చర్లపల్లి జోరువానలో కూలీ పనికి వచ్చిన ఓ బాలికను చూసి సంజయ్ కారు ఆపాడు
కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గం చర్లపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. కూలీల గుంపులో ఓ మైనర్ బాలికను చూసి.. 'అమ్మా.. పనికి వెళ్తున్నావా? నీకు చదువుకోవాలని అనిపించలేదా నీ కుటుంబ పరిస్థితి గురించి అడిగాడు. తన పేరు బొల్లా అక్షయ్ అని, తాను 10వ తరగతి పాసయ్యానని, అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో కూలీ పనులకు వెళ్తున్నానని బదులిచ్చారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈసారి ముందెన్నడూ లేని విధంగా అత్యంత సుదీర్ఘంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 12న ప్రారంభించి, మార్చి 12 వరకు నెల రోజుల పాటు సభను నడపాలని నిర్ణయించడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ముఖ్యంగా, సభకు వరుసగా గైర్హాజరవుతున్న వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వంపై వేటు వేసేందుకు అవసరమైన అర్హత సాధించడమే ఈ సుదీర్ఘ షెడ్యూల్ వెనుక ఉన్న అసలు టార్గెట్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: Snake Dog Video: పాము, కుక్క వైరం.. గంటపాటు జరిగిన యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?
60 రోజుల అనర్హత
రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక సభ్యుడు వరుసగా 60 పని దినాల పాటు సభకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సభ ఏర్పడినప్పటి నుంచి సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ సభ్యులను.. ఈసారి కూడా రాకుండా ఉంటే ఆ నిబంధన పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే కేవలం ఒక రోజు హాజరై సంతకం చేసి వెళ్లడం ద్వారా ఈ గండం నుంచి గట్టెక్కవచ్చని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం నైతికత అనే అస్త్రాన్ని తెరపైకి తెస్తోంది.
Also Read: YS Sharmila: మళ్లీ జగనన్నపై వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు.. పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు
ఎథిక్స్ కమిటీ సిఫారసులు
అసెంబ్లీ సమావేశాలకు రాకుండా.. చర్చల్లో పాల్గొనకుండా కేవలం సంతకాలు పెట్టి జీతభత్యాలు తీసుకోవడం ప్రజలను వంచించడమేనని కూటమి ప్రభుత్వం వాదిస్తోంది. ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన బాధ్యతను విస్మరించి.. సాంకేతిక కారణాలతో సభ్యత్వాన్ని కాపాడుకోవాలని చూడడం వారి నైతిక పతనానికి నిదర్శనమని విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే సమావేశాల్లో రాజ్యాంగ స్ఫూర్తిని, అసెంబ్లీ నియమావళిని గౌరవించని వారికి గట్టి గుణపాఠం చెప్పే దిశగా స్పీకర్ నిర్ణయం ఉండబోతోందని సమాచారం. ఎథిక్స్ కమిటీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. చర్యలకు సిఫారసు చేస్తూ నివేదిక సమర్పిస్తే.. అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటుంది.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
వైసీపీ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఈసారి కూడా సభకు గైర్హాజరైతే చట్టపరమైన చిక్కులు తప్పవనే పరిస్థితి కనిపిస్తున్నాయి. అటు ప్రజల్లోనూ దీనిపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సంకటంలో పడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు పాటించాలా? లేక సభ్యత్వాన్ని కాపాడుకునేందుకు సభకు వెళ్లాలా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు వేదిక కానున్నాయి.
Also Read: Prices Decrease: భారత్ చారిత్రక ఒప్పందం.. లిక్కర్, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
QR Code Rist Band: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క-సారక్క మహాజాతర-2026 అంగరంగ వైభవంగా సాగుతోంది. లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దారులన్నీ మేడారం వైపు అన్నట్టు ఉంది. జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో ఈక్రమంలో పిల్లలు తప్పిపోతున్నారు. పిల్లలు అదృశ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తప్పిపోయిన పిల్లలను రెండు గంటల్లోనే ఆచూకీ కనిపెట్టి అప్పగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ సత్ఫలితాలను ఇస్తోంది. దానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Mamnoor Airport: వరంగల్ ఎయిర్పోర్టులో కీలక ముందడుగు.. త్వరలోనే ఎగరనున్న విమానాలు
మేడారం జాతర రద్దీలో చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉండడంతో వారి రక్షణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్’ వ్యవస్థను భక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ వ్యవస్థపై మల్టీ జోన్ -2 ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ సహకారంతో భక్తులు వచ్చే ప్రధాన మార్గాల్లో 11 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు ఈ బ్యాండ్లను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఈపీఎఫ్, డీఏ కోసం పోరాటం
హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్, హైదరాబాద్లోని ఉప్పల్, ఎంజీబీఎస్ బస్స్టేషన్లలో, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంథని, ఏటూరునాగారం, కాటారం బస్ స్టేషన్లతో పాటు.. వరంగల్ రైల్వే స్టేషన్, కాజిపేట్ రైల్వే స్టేషన్లలో రిస్ట్ బ్యాండ్లను అందజేసే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. జాతరలో ఎవరైనా చిన్నారి తప్పిపోయినట్లు కనిపిస్తే వారి చేతికి ఉన్న రిస్ట్ బ్యాండ్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్మార్ట్ఫోన్ ద్వారా స్కాన్ చేయాలని సూచించారు. స్కాన్ చేసిన వెంటనే లభించే ఫోన్ నంబర్ ద్వారా సదరు బాధితుల బంధువులకు లేదా పోలీసులకు సమాచారం అందించి చిన్నారులను క్షేమంగా వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చవచ్చని వివరించారు.
Also Read: Snake Dog Video: పాము, కుక్క వైరం.. గంటపాటు జరిగిన యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?
ఎస్ఐబీ, ఐజీపీ సుమతి ఈ వినూత్న సాంకేతిక ప్రక్రియను రూపొందించారని ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నూతన ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్యూఆర్ రిస్ట్ బ్యాండ్లు జాతరలో ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను కేవలం గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చినట్లు తెలిపారు. కరీంనగర్ బస్టాండ్లో రిస్ట్ బ్యాండ్ వేయించుకున్న మురళీకృష్ణ కుమారుడు అరియాన్ష్ (4) అనే బాలుడు జాతరలో తప్పిపోగా ఈ సాంకేతికత ఆధారంగానే అతడిని త్వరగా గుర్తించగలిగినట్లు వెల్లడించారు. హనుమకొండ హయగ్రీవచారి గ్రౌండ్స్లో రిస్ట్ బ్యాండ్ ధరించిన గోవిందరావుపేట గ్రామానికి చెందిన మిల్కీ అనే బాలిక కూడా తప్పిపోయిన కొద్దిసేపటికే తన తండ్రి గుంజ నాగరాజు చెంతకు చేరిందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Warangal Mamnoor Airport: తెలంగాణ రాష్ట్రంలో మరో ఎయిర్పోర్టు ఏర్పాటు కాబోతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో వరంగల్ మామునూరు ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించిన భూమి సేకరణ పూర్తయ్యింది. ఆ భూమిని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ భూమి అప్పగింత కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Prices Decrease: భారత్ చారిత్రక ఒప్పందం.. లిక్కర్, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో మామునూరు ఎయిర్పోర్టుకు భూమి అప్పగింత కార్యక్రమం జరిగింది. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్కు అవసరమైన 300 ఎకరాల భూమిని కేంద్ర వైమానిక శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్పోర్టుకు అవసరమైన భూమిని సేకరించి ఈరోజు కేంద్ర విమానయాన శాఖకు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజు అని ప్రకటించారు.
Also Read: Gold Prices: బడ్జెట్లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర
మామునూరు తరహాలోనే ఆదిలాబాద్, కొత్తగూడెం పట్టణాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఎయిర్పోర్టుల నిర్మాణం పనిని వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. తెలుగు గడ్డపై పుట్టిన వ్యక్తి కేంద్రంలో వైమానిక శాఖ మంత్రిగా ఉండడం అభినందనీయమని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలను గుర్తిస్తూ సహకారం అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. 2007లోనే ఎయిర్పోర్ట్ అథారిటీతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆలస్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఈపీఎఫ్, డీఏ కోసం పోరాటం
హైదరాబాద్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని టూ టైర్ సిటీలు అయినా కొత్తగూడెం, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రామ్మోహన్ నాయుడును రాష్ట్ర మంత్రివర్గం కోరిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్లడం శుభసూచకం అని తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ 1930లో నిజాం కాలంలోనే పనులు మొదలుపెట్టారని.. ఇది ఆనాడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుచేశారు. మామునూరు ఎయిర్పోర్ట్ భూ సేకరణకు 300 కోట్లు అవసరమని గుర్తించి వాటిని వెంటనే విడుదల చేసి వడివడిగా అడుగులు వేసి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Medaram Jatara 2026: దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారక్క మహాజాతరను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరలో కనీస వసతుల్లో ఎలాంటి లోటుపాట్లు లేవని స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదారులు, రవాణా, భద్రత, సమాచార వ్యవస్థ వంటి మౌలిక వసతులన్నింటినీ శాఖల మధ్య సమన్వయంతో అందిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Medaram Jatara: మేడారం జన జాతర.. 2 రోజుల్లో 80 లక్షల మంది భక్తుల రాక
మేడారంలో సమ్మక్క, సారక్కను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మేడారం సమ్మక్క, సారక్కలను దర్శించుకున్న అనంతరం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం మాట్లాడుతూ.. 'సమ్మక్క–సారక్క జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఇది గిరిజనుల మహాకుంభంగా నిలుస్తోంది. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు అందిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశాం' అని వివరించారు. 'కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ పథకాలపై వివరాలు వెల్లడించారు. ధర్తీ ఆబా గిరిజన గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద రూ.లక్ష కోట్లు, పీఎం జన్మన్ యోజన కింద రూ.24 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణకు 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసినట్లు చెప్పారు.
Also Read: Gold Prices: బడ్జెట్లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 'సమ్మక్క–సారక్క జాతర గిరిజన ప్రజల అతిపెద్ద పండుగ. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు మేడారానికి తరలివస్తారు. ములుగు, లక్నవరం, మేడవరం, తాడ్వాయి, బొగత జలపాతం ప్రాంతాల పర్యాటకాభివృద్ధికి రూ.80 కోట్లు, రామప్ప దేవాలయ అభివృద్ధికి రూ.140 కోట్లు, ఈ ఏడాది జాతర నిర్వహణకు రూ.3.70 కోట్లు మంజూరు చేశాం' అని వివరించారు. రూ.890 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని.. త్వరలో ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
Also Read: Prices Decrease: భారత్ చారిత్రక ఒప్పందం.. లిక్కర్, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా.. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు సంపూర్ణ గౌరవం ఇస్తూ జాతర నిర్వహణ జరుగుతోందని రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. 'ఈ మహాజాతర భక్తులకు సేవ చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎండ, వర్షం, రద్దీ అన్న తేడా లేకుండా పని చేస్తున్న అధికారుల అంకితభావమే ఈ జాతర విజయానికి బలం. ప్రజల సహకారం, మీడియా బాధ్యతాయుత పాత్రతో మహాజాతర సజావుగా కొనసాగుతోంది' అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Snake vs Dog: జీవ ప్రపంచంలో ఒక జీవితో మరో జీవికి పడదు. దానికి మానవులు కూడా అతీతం కాదు. మానవుల విషయం పక్కనపెడితే పాములకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఉంటాయి. పాములు పగబట్టడంలో.. తమ జాతి పాములతోనే పోరాడే పాములు ఇక వేరే జాతి జంతువులతో కూడా శత్రుత్వం కొనసాగిస్తాయి. వాటిలో పాము, ముంగిస ఒకటీ కాగా.. రెండోది పాము, కుక్క. ప్రస్తుతం ఒక వీడియో వైరల్గా మారింది. పాము, కుక్క కలిసి రెండూ కొన్ని నిమిషాల పాటు పోరాటం చేశాయి. చివరకు కుక్క పైచేయి సాధించింది. పామును చంపేసి యజమాని కుటుంబాన్ని కాపాడింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలో ఈ సంఘటన జరగ్గా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Gold Prices: బడ్జెట్లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలో బడుగు సాయిలు అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి నాగుపాము వచ్చింది. పాము వచ్చి బుసలు కొట్టడంతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళన చెందింది. పాము రావడంతో ఏం చేయాలో పాలుపోకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వారు కూడా వచ్చారు. ఆ పాము కాటు వేయకుండా బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే వారు పెంచుకుంటున్న కుక్క పాముపై ప్రతాపం చూపించింది.
Also Read: Prices Decrease: భారత్ చారిత్రక ఒప్పందం.. లిక్కర్, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
అందరూ బెదిరించడంతో ప్రాణభయంతో ఆ నాగుపాము ఇంటి గోడ పక్కన ఉన్న రంధ్రంలోకి వెళ్లింది. అయితే పెంపుడు కుక్క ఇది గమనించి పామును తోక పట్టుకుని బయటకు లాగింది. బయటకు లాగిన నాగుపాముతో కుక్క పోట్లాడింది. అటు మనుషులు, ఇటు కుక్క దెబ్బకు పాము ఎటు పోలేని పరిస్థితి. ప్రాణభయంతో పారిపోతుండగా కుక్క పట్టుకుని వచ్చి యుద్ధం చేసింది. దీంతో ప్రాణం పోతున్నా ఆ పాము కుక్కతో హోరాహోరీగా పోరాడింది. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆ పాము కుక్క దెబ్బకు ప్రాణం విడిచింది. వెంటాడి వేటాడి ప్రాణం పోయేంత వరకు పాముతో కుక్క పోరాటం చేసింది.
Also Read: Medaram Jatara: మేడారం జన జాతర.. 2 రోజుల్లో 80 లక్షల మంది భక్తుల రాక
ఈ పాము, కుక్క పోరాటాన్ని ఆ కుటుంబసభ్యులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. యజమాని కుటుంబాన్ని పాము బారి నుంచి కుక్క కాపాడడం ఆసక్తికరంగా మారింది. మనుషులపై కుక్క చూపించే విశ్వాసానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన. పాము, కుక్క కొట్లాడే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇన్నాళ్లు పాము, ముంగిస పోరాటం చూశాం కానీ పాము, కుక్క కొట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన పాదయాత్రపై రాజకీయాలు వేడెక్కగా.. పాదయాత్ర చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తన సోదరుడు, వైఎస్సార్సీపీ అధినేతపై చెల్లెలు వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. తన అన్న ప్రకటించిన పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర ఎందుకు? అని సూటిగా ప్రశ్నించారు. అధికారం ఇస్తే ఏం చేశారని నిలదీశారు. స్వార్థం తగ్గి మంచితనం పెరగాలని సూచించారు.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ చేసిన పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. 'జగన్ పాదయాత్ర ఎందుకు? అధికారం కోసమే కదా ఈ పాట్లు? అధికారం ఇస్తే ఏం చేశారు?' అని ప్రశ్నించారు. 'వైఎస్సార్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కులేదు. అధికారంలో వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. అధికారం ఇస్తే ఎందుకు పూర్తి చేయలేదు?' అని నిలదీశారు.
Also Read: Prices Decrease: భారత్ చారిత్రక ఒప్పందం.. లిక్కర్, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
'మద్యనిషేధం అన్నాడు. అధికారం ఇస్తే కల్తీ మద్యం పెట్టి క్యాష్ పద్ధతిలో మద్య మాఫియా చేశాడు. రుషికొండ వేల ఏళ్ల నుంచి నిలబడ్డ కొండ. రుషికొండను బోడి గుండు చేశాడు. అధికారం ఇస్తే ఒక్క రోజు కూడా బయటకు రాలేదు. ఆ పార్టీ వాళ్లకే అందుబాటులో లేడు' అని తన సోదరుడు జగన్పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి సిద్ధం అంటూ కొన్ని నెలలు తిరిగారు తప్పిస్తే ఒకరోజు అయినా ప్రజల కోసం బయటకు వచ్చారా? అని ప్రశ్నించారు.
Also Read: Gold Prices: బడ్జెట్లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర
'అబ్రహం లింకన్ ఒక మాట అన్నాడు. ఒక మనిషి నిజమైన నైజం తెలియాలి అంటే అధికారం ఇచ్చి చూడండి అన్నాడు. మనం జగన్ని అధికారంలో చూశాం. జగన్కి అధికారం సూట్ అవ్వలేదు. జగన్కు పవర్ సూట్ అవ్వలేదు' అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. 'జగన్ నేచర్ మారాలి. జగన్ నైజం మారాలి. జగన్లో మార్పు రావాలి. జగన్లో స్వార్థం తగ్గి మంచితనం పెరగాలి' అని హితవు పలికారు. 'అప్పుడు దేవుడు అధికారం ఇస్తాడేమో? అంతవరకు దేవుడు ప్రజలు ఆశీర్వదించడు' అని పేర్కొన్నారు. ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు అనౌన్స్ ఎందుకు? చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకు? అని మాజీ సీఎం వైఎస్ జగన్ను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Railway Ticket Discount For Senior Citizens: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026-27 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు (వృద్ధులకు) రైల్వే ప్రయాణాల్లో ఊరటనిచ్చేలా కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కరోనా సమయంలో నిలిపివేసిన రైల్వే కన్సెషన్లను (Railway Concessions) మళ్లీ ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. దీనిపై ఆర్థిక శాఖ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరికి ఎంత రాయితీ?
పాత నిబంధనల ప్రకారం.. ఈ పథకం అమల్లోకి వస్తే సీనియర్ సిటిజన్లకు ఈ క్రింది విధంగా ప్రయోజనం చేకూరుతుంది.
మహిళలు (58 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరపై 50 శాతం రాయితీ.
పురుషులు (60 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరపై 40 శాతం రాయితీ.
అన్ని తరగతులకు వర్తింపు
కేవలం సాధారణ స్లీపర్ క్లాస్ మాత్రమే కాకుండా, ఏసీ కోచ్లలో (1st AC, 2nd AC, 3rd AC) కూడా ఈ రాయితీ లభించే అవకాశం ఉంది. ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 'సీనియర్ సిటిజన్' ఆప్షన్ను ఎంచుకోవడం ద్వారా ఈ తగ్గింపును పొందవచ్చు.
ఎందుకు నిలిపివేశారు?
మార్చి 2020లో కరోనా మహమ్మారి కారణంగా రైల్వే ఆదాయం దెబ్బతినడంతో, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఈ రాయితీలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల ప్రతి ఏటా రైల్వే శాఖకు సుమారు రూ.1,600 నుంచి రూ.2,000 కోట్ల వరకు ఆదా అవుతోంది. అయితే, ప్రస్తుతం రైల్వే ఆదాయం పెరగడం, వృద్ధుల నుంచి వస్తున్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని దీనిని పునరుద్ధరించాలని నిర్ణయించారు.
బడ్జెట్పై ఆశలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లపై అధిక వడ్డీ వంటి ప్రయోజనాలు పొందుతున్న సీనియర్ సిటిజన్లకు, ఇది అదనపు బూస్ట్ను ఇస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Elephant Jumping Video Watch Here: సోషల్ మీడియాలో నిత్యం వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.. నెటిజన్స్ ఎక్కువగా ఇలాంటి వీడియోలు చూసేందుకు మాత్రమే ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇందులో భాగంగా కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు తరచుగా ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో ఏనుగు ఒక భవనం పై నుంచి అదుపుతప్పి కారుపై దూకుతున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు చూడొచ్చు. అయితే, ఇది ఎక్కడ జరిగింది? ఏనుగు ఇలా దూకడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఒక భారీ జనావాస ప్రాంతంలో ఇరుకైన వీధిలో ఇంటి పైకప్పు పై ఒక పెద్ద ఏనుగు కనిపించడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ భవనం శిథిలావస్థలో ఉండడం.. చెక్కలు, రేకులాంటి నిర్మాణంపై ఏనుగు నిలబడి ఉండడం మీకు కనిపిస్తుంది. అయితే, ఆ పాత భవనం ఏనుగు బరువు తట్టుకోలేక కూలిపోయేందుకు దగ్గరగా ఉన్నట్లు మీరు చూడొచ్చు. ఇదే సమయంలో ఏనుగు దానిపై నిలకడ కోల్పోయి.. నేరుగా రోడ్డుపై ఆగి ఉన్న ఒక కారుపై దూకడం మీరు చూడొచ్చు.
అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలంతా అదే వీధుల్లో ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా ఆ ఏనుగు కారుపై పడగానే భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వారంతా.. వెనక్కి వెళ్ళండి.. వెనక్కి వెళ్ళండి అంటూ అరవడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో చాలామంది అక్కడి నుంచి పారిపోవడం కూడా మీరు గమనించవచ్చు. అయితే ఆ ఏనుగు పైనుంచి దూకడంతో కొద్దిగా గాయాలైనట్లు తెలుస్తోంది. దూకిన వెంటనే ఆ ఏనుగు అక్కడి నుంచి పరుగులు పెట్టేందుకు ప్రయత్నించడం కూడా మీరు చూడొచ్చు.
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
ఈ వీడియోలో ఏనుగు పరిస్థితి ఏంటి అంటే.. పైనుంచి దూకిన ఏనుగు వెంటనే లేచి నిలబడడంతో గాయాలు కొద్దిగానే అయినట్లు తెలుస్తోంది. అలాగే అదృష్టవశాత్తూ ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ ఘటనను అక్కడున్న కొంతమంది తమ మొబైల్లో చిత్రీకరించి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం.. ఇది నిజమైన వీడియో కాదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిందని కామెంట్లు చేస్తున్నారు. అవును మీరు కూడా క్లియర్ గా గమనించి ఈ వీడియోని చూస్తే.. ఇది ఒక ఏఐ వీడియోగా అనిపిస్తుంది. అలాగే ఫ్యాట్ చెక్ చేసి చూడగా.. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వీడియో గా తేలింది.
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Liquor And Wine Prices: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశంలో అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి.. బంగారం, వెండి అయితే అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే బడ్జెట్కు ముందే ఓ కీలక పరిణామం జరిగింది. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందంగా పరిగణిస్తుండగా.. ఈ ఒప్పందంతో ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేస్తుందని.. చాలా వాటి ధరలు తగ్గుముఖం పడతాయని తెలుస్తోంది.
Also Read: Gold Prices: బడ్జెట్లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర
ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఈయూ నుంచి భారత్కు వచ్చే వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందంతో దేశంలోనే పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయని.. యూరోపియన్ యూనియన్తో చేసుకున్న కీలక వాణిజ్య ఒప్పందం ఎంతో దోహదం చేస్తుందని తెలుస్తోంది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఈపీఎఫ్, డీఏ కోసం పోరాటం
ఈ ఒప్పందంపై నరేంద్ర మోదీ స్పందిస్తూ.. 'ఇది చారిత్రాత్మక నిర్ణయం. ఇదొక పెద్ద డీల్' అని తెలిపారు. ఈ ఒప్పందంతో రెండు దేశాలకు ప్రయోజనం జరగనుందని.. ఇది ఆరంభం మాత్రమేనని ప్రధాని వెల్లడించారు. రెండు దేశాల మధ్య వ్యూహత్మాక సంబంధాలు బలోపేతమవుతాయని చెప్పారు. అయితే ఈయూతో చేసుకున్న ఈ ఒప్పందంతో భారత్లో వివిధ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశంలో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ధరలు తగ్గే జాబితాలో కార్లు, మద్యం ప్రధానంగా ఉన్నాయి. బీర్, విస్కీ, వోడ్కా, వైన్తోపాటు నూనె ధరలు (ఆలివ్ ఆయిల్, కూరగాయల నూనె) తగ్గుతాయని తెలుస్తోంది. కివీస్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్ వంటి ధరలు తగ్గే అవాకశం ఉంది. ఈయూ దేశాల నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారీగా తగ్గే అకాశాలు ఉన్నాయి.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
ఈయూ నుంచి దిగుమతి చేసుకునే 96.6 శాతం వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండకపోవడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. దీంతోపాటు ఈయూకి భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై కూడా సుంకాలు తగ్గుతాయి. 96.6 శాతం సుంకాలను తొలగిస్తామని యూరోపియన్ యూనియన్ తెలిపింది.
వీటిపై తగ్గనున్న సుంకాలు
స్పిరిట్లపై 40 శాతం సుంకాలు
అఫ్టికల్, సర్జికల్, మెడికల్ పరికరాలపై 90 శాతం సుంకాలు
భారత్ నుంచి వెళ్లే ఈయూ విమానాలు, అంతరిక్ష నౌక ఎగుమతులపై సుంకాల తొలగింపు
యంత్రాలు 44 శాతం
రసాయనాలు 22 శాతం
ఔషధాలు 11 శాతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Leopard Latest video: సామాన్యంగా మానవులు పులిని చూస్తేనే గజ గజ మునిగిపోతూ ఉంటారు.. అలాంటిది ఏకంగా ఓ అత్యంత ప్రమాదకరమైన చిరుత పులి తోక పట్టుకొని.. అది ఇతరులపై దాడి చేయకుండా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న పోలీస్ అధికారి సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా ఎంతో నైపుణ్యం ఉన్నవారు ఇలా సులభంగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎలాంటి నైపుణ్యం లేని ఒక పోలీస్ ఆఫీసర్ ఆ పులిని పట్టుకుంటున్న తీరును చూస్తుంటే అతనికున్న ధైర్యం అంతో ఇంతో కాదని అనిపిస్తోంది. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో? ఎక్కడ జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. అయితే, ఇది ఎక్కడ జరిగిందనేది వీడియోలు పేర్కొనలేదు. కానీ ఓ నివాస ప్రాంతంలో అకస్మాత్తుగా ప్రవేశించిన చిరుత పులి స్థానికులను ఎంతగానో భయాందోళనకు గురి చేస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులతో పాటు అడవిశాఖ సిబ్బంది అధికారులు అక్కడికి వెంటనే చేరుకున్నారు.. అయితే ఈ సమయంలో వారు ఎంతో యాక్టివ్ గా ఉన్న ఆ చిరుత పులిని బంధించాలనుకున్నారు. ఈ సమయంలో ఒక పోలీస్ అధికారి తన ధైర్యాన్ని ఒక్కసారిగా పెంచుకొని.. చిరుత పులి తప్పించుకొని పారిపోతున్న సమయంలో దాని తోకను గట్టిగా పట్టుకున్నాడు.
ఆ అధికారి ఎంతో చాకచక్యంగా చిరుత పులి తోకను పట్టుకోవడం చూసిన ఇతర అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు. అయితే, ఈ సమయంలో ఆ చిరుత పులి పోలీస్ అధికారిపై ఎదురు దాడి చేయడం కూడా మీరు చూడొచ్చు.. అయినప్పటికీ ఆ పోలీస్ ఆఫీసర్ ఏమాత్రం వదలకుండా చిరుత పులి తోకను అలాగే పట్టుకొని ఉండిపోయాడు.. అయితే, అక్కడున్న కొంతమంది రోప్ సిధం సార్ అని అరుస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా అక్కడున్న పోలీస్ ఆఫీసర్ అందరూ వెనక్కి వెళ్లిపోండి అంటూ అరవడం మీరు చూడొచ్చు..
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
చివరికి అడవి శాఖ సిబ్బందితోపాటు ఇతరులు కలిసి ఆ చిరుత పులిని ఎంతో సురక్షితంగా తాళ్లతో బంధించి.. అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఎనిమిది సెకండ్ల నిడివి గల వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజమైన హీరో అంటే ఇతనే అనే క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు.. చాలామంది ఈ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా సృష్టించిందని కామెంట్లు చేస్తున్నారు. అవును మీరు ఈ వీడియోను క్లియర్గా గమనించి చూస్తే.. ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అని తెలుస్తుంది.
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BSNL 1 Rupee Offer Last Date: బీఎస్ఎన్ఎల్ (BSNL) మొబైల్ వినియోగదారులకు ఒక ముఖ్యమైన గమనిక. తక్కువ ధరకే అదనపు డేటాను అందించే పలు అద్భుతమైన ఆఫర్లకు గడువు ముగియబోతోంది. పాత ధరకే ఎక్కువ డేటా ప్రయోజనం పొందాలనుకునే వారు జనవరి 31, 2026 లోపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రైవేట్ టెలికాం సంస్థలకు పోటీగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ల ద్వారా రోజువారీ డేటా పరిమితిని పెంచారు. అయితే ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది.
అదనపు డేటా లభించే ప్లాన్లు
ఈ క్రింది ప్లాన్లలో గతంలో కంటే రోజుకు 0.5GB డేటా అదనంగా లభిస్తుంది.
| ప్లాన్ ధర | ప్రస్తుత డేటా (రోజుకు) | పాత డేటా (రోజుకు) | వ్యాలిడిటీ |
| ₹225 | 3GB | 2.5GB | 30 రోజులు |
| ₹347 | 2.5GB | 2GB | 50 రోజులు |
| ₹485 | 2.5GB | 2GB | 72 రోజులు |
| ₹2399 | 2.5GB | 2GB | 365 రోజులు |
గమనిక: అన్ని ప్లాన్లలోనూ అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితం. డేటా పరిమితి ముగిశాక ఇంటర్నెట్ వేగం 40Kbpsకి తగ్గుతుంది.
సెన్సేషనల్ ₹1 ప్లాన్ (కొత్త కస్టమర్లకు మాత్రమే)
కొత్తగా బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకునే వారికి ఈ ఆఫర్ ఒక వరం. ఈ రీఛార్జ్ ద్వారా రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, 100 SMSలు.. 30 రోజుల వ్యాలిడిటీతో రానున్నాయి. ఈ ప్లాన్తో పాటు ఉచిత సిమ్ కార్డ్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ కూడా జనవరి 31 తో ముగియనుంది.
₹251 స్పెషల్ ప్లాన్ (100GB డేటా)
ఎక్కువ డేటా అవసరమయ్యే వారి కోసం ఈ ప్లాన్ తీసుకొచ్చారు. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు ఏకమొత్తంగా 100GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో పాటు ఉచిత BiTV సబ్స్క్రిప్షన్. రోజుకు కేవలం ₹8.36 మాత్రం గానే ఉంది.
బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ అదనపు డేటా, ప్రత్యేక ప్లాన్ల ప్రయోజనం పొందాలంటే వినియోగదారులు ఫిబ్రవరి 1 లోపు తమ మొబైల్స్ రీఛార్జ్ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Price Will Great Fall: బంగారం మాట అంటేనే మండే పరిస్థితులు ఉన్నాయి. బంగారం ధర చూసి ఇప్పుడు మహిళలు తమ ఇంట్లో వారిని కొనమని అడితే పరిస్థితి లేదు. ఎందుకంటే భారీ స్థాయిలో బంగారం ధరలు పెరిగిపోతుండడం.. దానికితోడు వెండి కూడా అదే స్థాయిలో పెరిగిపోతుండడంతో మహిళలు కూడా బంగారం, వెండిపై మమకారాన్ని చంపేసుకుంటున్నారు. అయితే ఈ ధరలు ఇప్పట్లో తగ్గవా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించబోతుందని చర్చ జరుగుతోంది. కీలక నిర్ణయాలు తీసుకుంటే బంగారం రూ.లక్ష లోపు చేరుతుందని తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రవేశపెడుతున్న బడ్జెట్పై ప్రజల్లో భారీగా ఆశలు ఉన్నాయి. బడ్జెట్ నుంచి తమకు ఏం లభిస్తాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే బంగారంపై కూడా కేంద్రం తీపి కబురు వినిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం, జీఎస్టీ తగ్గిస్తే బంగారం ధర అమాంతం పడిపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఈపీఎఫ్, డీఏ కోసం పోరాటం
అమెరికా డాలర్ బలహీనంగా ఉండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే అంచనాలు ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ పరిణామాలు ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో పెట్టుబడిదారులు తమ సురక్షితమైన పెట్టుబడిగా బంగారం, వెండి అని భావిస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధరలు రోజురోజుకు వేలకు వేలు పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్యుడికి అందనంత దూరంలోకి చేరుకున్నాయి. ప్రస్తుతం తులం బంగారం దాదాపు రూ.1.65 లక్షలకు చేరుకుంటోంది. వెండి అయితే కిలో రూ.4 లక్షలు దాటేసింది.
Also Rad: Telangana PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..పీఆర్సీ అమలుపై ఆశలు గల్లంతు..ఎప్పటికి వచ్చే?!
కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న బంగారం, వెండి ధరలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుతున్నారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో బంగారం, వెండిపై తీపి కబురు ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బంగారం ధరను ప్రభావితం చేసే దిగుమతి సుంకాలు, జీఎస్టీ రేట్లను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరి విజ్ఞప్తితోపాటు దేశంలో బంగారం మార్కెట్కు ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
విదేశాల నుంచి భారతదేశం అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. బంగారంపై విధించే దిగుమతి సుంకాల ప్రభావం ధరలపై ఉంటుంది. రానున్న బడ్జెట్లో బంగారంపై విధించే దిగుమతి సుంకాన్ని తగ్గించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. సుంకాలను తగ్గిస్తే బంగారం ధరలు కాస్త తగ్గే అవకావం ఉంది. సుంకాలు తగ్గిస్తే రిటైల్ మార్కెట్ పెరగడమే కాకుండా తయారీ రంగం కూడా అభివృద్ది చెందుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
బంగారాన్ని పెట్టుబడిగా భావిస్తుండడంతో సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని తిరిగి తీసుకురావాలనే డిమాండ్ వస్తోంది. 2024లో ఈ పథకం నిలిపివేయగా తిరిగి పునరుద్దరించాలనే డిమాండ్లు వస్తున్నాయి. బంగారం అభరణాలపై ఉన్న 3 శాతం జీఎస్టీని తగ్గించాలని మహిళలు కోరుతున్నారు. 1.25 లేదా 1.5 శాతం జీఎస్టీ తగ్గించాలనే కోరుతుండగా.. అలా తగ్గిస్తే బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉంది. దిగుమతి సుంకాలు తగ్గించడం, జీఎస్టీ తగ్గించడం చేస్తే మాత్రం దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయి. మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎలాంటి ప్రకటనలు ఇస్తుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Google Data Center Vizag Foundation: విశాఖపట్నం ఐటీ హబ్గా మారే దిశలో మరో భారీ అడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ (Google) తన డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖను వేదికగా చేసుకుంది. దీనికి సంబంధించి ఫిబ్రవరిలో శంకుస్థాపన జరగనుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగ చరిత్రలో విశాఖపట్నం కేంద్రంగా ఒక భారీ పారిశ్రామిక విప్లవం మొదలుకాబోతోంది. గూగుల్తో పాటు బెంగళూరుకు చెందిన ఆర్ఎంజడ్ (RMZ) కార్పొరేషన్ కూడా ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
గూగుల్ డేటా సెంటర్ - కీలక వివరాలు
వేదిక: ఆనందపురం మండలం, తర్లువాడ పరిసర ప్రాంతాలు.
భూమి: సుమారు 308 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఏపీఐఐసీ (APIIC) ద్వారా భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ పూర్తయింది.
పరిహారం: భూమి సేకరించిన 51 మంది రైతులలో 49 మందికి ఇప్పటికే నగదు జమ చేశారు. మిగిలిన ఇద్దరికీ త్వరలోనే చెల్లింపులు పూర్తి చేయనున్నారు.
మౌలిక సదుపాయాలు: డేటా సెంటర్లకు నీటి సరఫరా అత్యంత కీలకం. దీనికోసం జీవీఎంసీ (GVMC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్ఎంజడ్ (RMZ) కార్పొరేషన్ భారీ ప్రాజెక్టు
దావోస్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. ఆర్ఎంజడ్ గ్రూపు ఏపీలో రూ.83,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. విశాఖలో ఒక గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా సెంటర్ను వీరు నిర్మించనున్నారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (GCC) మొదటి దశలో 50 ఎకరాల్లో గ్లోబల్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు భూములను పరిశీలిస్తున్నారు. ఆనందపురం మండలం జగన్నాథపురం, విజయనగరం పరిసరాలు, కాపులుప్పాడ ఐటీ లేఅవుట్లను అధికారులు ప్రతిపాదించారు.
ఈ భారీ కంపెనీల రాకతో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఐటీ మ్యాప్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోనుంది. వేల సంఖ్యలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇంజనీర్లకు ఉపాధి దొరకనుంది. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాల్లో విశాఖ కీలక కేంద్రంగా మారుతుంది.
ఫిబ్రవరిలో జరగబోయే శంకుస్థాపన కార్యక్రమం విశాఖ ఐటీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలవనుంది. సింహాచలం భూముల కేటాయింపు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న వెంటనే పనులు వేగవంతం కానున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Employees JAC Protest: మాయ మాటలతో నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వేతన సవరణ సంఘంతోపాటు ఈపీఎఫ్ జీపీఎఫ్, డీఏ, పెండింగ్ బిల్లులపై రేవంత్ రెడ్డి తీరని మోసం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులు భారీ నిరసనకు దిగారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో రెండు రోజులుగా పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్లో చేస్తున్న భారీ నిరసనపై పూర్తి వివరాలు ఇవే.
Also Rad: Telangana PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..పీఆర్సీ అమలుపై ఆశలు గల్లంతు..ఎప్పటికి వచ్చే?!
మింట్ కాంపౌంట్లో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ ఫోరం ఆధ్వర్యంలో మహా ధర్నా జరుగుతోంది. విద్యుత్ సంస్థల యాజమాన్యాల వైఖరికి నిరసనగా ధర్నా చేస్తున్నారు. బదిలీల పాలసీపై యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టారు. వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిటీ వేయాలని.. ఈపీఎఫ్ టు జీపీఎఫ్, అరిజన్ల గ్రెడ్ మార్పు చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు సాయిబాబా ప్రసంగిస్తూ.. 'బదిలీల విషయంలో సిబ్బంది సమస్యలు పరిగణలోకి తీసుకోవాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కను కోరాం. యాజమాన్యం మొండి వైఖరిగా వ్యవహరిస్తోంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మహా ధర్నా తలపెట్టాం' అని వివరించారు. తాము చేసే డిమాండ్లతో యాజమాన్యంపై ఎలాంటి భారం పడదని స్పష్టం చేశారు.
Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి
జేఏసీ మరో నాయకుడు శివాజీ మాట్లాడుతూ.. 'కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలో 10 వేల మందికి పైగా మహా ధర్నాకు తరలివచ్చారు. ఐఏఎస్ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది, ప్రభుత్వం పక్షాన ఉండాలి కానీ వారు ఆ విషయాలనే పట్టించుకోవడం లేదు. సీఎండీ ప్రవర్తన జేఏసీ నేతలకు ఆందోళన కలిగించింది. సమస్యల పరిష్కారం కోసం స్పందించాలని కోరితే స్పందించడం లేదు. ఎస్పీడీసీఎల్ సీఎండీ అహంకారపూరిత వ్యవహారశైలితో వ్యవహరిస్తున్నారు' అని ఆరోపించారు. ఉద్యోగస్తులను, ఉద్యోగ సంఘాల నేతలను బానిసలుగా, ఆర్టిజన్లను కట్టు బానిసలుగా చూస్తున్నారని విమర్శించారు. 'సీఎండీ నేను నా ఇష్టం అన్న చందంగా వ్యవరిస్తున్నారు. ఎస్పీడీసీఎల్లో ఆంధ్రా ఆధిపత్యం కొనసాగుతుంది' అని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
'సాధారణ బదిలీల పై యాజమాన్యానికి రెండు జేఏసీలు వినతిపత్రం ఇచ్చాయి. అన్ని సమస్యల పరిష్కారాల కోసం పనిచేస్తాం. బదిలీ పాలసీ అనేది చిన్న సమస్య ఆత్మగౌరవ సమస్య. కష్టపడి పని చేయడానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ మా గౌరవాన్ని తగ్గించొద్దు. మా కష్టఫలితంగానే సంస్థ మనుగడ సాధిస్తోంది. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలతో చర్చలు చేయాలి'
- రత్నాకర్ రావు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook