కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన చర్లపల్లి ప్రవాసంలో మెరుగుదెబ్బకు
Karimnagar, Telangana:కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభించిన అనంతరం, వానలో పొలం పనుల్లో ఉన్న రైతు కూలీల వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న మైనర్ బాలిక బోళ్ల అక్షయ్యను చూసి, ఆమె చదువు గురించి ప్రశ్నించారు. అక్షయ్య టెన్త్ పాసైనప్పటికీ ఆర్ధిక పరిస్థితి కారణంగా కూలీ పనులు చేస్తోంది. బండి సంజయ్, ఆమెను కాలేజీలో చేర్చడానికి సహాయం చేస్తానని చెప్పగా, అక్షయ్య ధన్యవాదాలు చెప్పారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
పాపం.. చీర కొనివ్వలేదని కుక్కర్ మూతతో భర్తను చంపేసిన భార్య!
Hyderabad, Telangana:Maharashtra Saree Dispute Crime: పెళ్లిళ్లను స్వర్గంలో నిర్ణయిస్తారని చెబుతూ ఉంటారు మన పెద్దలు.. కానీ, ఆ తర్వాత జరిగే కొన్ని దారుణమైన గొడవలు జీవితాన్ని నరకంగా మారుస్తూ ఉంటాయి. సంతోషంగా, ఆనందంగా ఉండాల్సిన దంపతుల మధ్య చిన్నపాటి కారణాలే ప్రాణాలు తీసేంత తీవ్రరూపం దాల్చుతూ ఉంటాయి. తాజాగా మహారాష్ట్రలోని బడ్లాపూర్ పట్టణంలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. ఒక చీర విషయంలో మొదలైన చిన్నపాటి గొడవ.. చివరికి భర్త దారుణ హత్యకు దారితీసింది..
వివరాల్లోకి వెళ్తే..
బడ్లాపూర్ ప్రాంతానికి చెందిన హరేరామ్.. సునీతాదేవి భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.. కాగా.. కొంతకాలంగా భార్య సునీతాదేవి తనకోసం ఒక చీర కొనివ్వాలని భర్తను అడుగుతూ వస్తోంది.. అయితే, భర్త హరేరామ్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడమే కాకుండా.. చీర తేకపోవడంతో ఇంట్లో దంపతుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మాటమాట పెరిగి ఆవేశంతో ఊగిపోయిన సునీతాదేవి.. విచక్షణ కోల్పోయి భర్తపై దాడికి తెగబడింది.
ఇంట్లో ఉన్న కుక్కర్ మూతతో భర్త హరేరామ్ తలపై బలంగా బాదింది.. దెబ్బకు అతడు విలవిలలాడుతుండగానే.. ఆయన గొంతు నులిమి అతి దారుణంగా హత్య చేసింది. భర్త ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారించుకున్నాక... తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ భార్య అత్యంత తెలివిగా ఒక డ్రామాకు తెరలేపింది.
గుండెపోటు నాటకం..
భర్త మరణించిన అనంతరం ఆమె పొరుగువారికి, బంధువులకు ఫోన్ చేసి.. తన భర్తకు హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అతడికి సకాలంలో వైద్యం అందిద్దామనుకునే లోపే కన్నుమూశాడంటూ కన్నీరుమున్నీరుగా ఏడ్చింది.
అయితే, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.. భర్త మృతదేహంపై, ముఖ్యంగా తల, మెడ భాగంలో ఉన్న అనుమానాస్పద గాయాలను చూసి పోలీసులకు సందేహం వచ్చింది.. వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం తమదైన శైలిలో భార్య సునీతాదేవిని విచారించగా.. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది.
పోలీసుల గట్టి విచారణ ముందు ఆమె ఎక్కువ సేపు నిలబడలేకపోయింది.. చీర కొనివ్వలేదన్న కోపంతోనే భర్తను కుక్కర్ మూతతో కొట్టి.. గొంతు నులిమి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
అనాథగా మారిన కుమారుడు..
ఈ విషాద ఘటనతో వారి ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మిగిలిపోయాడు.. తండ్రి శాశ్వతంగా నూరేళ్లూ నిండి కన్నుమూయడం.. కన్నతల్లే హంతకురాలై జైలుపాలవ్వడంతో ఆ బాలుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. క్షణికావేశంలో ఒక చీర కోసం భార్య చేసిన ఈ దారుణమైన పని.. కుటుంబంలో కోలుకోలేని విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: NEET Re-Exam: నీట్ విద్యార్థులకు గుడ్న్యూస్.. చరిత్రలోనే తొలిసారి.. రంగంలోకి ప్రధాని మోదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cockroach Repellent: బొద్దింకల పాలిట యమరాజు..నాలుగో చిట్కా ఎంతో పవర్ఫుల్ అండ్ డేంజరస్!
Hyderabad, Telangana:Cockroach Repellent Tips: రాత్రిపూట లైట్ వేయగానే గది మూలల నుంచో లేదా వంటగది సింక్ నుంచో బొద్దింకలు బయటకు రావడం చూస్తే ఎవరికైనా చిరాకు పుడుతుంది. ఇల్లు ఎంత శుభ్రం చేసినా, మార్కెట్లో దొరికే కెమికల్ స్ప్రేలు చల్లినా ఇవి పూర్తిగా నిర్మూలన కావు. పైగా ఆ రసాయనాల ఘాటైన వాసన ఇంట్లోని పిల్లలకు, వృద్ధులకు ఆరోగ్యం పరంగా ఇబ్బంది కలిగిస్తుంది. రసాయనాల అవసరం లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని 4 ఇంట్లోనే తయారు చేసుకునే సురక్షితమైన చిట్కాలతో బొద్దింకలను ఇంట్లోంచి పూర్తిగా తరిమికొట్టవచ్చు.
అసలు బొద్దింకలు ఎందుకు వస్తాయి?
బొద్దింకలు ముఖ్యంగా చెత్త, మురికి, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల వైపు ఆకర్షించబడతాయి. మూసివున్న, వెచ్చని, తేమగా ఉండే గది మూలలు ఇవి సంతానోత్పత్తి చేయడానికి అనువుగా ఉంటాయి. పగటిపూట ఇవి బాత్రూమ్ లేదా సింక్ డ్రెయిన్లలో దాక్కుని, రాత్రి వేళల్లో మాత్రమే బయటకు వస్తుంటాయి.
బొద్దింకలను తరిమేసే 4 అద్భుతమైన ఇంటి చిట్కాలు
1) వెనిగర్, బేకింగ్ సోడా స్ప్రే
డ్రెయిన్లు, డ్రైనేజీ రంధ్రాల నుండి వచ్చే బొద్దింకలను నివారించడానికి ఇది ఉత్తమమైన మార్గం. ఒక కప్పు వెనిగర్లో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా, కొద్దిగా నీరు కలిపి స్ప్రే బాటిల్లో నింపండి. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు వంటగది సింక్, బాత్రూమ్ డ్రెయిన్ల లోపల, చుట్టుపక్కల చల్లండి. వెనిగర్ యొక్క తీవ్రమైన వాసనకు బొద్దింకలు ఆ ప్రాంతం వైపు రావు.
2) ఉల్లిపాయ, బేకింగ్ పౌడర్ మిశ్రమం
హోమ్ రెమిడీ నిపుణురాలు పూనమ్ దేవనాని సూచించిన ఈ విధానం బొద్దింకలపై వేగంగా పనిచేస్తుంది. ఒక ఉల్లిపాయను పేస్ట్లా రుబ్బి, రసాన్ని వడకట్టండి. ఆ ఉల్లిపాయ రసంలో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొద్దిగా నీరు కలిపి స్ప్రేలా తయారు చేయండి. బొద్దింకలు దాక్కునే మూలల్లో దీనిని చల్లండి.
గమనిక: ఈ స్ప్రేని తక్కువ మోతాదులో తయారు చేసుకుని 1-2 రోజుల్లోనే ఉపయోగించాలి. నిల్వ ఉంచితే దీని ప్రభావం తగ్గుతుంది.
3) పిండి, బోరిక్ పౌడర్ ఉండలు
వార్డ్రోబ్లు, కప్బోర్డ్లు, కిచెన్ డ్రాయర్ల మూలల్లో దాక్కునే బొద్దింకలకు ఇది సరైన పరిష్కారం. దీని తయారీకి 4 టీస్పూన్ల గోధుమ పిండి, 2 టీస్పూన్ల బేకింగ్ సోడా, 1 టీస్పూన్ పంచదార, కొద్దిగా బోరిక్ పౌడర్ (మార్కెట్లో సులభంగా దొరుకుతుంది) కలిపి పిండిలా కలపండి. చిన్న చిన్న ఉండలుగా చేసి కప్బోర్డులు, డ్రాయర్లు, పెట్టెల వెనుక ఉంచడం వల్ల అవి పంచదార వాసనకు ఆకర్షించబడి ఇవి తినడం వల్ల బొద్దింకలు నశిస్తాయి.
4) బేకింగ్ పౌడర్, చక్కెర పొడి (మ్యాజిక్ పౌడర్)
లిక్విడ్ స్ప్రే లేదా పిండి ఉండలు పెట్టడానికి వీలులేని ప్రదేశాలలో ఈ పొడిని ఉపయోగించవచ్చు. దీని తయారీ 2 టీస్పూన్ల పొడి చేసిన చక్కెరను 4 టీస్పూన్ల బేకింగ్ పౌడర్తో బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని వంటగది సామగ్రి ఉంచే షెల్ఫుల మూలల్లో ఈ పొడిని చల్లండి. రసాయనాలు లేకపోవడం వల్ల ఆహార పాత్రల దగ్గర కూడా దీనిని సురక్షితంగా వాడవచ్చు.
మార్కెట్ లభించే ఘాటైన రసాయనాల కంటే ఈ సహజ సిద్ధమైన చిట్కాలు సురక్షితమైనవి, అత్యంత ప్రభావవంతమైనవి. క్రమం తప్పకుండా 3-4 రోజులు పాటించడం వల్ల మీ ఇల్లు బొద్దింకల బెడద నుంచి పూర్తిగా విముక్తి పొందుతుంది.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read; Raw Garlic Benefits: ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఏం జరుగుతుంది?
Also Read: Milk Benefits: నిద్రపోయే ముందు పాలు తాగితే పరిస్థితి ఇంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కిలో రూ.9 కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ పౌడర్..
Hyderabad, Telangana:Most Expensive Tea Powder Latest News: సాధారణంగా మన దేశంలో కిలో టీ పొడి ధర రూ.300 నుంచి రూ.1,000 వరకు ఉంటుంది. కానీ.. కేవలం ఒక కప్పు టీ తాగాలంటే లక్షల రూపాయలు బిల్ కట్టాల్సిందే.. అవును నిజం.. కిలో టీ పొడి ధర ఏకంగా రూ.9 కోట్లు అని తెలిస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన దా-హాంగ్ పావో (Da Hong Pao) టీకి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న విలువ ఇది.. చైనాలోని పురాతన పర్వత ప్రాంతాలలో మాత్రమే లభించే.. ఈ అరుదైన టీ పొడిపై చైనా ప్రభుత్వం ప్రస్తుతం పూర్తి నిషేధం విధించింది.
ఏంటీ దా-హాంగ్ పావో?
మండరిన్ భాషలో దా-హాంగ్ పావో అంటే పెద్ద ఎర్రటి వస్త్రం అని అర్థం.. చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్లోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన వుయి పర్వతాల రాతి కొండచరియలపై ఈ టీ పండుతుంది. చైనా జానపద కథల ప్రకారం.. మింగ్ రాజవంశం కాలంలో తీవ్ర అనారోగ్యానికి గురైన రాణి.. ఈ పర్వత ఆకుల టీ తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారట.. దానికి కృతజ్ఞతగా చక్రవర్తి తన ఎర్రటి రాజవస్త్రాన్ని ఆ టీ మొక్కలకు కప్పించి గౌరవించారట.. అప్పటి నుంచి దీనిని దా-హాంగ్ పావో అనే వస్త్రంగా పిలవడం అలవాటు అయ్యిందని సమాచారం..
కేవలం 6 మొక్కలు మాత్రమే..
ఈ టీ అత్యంత అరుదైనదిగా మారడానికి ప్రధాన కారణం.. పర్వత లోయలలో శతాబ్దాల నాటి కేవలం 6 మొక్కలు మాత్రమే మిగిలి ఉండటం.. వీటి నుంచి లభించే ఆకుల పరిమాణం అత్యంత తక్కువ.. గతంలో జరిగిన వేలంలో కేవలం 20 గ్రాముల దా-హాంగ్ పావో టీ పొడి సుమారు రూ.1.23 లక్షల నుంచి రూ.26 లక్షల వరకు ధర పలికి ప్రపంచ రికార్డు సృష్టించింది.
జాతీయ సంపదగా గుర్తింపు..
ఈ పురాతన మదర్ ట్రీస్ను చైనా ప్రభుత్వం తమ జాతీయ సంపదగా ప్రకటించింది.. ఈ చెట్లకు హాని కలగకుండా కాపాడేందుకు 2006 నుంచి ఆకులను కోయడంపై సంపూర్ణ నిషేధం విధించింది.. చెట్ల రక్షణ కోసం ప్రత్యేక సెక్యూరుటీ గార్డులను కూడా ఉంచింది.. మార్కెట్లో అసలైన మదర్ ట్రీస్ ఆకులు లభించకపోవడంతో.. ప్రస్తుతం ఉన్న పాత స్టాక్ విలువ బంగారం, వజ్రాల కంటే ఎక్కువగా మారింది.
ప్రత్యేకమైన రుచి, సువాసన..
ఇది గ్రీన్ టీ, బ్లాక్ టీల కలయికగా ఉండే ప్రత్యేకమైన ఓలాంగ్ టీ రకానికి చెందినదిగా భావిస్తారు.. పర్వతాల రాతి పగుళ్లలోని ఖనిజాలను పీల్చుకోవడం వల్ల దీనికి విశిష్టమైన మట్టి వాసన.. ఆర్కిడ్ పూల పరిమళం, పండ్ల స్వల్ప రుచితో కూడిన సహజమైన తీపి లభిస్తుంది. దీనిని ఆస్వాదించిన తర్వాత ఆ సువాసన గొంతులో చాలా సేపు ఉంటుందని టీ తాగిన వారు చెబుతున్నారు.
Also Read; Onion Juice Benefits: ఉల్లిపాయ జ్యూస్ ఎప్పుడైనా తాగారా? తాగితే ఏం జరుగుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
ఆర్టీసీ బస్సు దొంగతనం కేసులో బిగ్ ట్విస్ట్.. ఎందుకు దొంగతనం చేశాడో తెలుసా?
Korutla, Telangana:RTC Bus Theft: ఆర్టీసీ బస్సు దొంగతనం కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపుతోంది. పట్టపగలు ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉంచిన బస్సును ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. తర్వాత బస్సు కోసం వచ్చిన డ్రైవర్, కండక్టర్ బస్సు కనిపించకపోవడంతో నివ్వెరపోయారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు బస్సు కోసం గాలించగా ఓ మార్గంలో దుండగుడు అత్యంత వేగంగా తీసుకెళ్తున్నాడు. అయితే ఇంతకీ బస్సు ఎందుకు ఎత్తుకెళ్లాడో అనే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం ఆగి ఉన్న బస్సును ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. పోలీసులు నడిరోడ్డుపై నిలబడి అడ్డుకున్నా ఆగకుండా అతడు రయ్మని తీసుకెళ్లాడు. అతడి స్పీడ్కు భయపడిన పోలీసులు వెంటనే మూడు పోలీస్ కాన్వాయ్లతో వెంటపడ్డారు. సినిమా రేంజ్లో మించిన ఈ ఛేజింగ్లో పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. అయితే రోడ్డుపై ఏర్పడిన ఒక గుంత కారణంగా బస్సు ఆగిపోవడంతో ఆ దుండగుడు దొరికాడు. లేకపోయి ఉంటే అతడు ఎంత బీభత్సం.. విధ్వంసం సృష్టించేవాడోనని అందరూ ఆందోళన చెందుతున్నారు.
కోరుట్ల బస్టాండ్లో డ్రైవర్ ప్రవీణ్ బస్సును నిలిపి టీ తాగుదామని కండక్టర్తో కలిసి వెళ్లగా.. ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన సాంబయ్య (40) బస్టాండ్కు వచ్చాడు. బస్టాండ్ నుంచి బస్సును తీసి సుమారు 15 కి.మీ. మేర హైవేపై బీభత్సం.. భయానక వాతావరణం సృష్టించాడు. అతికష్టంగా పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అయితే సాంబయ్య బస్సు ఎందుకు ఎత్తుకెళ్లాడని విచారణ చేయగా.. అతడు తాగిన మత్తులో అలా చేశాడని తెలిసింది.
సినిమాను మించిన ఛేజింగ్
టీ తాగి వచ్చిన బస్సు డ్రైవర్ ప్రవీణ్ తన బస్సు ఇన్గేట్ నుంచి బస్సును హైవేపైకి మళ్లించాడని గ్రహించాడు. వెంటనే బస్సు డ్రైవర్ ప్రవీణ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు రెండు, మూడు చోట్ల బస్సును ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సాంబయ్య ఎంతకు బస్సు ఆపకుండా అత్యంత వేగంగా నడపడంతో పోలీసులు భయపడ్డారు. వెంటనే కోరుట్ల, కథలాపూర్ పోలీసులు అప్రమత్తమై బస్సును వెంబడించారు. మెట్పల్లికి వెళ్లేలోపు సాంబయ్యను పట్టుకోవాలని ప్రయత్నం చేశారు. అయితే పట్టుకునే క్రమంలో సాంబయ్య బస్సుతో కోరుట్ల శివారులో ఓ బైక్ను, ఆరపేట వద్ద మరో బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
కోరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సును దొంగిలించిన దుండగుడు
వేగంగా వెళ్తూ పోలీస్ వాహనాన్ని, పలు వాహనాలను ఢీకొట్టి.. పలువురికి గాయాలు
నిజామాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ దేవాలయం వద్ద గుంతలో దిగి ఆగిపోయిన బస్సు
బస్సు దిగి పారిపోతున్న దుండగుడిని పట్టుకున్న పోలీసులు.. మెట్పల్లి… pic.twitter.com/eNzDx0aSKh
— Telugu Scribe (@TeluguScribe) July 21, 2026
అనంతరం సాంబయ్య తాను నడుపుతున్న బస్సుతో కథలాపూర్ పోలీసుల వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ బస్సును ఎలాగైనా ఆపాలని పోలీసులు నిర్ణయం తీసుకుని గండిహనుమాన్ చెక్ పోస్టు సమీపంలో లారీ, ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా ఉంచారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు ఉండడంతో వెంటనే సాంబయ్య బస్సును పక్కకు మళ్లించాడు. అయితే బస్సు రోడ్డు దిగి ఆగిపోయింది. బస్సు ఆగడంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పారిపోయే ప్రయత్నం చేస్తున్న సాంబయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
pic.twitter.com/iutbdkIauO https://t.co/9C5mdMjAx8బస్సు దిగి పారిపోతున్న దుండగుడిని పట్టుకున్న పోలీసులు.. మెట్పల్లి…
నిజామాబాద్ వైపు వెళ్తుండగా హనుమాన్ దేవాలయం వద్ద గుంతలో దిగి ఆగిపోయిన బస్సు
వేగంగా వెళ్తూ పోలీస్ వాహనాన్ని, పలు వాహనాలను ఢీకొట్టి.. పలువురికి గాయాలు
కోరుట్ల బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సును దొంగిలించిన దుండగుడు
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2026
గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతున్న రెడ్మీ నోట్ 17.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!
Hyderabad, Telangana:Redmi Note 17 India Launch: ప్రముఖ ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రెడ్మీ (Redmi) తన పాపులర్ నోట్ సిరీస్లో సరికొత్త మోడల్ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.. ఇటీవలే చైనాలో విడుదలైన రెడ్మీ నోట్ 17 (Redmi Note 17) స్మార్ట్ఫోన్ త్వరలోనే భారతదేశంలో విడుదల చేయబోతున్నట్లు ప్రముఖ టెక్ టిప్స్టర్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన రెడ్మీ నోట్ 15 స్థానంలో ఈ కొత్త ఫోన్ గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ టిప్స్టర్ యోగేష్ బ్రార్ తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్మీ నోట్ 17 ఇండియా వర్షన్ ధరతో పాటు దాని ప్రధాన ఫీచర్లు లీక్ అయ్యాయి. తాజాగా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. రెడ్మీ నోట్ 17 స్మార్ట్ఫోన్ భారత్లో ఆగస్టు 6న అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని లీక్ అయిన వివరాలు చెబుతన్నాయి. అనంతరం ఆగస్టు 11 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్స్తో పాటు రిటైల్ స్టోర్లలో విక్రయాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..
ధర విషయానికొస్తే..
6 GB ర్యామ్తో పాటు 128 GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర భారత మార్కెట్లో రూ.30,000 కంటే కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టిప్స్టర్ అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఫోన్కు 4 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ OS అప్డేట్లతో పాటు 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్లను కంపెనీ అందించే ఛాన్స్లు ఉన్నట్లు లీక్ అయిన వివరాలు తెలుపుతున్నాయి..
ప్రధాన ఫీచర్లతో పాటు స్పెసిఫికేషన్లు..
ఈ స్మార్ట్ఫోన్ 7-అంగుళాల ఫుల్ HD+ (1,080 x 2,396 పిక్సెల్స్) OLED డిస్ప్లేతో అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1,800 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది.. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ప్రింట్ స్కానర్ను కూడా అందిస్తోంది.. ఈ ఫోన్లో ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 4 జెన్ 4 (Snapdragon 4 Gen 4) చిప్సెట్తో పాటు అడ్రెనో GPUని వినియోగించిన్నట్లు తెలుస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత HyperOS 3 పై పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
పవర్ఫుల్ బ్యాటరీ..
ఈ ఫోన్ మోస్ట్ పవర్ఫుల్ 8,000 mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్కు సపోర్ట్ను అందిస్తుంది. దీనివల్ల ఇతర డివైజ్లను కూడా ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వెనుకవైపు Square-shaped కెమెరా మాడ్యూల్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. చాలా ప్రత్యేకమైన LED ఫ్లాష్ కూడా అందుబాటులో ఉంది.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందిస్తోంది. కనెక్టివిటీ కోసం ఇందులో 5G, 4G LTE, డ్యూయల్ సిమ్తో పాటు వై-ఫై, బ్లూటూత్, GPS, USB టైప్-సి పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Joha Rice Benefits: ఈ స్పెషల్ రైస్ రోజూ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది! ఇది ఎంత తిన్నా మధుమేహం దరిచేరదు!
Hyderabad, Telangana:Joha Rice Benefits Diabetes: మధుమేహం ఉన్నవారు అన్నం తినవచ్చా? సాధారణంగా డాక్టర్లు మధుమేహ వ్యాధిగ్రస్తులను తెల్ల అన్నానికి దూరంగా ఉండమని సూచిస్తారు. తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (GI), పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు) ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం. అయితే, భారతీయ ఆహారంలో భాగమైన అన్నాన్ని పూర్తిగా మానేయడం అందరికీ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో అస్సాంలో పండే ఒక ప్రత్యేక రకం బియ్యం మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.
మధుమేహం అనేది జీవక్రియకు సంబంధించిన సమస్య. ఆహారం ద్వారా దీనిని సమర్థవంతంగా నియంత్రించవచ్చు తప్ప, ఏ బియ్యం తిన్నా ఇది 'మూలాల నుండి నయమైపోతుంది' అనడం సరికాదు.
ఏమిటీ 'జోహా' బియ్యం?
అస్సాంలోని గారో కొండల ప్రాంతంలో పండించే 'జోహా బియ్యం' (Joha Rice) దాని విశిష్టమైన సువాసన, రుచికి ప్రసిద్ధి చెందింది. ఇది బాస్మతి బియ్యం తరహాలోనే ప్రత్యేక గుర్తింపు పొంది, భౌగోళిక గుర్తింపు కూడా దక్కించుకుంది. ఇటీవల 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ' చేపట్టిన అధ్యయనంలో ఈ బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను త్వరితగతిన పెంచదని తేలింది.
జోహా రైస్ ఆరోగ్య ప్రయోజనాలు..
1) బ్లడ్ షుగర్ నియంత్రణ: ఈ బియ్యంలో ఉండే పోషక గుణాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సడన్ గా పెరగకుండా చూస్తాయి.
2) ఒమేగా కొవ్వు ఆమ్లాలు: జోహా బియ్యంలో శరీరానికి మేలు చేసే ఒమేగా-3, ఒమేగా-6 వంటి అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
3) హృద్రోగాల నివారణ: శీతాకాలంలో ఈ బియ్యాన్ని క్రమం తప్పకుండా వినియోగించే అస్సాం ప్రాంత ప్రజలలో మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
4) మొక్కల ఆధారిత ప్రోటీన్: ఇది శాకాహారులకు మంచి ప్రోటీన్ మూలంగా పనిచేస్తుంది. ఈ బియ్యం పొట్టు (Rice Bran) నుండి ఆరోగ్యకరమైన నూనెను కూడా తయారు చేస్తారు.
మధుమేహంతో బాధపడేవారు బియ్యం ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తూ, సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జోహా బియ్యం పోషకాల పరంగా మెరుగైన ప్రత్యామ్నాయం అయినప్పటికీ, మీ ఆహారంలో ఏవైనా పెద్ద మార్పులు చేసే ముందు మీ వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం మంచిది.
(గమనిక: ఇక్కడ పొందుపరిచిన సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Snake Plants: ఈ మొక్కలు పెంచితే ఇంట్లోకి పాములు వస్తాయి..వెంటనే బయటపడేయండి!
Also REad: Milk Benefits: నిద్రపోయే ముందు పాలు తాగితే పరిస్థితి ఇంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మల్లారెడ్డి వైఖరిపై BRS కార్యకర్త ఆగ్రహం.. సొంత రక్తంతో బహిరంగ లేఖ!
Hyderabad, Telangana:Brs Malla Reddy: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రవర్తన ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సింది పోయి.. కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ప్రత్యర్థుల వేదికలపై దర్శనమివ్వడంపై స్థానిక నాయకులు, శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ BRS కార్యకర్త తీవ్ర మనస్తాపానికి గురై.. తన సొంత రక్తంతో మల్లారెడ్డికి బహిరంగ లేఖ రాయడం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రక్తంతో రాసిన లేఖ..
తన కోసం, పార్టీ విజయం కోసం పగలు, రాత్రి తేడా లేకుండా BRS జెండాను భుజాన మోసిన లక్షలాది మంది కార్యకర్తల విశ్వాసాన్ని మల్లారెడ్డి దెబ్బతీస్తున్నారని సదరు కార్యకర్త ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నిమిషం తీరిక లేకుండా పరుగులు తీసి.. పదుల సంఖ్యలో కార్యక్రమాలు చేపట్టిన మల్లారెడ్డి.. నేడు పార్టీకి అత్యంత అవసరమైన సమయంలో ఎందుకు దూరంగా ఉంటున్నారని నిలదీశారు.



కార్యకర్తలను తన విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులుగా భావిస్తున్నారని.. ధనాహంకారంతో ప్రవర్తిస్తూ.. పార్టీ పునాదులను బలహీనపరుస్తున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS పార్టీ అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని.. అలాంటి పార్టీ సిద్ధాంతాలను, కార్యకర్తల త్యాగాలను తుంగలో తొక్కి.. ఆత్మగౌరవాన్ని అవమానించడం దారుణమని లేఖలో తెలిపారు.
కార్యకర్తల చెమటతో పాటు కష్టాన్ని మరచిపోయి.. స్వార్థ రాజకీయాలు చేసే ఏ నాయకుడైనా చరిత్రహీనుడిగా కాలగర్భంలో కలసిపోవడం ఖాయమని తీవ్ర హెచ్చరిక చేశారు. ఒక వైపు నాయకులు మారుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్న కార్యకర్త ఆవేదనకు ఈ రక్తంతో రాసిన లేక నిదర్శనంగా నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
EPS-95 Pension Hike: ఉద్యోగులకు గుడ్న్యూస్..కనీస పెన్షన్ రూ.7,500కు పెంపు..పార్లమెంట్లో మంత్రి ప్రకటన!
Hyderabad, Telangana:EPS-95 Pension Hike 2026: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద కనీస పింఛను మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ.1,000 నుండి రూ. 7,500కు పెంచాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఘాలు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ పెంపుదలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టతనిచ్చింది.
ప్రస్తుతం కనీస పింఛను పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, దానికి సంబంధించి ఎలాంటి కాలపరిమితి కూడా లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు లోక్సభలో ఎంపీ భాసాహెబ్ రాజారామ్ వాక్చౌరే అడిగిన ప్రశ్నకు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
లోక్సభలో కేంద్ర మంత్రి వివరణ
కనీస పింఛను రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఇస్తున్నారని, ఇది వృద్ధులకు సరిపోదని ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. "పింఛను నిధి సుస్థిరత, భవిష్యత్తు బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని EPFO సభ్యులకు బలమైన సామాజిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. EPFOకి అందించే 1.16% బడ్జెట్ మద్దతుకు అదనంగా, EPS-1995 కింద పెన్షనర్లకు నెలకు కనీసం రూ.1,000 లభించేలా బడ్జెట్ ద్వారా ప్రభుత్వం సహాయం అందిస్తోంది" అని పేర్కొన్నారు.
పింఛను నిధికి నిధులు ఎలా సమకూరుతాయంటే?
యజమాని వాటాగా ఉద్యోగి వేతనంలో 8.33% వంతు ఉండగా.. కేంద్ర ప్రభుత్వ వాటా నెలకు రూ. 15,000 వరకు ఉన్న వేతనంపై 1.16% బడ్జెట్ మద్దతు ఇస్తుంది. ఈ నిధి ఆధారంగానే పింఛను చెల్లింపులు జరుగుతాయని, ఏటా నిధి విలువను లెక్కిస్తారని ప్రభుత్వం తెలిపింది.
'EPS 2026' కీలకమైన మార్పులివే!
ప్రభుత్వం పాత 'EPS 1995', 'ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 1971' స్థానంలో 'కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020' కింద నూతన 'ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 2026'ను నోటిఫై చేసింది.
ఈ కొత్త పథకంలో ప్రవేశపెట్టిన ప్రధాన మార్పులు..
1) వేగవంతమైన పరిష్కారం అనగా..పెన్షన్ క్లెయిమ్లను గరిష్టంగా 20 రోజుల్లోపు పరిష్కరించాలి.
2) ఆలస్యమైతే వడ్డీ.. క్లెయిమ్ ఆలస్యమైతే లబ్ధిదారునికి 12% వడ్డీ చెల్లిస్తారు.
3) డిజిటల్ విధానం.. యాజమాన్యాల (Employers) కోసం డిజిటల్ వర్తింపు నిబంధనలను నిర్బంధం చేశారు.
4) అధిక పెన్షన్.. అధిక పెన్షన్కు సంబంధించిన స్పష్టమైన నిబంధనలను ఇందులో పొందుపరిచారు.
గమనిక: ఉద్యోగి నిష్క్రమించే ముందు చివరి 60 నెలల సగటు జీతాన్నే పెన్షన్కు అర్హత ఉన్న జీతంగా పరిగణిస్తారు.
Also Read: ఉద్యోగుల గ్రాట్యూటీ రూల్స్..5 ఏళ్లు పనిచేయకపోయినా గ్రాట్యుటీ ఎలా పొందవచ్చో తెలుసా?
Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. సోమవారం భారీ వర్ష సూచన..ఈజిల్లాల్లో భారీవర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
50MP Zeiss కెమెరా, 90W ఛార్జింగ్.. Vivo X300 E ప్రీ-సేల్స్ ప్రారంభం!
Hyderabad, Telangana:Vivo X300 E Launched: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Vivo ప్రీమియం విభాగంలో మరో సరికొత్త మోడల్ను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీనిని కంపెనీ Vivo X300 E స్మార్ట్ఫోన్ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ఫోన్ కోసం సంస్థ తన అధికారిక వెబ్సైట్లో ప్రీ-సేల్స్ (Pre-sales) ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభించింది. అయితే, దీనిని కంపెనీ జులై 27వ తేదీన ఈ ఫోన్ అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇటీవల భారత్లో విడుదలైన X300 FE మోడల్కు భిన్నమైన డిజైన్తో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మెటల్ ఫ్రేమ్తో ఈ ఫోన్ రెడీ అయిన్నట్లు తెలుస్తోంది. ఇది V2612A మోడల్ నంబర్తో వస్తోంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్తో పాటు ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో తీసుకు వచ్చింది..
అద్భుతమైన డిస్ప్లే..
ఈ Vivo X300 E స్మార్ట్ఫోన్ చాలా ప్రత్యేకమైన 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2750×1260 పిక్సెల్స్ రెజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్తో లభిస్తోంది.. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం క్వాల్కమ్ టాప్-ఎండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 (3nm) చిప్సెట్తో పాటు అడ్రెనో 829 GPUతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది..
పవర్ ఫుల్ బ్యాటరీ..
కెమెరా వివరాల్లోకి వెళితే.. వీవో జైస్ (Zeiss) ఇమేజింగ్ సిస్టమ్ను ఉపయోగించింది. దీని వెనక భాగంలో ఎంతో శక్తివంతమైన 50 MP ప్రధాన కెమెరా, 8 MP ఆల్ట్రా-వైడ్ లెన్స్, 50 MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఫ్రంట్ భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో కంపెనీ ఏకంగా 7015mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఇతర కీలక ఫీచర్లు..
ఈ ఫోన్కు ధూళి, వాటర్ రిసిస్టెంట్ కోసం IP68 + IP69 రేటింగ్ను కూడా అందించింది.. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఆల్ట్రాసోనిక్ ఫింగర్ప్రింట్ సెన్సార్ను అందించారు. ఇది కేవలం 7.99 మిమీ మందంతో పాటు 203 గ్రాముల బరువుతో ఉండే ఈ స్మార్ట్ఫోన్ 5G, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, USB టైప్-సి, NFC వంటి అత్యాధునిక కనెక్టివిటీ ఆప్షన్లను కూడా కలిగి ఉంటుంది. ర్యామ్ విభాగంలో 12GB/16GB LPDDR5X ఆప్షన్లు, స్టోరేజ్ విభాగంలో 256GB నుంచి 1TB UFS 4.1 వరకు లభిస్తుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Abrar Ahmed Sunrisers: కావ్యా పాప కొంపముంచిన పాకిస్థాన్ స్పిన్నర్..రూ.2.45 కోట్లు దండగ..గెలిచే మ్యాచ్ ఇలా..!
England:Abrar Ahmed Sunrisers Leeds: ది హండ్రెడ్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్లోనే కావ్య మారన్ యాజమాన్యంలోని సన్రైజర్స్ లీడ్స్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఎంఐ లండన్తో జరిగిన ఈ ఓపెనింగ్ మ్యాచ్లో సన్రైజర్స్ లీడ్స్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. కెప్టెన్ సామ్ కరన్, విద్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ ధనాధన్ ఇన్నింగ్స్లతో ఎంఐ లండన్ సునాయాస విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్ హైలైట్స్
ఎంఐ లండన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ లీడ్స్ జట్టు 99 బంతుల్లో 143 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే 144 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఎంఐ లండన్ జట్టు 84 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది (ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే విజయం).
మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్కు ఓపెనర్లు మిచెల్ మార్ష్ (41), ర్యాన్ రికెల్టన్ (25) ఆకట్టుకునే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత జాక్ క్రౌలీ (11 బంతుల్లో 29), టామ్ ఆల్సాప్ (18 బంతుల్లో 31) రాణించడంతో జట్టు 143 పరుగులు చేయగలిగింది. స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (8) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఎంఐ లండన్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 19 బంతుల్లో 4 వికెట్లతో చెలరేగగా, సామ్ కరన్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.
విరుచుకుపడ్డ పూరన్, సామ్ కరన్
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ లండన్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. విల్ జాక్స్ (2), జేమ్స్ విన్స్ (0) త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సామ్ కరన్ (60), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 58) సన్రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ మ్యాచ్ను ఏకపక్షం చేశారు. పూరన్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం.
పాక్ స్పిన్నర్ అబ్రార్ను చితక్కొట్టిన పూరన్-కరన్
వేలంలో ప్రత్యేకంగా కొనుగోలు చేసి, ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్కు ఈ మ్యాచ్ ఒక పీడకలగా మారింది. 70 బంతుల తర్వాత బౌలింగ్కు వచ్చిన అబ్రార్ అహ్మద్ ఒకే ఓవర్లో 3 సిక్సర్లు సమర్పించుకున్నాడు. తొలి బంతికి సామ్ కరన్ మిడ్వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదగా, ఆ తదుపరి 74, 75వ బంతులకు నికోలస్ పూరన్ వరుసగా రెండు సిక్సర్లు బాది విజయానికి చేరువ చేశాడు. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు మైదానానికి వచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా పూరన్, కరన్ ల విధ్వంసకర హిట్టింగ్ను ఎంతో ఆస్వాదిస్తూ కనిపించాడు.
ఇంగ్లండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్ 2026' లీగ్లో సన్రైజర్స్ ఫ్రాంచైజీ (సన్రైజర్స్ లీడ్స్) పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను వేలంలో సొంతం చేసుకోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2008 ఐపీఎల్ తర్వాత ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా పాకిస్తాన్ ఆటగాళ్లను తమ జట్లలోకి తీసుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్స్లో జట్లను కలిగి ఉన్న భారతీయ ఫ్రాంచైజీలు కూడా ఇదే విధానాన్ని పాటిస్తాయని అందరూ భావించారు. అయితే, కావ్య మారన్ యాజమాన్యంలోని సన్రైజర్స్ లీడ్స్ మాత్రం అబ్రార్ అహ్మద్ను £190,000 (సుమారు ₹2.45 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది.
కావ్య మారన్ ఏమన్నారంటే?
పాకిస్తాన్ ఆటగాడిని ఎంపిక చేసుకోవడంపై 'ది టెలిగ్రాఫ్' ఇంటర్వ్యూలో కావ్య మారన్ను సూటిగా ప్రశ్నించగా, ఆమె దానికి దౌత్యపరంగా సమాధానమిచ్చారు. ప్రత్యక్షంగా వివాదాల జోలికి వెళ్లకుండా సమాధానాన్ని దాటవేస్తూ.. "మా పురుషుల, మహిళల జట్ల ఎంపిక పట్ల మేము పూర్తి సంతృప్తితో ఉన్నాము. ఒక జట్టును నిర్మించేటప్పుడు మేము చాలా రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటాము" అని ఆమె పేర్కొన్నారు.
'ది హండ్రెడ్ 2026' ప్రత్యేకతలు
ఈసారి 'ది హండ్రెడ్' లీగ్లో కేవలం ఇద్దరు పాకిస్తానీ ప్లేయర్లు మాత్రమే వేలంలో ఎంపికయ్యారు. అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ దక్కించుకోగా, ఉస్మాన్ తారిఖ్ను బర్మింగ్హామ్ ఫీనిక్స్ జట్టు రూ.1.80 కోట్లకు (£140,000) సొంతం చేసుకుంది. జూలై 21న ప్రారంభమైన లీగ్ తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్ లీడ్స్ తమ తుది జట్టు (Playing XI)లో అబ్రార్ అహ్మద్కు అవకాశం కల్పించింది. ఈ లీగ్లోని 8 జట్లలో 4 జట్లు ఐపీఎల్ యాజమాన్యాల చేతిలోనే ఉన్నాయి. సన్రైజర్స్ లీడ్స్ (SRH), ఎంఐ లండన్ (ముంబై ఇండియన్స్), మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ (LSG), సదరన్ బ్రేవ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని GMR గ్రూప్) వారు ఉన్నారు. జూలై 21న ప్రారంభమైన 'ది హండ్రెడ్' టోర్నీ ఆగస్టు 16న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది.
Also Read: రిటైర్మెంట్ ఊహాగానాలపై రోహిత్ శర్మ ఊహించని ట్విస్ట్..బీసీసీఐ సెలెక్టర్లకు మాటల్లేవు!
Also REad: ఫిఫా వరల్డ్కప్ ఫైనల్లో డొనాల్డ్ ట్రంప్ హల్చల్..ట్రోఫీ స్టేజ్పై వింత ప్రవర్తన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మోస్ట్ పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Redmi Note 17 Pro Max త్వరలో విడుదల!
Hyderabad, Telangana:Redmi Note 17 Pro Max: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షామీ (Xiaomi) తన సబ్-బ్రాండ్ రెడ్మీ ఇటీవలే రెడ్మీ నోట్ 17 (Redmi Note 17 Pro Max) సిరీస్ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ సిరీస్లో స్టాండర్డ్ మోడల్తో పాటు రెడ్మీ నోట్ 17 ప్రో అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్కు కొనసాగింపుగా సరికొత్త ఫ్లాగ్షిప్ ఎడిషన్ రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్ మోడల్ను త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తున్నాయి.. ఇది విడుదలైన అన్ని మోడల్స్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్తో అందుబాటులోకి రాబోతోంది.
థాయిలాండ్కు చెందిన నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమీషన్ (NBTC) డేటాబేస్లో రెడ్మీ నోట్ 17తో పాటు రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్ అంతర్జాతీయ మోడల్ నంబర్లు 26081RA18G, 2609FRA74Gగా కనిపించడం విశేషం.. దీంతో ఈ ఫోన్ల గ్లోబల్ లాంచ్ అతిత్వరలోనే ఉండబోతోందని తెలుస్తోంది.. అంతేకాకుండా ఇవి ప్రీమియం డిజైన్స్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాక్స్ మోడల్ ప్రీమియం లుక్లో కనిపించబోతోంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు..
లీకైన వివరాల ప్రకారం.. ఈ ప్రో మాక్స్ వేరియంట్లో అత్యుత్తమ టెక్నాలజీని వినియోగించిన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోర్ వెనుక భాగంలో Samsung సెన్సార్కు సంబంధించిన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి..
శక్తివంతమైన పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 (MediaTek Dimensity 7500) ప్రాసెసర్ను అందించనున్నట్లు సమాచారం. ఈ ఫోన్లో ఎంతో శక్తివంతమైన 10,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా లభించే ఫోన్లతో పోలిస్తే.. ఇది వినియోగదారులకు రోజులకు పైగా సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
సిరీస్లోని స్టాండర్డ్ మోడల్ వివరాలు..
ఇటీవల చైనాలో విడుదలైన బేస్ మోడల్ రెడ్మీ నోట్ 17 స్మార్ట్ఫోన్లో 7-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3, స్నాప్డ్రాగన్ 4 జెన్ 4 చిప్సెట్తో పాటు 8,000 mAh బ్యాటరీ వంటి అధునాతన హార్డ్వేర్ ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. అత్యాధునిక 200MP కెమెరాతో పాటు పవర్-ప్యాక్డ్ డైమెన్సిటీ ప్రాసెసర్తో పాటు భారీ 10,000mAh బ్యాటరీతో రాబోతున్నట్లు రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్ మిడ్-రేంజ్ ప్రీమియం స్మార్ట్ఫోన్ మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. త్వరలోనే దీని అధికారిక ధర, విడుదల తేదీలను కంపెనీ ప్రకటించబోతోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
పుష్య నక్షత్రంలోకి గురుడు.. ఆగస్టు 3 తర్వాత ఈ రాశుల జాతకం మారబోతోంది!
Hyderabad, Telangana:Jupiter Nakshatra Transit 2026 Telugu: నవగ్రహాలలో అత్యంత శుభ గ్రహంగా.. జ్ఞానం, సంపద, వివాహంతో పాటు ఆధ్యాత్మికతకు కారకుడైన బృహస్పతి త్వరలోనే తన నక్షత్ర పదాన్ని మార్చబోతున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. 2026 ఆగస్టు 3వ తేదీ రాత్రి 11:17 గంటలకు గురు గ్రహం పుష్య నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశించబోతోంది. ఈ నక్షత్ర సంచారం ఆగస్టు 19 వరకు ఇదే పాదంలో కొనసాగుతుంది.. గురు గ్రహం ఈ కీలక మార్పు వల్ల ముఖ్యంగా 4 రాశుల వారి జాతకం పూర్తిగా మారబోతోంది. వీరి కెరీర్, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారుతాయి.. అనుకోని ధన యోగం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపునులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
కన్యా రాశి
కన్యా రాశి వారికి గురు నక్షత్ర సంచారం అనేక విజయావకాశాలను తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు విశేషంగా పెరుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో పదోన్నతులు లభించి.. కెరీర్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. కోర్టు కేసులతో పాటు సుదీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలు అనుకూలంగా పూర్తవుతాయి.. అనవసర ఖర్చులు అదుపులోకి వచ్చి.. బలమైన ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి
గురుడు అనుకూల స్థానంలోకి రావడంలో ధనుస్సు రాశి వారికి సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ఒకదానికంటే ఎక్కువ మార్గాల నుంచి ఆదాయం లభిస్తుంది.. అంతేకాకుండా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఊహించని అభివృద్ధిని పొందుతారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటల వరకు వెళ్లే బలమైన అవకాశాలు ఉన్నాయి. అదృష్టం తోడ్పడటంతో నిలిచిపోయిన కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.
మకర రాశి
పుష్య నక్షత్రంలో గురు సంచారం మకర రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. ఆర్థిక అంశాల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పెద్ద బిజినెస్ డీల్స్ కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబ సమస్యలు, ఒత్తిడి తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇవే కాకుండా ఆర్థికంగా కూడా దిమ్మతిరిగే ధన లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ గురు సంచారం అన్ని రంగాల్లోనూ తిరుగులేని విజయాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ధన లాభం పెరిగి పాత అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు దక్కడంతో పాటు వృత్తిపరంగా నూతన అవకాశాలు తలుపు తడతాయి. ఇవే కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
ప్రొటెస్ట్ చేయడం ఎందుకు? స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా!!: నీట్ ర్యాంకర్
Hyderabad, Telangana:NEET Ranker Reaction On CJP Protest: ఢిల్లీలో రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున సీజేపీ మద్ధతుగా నిరసనలు చేపట్టారు. అక్కడ పెద్ద ఎత్తున అరెస్టులు కూడా జరిగాయి. టిపిసిసి కూడా ఈరోజు కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతల అరెస్టులను సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని మండిపడ్డారు. అయితే ఈ వివాదంపై నీట్ ఆల్ ఇండియా ర్యాంకర్ బన్సల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ అయినప్పుడు తాను తీవ్రంగా బాధపడ్డానని, కానీ ఆ తర్వాత సానుకూలంగా ఆలోచించడం మొదలుపెట్టానని చెప్పారు. నిరసనల్లో వెళ్లడం కంటే ఇంట్లోనే ఉండి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా అనిపించిందని, అదే మోటివేషన్తో చదివి తన మార్కులను 706 నుండి 715కి పెంచుకోగలిగానని తెలిపారు. నెగటివిటీని పక్కన పెట్టి కేవలం తన లక్ష్యంపైనే ఫోకస్ చేశానని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ వివాదం జరుగుతున్న సమయంలో ఈ సెకండ్ ర్యాంకర్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పరీక్ష మే 3వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. పేపర్ లీకేజీ కారణంగా మే 13న పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అనంతరం జూన్ 21న రీనీట్ నిర్వహించగా, జూలై 16న ఫలితాలు వెలువడ్డాయి. న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్కు చెందిన విద్యార్థి బన్సల్ ఆల్ ఇండియా 2వ ర్యాంక్ సాధించారు.
ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై స్పందిస్తూ, నిరసనల్లో పాల్గొనడం కంటే ఇంట్లోనే ఉండి చదువుకు ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. పరీక్షా విధానంలో మార్పులు వచ్చినప్పటికీ, తాను 99.99 శాతం పెర్సంటైల్ సాధించి ఆల్ ఇండియా ర్యాంక్ పొందానని వివరించారు. తన ప్రిపరేషన్ను మెరుగుపరుచుకోవడానికి తాను తీసుకున్న చర్యలను కూడా ఆయన పంచుకున్నారు. మొదటిసారి పరీక్ష రద్దయినప్పుడు రెండు గంటల పాటు తీవ్ర నిరాశకు గురైనప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ సిద్ధమవ్వడం ముఖ్యం అని భావించి పునఃపరీక్షలో మెరుగైన మార్కులు సాధించగలిగానని చెప్పారు.
Also Read: NEET Re-Exam: నీట్ విద్యార్థులకు గుడ్న్యూస్.. చరిత్రలోనే తొలిసారి.. రంగంలోకి ప్రధాని మోదీ
Also Read: NEET Exam Cancel: పరీక్షల రద్దు పరంపర.. ఐదేళ్లలో NTA రద్దు చేసిన టాప్ పరీక్షలు ఇవే!
అదేవిధంగా, తన షెడ్యూల్ను మార్చుకోకుండా ఎప్పటిలాగే క్రమం తప్పకుండా చదువుకున్నానని, కేవలం ఒకే నెలలో 100 శాతం కృషి చేశానని చెప్పారు. మిగిలినదంతా దేవుడికి వదిలేశానని చెబుతూ, ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో బన్సల్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. మరోవైపు వేలాది మంది విద్యార్థులు పరీక్షా విధానాన్ని ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్.. రేపు ఎస్ఎస్డీ టోకెన్ల జారీ రద్దు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Darshan Tokens: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో తిరుమల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి భారీగా సమయం పడుతోంది. అనూహ్యంగా మంగళవారం భక్తుల సంఖ్య పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరగడంతో గురువారం దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
తిరుపతిలోని మూడు కేంద్రాల వద్ద బుధవారం జారీ చేయాల్సిన ఎస్ఎస్డీ టోకెన్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన చేసింది. ఒక్కరోజు విరామం తర్వాత అంటే శుక్రవారం దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లు గురువారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత కూడా తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ కారణంతో జూన్, జూలై నెలల్లో పలుమార్లు ఎస్ఎస్డీ టోకెన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు చేయడం వరుసగా ఇది నాలుగో వారం. అయితే టోకెన్ల రద్దుతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా టోకెన్లు లేని భక్తులు నేరుగా తిరుమలలోని సర్వదర్శనం క్యూలైన్లలోకి వెళ్లాలని టీటీడీ సూచిస్తోంది.
దర్శనానికి సరికొత్త టెక్నాలజీ
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సరికొత్త సాంకేతికతను వినియోగిస్తోంది. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటి నిత్యావసరాలను వేగంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరవేసేందుకు సరికొత్త ఎక్స్ లిఫ్టర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ అత్యాధునిక వ్యవస్థ పనితీరును తాజాగా ట్రయల్ రన్ ద్వారా అధికారులు పరీక్షించారు. క్యూలైన్లలోని వివిధ ప్రాంతాలకు ఆహారం, నీరు, పాలు వంటి వస్తువులను ఎంత వేగంగా, ఎంత సమర్థవంతంగా చేరవేయగలదనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రయల్ విజయవంతమైతే ఈ వ్యవస్థను శాశ్వతంగా అమల్లోకి తీసుకురావాలని టీటీడీ యోచిస్తోంది.
ఇప్పటికే కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతికతతో భక్తులకు పలు సేవలను అందిస్తున్న టీటీడీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగిస్తూ భక్తులకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎక్స్ లిఫ్టర్ వ్యవస్థ అమల్లోకి వస్తే క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు సేవలు మరింత వేగంగా, సులభంగా అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. రేపు యాపిడో, ఉబర్, జొమాటో, జెప్టో సేవలు బంద్
Hyderabad, Telangana:Tomorrow Bandh: హైదరాబాద్తోపాటు తెలంగాణ ప్రజలకు భారీ అలర్ట్. రేపు యాప్ ఆధారిత ఎలాంటి సేవలు అందవు. అంటే ఫుడ్ డెలివరీ చేసుకోవాలన్నా.. బైక్, కారు బుక్ చేసుకోవాలన్నా.. అత్యవసర సామగ్రి కొనుగోలు చేయాలన్నా రేపు కుదరదు. ఎందుకంటే రేపు అన్ని రకాల డెలివరీ సేవలు ఆగిపోనున్నాయి. డెలివరీ చేసే కార్మికులతోపాటు డ్రైవర్లు సమ్మెకు దిగుతున్నారు. డెలివరీ బాయ్లతోపాటు యాప్ ఆధారిత డ్రైవర్లు ఆందోళన చేపట్టనున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని.. రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్తో రేపు బుధవారం నిరసనకు దిగనున్నారు.
రేపు తాము బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ గిగ్ వర్కర్లు, యాప్ఖ ఆధారిత డ్రైవర్లు ప్రకటించారు. రేపు సమ్మె చేస్తున్నట్లు తెలంగాణ గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), తెలంగాణ యాప్-బేస్డ్ డ్రైవర్స్ ఫోరమ్ (టీఏడీఎఫ్) సంఘాలు ప్రకటన చేశాయి. ఓలా, ఉబెర్, రాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, పోర్టర్, ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ కంపెనీలకు చెందిన యాప్-బేస్డ్ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, గూడ్స్ ఆటో రవాణా డ్రైవర్లు, డెలివరీ వర్కర్లు, గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు విధులకు హాజరుకావడం లేదని ప్రకటించారు.
వారి ప్రధాన డిమాండ్లు
==> ప్రభుత్వం, ప్లాట్ఫామ్ కంపెనీలు అన్ని యాప్-ఆధారిత రవాణా సేవలకు కిలోమీటర్కు, నిమిషానికి ధరతోపాటు.. కనీస బేస్ ఛార్జీని తప్పనిసరిగా నిర్ణయించాలి.
==> గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ నిబంధనలను తక్షణమే నోటిఫై చేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.
==> తెలంగాణ ప్రభుత్వం, అగ్రిగేటర్ కంపెనీలు ఏకపక్షంగా ఛార్జీలను నిర్ణయించడానికి అనుమతించకుండా మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు- 2025 ప్రకారం కనీస ఛార్జీలను తప్పనిసరిగా అమలు చేయాలి.
కాంగ్రెస్ పార్టీ తీరని మోసం
గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ స్వయంగా గిగ్ వర్కర్లతో సమావేశమై వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లవుతున్నా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేపటి ఆందోళన చేస్తున్నారు. కాగా ఇదే డిమాండ్లపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో ఇలాంటి సమ్మె జరిగింది. ఉబర్, ఓలా, రాపిడో డ్రైవర్ల సమ్మె విశాఖపట్టణంలో ఉదృతంగా జరుగుతుండగా.. తాజాగా ఇది హైదరాబాద్ను తాకింది. హైదరాబాద్లో విజయవంతమైతే వీరి ఆందోళన దేశంలోని ఇతర నగరాలకు పాకే అవకాశం ఉంది.
