icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
SShankerreddyFollow27 Jul 2024, 03:17 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

6,700 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయం.. భువనగిరిలో భారీ అక్రమ దందా!

Hyderabad, Telangana:

Yadadri Bhuvanagiri Rice Mill Fraud: ప్రభుత్వం పేదల బియ్యం కోసం కస్టమ్ మిల్లింగ్ (CMR) కింద కేటాయించిన వేలాది టన్నుల ధాన్యం పక్కదారి పట్టింది. అధికారుల కన్ను పడటంతో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ రైస్ ఇండస్ట్రీలో జరుగుతున్న భారీ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. సుమారు 6,700 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించుకొని.. ఏకంగా రూ.24 కోట్ల మేర గోల్‌మాల్ చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

అసలేం జరిగింది? 
భువనగిరి సమీపంలోని ఓ రైస్ ఇండస్ట్రీస్‌కు పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం.. సీఎంఆర్ (Custom Milling Rice) కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి రైస్ రూపంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌కు అప్పగించాల్సి ఉంది.

అయితే, ఈ నెల 24వ తేదీన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సదరు రైస్ మిల్లులో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యం నిల్వలను, మిల్లు గోదాముల్లో ఉన్న సరుకుతో సరిపోల్చి చూశారు. ఆ సమయంలో రికార్డుల్లో చూపించిన ధాన్యానికి, అక్కడ ఉన్న నిల్వలకు అస్సలు పొంతన లేకపోవడంతో అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

రూ.24 కోట్ల ధాన్యం మాయం.. 
తనిఖీల సమయంలో గోదాముల్లో ఉండాల్సిన సుమారు 6,700 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.24 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

ఈ భారీ తేడాపై మిల్లు యాజమాన్యాన్ని అధికారులు నిలదీయగా.. వారు సరైన ఆధారాలు చూపలేక నీళ్లు నమలడం.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అధికారులకు పక్కాగా అనుమానం వచ్చింది. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా బయట మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని గ్రహించిన సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ (DM) హరికృష్ణ తక్షణమే చర్యలు తీసుకున్నారు..

ఐదుగురిపై కేసు నమోదు.. 
డీఎం హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి రూరల్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ప్రభుత్వ సొమ్మును తప్పుదోవ పట్టించి.. అక్రమాలకు పాల్పడిన రైస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నూనె వెంకటేశ్వర్లు తో పాటు మరో నలుగురు బాధ్యులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Viral Video: బ్యాంకు మేనేజర్‌ చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం మనవరాలు

Chennai, Tamil Nadu:

Kayalvizhi Alagiri Video: బ్యాంకులో ఓ మాజీ ముఖ్యమంత్రి మనవరాలు హల్‌చల్‌ చేశారు. బ్యాంకులో తిట్ల పురాణం అందుకోవడమే కాదు బ్యాంకు మేనేజర్‌నే చెంప ఛెళ్లుమనిపించారు. అతడు ఏమైనా చేశాడా అంటే లేదు. కానీ ఓ విషయమై అతడితో వాగ్వాదానికి దిగి ఒక్కసారిగా లేచి ఆమె కొట్టారు. చిన్న విషయమై ఆమె రాద్ధాంతం చేయడంతో ఈ సంఘన సంచలనం రేపుతోంది. అయితే దాడి చేసి మాజీ సీఎం మనవరాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేనేజర్‌పై దాడి చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని చెన్నైలో అడయార్‌ ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎన్‌ఆర్‌ఐ శాఖ ఉంది. ఈ బ్యాంకు కార్యాలయానికి మాజీ కేంద్ర మంత్రి ఎంకే ఆళగిరి కుమార్తె, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనవరాలు కయల్విళి అళగిరి వచ్చారు. అయితే బ్యాంకు కొనసాగుతున్న వాణిజ్య సముదాయం యజమాని కయల్విళి అళగిరి. ఇటీవల ఆ భవనంలోని లిఫ్ట్ పని చేయకపోవడంతో బ్యాంక్ శాఖ మేనేజర్ హర్షిన్ సింగ్ మొదట మెయింటెనెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సమస్యపై సరైన స్పందన రాకపోవడంతో బ్యాంకు మేనేజర్‌ భవన యజమాని కయల్విళి అళగిరికి ఫోన్ చేసి లిఫ్ట్ సమస్యను వివరించారు.

లిఫ్ట్‌ సమస్యపై ఫోన్ చేసి తనకు ఫిర్యాదు చేయడంతో కయల్విళి అళగిరి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకే ఫిర్యాదు చేస్తారా అని ఈ నెల 20వ తేదీన నేరుగా బ్యాంకుకు ఆమె వచ్చారు. నేరుగా మేనేజర్ ఛాంబర్‌లోకి వెళ్లి తీవ్ర వాగ్వాదానికి దిగారు. కూర్చుని మేనేజర్‌ ప్రశాంతంగా సమాధానం ఇస్తుండగా ఒక్కసారిగా లేచిన కయల్విళి ఆవేశంలో మేనేజర్ హర్షిన్ సింగ్ చెంపపై కొట్టారు. అంతటితో ఆగకుండా తిట్లతో విరుచుకుపడ్డారు. దీనికి తీవ్ర పర్యవసానాలు ఉంటాయని మేనేజర్‌ను బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సంఘటన బ్యాంక్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డవగా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తమ బ్యాంకు మేనేజర్‌పై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ నమచ్చివాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడయార్ పోలీసులు కయల్విళి అళగిరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం, భౌతిక దాడికి పాల్పడటం, దుర్భాషలాడటం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం వంటి తీవ్ర ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు ప్రస్తుతం సమగ్ర విచారణ చేస్తున్నారు. గొప్ప రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇలా బ్యాంక్ మేనేజర్‌పై దాడికి దిగడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎంత రాజకీయ నాయకురాలు అయినా కూడా ఇలా భౌతిక దాడులు చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

0
0
Report

Vivo S2: ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. భారత్‌లోకి Vivo S2 రీ-ఎంట్రీ..

Hyderabad, Telangana:

Vivo S2 India Launch: టెక్ దిగ్గజం సంస్థ వివో (Vivo) భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరొక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. గత కొన్ని సంవత్సరాల పాటు విడుదల చేస్తానున్న ప్రకటించి.. ఐకానిక్ S సిరీస్‌ను భారత్‌లో తిరిగి విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. 2019లో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వివో S1 తర్వాత.. దాదాపు ఏడేళ్ల తర్వాత వివో S2 మోడల్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ క్రమంలో కంపెనీ ఇప్పటికే ఒక అధికారిక పోస్టర్‌ను విడుదల చేయగా.. టెక్ వర్గాల్లో ఈ ఫోన్‌పై భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది.. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 6న భారత్‌లో అధికారికంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. లాంచ్ అయిన కొద్ది రోజులకే.. అంటే ఆగస్టు 11 నుంచి దీనిని విక్రయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. 

వివో S2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
కంపెనీ ఇంకా పూర్తి స్థాయి స్పెసిఫికేషన్లను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. లీకైన వివరాల ప్రకారం ఈ ఫోన్ అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.59-అంగుళాల OLED ప్యానెల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా సులభంగా అన్‌లాక్ చేయడానికి ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ 8GB RAM వేరియంట్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. దీని స్టోరేజ్ విషయానికి వస్తే.. 128GB (బేస్ మోడల్)తో పాటు 256GB ఆప్షన్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.. వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఫోన్ సఫైర్ బ్లూ (Sapphire Blue), రీగల్ బ్రాంజ్ (Regal Bronze)తో పాటు సిల్క్ వైట్ (Silk White) అనే మూడు రాయల్ కలర్స్‌లో లభించనుంది.

ధర వివరాలు..
భారత మార్కెట్లో వివో S2 ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో పోటీపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 38,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫుల్ ఆప్షన్స్ ఉన్న టాప్ వేరియంట్ ధర రూ. 42,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. డిజైన్, పనితీరుకు ప్రాధాన్యతనిచ్చే.. స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఈ వివో S2 ఒక మంచి ఆప్షన్‌గా నిలవబోతోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

సినిమా ఫక్కీలో స్కెచ్.. సిద్ధిపేట ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్!

Hyderabad, Telangana:

Siddipet Latest News: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శనివారం తీవ్ర కలకలం రేగింది. వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ ఖైదీ.. పోలీసుల కళ్లుగప్పి సినిమా ఫక్కీలో పరారైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బైక్ దొంగతనాల కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితుడు సాయికుమార్ తప్పించుకోవడంతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఘటన వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బైక్ దొంగతనాల కేసులో నిందితుడైన సాయికుమార్‌తో పాటు మొత్తం ఏడుగురు ఖైదీలను క్రమశిక్షణా ప్రక్రియలో భాగంగా.. అలాగే జైలు నిబంధనల ప్రకారం.. మెడికల్ చెకప్ నిర్వహించేందుకు సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.

ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న సాయికుమార్.. పోలీసులు అజాగ్రత్తగా ఉన్న సమయంలో వారి దృష్టిని మళ్లించి ఒక్కసారిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఖైదీ మాయమైనట్లు గమనించిన సిబ్బంది వెంటనే తేరుకుని ఆసుపత్రి పరిసరాల్లో వెతికినప్పటికీ.. అప్పటికే అతడు పరారయ్యాడు.

పరారైన సాయికుమార్ పలు బైక్ దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తూ.. పోలీసులకు చిక్కాడు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలకు తీసుకురాగా ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది.

Also Read: Dharmapuri: అయ్యో.. ధర్మపురిలో తీవ్ర విషాదం.. నిద్రమత్తులో పామును తొక్కిన నాలుగేళ్ల బాలుడు.. ఆ తర్వాత..!

ఖైదీ పరార్ వార్త తెలిసిన వెంటనే జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనపై తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోకి వెళ్లే ప్రధాన రహదారుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేసిన్నట్లు తెలుస్తోంది.. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీని సేకరించి.. అతడు ఏ వైపు పరారయ్యాడనే అంశంపై విశ్లేషిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.

Also Read: Dharmapuri: అయ్యో.. ధర్మపురిలో తీవ్ర విషాదం.. నిద్రమత్తులో పామును తొక్కిన నాలుగేళ్ల బాలుడు.. ఆ తర్వాత..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

7200mAh భారీ బ్యాటరీతో వివో X300e గుడ్ న్యూస్.. లాంచ్ డేట్, ఫీచర్లు ఇవే!

Hyderabad, Telangana:

Vivo X300e Launch: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రముఖ టెక్ దిగ్గజం  వివో నుంచి మరొక పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రాబోతోంది. వివో X300e (Vivo X300e) పేరుతో ఈ నయా మోడల్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ ఫోన్ అధికారిక లాంచ్‌కు ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉన్న సమయంలో.. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు, డిజైన్ వివరాలు, కెమెరా ఫీచర్లు వివిధ సర్టిఫికేషన్ సైట్లలో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Vivo కంపెనీ అధికారిక సమాచారం ప్రకారం.. ఈ Vivo X300e లాంచ్ ఈవెంట్ ఆగస్టు 27న ఘనంగా జరగబోతోంది. కంపెనీ తన దేశీయ మార్కెట్ అయిన చైనాలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతోంది.. టెక్ ప్రియుల కోసం.. ఈ లాంచ్ ప్రోగ్రామ్‌ను కంపెనీ అధికారిక సోషల్ మీడియా సైట్లలో ప్రత్యక్ష ప్రసారం (Live Stream) చేయనున్నారు. లాంచ్‌కు ముందే ఈ పరికరం ప్రధాన ఫీచర్లు లీక్ అవ్వడంతో మార్కెట్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

శక్తివంతమైన ప్రొసెసర్..
ఈ ఫోన్‌లో 6.59-అంగుళాల హై-రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే క్వాల్‌కామ్‌కు సంబంధించిన మోస్ట్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) చిప్‌సెట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని గరిష్ట ఫ్రీక్వెన్సీ 3.8GHz గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్ అత్యంత సులభంగా మారుతుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ ఫోన్ మూడు ప్రధాన వేరియంట్లలో లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ మొత్తం మూడు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్ 8GB RAM + 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రాబోతోంది. ఇందులో రెండవది 12GB RAM + 256GB స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇక చివరి మోడల్ 12GB RAM + 512GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.. ఇందులోని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇందులో సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో అందుబాటులో ఉంది. ఇక మూడవ కెమెరా 8 మెగాపిక్సెల్ సెన్సార్‌కు కూడా కలిగి ఉంటుంది. ఫ్రంట్ భాగంలో కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఇతర ఫీచర్లు..
ఈ ఫోన్‌లో రోజంతా వినియోగించుకునేందుకు ఎంతో శక్తివంతమైన 7200mAh భారీ బ్యాటరీని అందించారు. దీనితో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇది మొత్తం మూన్‌లైట్ వైట్ (Moonlight White), సన్‌లైట్ ఆరెంజ్ (Sunlight Orange)తో పాటు మిడ్‌నైట్ బ్లాక్ (Midnight Black) కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులో కంపెనీ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, NFCతో పాటు బ్లూటూత్, WLAN, USB కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Chandrababu: ఎన్నికలపై చంద్రబాబు కీలక ప్రకటన.. మళ్లీ కూటమి అధికారంలోకి రావడం ఖాయం

Amaravathi, Andhra Pradesh:

TDP Door To Door Programme: 'స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలవాలి. టీడీపీ సహా కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. బూత్ కన్వీనర్లు సహా వివిధ పార్టీ హెదాల్లో పని చేసిన వారు బాధ్యతతో పని చేయాలని సూచించారు. కష్టంతో కాకుండా ఇష్టంతో పని చేయాలి.. ప్రజలు, కార్యకర్తలతో సన్నిహితంగా ఉండాలని చెప్పారు. తనకు కావాల్సింది అనుచరులు కాదు.. పార్టీకి నాయకులు కావాలని చెప్పారు.

తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండేళ్ల పాలనపై చేపట్టాల్సిన ఇంటింటి ప్రచారం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. రెండేళ్ల కూటమి పాలనపై రేపటి నుంచి 45 రోజుల పాటు డోర్ టు డోర్ కార్యక్రమంపై సమీక్ష చేశారు. గత ఎన్నికల్లో చారిత్రాత్మకమైన విజయాన్ని ప్రజలు అందించారని.. సీట్లల్లో 94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లు సాధించగలిగామని గుర్తుచేశారు.

'నాటి ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు, విధ్వంసంతోనే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. టీడీపీ సహా కూటమి పార్టీలు చేసిన పోరాటాలు.. ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలతో మంచి మెజార్టీలు సాధించగలిగాం. ప్రజలకు ఉపయోగపడేలా పాలన చేపడుతున్నాం.. నిరంతరం ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం' అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. 'సమస్యలకు పరిష్కారం చూపగలిగే నైపుణ్యాలను అలవర్చుకోవాలి. నాయకత్వ నైపుణ్యం పెంచుకోవాలి' అని సూచించారు.

'ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పాలి. ప్రజలు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాలి... వారికి అర్థమయ్యేలా వివరించాలి' అని టీడీపీ నాయకులకు చంద్రబాబు సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పార్టీ యంత్రాంగం మొత్తం అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. కానీ ఏమరుపాటు వద్దు.. ప్రజలకు నచ్చని, వారు మెచ్చని పనులు చేయకూడదని పార్టీ నాయకత్వానికి హితవు పలికారు.

'రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం కచ్చితంగా కొనసాగాల్సిందే... ఇది ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పాలి. యువత సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు... యువతను గొడ్డలి పార్టీ ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే అంశాలను వివరించాలి. యువత భవితకు.. వాళ్ల ఆలోచనలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలి' అని టీడీపీ నాయకత్వానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు.

'డబ్బులు ఉన్నాయని ఎలాగైనా గెలుస్తామనే ధీమాతో గొడ్డలి పార్టీ వ్యవహరించింది. కేవలం డబ్బులతోనే ప్రజాభిమానాన్ని పొందలేం' అని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుచేశారు. 2024 ఎన్నికలతో పాటు ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించాలని సూచించారు. 'గొడ్డలి (వైఎస్సార్‌సీపీ) పార్టీ విధానాలు.. తప్పుడు పద్దతులను ప్రజల్లో ఎండగట్టాలి. ఘోర ఓటమి చెందినా... ఇప్పటికీ సమాజంలో చిచ్చును రాజేస్తోంది. గొడ్డలి పార్టీ విధ్వంసకర విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. ప్రజలతో నిత్యం ఇంటరాక్ట్ అయితే గొడ్డలి పార్టీ కుట్రలను ఎక్స్ పోజ్ చేయవచ్చు. నిరంతరం ప్రజల్లో ఉండడాన్ని బాధ్యతగా తీసుకోవాలి. ఇది అగ్ర స్థాయి మొదలుకుని క్షేత్రస్థాయి నేతల వరకు వర్తిస్తుంది' అని టీడీపీ నాయకత్వానికి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

0
0
Report
Advertisement

AP Weather Alert: బంగాళాఖాతంలో అలజడి..వాయుగుండంగా మారిన అల్పపీడనం! ఆ జిల్లాల్లో అలర్ట్!

Visakhapatnam, Andhra Pradesh:

AP Cyclone Weather Alert: వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

వాయుగుండం ప్రభావం
ఇది వాయువ్య దిశగా పయనిస్తూ, రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది పారాదీప్ - సాగర్ ద్వీపాల మధ్య ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం తీవ్ర అలజడిగా మారి, భారీ అలలు ఎగసిపడే సూచనలు ఉన్నాయి.

మత్స్యకారులకు హెచ్చరిక 
ఏడు మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న పడవలను ఉపయోగించడం అత్యంత ప్రమాదకరమని అధికారులు స్పష్టం చేశారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ బుధవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో గత కొంతకాలంగా ఎల్ నినో ప్రభావం, విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. ఈ వాయుగుండం ప్రభావం వల్ల తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. రాబోయే బుధవారం వరకు రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: దేశంలో భారీ వర్షాల హెచ్చరిక.ఈ 3 రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్'..ఐఎండీ సూటిగా వార్నింగ్!

Also Read: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ఘోర ప్రమాదం..ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Karimnagar Bonalu: కరీంనగర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు!

Hyderabad, Telangana:

Karimnagar Bonalu: కరీంనగర్‌లో బోనాల పండుగ వాతావరణం నెలకొంది. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా.. కన్నుల పండువగా సాగాయి. నగరంలోని చింతకుంట, కిసాన్ నగర్, శివాజీ నగర్, పసుల నారాయణ కాలనీ ప్రాంతాలు భక్తితో మురిసిపోయాయి. ఉదయం నుంచే శోభాయాత్రలు, మంగళవాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో నగర వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి.. తలపై నైవేద్యంతో కూడిన బోనాలను ఎత్తుకుని అమ్మవారి ఆలయాలకు క్యూ లైన్లలో తరలివచ్చారు.

ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్నూరు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న ప్రత్యేకంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వీరంతా స్వయంగా అమ్మవారి బోనాలను తలపై ఎత్తుకుని శోభాయాత్రగా ఆలయం వరకు చేరుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అమ్మవారికి పట్టువస్త్రాలు, నైవేద్యం సమర్పించి.. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజాప్రతినిధులు స్వయంగా బోనం ఎత్తడం పట్ల స్థానిక భక్తులు, సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

పాడిపంటలు సమృద్ధిగా పండాలి..
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని కొనియాడారు. పోచమ్మ తల్లి కరుణాకటాక్షాలతో నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి.. చెరువులు కుంటలు నిండి, పాడిపంటలు కళకళలాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రజలందరిపై అమ్మవారి చల్లని చూపు ఎల్లవేళలా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Revanth Reddy: కేటీఆర్‌ బర్త్‌డేపై రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్‌ అడగాలి'

కార్యక్రమాన్ని మున్నూరు కాపు సంఘం నాయకులు అత్యంత కట్టుదిట్టంగా.. వైభవంగా నిర్వహించారు. ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మహోత్సవంలో ఆయా డివిజన్లకు చెందిన స్థానిక నాయకులు, మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు, వివిధ మున్సిపల్ కార్పొరేటర్లు వందల సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 

Also Read: Revanth Reddy: కేటీఆర్‌ బర్త్‌డేపై రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్‌ అడగాలి'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

ఒకే యువకుడితో ముగ్గురు యువతులు పెళ్లి.. శిక్ష పడుతుందా? BNS ఏం చెబుతోంది..

Hyderabad, Telangana:

Up Triple Marriage Latest News: ఒకే యువకుడిని ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకేసారి పెళ్లి చేసుకున్న విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి ఇష్టాయిష్టాలతో, పరస్పర అంగీకారంతో జరిగిన ఈ పెళ్లిలో తప్పేముందని కొందరు మద్దతు అంటుండగా.. భారతదేశ చట్టాల ప్రకారం.. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని మరికొందరు స్పష్టం చేస్తున్నారు. అయితే, ఇలా ముగ్గురిని పెళ్లి చేసుకోవడంపై భారత చట్టాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ వివాహంపై వస్తున్న విమర్శలపై ఆ ముగ్గురు యువతుల్లో ఒకరు విలేకరులతో మాట్లాడుతూ.. రామాయణంలో దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు (కౌసల్య, సుమిత్ర, కైకేయి) ఉన్నప్పుడు లేని అభ్యంతరం.. ఇప్పుడు మేము మా ఇష్టంతో చేసుకుంటే ఎందుకు వస్తోందని ఆమె ప్రశ్నించారు. తాము చిన్నప్పటి నుంచి కలసి పెరిగామని.. పెళ్లి తర్వాత కూడా విడిపోకూడదనే ఉద్దేశంతోనే ఒకే వ్యక్తిని భర్తగా స్వీకరించామని వెల్లడించారు.

హిందూ వివాహ చట్టం ఏం చెబుతోంది?
అయితే, పురాణాల కాలం నాటి పరిస్థితులతో ప్రస్తుత ఆధునిక చట్టాలను పోల్చలేమని చట్ట నిపుణులు స్పష్టం చేస్తున్నారు. హిందూ వివాహ చట్టం - 1955 (Hindu Marriage Act, 1955) ప్రకారం హిందూ మతంలో ఒకే యువకుడు ముగ్గురును పెళ్లి చేసుకోవడం పూర్తిగా నిషేధించారు. సెక్షన్ 5(i) ప్రకారం.. వివాహం చేసుకునే సమయానికి దంపతుల్లో ఎవరికీ అంతకుముందే వివాహమై బతికి ఉన్న జీవిత భాగస్వామి ఉండకూడదు. ఒక భార్య బతికి ఉండగా.. ఆమెకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా చేసుకునే రెండో లేదా మూడో పెళ్లికి చట్టపరంగా ఎటువంటి విలువ ఉండదు. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం నేరం..
ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త నేర శిక్షా స్మృతి భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం..  ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. BNS సెక్షన్ 82 ప్రకారం.. మొదటి భాగస్వామి జీవించి ఉండగానే.. ఆ విషయమై స్పష్టమైన సమాచారం ఉండి కూడా మరొకరిని వివాహం చేసుకోవడం చట్టప్రకారం నేరం.. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే సదరు వ్యక్తికి ఏకంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశముంది. సంబంధిత వ్యక్తులు పరస్పర అంగీకారం అని చెప్తున్నప్పటికీ.. భారత చట్టాల ముందు వ్యక్తిగత అంగీకారం కంటే రాజ్యాంగబద్ధమైన నియమాలే ప్రామాణికంగా ఉంటాయని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

చెల్లెలు కారణంగానే ముద్రగడ్డ పద్మనాభం మరణం: ముద్రగడ గిరిబాబు సంచలన వ్యాఖ్యలు

Kirlampudi, Andhra Pradesh:

Mudragada Giribabu: కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో మృతి చెందడంతో కాపు సమాజం పెద్ద దిక్కు కోల్పోయిన విషయం తెలిసిందే. ముద్రగడ పద్మనాభం ఉద్యమమే కాదు మరణం కూడా వివాదం రాజుకుంది. ముద్రగడ అంత్యక్రియలకు ఆయన కుమార్తె క్రాంతిని రానివ్వకపోవడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై ముద్రగడ పద్మనాభం స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా తన చెల్లెలె క్రాంతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మరణానికి చెల్లెలు కారణం అని ప్రకటించారు. తన తండ్రిని మానసిక క్షోభకు గురయ్యారని.. దాని కారణంగానే ఆయన మరణించారని ముద్రగడ గిరిబాబు తెలిపారు.

కిర్లంపూడిలోని నివాసంలో ముద్రగడ గిరిబాబు మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు తెలిపారు. 'సోదరి క్రాంతి వల్లే నా తండ్రి మానసిక క్షోభకు గురై మృతి చెందారు. నా తండ్రి మరణించక ముందు చెప్పిన విషయాలనే మా కుటుంబం చేసింది' అని వివరించారు. తన తండ్రి మరణించకముందే ఐదు విషయాలు చెప్పినట్లు ముద్రగడ గిరిబాబు తెలిపారు. 'నన్ను కాల్చవద్దు.. పూడ్చాలి. పెద్ద రోజు కానీ చిన్న రోజు చేయరాదు. అంటే దశదిన కర్మ చేయరాదు. తాను చనిపోయినా బొట్టు, గాజులు, పూలు తీయరాదు. పుట్టుకతో వచ్చినవి తీయరాదు. క్రాంతి గాలి కూడా పడొద్దు. ఎప్పటికీ క్షమించకు. దగ్గరకు రానివ్వదు. ప్రభుత్వం ఏమీ ఇచ్చినా స్వీకరించొద్దు. ఎప్పుడూ వారి వద్ద చేయి చాపరాదు' అని ముద్రగడ గిరిబాబు వెల్లడించారు.

ప్రభుత్వం వచ్చే వాటిని అందుకోవద్దని చెప్పినట్లు వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్రగడ గిరిబాబు తెలిపారు. బతికి ఉన్నప్పుడు అవమానించి అంతిమ సంస్కారాలకు గౌరవం ఇస్తానంటే ఎలా స్వీకరిస్తామని ప్రశ్నించారు. తమ కుటుంబానికి గౌరవం ఇచ్చింది తండ్రి మరణించే వరకు వెన్నంటే ఉన్నది మాజీ సీఎం జగన్ అని తెలిపారు. తన తండ్రి పద్మనాభానికి తమ కుటుంబం ఎన్ని జన్మలు ఎత్తిన రుణపడి ఉంటుందని ప్రకటించారు. 'సోదరి క్రాంతిని దగ్గరకు రానివ్వదని నా తండ్రి చెప్పారని అందుకే రానివ్వలేదు. జనసేన పార్టీకి ఆమె ఎంత ఉపయోగపడుతుందో తెలియదు కానీ పార్టీని మాత్రం ఆమె బాగా ఉపయోగించుకుంటుందని' ముద్రగడ గిరిబాబు తెలిపారు.

తల్లిదండ్రులను బాధపెట్టిన వారిని ఎవరూ కూడా క్షమించరాదని ముద్రగడ గిరిబాబు చెప్పారు. తన తండ్రి చెల్లెలు క్రాంతి వలన చాలా ఆవేదనకు గురయ్యారని.. అలాంటి కూతురును ఎప్పుడూ దగ్గరకు రానివ్వరాదని చెప్పినట్లు వెల్లడించారు.

0
0
Report

CM Revanth Reddy Resolution: 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీలుగా యువత.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజల్ సాధ్యమేనా?

Hyderabad, Telangana:

CM Revanth Reddy 21-Age Resolution: 'కమిటీ కుర్రాళ్లు' సినిమాలో చూపించినట్లుగా, ప్రస్తుత జెన్-జీ (Gen-Z) యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతోంది. ఇదే కోవలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు యువతలో కొత్త జోష్ నింపాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రతిపాదన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల కనీస వయస్సు నిబంధనను 21 ఏళ్లకు తగ్గించాలని ఆయన కోరారు. మరి రీల్‌లో మాదిరిగా రియల్‌గా ఇది సాధ్యమేనా? ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం.

సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజల్ నేపథ్యం ఏమిటి?
భవిష్యత్తులో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, యువత ఎన్నికల్లో నేరుగా పోటీ చేసేలా అర్హత వయస్సును 21 ఏళ్లకు తగ్గిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసేసరికి యువత వయస్సు సుమారు 20 ఏళ్లు ఉంటుందని, ఆ వెంటనే వారు రాజకీయాల్లోకి వచ్చి దేశ సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని, రాజ్యాంగ సవరణ (ఆర్టికల్ 368) ద్వారా ఇది సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు.

ముందున్న సవాళ్లు ఏంటి?
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆపై రాజ్యాంగ సవరణను ఆమోదింపజేయడం అంత సులువైన విషయం కాదు. ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు, కుటుంబ నేపథ్యం, పార్టీ బలమైన మద్దతు కీలకంగా మారుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా జాతీయ స్థాయిలో పోటీ చేయడం సవాలుతో కూడుకున్నదే.

వయస్సుతో సంబంధం లేకుండా రాణిస్తున్న యువ నాయకులు ఉన్న ఈ సమాజంలో ప్రస్తుత నిబంధనల ప్రకారమే 25 ఏళ్ల వయస్సులో అనేక మంది యువత చట్టసభల్లో అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు.

2024 పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 25 ఏళ్ల వయస్సులోనే పుష్పేంద్ర సరోజ్ (సమాజ్‌వాది పార్టీ), ప్రియా సరోజ్, శాంభవి చౌదరి (ఎల్‌జెపి), సంజనా జాతవ్ (కాంగ్రెస్) వంటి యువ నాయకులు ఎంపీలుగా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు.

అలాగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. బీహార్‌లో మైథిలి ఠాకూర్, హర్యానాలో ఆదిత్య సూర్జేవాలా, తెలంగాణలో మైనంపల్లి రోహిత్, ఒడిశాలో ఉపాసనా మోహపాత్ర వంటి యువత 25-26 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

సాధ్యమేనా? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
డబ్బు, రాజకీయ వ్యవస్థ ప్రభావం ఎంత ఉన్నప్పటికీ.. ప్రజల మద్దతు, నిజాయితీ, సరికొత్త ఆలోచనలు ఉంటే గెలవడం అసాధ్యమేమీ కాదు. సోషల్ మీడియా రాకతో యువతకు ప్రచారం చేయడం మరింత సులువయ్యింది. 1988లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18కి తగ్గించిన చరిత్ర మన దేశంలో ఉంది.

ఒకవేళ భవిష్యత్తులో చట్టసభల్లో పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ జరిగితే.. జెన్-జీ యువత భారీ సంఖ్యలో రాజకీయాల్లోకి వచ్చి దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Also Read: అరుణాచలం క్షేత్రంలో తీవ్ర విషాదం..మోక్షమార్గంలో ఇరుక్కొని ఆంధ్రప్రదేశ్ భక్తుడు మృతి

Also Read: Bala Krishna Health: హీరో బాలకృష్ణ ఆరోగ్యం ఎలా ఉందంటే? హెల్త్ బులిటిన్ విడుదల చేసిన ఆస్పత్రి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసలు.. అప్రమత్తంగా ఉండాలన్న CP సజ్జనర్..

Hyderabad, Telangana:

Indiramma Housing Scheme: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రమాదముందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ VC సజ్జనర్ ప్రజలను హెచ్చరించారు. లబ్ధిదారుల నుంచి రూ.10,000 లబ్ధిదారుల ముందస్తు డిపాజిట్ చెల్లించే ప్రక్రియ ప్రారంభం కావడంతో.. కేటుగాళ్లు నకిలీ కాల్స్‌తో పాటు అపరిచిత లింకులతో రెచ్చిపోయే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.

దళారులను నమ్మవద్దు.. 
ఈ పథకంలో ఎలాంటి దళారులు లేదా మధ్యవర్తులకు తావులేదని సీపీ తెలిపారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు. డబ్బులు ఇస్తే కచ్చితంగా ఇల్లు ఇప్పిస్తాం.. అని చెప్పే ఇతరుల మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మవద్దని ఆయన సూచించారు. నిబంధనల ప్రకారం.. చెల్లించిన ఈఎండీ డబ్బులు సెక్చూర్‌గానే ఉంటాయని.. ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ఆ మొత్తాన్ని దరఖాస్తుదారుడి ఒరిజినల్ బ్యాంకు ఖాతాకే ప్రభుత్వం నేరుగా తిరిగి జమ చేస్తుందని వివరించారు.

ఈ రోజే ఆఖరు తేదీ.. వెంటనే డబ్బులు కట్టకపోతే ఇల్లు రద్దవుతుంది అంటూ..  లబ్ధిదారులను భయపెట్టి, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలా చేసి.. నగదు బదిలీ చేయించుకోవడమే సైబర్ నేరగాళ్ల ప్రధాన వ్యూహమని సీపీ వివరించారు. వాట్సాప్ లేదా మెసేజ్‌ల ద్వారా వచ్చే ఏవైన లింకులను క్లిక్ చేసి.. ఎల్.పి.కె (APK) ఫైళ్లను ఇన్‌స్టాల్ చేస్తే.. ఫోన్ హ్యాక్ అయి.. బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని హెచ్చరించారు. 

అలాగే ప్రభుత్వ పోర్టళ్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి మోసగించే అవకాశం ఉందని తెలిపారు. సాయం చేస్తామనే నెపంతో ఎనీడెస్క్, టీమ్‌వ్యూర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయించి బ్యాంకు వివరాలు కాజేస్తారని పేర్కొన్నారు. పిన్ అనేది కేవలం ఇతరులకు డబ్బులు చెల్లించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రభుత్వ రీఫండ్ చేసిన డబ్బులు స్వీకరించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ పిన్ నమోదు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అపరిచిత వ్యక్తులకు ఆధార్ కార్డు ఫొటోలు, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు ఎప్పుడూ పంచుకోవద్దని తెలిపారు.

Also Read: Revanth Reddy: కేటీఆర్‌ బర్త్‌డేపై రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్‌ అడగాలి'

సందేహాలు ఉన్నాయా? 
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా.. పరిష్కారం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 040-24603572 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ పొరపాటున ఎవరైనా సైబర్ మోసానికి గురైతే.. తక్షణమే సొమ్మును ఫ్రీజ్ చేసేందుకు 1930 ఉచిత హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Also Read: Revanth Reddy: కేటీఆర్‌ బర్త్‌డేపై రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్‌ అడగాలి'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

0
0
Report
Advertisement

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడ...

Warangal, Telangana:

Narsampet Ex Mla Passes Away Fake News:  నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం సురక్షితంగా ఉందని, ఆయన ఆరోగ్యంపై వస్తున్న అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని హనుమకొండలోని రోహిణి హాస్పిటల్ సుపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి, పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందనీ.. అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేశారు.

న్యూమోనియాతో ఇబ్బంది.. 
ఇటీవల న్యూమోనియా కారణంగా పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. ఆరోగ్య పరిస్థితి కొద్దిగా క్షీణించడంతో వైద్యులు వెంటనే స్పందించి సిపిఆర్ (CPR) నిర్వహించారు. ప్రాథమిక చికిత్సల అనంతరం ఆయనకు హార్ట్ బీట్ మెరుగుపడింది.. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని, అభిమానుల ఆశీస్సులతో ఆయన క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

అసత్య ప్రచారాలు నమ్మవద్దు..
సామాజిక మాధ్యమాల్లో, కొన్ని వేదికలపై పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై రకరకాల పుకార్లు వ్యాపిస్తున్నాయని.. ఇవన్నీ కేవలం వదంతులు మాత్రమేనని పార్టీ ముఖ్య నాయకులు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలను విశ్వసించి.. ఎవరూ అధైర్యపడవద్దని, ఆసుపత్రి యాజమాన్యం లేదా కుటుంబ సభ్యుల నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే అధికారిక సమాచారంగా తీసుకోవాలని కోరారు.

త్వరలోనే ప్రజల మధ్యకు..
నర్సంపేట నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.. ప్రజల ప్రేమ, అభిమానుల ఆత్మీయత, పార్టీ కార్యకర్తల కోరికల మేరకు ఆయన త్వరలోనే కోలుకుని ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. నియోజకవర్గ సంక్షేమం, నర్సంపేట ప్రగతి కోసం ఎప్పటిలాగే తన సేవా కార్యక్రమాలను మరింత ఉత్సాహంతో కొనసాగిస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.

 

Also Read: Revanth Reddy: కేటీఆర్‌ బర్త్‌డేపై రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్‌ అడగాలి'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

ఆగస్టు 7న శక్తివంతమైన నవపంచమ రాజయోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని ధనలాభం!

Hyderabad, Telangana:

Navapanchama Rajayoga Effect On Zodiac: కొన్ని గ్రహాల కదలికలు మానవ జీవితాలపై చూపే ప్రభావం ఎంతో అద్భుతమైనదిగా భావిస్తారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన గ్రహం కదలికలు చేయబోతోంది. గ్రహరాజు అయిన సూర్యుడు, న్యాయదేవుడైన శని భగవానుడి కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన నవపంచమ దృష్టి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. 

రాబోయే ఆగస్టు 7 ఉదయం 8:11 గంటలకు సూర్య-శనులు పరస్పరం 120 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఈ శక్తివంతమైన యోగం ఏర్పడబోతోంది.. ఈ సమయం 4 రాశుల వారి జీవితాల్లో వస్తున్న సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.. ఇన్నాళ్లూ పడ్డ కష్టాలకు, వేదనలకు ప్రతిఫలంగా... అపారమైన ధనయోగం, కొండంత ఆనందం రాబోతున్నాయి..

ఈ రాశులవారికి బంఫర్‌ లాభాలు..
మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి ఈ రాజయోగం చాలా అద్బుతంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు అందుతుంది.. ప్రభుత్వ సంబంధిత పనుల్లో అద్భుత విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.. రాబడి గణనీయంగా పెరిగి బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది.. దాంపత్యం, ప్రేమ బంధాలు మెరుగుపడతాయి..

వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఇక తిరుగుండదు.. సుదీర్ఘకాలంగా మీరు పడుతున్న శ్రమకు ఫలాలు అందే అద్భుత ఘట్టంగా భావించవచ్చు.. ఉద్యోగంలో పదోన్నతి.. జీతంలో ఊహించని పెరుగుదల మీ ఆర్థిక పరిస్థితులను పూర్తిగా మార్చేస్తాయి. సరికొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. అనుబంధాల్లో ప్రేమ, ఆప్యాయతలు రెట్టింపవుతాయి. పాత ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభించి పరిపూర్ణమైన మనశ్శాంతి సమకూరుతుంది.

సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ యోగం అద్బుతమైన అవకాశాలను అందిస్తుంది. నిలిచిపోయిన పనులు వేగవంగా పూర్తవుతాయి. కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు లభించి సమాజంలో మీ గౌరవం విపరీంతగా పెరుగుతుంది. నిర్ణయాత్మక శక్తి పెరిగి క్లిష్ట పరిస్థితులను సైతం సులభంగా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ బంధంలో నమ్మకం పెరిగి బంధం మరింత బలపడుతుంది. విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు..

తులా రాశి (Libra)
తులా రాశి వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని ధనలాభాలు కూడా కలుగుతాయి. కళాత్మక, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమికుల జీవితం ఒక అందమైన మలుపు తిరిగి కొత్త వెలుగులు నింపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి వయస్సు 21 ఏళ్లకు తగ్గిస్తాం.. జెన్‌జీ తరానికి తెలంగాణ సీఎం తీపి కబురు

Hyderabad, Telangana:

Hyderabad: 'ఈ దేశం జెన్ జీది. దేశ భ‌విష్య‌త్తే యువ‌త‌రం భ‌విష్య‌త్తు. దేశం భ‌విష్య‌త్తు బాగుంటే యువ‌త‌రం భవిష్య‌త్తు బాగుంటుంది. ప్ర‌జాస్వామిక వాదులంతా దిక్కులు పిక్క‌టిల్లేలా యువ‌త‌కు మ‌ద్ద‌తు ఇచ్చారు. జంత‌ర్ మంతర్ నుంచి జెన్‌జీ పార్ల‌మెంటుకు వెళ్లాలి' అని రేవంత్ రెడ్డి సూచించారు. 61 వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ద్వారా ఓటు హ‌క్కు నుంచి 21 ఏళ్ల నుంచి 18 ఏళ్ల‌కి త‌గ్గించారు. 73,74 రాజ్యాంగ స‌వ‌ర‌ణతో స్థానిక సంస్థ‌ల్లో పోటీ చేయ‌డానికి 21 ఏళ్ల‌కు త‌గ్గించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు తగ్గిస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయడంతోపాటు నీట్‌ విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'జె‌న్ జీ యువ‌త‌ 56 ఇంచుల ఛాతిని ఓడించి విద్యా శాఖ మంత్రి రాజీనామా వ‌ర‌కు తెచ్చారు. కానీ ఇది సరిపోదు. నీట్ ప‌రీక్ష ప‌త్రాలు లీక్ కావ‌డంతో ఆత్మహ‌త్య‌లు చేసుకున్న విద్యార్థుల కుటుంబాల‌కు ప‌రిహారం ఇవ్వ‌లేదు. పోరాటంలో విద్యార్థుల‌పైన పెట్టిన కేసుల‌ను ఎత్తివేయ‌లేదు' అని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. 'కేంద్ర ప్ర‌భుత్వం ప‌రీక్షా నిర్వ‌హ‌ణ‌లో విఫ‌లం కావ‌డంతో అనేక మంది విద్యార్థుల న‌ష్ట‌పోయారు. భార‌త‌దేశ యువ‌త సాధించిన విజ‌యాన్ని కాంగ్రెస్ ఖాతాలో రాసుకోద‌ల్చుకోలేదు' అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

'ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా జెన్ జీ పోరాట ఫ‌లితం. పోరాటానికి నరేంద్ర మోదీ త‌ల‌వంచి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో రాజీనామా చేయించాడు. ఈ విజ‌యం మీది. రాజీనామాతో స‌రిపెట్టుకోకుండా అక్ర‌మ కేసుల‌ను తొల‌గించడానికి, చ‌నిపోయిన విద్యార్థుల కుటుంబాల‌కు సాయం కోసం ఈ ర్యాలీ చేప‌ట్టాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. విద్యార్థుల కుటుంబాల‌కు అండ‌గా ఉంటామని ప్రకటించారు. 'ఆగ‌స్టు మొద‌టి వారంలో అసెంబ్లీ, శాస‌న‌మండ‌లి ప్ర‌త్యేక స‌మావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసే వ‌యసు 21 ఏళ్లుగా ఉండాల‌ని  తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం' అని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. పార్ల‌మెంటులో ఈ బిల్లును ఆమోదించేలా కృషి చేస్తామని తెలిపారు. జె‌న్ జీ యువ‌త  విద్యాశాఖ  , ఐటీ శాఖ‌ల మంత్రులుగా  ఉంటే దేశం ముందుకు పోతుందని పేర్కొన్నారు.

'ప్ర‌పంచానికి జెన్ జీ గ‌ళం వినిపించాలి.. ఆ దిశ‌గా మేం ప‌నిచేస్తాం. పార్ల‌మెంటులో ఒక్క శాతంలోపే జెన్ జీ ప్రాతినిధ్యం ఉంది. 30 శాతం  ఉన్న జెన్ జీల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో అవ‌కాశం క‌ల్పించాల్సి ఉంది. 21 ఏళ్ల వ‌య‌సులో యువ‌తీయువ‌కులు చ‌ట్ట‌స‌భ‌ల‌కు పోటీ చేసే అవ‌కాశం ఉండాలి' అని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈడీ, సీబీఐ లాంటి వాళ్ల‌తో అక్ర‌మ కేసులు పెట్టి రాజ‌కీయ పార్టీలను లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నం చేశారని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీని, కేంద్రాన్ని గుండె ధైర్యంతో లాఠీలు, తూటాల‌కు ఎదురొడ్డి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌తో రాజీనామా చేయించారని యువతరంపై ప్రశంసలు కురిపించారు. ఈ సునామీ ఇంత‌టితో ఆగోద్దని యువతరానికి సూచించారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top