icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
SShankerreddyFollow27 Jul 2024, 03:17 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Harish Rao: హిట్లర్‌కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పడుతుంది: హరీశ్‌ రావు

Warangal, Telangana:

Wargangal BRS Party Meeting: 'సర్‌ ప్రక్రియలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అభిమానుల ఓట్లు మిస్ కాకుండా చూసుకోవాలి. ఎవరిదైనా ఓటు మిస్ అయితే హైకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది. ఎవరైతే బాధ్యత తీసుకొని పని చెయ్యకపోతే తల్లికి ద్రోహం చేసినట్లు అవుతుంది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ అయితే బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు.

అంత మన మంచికి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక ప్రసంగం చేశారు. 'సర్‌ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలగిస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఓట్ల ఏరియాతో కొన్ని పార్టీలను దెబ్బతీశాయని వార్తలు వచ్చాయి. ఒక రాజకీయ పార్టీగా పోలింగ్ బూత్‌లలో మనం ఏం చేయాలో ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ శ్రేణులు ఎంత చురుగ్గా పాల్గొంటే రేపు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అంత మంచి మనకి జరుగుతుంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కార్పొరేటర్‌గా పనిచేసిన వాళ్లు, కార్పొరేటర్‌గా పోటీ చేయాలనుకునే వాళ్లు చాలా యాక్టివ్‌గా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉందని గుర్తుచేశారు.

రేవంత్ రెడ్డికి అంతే గతి
హిట్లర్‌కి ఏ గతి అయితే పట్టిందో రేవంత్ రెడ్డికి అంతే గతి పడుతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్‌ రావు హెచ్చరించారు. గురుకుల పాఠశాలల్లో అవినీతి, సింగరేణిలో అవినీతి, హ్యామ్ మోడల్ రోడ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అవినీతిమయం. మంచిర్యాలకు పోయిన భట్టి విక్రమార్క 40 లక్షల బొగ్గు ఎక్కడుందో చూయించాలని సవాల్‌ చేశారు. సింగరేణి కుంభకోణంపై సూటి ప్రశ్నలు వేస్తే ఎటువంటి సమాధానం రావడం లేదని తెలిపారు.

'నా అంత మొగుడు లేనట్లు'
'నేను గట్టిగా మాట్లాడితే నాపై కేసులు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంటుంది. సింగరేణిలో అవినీతి జరిగిందని నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తే దొంగ చేతికి తాళం ఇచ్చి విచారణ చేయండి. మట్టి కుప్పలపై బొగ్గు పేరుస్తున్నారు, ఇది బయట పెట్టాలి' అని భట్టి విక్రమార్క, కిషన్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు సవాల్ చేశారు. 'వడ్లు కొనకముందే నా అంత మొగుడు లేనట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేపర్‌లో వాణిజ్య ప్రకటన ఇచ్చుకున్నాడు. ఆనాడే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కేసీఆర్ హయాంలో కొన్నాం. 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనకముందే మొలకెత్తిన వడ్లు కొనే తెలివిలేదు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీను మొలకెత్తినయ్యని అంటున్నాడు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు.

పోలీసులకు హెచ్చరిక
'కొంతమంది పోలీస్ అధికారులు ఎక్కువ చేస్తున్నారు. సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వార్తలు వస్తున్నాయి. చట్ట ప్రకారం పోలీస్ అధికారులు పని చెయ్యాలి. వరంగల్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎక్కువగా కేసులు పెడుతున్నారు. చట్టం అందరికీ సమానమే విషయాన్ని పోలీస్ అధికారులు మరిచిపోవద్దు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు హెచ్చరించారు. 'పోలీస్ అధికారులకు మంచి చేసింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులకు 5 సరెండర్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీసులకు కేసీఆర్‌ గౌరవం పెంచారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు.

0
0
Report

KTR: పాలమూరు ప్రాజెక్టుతో ద్రోహం.. కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి ఓటమి ఖాయం: కేటీఆర్‌

Baddipadaga, Telangana:

KTR vs Revanth Reddy: మహబూబ్‌నగర్ ప్రజలు కాంగ్రెస్‌ను, రేవంత్ రెడ్డిని తరిమికొడతారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టి ద్రోహం చేస్తున్నారని.. కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

కేటీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్‌లోని మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో క్షేత్ర స్థాయి పరిస్థితులపై మాజీ మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ ప్రస్తుతం కొనసాగిస్తున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాల తీరును సమీక్షించారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌) ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా చర్చించారు. అనంతరం కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని మహబూబ్‌నగర్ ప్రజలు జిల్లా నుంచి తరిమికొడతారని హెచ్చరించారు.

రేవంత్ రెడ్డిని కొడంగల్ నుంచి తరిమికొడతారు
'పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటకు నీరందకుండా రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైంది. మహబూబ్‌నగర్ బిడ్డను అని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని కొడంగల్ నుంచి తరిమికొడతారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ జోష్యం చెప్పారు. గతంలో మాదిరి మరోసారి కొడంగల్ నియోజకవర్గంలోనూ రేవంత్ రెడ్డికి ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని తెలిపారు. జిల్లా ప్రజలకు చేయాల్సిన అభివృద్ధిని.. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను పక్కనపెట్టి కేవలం రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కేటీఆర్‌ జోష్యం చెప్పారు.

పాలమూరు అన్ని రంగాల్లో అగ్రస్థానం
తెలంగాణ ఏర్పాటుకు ముందు వలసల జిల్లాగా, కరువు జిల్లాగా ఉన్న పాలమూరును అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి కరువును, వలసలను తరిమికొట్టిన ఘనత ముమ్మాటికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అర్థమవుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకువెళ్తూనే.. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో మనం చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు గుర్తుచేయాలని కేటీఆర్ సూచించారు. పాలమూరు జిల్లాకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపాలని దిశానిర్దేశం చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీగా ఆదరణ
క్షేత్ర స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రతి ఒక్కరూ గుర్తించారని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నాయకులకు కేటీఆర్‌ ఆదేశించారు.

0
0
Report

Peko Kalp Collaboration: చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు సరికొత్త భాగస్వామ్యం..మరో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన పెకో, కల్ప్!

Hyderabad, Telangana:

Peko And Kalp Collaboration: యూఏఈ వ్యాపార రంగంలో ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేచింది. దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఆల్-ఇన్-వన్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ 'పెకో' (Peko).. ప్రముఖ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టోకనైజేషన్ టెక్నాలజీ సంస్థ 'కల్ప్' (Culp) చేతులు కలిపాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఫైనాన్స్, వాణిజ్య రంగాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ రెండు కంపెనీలు ఒక వ్యూహాత్మక ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. దీనివల్ల సాధారణంగా పెద్ద కార్పొరేట్ కంపెనీలకే పరిమితమయ్యే ఏఐ (AI), స్మార్ట్ పేమెంట్స్ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు ఇకపై చిన్న వ్యాపారులకు కూడా అందుబాటులోకి రానున్నాయి.

నేటి డిజిటల్ యుగంలో వ్యాపారంలో కేవలం మంచి ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఉంటే సరిపోదు. వాటితో పాటు కింది సేవలు కూడా అంతే ముఖ్యంగా అవసరం దాపురించింది. ఇన్వాయిసింగ్, బిల్లింగ్, అకౌంటింగ్, టాక్స్, జీతాల నిర్వహణ, కస్టమర్ మేనేజ్‌మెంట్, లైసెన్సింగ్ వంటివి ప్రస్తుత కాలంలో అత్యవసరంగా మారాయి. 

పెద్ద కంపెనీలు ఈ పనుల కోసం ఖరీదైన సాఫ్ట్‌వేర్‌లను వాడుతుంటాయి. కానీ చిన్న వ్యాపారాలకు (SMEs) అంత బడ్జెట్ ఉండదు. ఇక్కడే పెకో-కల్ప్ భాగస్వామ్యం చిన్న వ్యాపారాల పనిని మరింత సులభతరం, వేగవంతం, సురక్షితంగా మార్చబోతుంది. 

పెకో - కల్ప్ టెక్నాలజీ హైలైట్స్
ఈ ఒప్పందం ప్రకారం.. కల్ప్ సంస్థకు చెందిన అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను పెకో ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానిస్తారు. దీని ద్వారా వ్యాపారాలకు కింది డిజిటల్ సేవలు లభిస్తాయి.  వ్యాపార లావాదేవీలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మరింత సులభతరం చేయడంతో పాటు మరింత సురక్షితమైన, పారదర్శకమైన లావాదేవీల నిర్వహణ దీని బాధ్యత. అలాగే వేగవంతమైన వాల్యూ-మూవ్‌మెంట్ మౌలిక సదుపాయాలు..  సురక్షితమైన కీ-మేనేజ్‌మెంట్‌తో కూడిన టోకనైజేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటివి కీలకం కానున్నాయి.

రెండు భిన్న శక్తుల కలయిక
పెకో (Peko) అనే సంస్థ యూఏఈలో వ్యాపారాలకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లా పనిచేస్తోంది. బ్యాంకులు, ఫ్రీ జోన్లు, ప్రభుత్వ సంస్థలకు ఇన్వాయిసింగ్, పేరోల్, కార్పొరేట్ ట్రావెల్, ఇన్సూరెన్స్ వంటి 50కి పైగా సేవలను అందిస్తోంది.

మరోవైపు కల్ప్ (Culp) అనే సంస్థ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వెనుక ఉండి డిజిటల్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది. భాగస్వామ్య కంపెనీలు తమ సొంత బ్రాండ్ పేరుతో అధునాతన డిజిటల్ ఫైనాన్స్ సేవలు అందించేలా బ్యాకెండ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.

కంపెనీల అధినేతలు ఏమన్నారంటే..?
"మేము పెకోను నిర్మించినప్పుడు, కేవలం వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం మాత్రమే మా లక్ష్యం కాదు. వాటి వెనుక ఉన్న మౌలిక సదుపాయాలను సరికొత్తగా పునఃరూపకల్పన చేయడమే మా అసలు లక్ష్యం" అని పెకో ప్రతినిధి అహ్మద్ ఖాన్ అన్నారు. 

"మాది 'ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్' నమూనా. అంటే కేవలం ప్రచారం కోసం ఒక వినియోగదారు బ్రాండ్‌గా నిలవడం మా ఉద్దేశం కాదు. నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌ల వెనుక ఉంటూ శక్తివంతమైన సాంకేతికతను అందించడమే మా లక్ష్యం. రాబోయే దశాబ్దంలో వ్యాపారాలు డబ్బును నిర్వహించే శైలి మారబోతోంది. ఆ మార్పును SMEలు లీడ్ చేసేలా చేయడమే మా ప్లాన్" కల్ప్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు తపన్ సంగల్ పేర్కొన్నారు.

ఒకప్పుడు కేవలం పెద్ద ఆర్థిక సంస్థలకే పరిమితమైన హై-ఎండ్ డిజిటల్ టెక్నాలజీని, సాధారణ వ్యాపారాలు కూడా రోజువారీగా ఉపయోగించుకునేలా చేయడమే ఈ డీల్ ముఖ్య ఉద్దేశం. ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో చిన్న, మధ్య తరహా వ్యాపారాల ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.

Also REad: భారీగా పడిపోయిన బంగారం ధరలు..రూ.3,000 తగ్గిన గోల్డ్

Also Read: భారత్‌లో ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Cockroach Janata Party: దక్షిణాదిలో పట్టుపెంచుకునేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' బిగ్ స్కెచ్..ఏం జరిగిందంటే?

Hyderabad, Telangana:Cockroach Janata Party At Hyderabad: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' నేడు తెలంగాణలోని హైదరాబాద్‌లో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు విద్యావ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త, ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసన హైదరాబాద్‌లో చేపట్టడంపై భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం తక్కువగా ఉన్న దక్షిణాదితో తమ పార్టీ పట్టు పెంచుకునేందుకు పక్కా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
0
0
Report

Boat Accident In Krosuru: పల్నాడు జిల్లాలో విషాదం..కృష్ణా నదిలో పడవ బోల్తా..నలుగురు విద్యార్థులు మృతి!

Konuru, Andhra Pradesh:

Boat Accident In Krosuru News: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు (క్రోసూరు ప్రాంతం) సమీపంలోని కృష్ణా నదిలో ఆదివారం ఒక ఘోర పడవ ప్రమాదం జరిగింది. బంధువుల ఫంక్షన్‌కు వచ్చి సరదాగా గడపాలనుకున్న ఆ కుటుంబంలో ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

అసలేం జరిగిందంటే..?
క్రోసూరు ప్రాంతానికి సంబంధించిన కోనూరులో జరిగిన ఒక బంధువుల శుభకార్యానికి కొందరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సుమారు 10 మంది (విద్యార్థులు) కలిసి కృష్ణా నదిలో సరదాగా విహారయాత్ర (బోటింగ్) చేయడానికి ఒక చిన్న పడవలో బయలుదేరారు. అయితే, నదిలో కొంతదూరం వెళ్లాక తిరుగు ప్రయాణంలో ఒక్కసారిగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న 10 మందీ నీటిలో మునిగిపోయారు.

మృతదేహాలు లభ్యం
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నదిలోకి దూకారు. నీటిలో మునిగిపోతున్న వారిలో ఆరుగురిని సమయస్ఫూర్తితో ప్రాణాలతో కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే, మిగిలిన నలుగురు వ్యక్తులు నదీ ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్థానికులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఇప్పటివరకు రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో ఇద్దరి కోసం నదిలో తీవ్రంగా గాలిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి గురైన వారు ఎక్కడి నుంచి వచ్చారు? మృతుల వివరాలు ఏమిటి? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో కోనూరు గ్రామంలో స్థానికులు, బంధువుల రోదనలతో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: దసరా, సంక్రాంతికి స్కూల్ సెలవుల లిస్టు వచ్చేసింది! ఈ ఏడాది 87 రోజులు సెలవులు!

Also Read: ఏపీలో కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ CM పవన్ సంచలన వ్యాఖ్యలు..21 సీట్ల పోటీపై క్లారిటీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Cool Drink Death: కూల్‌డ్రింక్స్ వ్యసనంతో 19 ఏళ్ల యువకుడు మృతి..కిడ్నీలు ఫెయిల్ అయ్యి ప్రాణం పోయింది!

Doni, Karnataka:

Cool Drink Death Karnataka: ఎనర్జీ డ్రింక్స్, శీతల పానీయాల (సాఫ్ట్ డ్రింక్స్) వ్యసనం ఎంతటి ప్రమాదకరంగా మారుతుందో హెచ్చరించే ఒక దిగ్భ్రాంతికర ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. మితిమీరిన శీతల పానీయాల వాడకం వల్ల ఓ 19 ఏళ్ల యువకుడు కిడ్నీలు ఫెయిల్ అయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు, అధికంగా ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే ఆరోగ్య ముప్పుల గురించిన కథనం ఇప్పుడు తెలుసుకుందాం.

రోజుకు 3 నుంచి 4 బాటిళ్లు..!
కర్ణాటకలోని యాద్‌గిరి జిల్లా, హునసగి తాలూకా నారాయణపూర్ గ్రామానికి చెందిన బాలు దేశాయ్ (19) అనే యువకుడు విజయపురలోని ముద్దెబిహాల్‌లో చదువుకుంటున్నాడు. అతడికి గత కొంతకాలంగా మార్కెట్లో దొరికే 'స్టింగ్' ఎనర్జీ డ్రింక్ తాగడం వ్యసనంగా మారిందని వారి సన్నిహితులు వెల్లడించారు. ఇంట్లో వాళ్ళు, స్నేహితులు ఎంత వారించినా వినకుండా.. రోజుకు దాదాపు 3 నుంచి 4 బాటిళ్ల డ్రింక్స్ తాగేవాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కిడ్నీలు ఫెయిల్యూర్‌తో మృతి
ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా బాలు దేశాయ్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. తీవ్రమైన నీరసం, శరీరంలో అసౌకర్యం కలగడంతో కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బాగల్‌కోట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 12న బాలు దేశాయ్ మరణించాడు. అతిగా ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్లే అతడి కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని (కిడ్నీ ఫెయిల్యూర్) వైద్యులు నిర్ధారించారు.

కూల్‌డ్రింక్స్ ముప్పు ఏంటి?
ఈ ఘటన తర్వాత శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే నష్టాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. వైద్య నిపుణుల ప్రకారం.. ఈ తరహా పానీయాలలో ఉండే కొన్ని పదార్థాలు శరీర అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఎనర్జీ డ్రింక్స్‌లో అధిక కెఫీన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె కొట్టుకునే వేగాన్ని పెంచడమే కాకుండా రక్తపోటు (BP) పై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

ఈ పానీయాలలో వాడే విపరీతమైన చక్కెర వల్ల ఊబకాయం, మధుమేహం (డయాబెటిస్) వచ్చే ప్రమాదం ఉంది. వీటిలో రంగు, రుచి కోసం వాడే కృత్రిమ రసాయనాలు కాలేయం (లివర్), కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతాయి. ఇవి క్రమంగా కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని తగ్గించి, వాటిని పూర్తిగా ఫెయిల్ చేస్తాయి.

కూల్‌డ్రింక్స్ ప్రియులారా జాగ్రత్త!
ఇంట్లో చేసుకునే సహజసిద్ధమైన పండ్ల రసాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. మార్కెట్లో లభించే కార్బోనేటెడ్ డ్రింక్స్, ప్రిజర్వేటివ్స్ కలిపిన ప్యాక్డ్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌కు యువత ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏదీ కూడా అమితంగా తాగడం మంచిది కాదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. 

Also Read: తిరుపతిలో దారుణం..హోటళ్లలో కుళ్లిన మాంసంతో బిర్యానీ..నాన్-వెజ్ ప్రియులకు షాక్!

Also Read: దసరా, సంక్రాంతికి స్కూల్ సెలవుల లిస్టు వచ్చేసింది! ఈ ఏడాది 87 రోజులు సెలవులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Dharmapuri: ధర్మపురికి పోటెత్తిన భక్తులు.. గోదావరి తీరంలో కిక్కిరిసిన జనసందోహం!

Hyderabad, Telangana:

Dharmapuri Lakshmi Narasimha Swamy Temple News: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.. పవిత్రమైన అధికమాసం చివరి రోజు కావడంతో.. దానికి తోడు ఆదివారం సెలవు దినం, పాఠశాలల వేసవి సెలవులు ముగియవడం, అలాగే కొంతమంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు చదువుల కోసం వెళ్లడం తో ధర్మపురి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు.. ఎటు చూసినా భక్తుల కోలాహాలంతో గోదావరి తీరంతో పాటు ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.. భక్తులంతా నది స్నానాలు ఆచరించి.. స్వామి వారిని దర్శించుకుంటున్నారు..

దక్షిణ వాహినిలో పుణ్యస్నానాలు..
సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఎంతోమంది భక్తులు.. ఇక్కడ దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి నదిలో అత్యంత భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.. అధికమాసం చివరి రోజున గోదావరిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి.. పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.. దీంతో నది తీరమంతా భక్తుల హరినామ స్మరణతో మార్మోగిపోయింది. స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు తీరంలోనే వెలిసిన గోదావరి మాతకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి హారతులు కూడా ఇస్తున్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు..
నదీ స్నానాలు ముగించుకున్న భక్తులు నేరుగా స్థానిక ఆరాధ్య దైవం.. ఉగ్ర నరసింహుడిగా, యోగ నరసింహుడిగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృశ్య ఆలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు కూడా సమాచారం.. స్వామి వారి ఉచిత దర్శనం తో పాటు దర్శన క్యూ లైన్లో భక్తులు గంటల తరబడి నిలబడి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఇతర ఉప ఆలయాల్లో కూడా పూజలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

పాఠశాలలు ప్రారంభానికి ఇదే చివరి రోజు కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఆలయ కమిటీతో పాటు స్థానిక పోలీసులు గట్టి బందోబస్తుతో పాటు తాగునీరు, క్యూలైన్ల క్రమబద్దీకరణ వంటి వసతులను పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ధర్మపురి క్షేత్రం.. ఈరోజు భక్తులతో కిటకిటలాడుతోంది. సాధారణంగా పోలిస్తే.. సోమవారం కూడా అమావాస్య కావడంతో భక్తులు ఎక్కువగా ఆలయాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Two Snakes Fighting Video: నడిరోడ్డుపై నాగుపాముల ఫైట్.. వీడియో వైరల్..

Hyderabad, Telangana:

Two Snakes Fighting On Road Latest Video: సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే మనలో చాలామందికి భయం వేస్తూ ఉంటుంది. అలాంటిది రెండు భారీ నాగుపాములు రోడ్డుపై ప్రత్యక్షమై.. ఒకదానికొకటి మెలికలు తిరుగుతూ గాల్లోకి లేచి నృత్యం చేస్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా? సరిగ్గా ఇలాంటి ఒక అత్యంత ప్రమాదకరమైన.. ఆశ్చర్యం కలిగించే అరుదైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఒళ్ళు గగుర్పొడిచే విన్యాసం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. రెండు భారీ నాగుపాములు నడిరోడ్డుపై ఒకదానికొకటి తమ శరీరాలను పెనవేసుకుని ఉండడం మీరు చూడొచ్చు.. సినిమా సీన్లను తలపించేలా అవి రెండు పోటాపోటీగా పడుతూ గాల్లోకి లేస్తూ అద్భుతమైన నృత్యాలు చేస్తున్నాయి. ఆ పాముల వేగంతో పాటు వాటి శరీర కదలికలు చూస్తే వారికి ఒకవైపు భయాన్ని.. మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. జనావాసాలకు దూరంగా ఒక రోడ్డుపై ఈ రెండు సార్లు తమ లోకంలో తాము విహరిస్తూ ఈ విన్యాసాలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది..

సైన్స్ చెబుతుంది ఇదే..
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలను చూసి నాగ నృత్యం లేదా పాముల శృంగారమని భావిస్తూ ఉంటారు.. కానీ వన్యప్రాణి నిపుణుల ప్రకారం.. ఇది శృంగారం కాదు.. రెండు మగ పాముల మధ్య ఆధిపత్యం కోసం జరిగే పోరాటమని.. తమ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి లేదా వేరే ఇతర ఆడ పాముల కోసం రెండు మగ పాములు ఇలా పరస్పరం తలపడుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు పాములు కూడా ఏదో కావాలని పరస్పరం.. తలపడుతున్నాయని మీరు గమనించవచ్చు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

నెటిజన్ల కామెంట్ల వర్షం..
ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడున్న కొందరు తమ స్మార్ట్‌ఫోన్స్‌లో బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధి కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు.. నా జీవితంలో ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూడలేదని.. ఒకరు కామెంట్ చేయగా.. అవి అంత ప్రమాదకరమైన వైనా.. చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయని మరికొందరు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. మరి కొంతమంది అయితే, అటువైపు వెళ్తే ప్రాణాలు పోతాయి అంటూ చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియోని చూసి చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

0
0
Report
Advertisement

Mechanic Monkey Video: అబ్బా.. ఏం టాలెంట్ సామి.. సైకిల్ రిపేర్ చేస్తున్న కోతి.. వీడియో..

Hyderabad, Telangana:

 Monkey Repairing Cycle Viral Video: సాధారణంగా కోతులు చేతికి దొరికిన ప్రతి వస్తువును పాడు చేయడంతో పాటు ఆహారం గుంజుకొని తినడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ ఒక కోతి మాత్రం రూటు మార్చేసింది.. తోటి కోతుల అల్లరి పనులు చేయకుండా.. ఏకంగా సైకిల్ రిపేర్ షాప్ లో మెకానిక్ అవతారం ఎత్తేసింది.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక అరుదైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రిపేరింగ్ చేస్తున్న కోతి..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక సైకిల్ రిపేర్ షాప్ కనిపించడం మీరు క్లియర్ గా చూడొచ్చు.. అక్కడ ఒక సైకిల్ వెనక టైర్ పంచర్ అయిందో.. లేక చెడిపోయిందో కానీ.. ఆ కోతి దాన్ని బాగు చేసే పనిలో పడింది. మనుషులు ఏ విధంగా అయితే టూల్స్ ఉపయోగించి టైర్ లోపల ఉన్న ట్యూబ్ను జాగ్రత్తగా బయటికి తీస్తారో.. అలాగే ఆ కోతి కూడా ఎంతో సులభంగా.. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్‌లా.. ఆ ట్యూబ్ను బయటికి లాగుతోంది.. అయితే ఈ సమయంలో దాని పనితనం చూసి అక్కడున్న కొంతమంది కస్టమర్స్ కూడా షాక్ అయిపోయారు..

ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. 
ఈ అద్భుతమైన దృశ్యాలను అక్కడున్నవారు తమ స్మార్ట్‌ఫోన్స్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇది కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఈ కోతికి నెలకు ఎంత జీతం ఇస్తున్నారు యజమాని గారు? అని ఒకరు సరదాగా ప్రశ్నించగా.. మరొకరు మనుషులకంటే చాలా వేగంగా.. ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.. దీని టాలెంట్ కు జోహార్లు.. అని మరొక సోషల్ మీడియా వినియోగదారుడు ప్రశంసిస్తున్నాడు..

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

అదేవిధంగా కలికాలం అంటే ఇదేనేమో.. కోతులు కూడా ఉపాధి వెతుక్కుంటున్నాయి.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఏది ఏమైనా ప్రకృతిలో జంతువుల మేధస్సు మనల్ని ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఈ మెకానిక్ కోతి వీడియో కూడా అందుకు ఒక నిదర్శనంగా నిలిచింది.. ఇప్పుడు ఈ వీడియో శుచిత్ దీక్షిత్ అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 34 వేల మందికి పైగా లైక్ చేయగా.. కొన్ని లక్షల మంది ఈ వీడియోను వీక్షించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report

Peddi Collection: బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ప్రభంజనం..10 రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Hyderabad, Telangana:

Peddi Collection Day 10: బాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. వీక్ డేస్‌లో కాస్త నిలకడగా సాగినా, వీకెండ్స్ వచ్చేసరికి బాక్సాఫీస్ వద్ద చరణ్ సినిమా దుమ్మురేపుతోంది. తాజాగా ఈ చిత్రం విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం అధికారిక కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేసింది.

10 రోజుల్లో రూ.378 కోట్లు..!
విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న 'పెద్ది'.. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండో వీకెండ్ లో భాగంగా నిన్న శనివారం (జూన్ 13) ఒక్క రోజే ఈ సినిమాకు రూ. 12 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. 

ఈరోజు ఆదివారం (జూన్ 14) సెలవు దినం కావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. నేటితో ఈ కలెక్షన్ల గ్రాఫ్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ (విదేశాల్లో) కూడా 'పెద్ది' చిత్రానికి భారీగా వసూళ్లు వస్తున్నాయి.

సినిమా ప్రత్యేకతలు..
డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. సినిమాలో క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్‌గా రామ్ చరణ్ చూపించిన వేరియేషన్స్, అద్భుత నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి.

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, అప్పల సూరి పాత్రలో జగపతి బాబు నటనకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, సత్య తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించాయి.

వృద్ధి సినిమాస్ సమర్పణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ 'మైత్రీ మూవీ మేకర్స్', 'సుకుమార్ రైటింగ్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించాయి. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇదొక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: హీరోయిన్ రష్మికపై ఎగబడ్డ ఫ్యాన్స్..తెలుగింటి కోడలికి బాడీగార్డ్‌గా బాలీవుడ్ బ్యూటీ!

Also Read: ఐటెంసాంగ్ ద్వారా భారీగా సంపాదించిన హీరోయిన్ ఈమెనే! ఒక్క పాటకి అన్ని కోట్ల రూపాయలా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Cobra Video: పిచ్చెక్కిపోద్ది బాబోయ్.. ప్యాంటు బెల్టు బదులు బతికున్న కోబ్రాను చుట్టుకున్నాడు!

Hyderabad, Telangana:

 Venomous Cobra Snake Belt Video: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రైతులతో పాటు వ్యూస్ కోసం కొందరు యువకులు ఎంతటి తెగింపుకైనా వెనకాడడం లేదు.. ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రమాదకరమైన స్టంట్లను చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. సాధారణంగా పురుషులు ప్యాంట్లు జారిపోకుండా ఉండేందుకు రకరకాల లెదర్ బెల్ట్లను వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు ఏకంగా బ్రతికి ఉన్న ఒక ప్రమాదకరమైన నాగుపామును తన ప్యాంటుకు బెల్టుల చుట్టుకున్నాడు. విశ్వ సర్పం నడుము చుట్టూ కదులుతున్న.. ఆ యువకుడు మాత్రం భయం లేకుండా కెమెరాకు ఫోజులు ఇవ్వడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది.  

అసలేం జరిగిందంటే..?
వైరల్ అవుతున్న వీడియో వివరాల ప్రకారం.. ఒక యువకుడు రోడ్డు పక్కన నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. అతడి ప్యాంటు నడుము భాగాన్ని గమనిస్తే.. ఎవరికైనా గుండె ఆగినంత పనవ్వాల్సిందే.. ఒక పెద్ద నాగుపామును అతడు బెల్టు లాగా నడుముకు చుట్టుకున్నాడు.. ఆ పాము తలభాగంతో పాటు తోక భాగం బయటకు కనిపిస్తూ కదులుతున్నాయి. ఆ నాగుపాము ఏ క్షణంలోనైనా కాటు వేసే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఆ యువకుడు మాత్రం చాలా కూల్‌గా రోడ్డుపైనే నిలబడి ఉండిపోయాడు.. పక్కనే ఉన్న కొందరు ఈ దృశ్యాలని తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది..

 
 
 
 
 

అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. వ్యూస్ కోసం ఇంత పిచ్చా? ఒకవేళ అది కాటు వేస్తే ప్రాణాలు పోతాయని తెలీదా? ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమందిని సోషల్ మీడియా వినియోగదారులు కోరుతున్నారు.. ఎక్కువమంది సోషల్ నెటిజన్ల అయితే ఈ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది ఫ్యాషన్ కాదు ముమ్మాటికి పిచ్చితనం అంటూ.. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు..

ఇక మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులైతే.. బ్రతికున్న పామును అలా హింసించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైన సర్పంచ్ స్టంట్ లు చేయడం చట్టరీత్య నేరమని పలువురు గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ వీడియో ఎక్కడ జరిగిందో గుర్తించి.. సదరు యువకుడిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి.. కఠినంగా శిక్షించాలని అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులను సోషల్ మీడియా వేదికగా కొంతమంది కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో ఇంస్టాగ్రామ్‌లో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది. పోస్ట్ చేసి చాలా రోజులైనప్పటికీ ఇప్పుడు వైరల్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report
Advertisement

Realme P4R 5G: రూ.4,999లకే Realme P4R 5G స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్!

Hyderabad, Telangana:

Realme P4R 5G Launched on Flipkart: బడ్జెట్ ధరలు ప్రీమియం ఫీచర్లను కోరుకునే స్మార్ట్‌ఫోన్‌ ప్రియుల కోసం ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్ మీ సరికొత్త మొబైల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత యువతను లక్ష్యంగా చేసుకొని కంపెనీ Realme P4R 5Gను మోడల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మోడల్ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకమైన ఆఫర్లతో సందడి చేస్తోంది. ముఖ్యంగా లావెంటర్ కలర్‌తో కూడిన 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చింది..

ప్రస్తుతం Realme P4R 5G మొబైల్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులో ఉంది. అయితే, దీనికి సంబంధించిన సేల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది అంతలోనే దీనిపై కంపెనీ ప్రత్యేకమైన స్పెషల్ తీసుకుంటే ఆఫర్స్ అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి ఇది అత్యంత చీప్ ధరకు లభిస్తోంది. Realme P4R 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది అత్యంత తక్కువ ధరలోనే ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇది భారీ 8000mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి తోడు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం. అలాగే గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన బైపాస్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది..

సినిమాలు, గేమింగ్‌ ప్రియుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ అద్భుతమైన 6.8 అంగుళాలు కలిగిన సన్లైట్ డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి రావడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా ఫోటోగ్రఫీకి కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతగానో సహాయపడుతుంది.. ఇందులో వెనక భాగంలో అద్భుతమైన 50 మెగాపిక్సెల్ AI కెమెరాను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పాటు తక్కువ వెలుగులోను అద్భుతమైన పోర్ట్రైట్ షాట్స్ తీసుకునే విధంగా వివిధ రకాల కొత్త కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ఎరైజర్ తో పాటు జాల ప్రత్యేకమైన నెక్స్ట్ ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఫోటో ఎడిటింగ్ మరింత సులభతరం అవుతుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

మార్కెట్లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ధర MRP రూ.30,999 కాగా.. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో 32 శాతం వరకు ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.20,999 లకే లభించడం విశేషం. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రాగానే దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధానం యాక్సిస్ బ్యాంకు తోపాటు ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.3 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా అదనంగా దీనిపై కంపెనీ ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్‌తో పాటు అదనపు బోనస్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ వినియోగించడానికి తప్పకుండా మీ దగ్గర వినియోగిస్తున్న ఏదైనా బ్రాండ్ కు సంబంధించిన మొబైల్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాని కండిషన్‌ను బట్టి, దాని వ్యాల్యూని బట్టి ఏకంగా రూ.16 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ రూ.4,999 లోపే సొంతం చేసుకోవచ్చు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Amazon Offer: సగం ధరకే Aquaguard 9-స్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్.. బ్యాంక్ డిస్కౌంట్ కూడా!

Hyderabad, Telangana:

Aquaguard Water Purifier Amazon Offer: ప్రస్తుతం చాలామంది బయట ప్యూరిఫైయర్ చేసిన నీరు తాగకుండా ఇంట్లోనే వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకుంటున్నారు. వీటి నుంచి ఫిల్టర్ చేసిన నీటిని తాగుతున్నారు. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా అనారోగ్య సమస్యల భారిన పడకుండా రక్షిస్తూ ఉంటాయి. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో మంచి ప్యూరిఫైయర్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ డే సేల్‌లో భాగంగా.. కొన్ని వాటర్ ప్యూరిఫైయర్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌అందుబాటులో ఉన్నాయి. గతంలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన Aquaguard RO+UV+UF+MC Tech (2X Life) వాటర్ ప్యూరిఫైయర్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తుంది. అలాగే ఇది ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇందులో ఉన్న ఫీచర్స్ వివరాలు ఏంటో? ధర పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఈ వాటర్ ప్యూరిఫైయర్ కు సంబంధించిన పూర్తి ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఇది నీటిని 9 విభిన్న దశల్లో శుద్ధి చేస్తుంది. దీనివల్ల నీటిలోని మురికి, కెమికల్స్, బ్యాక్టీరియా తో పాటు వైరస్‌లు పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా ఈ మీరు పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా ప్రత్యేకమైన RO+UV+UF+MC టెక్నాలజీ అందుబాటులో ఉంది. రివర్స్ ఆస్మోసిస్ సీసంతో పాటు పాదరసం లోహాలు నీటిలోని పురుగులను తొలగించేందుకు సహాయపడతాయి. 

అలాగే ఇందులో ఉండే UV నీటిని 20 నిమిషాల పాటు మరిగిస్తే ఎంత శుద్ధిగా మారుతుందో.. అంతటి రక్షణను అందిస్తాయి. అలాగే ఇందులో అల్ట్రా ఫిల్టరేషన్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలతో పాటు ఇసుక రేణువులను సులభంగా వడ కడుతుంది. అంతేకాకుండా మినరల్ చార్జ్.. నీటిని శుద్ధి చేయడమే కాకుండా శరీరానికి అవసరమైన మెగ్నీషియంతో పాటు క్యాల్షియం వంటి పోషకాలను అందించేందుకు సహాయపడుతుంది.. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

60 శాతం హైయర్ వాటర్ రికవరీ (Aquasaver Tech) సపోర్ట్ కూడా లభిస్తుంది. సాధారణ ఆర్వో ప్యూరిఫైయర్లతో పోలిస్తే 60 శాతం వరకు నీటిని ఆదా చేస్తుంది. అంటే నేటి వృధా చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో రెండు సంవత్సరాల వరకు ఫిల్టర్ లైఫ్ సపోర్ట్ లభిస్తుంది. సాధన ఫిల్టర్ల కంటే ఇవి రెట్టింపు కాలం వరకు పనిచేస్తూ ఉంటాయి. ఇక ఈ వాటర్ ప్యూరిఫైయర్‌కు సంబంధించిన పూర్తి ధర వివరాల్లోకి వెళితే.. ఇది MRP ధర రూ.26,500 కాగా ఇప్పుడే దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి.. అదనంగా 58 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపుతో కేవలం.. రూ.10,999 లకే లభిస్తోంది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే అదనంగా రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Xiaomi Mix Fold 5: 200MP కెమెరాతో రాబోతున్న Xiaomi Mix Fold 5 ఫోన్‌.. సామ్‌సంగ్‌కు గట్టి పోటీ!

Hyderabad, Telangana:

Xiaomi Mix Fold 5 Leaked: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం Xiaomi మార్కెట్లోకి తమ కొత్త పోల్టబుల్ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సాంసంగ్‌తో పాటు వన్ ప్లస్, వివో వంటి బ్రాండ్లకు గట్టి పోటీని ఇస్తూ నెక్స్ట్ జనరేషన్ పోలిడబుల్ ఫోన్ Xiaomi Mix Fold 5 ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ క్రమంలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన స్పెసిఫికేషన్స్‌తో పాటు ఫీచర్స్ లీకయ్యాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఈ మొబైల్‌లో ఉన్న హైలెట్ ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

200MP కెమెరాతో ఈ మొబైల్..
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అత్యంత ప్రధాన విశేషమేంటంటే.. దీని కెమెరా.. ప్రముఖ చైనీస్ మైక్రో బ్లాకింగ్ ప్లాట్ఫామ్ విబోలో ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...షియోమీ మిక్స్ ఫోల్డ్ 5 వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్ ను కలిగి ఉండబోతోంది. ఇందులో కంపెనీ ఎంతో పవర్ఫుల్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. పోలిటబుల్ ఫోన్లలో ఇంత భారీ కెమెరా సెన్సార్ ను తీసుకురావడం మొదటిసారిగా భావించవచ్చు. అయితే, ఇందులో అద్భుతమైన అల్ట్రా-క్లియర్, హై-రిజల్యూషన్ ఫోటోగ్రఫీ అనుభూతి కూడా లభిస్తుంది. 

అద్భుతమైన డిస్‌ప్లే.. 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రోటో టైపులో 7.5 అంగుళాల నుంచి 7.6 అంగుళాల వరకు ఉండే ఫోల్డబుల్ ఇన్నర్ డిస్ప్లే కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్క్రీన్ లపై సాధారణంగా కనిపించే మడత మార్కులను పూర్తిగా తగ్గించేందుకు సరికొత్త మినిమలైజ్డ్ టెక్నాలజీని ఇందులో వినియోగించినట్లు తెలుస్తోంది. భద్రత కోసం ఫోన్ పక్క భాగంలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్స్ లభించడం విశేషం..

పవర్‌ఫుల్ బ్యాటరీ..
కొత్త తరం యూజర్ల అవసరాలకు అనుగుణంగా షియోమీ మిక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన 6,000 mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పూర్తిగా వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో పాటు అత్యంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన Xring O3 ప్రాసెసర్ను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా గేమ్స్ కోసం ప్రత్యేకమైన చిప్ సెటప్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది..

ధర వివరాలు ఇవే..
గత కొన్ని నీళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ మొబైల్స్‌ అమ్మకాలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో వచ్చిన మిక్స్ ఫోల్డ్ ఫోర్ స్థానంలో రాబోతున్న ఈ సరికొత్త మోడల్ ఆగస్టు నాటికి చైనాలోని లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అనేక కొత్త ఫీచర్ల కారణంగా దీని ధర మునుపటి మోడల్స్ కంటే కాస్త ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని లీకైన వివరాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర రూ.1,31 లక్షతో ప్రారంభం కాబోతోంది. అలాగే ఇది 200MP కెమెరాతో అందుబాటులోకి రావడం కారణంగా సాంసంగ్ బ్రాండ్ తో పాటు వన్ ప్లస్ బ్రాండ్ కు సంబంధించిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లతో పోటీపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top