icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
SShankerreddyFollow27 Jul 2024, 03:17 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

BRS Party Anniversary: రేపు తెలంగాణలో పల్లె పల్లెనా గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్‌ పిలుపు

Baddipadaga, Telangana:

BRS Party Anniversary Celebrations: పద్నాలుగేళ్లు పోరాటం.. పదేళ్లు అధికారం.. రెండున్నరేళ్లు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ రేపు 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నది. పార్టీ ఆవిర్భావ దినం కావడంతో రేపు అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయాలని గులాబీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి గ్రామం పట్టణం నియోజకవర్గం జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని కోరారు.

Also Read: Sunrisers Hyderabad: వైభవ్‌ సెంచరీ వృథా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా నాలుగో విజయం

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో ఆదివారం కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని తెలిపారు. ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు వివరణ ఇచ్చారు.

Also Read: RCB vs GT: బెంగళూరు దూకుడుకు తేలిపోయిన సాయి సుదర్శన్‌ సెంచరీ.. గుజరాత్‌ టైటాన్స్‌ మరో ఓటమి

పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణ భవన్‌లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని.. ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరుకావాలని, మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం, మండలం, పట్టణం, జిల్లా కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉదయాన్నే స్థానిక ప్రాంతాల్లో జెండా పండుగ ముగించుకుని మధ్యాహ్నం 1:30 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవాలని దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులకు సూచించారు. హైదరాబాద్‌లో జరగనున్న పార్టీ ఆవిర్భావ సమావేశంలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక ప్రసంగం చేయనున్నారు. కుదిరితే విలేకరుల సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Petrol And Diesel Crisis: పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభంపై ముంబై నుంచే సీఎం చంద్రబాబు రివ్యూ

Mumbai, Maharashtra:

AP Petrol And Diesel Crisis: పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పెట్రోల్‌ బంకులకు ఎగబడుతున్నారు. పెట్రోల్‌, డీజిల కొరత కారణంగా ప్రజలు భారీగా చేరుకుని బంక్‌లపై దాడి చేసే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి తీవ్రంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ముంబై పర్యటనలో ఉన్న చంద్రబాబు ఏపీలోని పరిస్థితిపై సమీక్ష చేశారు.

Also Read: Curry Point: రూ.10కి సాంబార్‌ ఇవ్వరా? అంటూ కర్రీ పాయింట్‌పై తల్వార్‌తో దాడి

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముంబై నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ముంబై నుంచి ఉదయం అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తోపాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సరఫరా ఎలా ఉందనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Also Read: Sunrisers Hyderabad: వైభవ్‌ సెంచరీ వృథా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా నాలుగో విజయం

రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా.. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సరఫరా గతం కంటే పెరిగినా కొరత ఏర్పడిందనే భయంతో వినియోగదారులు కొనేందుకు ఎగబడడంతో అకస్మాత్తుగా డిమాండ్ పెరిగిందని అధికారులు తెలిపారు. పెట్రోలియం సంస్థలు శనివారం రోజున 10,345 కి.లీ పెట్రోల్, 14,156 కి.లీ డీజిల్‌ను డీలర్లకు సరఫరా చేసినట్టు వివరించారు. కొరత ఏర్పడిందనే ఆందోళనతో పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు.

Also Read: Drug Overdose: పెళ్లికి ముందే కాబోయే భార్యతో 'కార్యం'.. ఆత్రుతలో వయగ్రా ఎక్కువ తీసుకుని మరణం

సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 6330 కిలో లీటర్ల పెట్రోల్ విక్రయాలు ఉంటే.. శనివారం రోజున 8,489 కిలో లీటర్ల అమ్మకాలు జరిగాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. డీజిల్ విషయంలో కూడా సాధారణ అమ్మకాల కంటే శనివారం రోజున ఎక్కువ జరిగాయని తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 9,048 కిలో లీటర్ల డిజీల్ అమ్ముతారని కానీ శనివారం రోజున 10,556 కిలో లీటర్ల డీజిల్ విక్రయించారని వెల్లడించారు.

సాధారణ స్థాయిని మించి అమ్మకాలు జరగడంతో కొన్ని బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా సరఫరా పెరిగినా వినియోగదారులు కొన్ని చోట్ల బారులు తీరి పెట్రోల్‌, డీజిల్‌ కోసం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆక్వా రంగంలో డ్రమ్‌లలో కొనుగోళ్లు చేస్తున్నారని.. వారికి పెట్రో ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందని అధికారులు వెల్లడించారు. దీనికి పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు, ఫిషరీష్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై తనకు నివేదిక ఇవ్వాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రం వచ్చిన అనంతరం తిరిగి పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభంపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష చేసి.. పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేకుండా చర్యలు తీసుకోనున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Python Vs Mongoose Video: భారీ కొండచిలువపై ముంగిసల సర్జికల్ స్ట్రైక్.. చూస్తే ఒళ్లు గగుర్పొడాల్సిందే! వీడియో..

Hyderabad, Telangana:

Giant Python Video Watch Here: ప్రకృతిలో మనుగడ కోసం జరిగే పోరాటం ఒక్కొక్కసారి ఊహకందని విధంగా ఉంటుందని మనందరికీ తెలుసు.. సాధారణంగా పాములు చూడగానే ముంగిస దాడి చేయడం మనం తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలో చూశాం.. కానీ ఒక భారీ కొండచిలువను ముంగిసలు గుంపు వేటాడి.. పీక్కుతిన్న అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అంత పెద్ద కొండచిలువ పామును చిన్న ముంగిసల దండు వేటాడిన తీరును చూసి కామెంట్లు కూడా చేస్తున్నారు.

సాధారణంగా కొండచిలువ తన భారీ శరీరంతో ఎంతటి జంతువునైనా సులభంగా మింగేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిందని భావించవచ్చు.  అడవి మార్గంలో వెళ్తున్న ఒక భారీ కొండచిలువపై ఒక్కసారిగా ముంగిసల గుంపు దాడికి దిగింది.. ఒకటో రెండో కాదు ఏకంగా పదుల సంఖ్యలో ముంగిసలు ఏకమై ఆ పామును చుట్టుముత్తాయి.. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ కొండచిలువ తన భారీ శరీరంతో ఎదురు దాడికి ప్రయత్నించినప్పటికీ.. ముంగిసల వేగం ముందు అది నిల్వ లేకపోయింది..

 
 
 
 
 

ఈ వీడియోలో అత్యంత భయంకరమైన దృశ్యం ఏంటంటే.. ముంగిసలు గుంపుగా చేరి పాము శరీరాన్ని పదునైన పళ్ళతో కొరుకుతూ మాంసాన్ని పీక్కు తినడం.. కొండచిలువ ఎంత ప్రయత్నించినా.. ఆ గుంపు నుంచి తప్పించుకోలేకపోయింది.. ముంగిసలు వ్యూహాత్మకంగా పాము తోక వైపు నుంచి తల వైపు ఒకేసారి దాడి చేస్తూ దానిని నిస్సహాయ స్థితిలో పడేసాయి. ముఖ్యంగా తోక భాగంలో అత్యధికంగా ముంగిసలు దాడి చేయడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ ముంగిసలు ఏమాత్రం వదలకుండా దానిని దాడి చేస్తున్న తీరును చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Read more: Monkey Video: ముస్లిం వివాహంలో వింత ఘటన.. తోడు పెళ్లికొడుకులా మారిన కోతి.. వీడియో!

ఐకమత్యమే మహాబలం అనడానికి ఈ వీడియో నిదర్శనం.. అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అయితే, ఈ ఘటన ఏదో అడవికి సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు తమ స్మార్ట్‌ఫోన్స్‌లో ఈ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటినుంచి ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. సాధారణంగా పాములు ముంగిసలతో పోరాడడం చాలా కష్టం.. అయినప్పటికీ ఈ వీడియోలో కొండచిలువ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వాటితో పోరాడడం చూసి.. సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Read more: Monkey Video: ముస్లిం వివాహంలో వింత ఘటన.. తోడు పెళ్లికొడుకులా మారిన కోతి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

0
0
Report

Curry Point: రూ.10కి సాంబార్‌ ఇవ్వరా? అంటూ కర్రీ పాయింట్‌పై తల్వార్‌తో దాడి

Miyapur, Telangana:

Curry Point Attack: సాయంత్రం పూట హైదరాబాద్‌లోని ఓ కర్రీ పాయింట్‌లో కస్టమర్‌ వచ్చాడు. అక్కడి సిబ్బందిని రూ.10కు కర్రీ ఇవ్వాలని కోరాడు. పది రూపాయలకు కర్రీ ఇవ్వమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో సిబ్బందితో వాగ్వాదం చేసిన కస్టమర్‌.. కొద్దిసేపటికి తల్వార్‌ తీసుకువచ్చి దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా దాడికి పాల్పడడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్‌ శివారులోని అమీన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

Also Read: Sunrisers Hyderabad: వైభవ్‌ సెంచరీ వృథా.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుసగా నాలుగో విజయం

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  బీరంగూడ ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఓం శ్రీ సాయి కర్రీ పాయింట్ ఉంది. అదే ప్రాంతంలోని అంబేద్కర్ కాలనీ కి చెందిన జీవ రత్నం శనివారం రాత్రి వద్ద కర్రీ పాయింట్‌కు వచ్చాడు. 10 రూపాయలకు సాంబార్‌ ఇవ్వాలని అడిగాడు. పది రూపాయలకు ఏ కర్రీ ఇవ్వలేమని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతలో బయటకు వెళ్లి వచ్చి తల్వార్‌ కర్రీ పాయింట్‌కు వచ్చి దాడి చేశాడు.

Also Read: Drug Overdose: పెళ్లికి ముందే కాబోయే భార్యతో 'కార్యం'.. ఆత్రుతలో వయగ్రా ఎక్కువ తీసుకుని మరణం

దుకాణం షట్టర్‌ మూసివేసి మరి కర్రీ పాయింట్‌లో ఉన్న వారిపై తల్వార్‌తో విచక్షణారహితంగా దాడి చేశాడు. అతడి దాడిలో కర్రీ పాయింట్‌లో పనిచేసే ఉదయ్ (27) తీవ్ర గాయమైంది. దీంతో కర్రీ పాయింట్‌లోని సిబ్బంది ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అతడు చికిత్స పొందుతున్నాడు. కర్రీ పాయింట్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

24 గంటల్లోనే పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు నివాసితురాలు అఖిల హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఈనెల 23వ తేదీన రాత్రి కేపీహెచ్‌బీలోని నెక్సస్ మాల్‌లో తన బ్రేస్‌లెట్ పోగొట్టుకున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గంటల్లోనే బ్రేస్‌లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్రేసలెట్‌ను అఖిలకు అందజేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Giant Python Video: నడిరోడ్డుపై 15 అడుగుల కొండచిలువ.. వామ్మో ఎలా ఉందో చూడండి..

Hyderabad, Telangana:

Giant Python On Highway Viral Video Watch Here: ఆ రోడ్డు ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉంటుంది.. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో వేగంగా దూసుకెళ్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.. అక్కడి పరిస్థితి చూసి డ్రైవర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.. కారణం.. రోడ్డుపై ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని కాదు.. ఒక భారీ కొండచిలువ ఎలాంటి భయం లేకుండా రోడ్డు దాటుతుండటమే.. అవును దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

నడి రోడ్డుపై దాదాపు 12 నుంచి 15 అడుగుల పొడవు ఉన్న ఒక భారీ కొండచిలువ అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది.. పక్కనే ఉన్న అడవుల నుంచి రోడ్డుపైకి వచ్చి హంగామా సృష్టించింది. ఏమాత్రం తొందరపడకుండా ఆ ప్రమాదకరమైన పాము హైవే దాటడం మొదలుపెట్టింది. దీనిని గమనించిన వాహనదారులు ఒక్కసారిగా షాక్కు గురైపోయారు. కొందరు భయంతో కార్ల అద్దాలు మూసుకగా.. వరి కొందరు ఆశ్చర్యంతో తమ వాహనాలను నిలిపివేసి ఈ దృశ్యాలను తమ స్మార్ట్ ఫోన్స్ లో చిత్రీకరించారు..

ఈ భారీ పైథాన్ రోడ్డుకు అడ్డంగా పడుకోవడంతో రెండు వైపులా వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కొండచిలువను చూసేందుకు జనం ఎగబడడంతో పాటు ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడంతో కొన్ని మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. సాధారణంగా అడవి ప్రాంతాల్లో కనిపించే ఇలాంటి జీవి.. ఇరా జనాభాసాల మధ్య ఉండే హైవే పైకి రావడం స్థానికంగా ఎంతో కలకలం రేపింది..

Read more: Monkey Video: ముస్లిం వివాహంలో వింత ఘటన.. తోడు పెళ్లికొడుకులా మారిన కోతి.. వీడియో!

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలు స్పందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఈ వీడియో చూసి కామెంట్లలో స్పందిస్తూ వస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పెద్ద పాములు రోడ్లమీదకి రావడం సర్వసాధారణం కాదని కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇక మరికొంతమంది రద్దీగా ఉండే రోడ్లపై ఇలాంటి ప్రమాదకరమైన జీవులు రావడం ఆందోళనకరమని.. ప్రకృతిని మానవాళి నాశనం చేయడం కారణంగానే ఇలాంటి జీవులు రోడ్లపైకి వస్తున్నాయని కామెంట్లలో చెబుతూ వస్తున్నారు. అయితే అక్కడున్న స్థానికులు వెంటనే అడవిశాఖ సిబ్బందికి కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Read more: Monkey Video: ముస్లిం వివాహంలో వింత ఘటన.. తోడు పెళ్లికొడుకులా మారిన కోతి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Monkey Video: ముస్లిం వివాహంలో వింత ఘటన.. తోడు పెళ్లికొడుకులా మారిన కోతి.. వీడియో!

Hyderabad, Telangana:

 Muslim Wedding Video Watch Here: సాధారణంగా పెళ్లిలో బంధుమిత్రుల సందడితో పాటు  బాజాభజంత్రీల హోరు కనిపిస్తూ ఉంటుంది. పెళ్లి రెండు రోజులు ఇది సర్వసాధారణమే. కానీ తాజాగా ఒక ముస్లిం యువకుడి వివాహ వేడుకలు ఎవరు ఊహించని సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు పక్కన స్నేహితుడో, బంధువు కూర్చోవడం ఒక ఆనవాయితీ. అయితే, ఇక్కడ మాత్రం ఒక కోతి వచ్చి పెళ్లికొడుకు పక్కనే తోడు పెళ్లి కొడుకులా.. కూర్చొని అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ గా మారింది. 

ఒక ముస్లిం యువకుడి వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది.. బంధు మిత్రులందరికీ వేదికపై సందడి చేస్తున్నారు. సరిగ్గా పెళ్లి తంతు కొనసాగుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ.. ఒక కోతి హఠాత్తుగా వేదిక పైకి ప్రవేశించింది. అయితే, అక్కడ ఉన్న వారిని చూసి ఆ కోతి త్వరలోనే వెళ్ళిపోతుందనుకున్నప్పటికీ.. నేరుగా ప్రశాంతంగా పెళ్ళికొడుకు పక్కన ఖాళీగా ఉన్న చోట కూర్చుండిపోయింది..

ముస్లిం సాంప్రదాయ ప్రకారం.. పెళ్ళికొడుకు తలపాక ధరించి ఉండగా.. ఆ కోతి కూడా అతనిని ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా పక్కనే కూర్చుని ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా కోతులు గుంపులు కనిపిస్తేనే అల్లరి చేయడం, వస్తువులను లాక్కొని వెళ్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ కోతి మాత్రం ఎంతో క్రమశిక్షణతో కూర్చొని చుట్టూ జరుగుతున్న ఆ వేడుకను ఆసక్తిగా గమనిస్తూ ఉండిపోయింది. ఇది చూసిన పెళ్లి పెద్దలతో పాటు బంధువులు తులత ఆందోళన చెందినప్పటికీ.. ప్రవర్తన చూసి ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది.

 
 
 
 
 

Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!

ఇది నిజంగా అల్లా పంపించిన అతిథి ఉండు ఉంటుందని అక్కడ ఉన్నవారు గుసగుసలాడుకోవడం మీరు చూడొచ్చు. ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడివారు తమ మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కోతి రూపంలో దేవుడు ఆశీర్వదించడానికి వచ్చాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఇలాంటి వింతలు మేము ఎప్పుడూ చూడలేదని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.

Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

0
0
Report

Karimnagar: 44 డిగ్రీలు దాటిన భానుడి భగభగ.. కరీంనగర్ కాగుతోంది.. జగిత్యాల మండుతోంది!

Hyderabad, Telangana:

Karimnagar Heatwave Alert Telugu News: ఇప్పటికే రాష్ట్రంలో సూర్యుడి ప్రతాపం మామూలుగా లేదు. కొన్నిచోట్ల ఎండలు రికార్డు స్థాయిలను దాటి కొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. దీని కారణంగా చాలామంది ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక అప్పుడప్పుడు ఇదే సమయంలో ఎండలతో పాటు సాయంత్రం వేళలో వర్షం కూడా కురుస్తూ వస్తోంది. ఈదుడు గాలులతో కూడిన వర్షం కురుస్తూ పంటలకు, రైతన్నలకు ఊహించని స్థాయిలో నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఒకవైపు ఎండలతో పాటు మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో చాలామంది ఈ సమయంలో అనారోగ్య సమస్యల పారిన పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎండల కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సూర్యుడి ప్రతాపం  మామూలుగా చూపించడం లేదు. వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో జనం విలవిలలాడిపోతున్నారు. శనివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు చూస్తుంటే జిల్లా నిప్పుల కొలిమిలా తలపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి ఎండల తీవ్రత మొదలై.. మధ్యాహ్ననానికి వడగలుపులతో జనజీవనం స్తంభించిపోయేలా చేస్తోంది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జగిత్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా రాఘవపేట తో పాటు మేడిపల్లి ప్రాంతాల్లో ఏకంగా 43. 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డింగ్ రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతాలుగా నిలిచాయి. అటు పెద్దపల్లి జిల్లాలోని కామంపూర్ తో పాటు కల్వచర్ల ప్రాంతాల్లో 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం..

Also Read: Vaibhav Sooryavanshi Record: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సూర్యవంశీ..గేల్, రైనా రికార్డులు బ్రేక్!

ఈ ఎండలు కాలం ప్రారంభంలోనే ఇంత మెట్టుగా కొడుతుంటే.. రాబోయే రోజుల్లో వీటి ప్రభావం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ఎండకు బయట తిరిగేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అవసరమైతే తప్ప 11:00 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రావద్దని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బయట తిరిగేవారు తప్పనిసరిగా కొబ్బరినీళ్ళతో పాటు మజ్జిగ నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. వడదెబ్బ తగిలినట్లు అనిపిస్తే వెంటనే దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య  కేంద్రానికి వెళ్లడం మంచిది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వుండి బయటి పనులు చేసుకోవడం చాలా మంచిది.

Also Read: Vaibhav Sooryavanshi Record: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సూర్యవంశీ..గేల్, రైనా రికార్డులు బ్రేక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

White House Suspect: ట్రంప్‌పై దాడి చేయబోయిన వ్యక్తి ఇతనే! 'మానసిక రోగి' అని వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు!

Washington, District of Columbia:

White House Shooting Suspect: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన విందు కార్యక్రమంలో ఓ సాయుధుడు భద్రతా వలయాన్ని దాటి హాల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే అతడ్ని అడ్డుకున్నారని ట్రంప్ తెలిపాడు. ఇందులో భాగంగా ఓ అధికారి కాల్పులకు గురయ్యాడు. కానీ, అధికారి ధరించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల అతని ప్రాణాలు నిలిచాయి. 

శనివారం సాయంత్రం వాషింగ్టన్ హిల్టన్‌లో గందరగోళం చెలరేగిన ఈ ఘటన తర్వాత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిన్నర్ ఘటనలో పాల్గొన్న షూటర్ వీడియోను, అదుపులోకి తీసుకున్న నిందితుడి చిత్రాలతో పాటు పంచుకున్నారు. హోటల్ లాబీలో కాల్పులు జరిగినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ భయాందోళనలు చెలరేగి, విందుకు హాజరైన ట్రంప్, ఇతర ఉన్నతాధికారులను వెంటనే ఖాళీ చేయించాల్సి వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు అతని భార్య మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లను భద్రతా బలగాలు బాల్‌రూమ్ నుండి వేగంగా బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించాయి.

ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. నిందితుడిని పట్టుకున్నామని, అతడిని "తీవ్ర మానసిక రోగి" అంటూ వ్యాఖ్యానించాడు. అధికారులు ఆ వ్యక్తి అపార్ట్‌మెంట్‌లో సోదాలు చేశారని, నిందితుడు కాలిఫోర్నియా నివాసి అని ఆయన తెలిపారు. నిందితుడు అనేక ఆయుధాలతో ఉన్నాడని, సీక్రెట్ సర్వీస్ అధికారులు అడ్డుకునే ముందు ఒక భద్రతా చెక్‌పాయింట్‌పైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించాడని ట్రంప్ చెప్పారు. ఈ ఘర్షణలో ఒక అధికారిపై కాల్పులు జరిగాయి. కానీ అతను ధరించిన బుల్లెట్ ప్రూఫ్ ప్రాణాలను కాపాడింది. 

ట్రంప్ ఇలాంటి భద్రతా ముప్పును ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. జూలై 2024లో, పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఒక ప్రచార ర్యాలీలో, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో, సభా ప్రాంగణం వెలుపల ఎత్తైన ప్రదేశం నుండి ఒక దుండగుడు పలుమార్లు కాల్పులు జరపడంతో ఆయన హత్యాయత్నం నుండి ప్రాణాలతో బయటపడ్డారు.

ఆ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్ళగా, వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను వేదికపై నుండి కిందకు తీసుకువచ్చి, ఒక సురక్షితమైన వాహనశ్రేణిలో ఎక్కించారు. ఈ సంఘటన ఎన్నికల ప్రచార సమయంలో తీవ్రమైన భద్రతా ఆందోళనలను రేకెత్తించింది. ఇటీవలి చరిత్రలో ఒక అమెరికా అధ్యక్ష అభ్యర్థిపై జరిగిన అత్యంత తీవ్రమైన దాడులలో ఒకటిగా మిగిలిపోయింది.

Also Read: Attack On Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం..వైట్‌హోస్‌లో కాల్పుల కలకలం..

Also Read: AP Fuel Crisis: రాష్ట్రంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత..బంకుల ముందు బారులు తీరిన వాహనాలు..సీఎం కీలక ఆదేశాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

May 2026 Horoscope: మే నెలలో ఈ 4 రాశుల వారికి గోల్డెన్ పీరియడ్.. అదృష్టం మామూలుగా ఉండదు!

Hyderabad, Telangana:

May 2026 Horoscope Latest News: మే నెలలో ఎన్నో రకాల శక్తివంతమైన గ్రహాలు సంచారాలు చేయబోతున్నాయి. అలాగే ఈ సమయంలో నక్షత్ర సంచారాలు కూడా జరుగుతాయి. దీనికి తోడు గ్రహ సంయోగాలు కూడా జరగబోతున్నాయి. దీని కారణంగా మనిషి జీవితాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా సూర్యుడితో పాటు అంగారకుడు బుధుడు గ్రహాల కలయిక కారణంగా ఈ సమయంలో మహాగోచారం జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గోచారం ఎన్నో శక్తివంతమైన గ్రహాల కలయిక కారణంగానే ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో మూడు గ్రహాల కలయిక కారణంగానే ఇది ఏర్పడబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా 12 రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. అదే విధంగా నాలుగు రాశుల వారికి మాత్రం గోల్డెన్ పిరియడ్‌ ప్రారంభం కాబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆయా రాశుల వారికి అనుకోని ధన లాభాలు కూడా కలగబోతున్నాయి. 

మే నెలలో సూర్యుడు తన ఉచ్చ స్థితిలో నుంచి వృషభరాశిలోకి ప్రవేశించగా.. కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలో అడుగుపెట్టబోతున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా తన గమనాన్ని మార్చుకోవడం వల్ల ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది. దీనివల్ల ధన లాభాలు కలగడమే కాకుండా ఇప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి పరిష్కారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌ఫాట్‌:
మేషరాశి 
కుజుడు సొంత రాశిలోకి వెళ్లడం కారణంగా మేష రాశి వారికి ధైర్య సాహసాలు విపరీతంగా పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తి అవడమే కాకుండా.. ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించడమే కాకుండా.. వేతనాల పెంపు కూడా ఉండబోతోంది. దీని కారణంగా అనుకున్నంత స్థాయిలో వేతనాలు కూడా పొందగలుగుతారు.

వృషభ రాశి 
సూర్యుడి ప్రభావంతో వృషభ రాశి వారికి ప్రభుత్వ రంగ పనుల్లో వస్తున్న సమస్యల నుంచి పరిష్కారం లభించి.. అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో ధన లాభాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో సుఖశాంతోషాలు కూడా నెలకొంటాయి. ముఖ్యంగా మానసిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడి ఎంతో ఆనందంగా ఉంటారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మిథున రాశి 
బుధుడి అనుగ్రహం వల్ల మిధున రాశి వారికి విపరీతంగా తెలివితేటలు పెరగబోతున్నాయి. దీని కారణంగా ఆలోచనత్మకంగా పనులు చేసి అనుకున్న పనుల్లో అఖండ విజయాలు సాధించగలుగుతారు. నూతన ఆదాయ వనరులు కూడా చాలావరకు లభించబోతున్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. 

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కెరీర్ పరంగా గొప్ప గొప్ప అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఉన్నతాధికారుల సపోర్టుతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో హోదా పెరగడమే కాకుండా.. భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. అంతేకాకుండా అనుకున్నంత స్థాయిలో ధన లాభాలు కూడా సొంతం చేసుకోగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

AP Fuel Crisis: రాష్ట్రంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత..బంకుల ముందు బారులు తీరిన వాహనాలు..సీఎం కీలక ఆదేశాలు!

Vijayawada, Andhra Pradesh:

Fuel Crisis In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడింది. సడెన్‌గా దాదాపుగా అన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డు వెలిసింది. అయితే కొన్ని చోట్ల కేవలం రూ.500లకే పెట్రోల్ ఫిల్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నో స్టాక్ బోర్డులు వెలసిన నేపథ్యంలో వాహనాదారుల్లో ఆందోళన నెలకొంది. ఏపీలో ఇంధన కొరతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలోని బంకు యజమానులతో చర్చలు జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

ఏపీ వ్యాప్తంగా శుక్రవారం నుంచి నో స్టాక్ బోర్డులు అక్కడక్కడ కనిపించగా.. శనివారం నాటికి ప్రతి జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది.  ఇంధనం కోసం వాహనాదారులు బంకుల ఎదుట బారులు తీరారు. దీంతో రోడ్లపై పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కాకినాడ, విజయవాడతో పాటు గోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇంధన కొరత తీవ్రంగా ఏర్పడింది. పంట కోతకు వచ్చిన సమయంలో ఈ కొరత రైతులతో పాటు ఇతర వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అదే విధంగా ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల సాధారణ ప్రజలకు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. 

కొన్నిచోట్ల పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండగా.. అది కూడా కేవలం రూ.500 మాత్రమే ఫిల్ చేసేందుకు బంకు యజమానులు రూల్ పెట్టారు. పెట్రోల్ అడపాదడపా అక్కడక్కడ బంకుల్లో అందుబాటులో ఉన్నా.. డీజిల్ మాత్రం ఎక్కడ లభించకపోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో నో స్టాక్ బోర్డులు వెలియడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. పెట్రోల్, డీజిల్ సరఫరాపై నిజంగా కొరత ఉందా? లేదా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారా? అనే అంశంపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు. కావాలని కొరత ఏర్పడేలా చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయా జిల్లాల కలెక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ కొరత ఏర్పడిందని బంకుల యజమానులు అంటున్నారు. ఇంతకు ముందు ఇంధన సరఫరా కంపెనీలు స్థానిక డీలర్లకు అప్పుగా పెట్రోల్, డీజిల్ సప్లయ్ చేసేవారని యజమానులు చెబుతున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుగా ఇవ్వడం లేదని దీంతో కొరత ఏర్పడుతుందని వారు స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు పైస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నో స్టాక్ బోర్డుల వెనుక కారణాన్ని తెలుసుకొని..సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ సరఫరా కంపెనీలతో పాటు బంకుల యజమానులతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చూడాలని తెలియజేశారు. 

Also Read: Attack On Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం..వైట్‌హోస్‌లో కాల్పుల కలకలం..

Also Read: Vaibhav Sooryavanshi Record: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సూర్యవంశీ..గేల్, రైనా రికార్డులు బ్రేక్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Attack On Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం..వైట్‌హోస్‌లో కాల్పుల కలకలం..

Washington, District of Columbia:

Firing In White House: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పులు జరిగాయి. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర అగ్రశ్రేణి అమెరికా నాయకులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రాంగణంలోని బల్లల కింద దూరారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. ఘటనపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది. 

శనివారం రాత్రి జరిగిన డిన్నర్‌లో పెద్ద శబ్దాలు వినిపించడంతో, డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్‌లను హుటాహుటిన బయటకు తరలించారు. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చోటుచేసుకున్నాయి. ప్రాంగణంలో భయాందోళనలు వ్యాపించడంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అధ్యక్షుడు, ప్రథమ మహిళను వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శబ్దాలు మారుమోగుతుండగా, డిన్నర్‌కు హాజరైనవారు వెంటనే మాట్లాడటం ఆపేశారు. 

వందలాది మంది అతిథులు బల్లల కిందకు దూరగా.. సైనిక దుస్తులు ధరించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు భోజనశాలలోకి ప్రవేశించారు. ఏజెంట్లు వారిని హాలు నుంచి బయటకు తీసుకువెళ్లే ముందు ట్రంప్, అతని భార్యను వేదిక వెనుకవైపు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో 2,600 మంది అతిథులు పాల్గొన్నట్లు సమాచారం. 

ఈ ఘటనతో సంబంధం ఉన్న ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని, అతను బతికే ఉన్నాడని పరిస్థితిపై వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న షూటర్‌ను పట్టుకున్నట్లు ట్రంప్ తర్వాత ధృవీకరించారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన అనుమానితుడిని పట్టుకున్నారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడం సహా భద్రతా సిబ్బంది వేగవంతమైన చర్యను ప్రశంసించారు.

Also Read: Vaibhav Sooryavanshi Record: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సూర్యవంశీ..గేల్, రైనా రికార్డులు బ్రేక్!

Also Read: Trisha Cross Symbol: హీరో విజయ్ కోసం మతం మారిన త్రిష? సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా? వీడియోలో బట్టబయలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Vaibhav Sooryavanshi Record: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సూర్యవంశీ..గేల్, రైనా రికార్డులు బ్రేక్!

Hyderabad, Telangana:

Vaibhav Sooryavanshi Record In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రస్తుత లీగ్‌లో యువ ఆటగాళ్లు రాణిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీగా సెంచరీలతో విజృంభిస్తున్నారు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకరమైన శతకం సాధించి.. దిగ్గజాలైన క్రిస్ గేల్, సురేష్ రైనా, ట్రావిస్ హెడ్‌ల రికార్డులను సమం చేశాడు.

నిన్నటి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్‌లో రెండవ శతకాన్ని కేవలం 36 బంతుల్లోనే సాధించాడం విశేషం. మొత్తం 37 బంతులు ఎదుర్కోగా అందులో 12 సిక్సర్లు, 5 ఫోర్ల సహాయంతో 103 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 278.37గా ఉండటం గమనార్హం.

వైభవ్ సూర్యవంశీ సాధించిన మూడు రికార్డులు ఇవే..
1. అభిషేక్ శర్మ సిక్సర్లు రికార్డు సమం..

ఒకే ఇన్నింగ్స్‌లో 10కి పైగా సిక్సర్లు కొట్టిన ఘనతను వైభవ్ రెండోసారి సాధించాడు. దీనితో, ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతను అత్యధికంగా (2 సార్లు) సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో అతను అభిషేక్ శర్మతో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని పంచుకున్నాడు. ఈ ఘనతను 4 సార్లు సాధించిన వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

2. పవర్‌ప్లేలో దూకుడు..గేల్, రైనా రికార్డు..
వైభవ్ సూర్యవంశీ పవర్‌ప్లే దశలో ఏకంగా 7 సిక్సర్లు కొట్టాడు. దీనితో పవర్‌ప్లేలో ఒకే ఇన్నింగ్స్‌లో చెరో 6 సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్, సురేష్ రైనా, ట్రావిస్ హెడ్‌ల రికార్డును అతను అధిగమించాడు. వైభవ్ ఇప్పుడు సనత్ జయసూర్య, అభిషేక్ శర్మ వంటి దిగ్గజాల సరసన చేరాడు.

3. టీ20లో అత్యంత వేగంగా 1,000 పరుగులు
వైభవ్ కేవలం 26 ఇన్నింగ్స్‌లలోనే 1,000 టీ20 పరుగులు పూర్తి చేసి ఫిలిప్ హ్యూస్, మహమ్మద్ వసీంల రికార్డును సమం చేశాడు. ముఖ్యంగా ఈ మైలురాయిని అత్యధిక బంతులు (473 బంతులు) వేసి చేరుకున్న అత్యంత వేగవంతమైన బ్యాట్స్‌మెన్ అతనే కావడం గమనార్హం. 

మరోవైపు నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటర్ కేఎల్ రాహుల్ అజేయంగా 152 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు రాహుల్ పేరిట ఉంది. ఇది రాహుల్ ఐపీఎల్ కెరీర్‌లో ఆరో సెంచరీ కాగా, మొత్తం టీ20 కెరీర్‌లో ఎనిమిదో సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో రాహుల్, రోహిత్ శర్మ, సంజు సామ్సన్‌ల రికార్డులను సమం చేయడమే కాకుండా.. ఇషాన్ కిషన్, సురేష్ రైనా, రిషబ్ పంత్, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ల రికార్డులను కూడా అధిగమించాడు.

Also Read: Trisha Cross Symbol: హీరో విజయ్ కోసం మతం మారిన త్రిష? సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా? వీడియోలో బట్టబయలు!

Also Read: Sahil Parakh Injury: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్‌కు తీవ్ర గాయం..రక్త ధారలా కారడంతో వెంటనే ఆస్పత్రికి తరలింపు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top