icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
SShankerreddyFollow17 Jul 2024, 11:38 am

ఘనంగా గిరిజన బంజరాలు ప్రతి ఏటా నిర్వహించే సాంప్రదాయ సితాలపండుగ తీజ్ ఉత్సవాలు

Telangana:

కరీంనగర్‌లోని కొత్తపల్లి మండలంలో గిరిజన సంచార జాతులు ప్రతి ఏటా శీతాకాల పండుగను జరుపుకుంటారు. 9 రోజుల పాటు జరిగే ఈ తీజ్ పండుగలో బాలికలు భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. పెద్దల సమక్షంలో కుల దైవం జగదాంబదేవి, సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో లంబాడాలు తమ నాయక్ ఇంట్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. బాలికలు సంప్రదాయ పాటలు పాడుతూ నేరేడు చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రమేష్ నాయక్,శ్రావణ్ నాయక్ విట్టల్ మహారాజ్ భాస్కర్ మహారాజ్ రంగనాయక సుధాకర్ నాయక్ మహిళలు గ్రామస్తులు తదితరులుు పాల్గొన్నారు.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Raksha Bandhan Gift Ideas: రక్షా బంధన్ 2026.. తోబుట్టువులను ఆశ్చర్యపరిచే 10 అద్భుతమైన గిఫ్ట్ ఐడియాస్!

Hyderabad, Telangana:

Raksha Bandhan Gift Ideas 2026: తోబుట్టువుల మధ్య ఉండే పవిత్రమైన బంధాన్ని, అమితమైన అనురాగాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు వచ్చే ప్రత్యేకమైన పండుగ రక్షా బంధన్. ఈ రక్షా బంధన్ 2026 పండుగకు మీ తోబుట్టువుల కోసం బహుమతులు కొనడం ఆలస్యమైందా? చింతించకండి! చివరి నిమిషంలో కూడా మీ ప్రేమను మరియు ప్రయత్నాన్ని ప్రతిబింబించేలా, వారి హృదయాలను హత్తుకునే 10 అద్భుతమైన గిఫ్ట్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి. బహుమతి ఎంత ఖరీదైనది అనేదానికంటే, దాని వెనుక ఉన్న మీ భావమే ఇక్కడ ముఖ్యం.

1) వ్యక్తిగతీకరించిన ఫోటో ఫ్రేమ్: మీ చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు లేదా ఈ మధ్యకాలంలో దిగిన హృదయానికి దగ్గరైన ఏదైనా అందమైన ఫోటోను ఫ్రేమ్ చేసి బహుమతిగా ఇవ్వండి. ఇది మాటలు లేకుండానే మీ పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చి మీ బంధం ఎంత బలమైనదో తెలియజేస్తుంది.

2) చేతితో రాసిన లేఖ లేదా జ్ఞాపకాల స్క్రాప్‌బుక్: హృదయపూర్వకంగా చేతితో రాసిన లేఖకు ఉన్న విలువ మరే బహుమతికీ ఉండదు. మీ మధ్య ఉన్న సరదా ముచ్చట్లు, పాత జ్ఞాపకాలు, మీ తోబుట్టువుపై మీకున్న కృతజ్ఞతను ఈ లేఖ ద్వారా వ్యక్తపరచండి. ఇది చాలా సులువైనది కానీ అత్యంత అర్థవంతమైనది.

3) గిఫ్ట్ కార్డ్‌లు: వారికి ఏమి కొనాలో తెలియక సతమతమవుతుంటే, వారికి ఇష్టమైన బ్రాండ్ యొక్క గిఫ్ట్ కార్డ్ ఇవ్వడం బెస్ట్. దీనివల్ల వారు తమకు నచ్చిన వస్తువును స్వయంగా ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది.

4) చాక్లెట్లు లేదా స్వీట్ హ్యాంపర్‌లు: చివరి నిమిషంలో ఎంపిక చేసుకోగలిగే మధురమైన గిఫ్ట్ ఇది. ఒక నోరూరించే చాక్లెట్ల పెట్టె లేదా పండుగ స్వీట్ హ్యాంపర్ మీ తోబుట్టువు ముఖంలో తక్షణమే చిరునవ్వును రప్పిస్తుంది.

5) చర్మ సంరక్షణ లేదా గ్రూమింగ్ కిట్: ఇది ఒక ఆచరణాత్మకమైన, ఉపయోగకరమైన బహుమతి. ఒక మంచి స్కిన్ కేర్ లేదా గ్రూమింగ్ కిట్ అందించడం ద్వారా, మీరు వారి రోజువారీ సంరక్షణపై ఎంతగా శ్రద్ధ చూపుతున్నారో తెలియజేసినట్లవుతుంది.

6) ప్రత్యేకంగా తయారు చేయించిన మగ్ లేదా కుషన్: ఒక కప్పు లేదా కుషన్ (దిండు)పై మీ తోబుట్టువుకు నచ్చేలా అందమైన సందేశాన్ని లేదా చిత్రాన్ని ముద్రించి (కస్టమైజ్ చేసి) ఇవ్వండి. ఇది చిన్న ప్రయత్నమే అయినా వారికి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది.

7) పుస్తకాలు లేదా జర్నల్స్: మీ తోబుట్టువుకు పుస్తకాలు చదవడం లేదా రాయడం అలవాటు ఉంటే, ఒక మంచి పుస్తకం లేదా అందమైన జర్నల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం చివరి నిమిషంలో చేయగలిగే చక్కటి ఎంపిక.

8) యాక్సెసరీలు (వాచ్, బ్రాస్‌లెట్, చెవిపోగులు): స్టైలిష్ వాచ్, అందమైన బ్రాస్‌లెట్ లేదా చెవిపోగుల జత వంటి చిన్న వస్తువులు కూడా వారి లుక్‌ను తక్షణమే మెరుగుపరుస్తాయి. తక్కువ శ్రమతో గొప్ప అనుభూతిని ఇచ్చే బహుమతి ఇది.

9) పెర్ఫ్యూమ్: ఒక మంచి సువాసన ఇచ్చే పెర్ఫ్యూమ్ ఎప్పటికీ ట్రెండీగానే ఉంటుంది. ఇది చాలా క్లాసిక్ బహుమతిగా నిలవడమే కాకుండా, చివరి నిమిషంలో కూడా చాలా సులభంగా లభిస్తుంది.

10) అనుభూతినిచ్చే బహుమతి (సినిమా, విందు లేదా విహారయాత్ర): కొన్నిసార్లు చేతికి ఇచ్చే వస్తువుల కన్నా మనసుకు ఇచ్చే అనుభూతులు మిన్న. వారితో కలిసి ఒక సినిమా చూడటం, హోటల్‌కు వెళ్లి విందు ఆస్వాదించడం లేదా ఒక చిన్న విహారయాత్రను ప్లాన్ చేయడం ద్వారా నాణ్యమైన సమయం గడపవచ్చు. ఎలాంటి భౌతిక బహుమతికైనా ఇది ఏమాత్రం తీసిపోదు.
 
అంతిమంగా రక్షా బంధన్ అంటే కేవలం బహుమతులు మార్చుకోవడం మాత్రమే కాదు. అది జీవితాంతం నిలిచిపోయే ప్రేమ, ఆప్యాయతతో కూడిన తీపి జ్ఞాపకాల కలయిక. చివరి నిమిషంలో ఇచ్చే ఏ చిన్న బహుమతి అయినా మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు అది ఎంతో ప్రత్యేకంగా మారుతుంది. కాబట్టి, సమయం లేదని ఒత్తిడికి గురికాకుండా మీ తోబుట్టువులపై మీకున్న గౌరవాన్ని, ప్రేమాభిమానాలను వ్యక్తపరచండి.

Also Read: మీ సోదరులకు రాఖీ ఈ సమయంలో కడితే శ్రేష్టం అంటున్నారు పండితులు..!!

Also Read: తెలుగులో రాఖీ విషెష్‌, మధురమైన కొటేషన్లు, ఫోటోలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Tomorrow Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు అన్నీ పాఠశాలలకు సెలవు.. ఉద్యోగులకు కూడా

Wadgaon, Maharashtra:

School Holiday For Tomorrow: విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు బ్యాంకులకు భారీ శుభవార్త. రేపు అంటే శుక్రవారం అందరికీ సెలవు లభిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఈ సెలవు అన్నీ ప్రాంతాల్లో లేవు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ సెలవు ఉంది. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్ల మధ్య ఆత్మీయత పంచే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సెలవుల ప్రకటించారు. ఒక రోజు సెలవు పెడితే చాలు మొత్తం మూడు రోజుల సెలవులు లభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హిందూవులకు అత్యంత ప్రధానమైన పండుగ రాఖీ. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని ప్రజలు రాఖీ పండుగగా చేసుకుంటారు. ఈ పండుగను తోబుట్టువులు ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటుండగా.. శ్రావణ పౌర్ణమి కొన్ని రోజుల్లో అత్యంత పర్వదినంగా భావిస్తారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అధికారికంగా సెలవు ఉంది. అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా చేసుకునే రక్షా బంధన్ పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంది. అయితే తెలంగాణ, ఏపీలోని బ్యాంకులకు మాత్రం సెలవు లేదు. కానీ ప్రభుత్వ కార్యాలయాలకు కొన్ని ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాలు.. ఆయా విభాగాల్లో రేపు సెలవు లేదు. 

భారతదేశంలోని కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా అన్నీ విద్యాలయాలకు సెలవు ఉంది. ఈ రాష్ట్రాలలో రక్షా బంధన్‌ను అత్యంత వైభవంగా చేసుకుంటుండడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం సెలవు ఉంటుంది.

సెలవులు ఉన్న రాష్ట్రాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక,లలో రక్షా బంధన్‌కు సంబంధించి ఎటువంటి సాధారణ ప్రభుత్వ పాఠశాల సెలవు ఉండదు.

ఇక్కడ సెలవు లేదు
రాఖీ పండుగను దేశంలోని పలు రాష్ట్రాల్లో చేసుకోరు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో రాఖీ పండుగ ఉండదు. దీంతో ఆ రాష్ట్రాల్లో పాఠశాలలు యథావిధిగా నడుస్తాయి. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో సెలవు లేదు. 

ప్రైవేటు విద్యాలయాలు
రాఖీ పండుగ సందర్భంగా ప్రైవేటు విద్యాలయాలకు కూడా సెలవు ఉంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు తమ సొంత సెలవుల క్యాలెండర్‌లో కూడా సెలవు ఉంది. అయితే కొన్ని పాఠశాలలు ఆప్షనల్‌ హలీడేగా ప్రకటించాయి.

0
0
Report
Advertisement

Harish Rao Arrest: ఉద్రిక్తంగా మారిన టీఎన్జీవో ధర్నా.. బీఆర్ఎస్ హరీష్ రావు అరెస్ట్..హనుమకొండలో హైటెన్షన్!

Hyderabad, Telangana:Harish Rao Arrested in Hanamkonda: తెలంగాణలో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు దక్కాల్సిన బెనిఫిట్స్ పై కాంగ్రెస్ సర్కారును ఏకీపారేస్తుంది. ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, డీఏలు, ఇతర అలవెన్సులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంది. దీనిలో భాగంగా హనుమకొండలో హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోల ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
0
0
Report
Advertisement

Pending DAs: దేశ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల 6 పెండింగ్‌ డీఏలు ఒక రికార్డు

Warangal, Telangana:

Dearness Allowance Record: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారంపై ఆందోళన బాట పట్టారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆందోళన చేపట్టగా వారికి బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీవోలు చేపట్టిన ఉద్యోగుల ఆందోళనలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. 'దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే' అని ప్రకటించారు.

'జీతాల్లో డబ్బులు కట్ చేస్తూ.. ఆసుపత్రులతో అగ్రిమెంట్ లేకుండా ఈహెచ్ఎస్ మోసం. మీరు నడుపుతున్నది సర్కారా? లేక సర్కస్సా రేవంత్‌ రెడ్డి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏకంగా 15 శాతం కమీషన్ అడుగుతున్న దౌర్భాగ్యం ఉందని అసహనం వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో ఉద్యోగులకు గౌరవం.. నేడు సచివాలయంలోకి నో ఎంట్రీ ఉందని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డికి శంకరగిరి మాన్యాలు తప్పవని రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

'సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్‌లోకి మారుస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గొప్పగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దగ్గరపడుతున్నా ఇప్పటివరకు సీపీఎస్ రద్దు లేదు, పీఆర్సీకి మోక్షం లేదు. ప్రభుత్వం నుంచి కనీస చలనం లేదు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం కేవలం 1 శాతం కాంట్రిబ్యూషన్‌తో ఈహెచ్ఎస్ ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని 1.5 శాతానికి పెంచింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఇద్దరికీ కట్ చేస్తున్నారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఇంట్లో రిటైర్డ్ తల్లిదండ్రులు ఉంటే వాళ్లకూ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి ఉద్యోగులు మోసపోవడం తప్ప వారికి ఒరిగేదేమీ లేదని చెప్పారు.

'రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నారా? లేక సర్కస్ నడుపుతున్నారా? భారతదేశంలో ఎక్కడైనా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం ఉందా? ఆరు డీఏలను పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం మీదే. ఇది అత్యంత సిగ్గుచేటు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పెండింగ్ డీఏలు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కలిసి దండం పెట్టి అడిగినా ఈ ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే 15 శాతం కమీషన్ లంచంగా అడుగుతున్నారని ఓ బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ప్రభుత్వానికి వెన్నెముక లాంటి ఉద్యోగులను, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే వారిని ఎందుకింత ఇబ్బంది పెడుతున్నారు.. కాంగ్రెస్ పాలనలో అందరి బతుకులు ఆగమయ్యాయి' అని విమర్శించారు.

'తక్షణమే పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలి. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 'జీపీఎఫ్ లోన్ కోసం వెళ్దామంటే కనీసం వినే నాథుడే లేడు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఆగమాగం చేసి, అన్ని వర్గాలనూ రోడ్డు మీదికి తెచ్చాడు' అని విమర్శించారు. 'ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు, జీవో 97 కోసం పాలిటెక్నిక్ విద్యార్థులు, జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని నిరుద్యోగులు రోడ్డెక్కారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. 

'సర్వ శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను వరంగల్‌లో చాయ్ తాగినంత సేపట్లో పరిష్కరిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పటిదాకా వారి సమస్యను పరిష్కరించలేదు. కనీసం సచివాలయంలోకి కూడా అనుమతించడం లేదు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్లేనని రేవంత్ రెడ్డికి హెచ్చరించారు.

0
0
Report

Rakhi Festival: రాఖీ పండుగ వేళ కలకలం.. హైదరాబాద్‌లో స్వీట్‌ షాపులపై అధికారుల దాడులు

Secunderabad, Telangana:

Rakhi Festival: తోబుట్టువుల ఆత్మీయ పండుగ రాఖీ పౌర్ణమి సందర్భంగా మిఠాయిలు కొనేందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఒక్క నిమిషం. నాసిరకం.. గడువు దాటిన మిఠాయిలు, ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారని హైదరాబాద్‌ పోలీసులు చెబుతున్నారు. ఆహార శుద్ధి పాటించకుండా తీవ్ర నిర్లక్ష్యంతో స్వీట్‌ షాపులు నడుపుతున్న వాటిపై పోలీసులు, అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

హైదరాబాద్‌ శివారులోని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చౌదరిగూడ వెంకటాద్రి టౌన్‌షిప్‌లో పోలీసులు దాడులు చేశారు. అక్కడ ఉన్న బాలాజీ పవన్‌ స్వీట్‌ షాపుపై ఉప్పల్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీలు చేపట్టగా అక్కడ అధ్వాన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాలం చెల్లిన ఆహార పదార్థాలు, హానికరమైన సింథటిక్ కలర్స్‌ను వినియోగిస్తూ మిఠాయిలు, ఇతర తినుబండారాలు తయారు చేస్తున్నట్లు అక్కడ గుర్తించారు.

రాజస్థాన్‌కు చెందిన కమల్‌ కుడ్కుడియా (37) ఆ స్వీట్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద నుంచి సింథటిక్‌ ఆరెంజ్‌, లెమన్‌ ఎల్లో ఫుడ్‌ కలర్స్‌, వివిధ ఫ్లేవర్లు, రోజ్‌వాటర్‌, షుగర్‌ సిరప్‌, బాదం పాలు తదితర పదార్థాలతో పాటు సుమారు 30 కిలోల కలాఖండ్‌, 500 గ్రాముల డ్రైఫ్రూట్‌ స్వీట్‌, 2 కిలోల కోవా స్వీట్‌, 12 కిలోల సోన్‌ పప్పడ్‌ను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పదార్థాలు, కమల్‌ కుడ్కుడియాను పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఓటీ పోలీసుల ఫిర్యాదు మేరకు సివిల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ దాడుల నేపథ్యంలో ప్రజలకు ఎస్‌ఓటీ పోలీసులు, అధికారులు కీలక సూచనలు చేశారు. స్వీట్లు కొనే ముందు తయారీ, గడువు తేదీలు, ప్యాకింగ్‌, రంగు, వాసన, రుచి, నాణ్యతను పరిశీలించాలని పోలీసులు సూచించారు. వీలైనంత వరకు నమ్మకమైన దుకాణాల నుంచే స్వీట్లు కొనుగోలు చేయాలని.. లేదా ఇంట్లోనే తయారు చేసుకోవాలని ఎస్‌ఓటీ పోలీసులు తెలిపారు. ఆహార నాణ్యత, పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీటు దుకాణాల్లో కొనుగోలు చేయరాదని పోలీసులు సూచిస్తున్నారు. 

ఇటీవల హైదరాబాద్‌లో స్టార్‌ హోటళ్లతోపాటు మార్ట్‌లు, ఇతర రెస్టారెంట్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, ఎస్‌ఓటీ పోలీసులు తనిఖీలు చేస్తుండగా విస్తుపోయే విషయాలు కనిపిస్తున్నాయి. కల్తీ పదార్థాలు తయారుచేయడం.. నాసిరకం సామగ్రితో వంటలు చేయడం.. హానికరమైన పదార్థాలు వినియోగించడంతో పోలీసులు దాడులు చేస్తూ పెద్ద ఎత్తున సీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రాఖీ పండుగ సందర్భంగా స్వీటు షాపులపై దాడులు చేసి తనిఖీలు చేయగా.. అక్కడ అదే పరిస్థితి ఎదురైంది. దీంతో ప్రజలు ఏం కొని తినాలో అని ఆందోళన చెందుతున్నారు. బయట ఆహార పదార్థాలు కొనకుండా ఇంట్లోనే తయారుచేసుకోవాలని పోలీసులు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు.

0
0
Report
Advertisement

Maharashtra Paper Leak: లవర్ బ్రేకప్ చెప్పిందని పేపర్ లీక్ బయటపెట్టిన ప్రియుడు..రిక్రూట్‌మెంట్ రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం!

Badapur, Maharashtra:

Maharashtra Paper Leak Exposed: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వెనుక ఒక ఆసక్తికరమైన ప్రేమ కథా ముగింపు  ఉంది. ఈ ఏడాది మార్చి 22న రాష్ట్రవ్యాప్తంగా ఆరు డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లోని కేంద్రాలలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలోని గ్రూప్-బి డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి MPSC ఆఫ్‌లైన్ స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించింది. అయితే, ప్రియురాలితో విడిపోయిన గౌరవ్ పాటిల్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుతో ఈ లీక్ వ్యవహారం ముంబై క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు ద్వారా బయటపడింది.

గౌరవ్ పాటిల్ తన మాజీ ప్రియురాలి నుండి పరీక్షకు ముందే ప్రశ్నపత్రాన్ని పొందినట్లు ఆరోపించాడు. ఆమె తండ్రి కోచింగ్-క్లాస్ నిర్వాహకుడైన ప్రవీణ్ పాటిల్‌కు రూ.5 లక్షలు చెల్లించి ఈ లీకైన పేపర్‌ను సంపాదించినట్లు దర్యాప్తులో తెలిసింది. ఆ తర్వాత సదరు మహిళా అభ్యర్థి ఆ లీకైన పేపర్‌ను గౌరవ్‌తో పంచుకుంది. అయితే, వీరిద్దరి మధ్య సంబంధం చేదుగా ముగిసిన తర్వాత ప్రతీకారంతో గౌరవ్ MPSCకి ఫిర్యాదు చేశాడు.

ఆ తర్వాత కేసును మరో మలుపు తిప్పుతూ తానూ అబద్ధం చెప్పానని గౌరవ్ ఈమెయిల్ పంపినప్పటికీ, పోలీసులు విచారణను వేగవంతం చేసి అతనితో పాటు కమిషన్ అదనపు కార్యదర్శి అభిజిత్ లెండ్వే, మరో ముగ్గురు అధికారులతో సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.

పోలీసుల దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పరీక్ష తర్వాత సదరు మహిళ కోచింగ్ నిర్వాహకుడికి చేసిన ఫోన్ కాల్‌లో.. లీకైన పేపర్‌లోని దాదాపు 90 ప్రశ్నలలో 78 ప్రశ్నలకు తాను సరిగ్గా సమాధానాలు రాశానని, ఉద్దేశపూర్వకంగానే అనుమానం రాకుండా ఉండేందుకు కొన్ని ప్రశ్నలను వదిలేశానని చెప్పినట్లు ఫోన్ రికార్డుల ద్వారా తెలిసింది. ఇదే సమయంలో, గంగూర్డే అనే మరో అభ్యర్థి సోషల్ మీడియాలో నియామక ప్రక్రియ అపారదర్శకతపై పోస్ట్ చేసిన వీడియోతో ఈ వివాదం మరింత తీవ్రమైంది.

ఈ స్క్రీనింగ్ పరీక్ష ఫలితాలను జూన్ 12న ప్రకటించి, మొదట 506 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. జూలై 1 నుండి 22 మధ్య 488 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించి తాత్కాలిక మెరిట్ జాబితాను కూడా సిద్ధం చేశారు. కానీ ఈ తీవ్ర వివాదం, దర్యాప్తు నేపథ్యంలో MPSC ఈ మొత్తం నియామక ప్రక్రియను రద్దు చేసింది. త్వరలోనే మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, అలాగే ఎలాంటి పరీక్ష రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని కమిషన్ స్పష్టం చేసింది. 

Also Read: రాహుల్ గాంధీకి లైవ్‌లో ముద్దుపెట్టిన యువతి..సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీజేపీ రచ్చ!

Also Read: మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త.. తెలంగాణలో 121 కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు సిద్ధం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

India Vs Sri Lanka: శ్రీలంక జట్టు అద్భుత పోరాటం..భారత్‌తో రెండో టెస్టు డ్రా..సిరీస్ టీమ్ఇండియా కైవసం!

Colombo, Western Province:

India Vs Sri Lanka 2nd Test: కొలంబో వేదికగా టీమ్ఇండియాతో రెండో టెస్ట్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు అసాధారణ పోరాటపటిమను ప్రదర్శించింది. ఐదో రోజు ఆట ముగియడానికి మరో 18 ఓవర్ల సమయం ఉండగానే, మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్లూ డ్రాకు అంగీకరించాయి. ఈ సమయంలో శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసి, భారత్‌పై 216 పరుగుల లీడ్‌ సాధించింది. దీంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటిస్తూ ఆటగాళ్లు కరచాలనం చేసుకున్నారు. తొలి టెస్ట్ గెలిచిన భారత్, ఈ సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 503/9 (డిక్లేర్డ్) స్కోరు చేయగా, శ్రీలంక 290 పరుగులకు ఆలౌటైంది.

సోనాల్ దినుష సరికొత్త చరిత్ర
ఈ మ్యాచ్‌లో శ్రీలంక యువ బ్యాటర్ సోనాల్ దినుష వీరోచిత బ్యాటింగ్‌తో జట్టును ఓటమి నుంచి రక్షించాడు. తొలి ఇన్నింగ్స్‌లో (103) సెంచరీ సాధించిన దినుష, రెండో ఇన్నింగ్స్‌లోనూ అజేయ సెంచరీతో (133*) చెలరేగాడు. ఈ ఘనతతో భారత్‌పై ఒకే టెస్టులో రెండు సెంచరీలు సాధించిన మూడో శ్రీలంక బ్యాటర్‌గా (గతంలో దులీప్ మెండిస్ - 1982, అరవింద డిసిల్వా - 1997) దినుష నిలిచాడు. శ్రీలంక తరఫున ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 8వ బ్యాటర్‌గా గుర్తింపు పొందాడు. దినుష ఆటతీరును బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కొనియాడుతూ, అతడు అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో "మరో సచిన్"లా కనిపిస్తున్నాడంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

పట్టుదల చూపిన లోయర్ ఆర్డర్
ఐదో రోజు ఆటలో శ్రీలంక ఓవర్‌నైట్ బ్యాటర్లు సోనాల్ దినుష, కేశర నువాంత (46) చాలా నిలకడగా ఆడి ఏడో వికెట్‌కు 112 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత లంచ్ అనంతరం నువాంతను మానవ్ సుతార్ అవుట్ చేసి భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ప్రభాత్ జయసూర్య (2 పరుగులు, 28 బంతులు), లాహిరు కృష్ణ (12 పరుగులు, 90 బంతులు) అద్భుతమైన డిఫెన్స్‌తో భారత బౌలర్లను విసిగించారు. వీరిద్దరినీ రవీంద్ర జడేజా అవుట్ చేశాడు.

బౌలింగ్ చేసిన కెప్టెన్ గిల్
రెండో ఇన్నింగ్స్‌లో చివరి గంటల్లో శ్రీలంక 9వ వికెట్ కోల్పోయి, 200 పైగా పరుగుల ఆధిక్యం సాధించడంతో డ్రా ఖాయమైంది. ఈ క్రమంలో భారత ప్రధాన బౌలర్లకు విశ్రాంతినిస్తూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (151వ ఓవర్)తో పాటు యశస్వి జైస్వాల్ కూడా పార్ట్‌టైమ్ బౌలర్లుగా బంతులు విసిరారు. అంతకుముందు జడేజా కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడగా, మిగిలిన ఓవర్ బంతులను ప్రసిద్ధ్ కృష్ణ పూర్తి చేశాడు.

Also Read: ఆర్సీబీ టీమ్‌లోకి రోహిత్ శర్మ? రెడ్ జెర్సీలో హిట్‌మ్యాన్ ఫొటో వైరల్..ఏం జరుగుతోంది?

Also Read; టీమ్ఇండియాలోకి సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీ? బీసీసీఐ నుంచి కీలక సమాచారం లీక్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

మైనింగ్ AD ఇళ్లపై ACB పంజా.. 8 చోట్ల ఏకకాలంలో మెరుపు దాడులు!

Hyderabad, Telangana:

Telangana Acb Raids: అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ అవినీతి నిరోధక శాఖ మరో భారీ ఆపరేషన్ చేపట్టింది.. ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెడుతున్నారని పక్కా సమాచారంతో భూగర్భ జల వనరుల శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజు నివాసంపై ఏసీబీ అధికారులు గురువారం ఉదయం మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులకు ఆశ్చర్యం కలిగించే ఆస్తులు బయటపడ్డాయి. అవేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మైనింగ్ ఏడిగా జయరాజు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని భారీగా అక్రమాస్తులు సంపాదిస్తున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో బోడుప్పల్ ఈస్ట్ హనుమాన్ నగర్ లో ఉన్న ఆయన ప్రధాన నివాసంతో పాటు బంధువులు బినామీల ఇల్లు, కార్యాలయాలు ఇలా మొత్తం 8 ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఏసీబీ ప్రత్యేకమైన దాడులను నిర్వహించింది.

ఈ భారీ తనిఖీలను హైదరాబాద్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సాయి మనోహర్ తో పాటు వరంగల్ ఏసీబీ డిఎస్పి సాంబయ్య తమ పర్యవక్షణలో కొనసాగిస్తున్నారు. ఇంటి అణువణువు గాలిస్తున్న అధికారులు.. బీరువాతో పాటు లాకర్లు తెరిచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. జయరాజు ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాంక్ అకౌంట్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు..

సోదాలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నప్పటికీ.. అధికారుల కళ్ళు చెదిరి ఆస్తుల చిట్టా బయటపడినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు ఇప్పటివరకు గుర్తించిన వివరాల ప్రకారం.. తన ఇంట్లో ఉన్న రెండు ఖరీదైన కార్లతో పాటు దాదాపు 1,50,000 వరకు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఇక జనగామ జిల్లాలో ఉన్న ఐదు ఎకరాల విలువైన వ్యవసాయ భూమికి సంబంధించిన దస్త్రాలతో పాటు భారీ మొత్తంలో చేసిన ఫిక్స్ డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్ల రసీదులను వారు సొంతం చేసుకున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆస్తులకు సంబంధించిన రెండు కీలకమైన పాస్ బుక్కులను కూడా సొంతం చేసుకున్నారట..

ప్రస్తుతం దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయాల్సి ఉందని.. బంధువుల ఇళ్లలో తనిఖీలు పూర్తయితే భారీ ఎత్తున నగదుతో పాటు బంగారం మరెన్నో బినామీ ఆస్తు పత్రాలు బయటకు వచ్చే అవకాశాలు ఉందని సమాచారం. సోదాలు పూర్తిగా ముగిసిన అనంతరం.. స్వాధీనం చేసుకున్న అక్రమాస్తుల మొత్తం విలువను, ఇతర కీలక సమాచారాన్ని ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top