icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
SShankerreddyFollow27 Jul 2024, 03:17 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Karimnagar: వింత ఘటన.. ఇళ్లకు తాళాలు వేసి పొలాల్లోకి.. భయంతో వణికిపోతున్న గ్రామస్థులు!

Karimnagar, Telangana:

Karimnagar Latest News: ఒక మామూలు సాధారణ గ్రామం కాదు.. తెల్లవారుజామున నాలుగు గంటలకి ఇళ్లకు తాళాలు వేస్తున్నారు.. విల్లాపాపలతో సహా జనం పొలాల బాట పడుతున్నారు.. వంట సామాగ్రి తో పాటు బియ్యం, కూరగాయలు మూటలు గట్టుకొని అడవి బాట పట్టారు.. కారణం తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే.. కారణమేంటో కాదు ఆ ఊరికి కీడు సోకిందన్న భయం.. అవును మీరు విన్నది నిజమే. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కేశవాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ ఊరు పేరు వింటేనే అంతా భయపడి పోవలసిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గత రెండు నెలలుగా కేశవపూర్ గ్రామంలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. కేవలం 60 రోజుల వ్యవధిలో సుమారు 15 మంది వివిధ కారణాలతో మరణించారట.. తాజాగా ఒకరు మరణించిన తర్వాత.. వారి దశదిన కర్మలు కూడా పూర్తికాకముందే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తుల్లో ఒక ఊహించని ఆందోళన మొదలైంది. వయస్సుతో సంబంధం లేకుండా ఒకరి వెనక ఒకరు మృత్యువాత పడడంతో.. గ్రామానికి ఏదో దోష చుట్టుముట్టిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు..

గ్రామంలో నెలకొన్న ఈ భయానక పరిస్థితులపై గ్రామ పెద్దలతో పాటు యువకులు కలిసి ఒక జ్యోతిష్య శాస్త్ర పండితుడిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఊరిపై ఉన్న గ్రహ దోషం పోవాలంటే కీడు పంటలు చేయాలని ఆయన సూచించారు. సూర్యోదయానికి ముందే ఊరు విడిచి వెళ్లాలని.. రోజంతా ఊరి పొలిమేరల అవతల పడుకొని తిని.. సూర్యాస్తమయం అయ్యాక చీకటి పడ్డాకే మల్లి పిల్లకు చేరుకోవాలని నియమం విధించారు.. ఇలా చేస్తే గ్రామానికి అంతా బాగా జరుగుతుందని ఆ జ్యోతిష్యులు తెలిపారుట..

పండితుడి సూచనల మేరకు గ్రామస్తులందరూ ఏకమై ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామునే గ్రామం అంత ఖాళీ చేసిన పొలాల్లోకి చేరుకున్నారు.. ఊరులోని పాఠశాలలతో పాటు అంగన్వాడి కేంద్రాలు, దుకాణాలు అన్ని మూతపడ్డాయి. అలాగే చెట్ల కింద పొయ్యిలు వెలిగించి సామూహికంగా వంటలు చేసుకుంటున్నారు.. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు అందరూ రోజంతా ఊరికి దూరంగానే గడిపారు.  వరుస చావులు సంభవిస్తుంటే తట్టుకోలేకపోతున్నాం.. ఎవరికి ఏమవుతుందో అని భయమేస్తోంది.. అందుకే అందరం కలిసి ఊరి దోషం పోవాలని ఈ కార్యక్రమం చేపట్టామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్‌ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Liquor Shops: రేపు హైదరాబాద్‌లో 24 గంటలు వైన్‌షాపులు, బార్లు బంద్‌

Hyderabad, Telangana:

Tomorrow Wine Shops Close: మొన్ననే మద్యం దుకాణాలు, బార్లు బంద్‌ ఉండగా మందుబాబులు కొంత ఇబ్బందులు పడ్డారు. మళ్లీ మరోసారి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలతోపాటు బార్లు, కల్లు దుకాణాలు బంద్‌ ఉండనున్నాయి. మొన్న శ్రీరామనవమి సందర్భంగా వైన్స్‌ మూసివేయగా.. ఇప్పుడు హనుమాన్‌ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్‌ శాఖ, పోలీస్‌ శాఖ సూచించింది.

Also Read: Amaravati: అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరు.. అంగుళం కదపలేరు: సీఎం చంద్రబాబు

వైన్స్‌ దుకాణాలు మూసివేస్తూ మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 3వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని పోలీస్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హనుమాన్‌ జయంతి సందర్భంగా మద్యం విక్రయాలు బంద్‌ చేస్తున్నట్లు పోలీస్‌ శాఖ తెలిపింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కూడా మద్యం దుకాణాలు మూసివేసే అవకాశం ఉంది. ఒక్క సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో తెరచి ఉంటాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read: Tank Bund Shiva: ప్రాణాలు కాపాడే ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం

వీర హనుమాన్ విజయయాత్ర
హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ వరకు వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించనున్నట్లు భజరంగ్ దళ్ తెలిపింది. రేపు గురువారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు గౌలిగూడ రామమందిరంలో యజ్ఞం, 11 గంటలకు కోఠి కూడలిలో సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించనున్నట్లు భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ కొండా శ్రీకాంత్ వెల్లడించారు. అనంతరం ద్విచక్ర వాహన ర్యాలీ ప్రారంభమై కోఠి, సుల్తాన్ బజార్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, అశోక్‌నగర్, ట్యాంక్‌బండ్, బాటా, ప్యారడైజ్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు.

Also Read: Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌!

శోభయాత్ర ఏర్పాట్లు పరిశీలన
ఈ నెల 2వ తేదీన హనుమాన్ జయంతి నేపథ్యంలో తాడ్‌బండ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను  హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. హనుమాన్ జయంతి శోభాయాత్ర రూట్ మ్యాప్‌ పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు జరుగుతుండడంతో శోభాయాత్ర  రూట్‌మ్యాప్‌ను బాంటియా గార్డెన్ మీదుగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. 3000 మంది పోలీసు సిబ్బందితో పాటు సీసీ కెమెరాలతో శోభయాత్రను అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విజయవంతం చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు పోలీస్‌ శాఖ వెల్లడించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Kondagattu: కేసరి వర్ణంగా మారిన కొండగట్టు గుట్ట.. కిలోమీటర్ల మేర క్యూ!

Kondagattu, Telangana:

Kondagattu Latest Telugu News: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి భక్తులతో కిటకిట లాడుతోంది. చిన్న హనుమాన్ జయంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన హనుమాన్ దీక్ష పరులతో కొండగట్టు పరిసరాలన్నీ కేసరి వర్ణంగా మారాయి.. ప్రతి ఏడాది కొండగట్టులో హనుమాన్ జయంతి ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈసారి కూడా దీక్షాపరులతో హనుమాన్ జయంతి ఘనంగా జరగబోతున్నట్లు ఆలయ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు..

41 రోజులపాటు కఠిన దీక్షలు చేపట్టిన స్వాములు.. శనివారం తెల్లవారుజాము నుంచే కొండగట్టుకు చేరుకోవడం ప్రారంభించారు. తమ ఆరాధ్య దైవమైన అంజనకు ఇరుముడులు సమర్పించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్ లలో వేచి ఉన్నారు. జైశ్రీరామ్.. జై హనుమాన్ అనే నామస్మరణతో కొండగట్టు పై ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. కొండపై భారీ ఎత్తున స్వాములు ఉండడంతో..  కేసరి వర్ణంగా మారిపోయింది..

దీక్షపరుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేసినట్లు తెలుస్తోంది. దీక్ష పరులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ ఆవరణంలోని ప్రత్యేకమైన ఇరుముడి సమర్పణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృశ్య క్యూ లైన్ లో ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరుతో పాటు మజ్జిగ సరఫరా కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేకమైన అన్నదాన కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. అలాగే అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలతో పాటు ఆంబులెన్స్ సేవలను కూడా అందుబాటులో ఉంచారు.

Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్‌ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా? 

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొండగట్టు పై వాహనాల రాకపోకలపై పోలీసులు ప్రత్యేకమైన ఆంక్షలు కూడా విధించినట్లు తెలుస్తోంది. ఘాటు రోడ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసి.. కొన్నిచోట్ల ప్రత్యేకమైన సీసీ కెమెరాలు ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తమ కష్టాలను తీర్చి.. కొంగుబంగారంగా విరాజిల్లే కొండగట్టు అంజన్న ను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. ఏడాది దీక్షపరుల సంఖ్య గతంతో పోలిస్తే మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు మరిన్ని అదనపు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు..

Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్‌ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Most Expensive Wine: ఒక్క బాటిల్ వైన్.. ఒక లగ్జరీ విల్లా కంటే ఖరీదు! ఎందుకంత క్రేజ్?

Hyderabad, Telangana:

Most Expensive Wine Telugu: ఒక్క వైన్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? కొన్ని వందలు లేదా వేల రూపాయలు ఉంటుంది.. మల్టీ నేషనల్ బ్రాండ్ అయితే లక్షల్లో ఉండవచ్చు.. కానీ ఒకే ఒక బాటిల్ వైన్ ధర ఏకంగా విల్లా, ఖరీదైన లగ్జరీ కార్ల కంటే ఎక్కువకు అమ్ముడై అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి డొమైన్ డి లా రోమనీ-కొంటి బ్రాండ్ కు చెందిన 1945 నాటి ఓ వైన్ బాటిల్ ఇటీవల జరిగిన అకర్ వేలంలో ఏకంగా 7.63 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఇది ఇప్పుడు ప్రపంచ రికార్డును సృష్టించింది. కేవలం ఒక వైన్ బాటిల్ ఇంతవరకు అమ్ముడుపోవడానికి గల కారణాలు? అసలు ఈ వైన్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

న్యూయార్క్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక వేలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులతో పాటు వైన్ బాటిల్స్ ను సేకరించేవారు భారీ మొత్తంలో పాల్గొన్నారు. ఈ వేళంలో 1945 నాటి వింటేజ్‌కు చెందిన ఈ బాటిల్ కోసం ఒకరంటే ఒకరు పోటా పోటీగా.. దీనిని గెలుచుకునేందుకు ఆసక్తి చూపారు. చివరికి ఒక వ్యక్తి దీనిని రికార్డు స్థాయి ధరకు దక్కించుకున్నారు. 2018లో ఇదే బ్రాండ్ కు చెందిన ఒక బాటిల్ సుమారు నాలుగు కోట్ల రూపాయలకు అమ్ముడవ్వగా.. తాజా వేలం ఆ రికార్డును తుడిచి వేసింది..

ఈ వైన్ బాటిల్ ఇంత ఖరీదు పలకడానికి ప్రధాన కారణం దాని అరుదైన చరిత్రగా భావించవచ్చు. 1945 ప్రాంతంలో ఫ్రాన్స్‌లోని బుర్గుండి ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ రోమనీ-కొంటి ద్రాక్ష తోటల నుండి దీనిని తయారు చేశారు. ఆ సంవత్సరంలో కేవలం 600 బాటిళ్లు మాత్రమే తయారు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో తయారైన ఈ వైన్.. ఆ తోటల్లోని పాత ద్రాక్ష తీగలను తొలగించి కొత్తవి నాటడానికి ముందు సేకరించిన చివరి పంట నుండి వచ్చినది. అందుకే దీనిని పురాతన రుచిగా వైన్ ప్రియులు భావిస్తారు.. దాదాపు 80 ఏళ్లు గడిచిన దీని రుచితో పాటు నాణ్యతకు చెక్కుచెదరకుండా ఉండడం విశేషం..

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

వేల నిర్వహించిన అకర్ సంస్థ చైర్మన్ జాన్ కాపోన్ మాట్లాడుతూ.. ఇది కేవలం వైన్ మాత్రమే కాదు.. ఒక చరిత్రని.. నా జీవితంలో కేవలం మూడుసార్లు మాత్రమే దీనిని రుచి చూసే అవకాశం కలిగిందని.. ఇది కేవలం ప్రపంచంలోనే అత్యంతమైనదని.. ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైన్ కలెక్టర్లు కూడా దీనిని వైన్ ప్రపంచంలో కోహినూర్ వజ్రంగా అభివర్ణిస్తారు. అరుదైన వస్తువులను సేకరించే వారికి దీని సీసా గొప్ప ఆస్తిగా పరిగణిస్తారు..

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Amaravati: అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరు.. అంగుళం కదపలేరు: సీఎం చంద్రబాబు

Vinjamur, Andhra Pradesh:

Amaravati Capital Bill: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరని ప్రకటించారు. ఒక్క అంగుళం కూడా కదపలేరని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అని తెలిపారు. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం ఒక చరిత్రగా ప్రకటించారు. భవిష్యత్‌లోనే అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరని.. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని తెలిపారు. 

Also Read: Tank Bund Shiva: ప్రాణాలు కాపాడే ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం

నెల్లూరు జిల్లా వింజమూరులో ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు అరాచక, విధ్వంస పాలన సాగిందని వైఎస్‌ జగన్‌ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. వైఎస్సార్‌సీపీ మూడు ముక్కలాట, మూడు రాజధానుల నినాదంతో అమరావతిపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అమరావతికి చట్టబద్దత కోసం తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రాలేదని గుర్తుచేశారు.

Also Read: Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌!

ప్రజామోదం పొందిన రాజధాని అమరావతి విషయంలో ఇంత కక్ష పెట్టుకోవడాన్ని ఏమనాలి? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అలాంటప్పుడు ఆ పార్టీ ఎందుకు? ఇలాంటి నాయకులతో ఎవరికీ ఉపయోగం అని నిలదీశారు. ఎవరు ఏం చేసినా భవిష్యత్‌లో రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేరు అని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

Also Read: Heat Waves: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ అలర్ట్‌.. రాబోయే రోజుల్లో తీవ్ర వడగాలులు

లోక్‌సభలో అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందడంపై నారా లోకేశ్‌ స్పందించారు. 'నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి అని ఐదుకోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చారిత్రాత్మ‌కమైన రోజుకు దేశ పార్ల‌మెంటు వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ విధానంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ చేసిన ఏక‌గ్రీవ తీర్మానానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే అమ‌రావ‌తి బిల్లు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించడం కోట్లాది ప్ర‌జ‌లు గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భం. కేంద్ర‌ప్ర‌భుత్వానికి, మ‌ద్ద‌తుగా నిలిచిన పార్టీల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమ‌రావ‌తి విజ‌యం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల విజ‌యం. ఇది రైతుల త్యాగాలకు ద‌క్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి ద‌క్కిన ఫ‌లితం. కోట్లాది ప్ర‌జ‌ల కోరిక‌ను గౌర‌వించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ రాజ‌ధానిగా చ‌రిత్ర‌-సంస్కృతికి ఆల‌వాల‌మైన అమ‌రావ‌తిని నిలిపింది. జై ఆంధ్ర‌ప్ర‌దేశ్..జ‌య‌హో అమ‌రావ‌తి' అని నారా లోకేశ్‌ ప్రకటన విడుదల చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Bike Market: ఇక్కడ సగం ధరకే యమహా R15, బుల్లెట్ బైక్‌! రూ.45 వేలకే స్ప్లెండర్, షైన్..

Hyderabad, Telangana:

Second Hand Bikes In Delhi: ప్రస్తుత కాలంలో సొంత వాహనం ఉండటం అనేది కనీస అవసరంగా మారింది.. అయితే, కొత్త బైకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో సామాన్యులకు సెకండ్ హ్యాండ్ బైకులు వరంగా మారాయి.. తాజాగా దేశ రాజధాని పరిధిలోని సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్స్ షాపుల్లో వినియోగదారుల కోసం అద్భుతమైన బైక్లను అత్యంత తక్కువ ధరలకే అందిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని సెకండ్ హ్యాండ్ బైకులు దొరికే ప్రాంతాల్లో ఆయా షాపుల్లో కేవలం రూ.15 వేల నుంచి సెకండ్ హ్యాండ్ బైకులు లభిస్తూ ఉండడం విశేషం. అద్భుతమైన కండిషన్ లో ఉన్న బైకులు చీపు ధరలకు విక్రయించడం విశేషం..

ఢిల్లీలోని సెకండ్ హ్యాండ్ మోటార్స్ విక్రయించే అగర్వాల్ మోటార్స్ షాపులో అత్యంత తక్కువ ధరలకే స్పోర్ట్స్ బైక్ ల నుంచి ఫ్యామిలీ స్కూటర్ల వరకు అందుబాటులో ఉన్నాయి. దాదాపు వీరు షాపులో అత్యంత తక్కువ ధరలోనే 140 కి పైగా విక్రయించే వాహనాలు ఉన్నట్లు షాప్ యజమాని తెలుపుతున్నారు.  ముఖ్యంగా యువత ఎంతగానో ఇష్టపడే యమహా R15 V4, MT-15, బజాజ్ పల్సర్ NS 200, సుజుకి జిక్సర్ 250 వంటి మోడళ్లు షోరూమ్ కండిషన్‌లో అత్యంత చీపు ధరలకే అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని బైకులు అయితే కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే తిరగడం విశేషం..

ముఖ్యంగా ఈ షాపులో 2022 మోడల్ డబుల్ ఛానల్ ABS కలిగిన హంటర్ 350 మోటార్ సైకిల్ కేవలం రూ.1 లక్ష లోపే అందుబాటులో ఉంది. అంతేకాకుండా 2023 మోడల్ జావా 42 మోటార్ సైకిల్ కేవలం రూ. 1,20,000లకే అందుబాటులో ఉంది. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ స్టాండర్డ్, సిగ్నల్ ఎడిషన్లు రూ. 1.10 లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి. ఇక స్కూటీల వివరాల్లోకి వెళ్తే.. యాక్సెస్, జుపిటర్ వంటి స్కూటర్లు రూ. 40,000  నుంచి రూ. 50,000 మధ్య లభిస్తున్నాయి. అలాగే స్ప్లెండర్, షైన్ వంటి డైలీ యూజ్ బైకులు రూ. 45,000ల నుండే  ప్రారంభమవ్వడం విశేషం..

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

అలాగే ప్రతి వాహనానికి సంబంధించిన ఒరిజినల్ పేపర్లతో పాటు ఇన్సూరెన్స్, సర్వీస్ రికార్డులను అక్కడే అందిస్తున్నట్లు  సదరు షాపు యజమానులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎటువంటి పెండింగ్ చలాన్లు లేకుండా.. క్లియర్ కండిషన్లు బైకులను అందిస్తున్నట్లు వారి చెబుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వాహనాలను పంపేందుకు ట్రాన్స్పోర్ట్ సదుపాయంతో పాటు తక్కువ డౌన్ పేమెంట్తో ఫైనాన్షియల్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. అయితే మీరు కూడా ఇక్కడ మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటే నేరుగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక మోటార్ సైకిల్ కొనుగోలు చేసే క్రమంలో తప్పకుండా వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

Hyderabad, Telangana:

Cheapest Used Cars In Delhi: సొంత కారు ఉండాలని సామాన్యుడి కల.. కానీ కొత్త కార్ల ధరలు ఏకంగా ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల నుంచి ప్రారంభం అవడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కొనలేకపోతున్నాయి. ఒకవైపు యుద్ధం కారణంగా అన్ని వస్తువుల ధరలు పెరగడం వల్ల.. కొన్ని కంపెనీలు ప్రత్యేకమైన కార్ల మోడల్స్ పై ధరలు కూడా పెంచేసాయి.. దీని కారణంగా సామాన్య జనాలు కారులను కొనుగోలు చేయడం చాలా కష్టమైపోయింది. అయితే ఇప్పుడు మధ్యతరగతి ప్రజల చూపు సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ పై మల్లుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 11 లో ఉన్న సెకండ్ హ్యాండ్ మోటార్ షోరూమ్స్ కొన్ని కార్ల మోడల్స్ పై ప్రత్యేకమైన ఆఫీసును అందించడంతో.. చాలామంది ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ కేవలం రూ.99 వేల నుంచి ప్రారంభం కావడమే కాకుండా.. అతి తక్కువ డౌన్ పేమెంట్ ఆప్షన్లతో వందలాది వాహనాలు అందుబాటులో ఉండటం వల్ల చాలామంది వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు కూడా మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? 

కొన్ని సెకండ్ హ్యాండ్ మోటార్ షో రూముల్లో ఇప్పటికే ప్రత్యేకమైన సేల్స్ను ప్రారంభించారు. ఇందులో భాగంగా హోండా కు చెందిన సెవెన్ సీటర్ కార్లు ఆకర్షణీయంగా నిలుస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈవీ కార్లు కూడా అత్యధిక తగ్గింపు ధరల్లోనే అందుబాటులో ఉండడం విశేషం. అలాగే ఇప్పుడు సిఎన్జి కోరత ఏర్పడడానికి కారణంగా.. చాలామంది ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.. దీంతో ఇక్కడ అత్యంత చీప్ ధనలకే వీటిని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కార్లపై ఏకంగా 50 నుంచి 60 శాతం వరకు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నారు. 

ముఖ్యంగా రోహిణి సెక్టార్ 11 లో ఉన్న షాపుల్లో ఎక్కువగా స్విఫ్ట్, బ్రెజ్జా, స్కార్పియో, ఎక్స్‌యూవీ 500, అల్టో వంటి ప్రముఖ బ్రాండ్ల కార్లు భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. చిన్న కుటుంబాల కోసం 2020 మోడల్ కు సంబంధించిన ఆల్టో కార్లు కేవలం రూ.2 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే 2017 మోడల్ మహీంద్రా స్కార్పియో రూ. 6.90 లక్షలకు, ఎస్ యూవీ 500 కేవలం రూ. 7.25 లక్షలకే ఆఫర్ చేస్తున్నారు. దీంతోపాటు ఎర్టిగా వంటి ఫ్యామిలీ కార్లు కేవలం ఇక్కడ రూ.4 లక్షల నుంచి అందుబాటులో ఉండడం విశేషం. ఇవే కాకుండా మల్టీ నేషనల్ కార్ బ్రాండ్లకు సంబంధించిన కార్లు కూడా అందుబాటులో ఉండడమే కాకుండా అత్యంత చీకు ధరల్లో లభిస్తున్నాయి.

ఈ రోహిణి సెక్టార్ 11 ఉన్న షాపుల్లో ఎక్కడ కార్లను కొనుగోలు చేసిన ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా కేవలం మీరు రూ. 20వేల నుంచి రూ.30 వేల వరకు డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు.. కారు మీ వెంట తీసుకెళ్లొచ్చు. అంతేకాకుండా కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే 100 శాతం లోన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా సర్వీస్ రికార్డు ఉన్న అద్భుతమైన కార్లను విక్రయిస్తున్నట్లు అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా నవరాత్రి సీజన్లలో ఇక్కడ కార్లు కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల బంపర్ డిస్కౌంట్ ఆఫర్స్ ను కూడా అందిస్తున్నట్లు వారు చెబుతున్నారు.

Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Gold Rate Today: ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా మారిన సీన్.. బంగారం కొనేవారికి చుక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..!!

BBhoomi5h ago
Lakshmapur, Telangana:

Gold Rate Today:  ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల చూపు ఇప్పుడు వైట్ హౌస్ వైపు మళ్లింది. రాబోయే రెండు మూడు వారాల్లోనే యుద్ధాన్ని ముగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లలో పెను మార్పులకు కారణమైంది. ఈ ప్రకటనతో అటు స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తుండగా..  ఇటు బులియన్ మార్కెట్‌లో కూడా కదలికలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా అనిశ్చితిలో ఉన్న బంగారం, వెండి ధరలు ఇప్పుడు తిరిగి పుంజుకుంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పసిడి ధరలు:
ఏప్రిల్ 1వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి 31తో పోలిస్తే.. నేడు ధరల్లో పెరుగుదల కనిపించడం కొనుగోలుదారులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై గ్రాముకు రూ. 197 చొప్పున ధర పెరిగింది.

ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి తెలంగాణ నగరాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప వంటి ఆంధ్రప్రదేశ్ నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల బంగారం: నేడు పది గ్రాముల (తులం) స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,51,480 వద్ద ట్రేడవుతోంది (అంటే గ్రాముకు రూ. 15,148).

22 క్యారెట్ల బంగారం: ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 13,885 గా ఉంది.

Also Read: Gold Selling: కేంద్ర బ్యాంకుల సంచలన నిర్ణయం.. మార్కెట్లోకి భారీగా బంగారం.. తులం ధర రూ. లక్ష దిగువకు..?   

వెండి ధరల జోరు:
కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర రూ. 2,55,000 మార్కు వద్ద స్థిరంగా ఉంది. అంటే ఒక గ్రాము వెండి కొనాలంటే వినియోగదారులు రూ. 255 వెచ్చించాల్సి ఉంటుంది.

ధరల పెరుగుదలకు కారణాలేంటి?
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సడలుతాయన్న ఆశలతో ఇన్వెస్టర్లు మళ్ళీ విలువైన లోహాలపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. యుద్ధం ఆగిపోతే ఆర్థిక వ్యవస్థలు స్థిరపడతాయని, తద్వారా డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా డాలర్ విలువలో వచ్చే మార్పులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

Also Read:  Bank Auto Sweep Facility: బ్యాంకు ఖాతాదారులకు బంపర్ ఆఫర్! ఆటో స్వీప్ సౌకర్యంతో మీ సేవింగ్స్ అకౌంట్‌పై భారీ వడ్డీ.. ఎలాగో తెలుసా?

కొనుగోలుదారులకు సూచన:
పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ధరలు పెరగడం సామాన్యులకు ఇబ్బందికరమే అని చెప్పాలి. అయితే, మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు ధరల్లో ఇలాంటి ఒడిదుడుకులు సహజం. కాబట్టి, బంగారం కొనాలనుకునే వారు ప్రతిరోజూ ధరలను గమనిస్తూ, తక్కువగా ఉన్న సమయంలో కొనుగోలు చేయడం ఉత్తమం. షాపింగ్‌కు వెళ్లే ముందు మీ నగరంలోని లేటెస్ట్ రేట్లను మరోసారి సరిచూసుకోవడం మర్చిపోవద్దు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Stock Market Today: ట్రంప్ శాంతి మంత్రం.. ఒక ప్రకటనతో దుమ్మురేపుతున్న స్టాక్ మార్కెట్లు..!!

BBhoomi5h ago
Lakshmapur, Telangana:

Stock Market Today: ఏప్రిల్ నెల ట్రేడింగ్ భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక తీపి గుర్తుగా నిలిచిపోయేలా కనిపిస్తోంది. గత కొంతకాలంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెట్టగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన మార్కెట్ల రూపురేఖలను మార్చేసింది. ఇరాన్‌తో యుద్ధాన్ని సాగదీయడం తనకు ఇష్టం లేదని, రాబోయే రెండు మూడు వారాల్లోనే దీనికి ముగింపు పలకనున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి.

బుల్ రన్: పాయింట్ల వర్షం
బుధవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్ల జాతర మొదలుపెట్టారు. ఉదయం 9.50 గంటల సమయానికే బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1942 పాయింట్ల భారీ లాభంతో అగ్రభాగాన నిలిచింది. అటు నిఫ్టీ కూడా 590 పాయింట్లకు పైగా లాభపడి ఇన్వెస్టర్ల సంపదను అమాంతం పెంచేసింది. కేవలం లార్జ్ క్యాప్ కంపెనీలే కాకుండా, మిడ్ క్యాప్ (1773 పాయింట్లు), బ్యాంక్ నిఫ్టీ (1360 పాయింట్లు) కూడా తమ సత్తా చాటాయి.

ముడి చమురు ధరల తగ్గుదల - భారత్‌కు వరం
భారత మార్కెట్ల రాలీకి ప్రధాన కారణం ముడి చమురు ధరలు తగ్గడం. యుద్ధం ముగిసే సంకేతాలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 105 డాలర్లకు పడిపోయింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి, ధరల తగ్గుదల దేశ ఆర్థిక వ్యవస్థకు, రూపాయి విలువకు పెద్ద ఊరటనిస్తుంది. దీని ప్రభావంతోనే ఆసియా మార్కెట్లు కూడా దాదాపు 3.7% మేర లాభపడ్డాయి.

Also Read: Gold Selling: కేంద్ర బ్యాంకుల సంచలన నిర్ణయం.. మార్కెట్లోకి భారీగా బంగారం.. తులం ధర రూ. లక్ష దిగువకు..?   

బ్యాంకింగ్ రంగంలో అద్భుత కోలుకోలు
గత మార్చి నెలలో బ్యాంక్ నిఫ్టీ దాదాపు 17% మేర పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. అయితే, ఏప్రిల్ ప్రారంభంలోనే పరిస్థితి తారుమారైంది. సరైన కారణం లేకుండానే పడిపోయిన నాణ్యమైన ప్రైవేట్ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ ఒడిదుడుకులను సూచించే VIX (Volatility Index) 10% తగ్గడం అనేది మార్కెట్లో స్థిరత్వం ఏర్పడుతోందన్న సానుకూల సంకేతాన్ని ఇస్తోంది.

నిపుణుల విశ్లేషణ - టెక్నికల్ వ్యూ
ప్రస్తుత బుల్ రన్ ఉత్సాహాన్ని ఇస్తున్నప్పటికీ, టెక్నికల్ అంశాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 24,000 మార్కు పైన స్థిరంగా ముగిస్తేనే ఈ బుల్లిష్ ట్రెండ్ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు చక్కబడుతున్న వేళ, వ్యాల్యూ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని మార్కెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.ఏప్రిల్ మొదటి రోజున భారత మార్కెట్లు చూపిన జోరు ఇన్వెస్టర్లలో కొత్త ఆశలను చిగురింపజేసింది. యుద్ధ భయాలు వీడి శాంతి చర్చలు ఫలిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ మరిన్ని రికార్డులను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:  Bank Auto Sweep Facility: బ్యాంకు ఖాతాదారులకు బంపర్ ఆఫర్! ఆటో స్వీప్ సౌకర్యంతో మీ సేవింగ్స్ అకౌంట్‌పై భారీ వడ్డీ.. ఎలాగో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Tank Bund Shiva: ప్రాణాలు కాపాడే ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం

Hyderabad, Telangana:

Tank Bund Shiva Family: నగరానికే తలమానికంగా నిలిచే ట్యాంక్‌బండ్‌పై నిత్యం ప్రజల ప్రాణాలు కాపాడే వ్యక్తి.. యముడితో పోరాడి ప్రజల ప్రాణాలకు పునర్జన్మనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ట్యాంక్‌బండ్‌ శివకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచింది. ట్యాంక్‌బండ్‌ శివను గుర్తించి రూ.5 లక్షల ఆర్థిక సహాయంతోపాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ఈ సహాయంతో స్వచ్ఛందంగా ప్రజా సేవ చేస్తున్న ట్యాంక్‌బండ్‌ శివ కష్టాలు కొంత గట్టెక్కినట్టే.

Also Read: Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌!

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న ట్యాంక్‌బండ్‌ శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయంతో పాటు ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన నియామకపత్రాన్ని ఆ కుటుంబానికి సీఎం అందజేశారు. ప్రమాదవశాత్తు, లేదా ఇతరత్రా ఘటనల్లో హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌ (ట్యాంక్‌బండ్)లో పడడంతోపాటు జీవితంపై విరక్తితో ప్రాణాలు తీసుకుంటున్న వారి ఎంతోమంది ప్రాణాలను శివ కాపాడడాన్ని అభినందించారు. అయితే కుటుంబ పోషణ భారమై శివ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియడంతో ముఖ్యమంత్రి స్పందించి వెంటనే తన వద్దకు పిలుపించుకున్నారు.

Also Read: Heat Waves: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ అలర్ట్‌.. రాబోయే రోజుల్లో తీవ్ర వడగాలులు

ట్యాంక్‌బండ్‌ శివకు అవసరమైన సహాయం అందించాలని కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో స్పందించిన అధికారులు చర్యలు తీసుకుని శివ కుమారుడికి హోంగార్డు ఉద్యోగ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా శివ కుటుంబం ముఖ్యమంత్రిని కలిశారు. ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్‌పూల్‌ నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా శివ కోరడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తమను గుర్తించి ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా సాయం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ట్యాంక్‌బండ్‌ శివ కుటుంబ సభ్యులు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

PBKS vs GT: గుజరాత్‌పై పంజాబ్‌ పంజా.. బ్యాట్‌తో ప్రత్యర్థుల్లో కల్లోలం రేపిన కనోల్లీ

New Chandigarh, Punjab:

Cooper Connolly Performance: ఐపీఎల్‌ 2026లో అసలైన మజా గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ మ్యాచ్‌లో లభించింది. ఉత్కంఠ రేపే మ్యాచ్‌లో చివరకు పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించగా.. గుజరాత్‌ టైటాన్స్‌ తృటిలో విజయ అవకాశాలను దూరం చేసుకుంది. కూపర్‌ కనోల్లీ కుమ్మేయడంతో పంజాబ్‌కు విజయం వరించింది. ఐపీఎల్‌ 2026 నాలుగో మ్యాచ్‌లో పంజాబ్‌, గుజరాత్‌ హోరాహోరీగా తలపడగా.. ప్రేక్షకులకు చక్కటి వినోదం లభించింది. గుజరాత్‌పై పంజాబ్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Also Read: Liquor Income: లిక్కర్‌తో తెలంగాణ ఖజానా గలగల.. ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతంటే?

న్యూ చండీగడ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేయగా.. ఛేదనకు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 19.1 ఓవర్‌లో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. బ్యాటర్లందరూ ఔటవుతున్న వేళ గ్రౌండ్‌లో పాతుకుపోయిన కుర్రాడు కూపర్‌ కనోల్లీ బ్యాట్‌తో కుమ్మేశాడు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. చివరి వరకు గుజరాత్ పోరాడినా తొలి మ్యాచ్ లో ఓటమి తప్పలేదు.

Also Read: RTC Free Bus: తెలంగాణ ఫ్రీ బస్సులో మహిళలు 300 కోట్ల సార్లు తిరిగారు: డిప్యూటీ సీఎం

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ 6 వికెట్ల నష్టానికి 162 చేసి నామమాత్ర లక్ష్యాన్ని ప్రత్యర్థికి విధించింది. షారూక్‌ ఖాన్‌ (4), సాయి సుదర్శన్‌ (13), వాషింగ్టన్‌ సుందర్‌ (18) తక్కువ స్కోర్‌కు పరిమితమవగా.. కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌, జోస్‌ బట్లర్‌ పరవాలేదనిపించారు. తొలి మ్యాచ్‌లో శుభమన్‌ గిల్‌ సత్తా చాటుతాడనుకుంటే 27 బంతుల్లో 38 పరుగులకు పరిమితమయ్యాడు. వాటిలో 6 ఫోర్లు ఉండగా.. ఒక్క సిక్సర్‌ కూడా బాదలేదు. జోస్‌ బట్లర్‌ 33 బంతుల్లో 38 పరుగులు చేసి రాణించగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ 25 పరుగులతో పర్వాలేదనిపించాడు. రాహుల్‌ తెవాటియా చివరలో 11 పరుగులతో మెరిశాడు. పంజాబ్‌ బౌలర్లో విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ మూడు వికెట్లు తీసి అద్భుతం చేయగా.. యుజువేంద్ర చాహల్‌ 2 వికెట్లు, జాన్సన్‌ ఒక వికెట్‌ తీశాడు.

Also Read: Sister Videos: చెల్లెలిపై సొంత అన్న దారుణం.. భయ్యా అని పిలిస్తే అశ్లీల వీడియో చిత్రీకరణ

ఛేదనకు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ విజయం కోసం తీవ్రంగా పోరాడింది. మ్యాచ్‌ ఫలితం అటు ఇటు ఉన్న సమయంలో బ్యాటర్లు గొప్పగా పుంజుకుని ఆడడంతో తొలి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నారు. ఛేదనతోపాటు మ్యాచ్‌లో చెప్పుకోవాల్సింది కూపర్‌ కనోల్లీ ప్రదర్శన గురించే. వన్‌ డౌన్‌ దిగిన కూపర్‌ కనోల్లీ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. మొదట దూకుడుగా ఆడిన అతడు తర్వాత వికెట్లు పడుతున్న సమయంలో అత్యంత జాగ్రత్తగా ఆడి మెచ్యురిటీ కనబర్చాడు. సమయం దొరికినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లు బాదుతూనే సింగిల్స్‌, డబుల్స్‌ కూడా తీశాడు. ఫలితంగా 44 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ ఆర్య 7 పరుగులకే ఔటవగా.. ప్రభుసిమ్రాన్‌ సింగ్‌ 37 పరుగులతో రాణించాడు.

టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఈ మ్యాచ్‌లో 18 పరుగులు మాత్రమే చేశాడు. నేహాల్‌ వదేరా, (3), శశాంక్‌ సింగ్‌ (4), మార్కో జేన్సన్‌ (9) తక్కువ పరుగులు చేయగా.. మార్కస్‌ స్టోయినీస్‌ డకౌట్‌ అయ్యాడు. గుజరాత్‌ బౌలర్లు పంజాబ్‌ బ్యాటర్లను బెంబేలెత్తించారు. వికెట్ల మీద వికెట్లు తీసి ఆత్మస్థైర్యం దెబ్బతీయగా.. కూపర్‌ వికెట్‌ను మాత్రం తీయలేకపోయారు. ప్రసిద్‌ కృష్ణ మూడు వికెట్లతో సత్తా చాటగా.. రబడా, అశోక్‌ శర్మ, రషీద్‌ ఖాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Heat Waves: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ అలర్ట్‌.. రాబోయే రోజుల్లో తీవ్ర వడగాలులు

Nuzendla, Andhra Pradesh:

Heat Waves In AP: వేసవికాలం ఆరంభంలో ఎండలు దంచికొట్టగా.. తర్వాత అకాల వర్షాలతో కొంత ఎండల ప్రభావం తగ్గింది. అయితే మార్చి ముగిసి ఏప్రిల్‌లోకి అడుగుపెడుతుండగా ఎండల ప్రభావం తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. పెద్ద ఎత్తున వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న రోజుల్లో ఎండ వేడిమి పెరుగుతుందని తెలిపింది. అంతేకాకుండా కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.

Also Read: New Rules From April 1st: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..: మీకు లోన్‌ ఉందా? అయితే ఈ శుభవార్త మీకే!

విజయనగరం జిల్లా బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, సీతానగరం, పోలవరం జిల్లా ఎటపాక మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం మొత్తంగా 13 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించారు. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

Also Read: Bengaluru Couple Death: ఇంట్లో భర్త ఆత్మహత్య.. 17వ ఫ్లోర్‌ నుంచి దూకిన భార్య

ఉష్ణోగ్రతలు ఇలా..
మార్చి చివరి రోజు అంటే మంగళవారం నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.9 డిగ్రీలు, అనంతపురం జిల్లా భట్టువానిపల్లిలో 40.5, విజయనగరం జిల్లా గుర్లలో 39.9, పశ్చిమగోదావరి జిల్లా పోడూరులో 39.8, శ్రీకాకుళం జిల్లా గంగువారి సిగడాం 39.6, కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 39.5, చిత్తూరు జిల్లా రాయలపేట 39.2, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 39.1 చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

రేపు వాతావరణం
ఏప్రిల్‌ 1వ తేదీ బుధవారం పోలవరం జిల్లా  చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 8 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఏప్రిల్ నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.

కోస్తాంధ్ర, దానిని ఆనుకుని ఉన్న తెలంగాణపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉందని వెల్లడించింది. ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల కింద, పొలాలు, బహిరంగ ప్రాంతాల్లో ఉండరాదని హెచ్చరించింది. విభిన్న వాతావరణ పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read: Liquor Income:లిక్కర్‌తో తెలంగాణ ఖజానా గలగల.. ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Liquor Income:లిక్కర్‌తో తెలంగాణ ఖజానా గలగల.. ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతంటే?

Baddipadaga, Telangana:

Telangana Liquor Income: ఆర్థిక సంవత్సరం ముగియడంతో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల వివరాలు తెలుస్తున్నాయి. ప్రభుత్వానికి అక్షయ పాత్రగా ఉండే ఎక్సైజ్‌ శాఖకు ఈసారి కూడా పెద్ద ఎత్తున ఆదాయం లభించింది. మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు తగ్గట్టుగానే ఆదాయం రావడంతో ప్రభుత్వ ఖజానా గలగల లాడింది. దాదాపు అర్ధ లక్ష కోట్ల ఆదాయం ఎక్సైజ్‌ శాఖకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Also Read: Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌!

తెలంగాణ ఖజానాకు ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ ద్వారా భారీగా ఆదాయం లభించింది. మద్యం కాసుల వర్షం కురిపించింది. ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయి ఆదాయం లభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనాలను మించి ఆదాయం రావడంతో ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖకు మొత్తం రూ.46 వేల 500 కోట్ల ఆదాయం లభించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Also Read: Sister Videos: చెల్లెలిపై సొంత అన్న దారుణం.. భయ్యా అని పిలిస్తే అశ్లీల వీడియో చిత్రీకరణ

మద్యం అమ్మకాల ద్వారానే కాకుండా మద్యానికి సంబంధించిన ఇతర మార్గాల ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం లభించింది. లైసెన్స్‌లు, వైన్స్‌ అండ్‌ బార్ల దరఖాస్తుల రూపంలో ప్రభుత్వం భారీగా ఆర్జించింది. మద్యం దుకాణాలకు ఆహ్వానించిన దరఖాస్తుల రూపంలోనే సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయం లభించింది. ఇతర లైసెన్స్ ఫీజుల ద్వారా మరో రూ.2,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఏడాది పాటు జరిపిన మద్యం విక్రయాల ద్వారా మిగిలిన రాబడి వచ్చింది.

Also Read: Bengaluru Couple Death: ఇంట్లో భర్త ఆత్మహత్య.. 17వ ఫ్లోర్‌ నుంచి దూకిన భార్య

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు ఉండగా.. బార్ అండ్ రెస్టారెంట్లు 1,129 ఉన్నాయి. ఎక్సైజ్‌ శాఖకు అప్లికేషన్ల ఫీజులు, వార్షిక లైసెన్స్ ఫీజులు, మద్యం విక్రయాలు ఇలా అన్నీ కలిపి ఖజానాకు భారీగా ఆదాయం లభించింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మద్యం విక్రయాలు పెరగడంతోనే రికార్డ్ స్థాయి ఆదాయం లభించిందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్సైజ్‌ శాఖ కాసుల పంట పండించడంతో ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Sister Videos: చెల్లెలిపై సొంత అన్న దారుణం.. భయ్యా అని పిలిస్తే అశ్లీల వీడియో చిత్రీకరణ

Hyderabad, Telangana:

Sister Brother Video: ప్రేమగా భయ్యా అంటూ పిలిచిన చెల్లెలిపైనే వరుసకు అన్నయ్యే అయ్యే వ్యక్తి అత్యంత నీచానికి పాల్పడ్డాడు. ఆడుకుంటూ చిన్నారిని పై అంతస్తుకు తీసుకెళ్లి అశ్లీల వీడియోలు తీస్తూ నీచానికి పాల్పడ్డాడు ఆ ప్రబుద్ధుడు. అసభ్య దృశ్యాలు తీసిన ఆ సోదరుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించిన అతడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Bengaluru Couple Death: ఇంట్లో భర్త ఆత్మహత్య.. 17వ ఫ్లోర్‌ నుంచి దూకిన భార్య

హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతం కుమ్మరివాడికి చెందిన మహమ్మద్ ఫహాద్ అలియాస్ ఆదిల్ (19) డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నిందితుడికి అత్యంత సమీప బంధువు ఐదేళ్ల చిన్నారి ఉంది. చిన్నారి ఆ యువకుడిని ప్రేమగా భయ్యా అని పిలుస్తూ ఉండేది. చిన్నారి ప్రేమను ఆసరాగా చేసుకున్న నిందితుడు తరచూ బాలిక ఇంటికి వెళ్తుండేవాడు. ఎవరూ లేని సమయంలో బాలికను ఇంటి పైకప్పు పైకి తీసుకెళ్లి అసభ్య దృశ్యాలను చిత్రీకరించేవాడు. అయితే ఈ అంశాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా పోలీసులు చేధించారు.

Also Read: New Rules From April 1st: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..: మీకు లోన్‌ ఉందా? అయితే ఈ శుభవార్త మీకే!

పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన దృశ్యాలను నిరోధించే ‘టిప్‌లైన్’ ద్వారా సమాచారం అందడంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చర్యలు చేపట్టింది. ఐదేళ్ల చిన్నారిపై లైంగిక అసభ్య దృశ్యాలను చిత్రీకరించిన ఆదిల్‌ను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో  డైరెక్టర్ శిఖా గోయల్ మంగళవారం ప్రకటించారు. సేకరించిన వీడియో ఆధారాలను సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలించగా.. ఈ నేరం స్థానికంగానే జరిగిందని, బాధితురాలి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదని గుర్తించినట్లు ఆమె వెల్లడించారు.

Also Read: RTC Free Bus: తెలంగాణ ఫ్రీ బస్సులో మహిళలు 300 కోట్ల సార్లు తిరిగారు: డిప్యూటీ సీఎం

నిందితుడి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపామని.. ఆ యువకుడిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 67-బీతో పాటు పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద సీసీపీఎస్‌లో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు శిఖా గోయల్‌ వెల్లడించారు. బాధితురాలికి అవసరమైన సహాయం అందించడంతోపాటు ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వివరించారు. పిల్లలపై జరిగే ఇలాంటి నేరాల్లో దురదృష్టవశాత్తు కుటుంబసభ్యులు లేదా తెలిసిన వారే నిందితులుగా ఉంటున్నారని, ఇది సమాజంలో నమ్మకాన్ని వంచించడమేనని డైరెక్టర్‌ శిఖా గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లలను ఎవరి సంరక్షణలో ఉంచుతున్నామనే విషయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. పిల్లల రక్షణ అనేది అందరి సామూహిక బాధ్యత అని.. అధునాతన సాంకేతికతతో ఇటువంటి నేరాలను అరికట్టడానికి బ్యూరో నిరంతరం కృషి చేస్తోందని  శిఖా గోయల్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

RTC Free Bus: తెలంగాణ ఫ్రీ బస్సులో మహిళలు 300 కోట్ల సార్లు తిరిగారు: డిప్యూటీ సీఎం

Hyderabad, Telangana:

RTC Free Bus Scheme: మహిళలకు అమలు చేస్తున్న ఆర్టీసీ ఉచిత బస్సు పథకం విజయవంతమైందని.. ఈ పథకాన్ని ఉపయోగించి 300 కోట్ల సార్లు మహిళలు ప్రయాణం చేశారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఉచితంగా బస్సు ప్రయాణం చేసిన మహిళలు రూ.10 వేల కోట్ల ఆదాయం ఆదా చేశారని వెల్లడించింది. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉచిత బస్సు పథకం ఎంతో దోహదం చేసిందని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌!

మహాలక్ష్మీ పథకం అభినందన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడగానే రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు  మహా లక్ష్మీ పథకం ప్రారంభించాం. సభలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్టీసీ బస్సులను అసెంబ్లీకి పిలిపించి మహా లక్ష్మీ పథకం ప్రారంభించాం' అని వెల్లడించారు. 'ఆర్టీసీ సంస్థను రక్షించుకోవడానికి అన్ని కార్యక్రమాలు చేస్తూనే మహాలక్ష్మీ పథకం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నెల నెల ఆ సొమ్ములు చెల్లించాలని రవాణా శాఖ మంత్రి కోరడంతో నెల నెల ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో వాటి వివరాలు రాగానే ఆర్థికశాఖ ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తోంది. మహిళలు దాదాపు 300 కోట్ల సార్లు ప్రయాణించి రూ.10 వేల కోట్లు ఆదా చేసుకున్నారు' అని భట్టి విక్రమార్క తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాల ప్రయోజనాలు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పారు.

Also Read: Bengaluru Couple Death: ఇంట్లో భర్త ఆత్మహత్య.. 17వ ఫ్లోర్‌ నుంచి దూకిన భార్య

భవిష్యత్‌లో ప్రయాణం చేసిన నగదు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుందని.. వడ్డీలేని రుణాలు సంవత్సరానికి రూ.20 వేల కోట్లు బ్యాంకు లింకేజీతో ఇప్పిస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. సంవత్సరానికి లక్ష కోట్లు మహిళలకు ఇస్తామని తెలిపారు. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే అని ఇందిరమ్మ ప్రభుత్వం చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు. 'ఇప్పటికే రూ.57 వేల కోట్లు బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలకు అందించాం. రాబోయే 3 సంవత్సరాల్లో రూ.లక్ష కోట్లు మహిళలకు దాటిస్తాం. అవి లక్షా 50 వేల కోట్లు దాటుతాం' అని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Also Read: RR vs CSK Highlights: తొలి మ్యాచ్‌లోనే చెన్నై చెత్త ప్రదర్శన.. విజయంతో రాజస్థాన్‌ శుభారంభం

'మహిళలకు రూ.లక్ష కోట్లకి చెల్లించాల్సిన వడ్డీ చెల్లిస్తున్నాం. మేము ఇప్పటికీ రూ.3,800 కోట్లలో రూ.వేయి కోట్లు చెల్లించడం బడ్జెట్‌లో రూ.2,800 కోట్లు కేటాయించాం. వచ్చే 5 సంవత్సరాల్లో రూ.10 వేల కోట్లు  మహిళలకు వడ్డీ చెల్లిస్తాం' అని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళల ద్వారా కొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున మహిళలకు స్వయం సహాయక గ్రూపులలో చేర్పిస్తున్నాం.. వారికి వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం' అని వివరించారు. స్వయం సహాయక మహిళలకు సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి నిధులు ఇచ్చి వారిని వ్యాపారస్తులను చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. మహిళలందరికీ వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. 'మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశారు.. సోలార్ పవర్ ప్లాంట్, పెట్రోల్ బంకులు పెట్టిస్తున్నాం. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబం సమాజం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. మహిళలను కోటీశ్వరులను చేయడానికి ఎన్ని అవిరోధాలు వచ్చిన సాధిస్తూ ముందుకు పోతున్నాం' అని భట్టి విక్రమార్క తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top