బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యక్రమంలో తప్పున లోపం చేసింది
Baopet, Telangana:కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పాటు బావుపేట గ్రామంలో పెద్ద ఎత్తున గ్రానైట్ ఫ్యాక్టరీ ఉండడంతో తరచూ లారీలు వెళ్తుండడంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సంబంధిత శాఖ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంజాల స్వామిగౌడ్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరిపురం నాగప్రసాద్, గ్రామశాఖ అధ్యక్షుడు ఆరాయి మల్లేశం, కాజీపూర్ మాజీ వార్డు సభ్యుడు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Mechanic Monkey Video: అబ్బా.. ఏం టాలెంట్ సామి.. సైకిల్ రిపేర్ చేస్తున్న కోతి.. వీడియో..
Hyderabad, Telangana:Monkey Repairing Cycle Viral Video: సాధారణంగా కోతులు చేతికి దొరికిన ప్రతి వస్తువును పాడు చేయడంతో పాటు ఆహారం గుంజుకొని తినడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ ఒక కోతి మాత్రం రూటు మార్చేసింది.. తోటి కోతుల అల్లరి పనులు చేయకుండా.. ఏకంగా సైకిల్ రిపేర్ షాప్ లో మెకానిక్ అవతారం ఎత్తేసింది.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఒక అరుదైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రిపేరింగ్ చేస్తున్న కోతి..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక సైకిల్ రిపేర్ షాప్ కనిపించడం మీరు క్లియర్ గా చూడొచ్చు.. అక్కడ ఒక సైకిల్ వెనక టైర్ పంచర్ అయిందో.. లేక చెడిపోయిందో కానీ.. ఆ కోతి దాన్ని బాగు చేసే పనిలో పడింది. మనుషులు ఏ విధంగా అయితే టూల్స్ ఉపయోగించి టైర్ లోపల ఉన్న ట్యూబ్ను జాగ్రత్తగా బయటికి తీస్తారో.. అలాగే ఆ కోతి కూడా ఎంతో సులభంగా.. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మెకానిక్లా.. ఆ ట్యూబ్ను బయటికి లాగుతోంది.. అయితే ఈ సమయంలో దాని పనితనం చూసి అక్కడున్న కొంతమంది కస్టమర్స్ కూడా షాక్ అయిపోయారు..
ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
ఈ అద్భుతమైన దృశ్యాలను అక్కడున్నవారు తమ స్మార్ట్ఫోన్స్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఇది కాస్త క్షణాల్లో వైరల్గా మారింది. వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఈ కోతికి నెలకు ఎంత జీతం ఇస్తున్నారు యజమాని గారు? అని ఒకరు సరదాగా ప్రశ్నించగా.. మరొకరు మనుషులకంటే చాలా వేగంగా.. ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.. దీని టాలెంట్ కు జోహార్లు.. అని మరొక సోషల్ మీడియా వినియోగదారుడు ప్రశంసిస్తున్నాడు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
అదేవిధంగా కలికాలం అంటే ఇదేనేమో.. కోతులు కూడా ఉపాధి వెతుక్కుంటున్నాయి.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఏది ఏమైనా ప్రకృతిలో జంతువుల మేధస్సు మనల్ని ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఈ మెకానిక్ కోతి వీడియో కూడా అందుకు ఒక నిదర్శనంగా నిలిచింది.. ఇప్పుడు ఈ వీడియో శుచిత్ దీక్షిత్ అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 34 వేల మందికి పైగా లైక్ చేయగా.. కొన్ని లక్షల మంది ఈ వీడియోను వీక్షించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Peddi Collection: బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ప్రభంజనం..10 రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Hyderabad, Telangana:Peddi Collection Day 10: బాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. వీక్ డేస్లో కాస్త నిలకడగా సాగినా, వీకెండ్స్ వచ్చేసరికి బాక్సాఫీస్ వద్ద చరణ్ సినిమా దుమ్మురేపుతోంది. తాజాగా ఈ చిత్రం విజయవంతంగా 10 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం అధికారిక కలెక్షన్ల పోస్టర్ను విడుదల చేసింది.
10 రోజుల్లో రూ.378 కోట్లు..!
విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్న 'పెద్ది'.. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. రెండో వీకెండ్ లో భాగంగా నిన్న శనివారం (జూన్ 13) ఒక్క రోజే ఈ సినిమాకు రూ. 12 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
ఈరోజు ఆదివారం (జూన్ 14) సెలవు దినం కావడంతో థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. నేటితో ఈ కలెక్షన్ల గ్రాఫ్ మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ (విదేశాల్లో) కూడా 'పెద్ది' చిత్రానికి భారీగా వసూళ్లు వస్తున్నాయి.
#PEDDI GROSSES 378 CRORES+ WORLDWIDE in 10 days ❤🔥
Racing ahead at the box office in style 💥💥
🎟️ https://t.co/EMhY3eMGKq pic.twitter.com/R7q18Z3TIR
— PEDDI (@PeddiMovieOffl) June 14, 2026
సినిమా ప్రత్యేకతలు..
డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఫ్యాన్స్ను ఆకట్టుకుంది. సినిమాలో క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్గా రామ్ చరణ్ చూపించిన వేరియేషన్స్, అద్భుత నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, అప్పల సూరి పాత్రలో జగపతి బాబు నటనకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, సత్య తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్లో ప్రధాన పాత్ర పోషించాయి.
వృద్ధి సినిమాస్ సమర్పణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ 'మైత్రీ మూవీ మేకర్స్', 'సుకుమార్ రైటింగ్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించాయి. రామ్ చరణ్ కెరీర్లోనే ఇదొక ల్యాండ్మార్క్ మూవీగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: హీరోయిన్ రష్మికపై ఎగబడ్డ ఫ్యాన్స్..తెలుగింటి కోడలికి బాడీగార్డ్గా బాలీవుడ్ బ్యూటీ!
Also Read: ఐటెంసాంగ్ ద్వారా భారీగా సంపాదించిన హీరోయిన్ ఈమెనే! ఒక్క పాటకి అన్ని కోట్ల రూపాయలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: పిచ్చెక్కిపోద్ది బాబోయ్.. ప్యాంటు బెల్టు బదులు బతికున్న కోబ్రాను చుట్టుకున్నాడు!
Hyderabad, Telangana:Venomous Cobra Snake Belt Video: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రైతులతో పాటు వ్యూస్ కోసం కొందరు యువకులు ఎంతటి తెగింపుకైనా వెనకాడడం లేదు.. ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రమాదకరమైన స్టంట్లను చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. సాధారణంగా పురుషులు ప్యాంట్లు జారిపోకుండా ఉండేందుకు రకరకాల లెదర్ బెల్ట్లను వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువకుడు ఏకంగా బ్రతికి ఉన్న ఒక ప్రమాదకరమైన నాగుపామును తన ప్యాంటుకు బెల్టుల చుట్టుకున్నాడు. విశ్వ సర్పం నడుము చుట్టూ కదులుతున్న.. ఆ యువకుడు మాత్రం భయం లేకుండా కెమెరాకు ఫోజులు ఇవ్వడం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది.
అసలేం జరిగిందంటే..?
వైరల్ అవుతున్న వీడియో వివరాల ప్రకారం.. ఒక యువకుడు రోడ్డు పక్కన నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. అతడి ప్యాంటు నడుము భాగాన్ని గమనిస్తే.. ఎవరికైనా గుండె ఆగినంత పనవ్వాల్సిందే.. ఒక పెద్ద నాగుపామును అతడు బెల్టు లాగా నడుముకు చుట్టుకున్నాడు.. ఆ పాము తలభాగంతో పాటు తోక భాగం బయటకు కనిపిస్తూ కదులుతున్నాయి. ఆ నాగుపాము ఏ క్షణంలోనైనా కాటు వేసే ప్రమాదం ఉన్నప్పటికీ.. ఆ యువకుడు మాత్రం చాలా కూల్గా రోడ్డుపైనే నిలబడి ఉండిపోయాడు.. పక్కనే ఉన్న కొందరు ఈ దృశ్యాలని తమ మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త క్షణాల్లో వైరల్గా మారింది..
అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. వ్యూస్ కోసం ఇంత పిచ్చా? ఒకవేళ అది కాటు వేస్తే ప్రాణాలు పోతాయని తెలీదా? ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమందిని సోషల్ మీడియా వినియోగదారులు కోరుతున్నారు.. ఎక్కువమంది సోషల్ నెటిజన్ల అయితే ఈ వీడియో చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది ఫ్యాషన్ కాదు ముమ్మాటికి పిచ్చితనం అంటూ.. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు..
ఇక మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులైతే.. బ్రతికున్న పామును అలా హింసించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైన సర్పంచ్ స్టంట్ లు చేయడం చట్టరీత్య నేరమని పలువురు గుర్తు చేస్తున్నారు. అలాగే ఈ వీడియో ఎక్కడ జరిగిందో గుర్తించి.. సదరు యువకుడిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి.. కఠినంగా శిక్షించాలని అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులను సోషల్ మీడియా వేదికగా కొంతమంది కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో ఇంస్టాగ్రామ్లో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది. పోస్ట్ చేసి చాలా రోజులైనప్పటికీ ఇప్పుడు వైరల్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Realme P4R 5G: రూ.4,999లకే Realme P4R 5G స్మార్ట్ఫోన్.. ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్!
Hyderabad, Telangana:Realme P4R 5G Launched on Flipkart: బడ్జెట్ ధరలు ప్రీమియం ఫీచర్లను కోరుకునే స్మార్ట్ఫోన్ ప్రియుల కోసం ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్ మీ సరికొత్త మొబైల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత యువతను లక్ష్యంగా చేసుకొని కంపెనీ Realme P4R 5Gను మోడల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మోడల్ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో ప్రత్యేకమైన ఆఫర్లతో సందడి చేస్తోంది. ముఖ్యంగా లావెంటర్ కలర్తో కూడిన 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చింది..
ప్రస్తుతం Realme P4R 5G మొబైల్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart)లో ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులో ఉంది. అయితే, దీనికి సంబంధించిన సేల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది అంతలోనే దీనిపై కంపెనీ ప్రత్యేకమైన స్పెషల్ తీసుకుంటే ఆఫర్స్ అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి ఇది అత్యంత చీప్ ధరకు లభిస్తోంది. Realme P4R 5G స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది అత్యంత తక్కువ ధరలోనే ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇది భారీ 8000mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి తోడు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం. అలాగే గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన బైపాస్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది..
సినిమాలు, గేమింగ్ ప్రియుల కోసం ఈ స్మార్ట్ఫోన్ కంపెనీ అద్భుతమైన 6.8 అంగుళాలు కలిగిన సన్లైట్ డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అందుబాటులోకి రావడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా ఫోటోగ్రఫీకి కూడా ఈ స్మార్ట్ఫోన్ ఎంతగానో సహాయపడుతుంది.. ఇందులో వెనక భాగంలో అద్భుతమైన 50 మెగాపిక్సెల్ AI కెమెరాను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పాటు తక్కువ వెలుగులోను అద్భుతమైన పోర్ట్రైట్ షాట్స్ తీసుకునే విధంగా వివిధ రకాల కొత్త కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ఎరైజర్ తో పాటు జాల ప్రత్యేకమైన నెక్స్ట్ ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఫోటో ఎడిటింగ్ మరింత సులభతరం అవుతుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మార్కెట్లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ధర MRP రూ.30,999 కాగా.. ఇది ఫ్లిప్కార్ట్లో 32 శాతం వరకు ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.20,999 లకే లభించడం విశేషం. అంతేకాకుండా ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రాగానే దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంకు తోపాటు ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.3 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా అదనంగా దీనిపై కంపెనీ ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్తో పాటు అదనపు బోనస్ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ వినియోగించడానికి తప్పకుండా మీ దగ్గర వినియోగిస్తున్న ఏదైనా బ్రాండ్ కు సంబంధించిన మొబైల్ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాని కండిషన్ను బట్టి, దాని వ్యాల్యూని బట్టి ఏకంగా రూ.16 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ రూ.4,999 లోపే సొంతం చేసుకోవచ్చు..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amazon Offer: సగం ధరకే Aquaguard 9-స్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్.. బ్యాంక్ డిస్కౌంట్ కూడా!
Hyderabad, Telangana:Aquaguard Water Purifier Amazon Offer: ప్రస్తుతం చాలామంది బయట ప్యూరిఫైయర్ చేసిన నీరు తాగకుండా ఇంట్లోనే వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకుంటున్నారు. వీటి నుంచి ఫిల్టర్ చేసిన నీటిని తాగుతున్నారు. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా అనారోగ్య సమస్యల భారిన పడకుండా రక్షిస్తూ ఉంటాయి. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో మంచి ప్యూరిఫైయర్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ డే సేల్లో భాగంగా.. కొన్ని వాటర్ ప్యూరిఫైయర్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్అందుబాటులో ఉన్నాయి. గతంలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన Aquaguard RO+UV+UF+MC Tech (2X Life) వాటర్ ప్యూరిఫైయర్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్తో లభిస్తుంది. అలాగే ఇది ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇందులో ఉన్న ఫీచర్స్ వివరాలు ఏంటో? ధర పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వాటర్ ప్యూరిఫైయర్ కు సంబంధించిన పూర్తి ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఇది నీటిని 9 విభిన్న దశల్లో శుద్ధి చేస్తుంది. దీనివల్ల నీటిలోని మురికి, కెమికల్స్, బ్యాక్టీరియా తో పాటు వైరస్లు పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా ఈ మీరు పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా ప్రత్యేకమైన RO+UV+UF+MC టెక్నాలజీ అందుబాటులో ఉంది. రివర్స్ ఆస్మోసిస్ సీసంతో పాటు పాదరసం లోహాలు నీటిలోని పురుగులను తొలగించేందుకు సహాయపడతాయి.
అలాగే ఇందులో ఉండే UV నీటిని 20 నిమిషాల పాటు మరిగిస్తే ఎంత శుద్ధిగా మారుతుందో.. అంతటి రక్షణను అందిస్తాయి. అలాగే ఇందులో అల్ట్రా ఫిల్టరేషన్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలతో పాటు ఇసుక రేణువులను సులభంగా వడ కడుతుంది. అంతేకాకుండా మినరల్ చార్జ్.. నీటిని శుద్ధి చేయడమే కాకుండా శరీరానికి అవసరమైన మెగ్నీషియంతో పాటు క్యాల్షియం వంటి పోషకాలను అందించేందుకు సహాయపడుతుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
60 శాతం హైయర్ వాటర్ రికవరీ (Aquasaver Tech) సపోర్ట్ కూడా లభిస్తుంది. సాధారణ ఆర్వో ప్యూరిఫైయర్లతో పోలిస్తే 60 శాతం వరకు నీటిని ఆదా చేస్తుంది. అంటే నేటి వృధా చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో రెండు సంవత్సరాల వరకు ఫిల్టర్ లైఫ్ సపోర్ట్ లభిస్తుంది. సాధన ఫిల్టర్ల కంటే ఇవి రెట్టింపు కాలం వరకు పనిచేస్తూ ఉంటాయి. ఇక ఈ వాటర్ ప్యూరిఫైయర్కు సంబంధించిన పూర్తి ధర వివరాల్లోకి వెళితే.. ఇది MRP ధర రూ.26,500 కాగా ఇప్పుడే దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్లో కొనుగోలు చేసే వారికి.. అదనంగా 58 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపుతో కేవలం.. రూ.10,999 లకే లభిస్తోంది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే అదనంగా రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Xiaomi Mix Fold 5: 200MP కెమెరాతో రాబోతున్న Xiaomi Mix Fold 5 ఫోన్.. సామ్సంగ్కు గట్టి పోటీ!
Hyderabad, Telangana:Xiaomi Mix Fold 5 Leaked: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi మార్కెట్లోకి తమ కొత్త పోల్టబుల్ స్మార్ట్ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సాంసంగ్తో పాటు వన్ ప్లస్, వివో వంటి బ్రాండ్లకు గట్టి పోటీని ఇస్తూ నెక్స్ట్ జనరేషన్ పోలిడబుల్ ఫోన్ Xiaomi Mix Fold 5 ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ క్రమంలోనే ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన స్పెసిఫికేషన్స్తో పాటు ఫీచర్స్ లీకయ్యాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఈ మొబైల్లో ఉన్న హైలెట్ ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
200MP కెమెరాతో ఈ మొబైల్..
ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన అత్యంత ప్రధాన విశేషమేంటంటే.. దీని కెమెరా.. ప్రముఖ చైనీస్ మైక్రో బ్లాకింగ్ ప్లాట్ఫామ్ విబోలో ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...షియోమీ మిక్స్ ఫోల్డ్ 5 వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్ ను కలిగి ఉండబోతోంది. ఇందులో కంపెనీ ఎంతో పవర్ఫుల్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. పోలిటబుల్ ఫోన్లలో ఇంత భారీ కెమెరా సెన్సార్ ను తీసుకురావడం మొదటిసారిగా భావించవచ్చు. అయితే, ఇందులో అద్భుతమైన అల్ట్రా-క్లియర్, హై-రిజల్యూషన్ ఫోటోగ్రఫీ అనుభూతి కూడా లభిస్తుంది.
అద్భుతమైన డిస్ప్లే..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ ప్రోటో టైపులో 7.5 అంగుళాల నుంచి 7.6 అంగుళాల వరకు ఉండే ఫోల్డబుల్ ఇన్నర్ డిస్ప్లే కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్క్రీన్ లపై సాధారణంగా కనిపించే మడత మార్కులను పూర్తిగా తగ్గించేందుకు సరికొత్త మినిమలైజ్డ్ టెక్నాలజీని ఇందులో వినియోగించినట్లు తెలుస్తోంది. భద్రత కోసం ఫోన్ పక్క భాగంలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్స్ లభించడం విశేషం..
పవర్ఫుల్ బ్యాటరీ..
కొత్త తరం యూజర్ల అవసరాలకు అనుగుణంగా షియోమీ మిక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ఫోన్లో ఎంతో శక్తివంతమైన 6,000 mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పూర్తిగా వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో పాటు అత్యంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన Xring O3 ప్రాసెసర్ను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా గేమ్స్ కోసం ప్రత్యేకమైన చిప్ సెటప్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది..
ధర వివరాలు ఇవే..
గత కొన్ని నీళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ మొబైల్స్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో వచ్చిన మిక్స్ ఫోల్డ్ ఫోర్ స్థానంలో రాబోతున్న ఈ సరికొత్త మోడల్ ఆగస్టు నాటికి చైనాలోని లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అనేక కొత్త ఫీచర్ల కారణంగా దీని ధర మునుపటి మోడల్స్ కంటే కాస్త ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని లీకైన వివరాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర రూ.1,31 లక్షతో ప్రారంభం కాబోతోంది. అలాగే ఇది 200MP కెమెరాతో అందుబాటులోకి రావడం కారణంగా సాంసంగ్ బ్రాండ్ తో పాటు వన్ ప్లస్ బ్రాండ్ కు సంబంధించిన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లతో పోటీపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India-Iran Relations: అమెరికా - ఇరాన్ చర్చలు..భారత్కు భారీ గుడ్న్యూస్! భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
Hyderabad, Telangana:India-Iran Relations News: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా మారుతున్న ఈ సమీకరణాలు భారతదేశానికి వ్యూహాత్మకంగా, ఆర్థికంగా సరికొత్త అవకాశాలను తెచ్చిపెట్టబోతున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన భారత్-ఇరాన్ వాణిజ్య సంబంధాలు మళ్లీ ఊపందుకోవడమే కాకుండా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి ఇది ఒక సువర్ణావకాశంగా మారనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్కు చేకూరే ప్రధాన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చౌక ధరకే ముడి చమురు..
భారతదేశం తన దేశీయ ఇంధన అవసరాల కోసం దాదాపు 85 శాతం ముడి చమురును దిగుమతులపైనే ఆధారపడుతోంది. అమెరికా, ఇరాన్ ఒప్పందం సఫలమైతే భారత్కు భారీ ఊరట లభించనుంది. వెనిజులా లేదా అమెరికా నుంచి వచ్చే చమురులో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల దానిని క్లీన్ చేయడానికి ఎక్కువ ఖర్చవుతుంది. కానీ ఇరాన్ ముడి చమురు సాధారణ రకానికి చెందినది కావడం వల్ల శుద్ధి ఖర్చులు చాలా తక్కువ.
అలాగే ఇరాన్ నుంచి దిగుమతులు పునఃప్రారంభమైతే రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు గణనీయంగా తగ్గుతాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. భారత్ దిగుమతి చేసుకునే చమురులో 50 శాతం వివాదాస్పద 'హార్ముజ్ జలసంధి' గుండానే ప్రయాణించాలి. ఇరాన్తో సత్సంబంధాలు ఉంటే ఈ సముద్ర రవాణా మార్గానికి పూర్తి భద్రత లభిస్తుంది.
చాబహార్ పోర్ట్ ప్రాజెక్టుకు పునర్జీవం
భారత్ వ్యూహాత్మకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయ అభివృద్ధికి ఈ ఒప్పందం కీలక చోదక శక్తి కానుంది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ద్వారా ఈ పోర్ట్ నిర్వహణకు భారత్ 10 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. యంత్రాల కోసం 120 మిలియన్ డాలర్ల పెట్టుబడితో పాటు, మౌలిక వసతుల కోసం 250 మిలియన్ డాలర్ల రుణ సదుపాయాన్ని కూడా ప్రకటించింది.
పాకిస్థాన్లో చైనా నిర్మిస్తున్న 'గ్వాదర్' పోర్టుకు చాబహార్ అత్యంత సమీపంలో ఉంటుంది. దీని ద్వారా పశ్చిమాసియాలో చైనా ఆధిక్యానికి భారత్ బ్రేక్ వేయవచ్చు. పాకిస్థాన్తో ఎలాంటి అవసరం లేకుండానే భారత్ నేరుగా మధ్య ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలకు వాణిజ్యం సాగించడానికి చాబహార్ ఒక వ్యూహాత్మక గేట్వేగా మారుతుంది.
గతంలో అంతర్జాతీయ వేదికలపై (జమ్మూ కాశ్మీర్ వంటి కీలక అంశాల్లో) ఇరాన్ భారత్కు ఎంతో అండగా నిలిచింది. అయితే అమెరికా ఆంక్షల ప్రభావం ఈ బంధంపై తీవ్రంగా పడింది.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కేవలం మానవతా సహాయం, ప్రాథమిక అవసరాల వస్తువులకే వాణిజ్యం పరిమితమైంది. భారత్ నుంచి బాస్మతీ బియ్యం, టీ పొడి, మందులు ఇరాన్కు వెళ్తుండగా.. అక్కడి నుంచి ఎండుద్రాక్ష, రసాయనాలు భారత్కు వస్తున్నాయి.
గతంలో అమెరికా ఒత్తిళ్ల కారణంగా భారత్.. ఇరాన్ విషయంలో కొంత తటస్థ వైఖరిని అవలంబించాల్సి వచ్చింది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన కూడా అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే, ఇప్పుడు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరడం భారత దౌత్య, ఆర్థిక ప్రయోజనాలకు లభించిన అతిపెద్ద ఊరట. ఆంక్షలు సడలిస్తే చమురు మార్కెట్లో స్థిరత్వం ఏర్పడటంతో పాటు, ఆసియా వ్యాప్తంగా భారత్ తన ఆర్థిక పట్టును మరింత సుస్థిరం చేసుకోగలుగుతుంది.
Also Read: భారత నౌకపై అమెరికా సైన్యం దాడి..ముగ్గురు భారతీయులు
Also Read: అమెరికా దాడిలో ముగ్గురు భారతీయులు ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nitish Kumar Reddy Press Meet: 'అమ్మా.. 5 నిమిషాల్లో కాల్ చేస్తా': లైవ్ ప్రెస్మీట్ మధ్యలో ఆపేసిన నితీశ్ కుమార్ రెడ్డి..తెలుగు వీడియో వైరల్!
Jhikli Barol, Himachal Pradesh:Nitish Kumar Reddy Press Conference: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఎంత బిజీగా ఉన్నా.. అమ్మ పిలుపు కంటే ఏదీ ఎక్కువ కాదని నిరూపించాడు తెలుగు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి. ధర్మశాల వేదికగా అఫ్ఘానిస్థాన్తో జరిగిన తొలి వన్డే అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ఆసక్తికరమైన, అందమైన ఘటన చోటుచేసుకుంది.
ప్రెస్మీట్ మధ్యలో అమ్మ ఫోన్..!
మ్యాచ్ ముగిసిన తర్వాత నితీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా, ఒక్కసారిగా అతడి మొబైల్ మోగింది. స్క్రీన్పై 'అమ్మ' అని చూడగానే.. చుట్టూ ఉన్న రిపోర్టర్లను క్షమించమని కోరుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. "అమ్మా.. ప్రెస్మీట్లో ఉన్నాను. ఒక 5 నిమిషాల్లో మళ్లీ చేస్తాను" అంటూ పక్కా తెలుగులో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు.
అనంతరం అక్కడున్న విలేకరులకు చిరునవ్వుతో 'సారీ' చెప్పి మళ్లీ ప్రెస్మీట్ను కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
నెటిజన్ల ప్రశంసల జల్లు
ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు క్రికెటర్ నితీశ్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "గ్లోబల్ వేదికపై మన తెలుగు భాషను హైలైట్ చేశాడు, గర్వంగా ఉంది!" అని కొందరు అంటుంటే.. "అమ్మ అంటే అంత ప్రేమ మరి.. ఎంత పెద్ద స్టార్ అయినా అమ్మ తర్వాతే ఎవరైనా" అని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Mom > Media 📞😂pic.twitter.com/4bqfCZvSKn
— Cricbuzz (@cricbuzz) June 14, 2026
మ్యాచ్ హైలైట్స్
అఫ్ఘానిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు 194 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలింగ్ దళాన్ని పరిశీలిస్తే.. అరంగేట్రం మ్యాచ్లోనే గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబె తలో 3 వికెట్లతో అదరగొట్టారు. నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
భారత్ చేజింగ్లో 195 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 22.5 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలవగా.. కేఎల్ రాహుల్ 39* పరుగులతో అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన శుభ్మన్ గిల్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
Also Read: ఫుట్బాల్ మ్యాచ్లో హద్దు దాటిన లేడీ ఫ్యాన్..ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా రచ్చ!
ALso REad: ఇక సెలవు..అంతర్జాతీయ క్రికెట్కు కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వీడ్కోలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kriti Sanon Rashmika: హీరోయిన్ రష్మికపై ఎగబడ్డ ఫ్యాన్స్..తెలుగింటి కోడలికి బాడీగార్డ్గా మారిన బాలీవుడ్ బ్యూటీ!
Pimpri-Chinchwad, Pune, Maharashtra:Kriti Sanon Rashmika News: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రధానపాత్రలో.. కృతి సనన్, రష్మిక మందన్న హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం 'కాక్టెయిల్ 2'. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ ముగ్గురు స్టార్లు సినిమా ప్రమోషన్స్ కోసం పూణేలోని ఒక మాల్ను సందర్శించారు. అయితే, ఉత్సాహంగా ప్రారంభమైన ఈ ఫ్యాన్ ఈవెంట్, ఊహించని విధంగా భారీ సంఖ్యలో జనం భద్రతా బారికేడ్లను ఛేదించుకుని లోపలికి రావడంతో గందరగోళంగా మారింది.
ఈ గందరగోళం మధ్య, రష్మిక పట్ల కృతి చూపిన విధానం అందర్ని ఆకట్టుకుంది. రష్మిక పైకి ఫ్యాన్స్ ఎగబడుతున్న నేపథ్యంలో ఆమెను సంరక్షిస్తున్న ఓ బాడీ గార్డు మాదిరిగా ఆమె చేతులను అడ్డుపెట్టి రష్మికను సంరక్షించింది. ఇప్పడు అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. హీరోయిన్ కృతి సనన్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఈవెంట్కు సంబంధించిన ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, భారీ సంఖ్యలో జనం హీరోయిన్ల వైపు దూసుకురావడం, దీంతో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక ఆ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడటం కనిపించింది. కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. నటీనటులకు దగ్గరయ్యే ప్రయత్నంలో అభిమానులు భద్రతా బారికేడ్లను ఛేదించుకుని రావడంతో ప్రచార కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.
ఆ గందరగోళం మధ్య జనసమూహంలోంచి దారి వెతుక్కుంటూ వెళ్తున్న షాహిద్, స్పష్టంగా అసహనానికి గురైనట్లు కనిపించాడు. మరోవైపు, భద్రతా సిబ్బంది వారిని ప్రాంగణం నుండి బయటకు తీసుకువెళ్తుండగా, కృతి రష్మిక మందన్నను గట్టిగా పట్టుకుని, తోసుకుంటున్న జనసమూహం నుండి ఆమెను కాపాడుతూ కనిపించింది. ఆ నటి ఆద్యంతం అప్రమత్తంగా ఉంటూ, అభిమానుల మధ్య నుంచి రష్మికకు జాగ్రత్తగా మార్గనిర్దేశం చేసింది. ఆమె చేసిన ఈ పని అప్పటి నుండి ఆన్లైన్లో ప్రశంసలు అందుకుంది.
ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించారు. "కృతి రష్మికను కాపాడుతున్న తీరు.. ఒక చెల్లెల్ని అక్క కాపాడుతున్నట్లు ఉంది." మరొకరు కామెంట్ చేస్తూ.. "కృతి రష్మికను కాపాడుతున్న తీరు వారిద్దరి మధ్య ఉన్న సన్నిహితానికి ప్రతిరూపం" అని అన్నారు. అలాగే మరో నెటిజన్లు ఇలా వ్యాఖ్యానించారు. "కృతి రష్మికను కాపాడటం చాలా ఎంతో చూడముచ్చటగా ఉంది." అని ఫ్యాన్స్ కామెంట్ చేశారు.
'కాక్టెయిల్ 2' సినిమా గురించి..
హోమీ అడజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. 2012లో విజయవంతమైన 'కాక్టెయిల్' చిత్రానికి సీక్వెల్గా రూపొందింది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రాయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేట్రలలో విడుదల కానుంది.
Also Read: ఐటెంసాంగ్ ద్వారా భారీగా సంపాదించిన హీరోయిన్ ఈమెనే! ఒక్క పాటకి అన్ని కోట్ల రూపాయలా?
Also Read: మ్యూజిక్ డైరెక్టర్ను బీచ్లో పాతిపెట్టిన అనిల్ రావిపూడి..ఇలా కూడా చేస్తారా గురూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Rains: తెలంగాణలో ఆదివారం కుండపోత వర్షం.. ఈ జిల్లాలకు భారీ అలర్ట్
Baddipadaga, Telangana:Heavy Rain Alert To Hyderabad: వేసవికాలంతో విలవిలలాడిన తెలంగాణపై వరుణుడు కరుణించాడు. వర్షాకాలం ప్రారంభమే వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో పలుమార్లు వర్షం భారీగా పడగా జిల్లాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో వర్షాలు జోరుగా పడుతున్నాయి. ఆదివారం కూడా అంటే జూన్ 14వ తేదీన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తోపాటు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా పలు జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్ధిపేట, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాలున్నాయని వాతావరణ శాఖ వివరించింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడే జిల్లాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండగా.. నాలుగో రోజు కూడా కురవనుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజధాని హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉండగా.. సాయంత్రం వర్షం దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రభుత్వం అప్రమత్తం
కాగా ఇప్పటికే వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం ప్రకటించింది. భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమై అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో ఇప్పటికే వర్షాలతో దాదాపు ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో అలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు ప్రభుత్వం ఆదేశించింది.
Telangana: రేపటి నుంచే ప్రభుత్వ బడుల్లో ఉచిత బ్రేక్ఫాస్ట్.. సర్కార్ సరికొత్త కానుక..
Hyderabad, Telangana:Telangana Govt Schools Breakfast Scheme Telugu News: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉచితంగా పోషకాలతో కూడిన అల్పాహారాన్ని అందించే బ్రేక్ ఫాస్ట్ పథకం అమల్లోకి రాబోతోంది విద్యార్థులు ఖాళీ కడుపుతో బడికి రాకూడదనే ఉద్దేశంతో వారి ఆరోగ్యంతో పాటు చదువుపై శ్రద్ధ పెంపొందించేందుకు ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రభుత్వం రేపటి నుంచి అధికారికంగా ప్రారంభించబోతోంది. అయితే ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
తొలి విడతగా 1.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి..
ఈ పథకాన్ని విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇందులో భాగంగా మొదటి విడతలో 8 జిల్లాలను ఎంపిక చేశారు రేపటి నుంచి ఈ ఎనిమిది జిల్లాల్లో మొత్తం 1269 ప్రభుత్వ పాఠశాలలతో పాటు 33 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ అల్పాహార పథకం అందుబాటులోకి రాబోతోంది తొలి విడతలోనే దాదాపు 1.44 లక్ష మంది విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం వేడి వేడి బ్రేక్ ఫాస్ట్ అందబోతోంది. రాబోతున్న రోజుల్లో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలకు విస్తరించి.. మొత్తం 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికల సిద్ధం చేస్తోంది..
నోరూరించే మెనూ..
విద్యార్థులకు కేవలం అల్పాహారం అందించడమే కాకుండా అది రుచికరంగా.. అత్యంత పోషక విలువలతో కూడుకున్నదిగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేకమైన మెనూ రూపొందించింది. ప్రతిరోజు ఒకే రకమైన టిఫిన్ కాకుండా విద్యార్థులంతా ఎంతో ఇష్టంగా తినేలా వివిధ రకాల రుచికరమైన టిఫిన్లను అందుబాటులో ఉంచారు. ఈ మెనూలో ప్రధానంగా వేడివేడి దోశతో పాటు పూరీ, బోండా వంటి అల్పాహారాలు ఉండడం విశేషం. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్ ఇడ్లీతో పాటు కూరగాయలతో తయారుచేసిన ఉప్మా ఇతర పోషక పదార్థాలు అందించే టిఫిన్స్ ఉండడం ఈ మెనూ ప్రత్యేకత..
తల్లిదండ్రుల్లో ఆనందం..
ఉదయాన్నే పనులకు వెళ్లే పేద కుటుంబాల తల్లిదండ్రులకు ఈ పథకం పెద్ద ఊరటనివ్వబోతోంది.. పిల్లలకు పొద్దున్నే వంట చేసే సమయం లేక చాలామంది విద్యార్థులు పరిగడుపునె బడులకు వస్తూ ఉంటారు. ఈ పథకం వల్ల విద్యార్థుల్లో పౌష్టిక ఆహార లోపం తగ్గడమే కాకుండా.. బడులలో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పాఠశాలల్లో మంచి టిఫిన్ దొరకతుండడంతో అటు విద్యార్థులతో పాటు ఇటు తల్లిదండ్రులు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఈ పథకానికి సంబంధించి అధికారులు అన్ని పాఠశాలల్లో ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేసినట్లు తెలుస్తోంది..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Tuni Girl Missing Case: జల్లెడ పడుతున్న బృందాలు.. అడవుల్లో 9 రోజులు పాపం పసిపాప
Tuni, Andhra Pradesh:Tuni Girl Missing Case Search Operation: దారి తప్పి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన బాలిక ఆచూకీ లభించలేదు. 9 రోజుల పాటు అటవీ ప్రాంతంలోనే బాలిక ఉండిపోయింది. బతికి ఉందో లేదో తెలియదు.. కానీ బతికి ఉంటుందనే ఆశతో పోలీసు బృందాలు.. ఇతర సహాయ బృందాలు అటవీ ప్రాంతాన్నీ జల్లెడ పడుతున్నాయి. నిర్విరామంగా వెతుకుతున్నా ఎంతకీ ఆచూకీ లభించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. బాలిక అదృశం కేసుపై ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది.
Also Read: Pawan Kalyan: తుని చిన్నారి అదృశ్యంపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి తొమ్మిది రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ, చిన్న ఆధారం కూడా లభించకపోవడం గమనార్హం. ఉన్న ఒక్కగానొక్క సాక్ష్యం.. కీలక ఆధారమైన పెంపుడు కుక్క చనిపోయింది. దీంతో బాలిక ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. బాలిక అదృశ్యం కేసును సవాల్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఎలాగైనా ఆచూకీ తెలుసుకోవాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Students Jackpot: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్ల ప్రారంభం రోజే అద్భుత పథకం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తోపాటు హోం మంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు మరికొన్ని బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు చేస్తుండడంతో కాకినాడ పోలీస్ యంత్రాంగం బాలిక కోసం వెతుకుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అటవీ శాఖ బృందాలను రంగంలోకి దింపాలని సూచించారు. మరోపక్క హోంమంత్రి అనిత ఎస్పీతో మాట్లాడి. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపాలని ఆదేశించడంతో వారు పాప కోసం వెతుకుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ ఏమైనా కనుగొంటుందా అని తల్లిదండ్రులతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
హోంమంత్రి సమీక్ష
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా ఎస్పీతో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతున్నారు. నిరంతరం సమీక్ష చేస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి రోజు బాలిక అదృశ్యం కేసు వివరాలపై ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఆరా తీస్తున్నారు. హోం మంత్రి అనిత ఆదేశాలతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు దిగాయి. ఆదివారం కూడా హోంమంత్రి అనిత అధికారులకు పలు సూచనలు చేశారు. 'చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. ఈ కేసులో అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు' అని హోం మంత్రి అనిత వివరించారు.
తీవ్ర అనుమానాలు
ఈనెల 9వ తేదీన బాలిక అదృశ్యమైన విషయం తెలిసిందే. పెంపుడు కుక్కతోపాటు బాలిక అటవీ ప్రాంతంలోకి వెళ్లి కనిపించకుండాపోయింది. మూడు రోజుల అనంతరం పెంపుడు కుక్క బయటకు రాగా.. బాలిక మాత్రం ఇంతవరకు ఆచూకీ లభించలేదు. బాలికను ఎవరైనా అపహరించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికను అపహరించి.. హత్య చేసి ఉంటారా? లేదా అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని అనే అనుమానాలు వస్తున్నాయి. కరాటే కల్యాణి ఎంట్రీ ఇచ్చి.. 'బాలికను అమావాస్య రోజు నర బలి ఇచ్చి ఉంటారు' అని వ్యాఖ్యానించడంతో బాలిక అదృశ్యం కేసు తీవ్ర సంచలనం రేపుతోంది.
FIFA World Cup 2026: ఎల్లో కార్డు రద్దు.. FIFA ప్రపంచ కప్ చరిత్రలో మొదటి ఆటగాడు.. ఎవరంటే..??
Secunderabad, Telangana:FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 లో సరికొత్త హిస్టరీ క్రియేట్ అయ్యింది. ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత అరుదైన, మొట్టమొదటి ఘటనకు ఈ మెగా టోర్నీ వేదికైంది. అమెరికా వెటరన్ డిఫెండర్ టిమ్ రీమ్ ఫిఫా వరల్డ్కప్ హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్ రెఫరీ చేసిన ఒక తప్పుడు నిర్ణయం నుంచి వార్ (VAR - Video Assistant Referee) టెక్నాలజీ ద్వారా లబ్ధి పొందిన ప్రపంచపు మొట్టమొదటి ఆటగాడిగా టిమ్ రీమ్ రికార్డుకెక్కాడు.
అసలు ఏం జరిగిందంటే?
గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఒక ఫౌల్ జరిగింది. అయితే, ఆ ఫౌల్ చేసింది అమెరికాకు చెందిన వేరే ఆటగాడు అయినప్పటికీ.. మ్యాచ్ రెఫరీ పొరపాటున టిమ్ రీమ్కు ఎల్లో కార్డ్ చూపించాడు. ఫుట్బాల్ భాషలో దీనిని మిస్టేకెన్ ఐడెంటిటీ అంటారు. ఒకవేళ ఆ ఎల్లో కార్డ్ అలాగే ఉండి ఉంటే, అది మ్యాచ్ సమీకరణాలను, సదరు ఆటగాడి తదుపరి మ్యాచ్ల అవకాశాలను దెబ్బతీసేది.
రెఫరీ తప్పుడు నిర్ణయాన్ని గమనించిన వీడియో అసిస్టెంట్ రెఫరీ బృందం వెంటనే రంగంలోకి దిగింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా ఒక మిస్టేకెన్ ఐడెంటిటీ చెక్ కోసం వార్ టెక్నాలజీని ఉపయోగించారు. రీప్లేలను నిశితంగా పరిశీలించిన తర్వాత, ఫౌల్ చేసింది టిమ్ రీమ్ కాదని స్పష్టమైంది. దీనితో మైదానంలోని రెఫరీ తన తప్పును సరిదిద్దుకుని, టిమ్ రీమ్కు ఇచ్చిన ఎల్లో కార్డును రద్దు చేశారు.
ఈ ఘటనతో టిమ్ రీమ్ అయాచితంగా హిస్టరీ బుక్స్లోకి ఎక్కాడు. వార్' టెక్నాలజీని కేవలం గోల్స్, రెడ్ కార్డ్స్ లేదా పెనాల్టీల కోసమే కాకుండా.. ఇలాంటి తప్పుడు గుర్తింపులను సరిదిద్దడానికి ఉపయోగించి విజయం సాధించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ అరుదైన ఫుట్బాల్ రికార్డు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. క్రీడల్లో టెక్నాలజీ వాడకం ఎంత పారదర్శకతను తెస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని పలువురు కొనియాడుతున్నారు.
Also Read: ఫిఫా చరిత్రలోనే అమెరికా సంచలనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dwidasha Yoga 2026: జూన్ 14 నుంచి ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ద్విదశ యోగంతో కోటీశ్వర యోగం!
Hyderabad, Telangana:Dwidasha Yoga 2026 Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల ప్రత్యేక కలయిక జరిగినప్పుడు.. ఆ సమయంలోనే శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఏర్పడిన రాజయోగాలు తప్పకుండా మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయి.. ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ద్విదశ యోగం కూడా ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే జూన్ 14వ తేదీన ఈ యోగం ఏర్పడింది. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన యోగంగా పరిగణిస్తారు. చంద్రుడు మేషరాశిని వదిలి.. ఉచ్చరాశిగా భావించే వృషభంలోకి సంచారం చేసినప్పుడు ఈ యోగం ఏర్పడింది.. జూన్ 14వ తేదీన 9 గంటల వరకు అదే రాశిలో చంద్రుడు కొనసాగుతూ ఉంటాడు. ఇదే సమయంలో బుధుడు తన సొంత రాశిగా భావించే మిథునంలోకి ప్రవేశించడం వల్ల, చంద్రుడు బుధులు అరుదైన కలయికతో కొన్ని రాశుల వారికి అదృష్టం ఊహించని స్థాయిలో వరించబోతోంది అంతేకాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారాలు కూడా చాలావరకు లాభసాటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి
చంద్రుడు ఇదే రాశుల ఉండడం కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయం ఒక వరం కంటే ఎక్కువగా భావించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అలాగే పనుల్లో అద్భుతమైన శుభవార్తలు వినే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలతో పాటు గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి
సొంత రాశిలో బుధుడు ఉండడం కారణంగా వీరిపై కూడా ద్విదశ యోగ ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి అలాగే స్థిరమైన ధన ప్రవాహం కూడా లభించి ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు అద్భుతమైన పదోన్నతులు పొంది.. జీతాలు కూడా భారీగా పెంచుకోగలుగుతారు. గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ పరిష్కారం లభించి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది..
కన్య రాశి
చంద్ర-బుధ గ్రహాల సంయోగం కారణంగా కన్య రాశి వారికి మానసిక ప్రశాంతత విపరీతంగా పెరుగుతుంది. కొంతకాలంగా మనసులో ఉన్న మానసిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం తోడు లభించి.. విపరీతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలాలు లభించే అవకాశాలున్నాయి. కార్యాలయంలో అధికారులు మీపై హర్షం కూడా వ్యక్తం చేస్తారు..
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆనందంతో పాటు సానుకూల ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా మనసు కూడా చాలా ఉల్లాసంగా మారుతుంది.. అన్ని విషయాల్లో మీ కుటుంబ సభ్యులతో పాటు ప్రియమైన వారి సపోర్టు లభించి.. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. మానసిక ఉపశమనం లభించడమే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి..
మీన రాశి
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు శని ప్రభావం నడుస్తున్నప్పటికీ చంద్రుడి ప్రభావంతో కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీడియా రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా అనుకున్న పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలనుంచి విముక్తి పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Video: రోప్ జంప్లో ఇన్స్ట్రక్టర్ల ఘోర తప్పిదం.. భద్రతా తాడు కట్టకుండానే యువతిని తోసేయడంతో దుర్మరణం! ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Hyderabad, Telangana:Brazil Woman Dies After Thrown Without Rope Video: సాహస క్రీడలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తుల నిర్లక్ష్యం లేదా నిర్వాహకుల అజాగ్రత్త వల్ల పరిస్థితులు చేయిదాటి ప్రాణనష్టం జరుగుతోంది. రోప్ జంపింగ్ లేదా బంజి జంపింగ్ వంటి క్రీడల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ప్రాణాంతకంగా మారుతోంది. బ్రెజిల్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం కూడా అలాగే జరిగింది. భద్రతా తాడు సరిగ్గా కట్టకపోవడంతో ఒక యువతి సుమారు 100 అడుగుల ఎత్తు నుండి పడి అక్కడికక్కడే మరణించింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. బ్రెజిల్లోని లిమేరలో ఉన్న పోంటే డోస్కోలేటో ట్రైల్ వద్ద రోప్ జంపింగ్ చేయడం చాలా సాధారణం. పర్యాటకులు ఇక్కడ ఎంతో ఆసక్తిగా ఈ సాహసాలు చేస్తుంటారు. శనివారం రోజు 21 ఏళ్ల ఎడ్వర్డా అనే యువతి జంపింగ్ కోసం వచ్చింది. ఆ సమయంలో అక్కడ ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కానీ, ఆమెకు సేఫ్టీ తాడు కట్టకుండానే పైనుంచి తోసేశారు. ఈ ఘటన తర్వాత ఇద్దరు ఆర్గనైజర్లు భయంతో అడవిలోకి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు గాలింపు జరిపి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించినందుకు వారిని విచారిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత సంబంధిత అడ్వెంచర్ కంపెనీ తన సోషల్ మీడియా ఖాతాలను కూడా తొలగిస్తోంది.
వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒక యువతిని పైనుంచి కిందకు తోసేయడం కనిపిస్తుంది. సాధారణంగా బంజీ లేదా రోప్ జంపింగ్ చేసేటప్పుడు రక్షణ తాడు కడతారు. కానీ ఇక్కడ సిబ్బంది ఆమెకు తాడు కట్టకుండానే నిర్లక్ష్యంగా తోసేశారు. దీంతో ఆమె కిందపడి మరణించింది. దీంతో పక్కనే ఉన్న మరికొంత మంది అరుపులు కేకలు వేశారు. పోలీసుల ప్రకారం.. మృతురాలితో పాటు మరో ఇద్దరు కూడా ఆమెతో వచ్చారు. నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించినా, పోలీసులు వారిని పట్టుకున్నారు. భద్రతా తనిఖీలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ప్రాణనష్టాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రాకపోకలను నియంత్రించే, నిర్వహించే పూర్తి బాధ్యత మున్సిపాలిటీకి ఉందని ఫెడరల్ ప్రభుత్వం తెలిపింది.
READ ALSO: సిద్దిపేటలో ఘోర ప్రమాదం.. హైవేపై కంట్రోల్ తప్పిన కారు, ఇంటి ముందు కూర్చున్న ముగ్గురు మహిళలు దుర్మరణం!
READ ALSO: రక్షించాల్సిన పోలీసే రాక్షసుడయ్యాడు.. హన్మకొండలో వివాహితపై ఎస్ఐ అత్యాచారం, అసలేం జరిగిందంటే?
JUST IN: 21-year-old dies after workers forget to attach safety rope and push her off 40-meter bridge in São Paulo’s Limeira, Brazil pic.twitter.com/ceqniPJkUs
— Rapid Report (@RapidReport2025) June 13, 2026
సోషల్ మీడియాలో ఇలాంటి వైరల్ వీడియోలు ఎన్నో గతంలో కూడా చూశాం. రోప్ లేదా బంగీ జంప్ల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. సరైన భద్రత చర్యలు లేకపోవడంతో అమాయకులు ఎంజాయ్ చేయడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయి శవాలుగా వెళ్తున్నారు. టూరిస్ట్ ప్రాంతాలలో నిర్వాహకులు నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. కానీ ఏమాత్రం వ్యక్తులు కూడా ఏమరుపాటుగా ఉన్న ప్రాణాలు కోల్పోతున్నారు.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
