Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Karimnagar505001

ఘనంగా గిరిజన బంజరాలు ప్రతి ఏటా నిర్వహించే సాంప్రదాయ సితాలపండుగ తీజ్ ఉత్సవాలు

Jul 17, 2024 11:38:27
Telangana

కరీంనగర్‌లోని కొత్తపల్లి మండలంలో గిరిజన సంచార జాతులు ప్రతి ఏటా శీతాకాల పండుగను జరుపుకుంటారు. 9 రోజుల పాటు జరిగే ఈ తీజ్ పండుగలో బాలికలు భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. పెద్దల సమక్షంలో కుల దైవం జగదాంబదేవి, సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో లంబాడాలు తమ నాయక్ ఇంట్లో ఉత్సవాలను ప్రారంభిస్తారు. బాలికలు సంప్రదాయ పాటలు పాడుతూ నేరేడు చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రమేష్ నాయక్,శ్రావణ్ నాయక్ విట్టల్ మహారాజ్ భాస్కర్ మహారాజ్ రంగనాయక సుధాకర్ నాయక్ మహిళలు గ్రామస్తులు తదితరులుు పాల్గొన్నారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Mar 06, 2026 09:31:06
Bengaluru, Karnataka:

Social Media Ban For Under 16: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో 2026–27 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, సాంకేతికత, సామాజిక భద్రతపై పలు కీలక ప్రకటనలు చేశారు. మొబైల్ ఫోన్ల మితిమీరిన వినియోగం వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడానికి ప్రభుత్వం ఒక సాహసోపేత నిర్ణయం తీసుకోబోతోంది.

కర్ణాటక రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. డిజిటల్ వ్యసనం నుండి చిన్నారులను రక్షించడం, వారి విద్యాభ్యాసంపై దృష్టి మరలకుండా చూడటం వంటి  వాటి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏఐ (AI) హబ్‌గా బెంగళూరు
రాష్ట్ర రాజధానిని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మరింత బలోపేతం చేసేందుకు భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. ఇస్రో, కియోనిక్స్, ఐఐఎస్సీ సహకారంతో బెంగళూరులో ఒక అత్యాధునిక రోబోటిక్స్, ఏఐ ఇన్నోవేషన్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దాదాపుగా రూ.16 కోట్ల వ్యయంతో బయోటెక్నాలజీ, నాస్కామ్ సహకారంతో రెండు కొత్త ఎక్సలెన్స్ సెంటర్లను స్థాపించనున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన 17వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను వివరించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.4,48,004 కోట్లుగా మొత్తం వ్యయాన్ని అంచనా వేశారు. అయితే సెప్టెంబర్ 2025లో జీఎస్టీ రేట్ల మార్పుల తర్వాత ఆదాయ వృద్ధి 10 శాతం నుండి 4 శాతానికి పడిపోయిందని సీఎం పేర్కొన్నారు. దీనివల్ల వచ్చే ఏడాది రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.15,000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పన్ను ఆదాయంలో కర్ణాటక దేశానికే అగ్రగామిగా ఉన్నప్పటికీ, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన వాటాలో అన్యాయం జరుగుతోందని ఆయన విమర్శించారు.

బెంగళూరులో పట్టణ వరదలను అరికట్టడానికి ప్రపంచ బ్యాంకు నిధులతో రూ.5,000 కోట్ల వ్యయంతో ఐదేళ్ల విపత్తు నిర్వహణ ప్రాజెక్టును చేపట్టనున్నారు. బెంగళూరు శివార్లలో నివాస ప్రాంతాల్లోకి వచ్చే చిరుతపులులను రక్షించి, పునరావాసం కల్పించడానికి బన్నెర్‌ఘట్ట బయోలాజికల్ పార్క్‌లో రూ.5 కోట్లతో ప్రత్యేక సౌకర్యాన్ని ఏర్పాటు చేయనున్నారు.

పారదర్శకతను పెంచేందుకు ఎక్సైజ్ శాఖలో బదిలీల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారు. గ్రూప్-సి అధికారుల కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ కౌన్సెలింగ్ పద్ధతిని ఇప్పుడు ఉన్నతాధికారుల బదిలీలకు కూడా వర్తింపజేయనున్నారు. సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అటు సంక్షేమ పథకాలను, ఇటు అత్యాధునిక సాంకేతిక అభివృద్ధిని సమతుల్యం చేస్తూ 'దూరదృష్టి'తో రూపొందించినట్లు చెప్పుకొచ్చారు.

Also Read: IND Vs ENG Match Turning Moment: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో కీలక మలుపు..ఈ మూడు జరగకపోయి ఉంటే టీమ్ఇండియా ఓడిపోయేది!

Also Read: Morning Routine For Peace: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా? అయితే వెంటనే ఆపేయండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 06, 2026 09:30:36
Hyderabad, Telangana:

Poco M7 Plus 5g Flipkart Discount Telugu: అత్యంత తక్కువ ధరలోనే ఎప్పటినుంచో మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకోసం ఫ్లిప్‌కార్ట్‌ శుభవార్త అందిస్తోంది. సమ్మర్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ కొన్ని మొబైల్‌తో పాటు ఇతర ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి అద్భుతమైన ఆఫర్స్ లభించబోతున్నాయి. ముఖ్యంగా స్పెషల్ బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండడం విశేషం. అయితే, ఏ మొబైల్ ఇప్పుడు అత్యంత తగ్గింపు ధరకే లభిస్తుందో? మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

పోకో (POCO) కంపెనీ గతంలో విడుదల చేసిన Poco M7 Plus 5G మొబైల్ అత్యంత తగ్గింపు ధరికే లభిస్తుంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 6.9 అంగుళాల Full-HD+ IPS LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 850 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన క్వాల్‌కామ్ Snapdragon 6s Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్ తో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్‌తో పాటు గేమింగ్ చేసే వారికి ఇది అద్భుతమైన పనితీరునందిస్తుంది. దీంతోపాటు ముఖ్యంగా ఎక్కువ సేపు మొబైల్ వినియోగించే వారికి ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతగానో సహాయపడుతుంది.

Poco M7 Plus 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన బ్యాటరీ ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 7,000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రత్యేకమైన 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్, 18W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి ఎంతో స్పీడుగా బ్యాటరీ చార్జ్ చేయొచ్చు. ఈ మొబైల్ వెనుక భాగంలోకి వెళ్తే.. ఇది ఎంతో ప్రత్యేకమైన AI సపోర్ట్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. ఫ్రంట్ భాగంలో 8MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2.0 ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.

అలాగే ఇందులో కంపెనీ  2 ఏళ్ల మేజర్ OS అప్‌డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని హామీ ఇచ్చింది. అలాగే ఇది వివిధ స్టోరేజ్ ఆప్షన్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఇది 6GBతో పాటు 8gb ర్యామ్‌తో అందుబాటులో ఉంది. ఇందులో ప్రత్యేకంగా IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR బ్లాస్టర్, 5G కనెక్టివిటీ స్పెషల్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్‌ను కంపెనీ MRP ధర రూ.16,999 లకు విక్రయిస్తోంది. అయితే, ఇప్పుడే ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి 12 శాతం తగ్గింపు కేవలం రూ.14,999కే పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై స్పెషల్‌గా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ప్రత్యేకమైన కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగిస్తే దాదాపు రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ  స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఏదైనా పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే, ఏకంగా రూ.13 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్‌లో మీరు కేవలం రూ.1,499 లోపే పొందవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Mar 06, 2026 09:17:21
Nunna, Vijayawada, Andhra Pradesh:

Social Media Ban For Under 13 In AP: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని చిన్న పిల్లలు (13 ఏళ్ల లోపు వారు) సోషల్ మీడియా వాడకంపై ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. 13 ఏళ్లలోపు పిల్లలకు ఏపీలో సోషల్ మీడియా వినియోగంపై బ్యాన్ విధించనుంది. అందుకు సంబంధించిన నిబంధనల ప్రక్రియను రాబోయో 90 రోజుల్లో ఖరారు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో పాటు 13 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 

ఈ తరం డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్లు వినియోగిస్తూ సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. ఇలాంటి తీరుపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియా వినియోగం వల్ల 13 ఏళ్ల లోపు పిల్లల మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును ప్రభావం ఉంటుందని అభిప్రాయపడింది.

ఇదే విషయమై కర్ణాటక ప్రభుత్వం కూడా తాజాగా 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై నిషేధాన్ని విధించింది. ఇప్పుడు అదే బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాలో నిషేధాన్ని విధిస్తూ కీలక ప్రకటన చేసింది. రాబోయే 90 రోజుల్లో విధివిధానాలను ఖరారు చేసి మళ్లీ అసెంబ్లీలో ప్రస్తావిస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. 

అయితే ఇదే అంశంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పటికే లోక్‌సభలో (పార్లమెంటు) ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. చిన్న పిల్లల్లో పెరుగుతున్న ఇంటర్నెట్ వ్యసనాన్ని అరికట్టడానికి జాతీయ స్థాయిలో చట్టం రావాలని ఆయన ఆకాంక్షించారు.

పిల్లలకు సోషల్ మీడియా నిషేధానికి కారణాలు..
చిన్న వయస్సులోనే పిల్లలు సోషల్ మీడియాకు అలవాటు పడడం వల్ల వారిలో ఏకాగ్రత తగ్గడమే కాకుండా డిప్రెషన్, నిద్రలేమి వంటి సమస్యలు వస్తున్నాయి. వీటితో పాటు వారి చదువు మందగిస్తుంది. గంటల తరబడి సోషల్ మీడియా వినియోగం వల్ల చదువుపై దృష్టి తగ్గి..ఇతర కార్యక్రమాలపై ఆసక్తి పెరిగి పిల్లలు తప్పుదోవ పడుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

అలాగే సోషల్ మీడియాలో నియంత్రణ లేని కంటెంట్ అందుబాటులో ఉండడం వల్ల పిల్లలకు ఏది మంచి..ఏది చెడు అనే ఆలోచించే తత్వాన్ని కోల్పోతున్నారు. తల్లిదండ్రుల భయాన్ని వీడుతున్నారు. దీంతో  పిల్లలు హింసాత్మక కంటెంట్‌ బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే తెలియని వ్యక్తుల పరిచయాలు, సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బు కోల్పోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. దీంతో సోషల్ మీడియా వల్ల వారి భద్రత ముప్పుగా మారే అవకాశం ఉంది. 

ఈ నిర్ణయంతో పిల్లల్లో సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టి.. తద్వారా వారిని తిరిగి ఆటపాటలు, పుస్తక పఠనం వైపు ఆలోచన మళ్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోంది. త్వరలోనే దీనిపై విద్యావేత్తలు, మానసిక నిపుణులతో చర్చించి సీఎం సహా అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.

Also Read: Social Media Ban: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..పిల్లలపై సోషల్ మీడియాలో నిషేధం..అసెంబ్లీలో ప్రకటన!

Also Read: IND Vs ENG Match Turning Moment: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌లో కీలక మలుపు..ఈ మూడు జరగకపోయి ఉంటే టీమ్ఇండియా ఓడిపోయేది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 06, 2026 08:17:47
Mumbai, Maharashtra:

India Vs England Match Turning Moment: టీ20 ప్రపంచకప్‌లోని రెండో సెమీఫైనల్ చివరి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి, భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. గత నెల ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ టోర్నీ ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. మార్చి 8వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ కోసం టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే తాజాగా జరిగిన రెండో సెమిఫైనల్లో భారత జట్టు గెలవడానికి 3 ప్రధాన కారణాల గురించి ఇప్పుడు చర్చిద్దాం.

ముంబయిలోని వాంఖడే వేదికగా ఇంగ్లాండ్- భారత్ మధ్య జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఎంతో రసవత్తరంగా జరిగింది. తొలి ఇన్నింగ్స్ వరకు మ్యాచ్ ఏకపక్షంగా భారత్ వైపు ఉందని అంతా భావించారు. అందుకు ప్రధాన కారణం భారత బ్యాటర్లు రాణించడం సహా 253 పరుగులను రాబట్టి ప్రత్యర్థి జట్టు ఇంగ్లాండ్‌కు భారీ టార్గెట్ నిర్దేశించడం. 

253 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు అసాధ్యం అన్నట్లుగా కనిపించింది. కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులు సాధించడం అంత తేలికైన స్కోరు కాదు. కానీ ఇంగ్లాండ్ లాంటి బలమైన ఆటను ఆడి మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చారు. జట్టు ప్రారంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ, జాకబ్ బెథెల్, విల్ జాక్స్ అద్భుతంగా రాణించారు. ఓవర్‌కు సగటున 12 పరుగులు చేశారు. అయితే ఇంగ్లాండ్ 7 పరుగుల తేడాతో ఫైనల్‌కు చేరుకునే అవకాశాన్ని కోల్పోయారు.

భారతదేశం గెలుపునకు 3 ప్రధాన కారణాలు..
టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారత జట్టు మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు చేరుకోవడానికి 3 ప్రధాన కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1) టీమ్ఇండియా తొలుత బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సంజు సామ్సన్ క్యాచ్‌ను పట్టుకోవడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో సంజూ కేవలం 15 పరుగుల వద్ద ఉన్నాడు. అప్పుడు ఆ క్యాచ్ పట్టి ఉండే భారత జట్టు 253 పరుగులు రాబట్టడం అసాధ్యంగా మారే అవకాశం ఉంది. కచ్చితంగా చెప్పాలంటే సంజూ శాంసన్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల ఇంగ్లాండ్ జట్టు టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

2) ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో అక్షర్ పటేల్ పట్టిన క్యాచ్ అసలైన మ్యాచ్‌కి కీలక మలుపు. ఎందుకంటే అప్పటికే సూపర్-8లో పాకిస్థాన్ జట్టుపై ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో రెచ్చిపోయాడు. అయితే హ్యారీ బ్రూక్ క్యాచ్ పట్టేందుకు పెవీలియన్ వద్ద అక్షర్ పటేల్ దాదాపుగా 24 మీటర్లు పరిగెత్తిమరీ క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. 

అదేవిధంగా బ్రూక్ వెనుదిరిగిన వెంటనే విల్ జేక్స్ అద్భుతంగా రాణించాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన బంతిని సిక్స్‌గా కొట్టడానికి ప్రయత్నించాడు. అతను బంతిని పరిగెత్తించి బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి సమీపంలో ఉన్న శివం దూబేకి ఇచ్చి క్యాచ్‌ను విజయవంతంగా తీసుకునేలా చేశాడు. విల్ జేక్స్ నిలబడి ఉంటే, ఇంగ్లాండ్ ఖచ్చితంగా మ్యాచ్ గెలిచి ఉండేది.

3) చివరిగా భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతను ఒక వికెట్ తీసుకుని 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆ తర్వాత బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా కేవలం 4 ఓవర్లలో 2 వికెట్లు తీసుకుని 38 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారత జట్టు ఫైనల్ మ్యాచ్ కు చేరుకోవడానికి ఇదే ప్రధాన కారణం. 

2026 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో వారు న్యూజిలాండ్‌తో తలపడనున్నారు. ఈ మ్యాచ్ మార్చి 8 ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.

Also Read: Divvela Madhuri Cake Cutting: తిరుమల కొండపై అపచారం..బిగ్‌బాస్ దివ్వెల మాధురిపై కేసు నమోదు..భక్తులు ఆగ్రహం!

Also Read: Swarna Grama Swarna Ward Bill: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..పేరు మార్పుతో ప్రమోషన్ల పండుగ..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 06, 2026 07:02:51
Karimnagar, Telangana:

Rajanna Sircilla District Latest News: సోషల్ మీడియాలో పరిచయాలు యువతను ఎక్కడికి తీసుకెళ్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక అద్భుతమైన ఉదాహరణగా భావించవచ్చు. ఇంస్టాగ్రామ్ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ప్రియుడి విలాసాల కోసం ఓ యువతి ఏకంగా తన తల్లి బంగారాన్ని అమ్మి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ ఆ యువతీ ఎందుకు బంగారాన్ని అమ్మాల్సి వచ్చింది? అసలు ప్రియుడి యువతి మధ్య ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలానికి చెందిన ఓ యువతికి.. ఇంస్టాగ్రామ్ ద్వారా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు చాలా రోజుల క్రితం పరిచయమయ్యాడు.  ఆ పరిచయం కాస్త పోను పోను ముదిరి ఇద్దరి మధ్య స్నేహంగా మారింది. ఈ క్రమంలో సదరు యువకుడు తన ప్రియురాలిని ఒక ఖరీదైన బైకు కొనివ్వాలని డిమాండ్ చేశాడు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం తోనే ఆ యువకుడు బైక్ కొనివ్వమని అడిగినట్లు సమాచారం. 

ప్రియుడిపై ఉన్న అద్భుతమైన ప్రేమతో.. అతను అడిగిన కోరికను ఎలాగైనా తీర్చాలని ఆ యువతీ అనుకుంది.. అయితే ఆ యువతీ దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బులు లేకపోవడంతో.. కొద్దిరోజుల పాటు ఆలోచించింది. ఇంట్లో ఉన్న తన తల్లికి సంబంధించిన బంగారు ఆభరణాలపై ఈ సమయంలో కన్ను పడింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా తల్లి బంగారు ఆభరణాలను దొంగిలించి.  వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో ప్రియుడికి అత్యంత ఖరీదైన బైకును కొనిచ్చింది..

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఉన్న బంగారం నగలు కనిపించకపోవడంతో.. తల్లి ఎంతగానో కంగారు పడింది. అంతేకాకుండా చుట్టుపక్కల వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఒక్కసారిగా ఆందోళన చెందింది. చివరకు తన కూతురే ఈ పని చేసిందని ఆలస్యంగా గ్రహించి.. దిక్కుతోచని స్థితిలో ఎల్లారెడ్డి పేట పోలీసులను ఆశ్రయించింది. తన బంగారాన్ని రీకవరీ చేసి.. న్యాయం చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.  లేకుంటే ఇటువంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు..

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 06, 2026 05:19:15
Hyderabad, Telangana:

Shani Blessings 2026 Effect On Zodiac: జులై 26వ తేదీ నుంచి శని అనేక మార్పులు చేయబోతోంది. ముఖ్యంగా ఈరోజు నుంచి మీనరాశిలో వక్రగతిలోకి వెళ్ళబోతోంది. ఈ శని వక్ర కదలికలు దాదాపు 138 రోజుల పాటు కొనసాగుతాయి. అంటే డిసెంబర్ 11వ తేదీ వరకు శని ఇలాగే వక్రగతిలో ఉండబోతోంది. అయితే, ఈ సుదీర్ఘ కాలం పాటు కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం పరంగా శని గ్రహాన్ని కర్మలకు ఫలితాలను అందించే దేవుడిగా చెప్పుకుంటారు. అలాంటిది ఈ గ్రహ గమనంలో మార్పులు సంభవించడం కారణంగా కెరీర్‌తో పాటు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్యంపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేష రాశి 
మేష రాశి వారికి ఏలినాటి శని ప్రారంభమైంది. శని 12వ స్థానంలో సంచార దశలో ఉన్నాడు. దీని కారణంగా వీరికి ఒత్తిడితో పాటు సంక్లిష్టమైన పరిస్థితిలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతాయి. ఇతరులకు అప్పులు కూడా తిరిగి చెల్లిస్తారు. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు జీతాలు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొత్త అదనపు బాధ్యతలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా జీవితంలో అద్భుతమైన అవకాశాలు కూడా పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు దిమ్మతిరిగే లాభాలు కూడా పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. 

కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. దీంతోపాటు కొత్త పనులు చేయాలనుకుంటున్న వ్యక్తులకు లాభాలు రావడం ప్రారంభమవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులకు ఇది మంచి సమయం. అలాగే ఉద్యోగాలను వదిలి వ్యాపారాలకు రావాలనుకుంటున్న వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మీన రాశి 
మీన రాశి వారికి శని మూడవ స్థానంలో బలహీనంగా ఉన్నాడు. అయితే ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొన్ని రకాల శుభవార్తలు వినడమే కాకుండా.. ఆదాయం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఇల్లు లేదా కొత్త భూములు కొనుగోలు చేస్తారు. మానసికంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవితంలో కూడా ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు వీరికి అనుకున్న పనుల్లో భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందుతారు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 06, 2026 05:06:30
Hyderabad, Telangana:

Mercury Transits 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాలు మానవుల జీవితంలో ఎన్నో రకాల మార్పులను తీసుకొస్తూ ఉంటాయి. గ్రహాల కదలికలు, సంయోగాలను బట్టి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. జాతకంలో ఏదైనా గ్రహం శుభస్థానంలో ఉంటే దేనికి లోటు ఉండదు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా మేలు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా బుధుల్లాంటి గ్రహం శుభస్థానంలో ఉంటే నెలరోజుల పాటు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇదిలా ఉంటే మార్చి 25వ తేదీన ఉదయం ఆరు గంటల సమయంలో బుధుడు తన కక్ష్యలో దిశను మార్చుకుని దక్షిణం వైపు కదులుతాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఈ మార్పుకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.

ముఖ్యంగా బుధుడిని తెలివితేటలతో పాటు వ్యాపారం, కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీలకు సూచికగా పరిగణిస్తూ ఉంటాం. అలాంటివి ఈ గ్రహం కదలికల కారణంగా కెరీర్, వ్యాపారం, ఆర్థిక పరిస్థితుల పరంగా అనేకమైన మార్పులను తీసుకువచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో నాలుగు రాశుల వారికి ఎంతో మేలు జరగబోతోంది. దీంతోపాటు అదృష్టాన్ని కూడా తెచ్చి పెడుతుంది..

వృషభరాశి 
ముఖ్యంగా ఈ సమయంలో వృషభ రాశి వారికి ఎంతో మేలు జరగబోతోంది. కెరీర్‌తో పాటు వ్యాపారంపరంగా మరుగుదల కనిపించబోతోంది. అంతేకాకుండా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అలాగే డబ్బులు కూడా భారీ మొత్తంలో తిరిగి పొందుతారు. కొత్త పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు తిరిగి పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు పదోన్నతులు పొందడమే కాకుండా జీతాన్ని కూడా భారీగా పెంచుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆనందంతో పాటు సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది.

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఈ సమయంలో వీరు తప్పకుండా శుభవార్తలు కూడా వింటారు. వ్యాపారవేత్తలకు కావలసిన విజయాలు కూడా లభించే అవకాశాలున్నాయి. దీంతోపాటు వ్యక్తిగత ఖ్యాతి కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏవైనా వివాదాలుంటే ఈ సమయంలో తప్పకుండా తొలగిపోతాయి. చదువుతో సంబంధం ఉన్న వ్యక్తులకు చాలావరకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కన్యారాశి 
కన్యారాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా జీవితంలో కొత్త కొత్త అవకాశాలు రావడం ప్రారంభమవుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఊహించని ప్రయోజనాలు కలిగే ఛాన్సులు ఉన్నాయి. దీంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరగబోతోంది. కొత్త ప్రణాళికలతో ముందుకు సాగడం వల్ల అనుకున్న పనుల్లో విజయాలు సాధించక తప్పదు. అలాగే మీడియా కమ్యూనికేషన్ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మీన రాశి 
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు అనేకమైన మార్పులు రావడం ప్రారంభమౌతాయి. వ్యాపారాల్లో హత్యక పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు. అలాగే మానసిక ప్రశాంతత కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. కుటుంబ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధన పై ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు సాధించగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 06, 2026 04:53:51
Hyderabad, Telangana:

Sun And Saturn Blessings Effect On Zodiac Telugu: మార్చి నెల చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ నెల ప్రారంభం నుంచి చివరి వరకు అనేక ప్రధాన గ్రహాలు కదలికలు చేయడమే కాకుండా.. సంయోగం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మార్చి నెలలో తండ్రి కుమారులుగా భావించే సూర్యశని గ్రహాల సంయోగం జరుగుతుంది. అయితే ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల కొన్ని రాశులు ఊహించని స్థాయిలో ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా శని సంయోగం కారణంగా మార్చి 15వ తేదీ నుంచి కొన్ని రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగబోతున్నాయి.

జ్యోతిష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మీన రాశిలో శని సూర్యుల కలయిక దాదాపు 30 సంవత్సరాల తర్వాత  జరగబోతోంది. ఈ కలయిక కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా మేలు జరగడమే కాకుండా.. వృత్తిపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. కాబట్టి ఈ రెండు గ్రహాల సంయోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. 

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మిథున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు సూర్యశని గ్రహాల కలయిక కెరీర్ పరంగా అద్భుతమైన సానుకూలమైన ఫలితాలను అందించబోతోంది. ముఖ్యంగా ప్రమోషన్స్ లభించడమే కాకుండా కొత్త కొత్త ఉద్యోగాలు లభించబోతున్నాయి. అలాగే అదృష్టం కూడా పించని స్థాయిలో పెరుగుతుంది. దీంతోపాటు అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. పాత అప్పుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందుతారు. అంతేకాకుండా కొన్ని పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. 

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా అద్భుతం జరగబోతోంది. అదృష్టాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా.. ఈ సమయంలో చాలా బాగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలు కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే జీవితంలో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మీన రాశి 
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో సానుకూలమైన ప్రయోజనాలు రావడం ప్రారంభమౌతాయి. అంతేకాకుండా వీరికి కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. అలాగే తెలివితేటలతో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగాల్లో పనులు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొత్త విభేదాలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కోపంతో ఉన్న వ్యక్తులు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడడం మంచిది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Mar 06, 2026 04:12:27
Hyderabad, Telangana:

Morning Routine For Inner Peace: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం అయిపోయాయి. అయితే, ఉదయం నిద్రలేవగానే మనం చేసే కొన్ని చిన్న మార్పులు రోజంతా మనల్ని ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉంచుతాయి. మానసిక ఉల్లాసం కోసం నిపుణులు సూచిస్తున్న 6 అద్భుతమైన ఉదయపు అలవాట్లను తెలుసుకుందాం.

డిజిటల్ డెటాక్స్ (ఫోన్‌కు దూరంగా ఉండండి)
నిద్రలేవగానే నోటిఫికేషన్లు, సోషల్ మీడియా లేదా ఈమెయిల్స్ చూడటం వల్ల మెదడుపై ఒక్కసారిగా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే లేవగానే కనీసం మొదటి 30 నిమిషాల పాటు ఫోన్‌ను ముట్టుకోకుండా ఉండటం మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

సూర్యరశ్మి, తాజా గాలి
ఉదయాన్నే కిటికీలు తెరిచి లేదా కాసేపు బయట కూర్చుని సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. సూర్యకాంతి వల్ల శరీరానికి విటమిన్-డి అందడమే కాకుండా, మెదడులోని సెరోటోనిన్ స్థాయిలు పెరిగి నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి.

శారీరక శ్రమ లేదా వ్యాయామాలు
భారీ వర్కౌట్లు చేయకపోయినా పర్వాలేదు, కనీసం 10-15 నిమిషాల పాటు నడవడం లేదా యోగా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది మెదడును చురుగ్గా మార్చి, ఒత్తిడిని తగ్గించే సహజమైన మార్గంగా పనిచేస్తుంది.

హైడ్రేషన్ (నీరు తాగడం)
రాత్రంతా నిద్రలో మన శరీరం నీటిని కోల్పోతుంది. అందుకే ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల మెదడు కణాలకు తక్షణ శక్తి అందుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ వల్ల కలిగే చిరాకు, అలసట దూరమవుతాయి.

ధ్యానం లేదా యోగా
కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని మీ శ్వాసపై ధ్యాస పెట్టండి. రాబోయే పనుల గురించి ఆందోళన చెందకుండా, ప్రస్తుత క్షణంలో ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం అద్భుతంగా తోడ్పడుతుంది.

గమనిక: మానసిక ఆరోగ్యం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. పైన పేర్కొన్న అలవాట్లను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాటిస్తే, మీ జీవనశైలిలో, ఆలోచనా విధానంలో గొప్ప సానుకూల మార్పులను గమనించవచ్చు.

Also Read: Divvela Madhuri Cake Cutting: తిరుమల కొండపై అపచారం..బిగ్‌బాస్ దివ్వెల మాధురిపై కేసు నమోదు..భక్తులు ఆగ్రహం!

Also Read: Swarna Grama Swarna Ward Bill: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..పేరు మార్పుతో ప్రమోషన్ల పండుగ..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RGRenuka Godugu
Mar 06, 2026 02:40:03
Hyderabad, Telangana:

Who Is New Governor Of Telangana  Shiv Pratap Shukla: దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలకు గవర్నర్ల బదిలీ నిన్న జరిగింది. కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. అదే విధంగా తెలంగాణకు కూడా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేస్తున్న శివప్రతాప్ శుక్లాను బదిలీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణు దేవ్‌ వర్మాను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్‌ -నందకిషోర్ యాదవ్, బీహార్ గవర్నర్‌- సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవిని కూడా నియమించింది. 

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఎవరు?
తెలంగాణకు కొత్తగా అపాయింట్ అయినా శివప్రతాప్ శుక్ల 1952 ఏప్రిల్‌ 1వ తేదీ ఉత్తరప్రదేశ్‌లోని రుద్రాపూర్‌లో జన్మించారు. ఈయనకు ప్రస్తుతం 73 ఏళ్ల వయసు.   గోరఖ్‌పూర్ లో ఆయన లా పూర్తి చేశారు. ఇక రాజకీయంగా ఆయన కెరీర్ అక్కడ నుంచి ప్రారంభమైంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషద్‌ (ABVP) లో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. 1983 వ సంవత్సరంలో బీజేపీలో జాయిన్ అయ్యారు.

అలా శివ ప్రతాప్‌ శుక్లా 1989, 1991, 1993, 1996 లో వరుసగా గోరఖ్‌పూర్‌ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2016 లో ఆయన ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడుగా కూడా పనిచేశారు. 2017 నుంచి 2019 వరకు నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేసిన బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఇక 2023 నుంచి ఇప్పటివరకు ఆయన హిమాచల్ గవర్నర్‌గా ఉన్నారు. 

Also Read: రాష్ట్రంలో పత్తా లేని కొత్త రేషన్‌ కార్డులు.. పెండింగ్‌లో లక్షల దరఖాస్తులు, కారణం అదేనా?

Also Read: 10వ తరగతి హాల్‌టిక్కెట్లు విడుదల.. 503 Error వచ్చినా ఈ సింపుల్‌ టిప్స్‌తో డౌన్‌లోడ్‌ చేయండి..!

 మరో 9 రాష్ట్రాలకు గవర్నర్ల బదిలీ..
 తెలంగాణతోపాటు మరో తొమ్మిది రాష్ట్రాల్లో కూడా గవర్నర్ల బదిలీ జరిగింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఢిల్లీకి పనిచేస్తున్న వినయ్ కుమార్ సక్సేనాను లద్దాక్‌ ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇక ఇండియన్ అంబాసిడర్ యునైటెడ్ స్టేట్ రంజిత్ సింగ్ సంధు  కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఢిల్లీకి నియామకం చేపట్టారు. ఇక నందకిషోర్ యాదవ్ నాగాలాండ్ గవర్నర్‌గా అపాయింట్ కాగా.. సయ్యద్ హస్నేన్, బీహార్ గవర్నర్‌గా.. ఆర్‌ఎన్‌ రవి ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆయన్ను వెస్ట్ బెంగాల్‌కు నియమించారు. కేరళ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాధ్ ఆర్లేకర్ ను తమిళనాడుకు అదనపు బాధ్యతలు అందించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Mar 06, 2026 02:04:07
Nunna, Vijayawada, Andhra Pradesh:

Swarna Grama Swarna Ward Promotions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కూటమి సర్కార్ ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తూ, ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయ వ్యవస్థను కేవలం సేవా కేంద్రాలుగానే కాకుండా, అభివృద్ధికి చిరునామాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనమండలిలో కీలక బిల్లుకు ఆమోదం లభించింది.

ఇకపై 'స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు'
గతంలో ఉన్న 'గ్రామ, వార్డు సచివాలయాల' పేరును ఇకపై 'స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు' కార్యాలయాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2047 నాటికి 'స్వర్ణాంధ్ర' లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా ఈ సంస్థాగత మార్పులు చేపట్టారు. సచివాలయ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రమోషన్లు లేక ఒకే హోదాలో ఉండిపోయిన వేలాది మంది ఉద్యోగులకు త్వరలోనే పదోన్నతులు కల్పించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనుంది.

ప్రజలకు అందే సేవల్లో జాప్యం తగ్గించి, జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం మూడంచెల పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టింది. గతంలో దారిమళ్లిన ఆర్థిక సంఘం నిధులను ఇప్పుడు నేరుగా పంచాయతీలకే కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వాలంటీర్ల వ్యవస్థకు బదులుగా ప్రజాప్రతినిధులే నేరుగా పెన్షన్లు అందించడం ద్వారా వ్యవస్థలో మరింత పారదర్శకత వచ్చిందని ప్రభుత్వం భావిస్తోంది.

సచివాలయాలను రాజకీయ కేంద్రాలుగా కాకుండా, సామాన్య పౌరుడికి అవినీతి రహిత సేవలు అందించే నిజమైన సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ నూతన విధానం ద్వారా అటు ఉద్యోగులకు లబ్ధి చేకూరడమే కాకుండా, గ్రామీణ స్థాయిలో పాలనా యంత్రాంగం మరింత సమర్థవంతంగా తయారు కానుంది.

Also Read: Divvela Madhuri Cake Cutting: తిరుమల కొండపై అపచారం..బిగ్‌బాస్ దివ్వెల మాధురిపై కేసు నమోదు..భక్తులు ఆగ్రహం!

ALso Read: Russia Oil Supply To India: భారతదేశానికి మరోసారి రష్యా భరోసా..యుద్ధం వేళ చమురు సరఫరా కోసం మాస్టర్ ప్లాన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 05, 2026 17:21:56
Mumbai, Maharashtra:

IND vs ENG: టీ20 ప్రపంచకప్‌ 2026ను వరుసగా రెండోసారి అందుకునేందుకు భారత జట్టు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఉత్కంఠగా జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి టీమిండియా విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లను భారత బ్యాటర్లు ఉతికి పారేయగా.. ప్రత్యర్థిని మాత్రం భారత బౌలర్లు తీవ్రంగా కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించి ఫైనల్‌లో నిలబెట్టారు. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌ ఫలితాలు ఇలా ఉన్నాయి.

కోల్‌కత్తాలోని వాంఖడే స్టేడియంలో రెండో సెమీ ఫైనల్‌ భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌ చేసింది. అభిషేక్‌ శర్మ 9 పరుగులకే ఔటవగా.. మరోసారి సంజూ శామ్‌సన్‌ బ్యాట్‌తో అదరగొట్టాడు. 42 బంతుల్లో 89 పరుగులు చేసి సెంచరీని మిస్సయ్యాడు. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో అయినా సెంచరీ చేస్తాడనుకుంటే అనూహ్యంగా ఔటయ్యాడు. ఇషాన్‌ కిషన్‌ 39 పరుగులతో రాణించగా.. శివమ్‌ దూబే 43 స్కోర్‌తో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ (11), తిలక్‌ వర్మ (21), అక్షర్‌ పటేల్‌ (2) కొన్ని పరుగులు చేశారు.

ఇంగ్లాండ్‌ బౌలింగ్‌
భారత జట్టును ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. భారత బ్యాటర్లను నిలువరించలేకపోవడంతో భారీ స్కోర్‌ నమోదైంది. భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తున్న సమయంలో విల్‌ జాక్స్‌, అదిల్‌ రషీద్‌ కొంత నియంత్రించారు. వారిద్దరూ రెండు వికెట్ల చొప్పున తీయగా.. జోఫ్రా ఆర్చర్‌ ఒక వికెట్‌ తీశాడు.

పాండ్యా తీరు వివాదాస్పదం
సెమీస్‌ గెలవాలనే కసితో భారత జట్టు మొత్తం ఉండగా.. హార్దిక్‌ పాండ్యా ప్రవర్తన మాత్రం విస్మయానికి గురి చేసింది. హార్దిక్‌ పాండ్యా ఆట తీరు భారత్‌కు కొంత నష్టం చేసింది. శివమ్‌ దూబేతో కలిసి ఆడుతుండగా.. అవనసరంగా ఔట్‌ చేయించాడు. పరుగుకు పిలిచి తర్వాత వద్దనడంతో వెనక్కి తిరిగిన దూబే రనౌట్‌ అయ్యాడు. జట్టు భారీ స్కోర్‌ చేయాలంటే దూబే క్రీజులో ఉండాల్సి ఉంది. ఆ సమయంలో దూబే రనౌట్‌ కారణంగా భారత్‌కు మరో 20 పరుగులు వచ్చే అవకాశం ఉండేది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Mar 05, 2026 16:47:59
Tirupati Urban, Andhra Pradesh:

Divvela Madhuri Thanuja Birthday Cake Cutting: తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించి గతంలోనే వివాదాల్లో నిలిచిన దివ్వెల మాధురి, మరోసారి తన అత్యుత్సాహంతో వార్తల్లోకి ఎక్కింది. నిబంధనలకు విరుద్ధంగా ఏడుకొండలపై పుట్టినరోజు వేడుకలు నిర్వహించి శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురైంది. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, నిబంధనలను బేఖాతరు చేస్తూ తిరుమల కొండపై బర్త్ డే వేడుకలు జరపడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమల కొండపైకి కేకులు తీసుకురావడం, వేడుకలు జరపడం పూర్తిగా నిషేధం. అయినప్పటికీ, మాధురి తన సన్నిహిత మిత్రురాలు, బిగ్ బాస్ విన్నర్ తనూజ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమలలోని ఒక గెస్ట్ హౌస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో తనూజకు చీర, గాజులతో పాటు బంగారు కమ్మలను కూడా మాధురి బహుమతిగా ఇచ్చింది. అయితే ఇప్పుడు కట్టుదిట్టమైన తనిఖీలు ఉండే తిరుమల కొండపైకి కేక్ ఎలా వెళ్ళింది? సెక్యూరిటీ కళ్లుగప్పి ఈ పని ఎలా చేశారు? అనే అంశాలపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

గతంలోనూ వివాదాలే..
దివ్వెల మాధురికి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి తిరుమల మాడ వీధుల్లో రీల్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఆ ఘటనపై అప్పట్లో పోలీసులు ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.

సోషల్ మీడియాలో విమర్శల వర్షం
"హ్యాపీ బర్త్‌డే బంగారం.. నువ్వు స్వర్గం నుంచి దిగివచ్చావు" అంటూ తనూజకు శుభాకాంక్షలు చెబుతూ మాధురి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, భక్తులు "దేవుడి సన్నిధిలో ఇలాంటి పనులేంటి?" అంటూ మండిపడుతున్నారు.

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కేవలం ఫోటో షూట్లు, వేడుకలకు వేదికగా మార్చుకోవడంపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ తాజా వివాదంపై టీటీడీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Also Read: Vrushakarma Glimpse: మొన్న 'తండేల్', నేడు 'వృషకర్మ'..అక్కినేని ఫ్యాన్స్‌కు నాగచైతన్య ఫీస్ట్ రెడీ!

Also Read: Russia Oil Supply To India: భారతదేశానికి మరోసారి రష్యా భరోసా..యుద్ధం వేళ చమురు సరఫరా కోసం మాస్టర్ ప్లాన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 05, 2026 16:30:21
Hyderabad, Telangana:

Vijay Rashmika Marriage Cost: సినిమాలో కలిసి పని చేసిన విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఆ సమయంలో జరిగిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వరుసగా సినిమాలు చేస్తుండగా వారి మధ్య బంధం మరింత దృడమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి డేటింగ్‌ వరకు వచ్చేసింది. ఇరువురు మనసులు మార్చుకోగా.. పెళ్లితో జీవితాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమలో అగ్ర తారలుగా గుర్తింపు పొందుతున్న ఈ నటీనటులు ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. నెల రోజుల నుంచి విజయ్‌, రష్మిక పెళ్లిపైనే అందరి దృష్టి పడింది. మరి వీరి పెళ్లి ఎలా జరిగింది? ఎంత బంగారం కొన్నారు? ఎంత ఖర్చయ్యింది? తదితర వివరాలు తెలుసుకుందాం.

Also Read: Ind vs Eng: భారీ లక్ష్యం నమోదు చేసిన భారత్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?

తెలుగు సినీ పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన వివాహంగా విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక పెళ్లి ఉండనుంది. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయ్‌పూర్‌లో ఆత్మీయులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో వివాహం జరిగింది. ఫ్యామిలీ స్టార్‌, నేషనల్‌ క్రష్‌ పెళ్లి అక్కడ జరిగినా.. వివాహ విందు మాత్రం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరిగింది. అంతకుముందు తెలంగాణలోని తమ స్వగ్రామంలో విజయ్‌ దేవరకొండ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు.

Also Read: Telangana CM: కేంద్ర హోంమంత్రితో తెలంగాణ సీఎం భేటీ.. కీలకాంశాలపై చర్చ

దాదాపు పక్షం రోజులుగా వీరి పెళ్లిపై ఒకటే చర్చ. పెళ్లిలో విజయ్‌ వేసుకున్న వస్త్రధారణ.. వధువుగా రష్మిక ధరించిన ఆభరణాలపై అందరి దృష్టి పడింది. రాజుల కాలంలో మాదిరి విరోష్‌ జంట కనిపించింది. మరి పెళ్లికి ఎంత బంగారం వినియోగించారనేది చర్చ జరిగింది. మొత్తం మూడు కిలోలకు పైగా బంగారం వధూవరులు వినియోగించారని తెలుస్తోంది. తులాల పరంగా చూస్తే 257 తులాల బంగారం కొత్త జంట వాడింది. విజయ్‌, రష్మిక పెళ్లి ఒక ప్రముఖ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ నిర్వహించిందని సమాచారం. ఉదయ్‌పూర్‌లో పెళ్లి, సొంతూరులో సత్యనారాయణ వ్రతం, సంగీత్‌ కార్యక్రమం, అభిమానులకు విందు, మీడియాకు ప్రత్యేక విందు, దేశవ్యాప్తంగా మిఠాయిల పంపిణీ, ఆలయాల్లో అన్నదానంతోపాటు  హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ చేసింది. మొత్తం ఒక ప్యాకేజ్‌గా మాట్లాడుకున్నారని తెలుస్తోంది.

Also Read: BRS Party: గులాబీ పార్టీలో గుబులు.. సంస్థాగత నిర్మాణంపై మళ్లీ చేతులెత్తేసిన బీఆర్‌ఎస్‌

ఖర్చులు పోగా లాభం
విరోష్‌ పెళ్లి కోసం దాదాపు రూ.15 కోట్లకు పైగా ఖర్చయ్యిందని చర్చ జరుగుతోంది. సాధారణ ప్రజల వివాహాలు అయితే ఎవరు పెళ్లి చేస్తారని ప్రధానంగా చర్చ ఉంటుంది. ఇలా విజయ్‌, రష్మిక పెళ్లి ఖర్చు వధువు, వరుడు తరఫున ఎవరో ఖర్చు చేశారని చర్చించగా.. ఇద్రూ కలిసి ఖర్చు పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను విరోష్‌ జోడీ నెట్‌ఫ్లిక్స్‌కు అప్పగింంచింది. దీనికోసం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సుమారు రూ.60 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఆ వీడియో ద్వారా విరోష్‌ జోడీ తమ పెళ్లి ఖర్చుపోను అదనంగా రూ.45 కోట్ల వరకు లాభం పొందారు. తమ పెళ్లిని కూడా వ్యాపారంగా మలుచుకుని ఈ స్టార్‌ జంట లాభదాయకంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top