కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన చర్లపల్లి ప్రవాసంలో మెరుగుదెబ్బకు
Karimnagar, Telangana:కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభించిన అనంతరం, వానలో పొలం పనుల్లో ఉన్న రైతు కూలీల వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న మైనర్ బాలిక బోళ్ల అక్షయ్యను చూసి, ఆమె చదువు గురించి ప్రశ్నించారు. అక్షయ్య టెన్త్ పాసైనప్పటికీ ఆర్ధిక పరిస్థితి కారణంగా కూలీ పనులు చేస్తోంది. బండి సంజయ్, ఆమెను కాలేజీలో చేర్చడానికి సహాయం చేస్తానని చెప్పగా, అక్షయ్య ధన్యవాదాలు చెప్పారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Onion Price Hike: మండిపోతున్న ఉల్లి ధరలు..రెట్టింపైన రేట్లతో సామాన్యుడి కన్నీళ్లు!
Hyderabad, Telangana:Onion Rate Hike: కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు తమ జీవితాలను కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంటిట్లో అత్యంత కీలకమైన వస్తువు ఉల్లిపాయ. ప్రతిరోజు వంటల్లో దీని వాడకం తప్పనిసరి. ఇది లేనిదే ఏ కూర కూడా వండటానికి కుదరదు.
అలాంటి ఉల్లిపాయల ధరలు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరిగి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.20కే లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు ఏకంగా రెట్టింపయ్యాయి. అకాల వర్షాలు మరియు నిల్వ నష్టాల కారణంగా మార్కెట్లకు నాణ్యమైన ఉల్లి సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో ధరలు..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ. 40 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటి రైతు బజార్లలోని ధరల వివరాలను గమనిస్తే..
హైదరాబాద్ (మెహిదీపట్నం రైతు బజార్): ఇక్కడ కిలో ఉల్లిపాయల ధర రూ. 40గా ఉంది. ఇతర కూరగాయలతో పోల్చితే టమాట రూ. 19, వంకాయ రూ. 35, బెండకాయ రూ. 35, పచ్చిమిర్చి రూ. 37, బీన్స్ రూ. 65, క్యారెట్ రూ. 37, దొండకాయ రూ. 23, ఆలుగడ్డ రూ. 16 వద్ద కొనసాగుతున్నాయి.
విజయవాడ రైతు బజార్: విజయవాడలోని రైతు బజార్లలో చూస్తే కిలో ఉల్లిపాయల ధర రూ. 48 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. ఇక్కడ ఇతర కూరగాయల ధరలు చూస్తే టమాట రూ. 30, వంకాయ రూ. 24, క్యారెట్ రూ. 45, కీరదోస రూ. 50, బీన్స్ అత్యధికంగా రూ. 94కు లభిస్తున్నాయి.
దేశవ్యాప్త సగటు, కారణాలు
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం భారత్లో సగటు కిలో ఉల్లి ధర రూ. 49.59కి చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన దేశంలో సగటు ఉల్లి ధర రూ. 28.48 ఉండగా, ఇప్పుడు అది 74 శాతానికి పైగా పెరిగింది.
అయితే, ఈ ధరల పెరుగుదలకు దేశంలో ఉల్లి ఉత్పత్తి తగ్గడం కారణం కాదు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 307.37 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి అయింది. రబీ కోత సమయంలో కురిసిన అకాల వర్షాలు పంటను తీవ్రంగా దెబ్బతీయడం, తదుపరి నిల్వ నష్టాల వల్ల మండీలకు చేరే నాణ్యమైన ఉల్లిపాయల పరిమాణం తగ్గడమే ఈ భారీ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: విద్యార్థులకు శుభవార్త.. 'తల్లికి వందనం' నిధులు మరోసారి విడుదల..లిస్టు వచ్చేసింది!
Also Read: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana: కల్యాణలక్ష్మి గోవింద.. స్కూటీలు గోవిందా
Secunderabad, Telangana:BRS Party Leaders Chants Govinda Govinda Against Congress 420 PromisesMalla Reddy: రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మల్లారెడ్డి తీన్మార్ డ్యాన్స్
Hyderabad, Telangana:Former Minister Malla Reddy Mass Dance In BRS Party Protest Watch Viral VideoBRS Party: రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గాడిదలతో గులాబీ పార్టీ నిరసన
Hyderabad, Telangana:BRS Party Protest With Donkeys Against Revanth Reddy 1000 Days Rule Watch VideoACB Rides: టీటీడీ డిప్యూటీ ఈఓ నివాసంలో ఏసీబీ తనిఖీలు
Tirupati, Andhra Pradesh:ACB Officers Ride On TTD Deputy EO Lokanatham Residence At Tirupati Know The DetailsYSR: రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేది వైఎస్సార్ కోరిక: రేవంత్ రెడ్డి
New Delhi, Delhi:YSR Awards 2026: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ ఒక కోరిక తీరకుండానే మరణించాడని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ఆయన జీవిత లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ కోరిక తీరలేదని చెప్పారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్కు నిజమైన నివాళి అని ప్రకటించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ ఆశయాల సాధనకు తాము పనిచేస్తామని తెలిపారు.
ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026 కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'రైతులకు ఉచిత విద్యుత్ పై తొలి సంతకం చేసిన గొప్ప వ్యక్తి వైఎస్సార్. ఆనాడు రూ.1,300 కోట్లు విద్యుత్ బకాయిలు రద్దు చేసి.. రైతులపై కేసులు ఎత్తివేసి రైతుల గుండెల్లో వైఎస్సార్ రారాజుగా నిలిచారు' అని రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణలో సాగునీరు అందిచేందుకు ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రారంభించిన ఘనత వైఎస్సార్ది' అని వివరించారు. ఆనాడు వైఎస్సార్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ఆగిపోయాయని.. ఆయన ఆశయాలను నూటికి నూరు శాతం కొనసాగిస్తామని ప్రకటించారు.
'వైఎస్సార్ చివరి కోరిక ఇంకా నెరవేరలేదు. ఆయన రెండోసారి ప్రమాణస్వీకారం చేశాక ఒకే ఒక్క మాట చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఆయన జీవిత లక్ష్యం అని ఒకే ఒక్క మాట చెప్పారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. రాహుల్ గాంధీని దేశానికి ప్రధాని చేయడమే వైఎస్సార్కు నిజమైన నివాళి. ఆయన చివరి కోరిక నెరవేర్చాలంటే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
'వైఎస్ ఆశయాలను మనమంతా ముందుకు తీసుకెళ్లాలి. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు. నెహ్రూ ముందుచూపుతో దేశం ఆకలి కేకల నుంచి ఆహార ఎగుమతుల వరకు చేరుకుంది. దేశంలో మొట్టమొదటిసారిగా రైతు పండించే పంటకు మద్దతు ధరను అందించే చర్యలు చేపట్టిన ఘనత ఇందిరాగాంధీ. దేశంలో ప్రతీ ఒక్కరికీ ఆహారభద్రత కల్పించాలని సోనియా గాంధీ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారు' అని రేవంత్ రెడ్డి వివరించారు.
'వ్యవసాయ చట్టం తీసుకొచ్చి అసైన్డ్ భూములను పేదలకు పంచిన చరిత్ర ఇందిరాగాంధీది. పీడీఎస్ విధానం తీసుకొచ్చి రేషన్ షాప్ ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. తెలంగాణలో 3 కోట్ల 48 లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితమిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. 'దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడు అండగా నిలబడాలి. అండగా నిలబడాల్సిన చారిత్రక సందర్భం ఈరోజు ఈ దేశానికి అవసరం. దేశానికి బలమైన నాయకుడు రాహుల్ గాంధీ' అని తెలిపారు. తామంతా కలిసి కష్టపడి రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి సూచించారు.
Traffic Diversion: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. రేపు భారీగా ట్రాఫిక్ మళ్లింపు
Hyderabad, Telangana:Hyderabad Traffic Diversion: రోజువారి మీదుగా రాకపోకలు సాగించే హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. రేపు ఓ ప్రాంతంలో భారీగా వాహనాల మళ్లింపు చేపట్టారు. నగరంలో మరో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరగనుండగా.. ఈ క్రమంలో ఆ మార్గంలో వాహనాల మళ్లింపు చేయనున్నారు. నిత్యం బిజీగా ఉండే నల్గొండ ఎక్స్ రోడ్డులో వాహనాల మళ్లింపు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. పలు మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు రేపు ఉంటుందని.. వాహనదారులు గమనించాలని సూచించారు.
రేపు ఫ్లైఓవర్ ప్రారంభం
కేసీఆర్ ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగిన నల్లగొండ క్రాస్ రోడ్డు నుంచి ఓవైసీ జంక్షన్ కారిడార్ ఫ్లైఓవర్ పూర్తయ్యింది. నూతనంగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం రేపు జరగనుంది. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా రేపు సెప్టెంబర్ 3 గురువారం నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించినట్లు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వాహనాల మళ్లింపు కొనసాగుతుందని ప్రకటించారు.
మూసివేసే రహదారులు
సైదాబాద్ వై జంక్షన్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ మధ్య రహదారి పూర్తిగా మూసివేత. ఈ మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉండడంతో వాహనదారులు నల్గొండ ఎక్స్ రోడ్ - సైదాబాద్ వై జంక్షన్ రోడ్డు వైపు వెళ్లరాదు.
దారి మళ్లింపు ఇలా
నల్గొండ ఎక్స్ రోడ్డు నుంచి సంతోశ్ నగర్, ఐఎస్ సదన్ వైపు వెళ్లే వాహనాలు
==> నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద మళ్లింపు: మలక్పేట్ గంజ్ -- మూసారాంబాగ్ ఎక్స్ రోడ్ - గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ వద్ద కుడి మలుపు -> రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ -> శివగంగ థియేటర్ -> హనఫియా మసీదు వద్ద కుడి మలుపు -> సంకేశ్వర్ బజార్ -> సింగరేణి కాలనీ (ఎడమ మలుపు) -> ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ చంపాపేట్ (ఎడమ మలుపు) -> చంపాపేట్ మెయిన్ రోడ్డులో యు-టర్న్ -> చంపాపేట్ ఎక్స్ రోడ్ వద్ద ఎడమ మలుపు -> లక్ష్మారెడ్డి గార్డెన్ మీదుగా డిఎమ్ఆర్ఎల్ రోటరీ వైపు వెళ్లాలి
ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ నుంచి నల్గొండ ఎక్స్ రోడ్ వైపు వెళ్లే వాహనాలు
==> సైదాబాద్ వై జంక్షన్ వద్ద కుడి మలుపు -> డీసీపీ-3 కార్యాలయం -> సైదాబాద్ లా అండ్ ఆర్డర్ పీఎస్ -> సరస్వతి నగర్ కమాన్ -> సంకేశ్వర్ బజార్ -> ఇండియన్ పెట్రోల్ బంక్ -> హనఫియా మసీదు వద్ద ఎడమ మలుపు -> గడ్డిఅన్నారం ఎక్స్ రోడ్ వద్ద ఎడమ మలుపు తీసుకుని నల్గొండ ఎక్స్ రోడ్ చేరుకోవాలి.
మీర్చౌక్ నుంచి డబీర్పురా బ్రిడ్జి మీదుగా సైదాబాద్ వై జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు
==> ట్రిబ్యునల్ కోర్ట్ (ఏపీఏటీ) వద్ద మళ్లింపు -> డబీర్పురా కమాన్ -> షేక్ ఫయాజ్ కమాన్ (కుడి మలుపు) -> గంగా నాలా -> బడా బజార్ -> యాకుత్పురా ఆర్యూబీ (ఆర్యూబీ) -> 82 బస్ స్టాప్ -> మదన్నాపేట్ మండీ -> సంతోష్ నగర్ మెయిన్ రోడ్డు మీదుగా వెళ్లాలి.
డబీర్పురా కమాన్ నుంచి చంచల్గూడ ఎక్స్ రోడ్ మీదుగా మలక్పేట్ వైపు వెళ్లే వాహనాలు
==> ట్రిబ్యునల్ కోర్ట్ (ఏపీఏటీ) వద్ద మళ్లింపు -> దారుల్షిఫా గ్రౌండ్ -> సక్సెస్ స్కూల్ -> ఎస్జె రోటరీ చాదర్ఘాట్ మీదుగా మలక్పేట్ మెయిన్ రోడ్డుకు చేరుకోవాలి.
తాజా అప్డేట్ కోసం..
ప్రయాణికులు ఈ ప్రత్యామ్నాయ మార్గాలను గమనించి, సహకరించాలని కోరారు. తాజా ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఫేస్బుక్, ఎక్స్లో తమ అధికారిక ఖాతాలు చూడాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. ప్రయాణ అత్యవసర సమయాల్లో సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 90102 03626ను సంప్రదించాలని సూచించారు.
KPHB Land Record Price: భూముల ధరల్లో సరికొత్త రికార్డు.. ఒక్క గజం రూ.2.70 లక్షలు
Hyderabad, Telangana:KPHB Land Auction: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కన్న అత్యధిక ధరలు పలుకుతుండగా ఇక హైదరాబాద్లో భూముల ధరలు దేశంలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఒక్క గజం రూ.2.70 లక్షలు పలికింది. కేపీహెచ్బీకి సంబంధించిన భూముల వేలంలో భారీ ధరలు పలికాయి. ఆ భూముల ధరలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కేపీహెచ్బీ భూములకు మరోసారి వేలం నిర్వహించగా ఈసారి తీవ్ర పోటీ నెలకొనడంతో భారీ ధరలు పలికాయి. మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.47.14 కోట్ల మేర ఆదాయం లభించిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ప్రకటించారు. ఎటువంటి వివాదాలు లేని.. అన్ని వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్బీ ప్రాంతంలో నిర్వహించిన ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది.
హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగం వేలంలో ఓపెన్ ప్లాట్లకు రికార్డు ధరలు వచ్చాయి. కేపీహెచ్బీ 7 ఫేజ్లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక ప్లాట్కు ఒక చదరపు గజం భూమి 2.70 లక్షలకు ధర పలికింది. ఈ వేలానికి సంబంధించి హౌసింగ్ బోర్డు ఆగస్టు 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ప్లాట్లకు చదరపు గజం కనీస ధరగా రూ.1.60 లక్షలు నిర్దారించింది.
ఈ వేలం పాటలో ఓపెన్ ప్లాట్లను దక్కించుకోడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు (బిడ్డర్లు) పోటీపడ్డారు. వేలంలో చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలు పలికిందని హౌసింగ్ బోర్డు అధికారులు ప్రకటించారు. తాజా బహిరంగ వేలం ద్వారా హౌసింగ్ బోర్డ్కు సుమారు రూ.47.14 మేర కోట్ల ఆదాయం వచ్చిందని వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ వెల్లడించారు. ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్ముడుపోగా.. మరో ప్లాట్ చదరపు గజం రూ.2.36 లక్షలకు వేలంలో ధర లభించిందని తెలిపారు. మరో రెండు ప్లాట్లు రూ.2.06 లక్షలకు వేలం పాటలో ధర పలికిందని వివరించారు. నగరానికి శివారున ఉన్న కేపీహెచ్బీ ప్రాంతంలో భూములు ధరలు భారీగా ఉన్నాయి. ఈ డిమాండ్తో ప్రభుత్వం రానున్న రోజుల్లో మరికొన్ని కేపీహెచ్బీ ఓపెన్ ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Konda Surekha: ముఖ్యమంత్రి రేవంత్పై మరోసారి కొండా సురేఖ ఫైర్..ఈసారి మంత్రి పదవి ఊడినట్టేనా?
Hyderabad, Telangana:Minister Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఏఐసీసీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. తన వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వచ్చినట్లు చెప్పిన ఆమె.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేసింది. తన మంత్రి పదవిని డిస్మిస్ చేసే ముందు రేవంత్ రెడ్డిపై తొలుత చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై వేటు తప్పదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.School Holiday Tomorrow: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!
Hyderabad, Telangana:School Holiday Tomorrow News: భారతదేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాలలో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ (IMD) సెప్టెంబరు 3, 2026 వరకు పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పు, మధ్య భాగాలలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల రేపు బడులు మూసివేస్తారా లేదా అనే ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులలో వ్యక్తమవుతోంది.
సాధారణంగా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర స్థాయి నుండి కాకుండా, ఆయా రాష్ట్రాల విద్యాశాఖ, జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్థానిక వాతావరణ తీవ్రతను బట్టి సెలవులు నిర్ణయిస్తారు. ఈ క్రమంలో, దేశవ్యాప్తంగా ఒకేసారి సెలవు ప్రకటించే అవకాశం లేదు. ముఖ్యంగా పాఠశాలల మూసివేత నిర్ణయాలు ప్రయాణాల భద్రత, వరద పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.
రాష్ట్రాల వారీగా తాజా పరిస్థితులు..
హిమాచల్ ప్రదేశ్: ఈ రాష్ట్రంలో సెప్టెంబర్ 3 వరకు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు ఒకేసారి సెలవు ఇవ్వకపోయినప్పటికీ, వాతావరణ తీవ్రతను బట్టి ఆయా జిల్లాల కలెక్టర్లు లేదా అధికారులు స్థానికంగా మూసివేత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్: ఈ రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ముఖ్యంగా నైనిటాల్ జిల్లాలో సెప్టెంబర్ 3వ తేదీన పాఠశాలలకు సెలవును అధికారులు ధృవీకరించారు. మిగిలిన జిల్లాల్లో వాతావరణ బులెటిన్లు, స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోనున్నారు.
ఇతర రాష్ట్రాలు: తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ రాష్ట్రాల్లో పూర్తిస్థాయి సెలవులు ప్రకటించలేదు కానీ స్థానిక పరిస్థితుల ఆధారంగా బడులు మూసివేసే అవకాశం ఉంది.
తల్లిదండ్రులు, విద్యార్థుల జాగ్రత్తలు..
వాతావరణ పరిస్థితులు సెప్టెంబర్ 3-4 వరకు ఇలాగే ఉండి, ఆ తర్వాత రుతుపవనాలు క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు తమ స్థానిక జిల్లా యంత్రాంగం, విద్యాశాఖ, పాఠశాలల యాజమాన్యం నుండి వచ్చే అధికారిక ప్రకటనలను నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించడమైనది. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండి భద్రతా నియమాలు పాటించడం మంచిది.
Also Read: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు..బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షాలకు హెచ్చరిక!
Also Read: "రూ.43,000 కోట్ల అప్పులు తీర్చాను..నా జీవితం తెరిచిన పుస్తకం": Dr.సుభాష్ చంద్ర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TTD Deputy EO: తిరుమలలో కలకలం.. టీటీడీ డిప్యూటీ ఈఓ నివాసంలో ఏసీబీ తనిఖీలు
Tirupati, Andhra Pradesh:Mendu Lokanatham: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన డిప్యూటీ ఈఓ నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేయడం కలకలం రేపింది. ఇన్నాళ్లు ప్రభుత్వ ఉద్యోగులపై ఏసీబీ దాడులు నిర్వహించగా.. టీటీడీ అధికారి నివాసంపై ఏసీబీ తనిఖీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం టీటీడీలో తీవ్ర కలకలం రేపింది.
తిరుపతిలోని డిప్యూటీ ఈఓ లోకనాథం ఇంటిలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని ఏసీబీ బృందం సోదాలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగి మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు సోదాలు జరిగాయి. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఈ తనిఖీలు చేపట్టారు. జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరి ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న లోకనాథం ఆస్తులపై విచారణ సాగుతోంది.
తిరుపతితో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లతో సహా మొత్తం 5 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేశాయని సమాచారం. విచారణలో భాగంగా లభించిన బంగారం, ఆస్తి పత్రాలు, ఇతర పత్రాలను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు వెంటనే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ కోరారు. ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తుల మాటలు నమ్మవద్దని, అలా అడిగితే ఏసీబీ టోల్ ఫ్రీకి కాల్ చేయాలని సూచించారు.
భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాగా టీటీడీ డిప్యూటీ ఈఓ నివాసంపై ఏసీబీ తనిఖీలు చేయడాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ ఈవో లోకనాథం యాదవ్పై ఏసీబీ దాడులు కుట్రలో భాగమేనా? లోకనాథం యాదవ్ను టార్గెట్ చేయడం వెనుక ఆధిపత్య పోరే కారణమా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక 80 మంది అధికారులతో 6 నెలల విచారణ చేసినా ఏం తేలలేదు తెలిపారు. కొండను తవ్వి ఎలుకను పట్టారని విమర్శించారు.
Pattaya Police Raids: 5,000 మంది అమెరికా సైనికుల రాకతో సెక్స్ వర్కర్లపై దాడులు..థాయ్లాండ్ పోలీసులకు కొత్త చిక్కు!
Muang Pattaya, Chang Wat Chon Buri:Pattaya Workers Police Raids: అమెరికా నావికాదళానికి చెందిన ప్రతిష్టాత్మక విమాన వాహక నౌక 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్', మరో రెండు యుద్ధనౌకలు బుధవారం ఉదయం థాయ్లాండ్లోని లేమ్ చాబాంగ్ ఓడరేవులోకి ప్రవేశించాయి. ఈ నౌకలో సుమారు 5,000 మంది అమెరికా నావికులు, మెరైన్లు, పైలట్లు ఉన్నారు. గత ఏడాది నవంబర్లో అమెరికా పశ్చిమ తీరంలోని శాన్ డియాగో నుండి బయలుదేరిన ఈ నౌక, మధ్యప్రాచ్యంలో ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా సైనిక చర్యలకు మద్దతు ఇస్తూ సుదీర్ఘకాలం పాటు సముద్రంలోనే గడిపింది.
ఈ మోహరింపు సమయంలో నౌకలో తీవ్రమైన పని గంటలు, సౌకర్యాల కొరత వంటి ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం సెప్టెంబర్ 2 నుండి 6 వరకు ఐదు రోజుల పాటు తీర విరామం కోసం వచ్చిన సైనికులకు ఈ పర్యటన ఎంతో అవసరమైన ఉపశమనాన్ని ఇస్తోంది. పట్టాయా నగరానికి అమెరికా సైనికుల రాక ఇక్కడి పర్యాటక రంగానికి పెద్ద ఆశాకిరణంగా మారింది.
వియత్నాం యుద్ధం (1955-1975) సమయంలో విశ్రాంతి కోసం వచ్చిన అమెరికా సైనికుల వల్లే పట్టాయా ఒక చిన్న మత్స్యకార గ్రామం నుండి పర్యాటక కేంద్రంగా ఎదిగింది. ప్రస్తుతం 2026 నాటికి ఇక్కడ వ్యాపార పరిస్థితులు గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉన్నాయని పట్టాయా నైట్లైఫ్ బిజినెస్ అసోసియేషన్ అధ్యక్షురాలు లీసా హామిల్టన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి అమెరికా సైనికుడు రోజుకు సుమారు 1,000 నుండి 3,000 థాయ్ బాట్ (30 నుండి 90 డాలర్లు) వరకు ఖర్చు చేయవచ్చని, ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తుందని పట్టాయా మేయర్ పొరమాసే న్గాంపిచెస్ భావిస్తున్నారు.
అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో వినియోగదారులు రావడం వల్ల లైంగిక దోపిడీ, వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అసోసియేట్ ప్రొఫెసర్ పిపత్పాంగ్ ఫక్ఫారే హెచ్చరించారు. థాయ్లాండ్ చట్టాల ప్రకారం వ్యభిచారం చట్టవిరుద్ధం అయినప్పటికీ, పట్టాయాలో ఇది విస్తృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు గస్తీ ముమ్మరం చేసి అక్రమ వ్యభిచార గృహాలపై దాడులు చేశారు.
ఈ ఆపరేషన్లో భాగంగా ఆగస్టు 29న పట్టాయా బీచ్ వెంబడి వీధి వ్యభిచారం చేస్తున్న 25 మంది మహిళలతో (18 మంది థాయ్, 5గురు లావో, ఇద్దరు ఉగాండా మహిళలు) సహా మొత్తం 40 నుండి 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. లైంగిక కార్మికులు బహిరంగ ప్రదేశాలలో విటులను ఆకర్షిస్తుండటంతో చట్టాల అమలు కష్టంగా ఉందని పట్టాయా పోలీస్ చీఫ్ అనెక్ స్రాతోంగ్యూ తెలిపారు.
అమెరికా సైనికుల పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు కఠినమైన నిబంధనలు విధించారు. సైనికులను గంజాయి, మందుల దుకాణాలు, కొన్ని జల క్రీడలలోకి అనుమతించరు. రాత్రి 2 గంటల తర్వాత వారు బీర్ బార్ల వద్ద ఉండకూడదు. అలాగే, బాల లైంగిక సేవలను పూర్తిగా నిరోధించాలని, పర్యాటకుల నుండి అధిక ధరలు వసూలు చేసి దోపిడీ చేయవద్దని స్థానిక వ్యాపారులను అధికారులు హెచ్చరించారు.
Also Read: "భారత్, చైనా, అమెరికా వల్లనే వరదలు వచ్చాయి": నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా!
Also REad: నేపాల్లో పెను విలయం..ఆకస్మిక వరదలకు 392 మంది మృతి..290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Komatireddy Rajgopal: నేను ముఖ్యమంత్రి అవుతా.. బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు: రాజగోపాల్ రెడ్డి
Brahmana Vellemla, Telangana:YSR Death Anniversary: సొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి స్వరం వినిపిస్తూ.. రేవంత్ రెడ్డిపై నేరుగా యుద్ధం చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించారు. ఆ టైం వస్తే బ్రహ్మ దేవుడు కూడా ఆపలేడని స్పష్టం చేశారు. కొత్తవాళ్లు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కబ్జా చేయాలని చూస్తున్నారని.. కానీ తాను ఊరుకోనని స్పష్టం చేశారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని.. మళ్లీ వైఎస్సార్ రాజ్యం తీసుకొస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని స్వగ్రామం బ్రాహ్మణవెల్లంలలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పర్యటించారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఇతర పార్టీ నాయకులను తీసుకోవడం మంచిదే. కానీ మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని వెలగొడతాం అంటే ఊరుకోం' అని కొందరిని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. సీఎం సీఎం అంటున్నారు అవకాశం వస్తే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించారు. ఆ సమయం వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని స్పష్టం చేశారు.
మరోసారి MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నేను సీఎం అవుతా
అదే టైం వస్తే బ్రహ్మ దేవుడు కూడా ఆపలెడు
రాష్ట్రంలో రాబోయేది రాజశేఖర్ రెడ్డి యుగం
తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి కి అభిమానులు లక్షలాది మంది ఉన్నారు.
వైఎస్ఆర్ ఆశయాల కోసం పాటుపడుతా , వైఎస్ఆర్ స్ఫూర్తి తో… pic.twitter.com/f3najx7RIh
— News Line Telugu (@NewsLineTelugu) September 2, 2026
'కొత్తవాళ్లు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కబ్జా చేయాలని చూస్తే రాజగోపాల్ రెడ్డి ఊరుకోడు. కొంత మంది కాంగ్రెస్ పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొస్తా' అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మళ్లీ వైఎస్సార్ రాజ్యం తీసుకొస్తానని ప్రకటించారు. 'పేద ప్రజలకు రైతులకు అండగా నిలిచిన వాడే అసలైన నాయకుడని అలా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పేద ప్రజలు కార్పొరేట్ వైద్యాన్ని అందుకుంటున్నారంటే అది రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకంతోనే. రైతులకు ఉచిత కరెంటు వైఎస్సార్ ప్రవేశపెట్టారు. పేద ప్రజల కోసం, రైతుల కోసం ఆయన తీసుకొచ్చిన పథకాలు దేశ చరిత్రలో ఏ నాయకుడు తీసుకురాలేదు' అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
'ఆనాడు రాజశేఖరరెడ్డి ఒప్పించి నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొట్లాడి తెచ్చిన ప్రాజెక్టు ఉదయ సముద్రం ఎత్తిపోతల బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇచ్చాం' అని రాజగోపాల్ రెడ్డి వివరించారు. 'తెలంగాణలో రాజశేఖర్ రెడ్డికి అభిమానులు లక్షలాది మంది ఉన్నారు. వైఎస్సార్ ఆశయాల కోసం పాటుపడుతా. వైఎస్సార్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చా. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్సార్ శిష్యులం. మేము వైఎస్సార్ని మరవం' అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగదని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు.
Janmashtami 2026: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2026..జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన 7 కృష్టుడి దేవాలయాలు!
Hyderabad, Telangana:Janmashtami 2026 Famous Temples: శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, భక్తులు భారతదేశం అంతటా ఉన్న ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలను సందర్శిస్తుండటంతో, జన్మాష్టమి 2026ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. జన్మాష్టమి భారతదేశంలోని అత్యంత ఆనందకరమైన, ఆధ్యాత్మిక శక్తితో నిండిన పండుగలలో ఒకటిగా చెప్పవచ్చు.
ఈ సందర్భం కోసం దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు రంగురంగుల అలంకరణలతో అద్భుతంగా ముస్తాబవుతాయి. అందమైన అలంకరణలు, గుంపులు గుంపులుగా తరలివచ్చే భక్తులు, గాలిలో మారుమోగే భజనలు, మీరు ఊహించిన దానికంటే చాలా సేపటి వరకు సాగే అర్ధరాత్రి వేడుకలు ఈ పండుగ ప్రత్యేకత. ఈ సమయంలో మీరు కృష్ణ దేవాలయాన్ని సందర్శించగలిగితే, అది మీ మదిలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక అద్భుతమైన అనుభూతిగా మారుతుంది. దైవ ఆశీస్సుల కోసం మీరు తప్పక సందర్శించవలసిన 7 ప్రసిద్ధ ఆలయాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
1) బాంకే బిహారీ దేవాలయం (బృందావన్)
బృందావన్కు అనేక విధాలుగా ఇది ఒక కిరీటం వంటిది. ఇది దేశంలోని అత్యంత ప్రసిద్ధ కృష్ణ దేవాలయాలలో ఒకటి, జన్మాష్టమి సమయంలో ఈ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇక్కడి భక్తి శక్తి ఉప్పొంగే విధానాన్ని వర్ణించడానికి అద్భుతం అనే పదం కూడా సరిపోదు.
2) కృష్ణ జన్మభూమి ఆలయం (మథుర)
ఇది శ్రీకృష్ణుని అసలైన జన్మస్థలం అని నమ్ముతారు. అందుకే ఇక్కడ జన్మాష్టమి జరుపుకోవడం అనేది ఇతర ఆలయాలు సరిపోల్చలేని ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సంప్రదాయం ప్రకారం కృష్ణుడు జన్మించాడని చెప్పే అర్ధరాత్రి సమయంలో ఇక్కడ ప్రధాన పూజలు జరుగుతాయి.
3) ద్వారకాధీష్ ఆలయం (ద్వారక)
కృష్ణాష్టమి వేడుకల కోసం ద్వారకకు వెళ్లడం మంచి ఎంపిక. ఇది ద్వారకా రాజుగా కృష్ణునికి అంకితం చేస్తారు. ఇక్కడి వేడుకలు ఆ రాజవైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రత్యేక హారతులు, విస్తృతమైన అలంకరణలు ఇక్కడి ప్రత్యేకత.
4) ఇస్కాన్ ఆలయం (ISKCON)
శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు మీరు సందడిగా ఉండే వాతావరణం కోరుకుంటే ఇస్కాన్ మీకు అందిస్తుంది. కీర్తనలు, నృత్యం, ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఇక్కడి జన్మాష్టమి చాలా సందడిగా, ఆనందంగా, ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఇది ఏమాత్రం నిశ్శబ్దంగా ఉండే ప్రదేశం కాదు.
5) ప్రేమ్ మందిర్ (బృందావన్):
నిజం చెప్పాలంటే, ఈ ప్రదేశం వాస్తుశిల్పానికి ఒక అద్భుత దృశ్యం. అద్భుతమైన నిర్మాణం, నమ్మశక్యం కాని లైట్ షోలు ఇక్కడి ప్రత్యేకత. జన్మాష్టమి సమయంలో అలంకరణలు, దీపాల వెలుగులు తోడవడంతో ఆలయం మొత్తం ఒక కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది.
6) ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయం (కర్ణాటక)
కర్ణాటకలోని ఈ దేవాలయ వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ సాంప్రదాయ ఆచారాలు, ప్రశాంతమైన వాతావరణం, ఆడంబరాల కన్నా సరళతకే ప్రాధాన్యత ఇస్తారు. ఇతర దేవాలయాలలో ఉండే వైభవం ఇక్కడ లేకపోయినా, భక్తి మాత్రం అపారంగా ఉంటుంది.
7) జగన్నాథ దేవాలయం (పూరి)
ఇది ప్రధానంగా జగన్నాథునికి ప్రసిద్ధి చెందినప్పటికీ, కృష్ణాష్టమికి ఇక్కడ వైభవంగా పూజలు జరుగుతాయి. భక్తిశ్రద్ధలతో, ప్రత్యేక ఆచారాలతో ఈ పండుగ రోజును ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు.
2026 జన్మాష్టమి సందర్భంగా ఈ దేవాలయాలను సందర్శించడం ఖచ్చితంగా విలువైనదే. ప్రతి దేవాలయం తనదైన శైలిలో శాంతి, భక్తి, ఆనందాన్ని అందిస్తుంది. కొన్ని దేవాలయాలు అట్టహాసంగా ఉంటే, మరికొన్ని భక్తి శ్రద్ధల్లో ముంచేలా ప్రతిబింబిస్తాయి. ఏది ఏమైనప్పటికీ, మీరు ఆధ్యాత్మికతను అన్వేషించినా లేదా కేవలం వేడుకలలో లీనమవ్వాలనుకున్నా, ఇవి మీరు ఒక్కసారి సందర్శిస్తే ఎప్పటికీ మరచిపోలేని ప్రదేశాలుగా నిలిచిపోతాయి.
Also Read: Krishna Janmashtami 2026: 2026 కృష్ణాష్టమి ఎప్పుడు.
Also Read: Rakhi Festival: రాఖీని ఎన్ని రోజులు చేతికి ఉంచుకొవాలి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
బార్లో బిల్లు కట్టలేదని యువతికి గుండు.. వైరల్ అవుతున్న వీడియో!
Hyderabad, Telangana:Thailand Bar Hair-shaving Video: సాధారణంగా రెస్టారెంట్లతో పాటు బార్లలో కడుపునిండా తిని.. పీకల లోతు దాకా తాగి బిల్లు కట్టకుండా తప్పించుకున్నారన్న వార్తలు మనం తరచుగా వింటూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా వారిచేత అంట్లు తోమించడం లాంటి పనులు చేయిస్తూ ఉంటారు. కానీ థాయిలాండ్లోని బ్యాంకాక్ లో జరిగిన ఒక ఘటన మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. విపరీతంగా ఖర్చు చేసి బిల్లు కట్టలేక పోయిన ఒక ఒక యువతికి పబ్బు యాజమాన్యం ఏకంగా గుండు కొట్టించింది.. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ గా మారింది.. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అసలేమైందంటే..
ఆగస్టు 25వ తేదీన బ్యాంకాక్ లోని పినక్లావ్ (Pinklao) ప్రాంతంలో ఉన్న ఓ కాస్ట్లీ బార్లో 18 ఏళ్ల యువతి నకిలీ ఐడి కార్డుతో లోపలికి వెళ్ళింది.. అయితే, అక్కడ విపరీతంగా మందు తాగడంతో పాటు.. అక్కడికి డాన్సర్లకు కూడా ఖరీదైన డ్రింక్స్ ఇప్పించింది. అలా ఆ రాత్రి ఆమె చేసిన బిల్లు ఏకంగా భారత కరెన్సీలో 1.7 లక్షల రూపాయలు.. అంత భారీ మొత్తంలో వచ్చిన బిల్లును చూసి కంగు తిన్న ఆ యువతి.. డబ్బులు చెల్లించకుండా బార్ నుంచి మెల్లగా జారుకునే ప్రయత్నం చేసింది..
యువతి దొంగ చాటున పారిపోతుండగా గమనించిన భార సిబ్బంది.. ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.. పోలీసులకు అప్పగించాల్సిన యాజమాన్యం.. చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంది.. బిల్లులో కొంత మొత్తాన్ని రికవరీ చేయడానికి ఆ యువతి జుట్టును కొనుగోలు చేస్తున్నట్లుగా ఒక హెయిర్ పర్చేజ్ కాంట్రాక్ట్ (Hair Purchase Contract) పై బలవంతంగా యాజమాన్యం సంతకం చేయించుకుంది.. ఆ జుట్టుకు సుమారు 3000 బాట్లుగా రేటు కట్టారు.. ఆ తర్వాత వెంటనే ఎలక్ట్రిక్ ట్రిమ్మర్ ను తీసుకొచ్చి.. ఆమె జుట్టును పూర్తిగా కత్తిరించి గుండు చేశారు.. ఈ తథాంగాన్ని అంత కెమెరాలు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అధికాస్త విపరీతంగా వైరల్ అయింది.
— RT (@RT_com) August 30, 2026
ఈ వీడియోలో యువతి తెల్లటి డ్రెస్సులో కూర్చుని ఉండగా.. ఇద్దరు వ్యక్తులు ఇది మార్కెట్ రేటు ప్రకారమే తీసుకుంటున్నాం.. నేను నిన్ను మోసం చేయడం లేదు.. అని చెబుతూ గుండు చేయడం వీడియోలో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. థాయిలాండ్ కు సంబంధించిన సామాజిక కార్యకర్త చలిద ఫలమత్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడంతో.. ఆ బార్కు సంబంధించిన యాజమాన్యం చేసిన పనిని సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా ఖండించారు.. మరికొందరు మాత్రం మోసాలకు పాల్పడితే వారికి ఇదే సరైన బుద్ధి అని చెబుతూ వచ్చారు..
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
ఏది ఏమైనా.. ఆ బార్లో ఉన్న సిబ్బంది వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో.. మేనేజర్ తప్పును అంగీకరించి క్షమాపణలు కోరినట్లు వార్తలు కూడా వచ్చాయి.. విషయాన్ని తెలుసుకున్న థాయిలాండ్కు సంబంధించిన సామాజిక అభివృద్ధి, మానవ భద్రత మంత్రుత్వ శాఖ ఈ వ్యవహారంపై అధికారిక విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త ఓ పెద్ద సంచలనంగా మారింది.
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
