మాభూమికి రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని బాధితుడి ఆవేదన
Karimnagar, Telangana:ఆయన తండ్రి కొమరయ్య నుండి వారసత్వంగా పొందిన 36 గుంటల భూమి (సర్వే నంబర్ 143/c 296డి, 297/బి, 301/డి, 302/సి) పై కొంత కాలంగా కబ్జా చేయాలని యత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వీరు గత 25 సంవత్సరాలుగా విదేశాలలో ఉన్నారు. 1/2 గుంటలు సర్వే నంబర్ 278/ఏలో కొనుగోలు చేసిన భూమి కూడా రెవెన్యూ రికార్డులకు నమోదు చేయకుండా వేరే వారిపై చేయబడిందని పేర్కొన్నారు. వీరు 50 సంవత్సరాలుగా ఈ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారని, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో గ్రామస్తులు ఆరోపిస్తున్నారని వెల్లడించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
PM Modi Public Call: బంగారంతో సహా ప్రజలకు ప్రధాని మోదీ 6 విజ్ఞప్తులు.. అవేమిటంటే?
Baddipadaga, Telangana:Gold Price: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. వాటిలో బంగారంతోపాటు విదేశీ ప్రయాణం, ఎరువుల వినియోగం తదితర అంశాలపై ప్రధాని విజ్ఞప్తులు చేశారు. దేశం కోసం కొన్ని తగ్గించుకోవాలని సూచనలు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా దేశభక్తిలో భాగమని గుర్తుచేశారు. ప్రస్తుతం కరోనా వంటి సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఎదుర్కోవాలని హెచ్చరించారు.
Also Read: Narendra Modi: 'అబద్ధపు హామీలు ఇచ్చి మర్చిపోవడమే కాంగ్రెస్ మోడల్': ప్రధాని మోదీ
ప్రజలకు సూచనలు
==> మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించాలి. కార్పూలింగ్ను ప్రోత్సహించాలి. సాధ్యమైనంత వరకు రైల్వే సరుకు రవాణాను వినియోగించాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలి.
==> కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి. విదేశీ వస్తువుల కొనుగోళ్లు తగ్గించాలి. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాల. వోకల్ ఫర్ లోకల్ను బలంగా అమలు చేయాలి. రోజువారీ జీవితంలో విదేశీ ఉత్పత్తుల స్థానంలో స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలి.
==> విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలి
==> ఏడాదిపాటు బంగారం కొనడం తగ్గించుకోవాలి
==> వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలి
==> రైతులు రసాయన ఎరువులను తగ్గించుకోవాలి. రసాయన ఎరువుల వినియోగాన్ని 25 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించి సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాలి.
==> డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి పంపులను ఉపయోగించాలి.
Also Read: Narendra Modi: తెలంగాణలో మార్పు అనివార్యం.. అబ్కీ బార్ బీజేపీ సర్కార్: ప్రధాని మోదీ
కరోనా కాలంలో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ సమావేశాలను మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా దేశభక్తిలో భాగమని గుర్తుచేశారు. రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూమి నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ సంక్షోభాల సమయంలో ప్రతి పౌరుడు దేశహితం కోసం కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది ఒక్క ప్రభుత్వానికి.. ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశానికి సంబంధించిన బాధ్యత అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సంస్థ దేశ ప్రయోజనాల కోసం ఏకమై పనిచేస్తే దేశం ప్రతి సంక్షోభాన్ని జయిస్తుందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Narendra Modi: 'అబద్ధపు హామీలు ఇచ్చి మర్చిపోవడమే కాంగ్రెస్ మోడల్': ప్రధాని మోదీ
Hyderabad, Telangana:PM Modi Speech: బీజేపీ అభివృద్ధి, ఉపాధి సృష్టిపై దృష్టి సారిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారని, ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందుగా అబద్ధపు హామీలు ఇవ్వడం.. తర్వాత వాటిని మర్చిపోవడమే. హిమాచల్, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. తెలంగాణలో కూడా అదే జరుగుతోంది' అని రేవంత్ రెడ్డిపై ప్రధాని మండిపడ్డారు.
Also Read: Narendra Modi: తెలంగాణలో మార్పు అనివార్యం.. అబ్కీ బార్ బీజేపీ సర్కార్: ప్రధాని మోదీ
తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ప్రసంగం చేయడం గమనార్హం. 'కాంగ్రెస్ ఇప్పుడు దేశాన్ని విభజించే రాజకీయాలకు కేంద్రంగా మారింది. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకెళ్తోంది. అందుకే ప్రజలు కాంగ్రెస్ను ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్గా అభివర్ణిస్తున్నారు' అని ప్రధాని మోదీ విమర్శించారు. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందని ప్రధాని గుర్తుచేశారు.
Also Read: Telangana CM: 'తెలంగాణపై ప్రధాని మోదీ పెద్ద మనసు చూపాలి: రేవంత్ రెడ్డ
కాంగ్రెస్, వామపక్షాలు మావోయిస్టులకు భావజాల పరంగా మద్దతు ఇవ్వడంతోనే ఈ సమస్య ఇంతకాలం కొనసాగింది. తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలా కాలం కిందటే అంతం చేసేవారు. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోంది' అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం భారత్ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటోందని వివరించారు.
Also Read: Bandi Bageerath POCSO: రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్ కొడుకు కేసుపై హరీశ్ రావు నిలదీత
'కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. అయినప్పటికీ భారత ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా రైతులకు భారీ సబ్సిడీతో ఎరువులను అందిస్తున్నాం. ప్రపంచ మార్కెట్లో రూ..3000 ఉన్న ఎరువుల సంచిని భారత రైతులకు రూ.300 లోపే అందిస్తున్నాం' అని ప్రధాని మోదీ వివరించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రజలు కొన్ని సంకల్పాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
కార్యకర్తల్లో జోష్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో ప్రధాని మోదీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. సభా ప్రారంభానికి ముందు తన కోసం కార్యకర్తలు, చిన్నారులు తీసుకొచ్చిన పెయింటింగ్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించి తన భద్రతా సిబ్బందితో తీసుకున్నారు. ఆ చిత్రాలను సేకరించాలని ఎస్పీజీ అధికారులను ఆదేశించిన అనంతరం సేకరించిన పెయింటింగ్స్పై చిత్రకారుల అడ్రస్లు ఉంటే వారికి స్వయంగా లేఖలు రాస్తానని చెప్పడంతో కార్యకర్తల్లో జోష్ వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Narendra Modi: తెలంగాణలో మార్పు అనివార్యం.. అబ్కీ బార్ బీజేపీ సర్కార్: ప్రధాని మోదీ
Baddipadaga, Telangana:PM Modi Full Speech: 'తెలంగాణ రాజకీయాల్లో మార్పు అనివార్యం. అబ్కీ బార్ తెలంగాణాలో కూడా బీజేపీ ప్రభుత్వం అనే నినాదం ఇప్పుడు ప్రజల సంకల్పంగా మారింది' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించినట్టు తెలంగాణలో కూడా కుటుంబ, అవినీతి రాజకీయాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
Also Read: Telangana CM: 'తెలంగాణపై ప్రధాని మోదీ పెద్ద మనసు చూపాలి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. జాతీయ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతోపాటు ప్రపంచ పరిణామాలపై ప్రధాని స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడి చారిత్రాత్మక విజయోత్సాహం ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో అపారమైన జోష్ కనిపిస్తోంది' అని ప్రధాని తెలిపారు.
Also Read: Bandi Bageerath POCSO: రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్ కొడుకు కేసుపై హరీశ్ రావు నిలదీత
'దేశవ్యాప్తంగా బీజేపీ అభివృద్ధి మోడల్, సుపరిపాలనపై ప్రజలు మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు' అని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇప్పుడు తెలంగాణలో అబ్కీ బార్ బీజేపీ సర్కార్ అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని పేర్కొన్నారు. 'పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదు. ప్రజలను సంవత్సరాల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు' అని తెలిపారు. 'కాంగ్రెస్ అవినీతి, కుటుంబవాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారింది. అదే మార్గంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా నడిచింది. ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారు' అని ప్రధాని మోదీ వివరించారు.
'దక్షిణాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీని చిన్న పార్టీగా చూసేవారు. కానీ నేడు దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో అపారమైన విశ్వాసం పెరిగింది. తెలంగాణకు బీజేపీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న సమయంలో తెలంగాణ నుంచే ఒక ఎంపీ గెలిచారు' అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. దేశంలో మద్దతు లేకపోయినా తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ నుంచి దాదాపు సగం మంది ఎంపీలు బీజేపీ తరఫున గెలిచారని.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల మోసం, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. అందుకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధే దేశ అభివృద్ధి అనే సిద్ధాంతంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో తెలంగాణ, హైదరాబాద్ కీలక పాత్ర పోషించాలని కేంద్రం కట్టుబడి ఉంది' అని ప్రధాని మోదీ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Modi Visit Hyderabad: డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు ప్రధాని మోదీ పరామర్శ..సీఎం చంద్రబాబు ఇంట్లో గంటకు పైగా భేటీ!
Hyderabad, Telangana:PM Modi Visit CBN Residence: హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసాలను సందర్శించారు. జూబ్లీహిల్స్ పరిసరాల్లోని కూటమి నేతల ఇంటికి వెళ్లి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. రాజకీయ ప్రాధాన్యతతో పాటు వ్యక్తిగత అనుబంధాన్ని చాటుతూ ఈ పర్యటన సాగింది.
ప్రధాని మోదీ తొలుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల పవన్ కల్యాణ్కు సైనస్ సమస్య కారణంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ ఇంటికి వెళ్లిన మోదీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పవన్ నివాసం నుంచి ప్రధాని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. ప్రధానికి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ ఘనస్వాగతం పలికారు. దాదాపు గంటకు పైగా చంద్రబాబు నివాసంలో గడిపిన మోదీ, బాబుతో కలిసి వివిధ రాజకీయ, అభివృద్ధి అంశాలపై కీలక చర్చలు జరిపారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని స్పందన
చంద్రబాబు కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఎన్నో విభిన్నమైన అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం చాలా బాగుంది" అని మోదీ పేర్కొన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ స్వయంగా వీరి ఇళ్లకు వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇది ఇరు పార్టీల మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: "చచ్చేంత వరకు నా మాజీ లవర్స్ను ప్రేమిస్తూనే ఉంటా" విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు
Also Read; కృనాల్ పాండ్యా చొక్కా పట్టుకున్న పూరన్..LSG Vs RCB మ్యాచ్ తర్వాత మైదానంలో డిష్యుం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CM Vijay Trisha: తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష జోక్యం..ఒక్కమాటతో సీఎం విజయ్ క్లారిటీ!
Tamil Nadu:CM Vijay On Trisha: తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా విజయ్ సీఎం అయ్యాక నటి త్రిష పరిపాలనలో జోక్యం చేసుకుంటుందని.. మంత్రి పదవిని ఆమెకు ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి. అయితే వాటిపై సీఎం విజయ్ పరోక్షంగా స్పందించారు.PM Modi Speech: ప్రధానమంత్రి మోదీ మాటకు గొల్లున నవ్విన సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్..
Hyderabad, Telangana:PM Modi Offers CM Revanth Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్నారు. తాజాగా హెచ్ఐసీసీలో జరిగిన సభలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ఓ వ్యాఖ్యతో సభ మొత్తం గొల్లున నవ్వింది. అందుకుక సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Explosives in Modi Tour: ప్రధాని మోదీ పర్యటనలో బాంబు కలకలం..నగరం మొత్తం టెన్షన్ టెన్షన్!
Agara, Karnataka:Explosives Found in Modi Tour: బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ పేలుడు పదార్థాల లభ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమ వేదికకు కూతవేటు దూరంలో పేలుడు పదార్థాలు బయటపడటం భద్రతా వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. బెంగళూరు శివార్లలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో జరిగే వేడుకకు ప్రధాని హాజరుకావాల్సి ఉండగా, ఈ ఘటన వెలుగు చూసింది.
ఏం జరిగింది?
ఆదివారం నాడు ప్రధాని మోదీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు తనిఖీల్లో ప్రధాన వేదికకు కేవలం 3 దూరంలో ఉన్న కాగలిపుర సమీపంలోని ఫుట్పాత్ పక్కన రెండు జిలాటిన్ స్టిక్లు లభ్యమయ్యాయి. సమాచారం అందిన వెంటనే బాంబు నిర్వీర్య దళం (BDDS), ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ జిలాటిన్ స్టిక్స్ అక్కడికి ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని క్వారీ పనుల కోసం తెచ్చినవి పొరపాటున అక్కడ పడిపోయాయా? లేదా ప్రధాని పర్యటనను టార్గెట్ చేస్తూ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉంచారా? అనే కోణంలో విచారణ సాగుతోంది.
ఆశ్రమంలో ప్రధాని ప్రసంగం
భద్రతా ముప్పు పొంచి పర్యటన, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆర్ట్ ఆఫ్ లింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. బెంగళూరు కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా, ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రంగా మారిందని ప్రధాని ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణలో వాలంటీర్లు కావాలని కోరుతున్నారు.
ALso Read: ఉద్యోగులకు ఊరట! ఏటీఎం నుంచి PF డబ్బులు విత్డ్రా..తాజాగా అప్డేట్ ఇదే..
Also Read: Pooja Hegde Photos: జిమ్ డ్రస్సులో సెగలు పుట్టిస్తున్న పూజా హెగ్డే..కెవ్వుకేక అంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana CM: 'తెలంగాణపై ప్రధాని మోదీ పెద్ద మనసు చూపాలి: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Revanth Reddy Meets Narendra Modi: 'తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ అందించినట్టు సహకారం మీరు అందించాలి' అని ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కోరారు. ఎన్నికలు ముగిసిపోవడంతో రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధిపై అందరం దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: PM Modi Tour Live Updates: తెలంగాణ అభివృద్ధి మేం పెద్దపీట వేస్తున్నాం: ప్రధాని... లైవ్ అప్డేట్స్
హైదరాబాద్ పర్యటకు వచ్చిన ప్రధానమంత్రి హెచ్ఐసీసీలో తెలంగాణకు సంబంధించిన రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానమంత్రికి స్వాగతం పలికి జ్ఞాపిక అందించిన అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇది వికాస ఉత్సవం. తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకం. మీరు వికసిత్ భారత్ ప్రకటించిన సమయంలోనే మేం 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించాం' అని గుర్తుచేశారు.
Also Read: Bandi Bageerath POCSO: రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్ కొడుకు కేసుపై హరీశ్ రావు నిలదీత
'5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లడానికి ప్రధానమంత్రి వచ్చారు. రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై అందరం దృష్టి సారించాలి' అని తెలంగాణ సీఎం తెలిపారు. '2047 నాటికి దేశ ఎకానమీని 30 ట్రిలియన్లకు చేర్చాలని ప్రధానమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ దేశంలో 10 శాతం ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకానమీ చేరుకోవడమే మా లక్ష్యం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
'ఆరోజు మన్మోహన్ సింగ్లాగా ఇప్పుడు మీ సహకారం కావాలి. దేశంలో 6 నగరాలను గ్రోత్ ఇంజిన్లాగా అభివృద్ధి చేయండి. టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వండి' అని ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. 'దేశం అభివృద్ధి చెందుతున్నంత వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందాలనుకుంటుంది. అందుకు మీ సహకారం కావాలి. మచిలీపట్నం పోర్టు వరకు వేగంగా రైల్వే లైన్ వేయండి. పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వండి. మోడీది పెద్దమనసు అని బండి సంజయ్, కిషన్ రెడ్డి అంటారు. తెలంగాణపై కూడా పెద్ద మనసు చూపించండి' రేవంత్ రెడ్డి కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
MS Dhoni For Peddi: 'పెద్ది' సినిమా కోసం రంగంలోకి ఎంఎస్ ధోనీ..రామ్చరణ్ కోసం గ్రాండ్గా పబ్లిసిటీ!
Hyderabad, Telangana:Dhoni For Peddi Pre-Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతున్న వేళ, సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ లేదా ప్రీ-రిలీజ్ ఈవెంట్కు ధోనీ హజరయ్యే అవకాశం కనిపిస్తోంది.
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా, ఫైనల్గా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. తాజా సమాచారం ప్రకారం.. 'పెద్ది' సినిమా ట్రైలర్ను మే 16న గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఈవెంట్ను తెలుగు రాష్ట్రాల్లో కాకుండా, నార్త్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించనున్నారని తెలుస్తోంది.
ఈ వేడుకకు మాజీ కెప్టెన్ MS ధోని ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందట. రామ్ చరణ్ - ధోని మధ్య ఉన్న స్నేహం, అలాగే ఈ సినిమాలో చరణ్ ఒక రూరల్ క్రికెటర్గా కనిపిస్తారనే ప్రచారం నేపథ్యంలో ధోని రాకకు ప్రాధాన్యత సంతరించుకుంది.
మరో విశేషం ఏమిటంటే.. ఈ ఈవెంట్లో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాలోని 'చికిరి చికిరి' పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్తో యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఇప్పుడు రెహమాన్ స్వయంగా స్టేజ్ మీద సందడి చేయనుండటం అభిమానులకు కన్నుల పండుగే అని చెప్పాలి. నార్త్ ఇండియాలో 'పుష్ప' సాధించిన ఘనవిజయాన్ని దృష్టిలో ఉంచుకుని, 'పెద్ది' సినిమాకు కూడా అక్కడ భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని మేకర్స్ పట్టుబడుతున్నారు. అందుకే బాలీవుడ్ బెల్ట్లో ఈ స్థాయి ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
గమనిక: ధోని రాక, భోపాల్ ఈవెంట్పై ఇంకా చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది ఒక బిగ్గెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్గా మారే అవకాశం కనిపిస్తోంది!
Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..ప్రశాంత్ నీల్ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్..
Also Read: బాలయ్యపై మనసు పారేసుకున్న బాలీవుడ్ బ్యూటీ..'ఆయన వయసుతో పనేముంది' అంటున్న హీరోయిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Petrol Diesel Price Hike: మే 15 నుంచి భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.4 నుంచి రూ.5 వరకు పెంపు?
Hyderabad, Telangana:Petrol Diesel Price Hike News: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మే 15 తర్వాత భారీగా పెరుగుతున్నాయని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. చమురు కంపెనీలు ఆయిల్ ధరలను పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయంపై గతంలో కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
ఎందుకంటే ఇప్పటికే నెలకు రూ.30,000 కోట్ల నష్టాల్లో ఉన్న ఈ కంపెనీలు మే 15 నుంచి ధరలను సవరించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఏమాత్రం పెరగనున్నాయి. దీని వల్ల సామాన్యుడిపై భారం ఎంత మోపనున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశ ప్రజలు మరోసారి ఇంధన ధరల పెంపు భయాన్ని ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. నివేదికల ప్రకారం.. చమురు కంపెనీలు మే 15వ తేదీలోగా కొత్త ధరలను సవరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి లభించిన వెంటనే వాటిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇది సామాన్యుడిపై ఎంతో భారం పడనుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఒక్క బ్యారెల్ ముడి చమురు ధర 120 డాలర్ల మార్కును దాటింది . పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, హోర్మూజ్ జలసంధిలో ముడిచమురు రవాణాలో జాప్యం వంటి కారణాలతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలోనూ దీని ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. దీంతో ఇంధన ధరల పెంపు అనివార్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే పెరిగిన ముడిచమురు ధరల నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు ఉత్పత్తి సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఈ కంపెనీలు ప్రతి నెలా సుమారు రూ.30,000 కోట్ల నష్టాలను భరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నష్టాన్ని అరికట్టేందుకు ఇంధన ధరల పెంపు ఉండబోతోందని తెలుస్తోంది.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు రూ.4 నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే గృహ వినియోగం కోసం ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.40 నుంచి రూ.50 వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర ఇప్పటికే భారీగా పెరిగింది. స్థానికంగా ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.993కి చేరింది. దీని ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు చిరుతిండి వ్యాపారస్తులపై తీవ్ర భారం పడుతోంది. అయితే ఇంధన ధరల పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ధరల పెంపు ఉండబోతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ చర్చకు మరింత బలం చేకూరుతోంది.
Also Read: రూ.5000 షాపింగ్తో రూ.2000 బిల్లు కడితే చాలు! డీమార్ట్లో అదిరిపోయే ఆఫర్లు..
Also Read: మహేష్ బాబు మేనకోడలిని చూశారా? హీరోయిన్లనే మించిన అందం..క్యూట్లో క్వీన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party: బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి: బీఆర్ఎస్ పార్టీ
Hyderabad, Telangana:Bandi Bageerath POCSO Case: 'బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి కొడుకు అని తెలిసినా మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? 13 గంటల పాటు ఓ బాలిక తనకు జరిగిన అన్యాయంపై ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీస్ స్టేషన్లో ఎదురు చూసిందంటే రాష్టంలో పోలీసులు సామాన్యులపై ఎలాంటి వివక్ష ప్రదర్శిస్తున్నారో, పాలక పక్షాలకు కొమ్ము కాస్తున్నారో అర్థం చేసుకోవచ్చు' అని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం అందరికీ సమానమే అనే సూత్రం రాష్ట్రంలో సమాధి అయిందా? అని ప్రశ్నించారు.
Also Read: Bandi Bageerath POCSO: రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్ కొడుకు కేసుపై హరీశ్ రావు నిలదీత
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మదర్స్ డే రోజు హైదరాబాద్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పరేడ్ గ్రౌండ్లో ప్రసంగం ప్రారంభించకముందే బండి భగీరథపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు.
Also Read: Former DGP Wife Case: మాజీ డీజీపీ భార్య హత్యపై పోలీస్ కమిషనర్ కీలక వ్యాఖ్యలు
'బండి సంజయ్ని బర్తరఫ్ చేయకపోతే మోదీ చేసే ప్రసంగాన్ని ఎవరూ పట్టించుకోరు. రేవంత్ రెడ్డి హామీలకే పరిమితయ్యారు.. హోమ్ మంత్రిగా విఫలమయ్యారు. సామాన్య మహిళకు న్యాయం చేయలేకపోతే రేవంత్ హోం మంత్రిగా పనికి రారు. మహిళల ఆర్తనాదాలను మోడీ, రేవంత్ వినాలి' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి హితవు పలికారు. 'డీలిమిటేషన్తో కూడిన మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ప్రధాని మోడీ మహిళలకు ప్రతిపక్షాలు అన్యాయం చేశాయని మాట్లాడారు. మహిళల కోసం ఎంతో చేస్తున్నామని సానుభూతి ప్రదర్శించారు. నరేంద్ర మోదీ మాటలకే పరిమితమని మహిళలపై నేరాలు పెరుగుతున్న స్పందించరని బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు విషయంలో రుజువైంది' అని వివరించారు.
'కేంద్ర, రాష్ట్ర హోమ్ మంత్రులు (బండి సంజయ్, రేవంత్ రెడ్డి) కలిసి కేసును తొక్కిపెట్టే ప్రయత్నాలు చేయడం 2 కోట్ల మంది తెలంగాణ మహిళలను అవమానపరచడమే' అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. 'బండి భగీరథ్ గతంలో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని వీడియో రుజువులు ఉన్నాయి. అవి చూసి కూడా బండి సంజయ్ కొడుకు అమాయకుడని పోలీసులు భావిస్తున్నారా?' అని ప్రశ్నించారు.
'సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కేసులు పెట్టి వేధించి రేవంత్ పోలీసులు ఇంత పెద్ద ఘటనపై నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? కాంగ్రెస్, బీజేపీ నేతలు నేరాలు చేస్తే ఎలాంటి చర్యలు ఉండవా?' అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి నిలదీశారు. 'బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగితే ఈ కేసు నీరుగారే అవకాశం ఉంది. మహిళలపై మోడీకి ఏ మాత్రం గౌరవం ఉన్నా హైదరాబాద్లో ప్రవేశించక ముందే బండి సంజయ్ను మంత్రివర్గం నుంచి తప్పించాలి' అని డిమాండ్ చేశారు.
‘బేటీ బచావో.. బేటీ పఢావో’ కేవలం నినాదాలకే పరిమితం అయ్యాయి
తెలంగాణలో కావొచ్చు.. దేశంలో కావొచ్చు.. ఆడబిడ్డలకు ప్రధాని మోదీ రక్షణ కల్పించడం లేదు
ప్రభుత్వం మీదే కదా.. బండి సంజయ్ని బర్తరఫ్ చేయండి, కొడుకు భగీరథ్పై చర్యలు తీసుకోండి pic.twitter.com/NocB2VE37z
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 10, 2026
'బీజేపీకి ఏ మాత్రం విలువలు ఉన్నా బండి సంజయ్ కొడుకుపై చర్యలు తీసుకోవాలి. పేట్ బషీరాబాద్ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి' అని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరారు. 'ప్రియాంక గాంధి మహిళనే కదా.. సాటి మహిళపై అత్యాచారం జరిగితే స్పందించారా? రేవంత్ రెడ్డిని ఆదేశించే స్థితిలో లేరా? రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణ మహిళలపై జరుగుతున్న నేరాలు పట్టవా?' అని సందేహం వ్యక్తం చేశారు. బీజేపీ కాంగ్రెస్ ఫెవికాల్ బంధం బండి సంజయ్ కొడుకు పోక్సో కేసులో బట్టబయలైందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బండి కొడుకు భగీరథ్ను పోక్సో కేసు నుంచి రక్షించాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని.. కానీ బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
RCB Vs MI Preview: బెంగళూరు Vs ముంబై..ఈ మ్యాచ్తో ప్లేఆఫ్స్కు వెళ్తారా? అస్సాం ట్రైన్ ఎవరు ఎక్కుతారు?
Atal Nagar-Nava Raipur, Chhattisgarh:RCB Vs MI Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నేడు మరో రసవత్తరపోరు జరగనుంది. ఈరోజు జరగనున్న రెండో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించిన ముఖాముఖి రికార్డు, ప్లేయింగ్ XI, పిచ్ నివేదిక, వాతావరణ పరిస్థితులు వంటి విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీతో పాటు ముంబై జట్టులోని రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టులో చేరనున్నారని తెలుస్తోంది. పాయింట్ల పట్టిక ప్రకారం చూస్తే, డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఉన్న ఆర్సీబీ జట్టు 10 మ్యాచ్లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి 4వ స్థానంలో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన 10 మ్యాచ్లలో కేవలం మూడు విజయాలతో 6 పాయింట్లు మాత్రమే సాధించి 9వ స్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం, ముఖ్యంగా ముంబై జట్టుకు ఇది అత్యంత ముఖ్యమైన మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓడిపోతే వారు ప్లేఆఫ్ రేసు నుండి పూర్తిగా నిష్క్రమించే ప్రమాదం ఉంది. మరోవైపు, ఈ ఐపీఎల్ సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ముంబై జట్టుపై విజయం సాధించి ప్లేఆఫ్స్ మార్గం సుగమం చేసుకోవాలని ఆర్సీబీ యోచిస్తుంది.
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 35 మ్యాచ్ల్లో తలపడగా.. అందులో ముంబై 19 సార్లు గెలుపొందగా.. ఆర్సీబీ 16 సార్లు విజేతగా నిలిచింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ఆర్సీబీపై ముంబై జట్టు పైచేయి ఉందని తెలుస్తోంది. కానీ, ఈ సీజన్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించడం గమనార్హం.
ఈ వేదికలోని పిచ్, ముఖ్యంగా రాత్రిపూట జరిగే మ్యాచ్ల్లో బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. నేడు జరగబోయే మ్యాచ్లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, వేగాన్ని సమర్థవంతంగా మార్చగల పేసర్ ఈ పిచ్పై ఎక్కువ వికెట్లు పడగొట్టే అవకాశం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్.
ముంబై ఇండియన్స్ తుదిజట్టు అంచనా..
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రిక్లెటన్, సూర్యకుమార్ యాదవ్, కేశవ్ మహారాజ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్, కార్బిన్ బాష్.
Also Read: Vijay Telugu Speech: తమిళనాడు సీఎం విజయ్ తెలుగు స్పీచ్ అదరగొట్టాడు..సోషల్
Also Read: Avika Gor Bangkok: దేశం వదిలివెళ్లిన తెలుగు హీరోయిన్..అన్నీ బ్యాంకాక్ నుంచే చేస్తుందట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bandi Bageerath POCSO: రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్ కొడుకు కేసుపై హరీశ్ రావు నిలదీత
Baddipadaga, Telangana:Bandi Sai Bageerath POCSO Case: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు దేశవ్యాప్తంగా.. తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బండి భగీరథ్ను రెండు రోజులైనా అరెస్ట్ చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సంఘటనపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ తెలంగాణ పోలీసులను.. బండి సంజయ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.
Also Read: Former DGP Wife Case: మాజీ డీజీపీ భార్య హత్యపై పోలీస్ కమిషనర్ కీలక వ్యాఖ్యలు
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సోపై 'ఎక్స్' వేదికగా హరీశ్ రావు స్పందించారు. 'బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని నిలదీశారు. హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: DC vs KKR Highlights: సెంచరీతో ఢిల్లీని ఫినీష్ చేసిన ఫిన్ అల్లెన్.. కలకత్తా విజయం
'తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను అరెస్ట్ చేయాలని.. బండి సంజయ్ రాజీనామా చేయాలని కోరుతూ తెలంగాణలో నిరసనలు ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పొక్సో కేసు నమోదు చేసిన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను మహిళలు ముట్టడించారు. వెంటనే బండి భగీరథ్పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. కుత్బుల్లాపూర్ నివాసి మైనర్ బాధితురాలికి అండగా ప్రభుత్వం ఉండాలని కోరారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ మహిళలు నినాదాలు చేశారు.
డీజీపీ ఆఫీస్ ముట్టడి
బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని డీజీపీ ఆఫీస్ను బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ముట్టడించారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?
కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి @revanth_anumula దీనికి సమాధానం చెప్పాలి.
రాష్ట్రంలో కాంగ్రెస్,…
— Harish Rao Thanneeru (@BRSHarish) May 10, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant Python Video: భారీ కొండచిలువకు సబ్బు పెట్టి స్నానం చేయించిన తండ్రీకూతుళ్లు.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Giant Python Video Watch Here: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు.. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత భారీ సర్పములో ఒకటైన కొండచిలువను పట్టుకోవాలన్నా.. దాని దరిదాపుల్లోకి వెళ్లాలన్న గుండె ధైర్యం ఉండాల్సిందే. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం మీ కళ్ళు బైర్లు కమ్ముకపోవడం ఖాయం.. అంతేకాకుండా మీరు ఆశ్చర్య పోవడం తథ్యం.. ఒక వ్యక్తి ఏకంగా భారీ కొండచిలువకు ఇంట్లో పెంపుడు జంతువుకు చేసినట్లుగా సబ్బు పెట్టి స్నానం చేయిస్తున్నాడు..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక వ్యక్తి తన ఇంటి ముందు ఒక భారీ కొండచిలువను పడుకోబెట్టాడు.. అది ఎంత పొడవు ఉందంటే దానిని చూస్తేనే ఒళ్లంతా పాములు పాకినట్లు అనిపిస్తుంది.. ఆ వ్యక్తి చాలా సాధారణంగా ఒక మగ్గుతో నీళ్లు పోస్తూ.. ఆ పాము శరీరంపై సబ్బు రుద్దుతూ స్నానం చేయిస్తున్నాడు.. అంతటితో ఆగకుండా.. అతని పక్కనే ఉన్న చిన్నారి కూడా ఏమాత్రం భయం లేకుండా ఆ పాముకు ఒక చిన్న జగ్గుతో నీటిని పోయడం మీరు వీడియోలో క్లియర్ గా చూడొచ్చు..
ఆ కొండచిలువ కూడా చిన్నారిని కానీ.. దానికి స్నానం చేయిస్తున్న వ్యక్తిని కానీ ఏమీ అనకుండా చాలా ప్రశాంతంగా ఉండడం గమనార్హం.. సాధారణంగా కొండచిలువలు విషపూరితం కానప్పటికీ.. కవితమ్మ శరీరంలో గట్టిగా చుట్టేసి ఎముకలను విరగొట్టగలుగుతాయి.. అటువంటి క్రూరమైన వన్యప్రాణితో ఒక చిన్నారి ఆడుకోవడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.. అయితే, అక్కడే ఉన్న కొంతమంది దీనిని వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన కొద్దిసేపటికి మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించుకుంది. అంతేకాదు ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆ వ్యక్తి ధైర్యాన్ని మెచ్చుకుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ధైర్యం కాదు.. ముమ్మాటికి మూర్ఖత్వమే.. పెంపుడు జంతువు ఏదైనా సరే.. అది క్రూరమృగం అన్న విషయం మర్చిపోకూడదు అని కొంతమంది కామెంట్ చేస్తూ వస్తున్నారు.. అలాగే మరికొందరు చిన్నారి ప్రాణాలతో ఆ తండ్రి చెలగాటమాడుతున్నాడు.. ఇలాంటి పనులు అస్సలు ప్రోత్సహించకూడదని కొంతమంది రాస్కొస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Kondagattu: కొండగట్టులో మొదలైన అంజన్న పెద్ద జయంతి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న క్షేత్రం!
Hyderabad, Telangana:Kondagattu Anjanna Pedda Jayanti 2026: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, భక్తుల ఇష్టాదైవం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు నేటి నుంచి అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పురుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరావడంతో అంజన్న క్షేత్రం జైశ్రీరామ్.. జై హనుమాన్ నామస్మరణతో మారు మోగింది.. పెద్ద జయంతి సందర్భంగా ఈ సమయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.. కాబట్టి ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి కష్టాలు కలగకుండా ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఒక ముఖ్య ఘట్టం ఆవిష్కృతమైంది.. భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించే కార్యక్రమం భక్తుల భక్తి శ్రద్దల మధ్య సాగింది. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ పట్టు వస్త్రాలను తలమీద పెట్టుకొని మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు..
ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకర్షింపచేశాయి.. స్థానిక, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన తీరు అందర్నీ ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. కేసరి సందడి వేషాధారణలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. పెద్ద జయంతి సందర్భంగా 41 రోజుల హనుమాన్ దీక్షను చేపట్టిన మాలదారులు పెద్ద సంఖ్యలో కొండగట్టుకు చేరుకుంటున్నారు..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులతో పాటు పోలీసులు ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రత్యేకమైన క్యూలైన్లలో భక్తులకు మంచినీటితో పాటు మజ్జిగ సౌకర్యాలను కల్పించినట్లు కూడా సమాచారం.. మరో రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. రేపు స్వామివారికి విశేష అభిషేకంతో పాటు ఎల్లుండి పూర్ణ హారతితో ఈ వేడుక ముగుస్తుంది. ఈ ఆధ్యాత్మిక సంబరంతో కొండగట్టు పరిసర ప్రాంతాలని పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
