ఖమ్మం గ్రీవెన్స్ భారీగా బాధితుల ఫిర్యాదులు
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Municipal Exit Poll Results: పంచాయతీ ఎన్నికల్లో ఎదురుగాలి వీయగా.. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యంగా నిర్వహించినా తీవ్ర ఉత్కంఠతో ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో బుధవారం పోలింగ్ ముగిసింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గూండాల్లా రెచ్చిపోయి పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు చేయగా.. పలుచోట్ల తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బ్యాలెట్ పత్రాల్లో ఓటర్లు తమ నిర్ణయాన్ని ఉంచారు. ఎల్లుండి ఫలితాలు విడుదల కానుండగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. యథావిధిగా అధికార పార్టీకి అత్యధిక స్థానాలు దక్కుతుండగా.. అంతే పోటీగా బీఆర్ఎస్ పార్టీకి స్థానాలు దక్కుతున్నాయి. బీజేపీకి సింగిల్ డిజిట్ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Schools Holiday: రేపు తెలంగాణలో స్కూళ్లకు సెలవు.. ఉత్తర్వులు జారీ!
మున్సిపాలిటీల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు
మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి పీపుల్స్ పల్స్తోపాటు మరికొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేశాయి. వాటిలో అత్యధికంగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుండగా.. గులాబీ పార్టీ కూడా ఇంచుమించు అదే స్థాయిలో స్థానాలు దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది. ఇక బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా ఉన్నాయని స్పష్టమవుతోంది.
==> 116 మున్సిపాలిటీల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 68-76 దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేలింది.
==> ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ 29-36 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని తెలిసింది.
==> బీజేపీ 3-5 సింగిల్ డిపాజిట్ దక్కించుకుంటుందని వెల్లడైంది.
==> ఎంఐఎం ఒక్కటీ లేకుంటే సున్నా ఉండే అవకాశం.
ఓట్ల శాతం
కాంగ్రెస్: 36 శాతం
బీఆర్ఎస్ పార్టీ: 29.7 శాతం
బీజేపీ: 19.3 శాతం
ఎంఐఎం: 2 శాతం
Also Read: AP Budget Session: విధ్వంసం నుంచి అభివృద్ధి- సంక్షేమంపై పరుగులు: ఏపీ గవర్నర్
ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొందని.. ఈ ఫలితాలు కొద్దితేడాలతో అటు ఇటు మారుతాయని అంచనా వేశారు. 8 నుంచి 14 మున్సిపాలిటీల్లో ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా రాజకీయం నడిచినట్లు తెలుస్తోంది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వార్డుల వారీగా ఫలితాలు
కాంగ్రెస్: 1,210 నుంచి 1,290
బీఆర్ఎస్ పార్టీ: 860 నుంచి 930
బీజేపీ: 250 నుంచి 270
ఎంఐఎం: 35-44
సీపీఐ: 12 నుంచి 17
సీపీఎం: 10 నుంచి 14
ఇతరులు: 90 నుంచి 110
మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలు
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా తలపడగా.. కొన్ని చోట్ల ఎంఐఎం కింగ్ మేకర్గా నిలుస్తుందని తెలుస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ రెండు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Moto G57 Power 5G Price Cut: ఇటీవల మోటరోలా కంపెనీ విడుదల చేసిన సరికొత్త మొబైల్స్లో Moto G57 Power 5G స్మార్ట్ఫోన్ ఒకటి. ఇది అద్భుతమైన భారీ బ్యాటరీ సెట్ అప్ తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లతో విడుదల చేసింది. ముఖ్యంగా చాలా ప్రత్యేకమైన డిస్ప్లే సెటప్ ను కలిగి ఉంటుంది. కాబట్టి అతి తక్కువ ధరలోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ గా భావించవచ్చు. అయితే, ఈ స్మార్ట్ఫోన్పై ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారు భారీ తగ్గింపుతో దీనిని సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ మొబైల్పై ఉన్న స్పెషల్ ఆఫర్స్ ఏంటో? ఎంత తగ్గింపు ధరకు ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Moto G57 Power 5G స్మార్ట్ఫోన్ 6.72 అంగుళాల Full HD+ LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1050 నిట్స్ బ్రైట్నెస్ తో లభిస్తోంది. ఈ మొబైల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఎంతో శక్తివంతమైన 7,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్కు ప్లస్ పాయింట్ ఇదే అని చెప్పొచ్చు. అయితే ఇందులో ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కోసం 33W టర్బోపవర్ (TurboPower) ఫాస్ట్ చార్జర్ ని కూడా అందిస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 60 గంటల వరకు బ్యాటరీ లైఫ్ను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన Snapdragon 6s Gen 4 (ఇది 4nm చిప్సెట్ ప్రాసెసర్ పై లాంచ్ అయింది. ఇది 8gb ర్యామ్ సపోర్టుతో అందుబాటులో ఉంది. అలాగే రెండు స్టోరేజ్ ఆప్షన్స్లో లభిస్తోంది. ప్రస్తుతం 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంపై ఈ రన్ అవుతుంది. దీంతోపాటు Sony LYT-600 సెన్సార్తో 50MP మెయిన్ కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ లో అదనంగా 8MP అల్ట్రావైడ్ లెన్స్ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ ఫ్రంట్ భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇందులో డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సపోర్ట్తో కూడిన స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ 5G సపోర్ట్, బ్లూటూత్ 5.1, USB టైప్-సి కనెక్టివిటీ ఫీచర్లను కూడా అందిస్తోంది.
Moto G57 Power 5G స్మార్ట్ఫోన్ మార్కెట్లో బేస్ వేరియంట్ ధర రూ.17,999 కాగా.. ఇప్పుడే ఫ్లిఫ్కార్ట్లో కొనుగోలు చేసే వారికి 22 శాతం తగ్గింపుతో కేవలం రూ.13, 999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి అదనంగా రూ.700 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ఇదే తగ్గింపు లభిస్తుంది. ఇక అదనంగా మరింత చీపు ధరకే ఈ మొబైల్ పొందాలనుకునే వారు ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగిస్తే ఏకంగా రూ.13 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్కి కేవలం రూ.999 లోపే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nothing Phone 3a Pro Price: నథింగ్ ఫోన్ (3a) ప్రో (Nothing Phone 3a Pro) స్మార్ట్ఫోన్ను కంపెనీ 2025 సంవత్సరం మార్చి నెలలో విడుదల చేసింది. ఇది అత్యంత శక్తివంతమైన మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్గా లాంచ్ అయింది. అయితే, ఇప్పుడే కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మొబైల్ ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఫ్లిఫ్కార్ట్లో కొనుగోలు చేస్తే అదనంగా ప్రత్యేకమైన కూపన్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగిస్తే ఈ మొబైల్ గతంలో ఎన్నడు లభించని ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్తో సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్కు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Nothing Phone 3a Pro స్మార్ట్ఫోన్ అద్భుతమైన 6.77-అంగుళాల Flexible AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 nits గరిష్ట బ్రైట్నెస్తో లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 7s Gen 3 (4nm) చిప్సెట్ ప్రాసెసర్ పై విడుదలైంది. ఇది 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు మార్కెట్లో 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో లభిస్తోంది. అదేవిధంగా వెనక భాగంలో ఇది త్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. దీని ప్రధాన కెమెరా అద్భుతమైన సెన్సార్తో లభిస్తుంది.
ఈ Nothing Phone 3a Pro మొబైల్కు సంబంధించిన బ్యాక్ సెటప్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ OIS సెన్సార్తో కూడిన 50MP మెయిన్ కెమెరాతో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతోపాటు అదనంగా 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే అదనంగా మరో 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. ఫ్రంట్ భాగంలో 50MP ఫ్రంట్ కెమెరా, ఇది 4K వీడియో రికార్డింగ్ను సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైన 5000 mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది.
అంతేకాకుండా ఈ Nothing Phone 3a Pro స్మార్ట్ఫోన్ చాలా ప్రత్యేకమైన Android 15 ఆధారిత Nothing OS 3.1 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే దీనికి కంపెనీ మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్ను కూడా అందిస్తోంది. ఆరేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్ సపోర్టును కూడా అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో 128Gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ రూ.29 వేల రూపాయలతో అందుబాటులో ఉంది. ఇక దీనిని ఫ్లిప్కార్ట్లో ఇప్పుడే కొనుగోలు చేస్తే రూ.3000 వరకు కూపన్ లభిస్తుంది. దీంతోపాటు ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,300 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్ని వినియోగిస్తే ఈ స్మార్ట్ఫోన్ కేవలం రూ.25 వేల లోపే వస్తుంది. అలాగే దీనిని ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ.20 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.5 వేల లోపే సొంతం చేసుకోవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
White King Cobra Video Watch: ప్రకృతి ఒడిలో ఎన్నో వింత జీవులు జీవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల జీవులు అందర్నీ ఎంతగానో ఆశ్చర్యపరిస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా ఇటీవల ఓ అందమైన నదిలో కనిపించిన అరుదైన పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సాధారణంగా పాములు మనం నలుపు గోధుమ రంగుల్లో చూస్తూ ఉంటాం. కానీ ఈ వీడియోలో మాత్రం ఆ పాము తెలుపు రంగులో నదిలో పాకుతూ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారుల ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక వీడియో వివరాల్లోకి వెళ్తే.. ప్రకృతి ఒడిలో ఎంతో అందంగా ప్రవహిస్తున్న ఒక నది కనిపిస్తుంది.. అందులో నీరు ఎంతో నిర్మలంగా.. నది అడుగులో ఆకుపచ్చని రంగులో మెరుస్తూ ఉండడం మీరు చూడొచ్చు. కొందరు పర్యాటకులు నీటిలో కేరింతలు కొడుతూ స్నానం చేస్తున్నారు. ఇంతలోనే నీటిలో నుంచి అనుకోకుండా ఒక భారీ పాము ప్రవేశించింది. ఆ పాము తెలుగులోని రంగులో ఉండడం మీరు గమనించవచ్చు. అయితే, అది చాలా పొడవుగా చూడడానికి అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తోంది..
ఈ పాము అక్కడ ఈదుతున్న పర్యాటకుల వైపుగా రావడం మీరు గమనించవచ్చు. ఆ పాము రావడం గమనించిన పర్యాటకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొందరు ఆ పామును చూసి నీటిలో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేశారు. మరికొందరు ఒడ్డు పైనే ఉండి.. ఆ పామును మొబైల్లో చిత్రీకరిస్తున్నారు. అయితే, ఆ పాము మాత్రం ఎంతో వేగంగా పర్యాటకుల వైపు గానే దూసుకు రావడం మీరు గమనించవచ్చు. ఈ పాము ఎవరికీ హాని చెయ్యకుండా ఈదుతూ నెమ్మదిగా ముందుకు వస్తోంది.
అయితే, అక్కడే ఉన్న కొంతమంది ఆ పాముకు భయపడి ఒడ్డు పైకి చేరుకున్నారు. ఆ పాము వారికి అతి సమీపంలోకి రావడం వల్ల ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆ పాము నదిలోకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. పర్యాటకుల ఆనందానికి మాత్రం అంతరాయం కలిగించింది. ప్రకృతిలో మనతోపాటు ఇలాంటి ఎన్నో జీవులు నివసిస్తూ ఉంటాయి. ఇలా అప్పుడప్పుడు అనుకోకుండా దర్శనమిస్తాయి.. ఇలాంటి సందర్భాలను చిత్రీకరించి కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది.
Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Preconception Care Importance: మహిళలు ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడం అనేది గర్భం దాల్చిన తర్వాత మొదలయ్యే ప్రక్రియ కాదు. అది గర్భధారణకు ముందే ప్రారంభం కావాలి. తల్లి కావాలనుకునే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు పరీక్షల ప్రాముఖ్యతను ఫెర్నాండెజ్ హాస్పిటల్ రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీలేఖ A.R అందించిన కొన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం.
చాలామంది మహిళలు గర్భం దాల్చిన తర్వాతే వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ, గర్భం దాల్చడానికి ముందే చేసే పరీక్షలు, పోషకాహార మార్పులు పుట్టబోయే బిడ్డలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నిరోధించగలవు.
ముందస్తు స్క్రీనింగ్ ఎందుకు అవసరం?
సాధారణ రక్త పరీక్షల ద్వారా శరీరంలోని కొన్ని నిశ్శబ్ద సమస్యలను గుర్తించవచ్చు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే (రక్తహీనత) అలసట రావడమే కాకుండా, అకాల ప్రసవం, శిశువు తక్కువ బరువుతో పుట్టే ప్రమాదం ఉంది.
చికిత్స చేయని థైరాయిడ్ వల్ల గర్భం దాల్చడంలో ఇబ్బందులు, గర్భస్రావం, శిశువు మెదడు అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేకుంటే గర్భం దాల్చిన తొలి వారాల్లోనే శిశువు అవయవాల అభివృద్ధిలో లోపాలు తలెత్తవచ్చు.
జీవనశైలి, బరువు నిర్వహణ
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) ఉన్నవారిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల గర్భం దాల్చడం ఆలస్యం కావచ్చు. బరువు తక్కువగా ఉన్నా లేదా అధిక బరువు ఉన్నా అండోత్సర్గము లో సమస్యలు వస్తాయి. అధిక బరువు గర్భధారణ సమయంలో మధుమేహం, బిపి ప్రమాదాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా దీనిని అధిగమించవచ్చు.
పోషకాహారం, సప్లిమెంట్లు
గర్భధారణ ప్రణాళికలో ఉన్న మహిళలు కింది పోషకాలపై దృష్టి పెట్టాలి.
ఫోలిక్ యాసిడ్: శిశువు మెదడు, వెన్నెముక లోపాలను నివారించడానికి ప్రతిరోజూ కనీసం 400 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి.
ఐరన్, విటమిన్ సి: రక్తహీనతను తగ్గించడానికి ఆకుకూరలు, బెల్లం, ఖర్జూరాలు, గుడ్లు తీసుకోవాలి. ఐరన్ గ్రహించడానికి విటమిన్ సి (నిమ్మ, నారింజ) తోడవ్వాలి.
విటమిన్ డి: సంతానోత్పత్తి సామర్థ్యం పెరగడానికి ఎండలో గడపడం లేదా వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవడం అవసరం.
ఇవే కాకుండా వారసత్వంగా వచ్చే రక్త రుగ్మతలైన తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి వంటి వాటిని గుర్తించడానికి ముందే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. దీనివల్ల అవసరమైనప్పుడు జన్యు కౌన్సెలింగ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చివరిగా.. ఫిబ్రవరి నెలలో పాటించే పునరుత్పత్తి ఆరోగ్య మాసం (Reproductive Health Month) సందర్భంగా, మహిళలందరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి. ఆరోగ్యకరమైన తల్లి ద్వారానే ఆరోగ్యకరమైన కుటుంబం సాధ్యమవుతుంది.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం నిపుణుల అభిప్రాయాన్ని అనుసరించి రాసినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని వ్యక్తిగతంగా కలవడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Silver Price Prediction: వెండి ధరకు రెక్కలు..కిలో రూ.5 లక్షలకు చేరువలో? ఇన్వెస్టర్లు అప్రమత్తం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Police Attack On BJP Leaders: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులను అని కూడా చూడకుండా రెచ్చిపోయి పోలీసులపై దాడులకు తెగబడ్డారు. పోలీసులకు వార్నింగ్ ఇస్తూ పోలింగ్ బూతుల్లో యథేచ్చగా ప్రలోభాలకు గురిచేస్తూ.. డబ్బులు పంచుతూ కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు, పోలీసులు కూడా దాడులకు పాల్పడ్డారు.
Also Read: Schools Holiday: రేపు తెలంగాణలో స్కూళ్లకు సెలవు.. ఉత్తర్వులు జారీ!
సంగారెడ్డి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. పోలీసులతో కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డిలో 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. కాంగ్రెస్ అభ్యర్థిని సీఐ దూషించారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్లి పోలీసులతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఘటనా స్థలానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇందిరా కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థిని పోలీసులు అడ్డుకోవడంతో జగ్గారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులను బూతులు తిడుతూ జగ్గారెడ్డి రెచ్చిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడంతోనే అడ్డుకున్నామని పోలీసులు చెప్పగా అయినా కూడా జగ్గారెడ్డి వినిపించుకోలేదు. దీంతో అదనపు ఎస్పీ రఘునందన్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెడుతున్నారు.
బీజేపీ కార్యకర్తలపై పోలీసుల దాడి
కరీంనగర్లో పోలీసులు రెచ్చిపోయారు. కరీంనగర్ జిల్లా పరిషత్ వద్ద బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. విచక్షణరహితంగా దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆరుగురు బీజేపీ కార్యకర్తల చేతులు విరిగాయి. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. తాము చెబుతుంటే పోలీసులు తమపై లాఠీఛార్జి చేయడం ఏమిటని మండిపడ్డారు.
Also Read: AP Budget Session: విధ్వంసం నుంచి అభివృద్ధి- సంక్షేమంపై పరుగులు: ఏపీ గవర్నర్
మెట్పల్లిలో ఉద్రిక్తత
జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం వద్ద వివాదం రాజుకుంది. పోలింగ్ కేంద్రం ముందు పలువురు అభ్యర్థులు, వారి మద్దతుదారులు ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో స్వతంత్ర అభ్యర్థి మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధ్య మాటల యుద్ధం ప్రారంభమై అది కాస్త ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఇరు వర్గాల మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకుని ఒకరిపై ఒకరు నినాదాలు చేస్తూ గొడవ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
పోలింగ్ కేంద్రం సమీపంలో జరిగిన వివాదానికి గొడవ విషయం తెలుసుకున్న ఎస్పీ అశోక్ కుమార్ హుటాహుటిన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అప్పటికే ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. పోలింగ్ కేంద్రం సమీపంలో ఎవరూ గుంపులుగా ఉండనివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. 'జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎక్కడైనా చిన్న చిన్న ఘటనలు జరిగినా వెంటనే స్పందించి అదుపులోకి తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరూ గుంపులుగా ఉండనివ్వము. ప్రజలు నిర్భయంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి' అని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Usman Tariq Bowling Action Legal Or Illegal: పాకిస్థాన్ క్రికెట్ మరో మిస్టరీ స్పిన్నర్ను ప్రపంచానికి పరిచయం చేసింది. టీ20 ప్రపంచకప్ 2026లో తన విభిన్నమైన బౌలింగ్ శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ ఆటగాడే ఉస్మాన్ తారిక్. అమెరికాతో జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన తర్వాత, ఇప్పుడు భారత బ్యాటింగ్ లైనప్ను సైతం ఇబ్బంది పెట్టగల సామర్థ్యం ఉన్న 'ఎక్స్-ఫాక్టర్' (X-Factor)గా అతను మారాడని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఉస్మాన్ తారిక్ ఎదుగుదల వెనుక అంతులేని పట్టుదల, కఠినమైన గతం దాగి ఉందట. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఉస్మాన్, కుటుంబాన్ని పోషించడానికి అనేక రకాల ఉద్యోగాలు చేశాడు. ఆ కష్టాలే ఈరోజు అతనికి మైదానంలో ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇచ్చాయి.
ఎం.ఎస్. ధోనీ జీవిత చరిత్ర చూసిన తర్వాత, ఉస్మాన్ విదేశాల్లో స్థిరమైన జీవితాన్ని వదులుకుని ప్రొఫెషనల్ క్రికెట్ను ఎంచుకున్నాడు. భద్రత కంటే ఆశయం మిన్న అని నిరూపించాడు. సాంప్రదాయక పద్ధతుల్లో కాకుండా, ఇతని బౌలింగ్ యాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సెలెక్టర్ల కంట్లో పడ్డాడు.
'త్రో బౌలింగ్' వివాదం
ఉస్మాన్ బౌలింగ్ చేసేటప్పుడు క్రీజు దగ్గర ఒక్క క్షణం ఆగి, వింతైన స్లింగ్ మోషన్తో బంతిని వదులుతాడు. ఈ అసాధారణ యాక్షన్ చూసి చాలామంది ఇది 'త్రో బౌలింగ్' (అక్రమ బౌలింగ్) అని విమర్శించారు.
అయితే, ఐసీసీ (ICC) నిర్వహించిన బయోమెకానికల్ పరీక్షల్లో ఉస్మాన్ ఉత్తీర్ణత సాధించాడు. మోచేయి వంపు నిబంధనల లోపే ఉందని నిర్ధారణ కావడంతో అతను చట్టబద్ధంగా బౌలింగ్ చేయడానికి అనుమతి పొందాడు.
టీమ్ ఇండియాకు ఇతను ప్రమాదకరమా?
భారత్ వంటి బలమైన బ్యాటింగ్ లైనప్ను తారిక్ ఎలా ఇబ్బంది పెట్టగలడో ఈ అంశాలు వివరిస్తాయి. ఇతని బౌలింగ్లో ఎకానమీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పరుగులు అవసరమైన మిడిల్ ఓవర్లలో బ్యాటర్లను కట్టడి చేయగలడు.
బంతి రిలీజ్ అయ్యే పాయింట్ సాధారణ బౌలర్ల కంటే భిన్నంగా ఉండటంతో, బ్యాటర్లకు బంతి దిశను అంచనా వేయడానికి సమయం పడుతుంది. తన తొలి ప్రపంచకప్ మ్యాచ్లోనే 3 వికెట్లు తీసి ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండగలనని నిరూపించుకున్నాడు.
పాకిస్థాన్ జట్టు అతన్ని ఒక 'వైల్డ్ కార్డ్' లాగా వాడుకుంటోంది. కొత్త స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడే జట్లకు తారిక్ ఒక పెద్ద సవాలుగా మారనున్నాడు. నాకౌట్ మ్యాచ్ల్లో ఇతను పాకిస్థాన్ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది.
వివాదం నుండి ప్రభావం వైపు ఉస్మాన్ తారిక్ ప్రయాణం సాగుతోంది. తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా, 2026 ప్రపంచకప్లో పాకిస్థాన్కు ప్రధాన బలమైన వ్యూహాత్మక ఆస్తిగా అతను నిలుస్తున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Boat Airdopes 161 Price Cut Flipkart: ఎప్పటినుంచో అత్యంత తగ్గింపు ధరకే మంచి ఇయర్ బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ వీటిపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తూ వస్తోంది. ముఖ్యంగా బోట్ కంపెనీకి సంబంధించిన ఇయర్ బడ్స్ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇప్పుడు ఈ బ్రాండ్కు సంబంధించిన ఇయర్ బడ్స్ సగం ధరికే లభిస్తున్నాయి. అయితే, ఎలా కొనుగోలు చేస్తే.. ఇంత తగ్గింపు ధరకు పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
boAt Airdopes 161 (Advanced/4Mic ENx) మోడల్ ఇయర్ బడ్స్ చాలా తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇవి అద్భుతమైన ఫీచర్స్ను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో 4-Mic ENx Technology అందుబాటులో ఉంది. దీనివల్ల కాల్స్ మాట్లాడేటప్పుడు అవతల వారికి మీ వాయిస్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అలాగే ఇందులో కంపెనీ 50 హవర్స్ప్లే టైమ్ అందిస్తోంది. 50 గంటల వరకు నాన్ స్టాప్గా ఒకే ఛార్జ్తో ప్లే బ్యాక్ పొందవచ్చు. ఇందులో కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. కేవలం పది నిమిషాలు చార్జ్ చేస్తే చాలు ఏకంగా మూడు గంటల వరకు పాటలు వినడమే కాకుండా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే C టైప్ పోర్ట్ సపోర్ట్ను కూడా అందిస్తోంది.
ఇందులో కంపెనీ సౌండ్ క్వాలిటీ 10mm డ్రైవర్లను కూడా అందిస్తోంది. దీనివల్ల బోట్ సిగ్నేచర్ సౌండ్తో మంచి బేస్ను కొంత వచ్చు. అలాగే బ్లూటూత్ వెర్షన్ v5.3 కనెక్టివిటీతో లభిస్తోంది. ఈ టెక్నాలజీతో కేస్ ఓపెన్ చేయగానే ఫోన్ను వెంటనే ఇది కనెక్ట్ అవుతుంది. ఇక ఈ ఇయర్ బడ్స్ ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మార్కెట్లోకి MRP రూ.2,999తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, ఫ్లిప్కార్ట్లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఇది 73 శాతం తగ్గింపుతో కేవలం రూ.799కే పొందవచ్చు. అదేవిధంగా మరింత తగ్గింపు పొందడానికి ఫ్లిప్కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును కూడా వినియోగించవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా రూ.45 తగ్గింపు లభిస్తుంది. అదేవిధంగా యూపీఐ పేమెంట్ చేసే వారికి కూడా ఇదే తగ్గింపు లభిస్తుంది. ఇక ఫ్లిప్కార్ట్ అనుసంధాన ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి పేమెంట్ చేసిన.. ఇంతే మొత్తంలో తగ్గింపు లభిస్తుంది. కాబట్టి భారీ తగ్గింపుతో పొందడానికి క్రెడిట్ కార్డుతో పేమెంట్ వినియోగించవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gas Cylinder Saving Tips At Home: గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యులకు భారంగా మారుతున్న తరుణంలో, గృహిణులందరికీ గ్యాస్ ఆదా చేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. వంటగదిలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల గ్యాస్ త్వరగా అయిపోతుంటుంది. అయితే, కొన్ని స్మార్ట్ చిట్కాలు పాటించడం ద్వారా గ్యాస్ వినియోగాన్ని తగ్గించి, మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు. సరైన పద్ధతిలో వంట చేయడం వల్ల గ్యాస్ ఆదా అవ్వడమే కాకుండా, వంట కూడా వేగంగా పూర్తవుతుంది.
మూత పెట్టి వండటం మర్చిపోవద్దు
ఏదైనా పదార్థాన్ని ఉడికించేటప్పుడు పాత్రపై మూత పెట్టడం చాలా ముఖ్యం. దీనివల్ల లోపల వేడి, ఆవిరి బయటకు పోకుండా ఉండి ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఈ చిన్న అలవాటు గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
పాత్ర పరిమాణం ముఖ్యం
వండే ఆహార పదార్థం ఎంత ఉందో దానికి సరిపడా పాత్రనే ఎంచుకోండి. కొద్దిపాటి వంట కోసం పెద్ద పాత్రలు వాడటం వల్ల అవి వేడెక్కడానికి ఎక్కువ గ్యాస్ ఖర్చవుతుంది. అలాగే, వెడల్పాటి పాత్రలు వాడితే మంట పాత్ర అడుగు భాగానికి సరిగ్గా తగిలి వంట త్వరగా అవుతుంది.
ప్రెజర్ కుక్కర్ బెటర్
పప్పులు, మాంసం లేదా బియ్యం వండేటప్పుడు సాధారణ పాత్రల కంటే ప్రెజర్ కుక్కర్ వాడటం ఉత్తమం. ఇది తక్కువ సమయంలో ఎక్కువ వేడిని ఉత్పత్తి చేసి వంటను వేగంగా పూర్తి చేస్తుంది. దీనివల్ల సుమారు 30% నుండి 50% వరకు గ్యాస్ ఆదా అవుతుంది.
చాలామంది గ్యాస్ స్టవ్ వెలిగించిన తర్వాత కూరగాయలు కోయడం లేదా మసాలాలు వెతకడం చేస్తుంటారు. దీనివల్ల గ్యాస్ వృధా అవుతుంది. స్టవ్ వెలిగించే ముందే కూరగాయల కోయడం, నీళ్లు సిద్ధం చేసుకోవడం వంటి పనులు పూర్తి చేయండి.
లీకేజీలు, బర్నర్ల తనిఖీ
రెగ్యులేటర్ లేదా పైపుల వద్ద గ్యాస్ లీక్ అవుతుందో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేయండి. మీ స్టవ్ మంట నీలి రంగులో కాకుండా పసుపు రంగులో వస్తుంటే, బర్నర్లలో దుమ్ము లేదా అడ్డుపడటం జరిగిందని అర్థం. ఇది గ్యాస్ను ఎక్కువ ఖర్చు చేస్తుంది. వెంటనే బర్నర్లను క్లీన్ చేయండి.
పాలు లేదా కూరగాయలు ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే స్టవ్ మీద పెట్టకండి. అవి గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు వేచి ఉండి, ఆ తర్వాతే వేడి చేయండి. చల్లగా ఉన్న పదార్థాలను వేడి చేయడానికి గ్యాస్ ఎక్కువ సేపు మండాల్సి ఉంటుంది. పైన పేర్కొన్న చిట్కాలు పాటించడం ద్వారా ఒక సిలిండర్ వచ్చే కాలపరిమితిని మీరు కనీసం 10 నుండి 15 రోజులు పెంచుకోవచ్చు. దీనివల్ల మీ ఇంటి బడ్జెట్ అదుపులో ఉంటుంది.
Also Read: Ambati Rambabu Bail: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు..కస్టడీ పిటిషన్ను కొట్టేసిన గుంటూరు కోర్టు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Governor Abdul Nazeer Speech: 'గత 19 నెలలుగా మా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పథం వైపు పయనిస్తోంది. సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అభివృద్ధి కార్యకలాపాలను పునఃప్రారంభించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాం' అని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. 'విధానాలు, వ్యవస్థలు, వ్యయ ప్రాధాన్యాలలో కీలక సవరణలు చేశాం. 7 శ్వేతపత్రాల విడుదల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం. సంక్షేమాన్ని అభివృద్ధితో సమతుల్యం చేయడానికి పది సూత్రాలు రూపొందించాం' అని వెల్లడించారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వానికి బహిరంగ లేఖ
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. సంపదను సృష్టించే ప్రగతి చక్రాన్ని నిర్మించడమే మా లక్ష్యం అని ప్రకటించారు. స్వర్ణాంధ్ర విజన్ ఒక స్పష్టమైన ఆర్థిక మార్గాన్ని నిర్దేశించిందని చెప్పారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. '2019 తర్వాత వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు తలెత్తాయి. రాష్ట్ర అభివృద్ధి స్తంభించింది. ఆర్థిక ఒత్తిడి తీవ్రమైంది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి' అని ప్రసంగంలో వివరించారు.
Also Read: Schools Holiday: రేపు తెలంగాణలో స్కూళ్లకు సెలవు.. ఉత్తర్వులు జారీ!
'మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగు నీటి పారుదల రంగాలు తీవ్ర తిరోగమనం చవిచూశాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు' అని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణం వేగంగా జరుగుతోందని.. శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని చెప్పారు. అమరావతిలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని.. ప్రపంచంలోనే రాష్ట్రానికి ప్రత్యేక స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.
Also Read: Srisailam: శ్రీశైలం కొండపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. భక్తులు, శివస్వాముల ఆందోళన
విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులతో అద్భుతమైన ప్రజారవాణా అందుబాటులోకి తెస్తామని గవర్నర్ అబ్దుల్ నజీర్ వివరించారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాలను గవర్నర్ వివరించారు. 'వివిధ సందర్భాల్లో గత ప్రభుత్వ విధ్వంస విధానాలను ప్రస్తావిస్తూ కొనసాగిన గవర్నర్ ప్రసంగం. కేంద్ర బడ్జెట్లో ఏపీ ప్రస్తావనను వివిధ సందర్భాల్లో తన ప్రసంగంలో గుర్తు చేశారు. 'అమరావతికి రాజధానిగా చట్టబద్దత ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. మూడు ప్రాంతాల్లోనూ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం' అని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. నల్లమల సాగర్, నదుల అనుసంధానం వంటి అంశాలపై గవర్నర్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
గవర్నర్ ప్రసంగంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం
బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం 22ఏ పేరుతో వివాదాలు సృష్టించిందని పరోక్షంగా ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. గవర్నర్ ప్రంసంగం ప్రారంభించిన మూడో నిమిషం నుంచే సభలు నినాదాలు చేసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా వినకుండానే సభ నుంచి వెళ్లిపోయారు. అసెంబ్లీ సమావేశాలకు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగానికి పదేపదే ఆటంకం కలిగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాసేపటికే సభ నుంచి జగన్తో పాటు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
South Africa Vs Afghanistan Match: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీ20 ప్రపంచకప్ 2026లో ఒక అద్భుతమైన పోరాటం ఆవిష్కృతమైంది. గ్రూప్ దశలో భాగంగా దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే 'డబుల్ సూపర్ ఓవర్' థ్రిల్లర్గా మారింది. ఉత్కంఠకు పరాకాష్ఠగా నిలిచిన ఈ పోరులో చివరకు దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తొలుత నిర్ణీత 20 ఓవర్లలో ఇరు జట్లు సరిగ్గా 187 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది.
మొదటి సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 17 పరుగులు రాబట్టింది. లక్ష్య ఛేదనలో సఫారీలు కూడా సరిగ్గా 17 పరుగులే చేయడంతో తొలి సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసింది. ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ రెండో సూపర్ ఓవర్కు దారితీసింది.
రెండో సూపర్ ఓవర్లో దక్షిణాఫ్రికా రెచ్చిపోయి ఆడింది. సఫారీ బ్యాటర్లు వీరవిహారం చేసి 23 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లక్ష్య ఛేదనలో తడబడింది. మొదటి రెండు బంతుల్లో పరుగులు రాలేదు సదాకా, నబీ కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో రహ్మానుల్లా గుర్బాజ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడు.
కేశవ్ మహారాజ్ వేసిన చివరి బంతికి ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 5 పరుగులు కావాలి. కానీ, భారీ షాట్కు ప్రయత్నించిన గుర్బాజ్ క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా విజయం ఖాయమైంది.
గెలిపించేంత వరకు వచ్చి చివరి బంతికి ఓడిపోవడంతో ఆఫ్ఘన్ ఓపెనర్ గుర్బాజ్ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుత పోరాటం చేసినప్పటికీ, విజయం మాత్రం దక్షిణాఫ్రికాను వరించింది.
ప్రపంచ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు స్థాయి ఏంటో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. దక్షిణాఫ్రికా ఒత్తిడిని అధిగమించి విజేతగా నిలవగా, క్రికెట్ ప్రేమికులకు మాత్రం ఇది ఒక తీపి జ్ఞాపకంలా మిగిలిపోయింది.
Also Read: Uday Kiran Niece: ఉదయ్ కిరణ్ మేనకోడలిని చూశారా? మామ కోసం తొలిసారి ఇలా..వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ambati Rambabu Bail Granted: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో ఊరట లభించింది. పోలీస్ అధికారి విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై నమోదైన కేసులో గుంటూరు కోర్టు ఆయనకు షరత్తులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత కొద్ది రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబు విడుదల మార్గం సుగమమైంది.
ఏం జరిగిందంటే?
గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ గుంటూరులో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో విధుల్లో ఉన్న సీఐ (CI)ని అడ్డుకున్నారని, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై కేసు నమోదైంది. ఈ కేసులో పీటీ వారెంట్ జారీ కావడంతో, పట్టాభిపురం పోలీసులు మూడు రోజుల క్రితం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు
అంబటి రాంబాబు తరపు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంబటిని విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి రాంబాబు, బెయిల్ ఉత్తర్వులకు సంబంధించిన పత్రాలు జైలు అధికారులకు అందిన తర్వాత రేపు విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ శ్రేణులు అంబటి రాంబాబు బెయిల్ వార్తపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసులు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు.
Also Read: Silver Price Prediction: వెండి ధరకు రెక్కలు..కిలో రూ.5 లక్షలకు చేరువలో? ఇన్వెస్టర్లు అప్రమత్తం!
Also Read: EPFO Ceiling Hike: ఉద్యోగులకు శుభవార్త.. EPFO కనీస జీతం భారీగా పెంపు?! రూ.15,000 నుంచి రూ.25,000కి?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Silver Price Prediction 2026: ఇన్వెస్టర్లకు, సామాన్యులకు షాకిచ్చే వార్త ఒకటి బులియన్ మార్కెట్లో చక్కర్లు కొడుతోంది. రాబోయే రోజుల్లో వెండి ధరలు ఆకాశాన్ని తాకనున్నాయని, కేవలం ఏడాది కాలంలోనే కిలో వెండి ఏకంగా రూ.5 లక్షల మార్కును చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటీవల భారీగా పెరిగిన వెండి ధరలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇది కేవలం 'తుఫాను ముందు ప్రశాంతత' మాత్రమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
నిపుణుల అంచనా (GJC విశ్లేషణ)
ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) చైర్మన్ రాజేష్ రోక్డే వెల్లడించిన వివరాల ప్రకారం... 2026 చివరి నాటికి కిలో వెండి ధర రూ.5,00,000 కు చేరే అవకాశం ఉంది.
అదేవిధంగా 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.2,00,000 మార్కును తాకవచ్చు. ఒకవేళ ప్రభుత్వం జీఎస్టీ (GST), దిగుమతి సుంకాలను తగ్గిస్తేనే సామాన్యులకు కొంత ఉపశమనం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా వెండి స్పాట్ ధర ఔన్సుకు $82.43 కి పెరిగింది. అమెరికా ట్రెజరీ బాండ్ల దిగుబడి తగ్గడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నారు.
నేడు భారతదేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, ఢిల్లీలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
కిలో వెండి సుమారు రూ.2,90,000 నుండి రూ.3,00,000 మధ్య ట్రేడ్ అవుతోంది. గత నెల రోజుల్లో వెండి ధర ఏకంగా ఒక లక్ష రూపాయల వరకు దిగి వచ్చినప్పటికీ, దీర్ఘకాలికంగా చూస్తే ఇది పెరిగే దిశగానే కనిపిస్తోంది.
ఆర్థిక అనిశ్చితి నెలకొన్న సమయంలో కేవలం నగదును దాచుకోవడం కంటే, విలువైన లోహాలైన బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు నెమ్మదిగా వెండిని సేకరించడం ఇన్వెస్టర్లకు లాభదాయకంగా ఉండవచ్చు. అయితే, మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ద్వారా సేకరించిన సమాచారం మాత్రేమే. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
ALso Read: EPFO Ceiling Hike: ఉద్యోగులకు శుభవార్త.. EPFO కనీస జీతం భారీగా పెంపు?! రూ.15,000 నుంచి రూ.25,000కి?!
Also Read: Uday Kiran Niece: ఉదయ్ కిరణ్ మేనకోడలిని చూశారా? మామ కోసం తొలిసారి ఇలా..వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPFO Ceiling Hike: ఉద్యోగులకు శుభవార్త.. EPFO కనీస జీతం భారీగా పెంపు?! రూ.15,000 నుంచి రూ.25,000కి?!
EPFO Wage Ceiling Hike 2026: కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు సామాజిక భద్రతను మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), ESIC వేతన పరిమితులను భారీగా పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరుగుతున్న ఈ కసరత్తు, త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 2014 తర్వాత పీఎఫ్ వేతన పరిమితిలో ఎలాంటి మార్పు రాలేదు. పెరిగిన ద్రవ్యోల్బణం, జీతాల రీత్యా ఈ పరిమితిని పెంచడం ఇప్పుడు అత్యవసరంగా మారింది.
ప్రస్తుత వేతన పరిమితి vs ప్రతిపాదిత మార్పు
ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం వేతన సీలింగ్ ఈ విధంగా ఉంది. ప్రస్తుత పరిమితి నెలకు రూ.15,000. దీనిని రూ.25,000కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత పరిమితి నెలకు రూ.21,000. దీనిని కూడా సమాంతరంగా పెంచే అవకాశం ఉంది.
చివరిసారిగా 2014లో రూ.6,500 నుండి రూ.15,000కి పీఎఫ్ పరిమితిని పెంచారు. దశాబ్ద కాలంగా ఇది మారకపోవడంతో, కొంచెం ఎక్కువ జీతం ఉన్నవారు కూడా తప్పనిసరి సామాజిక భద్రతా ప్రయోజనాలను కోల్పోతున్నారు.
ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలు
వేతన సీలింగ్ పెంపు అమలులోకి వస్తే కలిగే లాభాలు ఇవే. లక్షలాది మంది కొత్త కార్మికులు EPFO, ESIC పరిధిలోకి వస్తారు. వేతన పరిమితి పెరగడం వల్ల ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నెలవారీ పొదుపు మొత్తం పెరుగుతుంది, ఇది రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో చేతికి అందుతుంది. ESIC పరిమితి పెంపు ద్వారా ఎక్కువ మంది కార్మికులకు, వారి కుటుంబాలకు ఉచిత వైద్య బీమా సౌకర్యం లభిస్తుంది.
కేవలం వేతన పరిమితి మాత్రమే కాకుండా, కార్మిక శాఖ మరికొన్ని కీలక అంశాలపై చర్చలు జరుపుతోంది. ఈపీఎస్-95 (EPS-95) కింద అందుతున్న కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒకే రకమైన కనీస వేతన విధానాన్ని తీసుకురావడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ప్రతిపాదనలపై సానుకూల సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ రిపోర్టును సమీక్షిస్తోంది. ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే వరకు పాత పరిమితులే (EPFO రూ.15,000, ESIC రూ.21,000) కొనసాగుతాయి.
వేతన పరిమితిని రూ.25,000కి పెంచడం అనేది మధ్య ఆదాయ వర్గాలకు, ప్రైవేట్ ఉద్యోగులకు ఒక గొప్ప వరంగా మారుతుంది. ఇది దేశంలోని శ్రామిక శక్తికి మరింత బలమైన ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.
Also Read: Uday Kiran Niece: ఉదయ్ కిరణ్ మేనకోడలిని చూశారా? మామ కోసం తొలిసారి ఇలా..వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Anganwadi Teacher Telugu News: అన్యంపుణ్యం ఎరగని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి.. ఒక తల్లిలా అక్కున చేర్చుకోవాల్సిన అంగన్వాడీ టీచర్.. ఆ పిల్లాడి పాలిత కాల యముడు అయింది. క్రమశిక్షణ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని ఆ టీచర్ విచక్షణ కోల్పోయి.. ఓ పసివాడి పై విరుచుకుపడింది.. ఈ అమానుష ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక విద్యను అందించాల్సిన టీచర్ ఇలా అన్యం పుణ్యం ఎరగని ఓ చిన్నారిపై విరుచుకు పడడం స్థానికంగా తీవ్ర కరకలం రేపింది. ఇంతకీ ఏం జరిగింది? దీనికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన విధ్వాన్స్ అనే బాలుడు స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి గత కొద్ది రోజుల నుంచి వెళ్తున్నాడు. అయితే, పాఠశాల సమయాల్లో బాలుడు అల్లరి చేశాడనో లేదా మరేదైనా కారణంతో గాని అక్కడి టీచర్ తీవ్ర ఆగ్రహానికి లోనైంది.. దీంతో ఆమె పసి పిల్లాడని చూడకుండా ఏకంగా తన చేతిలో ఉన్న కర్రతో రెచ్చిపోయి మరి విచక్షణారహితంగా దాడికి పాల్పడింది..
అయితే, ఈ దాడిలో విధ్వాన్స్ కంటికి తీవ్ర గాయం అయింది.. అంతేకాకుండా శరీరం అంత వాతలు పడి చర్మం కమీలి పోయినట్లు తెలుస్తోంది. ఆ టీచర్ కొట్టిన భారీ దెబ్బలకు చిన్నారి విలవిలలాడిపోతున్న సదరు ఉపాధ్యాయురాలు కనికరించకపోవడం స్థానికంగా ఊహించని స్థాయిలో చర్చనీ అంశానికి దారితీసింది. సాయంత్రం పూట బాలుడు ఇంటికి వెళ్లిన తర్వాత శరీరంపై ఉన్న గాయాలను చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు.. కన్ను విపరీతంగా కందిపోయి ఒళ్లంతా దెబ్బలు ఉండడంతో బాలుడిని తల్లిదండ్రులు ఏం జరిగిందని అసలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
దీంతో ఆ బాలుడు అంగన్వాడీ టీచర్ తనను దారుణంగా కొట్టిందని కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రుల వద్ద వివరించాడు.. వెంటనే తల్లిదండ్రులు తమ కుమారుడిని చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి తరలించారు. పిల్లలకు చదువు చెప్పాల్సిన టీచర్ ఇలా రాక్షసంగా ప్రవర్తించడంపై సదరు బాలుడికి సంబంధించిన తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ టీచర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వారు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు.. ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న సమయంలో వారు మీడియాతో మాట్లాడారు. మా బిడ్డలను అంగన్వాడికి పంపించేది కేవలం చదువుకోసమే కానీ.. ఇలా దెబ్బలు తినడానికి కాదు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook