icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505401
SShankerreddyFollow6 Sept 2024, 06:41 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. పాత పింఛన్‌ స్కీమ్‌ వర్తింపు

Nuzendla, Andhra Pradesh:

పాత పింఛన్‌ పథకంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు పాత పింఛన్‌ పథకం వర్తిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పింఛన్‌ విధానం (కాంట్రిబ్యూటరీ పింఛ్‌ స్కీమ్‌) వర్తింపు ఉన్న ఉద్యోగులకు పాత పింఛన్‌ అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాత పింఛన్‌ పథకం అమలుకు నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞలు చెబుతున్నారు.

అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో రిటైర్మెంట్‌ వయస్సు పెంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. 60 నుంచి 62 ఏళ్ల వరకు పదవీ విరమణ వయస్సును కొన్ని శాఖల ఉద్యోగులకు ప్రభుత్వం పెంచింది. ఇక పాత పింఛన్‌ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2004 సెప్టెంబర్‌ కంటే ముందు జారీ అయిన వివిధ నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్‌ను వర్తింపచేస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో 11 వేల మంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి పాత పెన్షన్ స్కీమ్ పరిధిలోకి  తీసుకురానుంది. ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగుల ఆర్థిక, సామాజిక భద్రతకు ప్రభుత్వ నిర్ణయం భరోసా కల్పించనుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆమోదం పొందిన అంశాలతోపాటు గతంలోనూ ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 01-09-2004కు ముందు నోటిఫికేషన్లు జారీ అయ్యి.. అనంతరం ప్రభుత్వ సేవలో చేరిన ఉద్యోగులను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్‌) నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్‌) పరిధిలోకి తీసుకురావాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం స్వాగతించింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సుమారు 11,000 మంది ఉద్యోగులు లబ్ధి పొందనుందని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. వారి పదవీ విరమణ అనంతర జీవితానికి, కుటుంబానికి ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ కల్పించే దిశగా ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా నిలుస్తుంది.

రాష్ట్రంలోని లక్షలాదిమంది సీపీఎస్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా దేశంలోనే తొలిసారిగా గ్రాట్యుటీ, చనిపోయిన సీపీఎస్‌ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ వంటి చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఏపీ సచివాలయ సంఘం గుర్తు చేసింది. ఉద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మిగిలిన సీపీఎస్‌ ఉద్యోగులందరికీ కూడా ఓపీఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

0
0
Report

తుంగభద్రకు పునరుజ్జీవం.. ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో 25న తుంగభద్ర గేట్లు ప్రారంభం

Hosapete, Karnataka:

Tungabhadra Dam Gates Open: మూడు రాష్ట్రాల మధ్య పారుతున్న తుంగభద్ర నదిపై ఏర్పాటుచేసిన ప్రాజెక్టు గేట్లను ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రారంభించనున్నారు. ఎల్లుండి జరగనున్న తుంగభద్ర డ్యామ్‌ గేట్ల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతేడాది వచ్చిన వరదలకు తుంగభద్ర డ్యామ్‌ గేట్ కూలిపోవడంతో ఆ ప్రాజెక్టును కొత్తగా బిగించారు. డ్యామ్‌ గేట్ల పనులు పూర్తవడంతో తుంగభద్ర డ్యామ్‌ తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు వర ప్రదాయినిగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు తిరిగి పూర్వ వైభవం సంతరించుకోనుంది. కొత్తగేట్ల అమరికతో సరికొత్త రూపుదిద్దుకున్న తుంగభద్ర ప్రాజెక్టు ఎల్లుండి అంటే గురువారం ప్రారంభం కానుంది. రూ.51 కోట్ల వ్యయంతో మొత్తం 33 గేట్ల ఏర్పాటు పనులు పూర్తికాగా.. వీటిని ఈ నెల 25వ తేదీన కర్నాటక ముఖ్యమంత్రి శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తోపాటు తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 

ఏడు దశాబ్దాల కిందట నిర్మించిన తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. తెలంగాణలో కొన్ని వేలల్లో జీవనాడీగా నిలుస్తోంది. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. ఆ సమయంలో నీటి వృథాను అడ్డుకునేందుకు సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలో తాత్కాలికంగా స్టాప్‌లాక్ గేటును బిగించారు. స్పిల్ వే గేట్లు అన్నీ మార్చాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఇవ్వడంతో కొత్త గేట్లు అమర్చారు. 6 నెలల్లో కొత్త గేట్లను అమర్చడంతో ఏపీ-కర్నాటక రాష్ట్రాల్లో తుంగభద్ర ప్రాజెక్టుకు పునరుజ్జీవం పోసుకుంది.

ఏపీలో లక్షల ఎకరాలకు నీరు
కృష్ణానది ఉప నది తుంగభద్ర నది కర్ణాటక నుంచి ఏపీతోపాటు తెలంగాణలో కొంత భాగం పారుతుంది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతోంది. ఈ ప్రాజెక్టు ఏపీ, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు కీలకంగా ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు కింద ఏపీలో 1.46 లక్షల హెక్టార్లకు సాగునీరు లభిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగు నీరు అందుతోంది. 25వ తేదీన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని హోస్‌పేటలో జరిగే బహిరంగ సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉంది.

0
0
Report

రేపే జొన్నగిరిలో గోల్డ్‌ మైనింగ్‌ ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు 'బంగారం'లాంటి వార్త

Jonnagiri, Andhra Pradesh:

400 KGs Jonnagiri Gold Mines: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఇది బంగారం లాంటి వార్త. బంగారం ధరలు భారీగా పెరుగుతుండగా.. ఇకపై అతి తక్కువకే ఏపీలో లభించే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీలో ఒక అతి పెద్ద బంగారం గని ప్రారంభం కానుంది. కరువు ప్రాంతానికి కేరాఫ్‌గా నిలిచే రాయలసీమలోని కర్నూల్‌ జిల్లాల్లో జొన్నగిరి బంగారం గనుల తవ్వకాలకు కీలక ముందడుగు పడనుంది. జొన్నగిరిలోని బంగారు గనుల వద్ద గోల్డ్‌ మైనింగ్‌ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం రేపు ప్రారంభించనుంది.

బంగారు నిక్షేపాలు
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారు గనులు బయటపడిన విషయం తెలిపింది. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సర్వేలు, పరీక్షలు చేసిన అనంతరం ఇక్కడ బంగారం తవ్వకాలకు అనువుగా ఉందని.. ఇక్కడ బంగారు నిక్షేపాలు భారీగా ఉన్నాయని గుర్తించారు. దీంతో జొన్నగిరిలో బంగారు గనులు త్వరలోనే ప్రారంభం కానుంది. జొన్నగిరి ప్రాంతం బంగారం ఉత్పత్తికి ప్రధాన వేదిక కానుండడ విశేషం.

అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు
దేశంలోనే ప్రైవేట్ రంగంలో అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు జొన్నగిరిలోనే ఏర్పాటవుతోంది. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు రూ.405 కోట్లు పెట్టుబడి పెట్టి ఇక్కడ బంగారు నిక్షేపాలు వెలికితీయనున్నాి. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌కు ప్రభుత్వం 1,500 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రస్తుతం మొదటి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు జరగనుండగా దీనికి తగ్గట్టు ప్రాసెసింగ్ ప్లాంట్లు నెలకొన్నాయి. తొలి ఏడాదికి 400 కిలోల బంగారం పసిడిని ఉత్పత్తి చేయనున్నారు. రెండో దశలో మిగిలిన ప్రాంతంలో ఈ ప్లాంట్‌ను విస్తరించనున్నారు. వచ్చే ఏడాది నుంచి 900 కిలోల బంగారం ఉత్పత్తి చేయడం లక్ష్యం.

రాష్ట్రానికి రాయల్టీ
ప్రతి సంవత్సరం బంగారం ఉత్పత్తి పెంచుతూ ఏడాదికి 2 టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేయడం ప్రధాన లక్ష్యం. ఈ ప్లాంట్ ద్వారా 700 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన బంగారం ధరలో 4 శాతం రాష్ట్రానికి రాయల్టీగా వస్తుండడంతో ఏపీలో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. తొలిసారి తీసే 400 కిలోల బంగారానికి రూ.57 కోట్లు రాయల్టీ రూపేణా ఏపీ ప్రభుత్వానికి దక్కనుండగా.. తర్వాత వెలికితీసే 900 కిలోల బంగారానికి రూ.144 కోట్ల వరకూ రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం లభించే అవకాశం ఉంది.

రేపు ప్రారంభం
జొన్నగిరిలో ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రేపటి నుంచి జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇక్కడ బంగారం తవ్వకంపై ట్రయల్ రన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. బంగారం గనుల తవ్వకం చేపడుతుండడంతో రాయలసీమ ప్రాంతం అభివృద్ధిలో సింహ భాగం కానుంది.

0
0
Report
Advertisement

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు పెంపు.. 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం

Amaravathi, Andhra Pradesh:

Govt Employees Retirement Age Increase: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వయస్సు పెంపు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కాకుండా గురుకులాలు, సొసైటీ ఉద్యోగులకు మాత్రమే పెంచారు. మరో రంగ ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మెమో.57 ప్రకారం 2004కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 11 వేల మంది ఉద్యోగులకు సీపీఎస్‌ నుంచి పాత పింఛన్‌ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా 85కి పైగా కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన , మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా మంత్రిమండలి సమావేశంలో పలు ప్రతిపాదనలను తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

పారిశ్రామిక రంగం ప్రోత్సాహం కోసం మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. నాయుడుపేటలో రూ.10 వేల కోట్లకు పైగా అంచనాతో ప్రీమియర్ ఎనర్జీ విస్తరణ, ప్రకాశం జిల్లాలో రూ.1,230 కోట్ల జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్రాజెక్టు, తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాల సవరణలపై మంత్రిమండలిలో చర్చ జరిగింది. అనకాపల్లిలో రూ.2,788 కోట్లతో CtrlS డేటా సెంటర్, విశాఖలో సిఫీ డేటా సెంటర్‌కు అదనపు భూముల కేటాయింపు, విశాఖలో ఇన్ఫీక్స్‌ ఐటీ క్యాంపస్ ద్వారా 4 వేల ఉద్యోగాల కల్పన, విజయనగరంలో పతంజలి ఫుడ్ పార్క్‌కు 70 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ వర్గాల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. వాస్తవంగా పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేయడం లేదు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు స్వాగతించడం లేదు. రిటైర్మెంట్‌ వయస్సును పెంచడంతో ఉద్యోగ వర్గాల్లో కొంత మంది అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే పని ఒత్తిడితోపాటు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న తమకు పదవీ విరమణ వయస్సు పెంపుతో ఉద్యోగం భారంగా మారుతుందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. పదవీ విరమణ వయస్సు పెంపుతో తమకు అన్యాయం జరుగుతుందని నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎప్పటికప్పుడు ఉద్యోగులు విమరణ పొందుతుంటే తమకు అవకాశాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. ఇప్పుడు రిటైర్మెంట్‌ వయస్సు పెంపుతో తమకు ఉద్యోగాలు ఎక్కడ? లభిస్తాయని ప్రశ్నిస్తున్నారు.

0
0
Report

సాయికృష్ణ కేసులో నిందితుల‌ను కాపాడ‌టమే ల‌క్ష్యంగా సిట్ విచార‌ణ‌: అంబటి రాంబాబు

Guntur, Andhra Pradesh:

Sai Krishna Case: కాపు యువ‌కుడు గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్‌కు గురయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు వదిలిపెట్టడం లేదు. మరోసారి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. నిందితులను కాపాడడమే లక్ష్యం సిట్‌ విచారణ జరుగుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే కృష్ణ‌లంక‌ పీఎస్ సీసీ టీవీ ఫుటేజ్‌లు మాయమయ్యాయని తెలిపారు.

గుంటూరు లోని త‌న క్యాంప్ కార్యాల‌యంలో మంగళవారం మీడియాతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'సీఐ నాగ‌రాజును ఇంత‌వ‌ర‌కు ఎందుకు అరెస్ట్ చేయ‌లేదు? కేసు న‌మోదైన మ‌రుక్ష‌ణ‌మే ఆయ‌న్ను అరెస్ట్ చేయాలి క‌దా? సీఐ నాగ‌రాజును అరెస్ట్ చేయ‌కుండా జ‌న‌సేన అడ్డుకోవ‌డం ఏమిటి? నేర‌స్తుల‌ను నేర‌స్తులుగానే చూడాల‌ని చెప్పే ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్న‌దేమిటి? పోలీసులే నేర‌స్తుల‌ను చంపేస్తుంటే న్యాయ‌స్థానాలు ఉన్న‌ది దేనికి?' అని ప్రశ్నలు కురిపించారు.

'సీఐ నాగరాజుని అరెస్ట్ చేయ‌క‌పోతే సాక్ష్యాధారాలు మాయం చేస్తాడ‌ని చెబుతూనే ఉన్నాం. చివ‌రికి మేం అనుమానించిన‌ట్టుగానే ఫుటేజ్‌లు మాయం చేశారు. సీబీఐ విచార‌ణ చేస్తే త‌ప్ప అస‌లైన నిందితుల‌కు శిక్ష ప‌డ‌దు' అని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు స్ప‌ష్టం చేశారు. ఈ కేసులో ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న సీఐ నాగ‌రాజు మీద కేసు న‌మోదు చేసిన మ‌రుక్ష‌ణ‌మే అరెస్ట్ చేయ‌కుండా ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం పోలీస్ స్టేష‌న్‌ల‌లో 18 నెల‌ల పాటు సీసీటీవీ ఫుటేజీలను నిల్వ చేసి ఉంచాల‌నే నిబంధ‌న ఉల్లంఘించార‌ని తెలిపారు. 

'సీఐ నాగ‌రాజును అరెస్ట్ చేసి ఉంటే ఆ ఫుటేజీ మాయమయ్యేదే కాదు. ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం పోలీసుల‌ను పోలీసులే కాపాడే కుట్ర‌లో భాగంగా స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతున్నారు. లాక‌ప్‌డెత్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఐని కాపాడ‌టానికి ధ‌ర్నాలు చేస్తున్న జ‌నసేన నాయ‌కుల‌ను ఎందుకు అడ్డుకోలేదు' అని పవన్‌ కల్యాణ్‌ను మాజీ మంత్రి అంబి రాంబాబు ప్ర‌శ్నించారు. 'సాయికృష్ణ‌ను లాక‌ప్‌లో చంప‌డ‌మే కాకుండా శ‌వాన్ని ఇవ్వ‌కుండా కాల్చేసి బూడిద కూడా దొర‌క్కుండా మాయం చేయ‌డం, సీసీటీవీ ఫుటేజీలు తుడిచేయ‌డం, ఇలా వ‌రుస‌పెట్టి త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూనే ఉన్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు సీబీఐ విచార‌ణ చేస్తే త‌ప్ప నిందితుల‌కు శిక్ష పడ‌ద‌ని స్పష్టం చేశారు. 

'మొద‌ట్నుంచి పోలీస్ క‌మిష‌న‌ర్ పాత్ర‌పై అనుమానాలు వ్య‌క్తం  చేస్తున్నా ప్ర‌భుత్వం ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. చివ‌రికి మేం చెప్పిందే జ‌రిగింది. కేసు న‌మోదు చేసిన మ‌రుక్ష‌ణ‌మే నేరారోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీఐ నాగ‌రాజును అరెస్ట్ చేయాల్సింది' అని మాజీ మంతరి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. నేర‌స్తులు ఏ కులం వారైనా శిక్షించాలి, నేర‌స్తుల‌ను నేర‌స్తులుగానే చూడాల‌న్న ప‌వ‌న్ కల్యాణ్ వ్యాఖ్య‌లతో తాను క‌చ్చితంగా ఏకీభ‌విస్తున్నట్లు ప్రకటించారు. కాపు యువ‌కుడి లాక‌ప్ డెత్ కు కార‌ణ‌మైన సీఐ నాగరాజును అరెస్ట్ చేయొద్ద‌ని జ‌న‌సేన నాయ‌కులు ధ‌ర్నాలు చేయ‌డం సిగ్గుచేటు అని మండిపడ్డారు. 'నేర‌స్తుడికి వంత‌పాడుతూ జనసేన పార్టీ నాయకులు క‌ల్లు తాగిన కోతులు మాదిరిగా డ్యాన్సులేస్తున్నారు. పోలీసుల అప్ర‌జాస్వామిక విధానాల‌కు వంత‌పాడుతున్నారు' అని విమర్శించారు.

సాయికృష్ణ కేసుకి మేక‌ప్ వేసే కార్యక్ర‌మం జ‌రుగుతోందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు. సాయికృష్ణ కేసులో తూతూమంత్రంగానే సిట్ విచార‌ణ జ‌రుగుతోందని.. కేసు నమోదు చేసిన నాటి నుంచే ఎక్క‌డా ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రించ‌డం లేదని అంబ‌టి రాంబాబు విమర్శలు చేశారు.

0
0
Report
Advertisement

Flipkartలో రూ.98 వేల TCL 55-ఇంచ్ 4K మినీ LED స్మార్ట్ టీవీ.. కేవలం రూ.39 వేలకే!

Hyderabad, Telangana:

TCL 55 inch Mini LED TV Flipkart Offers: ప్రస్తుతం భారత మార్కెట్‌లో కూడా TCL హవా కొనసాగుతూ వస్తుంది. అత్యంత తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌టీవీలను విక్రయించడంలో ఈ కంపెనీ ముందుంది. అలాగే ఈ స్మార్ట్‌టీవీలు చాలా తక్కువ ధరతో రావడంతో మిడిల్ క్లాస్ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు TCL కంపెనీ కొత్త కొత్త ఫీచర్లతో మంచి మంచి టీవీలను విడుదల చేస్తూ వస్తోంది. అయితే మీరు కూడా ఎప్పటినుంచో ఇదే బ్రాండ్‌కు సంబంధించిన టీవీ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? 

55 అంగుళాలు కలిగిన TCL స్మార్ట్‌టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్స్‌తో లభిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడే దీనిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఎన్నో రకాల స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే ఇది మార్కెట్లో ఇప్పుడు 55Q6CS మోడల్ నెంబర్‌తో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకుందాం..

TCL 55Q6CS (55 ఇంచుల) Ultra HD (4K) Mini LED Smart గూగుల్ స్మార్ట్‌టీవీ ఫీచర్స్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..55 ఇంచులు (139 సెం.మీ) 4K Ultra HD (3840 x 2160 పిక్సెల్స్) డిస్ప్లేన్ కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది సాధారణ LED ల కంటే మెరుగైన బ్రైట్‌నెస్ తో కూడిన QD-Mini LED సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. 

అంతేకాకుండా ఇందులో 312+ లోకల్ డిమ్మింగ్ జోన్లు ఉండటం వల్ల స్క్రీన్‌పై లైటింగ్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది.  అలాగే కంపెనీ ఎంతో ప్రత్యేకమైన AiPQ Processor ను అందిస్తూ వస్తోంది. దీంతోపాటు Dolby Vision, HDR10+, HLG తో పాటు IMAX Enhanced సర్టిఫికేషన్ కలిగి ఉంది. దీనివల్ల థియేటర్ లాంటి అనుభూతి లభిస్తుంది.  అదేవిధంగా 40 Watts పవర్ఫుల్ ఆడియో సపోర్టు కూడా అందుబాటులో ఉంది. ఇందులో కంపెనీ సౌండ్ కోసం బిల్ట్-ఇన్ సబ్‌వూఫర్ అందించడమే కాకుండా ONKYO 2.1 Hi-Fi స్పీకర్స్ సిస్టంను అందిస్తోంది. అలాగే చాలా ప్రత్యేకమైన Dolby Atmos, DTS ప్రీమియం సౌండ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది Google TV ఆపరేటింగ్ సిస్టంతో అందుబాటులోకి వచ్చింది. దీని ఇంటర్ఫేస్ ఎంతో అద్భుతంగా ఉంటుంది.

దీంట్లో కంపెనీ వాయిస్ కంట్రోల్ ఆప్షన్ కూడా అందిస్తోంది..హాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ (Google Assistant), బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, ఎయిర్‌ప్లే సపోర్ట్ కూడా అందుబాటులో ఉండడం విశే. అలాగే గేమింగ్ చేసే వాళ్ళకి కంపెనీ గేమింగ్ మాస్టర్ మోడ్ ను కూడా అందుబాటులో ఉంచింది.. ఇవే కాకుండా ఇందులో కంపెనీ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ వస్తుంది.. ఇక ఈ టీవీకి సంబంధించిన ధర, ఇతర వివరాల్లోకి వెళ్తే.. కంపెనీ మార్కెట్లో దీనిని MRP ధర రూ.98,9990 లకు విక్రయిస్తోంది. అయితే ఇప్పుడే దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ఏకంగా 54 శాతం వరకు స్పెషల్ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.45,990 లకే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఈ టీవీ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో ఫ్లిప్‌కార్ట్‌అనుసంధాన యాక్సిస్ బ్యాంకుతో పాటు ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.4,990 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ.3,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించే వారికి రూ.3 వేల బోనస్ లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.39 వేల లోపే పొందవచ్చు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Kondagattu: కొండగట్టు అంజన్న ఆలయంలో ఘోరం.. EO డ్రైవర్ చేతికి క్యాష్ కౌంటర్..

Hyderabad, Telangana:

Kondagattu Temple Controversy Latest News: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో మరో వివాదం చెలరేగింది.. ప్రతిరోజు లక్షలాది రూపాయల ఆదాయం వచ్చే ఆలయ టికెట్ క్యాష్ కౌంటర్లు ఒక ప్రైవేటు వ్యక్తి తిష్ట వేసి నగదు లావాదేవీలు నిర్వహించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యక్తిగత కారు డ్రైవర్.. ఏకంగా అంజన్న ఆలయ అధికారిక క్యాష్ కౌంటర్లో కూర్చొని భక్తులకు టికెట్లు ఇస్తూ.. డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై భక్తులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

అధికారిక కౌంటర్‌లో ప్రైవేట్ వ్యక్తికి ఏం పని?
స్వామి వారి దర్శనంతో పాటు పూజ, ప్రసాదాల కోసం ప్రతిరోజు వేలాదిమంది భక్తులు కొండగట్టుకు తరలివస్తు ఉంటారు.  దీని ద్వారా ఆలయ కౌంటర్లకు భారీగా నగదు అందుతుంది.. అత్యంత పారదర్శకంగా.. కేవలం ప్రభుత్వం లేదా దేవస్థాన అధికారిక సిబ్బంది మాత్రమే నిర్వహించాల్సిన ఈ బాధ్యతయుతమైన సీట్ లో.. ఈవో సొంత డ్రైవర్ కూర్చోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. దేవస్థాన నియమావళి ప్రకారం ఎలాంటి అర్హతలేని ఒక ప్రైవేటు వ్యక్తి. ప్రభుత్వం సొమ్ముతో కూడిన క్యాష్ కౌంటర్ లో ఎలా కూర్చుంటాడని.. దీనికి ఈవో పరోక్షంగా అనుమతి ఇచ్చారా? అని భక్తులతో పాటు కొంతమంది ఆలయ అధికారులు ప్రశ్నిస్తున్నారు..

క్రింది స్థాయి సిబ్బందిపై దురుసు ప్రవర్తన..
ఈవో అండా చూసుకొని.. సదర్ డ్రైవర్ ఆలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వెలువెత్తుతూ వస్తున్నాయి.. ఆలయంలో పనిచేసే ఇతర కిందిస్థాయి శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల పట్ల అతను అత్యంత దురుసుగా ప్రవర్తిస్తున్నాడని.. ప్రశ్నించిన వారిని ఈవో పేరు చెప్పి.. బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆలయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది..

బాధిత భక్తులు, స్థానికుల ఆగ్రహం..
భక్తులు సమర్పించే కానుకల తో పాటు టికెట్ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావడంలేదని.. ఒక ప్రైవేటు డ్రైవర్ చేతికి క్యాష్ కౌంటర్ అప్పగించడం ఏంటి? అక్కడ ఎంత పెద్ద కుంభకోణం జరుగుతుందో ఊహించవచ్చని.. దీని వెనకాల పెద్దల హస్తం కచ్చితంగా ఉందని భక్తులు అనుమాన పడుతున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

ఉన్నతాధికారుల విచారణకు డిమాండ్..
పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అక్రమాలపై హిందూ బంధువులతో పాటు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ ఉన్నత అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి.. వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారానికి బాధ్యుడైన సదరు డ్రైవర్ను ఆలయ ప్రాంగణం నుంచి తొలగించడమే కాకుండా.. అతనికి సహకరించిన అధికారులపై కూడా శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Vemulawada: రాజన్న క్షేత్రంలో నిలువు దోపిడీ.. కొబ్బరికాయ కొట్టాలన్నా జేబులు ఖాళీ కావాల్సిందే!

Hyderabad, Telangana:

Vemulawada Temple Extortion: దక్షిణ కాశిగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ క్షేత్రంలో అక్రమాల దందా మితిమీరిపోతోంది.. స్వామివారిని.. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి అమాయక భక్తులను టార్గెట్గా చేస్తూ కొందరు కేటుగాళ్లు నిలువు దోపిడీకి తెర లేపుతున్నారు.. ముఖ్యంగా ప్రముఖ వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయ ప్రాంగణంలో కొబ్బరికాయలు కొట్టాలంటే.. జేబులు ఖాళీ చేయాల్సిందే అనే విధంగా పరిస్థితి తయారయ్యింది. అధికారికంగా ఎలాంటి రుసుము లేకపోయినప్పటికీ.. భక్తుల నుంచి అడ్డగోలు డబ్బులు గుంజుతుండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది..

రూ.10 నుంచి రూ.50 వరకు డిమాండ్..
దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో పాటు నమ్మకంతో అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు కొబ్బరికాయ కొట్టే చోట చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.. ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ఎలాంటి ప్రభుత్వ లేదా దేవస్థాన రుసుము లేదు.  కానీ.. అక్కడ తిష్ట వేసిన కొందరు ప్రైవేటు వ్యక్తులు తామే సర్వాధికారాలైనట్లు వ్యవహరిస్తున్నారు.. ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టడానికి దాదాపు రూ.10 నుంచి మొదలుకొని.. ఏరా దీన్ని బట్టి రూ.5 వరకు డిమాండ్ చేస్తూ భక్తులను వేధింపులకు గురి చేస్తున్నారు.. డబ్బులు ఇవ్వని పక్షంలో భక్తులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆవేదన వ్యక్తమవుతోంది..

పట్టించుకోని అధికారులు.. భక్తుల ఆగ్రహం..
ఈ అక్రమ వసూళ్ల దందాపై పలువురు భక్తులు ఆలయ అధికారులతో పాటు సిబ్బందికి పదిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని మండిపడుతున్నారు.. అధికారులకు అంతా తెలిసినప్పటికీ మౌనంగా ఉంటున్నారని.. అక్రమార్కులతో అధికారులకు ఏమైనా చేతులు కలిసాయా అనే అనుమానాలు కూడా భక్తులు వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాకుండా చాలామంది భక్తుడు వివిధ సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ.. ఆలయానికి సంబంధించిన EO కూడా రెస్పాండ్ అవ్వకపోవడం వెనక ఏదో ఉందని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

బాధిత భక్తుల ఆవేదన..
వారు ఎంతో భక్తితో అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వస్తే.. ఇక్కడ ప్రతి దానికి దందా చేస్తున్నారని.. కొబ్బరికాయ కొట్టడానికి కూడా రూ.50 అడగడం ఏంటని? దేవస్థానం వారు ఉచితంగా కొట్టి సదుపాయం కల్పించారని.. కాపలా ఉండే సిబ్బంది కూడా వీరిని ఏమీ అనుకోవడం దారుణమని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి దేవస్థాన ఈఓ తో పాటు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.. కొబ్బరికాయలు కొట్టేందుకు ఎలాంటి రుసుము లేదని.. ఎవరికి డబ్బులు ఇవ్వకండి అనే స్పష్టమైన హెచ్చరికల బోర్డులను ఆలయ ప్రాంగణంలో.. ముఖ్యంగా కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్ద వివిధ భాషల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బంద్..

Hyderabad, Telangana:

ABVP School Bandh in Sircilla Latest News: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత విద్యార్థి పరిషత్ ముందడుగు వేసింది.. ప్రభుత్వ పాఠశాలల విలీనంతో పాటు మూసివేత నిర్ణయాలకు వ్యతిరేకంగా.. అలాగే విద్యారంగంలోని పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిరిసిల్ల పట్టణంలో ABVP ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల బందుకు పిలుపునిచ్చారు.. ఈ బంద్ పిలుపుతో పట్టణంతో పాటు సమీప గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలన్నీ పూర్తిగా మూతపడ్డాయి.. ఉదయం నుంచి ఏబీవీపీ నాయకులతోపాటు కార్యకర్తలు పట్టణంలోని వివిధ పాఠశాలల వద్దకు చేరుకొని నిరసన ప్రదర్శనలు చేపట్టారు..

ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకే..
ఏబీవీపీ డిమాండ్లను ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న విద్య వ్యతిరేక విధానాల వల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందని మండిపడ్డారు.. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో పాఠశాలలను విలీనం చేయడం లేదా పూర్తిగా మూసి వేయడం వంటి నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.. ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం కాకుండా.. వాటికి అవసరమైన మౌలిక వసతులను కల్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు..

ప్రధాన డిమాండ్లు ఇవే..
బంద్ సందర్భంగా విద్యార్థి నాయకులు ప్రభుత్వం ముందు పలు కీలకమైన డిమాండ్లను ఉంచినట్లు తెలుస్తోంది.. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటికీ కొన్నిచోట్ల విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందలేవని.. తక్షణమే పుస్తకాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.. ప్రభుత్వ పాఠశాలల్లో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేసి.. పాఠశాలల నిర్వహణను మెరుగుపరచాలని కోరారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తాగునీటితో పాటు మరుగుదొడ్లను, డిజిటల్ క్లాస్ రూమ్స్ వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.  బందులో భాగంగా విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా తరలివచ్చి.. ప్రధాన కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమాలు తెలిపారు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. విద్యార్థి ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేశారు. అన్ని సమస్యలపై స్పందించి విద్యాశాఖ అధికారులు లిఖితపూర్వక హామీ ఇచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ బంద్ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించడం విశేషం..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Pcos Diet: పెరుగుతున్న PCOS ముప్పు.. వంటింటి ఆహారంతోనే చెక్ పెట్టవచ్చంటున్న నిపుణులు!

Hyderabad, Telangana:

Natural Cure For Pcos: నేటి ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలితో పాటు ఒత్తిడి తప్పుడు ఆహార పలవాట్ల కారణంగా మెజారిటీ మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యలను పీసీఓఎస్ ఒకటి.. హార్మోన్ల అసమతుల్యత కారణంగా వచ్చే ఈ సమస్య మహిళల శారీరక, మానసిక అనారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అయితే, ఈ సమస్యకు ఖరీదైన మందుల కంటే.. వంటింట్లో లభించే సమతుల్య ఆహారంతోనే సులభంగా చెక్ పెట్టవచ్చని ప్రముఖ ఆరోగ్య నిపుణులతో పాటు వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు.

ప్లేటులో ఇవి తప్పనిసరిగా ఉండాలి..
పీసీఓఎస్ సమస్యతో బాధపడే ప్రతి ఒక్క మహిళ మార్కెట్లో లభించే కృత్రిమ సప్లిమెంట్ల వైపు వెళ్లకుండా.. ప్రతిరోజు ఇంట్లో వండే సాంప్రదాయ ఆహారాన్ని సమతుల్యంగా తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వారి రోజు డైట్ లో తప్పకుండా కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.. ముఖ్యంగా ఈ సమయంలో తప్పకుండా బాదాంతో పాటు వాల్నట్స్ జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్ను ప్రతిరోజు గుప్పెడు మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు లభిస్తూ ఉంటాయి.

ఈ సమయంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే అన్నాన్ని పూర్తిగా మానేయకుండా.. రోజుకు రెండు గుప్పెళ్ళు మోతాదులో తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఉడికించిన తాజా కూరగాయలతో పాటు చిక్కుడు బీన్స్, ఆకుకూరల పప్పును ఆహారంలో భాగం చేసుకోవలసి ఉంటుందని వారు చెబుతున్నారు. ఇవి శరీరానికి అవసరమైన ఫైబర్‌తో పాటు ప్రోటీన్లని ఎంతగానో అందిస్తూ ఉంటాయి.. అలాగే రోజు కొద్దిగా స్వచ్ఛమైన నెయ్యితో పాటు ఫ్యాట్ లేని పాలను తీసుకోవడం వల్ల హార్మోన్ల నియంత్రణకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు.

వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిందే..
శరీరంలోని ఇన్సులిన్ నిరోధకతను పెంచి.. హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే కొన్ని ఆహార పదార్థాలకు మహిళలకు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిందని వైద్యులు హెచ్చరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో పంచదార, విపరీతమైన నూనెతో చేసిన పదార్థాలు, స్వీట్లు, సమోసాలు, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్లు, కెమికల్స్ ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్ళు, జంక్ ఫుడ్స్ పూర్తిగా పక్కన పెట్టాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇవి శరీర బరువును వేగంగా పెంచి సమతుల్యతను మరింత చెడిపోయేలా చేస్తాయి..

Read more: International yoga day 2026: యోగా దినోత్సవం జూన్ 21 రోజునే ఎందుకు..?.. దీని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏమిటంటే..?

నియమాలు పాటిస్తే.. నియంత్రణ సాధ్యమే..
పీసీఓఎస్ అనేది నయం చేయలేని జబ్బు కాదు.. కేవలం జీవనం శైలి లోపం మాత్రమేనని వైద్యులు భరోసా ఇస్తున్నారు. పైన పేర్కొన్న ఆహార నియమాలతో పాటు ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామాలు లేదా యోగా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు.. అంతేకాకుండా తగినంత నిద్రతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా అదుపులోకి తెచ్చుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారమే హార్మోన్ల సమతుల్యత కు మూలసూత్రమని మహిళలు గుర్తించాలని వారి కోరుతున్నారు..

Read more: International yoga day 2026: యోగా దినోత్సవం జూన్ 21 రోజునే ఎందుకు..?.. దీని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏమిటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Sun And Venus Transit: సూర్య, శుక్రుల నక్షత్ర మార్పు.. మకర రాశితో పాటు ఆ 2 రాశులకు ఇక కోటీశ్వర యోగమే!

Hyderabad, Telangana:

Sun And Venus Transit June 22 Effect On Zodiac: జూన్ 22వ తేదీన సూర్య శుక్ర గ్రహాల మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇవి తమ నక్షత్రాలను మార్చుకున్నాయి. ఈరోజు సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయగా.. శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలోకి సంచారం చేశాడు.. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ధైర్యంతో పాటు సాహసం, ఆనందానికి సూచికగా భావిస్తారు. ఇక శుక్రుడిని సంపద శ్రేయస్సు వ్యాపారం ఉపాధితో పాటు ఇతర శుభ పనులకు సూచికగా భావిస్తారు. అలాంటిది ఈ రెండు గ్రహాలు సంచారం చేశాయి. ఇదిలా ఉంటే.. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు కాగా.. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు.. జూన్ 22వ తేదీన ఈ రెండు గ్రహాలు ఏకకాలంలో తమ నక్షత్రాలను మార్చుకోవడం అరుదైన యాదృచ్ఛికంగా భావిస్తారు.. దీని కారణంగా మూడు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఆర్థికంగా మేలు జరగడమే కాకుండా కోరుకుంటున్న కోరికలు కూడా చాలావరకు నెరవేరే అవకాశాలు కనిపించబోతున్నాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి..

తులారాశి:
సూర్య శుక్ర గ్రహాలు ఏకకాలంలో సంచారం చేయడం కారణంగా.. ముఖ్యంగా తులా రాశి వారిపై ఊహించని ప్రభావం పడబోతోంది. వీరికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా.. అనుకుంటున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు సొంతం చేసుకోబోతున్నారు. అలాగే వీరికి ధైర్య సాహసాలు పెరిగి ఆత్మీయంలో మద్దతు లభించి కష్టతరమైన పనులు కూడా ఎంతో సులభంగా చేయగలిగే అవకాశాలున్నాయి. దీంతోపాటు తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. అలాగే ఈ సమయంలో మీకు అనుకూలంగా పనులు చేయగలుగుతారు..

మకర రాశి:
సూర్య శుక్ర గ్రహాల అరుపులు అనేక విధాలుగా మకర రాశి వారిపై కూడా ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులకు అందరికీ మంచి మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసే వారందరికీ పదోన్నతులు కూడా తప్పకుండా లభిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మకర రాశి వారు తమ వ్యాపారాలను ఊహించని స్థాయిలో విస్తరించే అవకాశాలున్నాయి. దీంతోపాటు ఒంటరిగా ఉన్నవారికి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలిసే అవకాశాలున్నాయి. అలాగే మీకు అందరి సపోర్టు లభించి అనుకుంటున్న పనులు ఎంతో సింపుల్ గా చేయగలుగుతారు..

కుంభరాశి:
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులందరికీ ఈ సమయంలో ఆకర్షణతో పాటు పురోగతి విపరీతంగా పెరుగుతుంది. మీ వ్యక్తిగత జీవితంలోకి ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు. అలాగే వృత్తి జీవితం మెరుగుపడడమే కాకుండా.. అనుకున్నన్నీ ఆర్థిక లాభాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగాలపరంగా దిమ్మతిరిగే ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటారు. అదృష్టం కలిసి వస్తే ఆ సంపూర్ణంగా ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా ఈ సమయంలో పూర్తవుతాయి. ముఖ్యంగా కొత్త మార్గాల నుంచి భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు కూడా సొంతం చేసుకోగలుగుతారు. అవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం ఎంతో మంచిది అని జ్యోతిష్యులు చెబుతున్నారు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

Qatar LNG Blast: ఖతార్‌ గ్యాస్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు దుర్మరణం..!!

BBhoomi20h ago
Secunderabad, Telangana:

Ras Laffan Industrial City Indians Killed: ఖతార్ లోని ప్రముఖ రాస్ లఫాన్ లిక్విఫైడ్ నేచరుల్ గ్యాస్ ఇండస్ట్రీలో సంభవించిన భారీ పేలుడులో 13 మంది దుర్మరణం చెందారు. 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 12 మంది భారతీయులు ఉన్నారు. ఇరాన్ జరిపిన క్షిపణి దాడి కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలను కార్మికులు పునరుద్ధరిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. బర్జాన్ గ్యాస్ సరఫరా విభాగంలో ఈ పేలుడు జరిగిందని.. ఇదొక సాంకేతిక ప్రమాదమని అధికారులు తెలిపారు. 

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఖతార్‌లో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు, గాయపడిన వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన పేలుడులో భారత పౌరులతో సహా ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం వంటి వార్తలకు నేను తీవ్రంగా విచారించాను. మరిన్ని వివరాలు వెలువడుతున్న కొద్దీ, దోహాలోని మా భారత రాయబార కార్యాలయం ఖతార్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషాదంతో ప్రభావితమైన భారత పౌరుల కుటుంబాలకు సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధితులకు, వారి కుటుంబాలకు మా ప్రార్థనలు, సానుభూతి తెలియజేస్తున్నాము అని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్  అన్నారు. 

ప్రమాదంలో మరణించిన 12 మంది భారతీయుల పార్థివ దేహాలను వీలైనంత త్వరగా వారి స్వస్థలాలైన భారతదేశానికి పంపించడానికి, చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసేందుకు ఖతార్ అధికారులతో కలిసి వేగంగా పనిచేస్తున్నట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం, ఖతార్ అధికారులను ఉటంకిస్తూ సోమవారం ధృవీకరించింది. ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా నిలకడగా ఉందని, వారికి ఖతార్ ఆసుపత్రులలో సరైన, నాణ్యమైన వైద్య చికిత్స అందుతోందని కూడా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, భద్రతా అధికారులు రాస్ లఫాన్ అత్యవసర ప్రతిస్పందన బృందాలతో కలిసి స్పందించి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారీ సహాయక చర్యలను ప్రారంభించారని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రమాదం వల్ల ప్లాంట్ నుండి ఎలాంటి హానికరమైన గ్యాస్ లీకేజీలు జరగలేదని, సమీపంలో నివసిస్తున్న ప్రజల భద్రతకు గానీ, పర్యావరణానికి గానీ ఎటువంటి ముప్పు లేదని ఖతార్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం, ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు ఈ ఘటనకు గల కచ్చితమైన కారణాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: CEO లకే సవాల్ విసురుతున్న CPO పోస్ట్.. కార్పొరేట్ ప్రపంచంలో దీని క్రేజ్ వేరే లెవల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

ప్రజాసేవకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బాలకృష్ణ: చంద్రబాబు ప్రశంసల వర్షం

Hyderabad, Telangana:

'బాలకృష్ణకు సినిమాల్లో చప్పట్లు వినిపించేవి.. కానీ ఇప్పుడు ప్రజాసేవకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బాలకృష్ణ ఉంటారు. ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు సేవలు అందించిన ఘనత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కి దక్కుతుంది. ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీకి ఒక కారణం ఉంటుంది. మా అత్తమ్మ బసవతారకం. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. కానీ ఆమె మా కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండేవారు. క్యాన్సర్ అప్పట్లో డబ్బున్న వారికే వచ్చేది.. రాచపుండు అనే వారు. అమెరికాకు కూడా తీసుకెళ్లి చికిత్స చేయించాం. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే ఆమె మా నుంచి దూరమయ్యారు' అని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు. 'ఆమెను చూసిన ఎన్టీఆర్‌ పేదలకు చికిత్స అందించేందుకు ఒక ఆస్పత్రి ఉండాలని భావించి కొన్ని ఎకరాల భూమిని కేటాయించి కట్టించాలనే ధృడ నిశ్చయంతో ముందుకువెళ్లారని చెప్పారు. 'ముఖ్యమంత్రిగా ఓడిపోవడం. అనంతరం ఆస్పత్రిని పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డాం. ఎట్టకేలకు అప్పటి పీఎం వాజ్‌పేయి ప్రారంభించారు' అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 'తండ్రి ఒక మొక్క నాటితే దాన్ని ఒక గొప్ప కల్పవృక్షం లా మార్చిన ఘనత బాలకృష్ణకి దక్కుతుంది. 25 ఏళ్లలో ఎంతోమంది దాతలు ఆస్పత్రి కోసం పనిచేశారు' అని తెలిపారు.

'మాకు ఆస్పత్రిని నడపడానికి ఎన్నో సవాళ్లు వచ్చాయి. బాలకృష్ణ సారథ్యంలో 16 ఏళ్లుగా అన్‌స్టపబుల్‌గా నడుపుతున్నారు. ఈ పాటికి రిటైర్ అవుతారు. కానీ స్టిల్ హీరోగా రాణిస్తూ హిందూపూర్ ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. బాలకృష్ణకు ప్యాషన్ ఉంది. ఎంపతీ ఉంది' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. ఒక ప్రవైట్ ఆర్గనైజేషన్ పెడితే కూడా ఇంతలా కష్టపడరు.. కానీ నాన్ ప్రొఫిటబుల్ ఆర్గనైజేషన్ కోసం బాలకృష్ణ దేశవిదేశాల్లో తిరిగి దాతలను పట్టుకుని ఆస్పత్రిని నిలబెడుతున్నారని చెప్పారు. ఈ ఆస్పత్రికి వచ్చే ప్రతి పేషంట్‌కి భరోసా కల్పించేలా సేవలు అందిస్తున్నారు. 1,600 పైగా క్యాన్సర్ ప్రివెంటివ్ స్క్రీనింగ్ సెంటర్స్ పెట్టారు. అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి పెడతాము అంటే స్వాగతించా' అని చంద్రబాబు వివరించారు.

'ప్రతి ఏడాది 9 లక్షల మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారు. దీన్ని మనం ఆలోచించాలి. ఎంత ధైర్యంగా ఉన్నా కుటుంబంలో అయినా సరే క్యాన్సర్ వస్తే మొత్తం కుంగిపోతారు. మనం ముందుగా గుర్తిస్తే కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. సమైకే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్ని ప్రభుత్వాలు, విడిపోయాక కూడా అన్ని ప్రభుత్వాలు బసవతారకం ఆస్పత్రికి బాసటగా ఉన్నారు' అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 'ప్రైవేట్‌లో లాభాపేక్ష ఉంది. కానీ బసవతారకం ఆస్పత్రిలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అలాంటి ఆర్గనైజేషన్లు రావాలి. ఎన్‌టీఆర్‌ వేసిన పునాదులు.. ఒకవైపు బాలకృష్ణ సినిమాలు. నా భార్య ఎన్టీఆర్‌ ట్రస్ట్. పిల్లలు, హెరిటేజ్, మొత్తం సేవలు అందిస్తున్న కుటుంబం. భారతదేశంలోనే నెంబర్ 1 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా నిలుస్తుంది. బెస్ట్ ప్లాట్‌ఫారంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిలుస్తుంది' అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

0
0
Report

రేవంత్ రెడ్డి మోసగాడు.. భూమి బద్దలైనా మల్లొచ్చేది మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే: హరీశ్ రావు

Achampet, Telangana:

Harish Rao vs Revanth Reddy: 'రైతులకు రూ.29,350 కోట్ల భరోసా ఎగ్గొట్టి, బోనస్‌ను బోగస్ చేసి.. ఇప్పుడు కేంద్రం చెబితేనే పంటలు కొంటామంటున్న రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. పక్కా మోసగాడు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇవ్వడానికి పైసల్లేవంటాడు కానీ.. తన గెస్ట్ హౌస్‌కు రూ.100 కోట్లు, కంచెకు రూ.17 కోట్లు.. పక్క రాష్ట్రాల్లో పేపర్ యాడ్స్‌కు రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. 'నాడు ఔరంగజేబు జుట్టుపై పన్ను వేసినట్లు.. నేడు పెట్రోల్, డీజిల్, ఎరువులు, చార్జీల పేరుతో రేవంత్ సర్కార్ ప్రజల రక్తం తాగుతూ పన్నుల భారం మోపుతోంది' అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నల్లమల గౌరవం
నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు. 'కొనుగోలు కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యం కొనలేని దద్దమ్మ, బీఆర్ఎస్‌ను మొలకెత్తనివ్వననడం విడ్డూరం.. రాబోయే ఎన్నికల్లో పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి కొడంగల్‌లోనే రేవంత్‌ను చిత్తుగా ఓడిస్తాం' అని ప్రకటించారు. 'రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, మోసగాడు. నల్లమల పేరు చెప్పి నల్లమల గౌరవం రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నాడు' అని తెలిపారు. 'రైతులకు ఇప్పటివరకు రూ.29,350 కోట్ల రైతు భరోసా డబ్బులు బాకీపడ్డాడు. ఈ ప్రభుత్వంలో బోనస్ కాస్తా బోగస్ అయింది. మొలకెత్తిన గింజలు కొనలేని రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌ను మొలకెత్తనియ్య అని అంటున్నాడు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాం
'కేంద్ర ప్రభుత్వం జొన్నలు, మక్కలు, సోయాబీన్, పల్లి, సన్‌ప్లవర్ కొంతమేరే కొంటుంది. కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటుంది. ఖరీఫ్ సీజన్‌లో వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ఉమ్మడి పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లు గెలిచి కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్ హరీశ్ రావు ప్రకటించారు. 'దళారుల, మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ , ఆయన ఎవరి తోలు తియ్యలే. రాష్ట్రం సాధించిన పార్టీగా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం' అని తెలిపారు.

'తెలంగాణ కోసం రాజీనామాలో చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదంటున్న రేవంత్ రెడ్డి, పాలకపక్షం అవుతుందని ఒప్పుకున్నాడు. 100 స్థానాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. రేవంత్ రెడ్డిని, అయన మోసాలను ఎండగడుతూనే ఉండాలని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. 'పేరుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లు.. ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని వర్గాల వారికి కేసీఆర్ న్యాయం చేశారు. లంకె బిందెలు ఉన్నాయి అనుకుంటే పైసలు లేవని రేవంత్ రెడ్డి అంటున్నాడు' అని విమర్శించారు.

రూ.17 కోట్లతో ఇనుప కంచెలు
'జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో 100 కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. గెస్ట్ హౌస్ చుట్టూ రూ.17 కోట్లతో ఇనుప కంచెలు వేసుకున్నాడు. రేవంత్ రెడ్డి మనవడితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు పైసలు ఉంటాయి. కేరళ, బీహార్, మహారాష్ట్ర , ఢిల్లీలో వందల కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి. పేద వర్గాలకు పైసలు ఇచ్చేందుకు డబ్బులు లేవని అంటున్నాడు' అని డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు విమర్శించారు.

ఒక్క రూపాయి ఇవ్వలేదు
'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో  ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క రూపాయి ఇవ్వలేదు. భూమి బద్దలైనా మల్లొచ్చేది మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. స్కాంల ప్రభుత్వం వద్దు స్కీమ్‌ల ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని గుర్తుచేశారు. ఎవడు అయితే కేసులు పెట్టిండో, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. రిటైర్ అయినా, ఎక్కడున్నా పట్టుకొని వచ్చి బొక్కలో వేస్తామని ప్రకటించారు.

ప్రజలు తిట్టుకునే పరిస్థితి
'కాంగ్రెస్‌ పాలన కొన్నేళ్ల వరకు ప్రజలు తిట్టుకునే పరిస్థితి. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర యేండ్లు అవుతుంది, ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులలాగా కేసీఆర్ మార్చారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. 'కార్యకర్తలు గట్టిగా పనిచేసి అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరెయ్యాలి. అప్పుడు కొడంగల్‌కు ఇంఛార్జ్‌గా ఉండి రేవంత్ రెడ్డిని ఓడించాం. ఈసారి ఉమ్మడి పాలమూరులో 14 స్థానాలకు 14 బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు పూర్తి విశ్వాసం ప్రకటించారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top