భుతంగా ఆడి 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. వాటిలో 5 బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కామెరూన్ గ్రీన్ 24 బంతుల్లో 32 పరుగులతో రాణించగా.. రింకూ సింగ్ 4 పరుగులే చేశాడు. ఆఖరులో రావ్మన్ పావెల్ చెలరేగి ఆడి 39 పరుగులు చేసి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోర్ను అందించాడు. వరుస వైఫల్యాలను పొందుతున్న సమయంలో విజయం కోసం భారీ స్కోర్ చేస్తారనుకుంటే మోస్తరు స్కోర్ నమోదు చేశారు. లక్నో సూపర్ జియాంట్స్ బౌలింగ్ చెప్పుకోదగ్గట్టు ఏమీ లేదు. ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠి, అవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
కలకత్తా నిలిపిన లక్ష్యాన్ని బంతులను పూర్తి చేసుకుని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూపర్ ఓవర్ వెళ్తుందని భావించగా అనూహ్యంగా ముకుల్ చౌదరి బ్యాటింగ్తో అదరగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. మిచెల్ మార్ష్ (15), కెప్టెన్ రిషబ్ పంత్ (10), నికోలస్ పూరన్ (13), అబ్దుల్ సమద్ (2), షమీ (1) తక్కువ పరుగులు చేయగా.. ఆయుశ్ బదౌనీ, ముకుల్ చౌదరి అద్భుతంగా ఆడారు. 34 బంతుల్లో 54 పరుగులు చేసిన ఆయుశ్.. 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. వికెట్లన్నీ టపాటపా పడుతున్నా.. ఓటమి ఖాయం చేసుకున్న సమయంలో ముకుల్ చౌదరి అద్భుతంగా ఆడాడు. ఎవరూ ఊహించని రీతిలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగి దుమ్మురేపాడు. 27 బంతుల్లో 54 పరుగులు చేసి విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీలు రెండు కొట్టగా.. ఏడు సిక్సర్లతో ధనాధన్ షాట్లు బాదాడు.
చివరి రెండు ఓవర్లు
విజయం కోసం ఏమాత్రం కలకత్తా బౌలర్లు ప్రయత్నం చేయలేకపోయారు. ఆరంభంలో టపాటపా వికెట్లు తీసినా.. ఓవర్లు ముగుస్తున్నా కొద్దీ బౌలింగ్ పదును తగ్గింది. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లు చక్కగా వేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ కలకత్తా బౌలర్లు గెలుపు బాధ్యత మరిచారో లేదో ఏమిటో తెలియదు కానీ వికెట్లు తీయకపోవడమే కాకుండా పరుగులను కూడా నియంత్రించలేకపోయారు. వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్ రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, కామెరూన్ గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Akanksha Puri Bikini Saree: చీరపై బికినీ బ్లౌజ్లో తమిళ హీరోయిన్ రచ్చ..సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు!
Hyderabad, Telangana:Akanksha Puri Bikini Saree Photots: సినీ తారల జీవితమంతా వారు ఏదో ఒక స్టైల్, ఫ్యాషన్ ట్రెండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి కొన్ని విచిత్రమైన ఫ్యాషన్స్ సాధారణ ప్రజలకు అంతగా నచ్చకపోవచ్చు. అలా ఎంతో మంది సెలబ్రిటీలు తమ ఫ్యాషన్ డిజాస్టర్గా మిగిలిన రోజుల్లో ఎంతో మంది ట్రోల్స్కు గురైయ్యారు. ఇప్పుడదే కోవలో ఓ సీరియల్ నటిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ 37 ఏళ్ల నటి తాజాగా జరిగిన ఓ ఫ్యాషన్ షోలో సంప్రదాయ దుస్తులైన చీరపై బికినీ బ్లౌజ్ ధరించి ర్యాంప్ వాక్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
తమిళ, హిందీ, భోజ్పురీ వంటి భాషల్లో సుపరిచితమైన బోల్డ్ యాక్టరస్ ఆకాంక్ష పూరి. తమిళంలో విశాల్, తమన్నా జంటగా నటించిన 'యాక్షన్' సినిమాలోనూ ఆకాంక్ష నటించింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షెన్ రిలీజ్ కాగా.. ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇటీవలే ఆమె 'సారీ పర్మైష్' అనే మ్యూజిక్ వీడియోతో తరచూ వార్తల్లో నానుతోంది. ఆ మ్యూజిక్ ఆల్బమ్ ప్రచారంలో భాగంగా ఓ ఫ్యాషన్ షోకు నటి ఆకాంక్ష పూరి హాజరైంది. అయితే అందులో ఆమె ధరించిన దుస్తులు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
ఈ ఆన్లైన్ ట్రోలింగ్కు కారణం ఏమిటంటే ఆమె ర్యాంప్ వాక్ సమయంలో సంప్రదాయ చీరపై బికినీ బ్లౌజ్ ధరించడమే అని తెలుస్తోంది. ఇదే విషయమై ఆమెపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఆమెపై తిట్ల దండకం మొదలుపెడుతున్నారు. ఇప్పుడిదే ట్రోల్స్ పై నటి ఆకాంక్ష పూరి స్పందించారు.
బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్లో డిజైనర్ రోహిత్ వర్మ కోసం నటి ఆకాంక్ష పూరి.. అతిథిగా ర్యాంప్పై నడిచినప్పటి నుంచి ఈమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాషా బసుతో సహా పలువురు ప్రముఖ తారలు విచ్చేశారు. అయితే ఈ ర్యాంప్ వాక్లో ఆకాంక్ష పూరి ధరించిన బికినీ బ్లౌజ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ నటి సాంప్రదాయ మహారాష్ట్ర పైఠానీ చీరను ధరించి, దానికి బికినీ బ్లౌజ్ను ధరించడం చాలామందికి నచ్చలేదు.

ఈ క్రమంలో ఆమె ఈ దుస్తులలో ర్యాంప్పై నడిచినప్పుడు.. అందరూ ఆమె సిక్స్ ప్యాక్ అబ్స్, ఫిట్నెస్ను గమనించి కొందరు మెచ్చుకోగా మరికొందరు ఆ ఫొటోలను చూసి విమర్శిస్తున్నారు. ర్యాంప్ వాక్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంటే.. ట్రోల్స్ మొదలయ్యాయి. ఇలాంటి దుస్తుల కాంబినేషన్ భారతీయ సంస్కృతిని అవమానించడమే అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే 'చెత్త ఫ్యాషన్' అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
ఆన్లైన్ ట్రోలింగ్ పై నటి ఆకాంక్ష పూరి స్పందించింది. దుస్తులు అనేవి తన ఎంపిక కాదని చెప్పింది. అది కేవలం డిజైనర్ ఆలోచన అని ఆమె తెలిపింది. డిజైనర్ నచ్చిన దుస్తులను ర్యాంప్ వాక్లో ధరించాల్సి ఉంటుందని.. తన డిజైనర్ చెప్పిన దుస్తులనే ధరించానని ఆమె చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన డిజైనర్ రోహిత్కు మద్దతుగా నిలిచింది. రోహిత్ డిజైన్ చేశాడంటే ఎంతో ఆలోచించి.. ఆ తర్వాతే అలా డిజైన్ చేసి ఉంటాడని వెల్లడించింది. అతని పూర్తిగా నమ్మకం ఉందని.. తనపై నమ్మకంతోనే ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్ చేశానని జవాబు ఇచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
