కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన చర్లపల్లి ప్రవాసంలో మెరుగుదెబ్బకు
Karimnagar, Telangana:కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభించిన అనంతరం, వానలో పొలం పనుల్లో ఉన్న రైతు కూలీల వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న మైనర్ బాలిక బోళ్ల అక్షయ్యను చూసి, ఆమె చదువు గురించి ప్రశ్నించారు. అక్షయ్య టెన్త్ పాసైనప్పటికీ ఆర్ధిక పరిస్థితి కారణంగా కూలీ పనులు చేస్తోంది. బండి సంజయ్, ఆమెను కాలేజీలో చేర్చడానికి సహాయం చేస్తానని చెప్పగా, అక్షయ్య ధన్యవాదాలు చెప్పారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
చేతులు లేవని ఆగలేదు.. కాళ్లతో అన్నకు రాఖీ కట్టిన సోదరి! వైరల్ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..
Hyderabad, Telangana:Ties Rakhi With Feet Video: రాఖీ పౌర్ణమి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అన్నా చెల్లెల అంతులేని అద్భుతమైన ప్రేమ.. సోదరుడు ఎల్లప్పుడూ తనకు రక్షణగా నిలవాలంటూ.. ఒక సోదరి తన అన్న చేతికి కట్టే రక్షాబంధన్ వారిద్దరి మధ్య ఉన్న విడదీయరాని బంధానికి ప్రతీక.. అయితే, రాఖీ పండగకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమగిల్లిపోతున్నాయి.. శారీరక లోపం వారి ప్రేమకు ఏమాత్రం అడ్డు కాదని నిరూపించిన ఈ అన్నాచెల్లెళ్ల అనురాగం.. సోషల్ మీడియా వినియోగదారుల హృదయాలను కదిలిస్తూ వస్తోంది.. అసలు ఆ వీడియో ఏంటి? దానికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా రాఖీ పండగ రోజున అక్కా చెల్లెల్లు.. తమ అన్నదమ్ముళ్ల మణికట్టుకు తమ చేతులతో రాఖీ కట్టి స్వీట్లను తినిపిస్తూ ఉంటారు. కానీ ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక సోదరి తన సోదరుడికి చేతులతో కాకుండా.. తన రెండు కాళ్లతో రాఖీ కట్టడం కనిపిస్తుంది.. ఆ అమ్మాయికి చేతులు లేకపోవడంతో.. తన కాళ్ళనే చేతులుగా మార్చుకొని.. రాఖీ కట్టడం ఈ వీడియోలో చూడొచ్చు. అంతటితో ఆగకుండా.. కాళ్లతోనే ఎంతో ప్రేమగా అన్నకు స్వీట్లు కూడా తినిపించేసింది.. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆనందం.. సోదరుడి పట్ల ఆమెకున్న ప్రేమానురాగాలు చూస్తే ఎంతటి కఠినాత్ములకైన కన్నీళ్లు రాక తప్పవు.. సోదరుడు కూడా చెల్లెలి పరిస్థితిని అర్థం చేసుకొని.. ఆమె కురిపించిన ప్రేమను అంతే సంతోషంగా స్వీకరించడం ఈ వీడియోలో అందరి మనసును హత్తుకునే ఒక అద్భుతమైన ఘట్టంగా భావించవచ్చు..
ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్ వేదికగా ఓ ఖాతాదారుడు షేర్ చేశారు. కాళ్లతో కట్టిన ఈ రాఖీ సోదరుడికి ప్రపంచంలోనే అత్యంత విలువైన రాఖీ.. ఆ సోదరి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉన్న ఆమె ధైర్యం చూడండి.. కాళ్లతో రాఖీ కట్టి స్వీట్లు కూడా తినిపించింది.. ఆ బిడ్డను చూస్తుంటే నిజంగా హృదయం కదిలిపోతుంది అని ఆయన ఎమోషనల్ గా క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది..
बिटिया को देखकर आंखें सच में नम हो गईं। pic.twitter.com/KPjPIIptTT
— Haji Nizamuddin Abbasi (@HajiNizamuddin3) August 25, 2026
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ప్రారంభమైంది.. వేలాదిమంది ఈ వీడియోని వీక్షించడమే కాకుండా.. లైకులతో పాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. నిజమైన ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఈ వీడియో నిరూపించిందని చాలామంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. బయటి పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా.. మనస్సులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే దారి దానంతట అదే దొరుకుతుంది అని ఓ సోషల్ మీడియా వినియోగదారుడు ప్రశంసించాడు.
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
చాణక్యుడి ఈ 6 రహస్యాలు తెలుసుకుంటే.. జీవితంలో ఎప్పుడూ మోసపోరు!
Hyderabad, Telangana:Chanakya Niti: ఆచార్య చానక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితాన్ని సున్నితంగా.. సులభతరంగా.. విజయవంతంగా మలుచుకోవడానికి ఎన్నో అద్భుతమైన మార్గాలను సూచించారు.. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో స్వార్థం ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది.. మన అవసరం తీరగానే వదిలేసే కపట.. స్వార్థపరులను గుర్తించడం చాలా కష్టమైపోయింది.. అయితే, అటువంటి మోసగాళ్ల బారిన పడకుండా.. ఆర్థిక నష్టాల పాలు కాకుండా ఉండాలంటే కొన్ని అద్భుతమైన ఉపాయాలను చాణక్యనీతి స్పష్టంగా వివరిస్తోంది. ఆచార్య చానక్యుడు సూచించిన ఆ ఆరు కీలకమైన రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్థికపరమైన విషయాలను సీక్రెట్ గా ఉంచండి..
వీరి ఎంత సంపాదించుతున్నారు? మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? మీరు ఎక్కడైనా అప్పు చేశారా? లేదా పెట్టుబడులు ఎక్కడైనా పెట్టారా? లాంటి మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన విషయాలను ఎవరితోనూ పంచుకోకండి.. మీ దగ్గర డబ్బులు ఉంటే కొందరు అసూయ పడవచ్చు.. లేదంటే మిమ్మల్ని వాడుకొని ఆర్థికంగా మోసం చేస్తే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు..
మీ బలహీనతలు ఎవరికి చెప్పకండి..
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బలహీనత లేదా భయం ఉంటుంది.. కానీ దానిని అందరి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. ఆశావాదులతో పాటు ఫీడ్ చేసేవారు మీ బలహీనతను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మానసికంగా.. ఆర్థికంగా దెబ్బతీయవచ్చు.. మీ వ్యక్తిగత కష్టాలను అత్యంత నమ్మకమైన సన్నిహితులతో మాత్రమే పంచుకోవడం చాలా మంచిది..
గుడ్డిగా అసలు నమ్మకండి..
మానవ సంబంధాలలో నమ్మకం చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు. కానీ ఇతరులను గుడ్డిగా నమ్మడం మిమ్మల్ని తీవ్ర అగాధంలో నెట్టేస్తుందని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. మీతో తీయగా మాట్లాడే వారంతా మీ శ్రేయోభిలాషులు అస్సలు కారు.. అవతలి వ్యక్తి అసలు రంగు ఏంటి.. వారి అంతర్గత ఉద్దేశాలను పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారిని నమ్మడం చాలా మంచిది..
భవిష్యత్తు ప్రణాళికలను కూడా చాలా సీక్రెట్ గా ఉంచుకోండి..
మీ భవిష్యత్తులో చేయబోయే పనులతో పాటు ప్రారంభించబోయే కొత్త వ్యాపారాలు లేదా లక్ష్యాల గురించి ముందుగానే డబ్బా కొట్టుకోకండి.. మీ ప్రణాళికలు ఆచరణలోకి రాకముందే ఇతరులకు తెలిస్తే.. వారు మీ విజయానికి అవసరమైన అడ్డంకులు సృష్టించే ప్రమాదం అధికంగా ఉన్నాయి.
వ్యక్తిగత నిర్ణయాల్లో ఇతరుల జోక్యం..
మీ జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్యమైన నిర్ణయాలు మీరే స్వయంగా లోతుగా ఆలోచించి తీసుకోవలసి ఉంటుంది. సలహాలు తీసుకోవాలనుకుంటే మీకు నిజమైన శ్రేయోభిలాషులైన వారిని.. ఆ రంగంలో అపారమైన అనుభవం ఉన్న వారిని మాత్రమే అడగండి.. అనవసరంగా ఎక్కువమందిని అడిగితే మీలో గందరగోళం పెరిగి.. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి..
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
తక్కువగా మాట్లాడండి..
అవసరానికి మించి ఎక్కువగా ఎక్కువగా మాట్లాడేవారు తెలియకుండానే తమ రహస్యాలను ఇతరుల ముందు బయట పెట్టేస్తూ ఉంటారు. అందుకే ఎల్లప్పుడూ తక్కువగా మాట్లాడడం మంచిదని చాణక్యనీతి శాస్త్రం చెబుతుంది.. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు సమన్వయం కోల్పోకుండా.. ప్రశాంతంగా ఉంటూ ఎదుటివారి ప్రవర్తనను గమనించడం అత్యంత తెలివైన వారి లక్షణం..
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Harish Rao: ఒక్కొక్కరికీ రూ.66 వేలు బాకీ పడ్డ రేవంత్ రెడ్డి.. ఇచ్చేయాల్సిందే: హరీశ్ రావు
Hyderabad, Telangana:BRS Party: దివ్యాంగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు పెంచుతామని చెప్పి ఒక్కొక్క దివ్యాంగుడికి రేవంత్ రెడ్డి రూ.66 వేలు బాకీ పడ్డాడని తెలిపారు. ఆనాడు రూ.500 ఉన్న పెన్షన్ను కేసీఆర్ రూ.4,016 చేసి ఆదుకున్నారని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన రూ.6,000 పెన్షన్ ఏది? బ్యాక్లాగ్ పోస్టులు, ఉచిత బస్సు ఏమాయె అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
అందాల పోటీలకు, ఫుట్బాల్ సోకులకు డబ్బులుంటాయి కానీ పెన్షన్లకు ఉండవా అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. రూ.30 వేల కోట్ల భూములు అమ్మాడు, వందల కోట్ల ఆస్తులు తమ్ముడికి కట్టబెట్టాడని విమర్శించారు. హామీలు అడిగితే తప్పుపడతారా..దివ్యాంగుల పక్షాన ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులపై నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తోందని.. హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం దివ్యాంగుల సమర శంఖారావం సభ జరిగింది.
దివ్యాంగుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి దయలేదు.
దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదు.
రూ. 500 ఉన్న దివ్యాంగుల పెన్షన్ను కేసీఆర్ గారు రూ. 4,016 చేసిండు. రిజర్వేషన్లను పెంచిండు.
దివ్యాంగుల చట్టాన్ని మొట్టమొదటిగా అమలుచేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం అవార్డు… pic.twitter.com/PCXn3UaoqY
— BRS Party (@BRSparty) August 29, 2026
ఈ సందర్భంగా దివ్యాంగులను ఉద్దేశించి మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 'తెలంగాణలో ఉన్నది దయలేని కాంగ్రెస్ ప్రభుత్వం. దివ్యాంగులపై కనీస మానవత్వం కూడా లేనిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దివ్యాంగులను ఓటర్లుగా కాదు కుటుంబ సభ్యులుగా కేసీఆర్ చూసుకున్నారు' అని తెలిపారు. దివ్యాంగుల కోసమే కేసీఆర్ ప్రభుత్వం రూ.10,300 కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు డబుల్ బెడ్రూం ఇళ్లలో 5 శాతం రిజర్వేషన్, విద్యా ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది అని వెల్లడించారు.
దివ్యాంగుల హక్కుల చట్టాన్ని దేశంలోనే అత్యుత్తమంగా అమలు చేసిన రాష్ట్రంగా 2015లోనే తెలంగాణ జాతీయ అవార్డు గెలుచుకుందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? రేవంత్ రెడ్డి దివ్యాంగుల పెన్షన్ను ఒక్క రూపాయి కూడా పెంచలేదని చెప్పారు. పైగా నెలనెలా ఇవ్వాల్సిన పెన్షన్ను ఒక నెల ఇస్తూ, ఇంకో నెల ఆపుతూ.. ఏకంగా మూడు నెలల పెన్షన్ ఎగ్గొట్టాడని మండిపడ్డారు.
ఒక్కొక్క దివ్యాంగుడు ఒక్కొక్క శక్తివంతుడు..
దివ్యాంగులను హేళన చేసిన వాడే అసలైన దివ్యాంగుడు!త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద
దివ్యాంగుల తరపున నిరసన కార్యక్రమాలు చేపడతాం.- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥 pic.twitter.com/T5sxvMmfa7
— BRS Party (@BRSparty) August 29, 2026
'దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు రూ.6000 పెన్షన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ.. ఇలా ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి దగా చేశారు. ఒక్క బ్యాక్లాగ్ పోస్టును కూడా భర్తీ చేయలేదు' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. 'రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచిపోయాయి. రాష్ట్రంలోని 5 లక్షల 11 వేల మంది దివ్యాంగులకు హామీ ఇచ్చిన నెలకు రూ.6000 చొప్పున లెక్కేస్తే.. ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం ఏకంగా 66 వేల రూపాయలు బాకీ పడింది' అని వెల్లడించారు.
'ఎన్నికలు దగ్గర పడే సమయానికి ఆరు నెలల పెన్షన్లు విదిలించి ప్రజలను మభ్యపెట్టొచ్చు అనుకుంటున్నారేమో! దివ్యాంగులు మీ మోసాలను మర్చిపోరు. మిమ్మల్ని నమ్మరు' అని కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు బుద్ధి చెప్పారు. దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? లేక మనసు లేదా? అని ప్రశ్నించారు. అందాల పోటీలకు, ఫుట్బాల్ సోకులకు, మూసీ సుందరీకరణకు వందల, లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిలదీశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నాయకులు వాసుదేవ రెడ్డి, దేవీ ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్తోపాటు పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు.
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్
Dharmavaram, Andhra Pradesh:Cricketer Washington Sundar Visited Tirumala Lord Venkateswara Swamy Temple Watch VisualsTirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దామచర్ల
Tirupati Urban, Andhra Pradesh:Rakhi To Trees: చెట్లనే తోబుట్టువులుగా రాఖీ కట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
Anantapur, Andhra Pradesh:School Students Ties Rakhi To Trees In Anantapur District Watch Viral VideoPulasa Fish: వేలంపాటలో రికార్డు స్థాయిలో గోదావరి పులస చేప ధర.. ఎంతంటే?
Yanam, Puducherry:Pulasa Fish Record Price: గోదావరి పులస చేపకు ఎప్పుడూ భారీ ధర పలుకుతుంది. గతేడాది వేలం పాటో రికార్డు స్థాయిలో ధర పలకగా.. ఈ సారి కూడా భారీ ధరకు పులస చేప అమ్ముడుపోయింది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక పులస చేప లభించడం లేదు. కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్ద పులస చేట మత్య్సకారులకు చిక్కింది. వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు రెండు కిలోల పులస చేప చిక్కగా వేలం పాట వేయగా భారీ ధర పలికింది. పులస చేపను యానాం ఫిష్ మార్కెట్లో వేలం వేస్తే పార్వతి అనే మత్స్యకార మహిళ రూ.24 వేలకు దక్కించుకుంది. ఈ సీజన్లో ఇదే అతి పెద్ద పులస... అత్యధిక ధర కావడం విశేషంగా మారింది.
ఏటా వరదల సమయంలో గోదావరికి ఎర్రనీరు పోటెత్తిన సమయంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా సరిహద్దులోని కేంద్రపాలిత ప్రాంతం యానాం వద్ద గౌతమి గోదావరిలో పులసలు లభిస్తుంటాయి. పులస చేపకు అత్యంత డిమాండ్ ఉంటుంది. అయితే కొన్నేళ్లుగా పులుస చేపలు రావడం తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది ఎల్నినో కారణంగా గోదావరి వరద నామమాత్రంగా ఉండడంతో పులస చేపలు చిక్కడం లేదు. పులస చేపల కోసం మత్య్సకారులు ఎదురుచూస్తుంటే గోదావరిలో భారీ వరద ప్రవాహం లేకపోవడంతో పులస చేపలు కనిపించడం లేదు.
ఈ ఏడాది ఇప్పటివరకు మూడు పులుస చేపలు మాత్రమే లభించాయి. మార్కెట్లో వేలానికి వచ్చిన పులస చేపలకు భారీ డిమాండ్ ఏర్పడింది. నెల రోజుల కిందట వచ్చిన మొదటి రెండు పులస చేపలకు ఒక్కొక్కటి దాదాపు 15 వేల రూపాయల వరకు ధర పలికాయి. తాజాగా ఇప్పుడు వచ్చిన రెండు కేజీల పులుస చేప అత్యధికంగా 24 వేల రూపాయలు పలికింది. అయితే మత్స్యకార మహిళల నుంచి పులస చేప అంటే చెవి కోసుకునే మాంసాహార ప్రియులు ఫైనల్గా ఎంత రేటుకు కొనుగోలు చేశారో తెలియాల్సి ఉంది.
మరోవైపు గోదావరి జిల్లాలకు చెందిన వారు పులస చేప కూరను హైదరాబాద్లో సినిమా హీరోలు, రాజకీయ నాయకులకు గిఫ్ట్గా పంపించడం సాంప్రదాయం. 24 వేల రూపాయలకు కొనుగోలు చేసిన ఈ చేపను ఎవరికైనా గిఫ్ట్గా పంపించారా అనేది తెలియాల్సి ఉంది. గోదావరికి కొద్దిరోజులుగా మరోసారి స్వల్ప వరద రావడంతో ఇంకా పులస చేపలు దొరుకుతాయా అని మత్స్యకారులు ఆశగా వలలు వేస్తున్నారు. మరి పులస అదృష్టం మత్య్సకారులను వరిస్తుందా? లేదా అనేది ఆశగా ఎదురుచూస్తున్నారు.
1000 రోజులు దాటినా హామీలు ఎక్కడ? కాంగ్రెస్పై చల్మెడ లక్ష్మీనరసింహారావు ఫైర్..
Hyderabad, Telangana:Brs Vemulawada Protest: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో ఘోర నిర్లక్ష్యంపై ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని BRS వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చైర్మన్ లక్ష్మీనరసింహారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. వేములవాడ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో పాటు కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 గడుస్తున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రధాన వాగ్దానాలు నెరవేరలేదని చల్మెడ లక్ష్మీనరసింహారావు విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు మోసపూరితమైన వైఖరిని ఎండగట్టేందుకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రతి మండలం తో పాటు గ్రామంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు 420కి పైగా హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. తీర అధికారం దక్కాక వాటిని గాలికొదిలేసిందని ఆయన మండిపడ్డారు.. రైతులతో పాటు మహిళలు, యువత, పడకు బలహీన వర్గాలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నీటి మూటలుగా మారిందని ఆరోపించారు.. పాలన వైఫల్యాలతో పాటు క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న అవినీతి ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత BRS కార్యకర్తలపై ఉందన్నారు..
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని.. పథకాల అమలులో కోతలు విధిస్తూ ప్రజలను వంచిస్తున్నారని చల్మెడ పేర్కొన్నారు.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కాంగ్రెస్ వైఫల్యం పై కరపత్రాల పంపిణీ తో పాటు రచ్చబండ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. హామీల అమలులో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని వివరిస్తూ స్థానిక ప్రజలను చైతన్యం చేయడమే కాకుండా.. మండల స్థాయి నాయకులతో పాటు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేస్తూ నిరసనలు విజయవంతం చేయాలని కోరారు.. ఈ పోరుబాట ద్వారా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
Hyderabad, Telangana:Jagtial Rtc Driver Heart Attack: ప్రాణం పోయేంత తీవ్రమైన గుండెనొప్పి వేధిస్తున్నప్పటికీ.. తన ప్రాణం కంటే బస్సులో ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యం అనుకున్నాడు ఒక ఆర్టీసీ డ్రైవర్.. చివరి క్షణం లోను స్టీరింగ్ను నియంత్రించి.. బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన ఆపి దాదాపు 60 మంది ప్రయాణికులను మృత్యుంజయులుగా మార్చాడు.. జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశంగా దారితీసింది. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మద్దునూరు గ్రామం నుంచి ప్రయాణికులతో జగిత్యాల పట్టణానికి బయలుదేరింది.. ఆ సమయంలో బస్సులో విద్యార్థులతో పాటు నిత్య ప్రయాణికులు, మహిళలతో కలిపి దాదాపు సుమారు 50 నుంచి 60 మంది వరకు ఉన్నారు.. బస్సు వేగంగా ప్రయాణిస్తూ తిప్పన్నపేట శివారు ప్రాంతానికి చేరుకోగా.. ఆ బస్సును తోలుతున్న డ్రైవర్ లక్ష్మణ్ కు అకస్మాత్తుగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది..
జాతిలో విపరీతమైన నొప్పి మొదలైనప్పటికీ.. డ్రైవర్ లక్ష్మణ్ ఏ మాత్రం సమన్వయం కోల్పోలేదు.. వాహనం అదుపుతప్పి భారీ ప్రాణ నష్టం జరుగుతుందని గ్రహించిన ఆయన.. అత్యంత చాకచక్యంగా బ్రేకులు వేసి బస్సును రోడ్డు పక్కకు సురక్షితంగా నిలిపేశారు. వాహనం ఆగి ఆగగానే.. స్టీరింగ్ పైనే స్పృహత పిక్ కుప్పకూలిపోయా.. బస్సు సురక్షితంగా ఆగడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. డ్రైవర్ పరిస్థితి చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు..
అకస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్ లక్ష్మణ్ ను కాపాడేందుకు ప్రయాణికులతో పాటు స్థానికులు వెంటనే రంగంలోకి దిగారు.. అత్యవసర సేవల కోసం ఆంబులెన్స్ కు సమాచారం అందించినప్పటికీ.. అనుకోని సాంకేతిక కారణాలవల్ల అది సమయానికి అందుబాటులోకి రాలేదు.. దీంతో వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్థానిక ఆటోను ఏర్పాటు చేసి డ్రైవర్ను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు..
ప్రస్తుతం ఆస్పత్రిలో డ్రైవర్ లక్ష్మణ్ కు వైద్య అత్యవసర చికిత్సలు అందిస్తున్నారు. ఆయన పరిస్థితిని వైద్య బృందం నిక్షితంగా పర్యవేక్షిస్తుంది. ఆ సమయంలో డ్రైవర్ ఒక సెకండ్ పార్ట్ తడబడిన మా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని.. ప్రాణం పోయే స్థితిలోనూ మా గురించి ఆలోచించి బస్సును సురక్షితంగా నిలిపివేశారు అంటూ ప్రయాణికులు లక్ష్మణ్ సమయస్ఫూర్తి.. బాధ్యతాయుత ప్రవర్తన ను కొనియాడుతున్నారు.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆర్టీసీ సిబ్బంది కూడా ప్రార్థిస్తున్నారు..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
DK Aruna: హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించాలి: డీకే అరుణ
Mahbubnagar, Telangana:DK Aruna vs Revanth Reddy: మైనారిటీలకు ఇచ్చిన హామీల అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ఇంటిని, సచివాలయం, అసెంబ్లీ ముట్టడికి మైనారిటీ మోర్చా సిద్ధంగా ఉండాలని అని ఎంపీ అరుణ సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలు దూరమైన ప్రతిసారి మైనారిటీలను కాంగ్రెస్ రెచ్చగొడుతుందని మండిపడ్డారు. మైనారిటీల కోసం కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని ఎంపీ డీకే అరుణ సవాల్ చేశారు.
మహబూబ్నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మైనారిటీ మోర్చా సమావేశం శనివారం నిర్వహించగా ఈ సమావేశంలో ఎంపీ డీకే అరుణ కీలక ప్రసంగం చేశారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన సభలో ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్రంలో మైనారిటీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది. చేతలు శూన్యం. మైనారిటీలను ఓటు బ్యాంకుగా మాత్రమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నాయి. వారికి మేలు చేయాలనే ఎప్పుడూ ఆ పార్టీలకు లేదు. 60 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మైనారిటీలకు ఎటువంటి మేలు చేయలేదు. మైనారిటీలలో బీజేపీ పై మతతత్వ పార్టీ అని విద్వేషం రెచ్చగొడుతున్నారు' అని కాంగ్రెస్ తీరుపై ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు.
మైనారిటీల కోసం కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలని ఎంపీ డీకే అరుణ సవాల్ చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, విద్యావైద్యంలో మైనారిటీలకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రత్యేక ప్రోత్సాహకాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాగితాలకే మైనారిటీ సంక్షేమం పరిమితమైందని తెలిపారు. ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధుల అభివృద్ధిపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని చెప్పారు. 'దేశంలో ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా బీజేపీ ఏం చేసిందో ఒక్కటి చెప్పండి. తమ నుంచి ముస్లింలు దూరమైన ప్రతిసారి మైనారిటీలను కాంగ్రెస్ రెచ్చగొడుతుంది' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనలో మైనారిటీ గురుకులలకు సొంత భవనం రాష్ట్రంలో ఎక్కడైనా నిర్మించారా? అని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. మైనారిటీల అభివృద్ధికి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఎన్ని రుణాలు ఇచ్చారని నిలదీశారు.
'క్రిస్టియన్ మైనారిటీలో కూడా బీజేపీపై విద్వేషం నూరి పోస్తున్నారు. బీజేపీ చర్చ్లు కూల్చుతుందని తప్పుడు ప్రకారం చేశారు. ఎవరో ఒక్కరు తప్పు చేస్తే లేనివి ఉన్నట్లు బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాటకంలో భాగం కావద్దు. దేశ అభివృద్ధిలో మనం అందరం భాగం కావాలి' అని మైనార్టీ సోదరులకు డీకే అరుణ పిలుపునిచ్చారు. వికాసిత్ భారత్ లక్ష్యంతో ప్రధాని పని చేస్తున్నారని తెలిపారు. కుల, మతాల పేరుతో దేశాన్ని విచ్చినం చేసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
'భారతదేశం ప్రపంచ దేశాల కన్నా భిన్నమైన దేశం. మతసామరస్యం ఐకమత్యంగా మెదులుతున్నాం. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రైస్తవ, ముస్లిం, ఇతర మైనారిటీ సోదరులందరితో సమావేశాలు ఏర్పాటు చేసి బీజేపీపై విద్వేషం రెచ్చగొడుతున్నా వారు ఎవరి ప్రయోజనాల కోసం రెచ్చగొడుతున్నారో వివరించాలి' అని మైనార్టీ మోర్చ నాయకత్వానికి ఎంపీ డీకే అరుణ దిశానిర్దేశం చేశారు. 'మైనారిటీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోరాటానికి మైనారిటీ మోర్చా సిద్ధమైంది.
'మైనారిటీ కార్పొరేషన్ నుంచి రుణాలు అందడం లేదు. జైన్, సిక్కు, పార్శిలను మైనారిటీలుగా కేంద్రం గుర్తించినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా గుర్తించడం లేదు. మైనారిటీ సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై పెద్ద ఎత్తున పోరాటం మైనారిటీ మోర్చా చేయాలి' అని ఎంపీ డీకే అరుణ సూచించారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మైనారిటీ మోర్చా పోరాటానికి మద్దతుగా ఉంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగ్మోహన్ సింగ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.
Tree Rakhi: అనంతపురంలో వినూత్నంగా రాఖీ.. చెట్లకు రాఖీ కట్టిన విద్యార్థులు
Ananthapur, Andhra Pradesh:Rakhi With Trees: మానవుడి జీవనానికి ఆధారంగా నిలుస్తున్న చెట్లపై విద్యార్థులు తమ ప్రేమను చాటుకున్నారు. ప్రకృతిని ప్రేమించాలని.. చెట్లను పరిరక్షించాలని ఆకాంక్షిస్తూ రాఖీ పండుగను విద్యార్థులు చెట్లతో చేసుకున్నారు. ఏపీలోని అనంతపురం జిల్లా కుందుర్పి మండలం అపిలేపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్నంగా రాఖీ పండుగ జరుపుకున్నారు. అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు.. ఒకరికొకరు రక్షణకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన రక్షాబంధన్ను విద్యార్థులు చెట్లతో చేసుకున్నారు. అపిలేపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఒక వినూత్న ఆలోచనతో పాఠశాలలో జరుపుకున్నారు.
మనకు నిత్యం ప్రాణవాయువు అందిస్తూ.. పర్యావరణాన్ని కాపాడుతున్న చెట్లకు రాఖీలు కట్టి వాటిని రక్షించాలనే సందేశాన్ని విద్యార్థులు సమాజానికి, తల్లిదండ్రులకు అందించారు. పాఠశాల ఆవరణలోని ఉసిరి, టేకు, మామిడి, కొబ్బరి, మహాగని, మేడి, వెలగ, చింత, వక్క, సరుగుడు, బాదం చెట్ల చుట్టూ విద్యార్థులు చేరి వాటిని తమ కుటుంబసభ్యులుగా భావించారు. చెట్లకు కుంకుమ బొట్లు పెట్టి నీళ్లు పోసి వాటికి రాఖీలు కట్టారు.
మొక్కలను కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును మనమే కాపాడుకోవడమే అనే నినాదంతో పర్యావరణ పరిరక్షణపై రాఖీ పండుగ రోజు తోటి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు మొక్కలకు నీరు పోయడం, వాటిని సంరక్షించడం చేయాలని విద్యార్థులు సూచించారు. పండుగలు, జాతరల పేరుతో చెట్లను నరికివేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పుట్టినరోజు, మాతృదినోత్సవం రోజు అమ్మకు గుర్తుగా మొక్కలు నాటడం చేయాలని.. పచ్చదనం పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ వినూత్న రాఖీ వేడుకలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బొమ్మయ్య మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో ప్రకృతి పట్ల.. మొక్కల పట్ల ప్రేమ, అనుబంధం ఏర్పడుతుందని చెప్పారు. మనుషుల మధ్య కాకుండా మనిషికి ప్రకృతికి మధ్య కూడా అవినాభావ సంబంధం ఉండాలని చాటి చెప్పేందుకు ఇలా రాఖీ పండగ చేసినట్లు వెల్లడంచారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా చిన్నారుల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతను పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంత రాయుడు, ఉపాధ్యాయులు నాగేశ్వరి, సురేష్, లోకేష్, రాజా తదితరులు పాల్గొన్నారు.
చేతిలో పాము గుడ్డు.. పెంకును తొలగించగానే బయటకొచ్చిన పాముపిల్ల!
Hyderabad, Telangana:Snake Hatchling Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. అయితే వాటిల్లో కొన్ని వీడియోలు మాత్రమే అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా ప్రకృతిలోని అద్భుతాలను కళ్లుకు కట్టినట్లు చూపిస్తూ ఉంటాయి. తాజాగా KP SNAKE EXPRT అనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఒక షార్ట్ వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపడడమే కాకుండా... వారి అభిప్రాయాలను కూడా పంచుకుంటున్నారు.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వీడియో మొదట్లోనే ఒక స్నేక్ రెస్క్యూయర్ చేతిలో తెల్లటి పాము గుడ్లను పట్టుకుని జాగ్రత్తగా సోషల్ మీడియా వినియోగదారులకు చూపించడం మీరు గమనించవచ్చు.. ఆ గుడ్డుపై చిన్న పగలు కనిపించగానే.. లోపల ఉన్న పాము బయటికి రావడానికి సహాయం చేస్తూ.. గుడ్డు పెంకులను ఎంతో నెమ్మదిగా చిన్న చిన్నగా తొలగించడం మీరు ఈ వీడియోలో క్లియర్గా గమనించవచ్చు..
అయితే కొద్ది సెకండ్ల వ్యవధిలోనే ఒక చిన్న.. ఎంతో అందమైన పాము నెమ్మదిగా తలను పైకెత్తి బయటి ప్రపంచాన్ని చూడడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అది తన చిన్న నాలుకను బయటకు చాస్తూ.. భయం లేకుండా రెస్క్యూయర్ అరచేతిపైకి పాకుతూ రావడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయారు..
గుడ్డు లోపల ముడుచుకొని ఉన్న ఆ చిన్నజీవి.. మెల్లగా బయటికి వచ్చి తన పూర్తి శరీరాన్ని చాచిన దృశ్యం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తోంది. పాము పిల్లల పట్ల సాధారణంగా ఉండే భయాన్ని పక్కనపెట్టి.. సోషల్ మీడియా వినియోగదారులు దీనిని ప్రకృతి అందంగా అభివర్ణిస్తూ లైకులతో పాటు కామెంట్లు చేస్తూ ఉన్నారు.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఆశ్చర్యపడుతూ కామెంట్స్ కూడా చేస్తున్నారు..
ఇక పాము గుడ్లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే.. పాము గుడ్ల పెంకు పక్షుల గుడ్ల లాగా గట్టిగా ఉండదని.. కొద్దిగా మెత్తగా.. తోలు లాగా ఉంటుందని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుడ్డులోంచి బయటకు రావడానికి పిల్ల పాములు తన మూతి పై ఉండే ప్రత్యేకమైన చిన్న వంటిని ఉపయోగించి గుడ్డును చీల్చుకొని బయటికి వస్తాయట. చాలా జాతుల పాములు పిల్లలు పుట్టిన క్షణం నుంచి స్వాతంత్రంగా జీవించడంతోపాటు ఆహారాన్ని వేటాడడం ప్రారంభిస్తాయట..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
స్కూల్ బ్యాగ్ జిప్ తీయగానే షాక్.. లోపల దాక్కున్న పాము వీడియో..
Hyderabad, Telangana:Snake Inside School Bag Video: వర్షాకాలం లేదా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు విష సర్పాలతో పాటు కీటకాలు వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్లలోకి.. నిత్యవసర వస్తువుల్లోకి చేరడం సర్వసాధారణం.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాట్ వీడియో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.. పిల్లలు రోజు భుజాన వేసుకునే స్కూల్ బ్యాగ్ లోనే ఒక పాము దర్జాగా నక్కి కూర్చున్న దృశ్యం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తుంది.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు మాత్రం నెటిజన్లను షాప్కు గురిచేస్తున్నాయి.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక బ్యాగ్లో పాము ఉన్నట్లు అనుమానం రావడంతో స్నేక్ ఎక్స్పర్ట్ (Snake Rescuer) రంగంలోకి దిగాడు.. గదిలో నేలపై పెట్టిన ఆ ఒక నీలిరంగు స్కూల్ బ్యాగ్ జిప్ జాగ్రత్తగా తెరవగా.. లోపల పరశు వెనుక భాగంలో ఒక సన్నని కట్లపాము నక్కి ఉండడం మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఏమాత్రం తొందరపడకుండా.. ఎంతో అద్భుతమైన నైపుణ్యంతో ఆ స్నేక్ క్యాచర్ చేతితో పాము తోకను పట్టుకొని నెమ్మదిగా బయటికి తీయడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ పాము సురక్షితంగా బయటికి తీయడంతో అక్కడున్న కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది..
ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా బడికి వెళ్లే పిల్లలు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు సైతం సూచిస్తున్నారు. పిల్లల స్కూల్ బ్యాగులను నేలపై లేదా తలుపుల మూలల్లో వదిలివేయకుండా కాస్త ఎత్తైన ప్రదేశాల్లో వేలాడదీయడం మంచిదని వారు చెబుతున్నారు. బ్యాగ్ అవసరం లేనప్పుడు జిప్పులు పూర్తిగా మూసి ఉండేలా చూసుకోవాలని అంటున్నారు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
ఉదయం పూట పుస్తకాలతో పాటు లంచ్ బాక్సులు సర్దేటప్పుడు లోపల ఏముందో చూసి చేతులు పెట్టాలని వన్యప్రాణి సంరక్షకులు తెలుపుతున్నారు.. అంతేకాకుండా బ్యాగులతో పాటు పిల్లలు రోజు వేసుకునే సాక్సులు షూలు కూడా ఒకసారి దులిపి ఆ తర్వాత పిల్లలకు వేయడం మంచిదని వారు చెబుతున్నారు.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వ్యూస్తో పాటు లైక్స్తో దూసుకుపోతోంది. ఇలాంటి సంఘటనలు చిన్నవే అయినప్పటికీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ముప్పు వాటినే అవకాశం ఉందని సోషల్ మీడియా వినియోగదారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
సెప్టెంబర్లో ఈ 3 రాశులకు లక్ష్మీదేవి కటాక్షం.. ఊహించని ధనలాభాలు!
Hyderabad, Telangana:September 2026 Astrology News: సెప్టెంబర్ నెలలో చాలా గ్రహాలు తమ రాశిని మార్చుకోబోతున్నాయి. సెప్టెంబర్ రెండవ తేదీన శుక్రుడు తులా రాశిలోకి.. సెప్టెంబర్ 7వ తేదీన బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.. ఆ తర్వాత సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించి.. సెప్టెంబర్ 26న బుధుడు మళ్లీ తన రాశిని మార్చుకొని తులా రాశిలోకి ప్రవేశిస్తాడు.. మరోవైపు కుజుడు సెప్టెంబర్ 18 నుంచి కర్కాటక రాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహసంచారాలతో పాటు వాటి ద్వారా ఏర్పడి శుభయోగం పరంగా మూడు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారు తమ వృత్తి తో పాటు ఆర్థిక విషయాల్లో గొప్ప విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా అద్భుతమైన జీవితంతో విశేషమైన లాభాలు పొందగలుగుతారు..
ఈ క్రింది రాశుల వారికి బంపర్ లాభాలు..
వృషభ రాశి
సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త సంపాదన కూడా పొందగలుగుతారు. అలాగే నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. వృత్తి జీవితంలో ఘననీయమైన పురోగతి లభిస్తుంది.. లక్ష్మీదేవి అనుగ్రహంతో పనుల్లో మీకు మంచి మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. అలాగే ఆంటీ నిర్ణయాలు తీసుకున్న అద్భుతమైన లాభాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొత్త బాధ్యతలు కూడా సులభంగా లభిస్తాయి.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా సెప్టెంబర్ నెల ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది.. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడడమే కాకుండా.. ఆదాయం విపరీతంగా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పూర్వికుల ఆస్తుల నుంచి మంచి లాభాలు పొందడంలో ఊహించని విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా వృత్తిపరంగా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాల పరంగా వస్తున్న ఒప్పందాలు కూడా సులభంగా ఖరారు అయితాయి. అంతేకాకుండా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వారి కలలు నెరవేరుతాయి..
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు సెప్టెంబర్ నెల ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కాకుండా శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వృత్తిలో ఘననీయమైన అభివృద్ధి కనిపిస్తుంది.. అంతేకాకుండా పదోన్నతులు లభించి అద్భుతమైన అవకాశాలు కూడా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా పాత పెట్టబడిలో నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందగలుగుతారు. వివిధ మార్గాల నుంచి డబ్బులు పొందడం వల్ల విశేషమైన ప్రయోజనాలు సొంతం చేసుకోగలుగుతారు..
నోట్.. ఇక్కడ అందించిన సమాచారం కేవలం సాధారణంగా నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.. దీనిని జీ తెలుగు న్యూస్ దృవీకరించదు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
శని-కుజుల కేంద్ర యోగం.. సెప్టెంబర్ నుంచి ఈ రాశుల వారికి డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Saturn-mars Alignment Effect On Zodiac: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి శని కుజ గ్రహాలు ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీనివల్ల కేంద్ర యోగము ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఈ యోగం కృషి, క్రమశిక్షణ, ధైర్యంతో పాటు పట్టుదలకు సూచికగా భావిస్తారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... కుజ, శని గ్రహాల ఈ స్థానం వల్ల చాలా కాలంగా ఉద్యోగాలు వ్యాపారాల పరంగా నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. దీంతోపాటు ఆర్థిక రంగంలో పురోగతి కూడా లభిస్తుంది. సరైన వ్యూహంతో కష్టపడి ముందుకు తాగితే.. అద్భుతమైన పురోగతితో పాటు ధన లాభాలు కూడా కలుగుతాయి.
ఈ రాశుల వారికి గోల్డెన్ జాక్పాట్..
మిథున రాశి
ముఖ్యంగా శని, కుజ గ్రహాల కలయికతో మిధున రాశి వారికి వృత్తిలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పనుల్లో కొత్త బాధ్యతలు రావడమే కాకుండా నిలిచిపోయిన ప్రణాళికలు తిరిగి ప్రారంభించి.. భవిష్యత్తులో అద్భుతమైన నాబాలు పొందుతారు. వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు లభించడమే కాకుండా తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయం కూడా ఈ సమయంలో అంచలంచలుగా పెరుగుతుంది. అలాగే ఖర్చులపై నియంత్రణ ఉంచడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సంబంధాలు మనసు విప్పి మాట్లాడటం వల్ల అనేక రకాల అపార్ధాలనుంచి విముక్తి లభిస్తుంది. అలాగే కుటుంబంలో కూడా మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది..
కన్య రాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు కేంద్ర యోగం కెరియర్ పరంగా అనేక మార్పులను తీసుకువస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులను అందించడమే కాకుండా కొత్త బాధ్యతలను అందిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో తప్పకుండా వేగవంతమవుతాయి.. వ్యాపారస్తులకు పాత పరిచయాల నుంచి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో సరిగ్గా ప్రణాళికలు వేసుకొని మంచి ఫలితాలు పొందగలుగుతారు. కష్టానికి తగిన సానుకూలమైన ఫలితాలు తప్పకుండా పొందగలుగుతారు..
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులను కూడా కుజ శని గ్రహాల కలయిక అద్భుతమైన ప్రయోజనాలనుందిస్తుంది. ముఖ్యంగా వ్యాపార భాగస్వామితో కలిసి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా విపరీతంగా పెరిగి వ్యక్తుల సపోర్టుతో విశేషమైన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడి అనుకున్న ధన లాభాలు కూడా పొందగలుగుతారు. కుటుంబంలో సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు హోదా పెరుగుతుంది..
మీన రాశి
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు కేంద్ర యోగంతో ఆర్థికంగా బోలేడు లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. వృత్తి సంబంధిత సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా ఉద్యోగాలు మార్పులు కూడా వస్తాయి. కొత్త బాధ్యతలు పొంది అనుకున్న ధన లాభాలు సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా పలుకుబడి పెరగడం కారణంగా వీరు జీవితంలో అద్భుతమైన ఆనందాన్ని సొంతం చేసుకుంటారు.. గౌరవ మర్యాదలు కూడా పెరిగి డబ్బులు భారీగా పొందగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
