icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Youtuber Vaishnavi: శ్వేతనాగు రూపంలో వైష్ణవి? దశదిన కర్మలో జరిగిన ఆ వింత ఏంటి.. వీడియో..

Karimnagar, Telangana:

Youtuber Vaishnavi Viral Video Watch:  ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి అకాల మరణంతో ఒక్కసారిగా ఆమె కుటుంబాన్ని తీరని శోకంలోకి ముంచేసింది.. అయితే, ఆమె చనిపోయిన తర్వాత జరుగుతున్న కొన్ని వింత సంఘటనలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.. అలాగే ఇటీవలే వైష్ణవి తన సోదరుడి కలలోకి వచ్చిందని..తాను ఆత్మ రూపంలో ఆమెను చూశామని ఆమె సోదరులు షాకింగ్‌ విషయాలను ఓ యూట్యుబ్‌ ఛానెల్‌ ఇంటర్య్వూలో తెలిపారు. 

వైష్ణవి సోదరుడు సాగర్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి చెల్లి నా కలలోకి వచ్చిందని.. అన్నా.. నువ్వు ఎందుకు అంతగా బాధపడుతున్నావు? నేను చనిపోలేదు, మీతోనే ఉన్నాను. మన ఊరిలోనే తిరుగుతున్నాను. నేను మళ్లీ తిరిగి వస్తాను.. అని చెప్పింది. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన బట్టలతో పాటు చీరలు ఎవరికీ ఇవ్వవద్దని.. తాను మళ్లీ జన్మిస్తానని వైష్ణవి కలలో కోరినట్లు సోదరులు తెలిపారు.

వైష్ణవి దశదిన కర్మల సమయంలో ఒక తెల్లటి నాగుపాము ఇంటి పరిసరాల్లోకి తిరగడం అందరినీ అశ్చర్యపరిచేలా చేసింది.. మా అమ్మ శివయ్యను ప్రార్థిస్తూ.. నా బిడ్డను ఏ రూపంలోనైనా పంపించు అని వేడుకుందని.. సరిగ్గా అదే సమయంలో ఒక తెల్లటి పాము అక్కడికి వచ్చిందని.. అది మమ్మల్ని ఏమీ చేయకుండా చాలా సేపు అక్కడే ఉండి.. వెల్లిపోయిందని.. అది చూశాక మా చెల్లి పాము రూపంలో వచ్చిందని మాకు అనిపించిందని సోదరులు తెలిపారు. 

Also Read: Road Accident: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

వైష్ణవి మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని.. తమకు న్యాయం జరగాలని ఆమె సోదరులు డిమాండ్ చేస్తున్నారు. పాలకోవ ఇష్యూ జరిగితే.. ఇండస్ట్రీ అంతా స్పందించింది. కానీ.. ఒక ఆడబిడ్డ ప్రాణం పోతే ఎవరూ మాట్లాడటం లేదు. మా చెల్లికి జరిగిన అన్యాయం మరే ఇతర ఆడబిడ్డకూ జరగకూడదు అని వారు అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు తమ న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.

Also Read: Road Accident: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున ఎట్టిపరిస్థితుల్లో ఈ పని చేయకండి! ఏవి కొనాలి? ఏవి కొని ఇంటికి తీసుకురాకూడదో తెలుసా?

Hyderabad, Telangana:

Akshaya Tritiya Dos And Donts: ఈ ఏడాది పవిత్రమైన అక్షయ తృతీయ పర్వదినాన్ని ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున కొత్త పనికి శ్రీకారం చుట్టేందుకు ఎంతోమంది సన్నాహాలు చేస్తుంటారు. మరికొందరు బంగారం, వెండి వస్తువులను కొని దేవుని గదిలో పెట్టి పూజిస్తారు. అక్షయ తృతీయకు ఉన్న ప్రత్యేక ఏమిటంటే.. ఆ రోజు ముహూర్తాలు చూడకుండానే ఏ సమయంలోనైనా ఏదైనా పనిని నిశ్చింతగా ప్రారంభించవచ్చు. ఎన్నో శుభకార్యాలు చేయవచ్చు. ఈ పర్వదినం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే.. ఇంట సిరిసంపదలు తెస్తుందని ప్రజల నమ్మకం. ఈ కారణంగా ప్రజలంతా బంగారం, వెండి లేదా ఇతర విలువైన వస్తువులను కొనేందుకు ఇష్టపడతారు. అయితే అక్షయ తృతీయ రోజున కొన్ని పనులు చేయకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల ప్రభావం వస్తుందని నమ్ముతారు. ఆ పనులు ఏంటి? ఎందుకు ప్రారంభించకూడదు అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

అక్షయ తృతీయ నాడు ఏది శుభప్రదం!
అక్షయ తృతీయ నాడు రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీరు ఖరీదైన వస్తువులను కొనలేకపోయినా, మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఎన్నో చౌకైన వస్తువులను కొనేయోచ్చు. అక్షయ తృతీయ రోజు కింద పేర్కొన్న అనేక వస్తువులను ఎలాంటి అభ్యంతరం లేకుండా ఇంటికి తెచ్చుకోవచ్చు.

కళ్లు ఉప్పు: అక్షయ తృతీయ నాడు ఇంట్లోకి కళ్లు ఉప్పు తీసుకురావడం అప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.
పత్తి: ఇది స్వచ్ఛతకు, సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు.
మట్టి పాత్రలు: ఇవి ఇంట్లో సంతోషాన్ని, శ్రేయస్సును పెంచుతాయని నమ్ముతారు.
బార్లీ, పసుపు, ఆవాలు: ఇవి శుభానికి, శ్రేయస్సుకు చిహ్నాలుగా ఉంటాయి.
తులసి మొక్క: ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని పెంచుతుంది.
చోళీలు, పాత్రలు: ఇవి సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉన్నాయని భావిస్తారు.

ఇవి అస్సలు కొనకండి!
అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులను కొనడం అశుభంగా పరిగణిస్తారు. వాటిలో ఇనుప వస్తువులు, ముళ్ల మొక్కలు, పదునైన లేదా మొనదేలిన వస్తువులు, నల్లని రంగు వస్తువులు, పాత మిఠాయిలు, విరిగిన లేదా పాత వస్తువులతో పాటు అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు ఆ పర్వదినం నాడు కొనకపోవడమే మంచిది.

అక్షయ తృతీయ నాడు దానధర్మాలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీకు వీలైనప్పుడు.. ఈ వస్తువులను దానం చేయవచ్చు. పుచ్చకాయలు, దోసకాయలు, కల్కండూ, చేతి విసనకర్రలు, చాపలు, బూట్లు, బియ్యం, ఉప్పు, నెయ్యి, మట్టి కుండలు, కప్పులు, విల్లో ఆకులు, పండ్లు, గొడుగులు లాంటి ఇతర వస్తువులను కొని దానం చేయోచ్చు.

అక్షయ తృతీయ నాడు బంగారం కొనేందుకు ఓ ఉత్తమమైన మార్గం ఉంది. ఏప్రిల్ 19న వచ్చే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి ఉత్తమ సమయం ఉదయం 10:49 నుండి 5:51 వరకు ఉంటుంది.

ఉదయ ముహూర్తం (శుభ సమయం) - ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:20 వరకు
మధ్యాహ్న ముహూర్తం (శుభ సమయం) - మధ్యాహ్నం 01:58 నుండి సాయంత్రం 03:35 వరకు
సాయంత్ర ముహూర్తం (శుభ సమయం) - సాయంత్రం 06:49 నుండి రాత్రి 10:57 వరకు

(గమనిక : ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని పాటించే ముందు పండితుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: 8th Pay Commission Hike: ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త..రూ.46,000కు పెరగనున్న జీతం..పండగే పండగ!

Also Read: Jio 265 Recharge Plan: జియో బంపర్ ఆఫర్..రూ.265కే అపరిమిత కాల్స్, హైస్పీడ్ 5G ఇంటర్నెట్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

8th Pay Commission Hike: ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త..రూ.46,000కు పెరగనున్న జీతం..పండగే పండగ!

Hyderabad, Telangana:

8th Pay Commission Hike Update: 8వ వేతన సంఘంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతం పెరగనున్నట్లు సమాచారం. ఉద్యోగులకు జీతంతో పాటు ఉద్యోగ విరమణ చేసిన వారికి కూడా పెన్షన్ భారీ మొత్తంలో పెరగనుందని తెలుస్తోంది. దీని కోసం సుమారు 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జీతం, పెన్షన్ ఏమాత్రం పెరుగుతుందని అందరూ అడుగుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. జాతీయ మండలి ముసాయిదా కమిటీ ఏప్రిల్ 13న సమావేశం కానుందని సమాచారం అందుతోంది. ఆ మీటింగ్‌‌లో 8వ వేతన సంఘం ముసాయిదా సిఫార్సులను ఖరారు చేయనున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ ఇదో తీపికబురు అనే చెప్పాలి.

ఈ అత్యంత ముఖ్యమైన సమావేశం ఏప్రిల్ 13న జరగనుంది. ఇందులో భాగంగా 8వ వేతన సంఘం సిఫార్సులన్నింటినీ సవివరంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహించే ఈ కమిటీ అతి త్వరలోనే ఈ ముసాయిదాను సిద్ధం చేయనుంది. సుమారు 1.2 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల జీతం, పెన్షన్, అలవెన్సులు ఎంతమేర పెరుగుతాయనేది అందర్ని వెంటాడుతున్న ప్రశ్నగా మారింది. అయితే దీనిపై అతిత్వరలోనే ఓ నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. 

ఈ ముసాయిదా కమిటీ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య  ప్రధాన వారధిగా పనిచేస్తుంది. సరైన వేతన విధానాన్ని నిర్ణయించడంలో వీరు ముఖ్యమైన సలహాలు అందిస్తారు. ప్రస్తుతం ఉద్యోగులు 8వ వేతన సంఘం అమలుతో పాటు ముఖ్యంగా 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' విషయంపైనా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే విషయమై ఉద్యోగులు, ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. అందువల్ల ఈ అనిశ్చితి త్వరలోనే ముగుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

కొన్ని జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. 8వ వేతన సంఘం కనీస మూల వేతనాన్ని రూ.46,000 కంటే ఎక్కువగా నిర్ణయించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా పెన్షనర్లు కూడా కనీస పెన్షన్ రూ.25,000 కంటే పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. జీతాలు, పెన్షన్ల పెంపులో 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 7వ పే కమిషన్ సమయంలో ఈ ఫ్యాక్టర్ విలువ 2.57గా ఉండేది. ఇది కనీస వేతనాన్ని రూ.7,000 నుండి రూ.18,000కు పెంపుదల చేసింది. అంతకుముందు 6వ వేతన సంఘం నిర్ధారించిన ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.86గా ఉండేది. అయితే ఈసారి 8వ వేతన సంఘం సిఫార్సుల్లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.5 నుంచి 2.86 మధ్య ఉండనుందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. పెన్షనర్లకు కనీసం పెన్షన్ రూ.9,000 నుంచి సుమారు రూ.25,740 వరకు పెరగొచ్చని ఆశిస్తున్నారు. 

(గమనిక: ఈ పోస్ట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది. తాజా, అత్యంత కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సంప్రదించమని సిఫార్సు చేస్తున్నాము. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Jio 265 Recharge Plan: జియో బంపర్ ఆఫర్..రూ.265కే అపరిమిత కాల్స్, హైస్పీడ్ 5G ఇంటర్నెట్..

Also Read: Retirement Planning: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.50,000 పెన్షన్..ఏం చేయాలంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

IPL 2026 DC vs GT: కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ విధ్వంసం వృథా.. ఒక్క పరుగుతో గట్టెక్కిన గుజరాత్‌ టైటాన్స్‌!

New Delhi, Delhi:

GT Won By One Run: ఒక్క బంతి.. రెండు పరుగులు. విజయమో.. పరాజయమో అని తేలాల్సిన ఒకే ఒక్క బంతిలో ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తీవ్రంగా పోరాడాయి. సూపర్‌ ఓవర్‌కు వెళ్లాలని ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రయత్నించగా.. వికెట్‌ లేదా ఒక్క పరుగు కూడా రాకుండా చేయాలని గుజరాత్‌ టైటాన్స్‌ ప్రయత్నించాయి. చివరికి అనూహ్యం పరిణామంతో గుజరాత్‌కు విజయం వరించింది. ఒకే ఒక్క పరుగుతో గుజరాత్‌ ఐపీఎల్‌ 2026లో తొలి విజయాన్ని అందుకుంది. అత్యంత ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌ విశేషాలు ఇలా ఉన్నాయి.

Also Read: Husband Drinks Dettol: కాపురంలో లొల్లి.. భార్య వేధింపులు తాళలేక డెటాల్ తాగిన భర్త 

అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ 45 బంతుల్లో 70 పరుగులు చేసి దుమ్మురేపాడు. వాటిలో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. వరుస ఓటములు చవిచూస్తున్న సమయంలో ఈ మ్యాచ్‌ ఎలాగైనా గెలవాలని శుభమన్‌ గిల్‌ తీవ్రంగా పోరాడాడు. దాని ఫలితంగానే అతడు భారీ స్కోర్‌ సాధించాడు. ఇక జోస్‌ బట్లర్‌ (52), వాషింగ్టన్‌ సుందర్‌ (55) అర్ధ శతకాలతో రాణించారు. ఓపెనర్‌ సుదర్శన్‌ 12 పరుగులకు పరిమితమవగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ (14), రాహుల్‌ తెవాటియా (1) నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలింగ్‌ పరంగా చూస్తే ముకేశ్‌ కుమార్‌ 2 వికెట్లు తీయగా.. లుంగీ ఎంగిడి, కుల్దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

Also Read: IPL 2026 RR vs MI: రాజస్థాన్‌ రాయల్స్‌ హ్యాట్రిక్‌ విజయం.. ఫోర్లతో చెలరేగిన యశస్వి

వరుస విజయాలతో జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ హ్యాట్రిక్‌ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. విజయం సాధ్యం కానీ పక్షంలో సూపర్‌ ఓవర్‌ వెళ్లాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేకపోయాయి. 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. కేఎల్‌ రాహుల్‌ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి 92 పరుగులు చేసినా అతడి శ్రమ వృథాగా మారింది. 52 పరుగుల్లో శతకానికి చేరువైన రాహుల్‌ బంతులన్నీ బౌండరీలకు మళ్లించాడు. ఫలితంగా 11 ఫోర్లు బాదగా.. 4 సిక్సర్లు బాదాడు. పథూమ్‌ నిస్సాంక 24 బంతుల్లో 41 పరుగులు చేసి రాణించగా.. నితీశ్‌ రాణా (5), అక్షర్‌ పటేల్‌ (2), త్రిస్టన్‌ స్టబ్స్‌ (7), విప్రజ్‌ నిగమ్‌ (12), కుల్దీప్‌ యాదవ్‌ (1) అతి తక్కువ పరుగులకే ఔటవగా.. సమీర్‌ రిజ్వీ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. జట్టు క్లిష్ట సమయంలో విజయం కోసం డేవిడ్‌ మిల్లర్‌ తీవ్రంగా శ్రమించాడు. ఆఖరి వరకు గ్రౌండ్‌లో ఉండి జట్టు గెలిపించేందుకు.. మ్యాచ్‌ను డ్రా చేసేందుకు పోరాడాడు. 20 బంతుల్లో 41 పరుగులు చేసి విజయానికి ఒక్క పరుగు దూరాన జట్టును నిలిపాడు.

Also Read: Voice And SMS Packs: మొబైల్‌ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్‌ ప్లాన్స్‌

బ్యాటర్లు నిలిపిన స్కోర్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లు చాలా కష్టపడ్డారు. చెమటోడ్చి జట్టును చివరి బంతి వరకు తీసుకెళ్లి విజయం అందించారు. రషీద్‌ ఖాన్‌ మరోసారి అద్భుతంగా బంతులు వేసి అతి తక్కువ పరుగులు ఇవ్వడమే కాకుండా 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. 3 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చిన రషీద్‌ ఖాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ప్రసిధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీయగా.. తెలంగాణ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఒక వికెట్‌ తీశాడు. ఈ మ్యాచ్‌ విజయంతో హ్యాట్రిక్‌ ఓటముల నుంచి గుజరాత్‌ టైటాన్స్‌ తప్పించుకుని ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్ విజయాలు సాధించాలని కసితో ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు నిరాశతో ఈ సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Voice And SMS Packs: మొబైల్‌ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్‌ ప్లాన్స్‌

Wadgaon, Maharashtra:

Without Data Recharge Plans: నేటి సాంకేతిక యుగంలో డేటా అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తుండడంతో అన్నీ టెలికాం సంస్థలు తమ రీచార్జ్‌ ప్లాన్‌లలో మొబైల్‌ డేటాను తప్పనిసరి చేశాయి. ఇప్పుడు డేటా లేకుండా రీచార్జ్‌ ప్లాన్లు లేవు. అయితే డేటా లేకుండా కేవలం వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ల ప్లాన్‌ల కోసం చూస్తున్నారు. అలాంటి వారికి ట్రాయ్‌ తీపి కబురు అందించింది. డేటా లేని రీచార్జ్‌ ప్లాన్లు అందించాలని ప్రతిపాదనలు చేసింది.

Also Read: Husband Drinks Dettol: కాపురంలో లొల్లి.. భార్య వేధింపులు తాళలేక డెటాల్ తాగిన భర్త 

మొబైల్ రీఛార్జి ప్లాన్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) కొత్త ప్రతిపాదనలు చేసింది. టెలికాం కంపెనీలు అన్ని రకాల కాలవ్యవధితో వాయిస్, ఎస్‌ఎంఎస్ ప్లాన్లు అందించాలని ట్రాయ్ ప్రతిపాదన చేసింది. టెలికామ్‌ వినియోగదారుల రక్షణ రెగ్యులేషన్స్‌ (టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్) 2026 పేరిట కొన్ని ప్రతిపాదనలు చేసింది. దీనిపై ఏప్రిల్ 28వ తేదీ వరకు అభిప్రాయాలను ట్రాయ్‌ సేకరించనుంది. ఇంటర్నెట్ (డేటా) వాడకుండా కేవలం వాయిస్‌ కాల్స్ కోసం మాత్రమే రీఛార్జి చేసుకునే వారికి ట్రాయ్‌ చేసిన ప్రతిపాదనతో రీఛార్జుల భారం తగ్గనుంది.

Also Read: YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్‌ జగన్‌

టెలికాం కంపెనీలన్నీ డేటాతోపాటు అపరిమిత కాల్స్, ఎస్‌ఎంఎస్‌లతో కూడిన ప్లాన్లు అందిస్తున్నాయి. అయితే వీటిలో డేటా వాడకపోయినా దానికి యూజర్లు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ విషయం పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ట్రాయ్ కొత్త సిఫార్సులు చేసింది. డేటా లేకుండా 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల కాలవ్యవధితో ప్రత్యామ్నాయ రీచార్జ్‌ ప్లాన్లు తీసుకురావాలని సూచించింది.

ప్రస్తుతం కొన్ని కంపెనీలు కేవలం వాయిస్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. అయితే అవి 84 రోజులు లేదా ఒక సంవత్సరం వంటి సుదీర్ఘ కాలపరిమితితో ఉన్నాయి. ట్రాయ్‌ చేసిన కొత్త నిబంధనల ప్రకారం 28 రోజులు, 56 రోజులు వంటి అన్ని రకాల కాలపరిమితుల్లో డేటా లేని ప్లాన్లు అందుబాటులో ఉండాలి. అయితే ట్రాయ్‌ చేసిన ప్రతిపాదనలకు టెలికాం సంస్థలు ఆ కొత్త రీచార్జ్‌ ప్లాన్లు ఎప్పుడు తీసుకువస్తాయో వేచి చూడాలి.

ట్రాయ్‌ చేసిన కొత్త ప్రతిపాదనతో ఫీచర్ ఫోన్ వాడేవారికి.. డేటా వాడనివారికి ఎంతో దోహదం చేయనుంది. వాళ్లు ఇన్నాళ్లు కేవలం వాయిస్‌ కాల్స్ మాత్రమే వాడినా కూడా డేటాకు కూడా చెల్లింపు చేస్తున్నారు. ట్రాయ్ చేసిన కొత్త ప్రతిపాదనలతో డేటా రహిత ప్లాన్లను టెలికాం కంపెనీలు తీసుకురావాల్సి ఉంది. ఈ ప్లాన్లు తీసుకువస్తే వృద్ధులు, ఫీచర్ ఫోన్ వాడేవారికి లబ్ధి జరగనుంది.

Also Read: Capital Amaravati: రాజధాని అమరావతికి బిగ్‌ బూస్ట్‌.. రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్మాణం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Husband Drinks Dettol: కాపురంలో లొల్లి.. భార్య వేధింపులు తాళలేక డెటాల్ తాగిన భర్త 

Hyderabad, Telangana:

Wife And Husband Clashes: మ్యాట్రిమోనీ యాప్‌లో సంబంధం కుదుర్చుకుని వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కాపురం పెట్టిన కొన్నాళ్లకే గొడవలు జరగడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త ఆరోపించాడు. ఎవరితో సంబంధం ఉందనే రుజువు చూపించాలని కోరగా.. భర్త భార్య ఫోన్‌, వాట్సప్‌ వివరాలు అడిగాడు. అయితే ఆమె ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో పోలీసుస్టేషన్‌లో పంచాయితీ జరగ్గా ఆ సమయంలో భర్త డెటాల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: 
Capital Amaravati: రాజధాని అమరావతికి బిగ్‌ బూస్ట్‌.. రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్మాణం

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన ఇటుకల మహేష్ (29) హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతడు విలాసాగరం సమత అనే యువతిని ఓ మాట్రిమోని యాప్‌లో చూసి సంబంధం మాట్లాడుకుని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన తరువాత జూబ్లీహిల్స్‌ పరిధిలోని వెంకటగిరి కాలనీలో కాపురం పెట్టారు. అయితే కొన్ని రోజుల తరువాత మహేశ్‌కు అతడి భార్యపై అనుమానం పెంచుకుని గొడవ పడతుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

Also Read: YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్‌ జగన్‌

ఈ గొడవల కారణంగా మహేశ్‌, సమత ఇద్దరు కాపురం తీసేసి విడివిడిగా వేర్వేరు ప్రైవేటు హాస్టల్‌లో నివసిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో వీరిద్దరూ హాస్టల్స్‌లో నివసిస్తుండగా ఫిబ్రవరిలో భార్యాభర్తలకు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. తన భార్యకు వేరే వారితో సంబంధం ఉందని ఆరోపించగా.. పంచాయితీ పెద్దలు సాక్ష్యాధారాలు చూపించాలని అడిగారు. దీంతో అతడు రెండు నెలల గడువు కోరాడు.

సాక్ష్యాధారాలు చూపించడానికి రెండు నెలల గడువు ముగియడంతో మహేష్ చైతన్యపురి పోలీస్ స్టేషన్‌కు వచ్చి భార్యపై ఫిర్యాదు చేశాడు. తన భార్య సీడీఆర్‌, వాట్సప్‌ చాట్ కావాలని అడుగగా ఇవ్వడానికి భార్య నిరాకరించింది. బయటకు వెళ్లి డెటాల్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వచ్చి మరోసారి భార్యకు సంబంధించిన చాట్ ఇవ్వాలని కోరాడు. ఇవ్వకపోవడంతో తన వెంట తెచ్చుకున్న డెటాల్‌ను తాగాడు. అది గమనించిన పోలీసులు వెంటనే నిలువరించి అతడి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మహేశ్ ఫిర్యాదు భార్యభర్తలకు సంబంధించిన విసయం కావడంతో కోర్టులో కానీ.. ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆ జంటకు పోలీసులు సూచించి పంపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్‌ జగన్‌

Tadepalli, Andhra Pradesh:

YS Jagan Speech: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనతో విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన, శాంతిభద్రతలు, సంక్షేమం, అభివృద్ధి.. ఇవన్నీ కూడా ఈరోజు తిరోగమనంలో కనిపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ఎక్కడా కూడా పలాన మంచి చేశామనే చెప్పుకునే పరిస్థితి పోయి ఈరోజు ఎక్కడ చూసినా కూడా తిరోగమనమే కనిపిస్తోందని ఆరోపించారు.  'ఏ వ్యవస్థ చూసినా ఎక్కడా మంచి కనిపించడం లేదు. అంతా తిరోగమనమే కనిపిస్తోంది. రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సినది ఏదీ నిర్వహించడం లేదు' అని చంద్రబాబు పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Unclaimed Money: మూలుగుతున్న రూ.లక్షా 2000 కోట్లు.. అందులో మీ డబ్బు ఉందా? అని తెలుసుకోవడం ఇలా

తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన అనంతరం ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక ప్రసంగం చేశారు. చంద్రబాబు పాలనపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఈ ప్రభుత్వంపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అన్నింటికీ తాను ఉన్నానని భరోసానిచ్చారు. తాను పాదయాత్ర త్వరలో ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.

Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. పీఆర్‌సీ కోసం భారీ యాక్షన్‌ ప్లాన్‌

ప్రజలకు తోడుగా ఉన్నామని గర్వంగా చెబుతున్నారని పార్టీ శ్రేణులను వైఎస్‌ జగన్‌ అభినందించారు. 'విపత్కర పరిస్థితుల్లో ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ జెండాను చేత బట్టుకుని ప్రజలకు అండగా.. తోడుగా మేం ఉన్నామని గర్వంగా చెబుతున్ను. కళ్లు మూసుకుని తెరిచేలోపు ఐదేళ్లలో సగం కాలం అయిపోయింది. ఇక మిగిలింది సగం కాలమే' అని గుర్తుచేశారు. 'కూటమి పాలనకు సగం టర్మ్‌ అయిపోయింది. మిగిలింది ఒక సగం టర్మ్‌ మాత్రమే. ఇంకో సంవత్సరం దాటితే నా పాదయాత్ర కూడా ప్రారంభం‌ అవుతుంది. దాని తర్వాత నేను రోడ్డు మీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటా' అని వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. పాదయాత్ర స్టార్ట్‌ అయిన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తామని పునరుద్ఘాటించారు.

Also Read: Capital Amaravati: రాజధాని అమరావతికి బిగ్‌ బూస్ట్‌.. రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్మాణం

'మనం 5 సంవత్సరాల కాలంలో రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. వాటిలో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా బటన్లు నొక్కడం నా అక్కాచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోవడం చూశాం. ఆ రూ.2,73 లక్షల కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయని వారి ఆధార్‌ నంబర్లు ఏమిటి అనేది కూడా మనం ఇవ్వగలుగుతాం. అంతగా మనం రూ.3.31 లక్షల కోట్లు అప్పు తెస్తే రూ.2,73 లక్షల కోట్లు ఈ మాదిరిగా మనం జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం. ఆధార్‌ నంబర్లతో సహా' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.

'మెడికల్‌ కాలేజీలు అమ్మేస్తున్నారు. ముఖ్యమైన రాయలసీమ లిఫ్టు వంటివి ప్రాజెక్టులు చేయకుండా ఆపేసిన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. రైతులు, పిల్లలు, అక్కాచెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడే లేడు. పథకాల కథ దేవుడెరుగు. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు కనీసం సున్నా వడ్డీ రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి. డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి' అని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 

'ప్రభుత్వ భూములు పప్పులూ, బెల్లాలకు అమ్మేస్తున్నారు. రూపాయికి షాపులో చాక్లెట్‌ వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో రూపాయికి కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తున్నాయి' అని చంద్రబాబు పాలనా తీరుపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అసహనం వ్యక్తం చేశారు. 'కళ్ల ఎదుటే రుషికొండకు ఎదురుగా 50 ఎకరాల ప్రభుత్వ భూమి చంద్రబాబు తన సమీప బంధువు, విశాఖపట్నం ఎంపీకి రూ.5 వేల కోట్లు విలువజేసే భూమిని ఉచితంగా ఇచ్చాడు. ఊరికే రెగ్యులరైజేషన్‌ చేశారు. అంత దారుణంగా రాష్ట్రానికి సంబంధించిన భూములు కాజేస్తున్నారు' అని ఆరోపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Capital Amaravati: రాజధాని అమరావతికి బిగ్‌ బూస్ట్‌.. రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్మాణం

Amaravathi, Andhra Pradesh:

Common Central Secretariat: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త ప్రకటించింది. ఇప్పటికే పార్లమెంట్‌లో రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించి శుభవార్త వినిపించగా.. తాజాగా రాజధాని ప్రాంతంలో భారీ నిర్మాణం చేస్తామని ప్రకటించింది. కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ (సీసీఎస్‌) నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అమరావతిలో రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్మాణాలను చేపట్టనుంది. త్వరలోనే వీటికి సంబంధించిన నిర్ణయానికి ఆమోదం లభించనుంది.

Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. పీఆర్‌సీ కోసం భారీ యాక్షన్‌ ప్లాన్‌

రాజధాని అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణంపై కీలక ముందడుగు పడింది. అమరావతిలో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (సీసీఎస్‌) నిర్మాణం కోసం రూ.1,299.08 కోట్లు, నివాస సముదాయాల (జీపీఆర్‌ఏ) ఏర్పాటు కోసం రూ.1,234.91 కోట్లతో కూడిన పీఐబీ (పీఐబీ) మెమోరాండం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగాలంటే కేబినెట్ సెక్రటేరియట్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు క్లియరెన్స్ త్వరలోనే కానుందని సమాచారం. ఫైల్‌ క్లియరెన్స్‌ అయితే రాజధానిలో భవనాలు పూర్తి కానున్నాయి.

Also Read: Unclaimed Money: మూలుగుతున్న రూ.లక్షా 2000 కోట్లు.. అందులో మీ డబ్బు ఉందా? అని తెలుసుకోవడం ఇలా

పార్లమెంట్‌లో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ఆమోదం పొందగా.. ఇటీవల రాష్ట్రపతి ఆమోదం తెలిపి గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్‌ 2వ తేదీన అమరావతి రాజధానిగా అధికారికంగా ఏర్పాటుకానుంది. ఏపీ రాజధానిపై ఏపీ అధికారులు ఇప్పటికే కేబినెట్ సెక్రటేరియట్‌కు సమర్పించారు. వచ్చే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ ప్రాజెక్టు తదుపరి అనుమతులకు కీలకమైన కేబినెట్ సెక్రటేరియట్ క్లియరెన్స్ మాత్రమే పెండింగ్ ఉంది.

Also Read: Chandrababu: గోతుల రహిత రోడ్లు ఉండాలి.. ఈవీ బస్సులు వాడాలి: సీఎం చంద్రబాబు

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ ప్రాజెక్టు ఫైల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదం తెలపడంతో అది మరింత ముందుకు పడింది. అమరావతిలో కేంద్ర నిర్మాణాల కోసం మొత్తం 22.53 ఎకరాల భూమిని కేటాయించిన విషయం తెలిసిందే. సీపీడబ్ల్యూడీ (సీపీడబ్ల్యూడీ) కోసం 22.53 ఎకరాల భూమిని ఏపీ ప్రభుత్వం  ఇచ్చింది. వీటిలో 5.53 ఎకరాలు సెక్రటేరియట్ నిర్మాణానికి, 17 ఎకరాలు నివాస సముదాయాల (జీపీఆర్‌ఏ) ఏర్పాటుకు కేటాయించారు. వీటన్నింటికి కేబినెట్ సెక్రటేరియట్ నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Chandrababu: గోతుల రహిత రోడ్లు ఉండాలి.. ఈవీ బస్సులు వాడాలి: సీఎం చంద్రబాబు

Amaravathi, Andhra Pradesh:

AP Roads Development: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 45 వేల కిలోమీటర్ల రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. మెరుగైన రోడ్లతో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువాలని సూచించారు.

రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై ఉండవల్లిలోని సచివాలయంలో సమీక్ష చేశారు. మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్ల పైచిలుకు రహదారులు నిర్వహణ పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు.

మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Karimnagar: ఆపన్న హస్తంపై అక్రమహస్తం.. CMRF చెక్కుల్లో కమీషన్ల దందా..

Hyderabad, Telangana:

CMRF Commission Scam In Karimnagar: పేద ప్రజలకు ఆపద కాలంలో అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి సహాయనిది ఇప్పుడు కొందరు దళారులకు ఇదొక బిజినెస్ గా మారింది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మూడు ప్రధాన నియోజకవర్గాల్లో చోట లీడర్లు, స్వార్థపరులు దళారులుగా మారి నిరుపేదలను అష్ట కష్టాలకు గురి చేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో పాటు ప్రమాదాల్లో ఆసుపత్రుల పాలై.. అప్పులు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు ప్రభుత్వం ఇచ్చే సహాయం లోను వీరు వాటాలు కోరుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ నియోజకవర్గాల్లో కమిషన్ల దందా ఒక పద్ధతి ప్రకారం సాగుతూ వస్తోంది. మంజూరైన చెక్కు మొత్తం ఆధారంగా దళారులు తమ వాటాలను ముందే ఖరారు చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సహకారం ప్రకారం వసూళ్ల పర్వం వివిధ రకాలుగా ఉంది. రూ.50 లోపు చెక్కులకు.. రూ.10 వేల రూపాయల వరకు కమిషన్ తీసుకుంటున్నారట. అంతేకాకుండా లక్ష వరకు వచ్చే చెక్కులకు ఏకంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా రెండు లక్షలు దాటిన చెక్కులకు ఏకంగా రూ.30 వేల నుంచి దాదాపు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.

సాధారణంగా ప్రజలు నేరుగా ఎమ్మెల్యేలను కలిసి దరఖాస్తులు చేసుకుంటారు. అయితే, ఆ దరఖాస్తులను పరిశీలన నుంచి చెక్కుల పంపిణీ వరకు కీలకపాత్ర పోషించే కొందరు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయ సిబ్బంది.. ఈ దళారులతో చేతులు కలిపినట్లు ఆరోపణలు కూడా ఊహించని స్థాయిలో వస్తున్నాయి. చెక్కులు మంజూరైన విషయం లబ్ధిదారుడికి తెలియక ముందే.. ఈ దళారులకు సమాచారం అందుతోంది.. మా వల్లే ఈ చెక్కులు మంజూరు అయ్యాయని.. మాకు ఇంత ఇస్తేనే చెక్కులు మీ చేతికి వస్తాయని బాధితులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది..

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన ప్రభుత్వ లక్ష్యం ఈ దళారుల తీరు వల్ల నీరుగారిపోతోంది.. అప్పుల బాధలతో ఉన్న లబ్ధిదారులు.. అంతో ఇంతో వస్తుంది కదా అనే ఆశతో దళారులు అడిగినంత ఇచ్చుకోక.. చెక్కు తీసుకోలేక సతమతమవుతున్నారు.. బాధితులు ఫిర్యాదు చేద్దామన్న.. భవిష్యత్తులో రాజకీయ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయపడుతున్నారు.. జిల్లా యంత్రాంగంతో పాటు ఉన్నతాధికారులు తక్షణమే.. చెక్కుల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని.. అవినీతికి పాల్పడుతున్న దళారులతో పాటు వారికి సహకరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు మీడియా ద్వారా కోరుతున్నారు..

Also Read:​  Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్‌లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Infinix Note 60 Ultra: 200MP కెమెరాతో ఇన్ఫినిక్స్ సంచలనం.. నోట్ 60 అల్ట్రా వచ్చేసింది!

Hyderabad, Telangana:

Infinix Note 60 Ultra Launched: ప్రముఖ  స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ మార్కెట్లోకి మరో తమ శక్తివంతమైన మొబైల్‌ను లాంచ్ చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఇటాలియన్ కార్ డిజైన్ హౌస్ Pininfarina సహకారంతో అద్భుతమైన డిజైన్తో ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం లుక్‌తో పాటు ఎన్నో రకాల అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే మీ మొబైల్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K అల్ట్రా HDR AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది. డిస్ప్లే కు ప్రొటెక్షన్ గా కంపెనీ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కూడా అందించింది. దీంతోపాటు ఫోటోగ్రఫీ ప్రియుల కోసం కంపెనీ ఇందులో అద్భుతమైన కెమెరా సెటప్ ను అందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన Samsung ISOCELL HPE సెన్సార్ తో 200MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది.

అంతేకాకుండా ఇందులో అద్భుతమైన 3.5x ఆప్టికల్ జూమ్ తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉండడమే కాకుండా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక సెల్ఫీ ప్రియుల కోసం కంపెనీ ఎందులో ఎంతో శక్తివంతమైన 32MP ఫ్రంట్ కెమెరాను అందించింది. ఇక ఈ మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్‌తో పాటు గేమింగ్‌కు ఎంతో అద్భుతంగా పనిచేయబోతున్నట్లు ఇన్ఫినిక్స్ క్లైమ్ చేస్తోంది. ఇక ఈ ఫోన్లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏంటంటే.. దీని బ్యాటరీ.. ఇది ఎంతో శక్తివంతమైన 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో లాంచ్ అయింది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ కోసం కంపెనీ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ ను కూడా అందిస్తోంది. కేవలం 48 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఫుల్ ఛార్జ్ అవుతోంది.

Also Read:​  Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్‌లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16.2 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది.. ఇది 3 ఏళ్ల మేజర్ అప్‌డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ హామీని కంపెనీ ఇచ్చింది. దీంతోపాటు ఈ మొబైల్ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పటికే మలేషియా మార్కెట్లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారు రూ.70 వేల ఉంటుంది. దీనిని అతి త్వరలోనే ఇండియాలో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అమాల్ఫీ బ్లూ, మోన్జా రెడ్, రోమా సిల్వర్‌తో పాటు టొరినో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. హై ఎండ్ వేరియన్స్‌లో సాటిలైట్ కాలింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Also Read:​  Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్‌లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Assam: బీఫ్ ఇంట్లోనే తినండి.. బయట వద్దు.. అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు!

Hyderabad, Telangana:

Himanta Biswa Sarma Latest News: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో గోమాంసం వినియోగంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హీమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఫ్ వాడకాన్ని తాను పూర్తిగా నిషేధించడం లేదని.. అయితే పబ్లిక్ ప్లేసుల్లో దీని వినియోగంపై కొన్ని పరిమితులు ఉండాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశంపై పూర్తి క్లారిటీని అందించినట్లు సమాచారం..

బీఫ్ తినాలనుకునే వారు తమ సొంత ఇళ్లలో కూర్చొని తినవచ్చని.. దానికి ఎటువంటి అభ్యంతరం లేదని సీఎం పేర్కొన్నారు. నేను ఎవరిని తినొద్దని చెప్పలేదు.. కానీ బహిరంగ ప్రదేశాల్లో.. ముఖ్యంగా హోటల్స్‌లో లేదా ఇతర మనోభావాలు దెబ్బ తినే చోట తినోద్దని కోరుకుంటున్నాను.. ప్రజలు తమ ప్రైవేట్ నివాసాల్లో దీనిని స్వేచ్ఛగా తినొచ్చు.. అని ఆయన వివరించారు. సామాజిక సామరస్యాన్ని కాపాడటమే తమ ప్రభుత్వం ఉద్దేశం అని ఆయన చెప్పుకొచ్చారు..

అస్సాం ప్రభుత్వం గతంలోనే అస్సాం పశువుల సంరక్షణ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు.. ఈ చట్టం ప్రకారం కొన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయని ఆయన మరోసారి తెలిపారు.. హిందువుల దేవాలయాలతో పాటు వైష్ణవ సత్రాలు ఉన్న ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో బీఫ్ విక్రయించడం పూర్తిగా నిషేధం.. హిందువులతో పాటు సిగ్గులు జైనులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో కూడా బీఫ్ అమ్మకాలపై ఆంక్షలు ఉంటాయి. 

ఎన్నికల సమయంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు అస్సాం రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి.. రాష్ట్రంలోని విభిన్న సాంస్కృతులతో పాటు మతాల మధ్య సమతుల్యతను కాపాడటానికే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన సమర్థించుకున్నారు. చట్టాన్ని గౌరవిస్తూనే.. వ్యక్తిగత ఆహార పలవాట్లలో తాము జోక్యం చేసుకోవడం లేదని సంకేతాన్ని పంపే ప్రయత్నం చేశారు.. వివక్షాలు దీనిని రాజకీయ వ్యూహంగా విమర్శించినప్పటికీ..క్షేత్రస్థాయిలో తమ విధానం స్పష్టంగా ఉందని హిమంత విశ్వ శర్మ తేల్చి చెప్పారు..

Also Read:​  Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్‌లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Sun Transit 2026: మేషరాశిలోకి సూర్యుడి ఎంట్రీ.. ఈ రాశుల జాతకం మారుతోంది, డబ్బే డబ్బు!

Hyderabad, Telangana:

Sun Enters Effect On These 4 Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలకు రాజుగా  పిలిచే సూర్యుడు తన రాశిని మార్చుకున్నప్పుడల్లా ద్వాదశ రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. తాజాగా 2026 సంవత్సరం ఏప్రిల్ లో సూర్యభగవానుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడి సంచారం ఈ వారంలోనే జరగబోతున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా ఆయా రాశుల వారిపై ఊహించని ప్రభావం పడే అవకాశాలు కూడా ఉండాయట.. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం ఊహించని స్థాయిలో లభిస్తే.. మరికొన్ని రాశుల వారికి దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయట. కాబట్టి సూర్యుడి ప్రభావం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం లభించి.. జీవితాల్లో ఆర్థికంగా, వృత్తిపరంగా ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి..

ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం..
మేష రాశి 
సూర్యుడు మేషరాశిలో సంచారం చేయడం వల్ల ఈ సొంత రాశి వారికి రాజయోగం పట్టే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు వేగవంతం అవ్వడమే కాకుండా.  సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించడమే కాకుండా జీతాలు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

సింహరాశి 
సూర్యుడు సింహరాశికి అధిపతిగా వ్యవహరిస్తాడు. అలాంటిది సూర్యుడి సంచారం వల్ల సింహ రాశి వారికి అపారమైన లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు భారీ లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త పెట్టుబడిదారులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. వ్యాపారాల్లో భారీ లాభాలు చేకూరి అవకాశాలున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారికి సూర్యుడి సంచారం ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కల ఊహించని స్థాయిలో నెరవేరబోతోంది. పూర్వికులు ఆస్తి సంబంధిత వివాదాలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. ఆర్థికంగా బలోపేతం అవ్వడమే కాకుండా వీరు ఆరోగ్యంగా అద్భుతంగా ఉండబోతున్నారు.

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు వృత్తిపరంగా జీవితంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వీరు శత్రువులపై అద్భుతమైన విజయాలు సాధించడమే కాకుండా.. అనుకున్న పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Iphone Ultra: వచ్చేస్తోంది ఐఫోన్ అల్ట్రా.. మడతపెట్టే ఐఫోన్ ఫీచర్స్ ఇవే!

Hyderabad, Telangana:

Iphone Ultra Leaks Latest News: స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దిగ్గజ సంస్థ యాపిల్ త్వరలో ఫొల్టబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే అద్భుతమైన డిజైన్‌తో మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కేవలం పుకార్లకే పరిమితమైన యాపిల్ ఫోన్ డబుల్ ఫోన్ గురించి.. తాజాగా ఒక ఆసక్తికరమైన లీక్ బయటికి వచ్చింది. ఈ ఫోన్ ఐఫోన్ అల్ట్రా పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియా వేదికగా  పంచుకున్నట్లు తెలుస్తోంది.. ఇది గతంలో విడుదల చేసిన అన్ని మోడల్స్‌తో పోలిస్తే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం గూగుల్‌తో పాటు సాంసంగ్ వంటి సంస్థలు ఫొల్టబుల్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నాయి. యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ డిజైన్ అత్యంత ప్రీమియం లుక్కులో కనిపించేందుకు యాపిల్ వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉండట. కేవలం పేరు మార్చడమే కాకుండా.. అల్ట్రా స్థాయిలో అత్యున్నత ఫీచర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో యాపిల్ తన ప్రో మోడల్స్ను ఎలాగైతే వివిధ రకాల కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చిందో.. ఇందులో కూడా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లు ఉండబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ లోపలి భాగంలో ఒక పెద్ద ఫొల్టబుల్ స్క్రీన్‌తో పాటు.. సెకండరీ డిస్ప్లే ఉండే అవకాశాలు ఉన్నట్లు లీకైన వివరాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఇది ప్రీమియం కేటగిరీలో రాబోతుంది కాబట్టి.. దీని ధర సాధారణ యాపిల్ మొబైల్స్ కంటే పది రేట్లు ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా పూల డబ్బులు ఫోన్లను వచ్చే ప్రధాన సమస్యలైనా క్రిజ్ కనిపించకుండా యాపిల్ సరికొత్త మెకానిజంపై పని చేస్తున్నట్లు లీకైన వివరాలు తెలుపుతున్నాయి. ఇందులో కెమెరా కూడా గత మోడల్స్ కంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం..

Also Read:​  Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్‌లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!

యాపిల్ ప్రియులు గత కొంతకాలంగా హోల్డబుల్ ఐఫోన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, యాపిల్ ఈ స్మార్ట్‌ఫోన్ ను ఎప్పుడు విడుదల చేస్తాదని అంశంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ నిపుణుల అంచనాల ప్రకారం.. ఐఫోన్ అల్ట్రా 2026 సంవత్సరం చివరి నెలలో లేదా 2027 సంవత్సరం మొదటి నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ ఏ ఉత్పత్తిని తెచ్చిన అది పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే ఫోన్ డబ్బులు టెక్నాలజీలో ఉన్న లోపాలను సరిదిద్ది.. అత్యద్భుతమైన నాణ్యతతో ఈ అల్ట్రా ఫోన్ను తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఐఫోన్ అల్ట్రా మొబైల్‌ మార్కెట్లోకి వస్తే.. అది స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:​  Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్‌లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement
Advertisement
Back to top