బోనాల పండుగలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు
Karimnagar, Telangana:కరీంనగర్, రామనగర, మార్కండేయ కాలనీలో మున్నూరుకాపు కులస్తులు నిర్వహించిన పోచమ్మ నాట్లు ఉత్సవంలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో మెరుగు స్వప్నశ్రీ, పిట్టల రవీందర్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నెల్లి నరేష్, పెద్దిగారి తిరుపతి, ఉప్పరి అజయ్, అల్వాల భరత్, కంపల్లి కీర్తికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
PM Modi CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. ఏం మాట్లాడారంటే?
Delhi, Delhi:PM Modi CM Revanth Reddy Meeting: భారత ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి నమూనాను రేవంత్ వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యాలను ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు.Indian Sailors Died: అమెరికా దాడిలో ముగ్గురు భారతీయులు దుర్మరణం..ఒమన్ తీరంలో ఘోరంగా అటాక్!
Dibab, Muscat Governorate:Gold Price Crash: భారీగా పడిపోతున్న బంగారం ధరలు..ఇదే జరిగితే గోల్డ్ రేటు కుప్పకూలిపోవడం ఖాయం
Hyderabad, Telangana:Gold Price Crash News: బంగారం కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ షాకిస్తోంది. గత రెండు వారాలుగా పసిడి, వెండి ధరలు భారీగా క్రాష్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ పరుగు, అమ్మకాల ఒత్తిడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఏకంగా ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా బలంగా పడింది. అయితే ఈ తగ్గుదల ఇలాగే కొనసాగుతుందా? రానున్న రోజుల్లో పసిడి రేట్లు మరింత పతనమవుతాయా? అనే విషయాలపై మార్కెట్ నిపుణుల నుండి ఆసక్తికర అంచనాలు వెలువడుతున్నాయి.
ధరలు కుప్పకూలడానికి కారణాలు..
బంగారం ధరలు కుప్పకూలడం వెనుక అంతర్జాతీయ మార్కెట్లో ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ డాలర్ విలువ పెరగడంతో ఇతర కరెన్సీలు ఉపయోగించే దేశాలకు బంగారం కొనుగోలు భారం పెరిగింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ తగ్గింది.
అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధికంగానే ఉంచే అవకాశం ఉందనే వార్తలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. సాధారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే స్థిరమైన ఆదాయం లేని బంగారం వైపు పెట్టుబడులు తగ్గుతాయి. వచ్చే డిసెంబర్ నాటికి అమెరికా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం 70 శాతానికి పైగా ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ముప్పు మరింత ఎక్కువైంది. ఇది ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అనిశ్చితికి దారితీసింది.
కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాకుండా, పశ్చిమ ఆసియాలో మళ్లీ మొదలైన యుద్ధ మేఘాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత, అమెరికా ఇరాన్పై దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై, గల్ఫ్లోని మరో 21 ప్రాంతాలపై దాడులు లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ ఆందోళనకర పరిస్థితులు పెట్టుబడిదారులు తమ ఆర్థిక వ్యూహాలను, వడ్డీ రేట్ల అంచనాలను పునఃపరిశీలించేలా చేస్తున్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ గోల్డ్ ఎనలిస్టులు ఒక కీలకమైన మార్క్పై కన్నేశారు. వారి విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,100 డాలర్ల స్థాయిని తాకవచ్చనే అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ ధరలు ఈ మార్క్ కంటే దిగువకు పడిపోతే, పసిడి మార్కెట్లో సుదీర్ఘ కాలం పాటు భారీ పతనం కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికైతే మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున, రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు మరికొంత మేర తగ్గే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.
Also Read: భారీగా పడిపోయిన బంగారం ధరలు..రూ.3,000 తగ్గిన గోల్డ్ రేట్..10గ్రా. ఎంతంటే?
Also Read: వెండి కొనే వారికి బ్యాడ్న్యూస్..భారీగా పెరగనున్న వెండి ధరలు..కేంద్రం ఝలక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kanchrapara School News: ఆ స్కూల్లో రూ.1.77 కోట్లు అక్రమ నగదు..విద్యార్థినుల సిక్ రూమ్లో కండోమ్ ప్యాకెట్లు!
Kanchrapara, West Bengal:Kanchrapara School Cash Seized: విద్యా బుద్ధులు నేర్పాల్సిన పాఠశాలలో కోటి రూపాయల అక్రమ నగదు, కండోమ్ ప్యాకెట్లు దొరికాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలోని సురేంద్రనాథ్ కళాశాల విద్యార్థి సంఘం గదిలో భారీ మొత్తంలో నగదుతో పాటు ఆయుధాలు, గర్భనిరోధక ప్యాకెట్లు లభించిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
బుధవారం అర్ధరాత్రి నిర్వహించిన సోదాల్లో కాంచరపారాలో ఉన్న ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రూ.1 కోటికి పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 4 గంటల సమయానికి లెక్కించిన మొత్తం సుమారు రూ. 1.77 కోట్లుగా తేలింది. పాఠశాలలోని విద్యార్థినుల సిక్ రూమ్ (అనారోగ్యంతో ఉన్న విద్యార్థుల కోసం కేటాయించిన గది)లోని ఒక అల్మారాలో కండోమ్ ప్యాకెట్లు కూడా దొరికాయని సమాచారం అందుతోంది.
సిక్ రూమ్లో కండోమ్ ప్యాకెట్లు..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బిజ్పూర్ ఎమ్మెల్యే సుదీప్త దాస్ ఇటీవల తన నియోజకవర్గంలోని విద్యాసంస్థల నుండి సమాచార సేకరణ ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో సదరు పాఠశాలకు సంబంధించిన సమాచారం వారికి అందడంతో.. ఎమ్మెల్యే స్వయంగా అక్కడికి వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు.
కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు పాఠశాలకు చేరుకుని సోదాలు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న నగదు మొత్తాన్ని నిర్ధారించడానికి రాత్రికి రాత్రే అనేక నగదు లెక్కింపు యంత్రాలను అక్కడికి తీసుకువచ్చారు. ఉదయం 4:30 గంటల వరకు లెక్కింపు కొనసాగిందని, మొత్తం నగదు దాదాపు రూ. 1.77 కోట్లుగా తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే సుదీప్త దాస్, రాష్ట్రంలో గతంలో జరిగిన అవినీతి సంబంధిత దర్యాప్తుల్లో బయటపడిన నగదు మాదిరిగానే ఈ డబ్బు కూడా ఉందని ఆరోపించారు. పాఠశాల ఆవరణలో ఇంత భారీ మొత్తంలో నగదు ఉండటం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని, ఇది అక్రమాలకు సంకేతం కావచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రిన్సిపాల్ వాదన ఇదే!
ఆ డబ్బు పాఠశాలకు చెందినది కాదని, కాంచరపారా మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కమల్ అధికారి, సుబోధ్ అధికారి, సీనియర్ టీఎంసీ (TMC) నాయకుడు పార్థ భౌమిక్లతో సంబంధం ఉన్న లెక్కల్లో చూపని నగదు అని ఎమ్మెల్యే ఆరోపించారు. పాఠశాల ఆవరణలో ఈ డబ్బును దాచి ఉంచారని ఆయన ఆరోపించారు. అయితే, ఈ వార్త ప్రచురించే సమయానికి కమల్ అధికారి, సుబోధ్ అధికారి లేదా పార్థ భౌమిక్ నుండి ఎటువంటి స్పందన లభించలేదు. విచారణ నిమిత్తం అకౌంట్స్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
ఇదిలా ఉండగా, పాఠశాల ప్రిన్సిపాల్ బికాష్ చంద్ర పాల్ తాము ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు. స్వాధీనం చేసుకున్న నగదు గత కొన్ని నెలలుగా వసూలు చేసిన అడ్మిషన్ ఫీజులని ఆయన పేర్కొన్నారు. ఆ డబ్బు అకౌంట్స్ విభాగానికి చెందినదని, బ్యాంకులో జమ చేయడానికి వేచి ఉందని ఆయన తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి గదిలోని అల్మారాలో కండోమ్ ప్యాకెట్లు ఎలా చేరాయో తనకు తెలియదని కూడా ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
ఆ డబ్బు మూలం గురించి, పాఠశాల ప్రాంగణంలో అంత పెద్ద మొత్తంలో నగదును ఎలా నిల్వ చేశారనే దానిపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వారి వాంగ్మూలాల్లో పొంతన లేని విషయాలు వెలుగులోకి రావడంతో, పాఠశాల క్యాషియర్ అభిక్ నాథ్, అసిస్టెంట్ అకౌంటెంట్ సయన్ ఘోష్లను విచారణ నిమిత్తం బిజ్పూర్ పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
Also Read: విద్యార్థులకు గుడ్న్యూస్..జూన్ 30 వరకు సెలవులు పొడిగింపు..ఇక పండగే పండగ!
Also REad: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం బిగ్షాక్.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Condemns US Attack: అమెరికా దాడిలో ముగ్గురు భారతీయులు మృతి..అమెరికాపై మండిపడ్డ భారత విదేశాంగ శాఖ!
New Delhi, Delhi:India Condemns US Attack News: పశ్చిమాసియాలోని ఒమన్ గల్ఫ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్పై అమెరికా దళాలు జరిపిన ఘోర దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను భారతదేశం తీవ్రంగా ఖండించింది.
అసలేం జరిగింది?
యూఎస్ సెంట్రల్ కమాండ్ కథనం ప్రకారం.. ఒమన్ తీరంలో ఇరాన్ నుండి చమురును రవాణా చేస్తున్న పలావు జెండా కలిగిన 'MT సెట్టెబెల్లో' అనే చమురు ట్యాంకర్ను అమెరికా దళాలు అడ్డుకున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న దిగ్బంధనం నేపథ్యంలో, యూఎస్ దళాలు పదేపదే ఇచ్చిన ఆదేశాలను, హెచ్చరికలను ఆ ఓడ పెడచెవిన పెట్టడంతోనే ఈ దాడి చేయాల్సి వచ్చిందని అమెరికా సైన్యం వాదిస్తోంది.ఈ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 24 మంది భారతీయులు, ఇద్దరు పాకిస్థానీలు, ఒక ఉక్రేనియన్, ఒక రష్యన్ ఉన్నారు.
ఈ దాడిలో మొదట గల్లంతైనట్లు భావించిన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ధృవీకరించారు. ఇది అత్యంత 'విషాదకరమైన' నష్టమని ఆయన పేర్కొన్నారు. మరణించిన నావికులను క్రింది విధంగా గుర్తించారు. ఆదిత్య శర్మ (డెక్ క్యాడెట్), శివానంద్ చౌరాసియా (ఇంజన్ ఫిట్టర్), పట్నాల సురేష్ (చీఫ్ ఇంజనీర్) మిగిలిన 21 మంది భారతీయ నావికులను సురక్షితంగా రక్షించి తరలించారు.
అమెరికాపై భారత్ తీవ్ర ఆగ్రహం..
ఈ ఘోర దాడిపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని యూఎస్ ఛార్జ్ డి అఫైర్స్ (CDA)ను విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పిలిపించి, గట్టిగా నిరసన తెలియజేస్తూ 'డిమార్చే' జారీ చేసింది.
"మేము మా నావికుల సంక్షేమానికి, శ్రేయస్సుకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తాము. ఒమన్ తీరంలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ పౌరులను కోల్పోవడం అత్యంత బాధాకరం. మా తీవ్ర నిరసనను అమెరికా గమనిస్తుందని ఆశిస్తున్నాము. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు ఆగిపోవాలి. చర్చలు, దౌత్యం ద్వారానే శాంతి, స్థిరత్వం సాధ్యమవుతాయి" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 8 (సోమవారం) నుండి భారతీయ నావికులున్న మూడు నౌకలపై దాడులు లేదా ప్రమాదాలు జరిగాయి. ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాంతమైన హోర్ముజ్ జలసంధిలో భారత జెండా కలిగిన 13 నౌకలు ఉన్నాయని, వాటిలో 562 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నారని ముఖేష్ మంగళ్ వెల్లడించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణల కారణంగా అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న భారతీయ పౌరుల భద్రత ఇప్పుడు తీవ్ర ఆందోళనకరంగా మారింది.
Also Read: భారత నౌకపై అమెరికా సైన్యం దాడి..ముగ్గురు భారతీయులు దుర్మరణం..ఏం జరుగుతోంది?
Also Read: విద్యార్థులకు గుడ్న్యూస్..జూన్ 30 వరకు సెలవులు పొడిగింపు..ఇక పండగే పండగ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Peddapalli: రబీ సీజన్లో రికార్డు సృష్టించిన పెద్దపల్లి.. 4.29 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరణ..
Hyderabad, Telangana:Peddapalli Paddy Procurement: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా.. రికార్డు స్థాయిలో ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేసిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి.. ఈ రికార్డు స్థాయి కొనుగోళ్లే నిదర్శనమన్నారు. జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రికార్డు స్థాయిలో సేకరణ..
ఈ రబీ సీజన్లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 334 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 4 లక్షల 29 వేల 921 మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని విజయవంతంగా సేకరించారని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా.. దళారీల ప్రమేయం లేకుండా దాదాపు 1,018 కోట్ల 65 లక్షల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశామని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి సుమారు 29 వేల మెట్రిక్ టన్ల ధాన్యం అదనంగా సేకరించామని తెలిపారు.. దీనికి తోడు మార్కెట్ యార్డుల ద్వారా మరో 25 వేల మెట్రిక్ టన్ల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినా.. రంగు మారినా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని.. చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు..
రైతుల నిల్వ అవసరాల కోసం.. పెద్దపల్లి నియోజకవర్గంలో 1.70 లక్షల మెట్రిక్ టన్ల సామర్థ్యం గల గోదాముల నిర్మించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేశామని విజయరమణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఎలిగేడు మండలం లాలపల్లిలో 20 వేల మెట్రిక్ టన్ల గోదాము పనులు ఇప్పటికే మొదలయ్యాయని... రాబోయే రోజుల్లో ఓదెల, శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లో టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
బీఆర్ఎస్, బీజేపీలపై ఆగ్రహం..
ఇదే సమయంలో విపక్షాల తీరుపై ప్రభుత్వ విప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పెద్దపల్లికి కాలేశ్వరం.. నీటి వల్ల పంటలు పండలేదని.. నెహ్రూ, ఇందిరా గాంధీల కాలం నాటి ఎస్ఆర్ఎస్పీ (SRSP) కెనాల్ నీటి వల్లే ఇక్కడి రైతులకు సాగునీరు అందిందని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో తీవ్ర లోపాలతో కట్టి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని... అందుకే ఆ బ్యారేజీలు కుంగిపోయాయని ఆరోపించారు. ప్రాజెక్టులపై అవగాహనతో మాట్లాడాలని.. సలహాలు ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ను అసెంబ్లీకి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినా ప్రతిపక్షాలు భయపడి ముందుకు రావడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Pawan Kalyan Allu Arjun: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో అల్లు అర్జున్ సీక్రెట్ మీటింగ్..ఏం జరిగిదంటే?
Hyderabad, Telangana:Pawan Kalyan Allu Arjun Meeting: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. బుధవారం (జూన్ 10) రాత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన బన్నీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే పవన్ కల్యాణ్కు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు సర్జరీ తర్వాత రెండు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలకు తప్ప ఆయన బయటకు రావడం లేదు. పవన్ కల్యాణ్ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి, ఆయన హెల్త్ కండిషన్తో పాటు కుటుంబ విషయాలను కూడా ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
ఫ్యాన్ వార్స్కు చెక్ పడినట్లేనా?
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో 'మెగా వర్సెస్ అల్లు' అభిమానుల మధ్య తీవ్రమైన వార్ నడుస్తోంది. రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న తరుణంలో, అల్లు అర్జున్ తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదని, ఇవన్నీ కేవలం పుకార్లేనని సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.
మెగా, అల్లు హీరోలు ఇప్పటికీ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరి సినిమాలను మరొకరు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ స్వయంగా పవన్ను కలవడంతో.. ఇప్పటికైనా ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్కు ఎండ్ కార్డ్ పడుతుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్స్ తమ తమ రంగాల్లో బిజీగా గడుపుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హీరోగా తన సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి.. పూర్తిస్థాయిలో రాష్ట్ర పరిపాలనపై దృష్టి పెట్టారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అట్లీ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ (సుమారు రూ. 800 కోట్లు) చిత్రం 'రాకా' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. దీనితో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నారు.
Also Read: మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీకి ఛాన్స్..బాలయ్య హీరోయిన్ను పక్కకి నెట్టిన బ్యూటీ!
Also Read: బిగ్బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది! ఈసారి 'దశావతారమే' అంటూ నాగ్ వీడియో రిలీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Venomous Snake Video: బాబోయ్.. షూలో ప్రమాదకరమైన కాలనాగు.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Venomous Snake Video Watch Now: ప్రకృతిలో జీవించే వన్యప్రాణులు, ముఖ్యంగా పాములు మన నివాస ప్రాంతాల్లోకి సంచారం చేసినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో.. ఊహించుకుంటేనే కొంత భయం కలుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసే ఒక అత్యంత అరుదైన వీడియో వైరల్ అవుతోంది. మనం నిత్యం ధరించే బూట్లలో పాములు దూరి కూర్చుంటే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.. ఈ వీడియో.. ఒక నల్లటి షూలో నక్కి ఉన్న అత్యంత ప్రమాదకరమైన పాము.. నెమ్మదిగా బయటకు వచ్చి.. పడగవిప్పిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే, ఈ షాకింగ్కి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంటర్నెట్లో రోజుకు లక్షలాది వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.. వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో కేవలం ఆకర్షించడమే కాదు.. చూసే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. ఈ వీడియోలో ఒక నల్లటి షూ కనిపిస్తుంది. మొదటి చూపులో అందులో ఏముందో ఎవరికీ అర్థం కాదు.. కానీ, కొద్ది సెకన్ల వ్యవధిలోనే ఆ షూ లోపలి భాగం నుంచి ఒక నల్లటి ఆకారం కదలడం మొదలవుతుంది. దీనిని క్లియర్గా గమనిస్తే.. అది ఒక అత్యంత విషపూరితమైన పాము అని స్పష్టమవుతుంది. షూ లోపల చాలా హాయిగా.. ఎవరికీ కనిపించకుండా చుట్టలు చుట్టుకుని కూర్చున్న ఆ పాము, బయట జరుగుతున్న కదలికలను గమనించి నెమ్మదిగా తన తలను పైకి లేపింది.
షూ నుంచి బయటకు వచ్చి..
అయితే, షూ లోపల ఉన్న పాము కేవలం తల అటుఇటు కదిలించడమే కాకుండా.. నెమ్మదిగా తన శరీరాన్ని బయటకు లాగడం ప్రారంభించింది. సగం శరీరాన్ని పైకి లేపి.. తన పడగను విప్పి భీకరంగా బుసలు కొట్టడం మొదలు పెట్టింది.. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. లేదా ఆ షూలో కాలు పెట్టేందుకు ప్రయత్నించి ఉన్నా.. తప్పకుండా కాటేసి ఉండేది.. అయితే, పాము పడగవిప్పి కెమెరా వైపు చూస్తున్న దృశ్యం నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఊహించని స్థాయిలో వైరల్..
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రీల్కు ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్లలో ఊహించని స్పందన లభిస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఇకపై నేను షూస్ వేసుకునే ముందు వందసార్లు చెక్ చేసుకుంటాను బాబోయ్.. అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇది కేవలం వీడియో కాదు.. మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక హెచ్చరిక.. అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా చాలా మంది సోషల్ మీడియా వినియోగదారలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Indian Sailors Died: భారత నౌకపై అమెరికా సైన్యం దాడి..ముగ్గురు భారతీయులు దుర్మరణం..ఏం జరుగుతోంది?
Dibab, Muscat Governorate:Indian Sailors Died In Oman: ఒమన్ తీరంలోని భారత నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిపో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇరాన్ చమురుపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలతో, ఒమన్ తీరంలో పలావు జెండా కలిగిన చమురు ట్యాంకర్పై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత కచ్చితమైన ఆయుధాలతో దాడి చేయడంతో ఈ ప్రాణనష్టం జరిగింది.
ఈ వారం ప్రారంభంలో ఒమన్ తీరంలో అమెరికా దళాలు ఒక నౌకపై దాడి చేయడంతో, మొదట గల్లంతైనట్లుగా భావించిన ముగ్గురు భారతీయ నావికులు మరణించారని షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. దీనిని ఒక "విషాదకరమైన" నష్టంగా అభివర్ణిస్తూ, గల్లంతైన ముగ్గురు నావికుల మృతదేహాలను వెలికితీసినట్లు మంత్రి చెప్పారు.
ఒమన్ గల్ఫ్లో అమెరికా సైన్యం దాడికి గురైనప్పుడు, పలావు జెండా కలిగిన 'సెట్టెబెల్లో' అనే చమురు ట్యాంకర్లో 24 మంది భారతీయులు, నలుగురు విదేశీయులతో సహా మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు పాకిస్థానీలు, ఒక ఉక్రేనియన్, ఒక రష్యన్ ఉన్నారు. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైందని, ఇరాన్ నుండి చమురును తీసుకువస్తోందని ఆరోపిస్తూ ఆ నౌకపై దాడి చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది.
ఓడ నుంచి 21 మంది భారతీయ నావికులను రక్షించినప్పటికీ.. డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ అనే ముగ్గురు నావికులు గల్లంతయ్యారని తొలుత వార్తలు వచ్చాయి.
"ఇది మన సముద్రయాన కుటుంబానికి తీరని లోటు. ఈ కష్ట సమయంలో మోదీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుంది. వారి కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడానికి పూర్తిగా కట్టుబడి ఉంది. దాడి నుంచి బయటపడిన సిబ్బందితో పాటు మృతదేహాలను వెంటనే స్వదేశానికి రప్పించాలని.. మృతుల పార్థివ దేహాలను అంత్యక్రియల కోసం త్వరతగతిన తీసుకురావాలని అధికారులను ఆదేశించాను" అని షిప్పింగ్ మంత్రి సరస్బానంద సోనోవాల్ తెలిపారు.
దాడిపై భారత్ ఖండన..
నౌకలోని మిగిలిన నావికులతో స్థిరమైన నెట్వర్క్ కనెక్షన్ను ఏర్పాటు చేయడంలో నౌక యాజమాన్య సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇరాన్ చమురుపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలతో, ఒమన్ తీరంలో ఒక చమురు ట్యాంకర్పై అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు అత్యంత కచ్చితమైన క్షిపణులతో దాడి చేయడంతో ఈ ప్రాణనష్టం జరిగింది. హోర్ముజ్ను దాటేందుకు ఆ నౌక ప్రయత్నించగా, అమెరికా నౌకాదళం జరిపిన దాడిలో 24 మంది భారతీయులు మరణించారని భారత్ ఈ ఘటనను ఖండించింది.
భారత్ నిరసన..
ఈ దాడిపై "తీవ్ర నిరసన" తెలియజేయడానికి భారత్, న్యూఢిల్లీలోని వాషింగ్టన్ రాయబార కార్యాలయ అధికారుల్ని పిలిపించిందని ఒక సీనియర్ భారత ప్రభుత్వ అధికారి ఏఎఫ్పీ వార్తా సంస్థకు తెలిపారు. ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన జలమార్గమైన గల్ఫ్లోని హోర్ముజ్ జలసంధి, ఫిబ్రవరి చివరిలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన మధ్యప్రాచ్య యుద్ధం మొదలైనప్పటి నుండి దాదాపు పూర్తిగా దిగ్బంధించారు.
ఇటీవలి వారాలుగా అమల్లో ఉన్న కాల్పుల విరమణ సమయంలో జరిగిన చర్చలు, ఈ జలసంధిని తిరిగి తెరిచే ఒప్పందాన్ని కుదర్చడంలో విఫలమయ్యాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఈ నౌకా రవాణా మార్గాన్ని దిగ్బంధించగా, ఏప్రిల్ నుండి అమెరికా కూడా దానికి పోటీగా తనదైన దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది.
Also Read: మొసలి కడుపులో బంగారపు ఉంగరాలు, 6 జతల
ALso Read: మరికొద్ది రోజుల్లో ప్రపంచంలో ప్రళయం..ఒడ్డుకు చేరిన 'దేవుని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Python Kiss Video: పాము ముక్కును కరిచేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి!
Hyderabad, Telangana:Python Kiss Gone Wrong Viral Video Watch Now: నేటి డిజిటల్ యుగంలో లైకులతో పాటు వ్యూస్ కోసం యువత ఎలాంటి సాహసాలకైనా వెనక అడుగు వేయడం లేదు.. కొంతమంది కొన్ని సందర్భాల్లో పిచ్చి చేష్టలు చేస్తూ.. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఒక యువతి అత్యంత ప్రమాదకరమైన పాముతో పరాచకాలు ఆడబోయి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే..?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక యువతి చేతిలో అత్యంత పొడవైన ప్రమాదకరమైన పామును పట్టుకుని కనిపిస్తుంది. సాధారణంగా పాములను చూస్తేనే ఆమడదూరం పరుగెత్తే.. ఈ రోజుల్లో.. ఆమె మాత్రం దాన్ని చాలా సాధారణంగా చేతితో పట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు. అంతటితో ఆగకుండా.. కెమెరా వైపు చూస్తూ.. ఆ పాముకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. ఆమె తన ముఖాన్ని పాము నోటి దగ్గరకు తీసుకుని రావడంతో.. ఆ మరుక్షణమే ఊహించని ప్రమాదం జరిగింది.
యువతి ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ పాము.. క్షణాల వ్యవధిలో మెరుపు వేగంతో ఆమె ముఖంపై దాడి చేసింది.. నేరుగా ఆమె ముక్కు భాగాన్ని నోటితో గట్టిగా కరిచేసింది.. ఊహించని ఈ దాడితో సదరు యువతి త్రీవ భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. నొప్పితో విలవిలలాడుతూ.. ఆ పామును అక్కడే విసిరేసి.. ముక్కు పట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీయడం మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
నెటిజన్ల ఆగ్రహం..
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో అప్లోడ్ అయిన కొద్ధిరోజులకే లక్షలాది వ్యూస్తో పాటు వేలాది కామెంట్లతో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఇది కేవలం పిచ్చితనమే.. ప్రమాదకరమైన పాములతో ఇలాంటి ఆటలు అస్సలు ఆడొద్దని.. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తూ వస్తున్నాయి. అలాగే లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టకండి.. అని మరికొందరు హెచ్చరిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఆ పాము విషపూరితమైనది కాకపోవడం వల్లే ఆమె బతికిపోయి ఉంటుందని.. లేకపోతే.. ప్రాణాలు పోయేవని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలిదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారింది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Honor X80 Pro Max: మొబైల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సంచలనం.. 11,000mAh బ్యాటరీతో Honor X80 Pro Max లాంచ్?
Hyderabad, Telangana:Honor X80 Pro Max with 11,000mAh Battery: ప్రస్తుతం వస్తున్న అన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ఫోన్స్లో బ్యాటరీ లైఫ్ అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. రోజుకు రెండుసార్లు ఛార్జింగ్ పెట్టుకునే రోజులకు చెక్ పెడుతూ.. ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ Honor సరికొత్త సంచలనానికి తెరలేపబోతున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. హానర్ సంస్థ తన పాపులర్ ఎక్స్-సిరీస్లో అత్యంత పవర్ఫుల్ మోడల్ Honor X80 Pro Maxను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ ఏకంగా 11,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు ఫిక్స్..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెడ్మీతో పాటు షియోమి, హువావే వంటి దిగ్గజ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లలో గరిష్టంగా 5,000mAh నుంచి 6,000mAh బ్యాటరీలతో మాత్రమే విడుదల చేశాయి. కానీ హానర్ X80 ప్రో మాక్స్ వీటన్నింటికీ రెట్టింపు పవర్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్ఫోన్ను సాధారణగా వినియోగిస్తే దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు నాన్స్టాప్గా పనిచేస్తుంది. అలాగే ఇంత పెద్ద బ్యాటరీని సులభంగా ఛార్జ్ చేసేందుకు ఎంతో అద్భుతమైన 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది. ఈ అద్భుతమైన బ్యాటరీ కేవలం గంటన్నర లోపే ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి..
అద్భుతమైన డిస్ప్లే..
కేవలం బ్యాటరీ మాత్రమే కాకుండా... ఈ స్మార్ట్ఫోన్ డిస్ల్పే కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ హానర్ X80 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్ 6.8 ఇంచుల ఫ్లాట్ అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన ఇది 2788×1280 పిక్సెల్స్ (1.5K) రిజల్యూషన్తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుందని లీక్ అయిన వివరాలు క్లియర్గా చెబుతున్నాయి. ఇది చాలా తక్కువ బెజెల్స్ (Narrow Bezels)తో పాటు గుండ్రటి మూలలతో (Rounded Corners) ఈ ఫోన్ ప్రీమియం ల్యాండ్స్కేప్ లుక్ను కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన ఫోటోలు చెబుతున్నాయి.
పవర్ఫుల్ ప్రాసెసర్..
ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ వేగంగా ఉండేందుకు కంపెనీ ఇందులో ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ సంస్థకు చెందిన సరికొత్త స్నాప్డ్రాగన్ 6 జెన్ 5 (Snapdragon 6 Gen 5) ప్రాసెసర్ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 4nm ఆర్కిటెక్చర్పై పని చేస్తుంది. కాబట్టి గేమింగ్కు, మల్టీటాస్కింగ్కు అద్భుతంగా సూట్ అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే వాటర్ రెసిస్టెన్స్, కింద పడినా పగలకుండా ఉండేందుకు ఇందులో కంపెనీ.. కంపెనీ డ్రాప్-రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో చాలా అద్బుతమైన ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా ఉంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మార్కెట్లోకి విడుదల అప్పుడే?
ఈ హానర్కు సంబంధించిన బేస్ వేరియంట్ హానర్ X80 స్మార్ట్ఫోన్ 10,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ జూన్ చివరి వారంలో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్ అయిన వివరాలు తెలుపుతున్నాయి. ఈ మొబైల్ సిరీస్కి సంబంధించిన ప్రో మాక్స్ మోడల్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్లో ఉందని.. దీనిని త్వరలోనే కంపెనీ గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయితే, మొబైల్ మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Real Estate: కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్పేటలో ఇళ్ల స్థలాల రేట్లకు రెక్కలు.. ఇన్వెస్టర్లకు కోట్లు కురిపిస్తున్న భూములు..!!
Secunderabad, Telangana:Hyderabad Real Estate: హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. గతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ తిరిగినటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు క్రమంగా హైదరాబాద్లోని తూర్పు ప్రాంతాల్లో కూడా విస్తరించి ఇన్వెస్టర్లకు బంగారం లాంటి లాభాలను అందిస్తోంది. హైదరాబాద్ నగరానికి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ప్రాంతం ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఒక బెస్ట్ డెస్టినేషన్ గా మారింది అని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరానికి పడమర వైపు ఉన్నటువంటి కోకాపేట గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు ఇప్పటికే దాదాపు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన నేపథ్యంలో, ఇప్పుడు విస్తరణ మొత్తం కూడా హైదరాబాద్ నగరానికి తూర్పు వైపు ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాను అభివృద్ధి చేసేందుకు అనేక పారిశ్రామిక క్లస్టర్లను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్తులో రాబోతున్న రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ద్వారా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) కనెక్టివిటీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల కారణంగా ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు ఒక చక్కటి డెస్టినేషన్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను భారీగా సవరించి అమల్లోకి తీసుకురావడంతో రిజిస్ట్రేషన్ ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి.
క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ ధరలకు ప్రభుత్వ మార్కెట్ విలువలను దగ్గర చేయాలనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ శాఖ 25%, 50%, 75%, 100% శ్లాబుల ప్రకారం కొత్త ధరలను నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఫీజుల శాతంలో మార్పులు లేకపోయినా, భూముల విలువలు పెరగడంతో, కస్టమర్లు చెల్లించాల్సిన మొత్తం భారీగా పెరగనుంది.
కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్పేటలో భారీ పెంపు
మేడ్చల్ జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్న కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్పేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల ధరలు అత్యధికంగా పెరిగాయి. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్, గాజులరామారం, సూరారం, కొంపల్లి ప్రాంతాల్లో మార్కెట్ విలువలు 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. కొంపల్లి పరిసరాల్లో చదరపు గజం విలువ రూ.20,000 నుంచి రూ.25,000 వరకు చేరగా, చింతల్, గాజులరామారం ప్రాంతాల్లో రూ.15,000 నుంచి రూ.18,000 వరకు నమోదైంది.
మేడ్చల్ ఎస్ఆర్వో పరిధిలోని మేడ్చల్ టౌన్, అత్వెల్లి, గుండ్లపోచంపల్లి ప్రాంతాల్లో 75 శాతం నుంచి 100 శాతం వరకు పెంపు జరిగింది. జాతీయ రహదారి-44, ఓఆర్ఆర్ వెంబడి ఉన్న కమర్షియల్ స్థలాల ధరలు దాదాపు రెట్టింపు కాగా, ప్లాట్ల ధరలు చదరపు గజానికి రూ.18,000 నుంచి రూ.22,000కు పైగా నిర్ణయించారు.
శామీర్పేటలో రియల్ మార్కెట్ జోరు
ఓఆర్ఆర్ కనెక్టివిటీ, కొత్త విల్లా ప్రాజెక్టుల ప్రభావంతో శామీర్పేట, తూంకుంట, అలియాబాద్ ప్రాంతాల్లో వ్యవసాయ, నివాస భూముల విలువలు 75 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. హెచ్ఎండీఏ పరిధిలోని వ్యవసాయ భూముల కనీస విలువను ఎకరాకు రూ.10 లక్షలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. అభివృద్ధి, డిమాండ్ను దృష్టిలో ఉంచుకుంటే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ హబ్గా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!
Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: కరీంనగర్ ప్రగతిపై బురదజల్లొద్దు.. విమర్శలు ఆపండి: మంత్రి పొన్నం సీరియస్!
Hyderabad, Telangana:Minister Ponnam Prabhakar Latest News: కరీంనగర్ నగరానికి సంబంధించిన అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ ఆరోపణలు ఎంతమాత్రం తగవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నగరానికి సంబంధించిన ప్రగతిపై బురదజల్లే ప్రయత్నాలను ఆపాలని ఆయన అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ నగర రూపురేఖలను మార్చే ప్రతిష్టాత్మక మానేరు రివర్ ఫ్రంట్ (MRF) ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నగరానికి సంబంధించిన వివిధ అంశాలపై కూడా చర్చించిన్నట్లు తెలుస్తోంది.
మానేరు రివర్ ఫ్రంట్ రెండో విడుత పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ సందర్భంగా ఆధారాలతో సహా స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలకులు చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రాజెక్టులు ఆగిపోయాయని.. వారు గతంలో పెట్టిన పెండింగ్ బకాయిలను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే చెల్లిస్తూ.. ప్రాజెక్ట్కు సంబంధించిన పనులను ముందుకు తీసుకెళ్తోందని ఆయన వెల్లడించారు. జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటూ.. అనవసర విమర్శలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
డంప్ యార్డ్ తరలింపునకు కేంద్రం సహకరించాలి...
కరీంనగర్ ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగర అభివృద్ధికి, ప్రజల ఆరోగ్యానికి పెద్ద సమస్యగా ఉన్న స్థానిక డంప్ యార్డ్ తరిలింపుపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విషయంపై తప్పకుండా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. నిధుల మంజూరుతో పాటు తరలింపు ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
కరీంనగర్ సమగ్ర శ్రేయస్సు కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని.. నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పరుగులెత్తిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. విమర్శలు పక్కన పెట్టి.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సాధన కోసం స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా పార్టీల తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కరీంనగర్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Best Fuel Cards: IndianOil, BPCL, HPC..పెట్రోల్ కొడితే భారీ క్యాష్బ్యాక్.. ఫ్రీగా సినిమా టికెట్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్.. క్రేజీ కార్డ్ ఇదిగో..!!
Secunderabad, Telangana:Best Fuel Cards: పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరల నేపథ్యంలో డబ్బు సేవ్ చేసుకునేందుకు ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ వంటి కార్డులతో సహా 7 ప్రధాన ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు క్యాష్ బ్యాక్ తోపాటు పలు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. మీరు కూడా ఈ ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతుంటే ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ మీకు ఎంతో సహాయపడతాయి. చాలా ఫ్యూయల్ కార్డులు రెండు ప్రధాన ప్రయోజనాలను అందిస్తాయి. రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్బ్యాక్, 1శాతం ఫ్యూయల్ సర్చార్జ్ మినహాయింపును అందిస్తాయి. అయితే కొన్ని ఫ్యూయల్ కార్డులు క్యాష్బ్యాక్, రివార్డులతో పాటు, అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఇప్పుడు మీరు ఇంధనం నింపుకున్నప్పుడు మీకు బెనిఫిట్స్ అందించే కార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. BPCL SBI కార్డ్ ఆక్టేన్:
-BPCL పంపుల వద్ద ఫ్యూయల్ రీఫిల్స్పై 3.75శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.
-రెస్టారెంట్లు, కిరాణా సామాగ్రినపై కూడా 1.25శాతం క్యాష్ బ్యాక్ ఫ్రీ
-గోల్ఫ్ కోర్సు, ఎయిర్ పోర్టు లాంజ్ ఎంట్రీ వంటి ప్రీమియం బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
-నెలకు రూ. 4000 వరకు ఇంధన ఖర్చులపై పూర్తి ప్రయోజన ఉంటుంది.
-వార్షిక రుసుము రూ. 1,499 + GST (సంవత్సరానికి రూ.2 లక్షలు ఖర్చు చేస్తే ఈ ఫీజు మాఫీ అవుతుంది).
-చమురుపై అధికంగా ఖర్చు చేసేవారికి ఇది బెస్ట్. సర్చార్జ్ మినహాయింపులు, ప్రీమియం ఫీచర్లు.
-దీని పూర్తి ప్రయోజనం కేవలం బీపీసీఎల్ పంపుల వద్ద మాత్రమే లభిస్తుంది.
2. ఇండియన్ ఆయిల్ ఆర్బిఎల్ బ్యాంక్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్:
-ఇండియన్ఆయిల్ పంపుల వద్ద 8.5శాతం వరకు భారీ ఆదా. ప్రతి రూ 100 ఖర్చుపై 15 ఫ్యూయల్ పాయింట్లు (7.5% విలువ) + 1% సర్చార్జ్ మినహాయింపు పొందండి.
-నెలకు 2000 పాయింట్ల పరిమితి ఉంది.
-ఇతర ఖర్చులపై రివార్డులు కొద్దిగా తక్కువగా ఉంటాయి. కానీ ఇంధనం విషయంలో ఇది బెస్ట్.
-అత్యధిక రాబడులు, దేశవ్యాప్తంగా 20,000కు పైగా ఇండియన్ఆయిల్ పంపుల వద్ద చెల్లుబాటు అవుతుంది.
-దీని ప్రయోజనాలు కూడా ఇండియన్ఆయిల్ అవుట్లెట్లకు మాత్రమే పరిమితం.
3. హెచ్పిసిఎల్ ఎనర్జీ బూబ్ క్రెడిట్ కార్డ్:
HPCL పంపుల వద్ద మీరు 6.5% వరకు ప్రత్యక్ష పొదుపును పొందుతారు.
ఇది చాలా సులభమైన, సరళమైన కార్డ్, ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి క్యాష్బ్యాక్ను అందిస్తుంది.
ఈ కార్డు వార్షిక రుసుము ₹499+పన్ను.
ఈ కార్డు సంవత్సరానికి 4 ఉచిత లాంజ్ ప్రవేశాలను కూడా అందిస్తుంది.
4. ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్పిసిఎల్ కోరల్ క్రెడిట్ కార్డ్:
HPCL పై 3.5% ఆదా చేసుకోండి (2.5% రివార్డులు + 1% సర్చార్జ్ మినహాయింపు).
హీన్లో ₹200 వరకు ఫ్యూయల్ రివార్డ్ (నెలకు సుమారు ₹8,000 ఇంధన ఖర్చులకు ఉత్తమమైనది).
దీని వార్షిక రుసుము కేవలం ₹199 మాత్రమే, దీనిని చాలా తక్కువ ఖర్చుతో సులభంగా మాఫీ చేయించుకోవచ్చు.
5. ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్:
ఇండియన్ఆయిల్, కిరాణా, యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై 5% ఇంధన పాయింట్లు.
వార్షిక రుసుము ₹500, అయితే మీరు సంవత్సరానికి ₹50,000 ఖర్చు చేస్తే ఈ రుసుము మాఫీ అవుతుంది.
ఈ కార్డుతో ఇంధనం నింపడంపై 6% వరకు ఆదా లభిస్తుంది.
6. ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్:
ఇండియన్ఆయిల్పై 5% వరకు ఆదా చేసుకోండి (4% పాయింట్లు + 1% మినహాయింపు).
మీరు దీని RuPay వెర్షన్ తీసుకుంటే, దానిని UPIకి లింక్ చేయడం ద్వారా రివార్డ్ పాయింట్లను కూడా సంపాదించవచ్చు.
భోజనం, కిరాణా కొనుగోళ్లపై కూడా మంచి పాయింట్లు లభిస్తాయి. రుసుము ₹500, దీనిని సులభంగా మాఫీ చేయించుకోవచ్చు.
7. యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్:
ఇండియన్ఆయిల్లో మొత్తం 5% ఆదా (4% + 1% సర్చార్జ్ మినహాయింపు).
ఈ కార్డుతో, మీరు BookMyShow నుండి సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుంటే 15% తగ్గింపు, అలాగే భాగస్వామ్య రెస్టారెంట్లలో భోజనంపై కూడా తగ్గింపు పొందుతారు.
Also Read: ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!
Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chandrababu: ఎన్డీయే సమావేశంలో కీలక ప్రసంగం.. ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షం
New Delhi, Delhi:NDA Conclave: 'ప్రపంచంలోని ఏ నాయకుడితోనైనా ప్రధాని మోదీ సమానంగా నిలబడగలరు. ఇది నేను ఎంతో స్పష్టంగా చెప్పగలను. ఇది దేశానికే గర్వకారణం' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సాధారణంగా రాజకీయ కూటములు ఎన్నికల కోసం ఏర్పడతాయి... కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల కోసం కాదు దేశం కోసం ఏర్పడిందని తెలిపారు. అధికారం కోసం కాదు దేశ ప్రయోజనాల కోసం ఎన్డీయే ప్రయాణం సాగిస్తోందని చెప్పుకొచ్చారు. దీనికి రాష్ట్రాల్లో వరుసగా ఎన్డీఏ సాధిస్తోన్న విజయాలే సాక్ష్యమని వివరించారు.
చంద్రబాబు ప్రశంసలు
నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన, దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా సేవలందించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి నాయకత్వ ప్రతిభ, పరిపాలనా సామర్ధ్యం, ప్రపంచస్థాయిలో దేశానికి తెచ్చిన పేరు ప్రఖ్యాతలపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. దేశాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే రాష్ట్రాల అభ్యున్నతికి, ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నందుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
మోదీకి కృతజ్ఞతా తీర్మానం
నరేంద్ర మోదీకి కృతజ్ఞతా తీర్మానాన్ని గౌరవ సభలో ప్రవేశపెట్టిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. 'సరైన సమయంలో, సరైన స్థానంలో, సరైన నాయకుడిగా దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారు. ఒకవైపు దేశానికి స్థిరత్వాన్ని ఇచ్చే మార్గదర్శిగా.. కొత్త ఆలోచనలకు, నవ కల్పనలకు ప్రేరణనిచ్చే నాయకుడిగా పనిచేయడం మోదీ గొప్పతనం' అని ప్రశంసించారు. మోదీ ఎప్పుడూ ‘నేషన్ ఫస్ట్’ అనే అజెండాతో పనిచేస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు
'2001లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి నేటి ప్రధాని పదవి వరకు 25 ఏళ్లుగా మోదీ ప్రజా జీవితంలో విశేషంగా సేవలు అందించారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా నిలబడటం మోదీ నాయకత్వానికి ఉన్న ప్రత్యేకత. నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల అంతరాయాలు, ఇంధన మార్కెట్ల అస్థిరత, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మందగమనం, నెలకొన్న అనిశ్చితి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి' అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు.
విజయవంతమైన పాలన
'మోదీ సమర్ధవంతమైన పాలనతో భారతదేశంలో ద్రవ్యోల్బణం సుమారు 3.5 శాతం వద్దే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తెచ్చారు. సీఎంగా విజయవంతమైన పాలన అందించిన మోదీ ప్రధానమంత్రిగా కూడా అదే స్ఫూర్తి, సృజనాత్మకత, నూతనత్వాన్ని అనుసరించడం విశేషం' అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 'మోదీ ఎప్పుడూ అలిసిపోరు... నిత్యం ఉత్సాహంగా ఉంటారు. మిగిలిన వారిని ఉత్సాహపరుస్తారు' అని పేర్కొన్నారు.
'బీహార్లో 243 స్థానాల్లో 202 స్థానాల్లో గెలుపు ఎన్డీయేపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం. అసోంలో, పుదుచ్చేరిలో వరుస గెలుపుల ద్వారా ప్రజల ఆదరణను చాటుకుంది. ఇవి కేవలం ఎన్నికల ఫలితాలు కావు... సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు' అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. భారతీయత పునరుజ్జీవం పొందడం పన్నెండేళ్లలో మోదీ నాయకత్వంలో వచ్చిన అతిపెద్ద మార్పు అని చెప్పారు. వికాస్ బీ... విరాసత్ బీ నూతన భారత నిర్మాణానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
భారత్ బలం అదే
ప్రాచీన జ్ఞానం, డిజిటల్ పరిపాలన, ఆవిష్కరణల సమన్వయమే నూతన భారత్ బలం అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు. ప్రధాని మోదీ దేశానికి ఉన్న అడ్డంకులు తొలగించి, స్పష్టమైన విధానాలతో, లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. వ్యవస్థను పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నారని అభినందించారు. 'ప్రతీ భారతీయుడి మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు ప్రధాని మోదీ. మన కాలంలో అత్యుత్తమ రాజకీయవేత్తల్లో ప్రధాని మోదీ ఒకరు' అని ప్రశంసించారు.
భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం
ప్రధానిగా మోదీ పన్నెండేళ్ల ప్రయాణం భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ప్రతీ అంతర్జాతీయ సర్వే మోదీని అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచ నాయకుడిగా గుర్తిస్తోందని.. ఇది దేశ ప్రజలందరికీ గర్వకారణం అని ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులకు, భారతదేశానికి గౌరవం లభిస్తోందంటే దానికి కారణం మోదీ నాయకత్వం అని వివరించారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్నది మన లక్ష్యమని.. అది మోదీ నాయకత్వంతోనే సాకారం అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మోదీ నాయకత్వంలో దేశం మరిన్ని విజయాలు సాధిస్తుందని.. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం సాధించాలన్న అందరి సంకల్పం నెరవేరుతుందని చంద్రబాబు అభిలషించారు.
