బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యక్రమంలో తప్పున లోపం చేసింది
Baopet, Telangana:కరీంనగర్-వేములవాడ ప్రధాన రహదారిని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పాటు బావుపేట గ్రామంలో పెద్ద ఎత్తున గ్రానైట్ ఫ్యాక్టరీ ఉండడంతో తరచూ లారీలు వెళ్తుండడంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సంబంధిత శాఖ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంజాల స్వామిగౌడ్, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిరిపురం నాగప్రసాద్, గ్రామశాఖ అధ్యక్షుడు ఆరాయి మల్లేశం, కాజీపూర్ మాజీ వార్డు సభ్యుడు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Nara Lokesh: కోటి ఇళ్లకు చేరిన 'ఇంటింటికీ తెలుగుదేశం-2026'.. మంత్రి నారా లోకేశ్ హర్షం
Nuzendla, Andhra Pradesh:House To House TDP Programme: అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రెండేళ్ల పరిపాలనలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంలో గొప్ప మైలురాయి సాధించింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వివరించడంలో భాగంగా టీడీపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ-2026 కార్యక్రమం నిర్వహించగా ఆ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఆ కార్యక్రమం కోటి ఇళ్లకు పైగా చేరింది. దీంతో నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేస్తూ 'ఎక్స్' వేదికగా కీలక ప్రకటన చేశారు.
'కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది' అని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. 'ఇంటింటికీ తెలుగుదేశం-2026' కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలిపారు. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది అని పార్టీ శ్రేణులను అభినందించారు. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ఇంటింటి ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జూలై 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు నిరంతరాయంగా 'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమం నిర్వహించాలని ప్రకటించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు జూలై 26వ తేదీన పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని తెలుగు తమ్ముళ్లకు సూచించారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను టీడీపీ శ్రేణులు ఇంటింటికి చేర్చడంలో భాగమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గ్రామ గ్రామాన నాయకులు తిరిగి కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' హామీల అమలు, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రజలకు వివరించారు. వైఎస్సార్సీపీ పాలనకు, కూటమి పాలనకు మధ్య ఉన్న తేడాను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. అయితే నిర్దేశిత గడువుకు ముందే ఇంటింటికి టీడీపీ కార్యక్రమం లక్ష్యం పూర్తి కావడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి నారా లోకేశ్ అభినందించారు.
10 అడుగుల భారీ కోబ్రాతో స్నేక్ క్యాచర్ స్టంట్స్.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Giant 10-foot Cobra Snake Video Viral: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అద్భుతమైన.. వింతైన కంటెంట్ చెక్కర్లు కొడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విష సర్పాల వీడియోలు వస్తే.. సోషల్ మీడియా వినియోగదారులు ఎంతగానో ఆసక్తిగా వాటిని చూసి ఇతరులకు కూడా షేర్ చేస్తూ ఉంటారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఒక వీడియో మాత్రం వీక్షకులను ఆశ్చర్యపరచడమే కాకుండా తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.. ఏకంగా 10 అడుగులకు పైగా పొడవున్న భారీ కోబ్రాతో ఒక స్నేక్ క్యాచర్ చేసిన సాహసోపేతమైన విన్యాసాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పడగ విప్పిన మృత్యువుతో విన్యాసం..
నివాస ప్రాంతాల్లోకి అనుకోకుండా వచ్చిన భారీ కోబ్రాను పట్టుకోవడానికి స్థానికులు ఒక స్నేక్ క్యాచర్ను అక్కడికి పిలిపించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఆ వ్యక్తి సుమారు 10 అడుగుల పొడవున్న ఆ మహాసర్పాన్ని ఎంతో సింపుల్గా పట్టుకున్నాడు.. అయితే సాధారణంగా రక్షించిన తర్వాత వెంటనే.. ఒక సురక్షితమైన బాక్సు లేదా నల్లటి సంచిలో ఎక్కించాల్సిన ఆ స్నేక్ క్యాచర్ అక్కడ అనూహ్య ప్రవర్తనతో అందర్నీ బిత్తరపోయేలా చేసాడు..
ఆ పామును ఒక చెట్టు కాండం చుట్టూ తిప్పి.. ఒక చేతితో దాని తోకను గట్టిగా పట్టుకున్నాడు.. ఆ భారీ నాగుపాము కోపంతో స్వీకరంగా బుసలు కొడుతూ.. భారీ పడగ విప్పి ఉండడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.. ఆ వ్యక్తి ఏ మాత్రం భయపడకుండా దాంతో ఆడుకోవడం మొదలుపెట్టడం కూడా మీరు గమనించవచ్చు. అంతేకాకుండా.. అత్యంత ప్రమాదకరమైన ఆ పాము పడగపై భాగాన్ని.. తన చేతులతో మిమ్ములతో విన్యాసాలు చేశాడు. కోబ్రా ఏ క్షణంలోనైనా కాటు వేస్తే ప్రాణం పోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. అతడు అత్యంత నిర్లక్ష్యంగా దానితో ప్రవర్తించిన తీరు అక్కడున్న స్థానికులు మొబైల్ కెమెరాల్లో రికార్డు చేశారు..
సోషల్ మీడియాలో వైరల్..
ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్తో ట్రెండ్ అవుతూ వచ్చింది. అయితే, అతడు చేసిన విన్యాసాలకు వన్యప్రాణి సంరక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రెస్క్యూ అంటే వన్యప్రాణులను కాపాడటమే తప్ప.. లైకులతో పాటు వ్యూస్ కోసం వాటి ప్రాణాలతో స్టంట్ లు చేయడం కాదని వారు మండిపడుతున్నారు. అలాగే పాములను రెచ్చగొట్టడంతో పాటు వాటి ప్రవర్తనను అవమానించడం చట్టరీత్యా నేరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక క్షణం పట్టు తప్పిన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందని.. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలను ఎవరు అనుసరించవద్దని కొంతమంది ఈ వీడియో చూసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు..
Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
AP Employees JAC: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పీఆర్సీ కోసం రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు!
Vijayawada, Andhra Pradesh:AP Employees PRC Latest News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వానికి మధ్య గత కొద్ది రోజులుగా కీలక చర్చలు, పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తమకు రావాల్సిన కొత్త పీఆర్సీ, పాత బకాయిల చెల్లింపులపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ఏపీ ఉద్యోగుల జేఏసీ (JAC) నేతలు దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించారు.
ఉద్యోగ సంఘాల ఈ కొత్త కార్యాచరణ ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేసింది. ఈ ఆందోళనల నేపథ్యంలో, ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వ్యవహార శైలిపై మంత్రి అనగాని నేరుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బొప్పరాజు కూడా స్పందిస్తూ, తమకు ఎలాంటి రాజకీయ అజెండా లేదని, కేవలం ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసమే తాము నిలబడ్డామని స్పష్టం చేశారు.
ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో, ఉద్యోగుల సమస్యలకు ముగింపు పలకడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తానే స్వయంగా చర్చలు జరపాలని నిర్ణయించి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు (శనివారం) అమరావతి పరిధిలోని ఉండవల్లి నివాసంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సీఎం ముఖాముఖి సమావేశం కానున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు, పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిల వంటి సున్నితమైన ఆర్థిక అంశాలపై లోతుగా చర్చించనున్నారు.
అంతకుముందు గురువారం నాడు ఏపీ జేఏసీ నాయకులు సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా కలిశారు. ఆ సమయంలో ఉద్యోగుల ఆందోళనలకు దారితీసిన పరిస్థితులను విద్యాసాగర్ ముఖ్యమంత్రికి సవివరంగా వివరించారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు.
అయితే, సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చిస్తున్న తరుణంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు ఎందుకు తొందరపడుతున్నాయని, ఓర్పు పట్టలేకపోవడానికి గల కారణం ఏమిటని సీఎం ప్రశ్నించినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులకు చేయాల్సిన న్యాయమైన పనులను ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోందని ఆయన వివరించారు. శనివారం జరగబోయే ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశంలో సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ప్రభుత్వం తరఫున ఎలాంటి శుభవార్త వినబోతున్నారనే దానిపై ఉద్యోగ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read: మీ వీధిలో వినాయక మండపం పెడుతున్నారా? ఒకే క్లిక్తో పోలీస్ పర్మిషన్..రూ.1 ఖర్చు లేదు!
Also Read: ఏపీలో స్థానిక ఎన్నికల సమరం షురూ..అక్టోబరులోగా పోలింగ్ పూర్తి చేయాలని నిర్ణయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sangareddy: జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ నాగుపాము కలకలం.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Snake spotted in Zaheerabad govt hospital: ఇటీవల పాములు ఎక్కువగా అడవులు, పొదలలో నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. అంతే కాకుండా అవి చీకటిగా ఉండే ప్రదేశాలలో దూరి హల్ చల్ చేస్తున్నాయి. కొన్నిసార్లు కోబ్రాలు బూట్లలో లేదా బెడ్ ల కింద నక్కి ఉంటున్నాయి. అంతే కాకుండా ఇటీవల వాహనాల్లో సైతం పాములు దూరిదాక్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇటీవల పాముల కాటుకు గురైన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ పాము హల్ చల్ చేసింది. డెలివరీ, చిన్నపిల్లల వార్డు సమీపంలోకి నాగు పాము వచ్చింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ పాము కలకలం
జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భారీ పాము ప్రత్యక్షం
డెలివరీ, చిన్నపిల్లల వార్డు సమీపంలోకి వచ్చిన పాము
పాము కనిపించడంతో రోగులు, బాలింతలు, చిన్నారుల బంధువుల్లో తీవ్ర భయాందోళన
భయంతో పరుగులు తీసిన రోగులు,… pic.twitter.com/V02rXlBd8T
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 4, 2026
పాము కనిపించడంతో రోగులు, బాలింతలు, చిన్నారుల బంధువుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. వెంటనే అక్కడి నుంచి భయంతో రోగులు, వారి బంధువులు పరుగులు తీశారు. ఆ తర్వాత వెంటనే ఆస్పత్రి సిబ్బంది స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు.
కానీ వారు వచ్చేలోపు అక్కడున్న వారు కర్రలతో పామును చంపివేశారు. ఆ తర్వాత దగ్గరలోని అడవులలోకి తీసుకెళ్లి పాడేశారు. మరోవైపు ఆసుపత్రి పారిశుధ్యంపై రోగుల బంధువుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read more: Little Krishna Video: అరెవావ్.. బాల్కనీలో కూర్చుని వెన్న తింటున్నచిన్నారి కన్నయ్య.. క్యూట్ వీడియో..
చెత్త, పొదలు పెరిగిపోవడంతోనే పాములు ఆసుపత్రిలోకి వస్తున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. పామును అక్కడి వారు బైటకు తీసుకెళ్లి పోవడంతో బాలింతలు, పసిపిల్లలకు ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు సైతం ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bolisetty Bommidi Nayakar: "మా ఎమ్మెల్యేను కాదు, మీ బావమరిదిని ప్రశ్నించండి!" చంద్రబాబు వ్యాఖ్యలపై జనసేన నేత కౌంటర్
Vijayawada, Andhra Pradesh:Bolisetty Satyanarayana Bommidi Nayakar: ఆంధ్రప్రదేశ్లో గత రెండున్నరేళ్లుగా అధికార కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా కొనసాగుతున్న టీడీపీ, జనసేన పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశాలకు హాజరు కావడం లేదని, అలాగే సీఎం చంద్రబాబు పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నరసాపురం పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు, స్థానిక జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
జిల్లా అంతా ప్రగతి పథంలో ఉన్నా, నరసాపురం నియోజకవర్గం మాత్రం వెనుకబడిపోయిందని ఆయన అన్నారు. నియోజకవర్గ అధికారులు, ఎమ్మెల్యే సక్రమంగా పనిచేయడం లేదని విమర్శిస్తూ, 25 పరిపాలనా సూచికల్లో 23 సూచికలు ప్రతికూలంగా ఉండటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు.
సమస్యలను కేవలం తన వద్దకు తీసుకురావడమే కాకుండా, ప్రజా సహకారంతో స్థానికంగానే పరిష్కరించుకోవాలని, తక్షణమే చురుకైన నోడల్ అధికారిని నియమించుకోవాలని సూచించారు. ఈ బహిరంగ విమర్శలతో జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సభలోనే తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
ఈ ఉదంతంపై జనసేన నేత బోలిశెట్టి సత్యనారాయణ అత్యంత ఘాటుగా స్పందించారు. ప్రజల సమక్షంలో ఒక ఎమ్మెల్యే పనితీరును ప్రశ్నించడం మంచి ప్రజాస్వామ్య సంప్రదాయమేనని అంగీకరిస్తూనే, చంద్రబాబు నాయుడి ద్విముఖ ప్రమాణాలపై చురకలు అంటించారు.
ఈ వినూత్న సంప్రదాయాన్ని చంద్రబాబు తన సొంత బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ నియోజకవర్గంలోనో, లేదా దెందులూరులో తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలోనో ప్రారంభించి ఉంటే బాగుండేదని ట్వీట్ చేశారు. ప్రజాప్రతినిధుల పనితీరును ప్రశ్నించే ఈ విధానం కూటమిలోని అందరికీ సమానంగా వర్తిస్తేనే దానికి నిజమైన విలువ ఉంటుందని, అప్పుడే కూటమికి మేలు జరుగుతుందని స్పష్టం చేశారు.
Also Read: ఏపీలో స్థానిక ఎన్నికల సమరం షురూ..అక్టోబరులోగా పోలింగ్ పూర్తి చేయాలని నిర్ణయం..
Also Read: మీ వీధిలో వినాయక మండపం పెడుతున్నారా? ఒకే క్లిక్తో పోలీస్ పర్మిషన్..రూ.1 ఖర్చు లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Video: ఇస్రో మరో అద్భుత విజయం.. EOS-05 ఉపగ్రహం ప్రయోగం సక్సెస్, శత్రుదేశాలకు ఇక దడదడే!
Hyderabad, Telangana:ISRO successfully launches EOS-05: తెల్లవారుజామున చీకటిని చీల్చుకుంటూ ఇస్రో ఈ అద్భుత విజయాన్ని అందుకుంది. GSLV F17 ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని ప్రయోగించి, దానిని ట్రాన్స్ఫర్ ఆర్బిటల్లోకి విజయవంతంగా పంపినట్లు ఇస్రో వెల్లడించింది. మూడు దశల ప్రక్రియ అనంతరం ఉపగ్రహం తన లక్ష్యాన్ని చేరుకోగా, ఇస్రో సిబ్బంది అంతా వేడుకగా జరుపుకున్నారు. ఈ ఉపగ్రహం 36 వేల కిలోమీటర్ల ఎత్తు నుండి సరిహద్దుల్లో శత్రు దేశాల కదలికలను కూడా గుర్తించగలదు. ఈ విజయం ఇస్రోకు ఎంతో కీలకం. భూభాగాల పర్యవేక్షణకు, విపత్తులను ముందుగానే పసిగట్టే రక్షణ వ్యవస్థలకు ఇది ఎంతో దోహదపడుతుంది. భారత్ సాధించిన గొప్ప విజయమిది.
శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి జరిగిన ఇది 17వ ప్రయోగం. శాస్త్రవేత్తలు దీనిని 'ఆకాశంలో నిఘానేత్రం' అని పిలుస్తున్నారు. ఇది ఎంతో అద్భుతమైన ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం. ప్రారంభ దశలో ఈ స్పేస్ క్రాఫ్ట్ కేవలం 1536 కిలోల బరువును మోయాల్సి ఉండగా, ఇప్పుడు 2365 కిలోల బరువున్న అత్యంత భారీ ఉపగ్రహాన్ని కూడా అంతరిక్షంలోకి చేర్చినట్లు ఇస్రో ప్రకటించింది.
ఈ చారిత్రాత్మక ప్రయోగంలో EOS-05 ఉపగ్రహం ఆశించిన ఖచ్చితమైన కక్ష్యలోకి ప్రవేశించడానికి GSLV F17 వాహనం కీలక పాత్ర పోషించిందని ఇస్రో అధిపతి డాక్టర్ వి. నారాయణ తెలిపారు.
మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్ కూడా మాట్లాడుతూ.. ఇప్పటివరకు GSLV ద్వారా కక్ష్యలోకి పంపిన అత్యంత బరువైన ఉపగ్రహం ఇదేనని, ఇది మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానంగా ఈ మిషన్లో భాగంగా, ఈ ఉపగ్రహం 36 వేల కిలోమీటర్ల ఎత్తు నుండి భారతదేశాన్ని నిరంతరాయంగా వీక్షించేలా రూపొందించారు. ఇది దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, EOS-05 విశాలమైన ప్రాంతాల చిత్రాలను నిత్యం తీస్తుంది. సరిహద్దులు, సముద్ర ప్రాంతాలు, సున్నితమైన ప్రదేశాలలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మన నిఘా వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుంది.
EOS-05 భారత సరిహద్దుల్లో అత్యధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను అందిస్తుంది. వీటిని ప్రధానంగా వరదలు, తుఫానులు, అటవీ అగ్ని ప్రమాదాలు, పర్యావరణ సమస్యలను పర్యవేక్షించడానికి ఉపయోగిస్తారు. ఈ ఉపగ్రహం ఎందుకు అంత ముఖ్యమైనదంటే, ఇది సరిహద్దు ప్రాంతాల్లో కొత్త రహదారులు నిర్మించడం లేదా భూ వినియోగంలో వచ్చే మార్పులను పాత చిత్రాలతో పోల్చి చూసి, ఆ మార్పులను ఖచ్చితంగా గుర్తిస్తుంది.
Another giant leap for India in Space!
Kudos to Team @isro on the successful launch of GSLV-F17/EOS-05.
EOS-05 is a state-of-the-art Earth Observation satellite and India’s first imaging satellite from Geosynchronous Orbit, enabling advanced imaging across visible, infrared,… pic.twitter.com/1HHJrWM7ze
— Dr Jitendra Singh (@DrJitendraSingh) September 3, 2026
చైనా, పాక్కు చెక్..?
ఈ సమాచారాన్ని ఇతర నిఘా వ్యవస్థలతో కలిపి కూడా ఉపయోగిస్తారు. భారతదేశం చైనా, పాకిస్తాన్లతో విస్తారమైన భూ సరిహద్దులను పంచుకుంటోంది. కొన్ని ప్రాంతాల్లో సైనికులు స్వయంగా వెళ్లలేని కష్టతర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఈ ఉపగ్రహం అందించే చిత్రాలు, అదనపు సమాచారం మన సైనికులకు ఎంతో ఉపయోగపడుతుంది. సరిహద్దుల్లో జరిగే మార్పులను ఇది గ్రహించడమే కాకుండా, డ్రోన్లు, రాడార్ల ద్వారా వచ్చే సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
సముద్ర ప్రాంతంలో కూడా..
EOS-05 మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం భూ సరిహద్దులనే కాకుండా, సముద్ర ప్రాంతాల్లో కూడా కీలకమైన నిఘా వేస్తుంది. హిందూ మహాసముద్రం, భారత తీర ప్రాంతాల్లో జరిగే ప్రధాన మార్పులను ఇది అంచనా వేస్తుంది. ఇది నేరుగా సైనికుడిలా పనిచేయకపోయినా, మనకు ఎంతో ఉపయోగపడే నిఘా చిత్రాలను అందిస్తుంది. అలాగే వరదలు, తుఫానుల వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే పర్యవేక్షించడానికి కూడా ఈ చిత్రాలు ఎంతో కీలకం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Old City Metro: మెట్రో రైలుపై కీలక ప్రకటన.. హైదరాబాద్ పాతబస్తీవాసులకు తెలంగాణ సీఎం తీపి కబురు
Hyderabad, Telangana:Hyderabad Metro Rail: హైదరాబాద్లోని పాతబస్తీ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి భారీ శుభవార్త వినిపించారు. వచ్చే ఎన్నికల వరకు మెట్రో రైలును ప్రారంభిస్తామని ప్రకటించారు. గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రోను పూర్తి చేసి.. వచ్చే ఎన్నికల్లో మెట్రోలో వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందామంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని చంచల్గూడ - సంతోష్నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'గత ప్రభుత్వం (కేసీఆర్) కేవలం కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకుంది. బ్రిడ్జి నిర్మాణానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదు. కానీ మా ప్రభుత్వం నిధులు ఇచ్చి బ్రిడ్జిని పూర్తి చేసింది' అని వెల్లడించారు. 'ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని ఇక్కడ ప్రతీ గల్లీ నాకు తెలుసు. అసదుద్దీన్ అడిగిన ప్రతీ అభివృద్ధి పనులను మంజూరు చేయాలని ఈ వేదికగా అధికారులను ఆదేశిస్తున్నా' అని తెలిపారు. 'ఎమ్మెల్యే బలాల కళాశాల అభివృద్ధి కోసం రూ.20 కోట్లు అడిగారు. దీనికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నా' అని ప్రకటించారు. 'నేను నిధులు మంజూరు చేస్తా.. కానీ ఏడాదిన్నరలో అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే' అని స్పష్టం చేశారు.
'విద్య కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ హిందుస్థాన్ కు మద్దతుగా నిలిచి దేశభక్తి చాటుకున్నారు. రాజకీయ సిద్ధాంతాలు వేరు కావచ్చు.. దేశ భక్తి విషయంలో అందరం ఒక్కటే' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'మీరు కేబుల్ బ్రిడ్జి చూడాలంటే దుర్గం చెరువుకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే మేం మీరాలం చెరువులో 3 కి.మీ మేర కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నాం' అని చెప్పారు.
'వచ్చే ఎన్నికల్లోగా గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రోను పూర్తి చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మెట్రోలో వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నట్లు తెలిపారు. 'హిందూ, ముస్లిం కలిసి నడిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నారు' అని వివరించారు.
'మూసీని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని ప్రోత్సహిస్తాం. ఇక్కడి పేద ముస్లింలకు ఉపాధి కల్పించేలా చూస్తాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్- చాంద్రాయణగుట్ట- రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించబోతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా మేం అభివృద్ధి చేయాలనుకుంటుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయని విమర్శించారు.
'ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత అందిస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు… ఎన్నికలు ముగిసాక అభివృద్ధి ఒక్కటే లక్ష్యం. మనందరం కలిసికట్టుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'రూ. 500 కోట్లతో మీరాలం ట్యాంకును అత్యద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. భూసేకరణ ప్రక్రియ పూర్తి కావచ్చిన నేపథ్యంలో వచ్చే డిసెంబర్లో గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభిస్తాం' అని వెల్లడించారు.
G Chinna Reddy: పదవి తొలగింపుపై చిన్నారెడ్డి తొలి స్పందన.. 'ఒక్క పోటుతో కూల్చేశారు'
Wanaparthy, Telangana:Wanarparthy: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి స్పందించారు. తనకు పదవులపై ఎలాంటి వ్యామోహం లేదని స్పష్టం చేశారు. పదవి ఉన్నా లేకపోయినా తన వ్యక్తిగత గౌరవం తనకు ఉందని ప్రకటించారు. ప్రస్తుతం తన సొంత ఊరిలో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్న ఆయన మారిన రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో నమ్మకంగా పనిచేసిన తనకు ఒక్క పోటుతో కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తనను పదవి నుంచి తొలగించడంపై జిల్లెల చిన్నారెడ్డి మనస్తాపం చెందారు. పదవి పోయినా తాను ఎలాంటి పదవి కోసం ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని కలవడానికి తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని తెలిపారు. 'నాకు పదవులపై వ్యామోహం లేదు. పదవి ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా నా గౌరవం నాకు ఉంది' అని తెలిపారు. ప్రణాళిక సంఘం చైర్మన్ పదవికి సంబంధించి కూడా తనకు ఎలాంటి నిర్దిష్టమైన సమయం లేదని పేర్కొన్నారు.
గతంలో పదవిలో ఉన్న సమయంలోనే తాను ప్రోటోకాల్ను వదులుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చిన్నారెడ్డి గుర్తుచేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో తన సీనియారిటీపై కూడా జిల్లెల చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ హయాం నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు, తాను సీనియర్ నాయకులుగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం పదవి, ప్రోటోకాల్ కంటే తన వ్యక్తిగత గౌరవానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. 'నా మనుషులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్తే మెడ పట్టి బయటకు దొబ్బుతానని మేఘా రెడ్డి అన్నాడు. అయినా భరించా' అని చిన్నారెడ్డి తెలిపారు.
వనపర్తి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన చిన్నారెడ్డిని అర్ధాంతరంగా పదవి నుంచి తొలగించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదవి నుంచి తొలగించినా కూడా చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2028 ఎన్నికల సమయంలో తన సత్తా ఏమిటో చూపాలనే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించడం ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతంలో ఈ చిన్న తప్పు చేసినా ఫలితం దక్కదు!
Hyderabad, Telangana:Krishna Janmashtami Pooja Rules In Telugu: హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. ఆ దేవదేవుడు శ్రీమహావిష్ణువు అష్టమవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా భక్తులంతా ఎంతో భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ పర్వదినాన బాలకృష్ణుడిని పూజించి.. భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడుతూ ఉంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాల్గవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. అయితే మీరు కూడా ఈ పవిత్రమైన రోజున ఉపవాసాలు పాటిస్తూ ఉంటారా? ఈ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి.. ఎలాంటి తప్పులు చేయకూడదు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పవిత్రమైన రోజున వ్రతం చేయడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం లభించడంతోపాటు భక్తులకు అందరికీ కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే, జన్మాష్టమి ఉపవాస దీక్షలో కొన్ని కఠినమైన నియమాలు పాటించడం తప్పనిస.. ముఖ్యంగా సంతానంలో భాగంగా బాబును మాత్రమే కోరుకుంటున్న వారు తప్పకుండా ఈ సమయంలో ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కఠినమైన నియమాలతో శ్రీకృష్ణుడి పూజను చేయాల్సి ఉంటుంది..
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భక్తులందరూ ప్రధానంగా రెండు రకాలుగా ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు.. భారతదేశంలోని చాలామంది భక్తులు నిర్జల ఉపవాసం పాటిస్తూ ఉంటారు.. ఇది అత్యంత కఠినమైన వ్రతముగా భావిస్తారు. ఇందులో భక్తులు పగలు రాత్రి అనే తేడా లేకుండా కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసాలు ఉంటారు. అర్ధరాత్రి కృష్ణుడి జననం తర్వాత.. స్వామివారికి హారతి ఇచ్చి ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమిస్తారు.. ఇక మరికొంతమంది ఫలహార ఉపవాసం ఉంటారు. వృద్ధులతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా నిర్జీల దీక్ష చేయలేని వారు పలహార ఉపవాసం చేయొచ్చు. ఇందులో పండ్లు, పాలు నీరు మాత్రమే తీసుకుంటూ ఉంటారు..
ముఖ్యంగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఇవి..
ఉపవాసాలు ఉన్నవారే కాదు.. ఇంట్లో వారందరూ ఈరోజు తప్పకుండా ఉల్లిపాయతో పాటు వెల్లుల్లి, మాంసాహారం లాంటి తామసిక ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాల్సి ఉంటుంది. కేవలం తాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీకృష్ణాష్టమి రోజున వ్రతం ఆచరించేవారు వివాదాలతో పాటు అబద్ధాలకు, కఠినమైన మాటలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మనసును ప్రశాంతంగా ఉంచుకొని రోజంతా శ్రీకృష్ణుడి నామస్మరణ చేయాలి. బ్రహ్మచర్యం పాటించడం కూడా అత్యంత మంచిదని పురాణాలు చెబుతూ వస్తున్నాయి..
Also Read: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అరుదైన నవపంచమి రాజయోగం..
శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడని పురాణాలు తెలుపుతున్నాయి.. కాబట్టి జన్మాష్టమి రోజున నిశీధ కాలంలో పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం.. ఈ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11 గంటల 57 నిమిషాల నుంచి సెప్టెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల 43 నిమిషాలకు నిశీధ కాల ముహూర్తం ఉంది. ఈ సమయంలో శ్రీకృష్ణుడి బ్రహ్మోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలి. బాలకృష్ణుడికి ఇష్టమైన వెన్నతో పాటు పట్టిక బెల్లం, పంచమేవ, పండ్లు, రకరకాల స్వీట్లను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పూజా అనంతరం హారతిని ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇక ఉపవాస విరమణ విషయానికొస్తే.. కొంతమంది తమ కుటుంబ ఆచారాల ప్రకారం అర్ధరాత్రి పూజ పూర్తయిన వెంటనే ఉపవాసాన్ని విడిచిపెడతారు. మరి కొంతమంది మరిసటి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు..
Also Read: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అరుదైన నవపంచమి రాజయోగం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
కట్టెల పొయ్యిలో 8 అడుగుల కింగ్ కోబ్రా.. బుసలు కొడుతూ పడగ విప్పిన వీడియో వైరల్!
Hyderabad, Telangana:8-foot Cobra Video Watch: పాము పేరు వింటేనే చాలామందికి ఒంట్లో భయం మొదలవుతూ ఉంటుంది. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన కింగ్ కోబ్రా నేరుగా మన ఇంట్లోని వంట పొయ్యిలో తిష్ట వేసి కూర్చొని ఉంటే? ఊహించడానికి భయంగా ఉంది కదూ.. ఇప్పుడు ఇలాంటి ఘటనకు సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. పాత ఇంటి ఆవరణలోని కట్టెల పొయ్యిలో దూరిన ఒక భారీ నాగుపాము వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు కూడా పెడుతున్నారు..
వైరల్ అవుతున్న ఆ వీడియో వివరాల్లోకి వెళితే. ఒక పాత పెంకుటింటి ముందు వంట చేసుకునేందుకు ఏర్పాటు చేసిన సాంప్రదాయ మట్టి కట్టెల పొయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఆ పొయ్యి లోపల అప్పటికే ఒక భారీ 8 నుంచి 9 అడుగులు కలిగిన కింగ్ కోబ్రా నక్కి కూర్చుని ఉండడం మీరు చూడొచ్చు. ఎవరైతే దగ్గరికి వస్తున్నారన్న అలికిడి రాగానే.. అది పోయి పైభాగం నుంచి తలను పైకి లేపి భారీ పడగల విప్పేసింది.. తీవ్ర ఆగ్రహంతో బుసలు కొడుతూ.. క్షణాల్లో ఎవరిపై దాడి చేస్తుందో అన్న రీతిలో ఉగ్రరూపం ప్రదర్శించడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఆ పాము పరిమాణంతో పాటు అది నిలబడిన తీరు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం..
ఈ వీడియోను ఎవరి చిత్రీకరించారు? ఎక్కడ జరిగింది? అని విషయంపై స్పష్టమైన సమాచార ఇంకా రాలేకపోయినప్పటికీ.. గ్రామీణ ప్రాంతానికి లేదా అడవికి చాలా దగ్గరగా ఉన్న గ్రామానికి చెందిన దృశ్యాలుగా వీడియో చూసి మీరు భావించవచ్చు. అయితే, ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొద్ది రోజులకి విపరీతమైన అటెన్షన్ సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని రోజుల వ్యవధిలోని వేల లైకులు సంపాదించడం విశేషం. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాదిమందికి పైగా చూశారు. అంతేకాకుండా చాలామంది వివిధ రకాల అభిప్రాయాలను కామెంట్లలో వ్యక్తం చేశారు..
Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?
పాత ఇళ్లతో పాటు కట్టెల కుప్పలు, చల్లగా ఉండే చీకటి ప్రదేశాలతో పాటు ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలు పాములకు ఎంతో అనువైన ప్రదేశాలుగా మారుతూ ఉంటాయి.. ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజలు కట్టెల పొయ్యిలో వంట చేసుకునే ముందు.. ఎండు కట్టలను తీసుకునేటప్పుడు కర్రలతో తట్టి పరీక్షించుకోవడం ఎంతో మంచిది.. లేదంటే ఇలాంటి అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాలు దాడి చేసి ప్రాణానికి ముప్పు తెప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఒకవేళ ఇలా అత్యంత పొడవైన ప్రమాదకరమైన పాములు కనిపిస్తే చంపకుండా స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించడం మంచిది..
Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
KTR Padayatra: రేవంత్ రెడ్డి కాస్కో.. పాదయాత్రపై సంచలన ప్రకటన చేసిన కేటీఆర్
Miryalaguda, Telangana:KT Rama Rao: తెలంగాణ రైతులను నిండా ముంచుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తేల్చుకో అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ పాదయాత్రను ప్రకటించారు. రైతుల కోసం తాను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటన చేశారు. తన తండ్రి కేసీఆర్ మాదిరి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు.
రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై నిరసనల్లో భాగంగా మిర్యాలగూడలో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. గతంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కోదాడ నుంచి హాలియా వరకు చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితో తాను కూడా పాదయాత్ర చేపడతానని కేటీఆర్ ప్రకటించారు.
'నాగార్జునసాగర్లో 180 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు చుక్క నీరు కూడా విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోంది' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 2003లో ఇలాంటి పరిస్థితులే ఏర్పడినప్పుడు కేసీఆర్ కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేశారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో నేడు కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరోసారి పాదయాత్ర చేపడతానని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
'సెప్టెంబర్ 14వ తేదీలోపు సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన స్పష్టమైన షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే వేలాది మంది రైతులతో కలిసి పాదయాత్ర చేపడతామని ప్రకటించారు.
Asia Games 2026: గౌతమ్ గంభీర్కు చెక్ పెట్టనున్న బీసీసీఐ..ఆసియా గేమ్స్లో టీమ్ఇండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్!
Mumbai, Maharashtra:Asia Games 2026 VVS Laxman: జపాన్లోని ఐచి-నాగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్ 2026 కోసం భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పేరును అధికారికంగా ఖరారు చేశారు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ ఈ టోర్నీకి దూరంగా ఉండటంతో, భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్కు ఈ జపాన్ పర్యటన బాధ్యతలను బీసీసీఐ కట్టబెట్టింది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) అధిపతిగా ఉన్న లక్ష్మణ్, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత శ్రేయస్ సేనకు ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదించిన ప్రతినిధుల అధికారిక జాబితాలో లక్ష్మణ్ పేరును ప్రతిపాదించారు.
సాధారణంగా అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్లలో భారత క్రికెట్ జట్టుతో పాటు భారీ స్థాయిలో సహాయక సిబ్బంది (సపోర్ట్ స్టాఫ్) పయనిస్తుంటారు. అయితే ఆసియా గేమ్స్ నిబంధనలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది పరిమితి చాలా కఠినంగా ఉంది. భారత్ తరఫున పురుషుల, మహిళల జట్లకు కలిపి కేవలం 20 మంది సపోర్ట్ స్టాఫ్కు మాత్రమే అధికారికంగా అనుమతి లభించింది. ఈ పరిమిత సిబ్బందితోనే పకడ్బందీ ప్రణాళికలు రచించి, భారత జట్టుకు పతకం అందించాల్సిన పెద్ద బాధ్యత ఇప్పుడు లక్ష్మణ్ బృందం భుజస్కంధాలపై పడింది.
భారత జట్టుకు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడం లక్ష్మణ్కు ఇదే మొదటిసారి కాదు. గతంలో జింబాబ్వే పర్యటనలో కూడా శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీ20 జట్టుకు ఆయనే ప్రధాన కోచ్గా మార్గదర్శనం చేశారు. అంతేకాకుండా, 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత జట్టును విజేతగా నిలిపి, దేశానికి స్వర్ణ పతకాన్ని అందించిన గొప్ప ఘనత కూడా లక్ష్మణ్దే. ఆ అపారమైన అనుభవం జపాన్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఈ జపాన్ పర్యటనలో భారత జట్టుకు కేవలం మైదానంలోనే కాకుండా వెలుపల కూడా పలు రకాల విచిత్రమైన సమస్యలు, వసతుల లేమి ఎదురుకానున్నాయి. ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే మైదానం ఒకప్పుడు బేస్బాల్ క్రీడా ప్రాంగణం కావడం గమనార్హం. దానిని తాత్కాలికంగా డ్రాప్-ఇన్ పిచ్లను ఏర్పాటు చేసి క్రికెట్ మైదానంగా మార్చారు. ఇక్కడ క్రీడాకారులకు నివాస, డ్రెస్సింగ్ రూమ్ వసతులు అంతగా బాగోలేవని వార్తలు వస్తున్నాయి.
హోటల్ గదులలో ఇద్దరు ఆటగాళ్లు కలిసి ఉంటే, వారి కిట్ బ్యాగులు పెట్టుకోవడానికి కూడా సరైన స్థలం లేని పరిస్థితి నెలకొంది. డ్రెస్సింగ్ రూమ్ నుండి వాష్ రూమ్ వందల మీటర్ల దూరంలో ఉందనే కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటువంటి విచిత్రమైన పరిస్థితులు, అరకొర వసతుల మధ్య కూడా శ్రేయస్ అయ్యర్ సేన పతకమే లక్ష్యంగా ముందడుగు వేయాల్సి ఉంటుంది.
Also Read: 2027 ప్రపంచకప్కు ముందే రోహిత్ శర్మ రిటైర్మెంట్? హిట్మ్యాన్ అంగీకారం..నేడు కీలకభేటీ
Also Read: మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..57 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్..సెంచరీ జస్ట్ మిస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రూ. 2000 ఖాతాల్లో పడేది అప్పుడే! పిఎం కిసాన్ 24వ విడతపై కీలక అప్డేట్!
Hyderabad, Telangana:PM Kisan 2026: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పీఎం కిసాన్ నిధి యోజన 24వ విడత అతి త్వరలో విడుదల కానుంది. రూ. 2000 ఎప్పుడు జమ అవుతాయా అని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అక్టోబర్ నెలలో ఈ పిఎం కిసాన్ నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంది.
సెప్టెంబర్ చివరి వారంలో కాకపోయినా, అక్టోబర్ నెలలో నిధులు జమ అవుతాయి. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు రూ. 6000 నేరుగా వారి ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేయబడతాయి. వీటిని మూడు విడతలుగా, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. 23వ విడత జూన్ నెలలో విడుదలైనందున, 24వ విడత అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
అయితే, పీఎం కిసాన్ నిధులు పొందాలంటే ముందుగానే ఈ-కేవైసీ పూర్తి చేయాలి. అలాగే ల్యాండ్ రికార్డ్స్ వెరిఫికేషన్ పూర్తయి ఉండాలి. అంతేకాకుండా, మీ బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి. వ్యక్తిగత వివరాలను కూడా అప్డేట్ చేసుకోవాలి.
పీఎం కిసాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్లో 'ఫార్మర్ కార్నర్' క్లిక్ చేస్తే 'నో యువర్ స్టేటస్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా మీ స్టేటస్ను తనిఖీ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా పెండింగ్లో ఉంటే, ఆ సమాచారం కూడా అక్కడ తెలుస్తుంది. కేంద్ర డిప్యూటీ అగ్రికల్చర్ డైరెక్టర్ నేల చౌరాసియా 24వ విడత గురించి అప్డేట్ ఇస్తూ, ఈ నిధులు అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలు పూర్తి చేసుకుంటే, 24వ విడత పీఎం కిసాన్ నిధులు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి. కేవైసీ పూర్తి చేయని రైతులకు నిధులు అందడం ఆగిపోయే అవకాశం ఉంది.
Also Read: ఇండియా పోస్ట్లో 23,757 జీడీఎస్ ఉద్యోగాలు..
Also Read: SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మీ రోల్ నంబర్ షార్ట్లిస్ట్లో ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Eshwar Sai Madhuri Rathod Audio: మాధురి రాథోడ్తో ఈశ్వర్ సాయి సీక్రెట్ కాల్..సోషల్ మీడియాలో ఆడియో వైరల్!
Hyderabad, Telangana:Eshwar Sai Madhuri Rathod Audio Leak: ప్రముఖ ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి వివాహేతర సంబంధానికి సంబంధించిన ఓ వీడియో గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అది ఇప్పుడో పెద్ద వివాదంగా మారింది. తొలుత డ్యాన్సర్ మాధురి రాథోడ్.. ఈశ్వర్ సాయి భార్యపై కేసు పెట్టాలని నిర్ణయించుకోగా.. ఇప్పుడు ఈశ్వర్ సాయిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్లకు సంబంధించిన ఓ పర్సనల్ కాల్ ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది.Konda Surekha: నా ఆత్మగౌరవం కాపాడాలి.. రాహుల్ గాంధీకి రాసిన లేఖ బహిర్గతం చేసిన కొండా సురేఖ
Baddipadaga, Telangana:Konda Surekha vs Revanth Reddy: తనపై చర్యలు తీసుకునేముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మంత్రి కొండా సురేఖ కీలక లేఖలు రాశారు. వాటిలో రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా ఆధారాలు కూడా పొందుపర్చారు. వేటు పడిన అనంతరం కొండా సురేఖ వాటిని విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీకి కూడా కొండా సురేఖ రాశారు. రాహుల్ గాంధీకి రాసిన లేఖతోపాటు పెన్డ్రైవ్లో సాక్ష్యాలు పొందుపర్చారు.
సోనియా గాంధీకి లేఖ రాసిన మరుసటి రోజే ఆగస్టు 23వ తేదీన తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా 6 పేజీల సమగ్ర లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ మహిళా మంత్రినైన తనపై రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న రాజకీయ, పరిపాలనాపరమైన వివక్షపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డితోపాటు సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరు, ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను రాహుల్ గాంధీకి లేఖలో మంత్రి కొండా సురేఖ వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు.
31 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానాన్ని, పార్టీ పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని, ఒక బీసీ మహిళా సీనియర్ నాయకురాలిగా తన ఆత్మగౌరవాన్ని కాపాడాలని రాహుల్ గాంధీని కోరారు. ఈ ఆరోపణలన్నింటిపై నిష్పాక్షిక, సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.
రాహుల్ గాంధీకి రాసిన లేఖలోని కీలక అంశాలు
మంత్రిగా ప్రాధాన్యం కరవు
ప్రభుత్వ ప్రకటనల్లో ఫొటో తొలగించారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనల్లో నా ఫొటోను ఉద్దేశపూర్వకంగా తొలగించారు. ఇది కనీస గౌరవాన్ని నిరాకరించడమే.
శాఖాపరమైన అధికారాల కత్తిరింపు
యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు, సమ్మక్క-సారలమ్మ ఆలయ నిధులను ఒక్క రోజులోనే ఆర్, బీ శాఖకు బదిలీ చేయడం వంటి అంశాల్లో సంబంధిత మంత్రి అయిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకున్నారు.
మాజీ ఓఎస్డీ టార్గెట్
నా మాజీ ఓఎస్డీ సుమంత్ను ముందస్తు సమాచారం లేకుండా తొలగించి.. అరెస్ట్ చేసేందుకు మంత్రి నివాసమైన నా క్వార్టర్స్కు పోలీసులను పంపడం మంత్రి పదవిని, తన గౌరవాన్ని కించపరచడమే. ప్రస్తుతం అతడిపై ఆధారాలు లేని మరో నాన్-బెయిలబుల్ కేసు మోపుతున్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంపై నిర్లక్ష్యం
పక్క నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వరంగల్ స్మార్ట్ సిటీ మోడల్ బస్ స్టాండ్, బొండి వాగు విస్తరణ వంటి పనులకు నిధులు విడుదల చేయకుండా తీవ్ర జాప్యం చేస్తూ వివక్ష చూపుతున్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష
సంబంధిత శాఖ మంత్రికి సమాచారం లేకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించినా పార్టీ అధిష్ఠానం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
పార్టీలో ద్వంద్వ ప్రమాణాలు
జగ్గారెడ్డి టికెట్ విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి.. పరకాలలో మాత్రం రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు పార్టీలోని బీసీ నాయకత్వాన్ని అణచివేయడమే.
కూతురి వ్యాఖ్యలు – సమన్వయ రాజకీయ దాడులు
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కలత చెందిన తన కుమార్తె సుస్మితా పటేల్ వ్యక్తిగతంగా మాట్లాడితే.. ఆమె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయడం దారుణం. కొన్ని రోజులుగా కొండా కుటుంబాన్ని ఒంటరిని చేసేందుకు పలువురు నాయకులతో సమన్వయ రాజకీయ దాడులు చేయిస్తున్నారు.
