icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow28 Jul 2024, 10:42 am

బోనాల పండుగలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు

Karimnagar, Telangana:

కరీంనగర్, రామనగర, మార్కండేయ కాలనీలో మున్నూరుకాపు కులస్తులు నిర్వహించిన పోచమ్మ నాట్లు ఉత్సవంలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో మెరుగు స్వప్నశ్రీ, పిట్టల రవీందర్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నెల్లి నరేష్, పెద్దిగారి తిరుపతి, ఉప్పరి అజయ్, అల్వాల భరత్, కంపల్లి కీర్తికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Mumbai Rain Alert: ముంబై వరదల లాక్‌డౌన్..ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిక..16 రైళ్లు, విమానాలు రద్దు!

Mumbai, Maharashtra:

Mumbai Rain Alert News: ముంబైపై వరుణ దేవుడు పగపట్టినట్లు అయ్యింది. నగరవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా కురిస వర్షాలు ఇప్పుడు వరదలుగా మారి పొంగి పొర్లుతున్నాయి. ఈ కుండపోత వర్షాల వల్ల ముంబై మహానగరంతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింపోయింది. రోడ్లు జలమయమవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వరద నీరు రైల్వే ట్రాక్‌లను ముంచెత్తాయి. ఇప్పటికే సాధారణ రైళ్లు రద్దు కాగా.. ఇప్పుడు లోకల్ రైళ్ల సర్వీసులకు పూర్తి అంతరాయం ఏర్పడింది. అలాగే ముంబై-పుణె మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోవడం సహా వాతావరణ శాఖ భారీ వర్షాల నడుమ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. అటు రైళ్లు, రోడ్డు మార్గాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడడం సహా ఇటు విమాన సర్వీసులు కూడా రద్దు చేయడంతో పాటు కొన్ని విమానాలను దారి మళ్లించారు. 

ముంబై వెళ్లే డజన్ల కొద్దీ రైళ్లు రద్దు

మహారాష్ట్రలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ముంబై-పుణె రైలు మార్గం మూతపడింది. కర్జత్-లోనావాలా భోర్ ఘాట్ సెక్షన్‌లోని రెండు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అంతేకాకుండా, ముంబైకి రానుపోను వెళ్లే 20కి పైగా రైళ్లను రద్దు చేశారు. ముంబైకి జీవనాధారంగా భావించే లోకల్ రైళ్లు నిలిచిపోయాయి.

ముంబై వెళ్లే ఏ రైళ్లు రద్దుయ్యాయి?

ముంబైలో భారీ వర్షాల నేపథ్యంలో రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకలను నిలిపేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని.. ముంబై వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు అనేక రైళ్లు దారి మళ్లించగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. 

వర్షం కారణంగా ముంబై - పుణె మార్గంలో రద్దు చేసిన రైళ్లు జాబితా..
1. సి.ఎస్.ఎం.టి – పూణే (ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్) (22105)
2. పూణే జంక్షన్ – సోలాపూర్ (ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్) (12169)
3. సోలాపూర్ – పూణే జంక్షన్ (ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్) (12170)
4. పూణే – సి.ఎస్.ఎం.టి (ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్) (22106)
5. పూణే – సి.ఎస్.ఎం.టి (ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్) (12127)
6. సి.ఎస్.ఎం.టి – పూణే (ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్) (12128)
7. పూణే – సి.ఎస్.ఎం.టి (దక్కన్ ఎక్స్‌ప్రెస్) (11007)
8. సి.ఎస్.ఎం.టి – పూణే (దక్కన్ ఎక్స్‌ప్రెస్) (11008)
9. పూణే – సి.ఎస్.ఎం.టి (దక్కన్ క్వీన్) (12124)
10. సి.ఎస్.ఎం.టి – పూణే (దక్కన్ క్వీన్) (12123)
11. పూణే – సి.ఎస్.ఎం.టి (ప్రగతి ఎక్స్‌ప్రెస్) (12126)
12. సి.ఎస్.ఎం.టి – పూణే (ప్రగతి ఎక్స్‌ప్రెస్) (12125)
13. పూణే – సిఎస్‌ఎమ్‌టి (సింహగడ్ ఎక్స్‌ప్రెస్) (11010)
14. సిఎస్‌ఎమ్‌టి – పూణే (సింహగడ్ ఎక్స్‌ప్రెస్) (11009)
15. సిఎస్‌ఎమ్‌టి – ధూలే ఎక్స్‌ప్రెస్ (11015)
16. ధూలే – సిఎస్‌ఎమ్‌టి ఎక్స్‌ప్రెస్ (11012)

మరోవైపు భారీ వర్షాల తాకిడికి ముంబై - పుణే ఎక్స్‌ప్రెస్ రహదారిపై తీవ్రమైన పరిస్థితి ఏర్పడింది. సుమారు రూ.6,695 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ రహదారి భారీ వర్షాల కారణంగా మూతపడింది. ఆ మార్గంలో కొండచరియలు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. 13.3 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని 2026 మే 1న ప్రారంభించగా.. తొలిసారి వచ్చిన వర్షానికే అందులో లోపాలు బయటపడ్డాయి. 

అలాగే భారీ వర్షాల కారణంగా రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు మాత్రమే కాకుండా నేషనల్ హైవే కూడా మూతపడింది. ముంబై - పుణే మధ్య కనెక్టివిటీగా ఉన్న జాతీయ రహదారిపై ప్రస్తుతం ఎలాంటి ప్రయాణం చేయవద్దని అధికారులు సూచించారు. పాత రహదారిని కూడా మూసివేయడంతో, భారీ వర్షాల సమయంలో ముంబై చేరుకోవడం సవాలుగా మారింది.

ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ నేపథ్యంలో విమానాశ్రయం రన్‌వే పై భారీగా వరద నీరు వచ్చి చేరింది. డజన్ల కొద్దీ విమానాలు గంటల తరబడి ఆలస్యమవుతున్నాయి. తక్కువ దృశ్యమానత కారణంగా, అనేక విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు. నాలుగు విమానాలను రద్దు చేయగా, 13 విమానాలను దారి మళ్లించారు. ఢిల్లీ-ముంబై, ముంబై-ఇండోర్, ఇండోర్-ముంబై, ముంబై-ఢిల్లీ మార్గాల్లో 13కి పైగా విమానాలను రద్దు చేశారు.

Also Read: పెళ్లిలో వధువుని డ్యాన్స్ చేయోద్దన్న వరుడు..కోపంతో పెళ్లి క్యాన్సిల్!

Also Read: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Markapur Marriage Incident: పెళ్లిలో వధువుని డ్యాన్స్ చేయోద్దన్న వరుడు..కోపంతో పెళ్లి క్యాన్సిల్!

Sankavaram, Andhra Pradesh:

Markapur Marriage Incident News: మరికాసేపట్లో మూడు ముళ్ళు పడాల్సి ఉంది. ఇరు కుటుంబాల్లో పెళ్లి భాజలు, బంధువుల కేరింతలతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. అంతలోని డాన్స్ విషయంలో వచ్చిన ఒకే ఒక్క చిన్న వివాదం వధూవరులు జీవితంలో ఊహించని మరుగు తిప్పింది. పెళ్లికూతురుని డాన్స్ చేయొద్దని వరుడు మందలించడంతో, పెళ్లి పీటల్లాగా వెళ్లాల్సిన వేడుక కాస్త ఊరేగింపులోనే అయిపోయింది. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలో ఈ వింత ఉదంతం చోటుచేసుకుంది. 

ఏం జరిగింది అంటే? 
రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన యువకుడికి, కంభం మండలం తురిమెళ్ళకు చెందిన యువతీతో పెద్దలు వివాహం నిర్ణయించారు. ఆదివారం ఉదయం ముహూర్తం కావడంతో.. శనివారం రాత్రి వధువు తరుపు వారు పెళ్లికూతురుతో సహా చిన్నగానిపల్లికి చేరుకున్నారు. 
 
రాత్రివేళ ఇరువైపులా ఉన్న బంధుమిత్రులు, యువకులు ఉత్సాహంగా వధూవరులను వాహనం ఎక్కించి ఊరేగింపు ప్రారంభించారు. డీజే పాటలు మోతకు ఇరువైపుల వారి స్టెప్పులేస్తూ కేరింతల కొడుతూ ముందుకు సాగుతున్నారు. 

డాన్స్ గొడవ..సీన్ రివర్స్!
ఊరేగింపు జోరుగా సాగుతున్న సమయంలో.. వధూవరులను కూడా డాన్స్ చేయాల్సిందిగా అక్కడున్న కొందరు కోరారు. దానికి వదులు ఎంత ఉత్సాహంగా సిద్ధమైంది. కానీ వరుడు మాత్రం తాను డాన్స్ చేసే ప్రసక్తి లేదని భేష్ నుంచి కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా అందరి ముందు వధువువైపు తిరిగి నువ్వు కూడా డాన్స్ చేయడానికి వీలు లేదు అని గట్టిగా మందలించాడు.

పెళ్లి కాకముందే అందరి ముందు కాబోయే భార్య వరుడు అలా కోప్పడడం వధువు తండ్రికి అసలు నచ్చలేదు. పెళ్లికి ముందే ఇంత అహంకారం చూపిస్తే ఇక పెళ్లయ్యాక నా కూతుర్ని ఇంకా ఎంత ఇబ్బంది పెడతాడు అని ఆయన మనస్థాపానికి గురైయ్యాడు. 

పెళ్లి క్యాన్సిల్..
అంతే వధువు తండ్రి తక్షణమే నిర్ణయం తీసుకొని తన కుమార్తె వాహనం పైనుంచి కిందకి దించేశాడు. మాకు "ఈ పెళ్లి వద్దు" అని తెగేసి చెప్పి, బంధువులందరినీ తీసుకొని రాత్రి రాత్రి సొంతూరికి తిరుగు ప్రయాణం అయ్యారు.

సరిగ్గా ముహూర్తానికి ముందు పెళ్లి ఆగిపోవడంతో ఇరుపక్షలు వారు కూర్చుని కట్నకానుక లావాదేలిన సెటిల్ చేసుకున్నారు. అయితే అప్పటికే పెళ్లి ఏర్పాట్ల కోసం భారీగా ఖర్చు చేసిన వరుడు తరుపున వారు మాత్రం చేజేతులా చేసుకున్న తప్పుకు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

Also Read: Bus Accident Gadwal: ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి

Also Read: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Hyderabad Traffic Police: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నకిలీ నెంబర్ ప్లేట్ వాడితే ఇకపై జైలుకే..నగరంలో స్పెషల్ డ్రైవ్స్!

Hyderabad, Telangana:

Hyderabad Fake Number Plate: హైదరాబాద్ నగరంలో నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న కిలాడి వాహనదారులపై పోలీసులు నిఘా పెట్టారు. ట్రాఫిక్ ఛలానా నుంచి తప్పించుకునేందుకు అలాగే కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడానికి కొంతమంది వాహనాల నంబర్ ప్లేట్ పెద్ద ఎత్తున మారుస్తున్నట్లు పోలీసులు దృష్టికి వచ్చింది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. 

వారం రోజుల్లో క్రిమినల్ కేసులు వాహనాలు సీస్ 
ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కి.. నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వారిపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే గత వారం రోజుల్లో నగరంలోని ప్రధాన ప్రాంతాలైన టప్పాచబుత్రా, ఐఎస్ సదన్, టోలిచౌకి, అబిడ్స్, మలక్ పేట వంటి ఏరియాల్లో జరిపిన తనిఖీల్లో నకిలీ నెంబర్ ప్లేట్లతో దొరికిన వారికి పోలీసులు ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. నిబంధన ఉల్లంఘించిన పలు వాహనాలను కూడా అక్కడికక్కడే స్వాధీనం చేసుకున్నారు. 

ఆ నంబర్ ప్లేట్లే తప్పనిసరి..
వాహనదారులు కేవలం ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను మాత్రమే ఉపయోగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. నెంబర్ ప్లేట్లపై ఫాంట్లు మార్చడం, అంకెలు స్పష్టంగా కనిపించకుండా చేయడం, నచ్చిన డిజైన్లు వేయటం, స్టిక్కర్లు అతికించడం లేదా ఎలాంటి అనధికారిక మార్పులు చేసిన అది చట్ట ప్రకారం తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. 

నకిలీ నెంబర్ ప్లేట్స్ వాడే వారిపై జీరో టోలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు పోలీసులు తేల్చి చెప్పారు. నిబంధనలను మీరితే ఎంతటి వారైనా సరే, క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్డు భద్రతను పెప్పర్ దించేందుకు నేరాలు అరికట్టడానికి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. కాబట్టి వాహనదారులు అలర్ట్ గా ఉండటం మంచిది.

Also Read: Bus Accident Gadwal: ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి

Also Read: రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..రూ.100లకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

ప్రపంచాన్ని షేక్ చేస్తున్న వింత మద్యం.. బ్రాందీ, విస్కీ కాదు.. అత్యధికంగా తాగేది దీనినే..!

BBhoomi6h ago
Secunderabad, Telangana:

Soju: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే మద్యపానం ఏది అని మిమ్మల్ని అడిగితే..మీరు విస్కీ , వోడ్కా లేదా రమ్ అని సమాధానం ఇస్తారు . కానీ మీరు చెప్పిన సమాధానం అస్సలు కరెక్టు కాదు. ఎందుకంటే..  గత 20 సంవత్సరాలుగా.. దక్షిణ కొరియా సాంప్రదాయ మద్యమైన సోజు, ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే మద్యపానంగా నిలిచింది. ముఖ్యంగా.. జిన్‌రో సోజు బ్రాండ్ అనేక అంతర్జాతీయ బ్రాండ్‌లను అధిగమించి.. కొత్త అమ్మకాల్లో రికార్డులు నెలకొల్పుతోంది.ప్రపంచవ్యాప్తంగా కొరియన్ సంస్కృతికి పెరుగుతున్న కారణంగా.. సోజు  ప్రజాదరణ ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో కూడా వేగంగా పెరుగుతోంది.

సోజు అంటే ఏమిటి? దానిని ఎలా తయారు చేస్తారు? 

సోజు అనేది కొరియా జాతీయ మద్యం. ఇది నీటిలా స్వచ్ఛంగా ఉంటుంది. సాంప్రదాయకంగా దీనిని బియ్యంతో తయారు చేసినప్పటికీ, ఇప్పుడు జిన్సెంగ్, బార్లీ.. గోధుమల నుండి స్వేదనం ద్వారా కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీనిలో ఆల్కహాల్ శాతం సాధారణంగా 12 నుండి 25 శాతం వరకు ఉంటుంది. ఇది విస్కీ, వోడ్కాల కంటే తక్కువగా ఉంటుంది.  కానీ బీర్,  వైన్ కంటే ఎక్కువగా ఉంటుంది. దీని రుచి తియ్యగా, మృదువుగా ఉండి, తాగడానికి సులభంగా ఉంటుంది.

ప్రజాదరణకు కారణాలు ఏంటి? 
సోజు ప్రజాదరణకు ప్రధాన కారణం  కొరియన్ వేవ్. కె-డ్రామాలు, కె-పాప్ సంగీతంలో తరచుగా కనిపించే సోజు ఆకుపచ్చ సీసా, ప్రపంచవ్యాప్తంగా యువతను ఆకర్షించి, విస్తృతమైన ఆసక్తిని రేకెత్తించింది. అంతేకాకుండా, దీనిలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండటం వల్ల మరుసటి రోజు హ్యాంగోవర్ తక్కువగా ఉంటుంది.  అందుకే యువత దీనిని ఎక్కువగా ఇష్టపడతారు. పీచ్,  స్ట్రాబెర్రీ వంటి వివిధ రకాల పండ్ల రుచులలో ఇది లభించడం.. గ్రిల్ చేసిన మాంసం, వేయించిన చికెన్ వంటి వంటకాలతో ఇది అద్భుతంగా జతకలవడం కూడా దీని ప్రజాదరణకు కారణమని చెప్పాలి. అంతేకాదు ఇతర కారణాలు కూడా ఎన్నో ఉన్నాయి.

భారతదేశంలో.. ముఖ్యంగా నగరాల్లోని యువతలో సోజు ప్రజాదరణ పొందుతోంది. పన్నులు, లభ్యత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, మారుతున్న మద్యపాన సంస్కృతిలో సోజు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోంది.ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, గురుగ్రామ్ వంటి ప్రధాన నగరాల్లో యువతలో దీని ప్రజాదరణ వేగంగా పెరిగింది. దిగుమతి సుంకాలు, పరిమిత లభ్యత కారణంగా ఇది ఇంకా అన్నిచోట్లా సులభంగా అందుబాటులో లేనప్పటికీ.. మారుతున్న జీవనశైలి.. అంతర్జాతీయ వంటకాల పట్ల పెరుగుతున్న ఆసక్తి వల్ల దీనికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

లభ్యత పెరిగి, ధరలు పోటీగా మారితే, సోజు భారత మార్కెట్లో కూడా నిలదొక్కుకోగలదని నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఇది ఇకపై దక్షిణ కొరియాకే పరిమితం కాకుండా, ప్రపంచ పానీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.

Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్‌లో భారత్‌కు చెందినవి కూడా..!!

Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో

Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Neymar Jr Retirement: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ముగిసిన మరో శకం.. స్టార్ ఆటగాడు నెయ్‌మేర్ రిటైర్మెంట్..

Neymar Announces Retirement: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో మరో శకం ముగిసింది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ నెయ్‌మేర్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా భావోద్వేగంగా.. "నేను ప్రయత్నించాను.. ఇప్పుడు అది ముగిసిపోయింది" అని అన్నాడు. రౌండ్ ఆఫ్ 16లో నార్వే చేతిలో బ్రెజిల్ బాధాకరంగా నిష్క్రమించిన తర్వాత నేమార్ జూనియర్ అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.

బ్రెజిల్ తరపున ఆడిన అత్యంత ప్రసిద్ధ ఆటగాళ్లలో ఒకరైన నేమార్ జూనియర్, నార్వే చేతిలో తన జట్టు అనూహ్యంగా ఓడిపోవడంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఓటమి 2026 ఫీఫా ప్రపంచకప్ నుండి బ్రెజిల్‌ను నిష్క్రమించేలా చేసింది. ఈ ప్రకటనతో దేశం తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా 129 మ్యాచ్‌లలో 80 గోల్స్‌తో నేమార్ 16 ఏళ్ల కెరీర్ ముగిసింది. బ్రెజిల్ తరపున నేమార్ చివరి మ్యాచ్ మెట్‌లైఫ్ స్టేడియంలో ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఆడాడు. ఇదే వేదికపై అతను 2010లో అరంగేట్రం చేశాడు. బార్సిలోనా, పారిస్ సెయింట్-జెర్మైన్ మాజీ స్టార్ అయిన నేమార్, నార్వేపై పెనాల్టీ గోల్ చేసినప్పటికీ, అది బ్రెజిల్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించకుండా ఆపలేకపోయింది.

నార్వే చేతిలో బ్రెజిల్ ఓడిపోవడంతో నేమార్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఫైనల్ విజిల్ తర్వాత అతను ఏకధాటిగా ఏడుస్తున్న దృశ్యాలు అభిమానుల హృదయాలను ముక్కలు చేశాయి. అతని బ్రెజిల్ జట్టులోని పలువురు సహచరులు అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ బార్సిలోనా మాజీ ఆటగాడైన అతను పూర్తిగా కుంగిపోయాడు.

"నేను ప్రయత్నించాను, చాలా ప్రయత్నించాను. ఇప్పుడు అంతా ముగిసింది" అని ఆట తర్వాత అతను గ్లోబోతో అన్నాడు. "నేను ఇక్కడే మొదలుపెట్టాను. ఇక్కడే ముగించాను." బ్రెజిల్‌తో అతని ప్రయాణం ముగిసినప్పటికీ, నెయ్‌మార్ శాంటోస్ ఎఫ్‌సి క్లబ్‌తో తన కెరీర్‌ను కొనసాగిస్తూ, ప్రతి సీజన్‌లో తన భవిష్యత్తును సమీక్షించుకుంటున్నాడు.

నార్వే చేతిలో ఈ ఓటమి, ప్రపంచకప్‌లలో యూరోపియన్ ప్రత్యర్థులపై బ్రెజిల్ ఘోర పరాజయ పరంపరను సూచిస్తుంది. 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు, 2002 ఫైనల్‌లో జర్మనీని ఓడించినప్పటి నుండి యూరోపియన్ ప్రత్యర్థులను ఓడించలేదు. ఈ ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, కోచ్ కార్లో అన్సెలోట్టి మాట్లాడుతూ, ఆదివారం జరిగిన ప్రపంచ కప్ చివరి 16 ఓటమిని భవిష్యత్తుకు "ఇంధనంగా" ఉపయోగించుకోవాలని, వారి నిరాశాజనకమైన టోర్నమెంట్ "ఒక కొత్త శకానికి నాంది" అని నొక్కి చెప్పారు.

నార్వే తరఫున హాలాండ్ చివరి దశలో రెండు గోల్స్ సాధించాడు. అంతకుముందు బ్రెజిల్ ఆటగాడు బ్రూనో గిమారెస్ తీసుకున్న పెనాల్టీని ప్రత్యర్థి గోల్ కీపర్ అడ్డుకోవడం ఆ మ్యాచ్‌లో కీలక మలుపుగా నిలిచింది. ఇంజరీ టైమ్‌లో నెయ్మార్ పెనాల్టీని విజయవంతంగా గోల్‌గా మలిచినప్పటికీ, అది కేవలం ఓదార్పునిచ్చే ఫలితంగా మాత్రమే మిగిలిపోయింది. బ్రెజిల్ జెర్సీ ధరించి ఆటగాడిగా అతనికి ఇదే చివరి సందర్భం కూడా.

"ఇలాంటి ఓటమిని జీర్ణించుకోవాల్సిందే. ఇది ఒక కొత్త ప్రయాణం. ఇకపై మేము మా స్థానాలను నిలబెట్టుకుంటూ, మెరుగుపడేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి" అని ఆన్సెలోట్టి పేర్కొన్నారు. బ్రెజిల్‌కు రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్ అందించే బాధ్యతతో ఏడాది క్రితమే ఆయన నియమితులయ్యారు.

2030లో జరగబోయే తదుపరి ప్రపంచకప్ వరకు ఆన్సెలోట్టికి ఒప్పందం ఉంది. టోర్నమెంట్ నుంచి బ్రెజిల్ త్వరగా నిష్క్రమించినప్పటికీ, తాను పదవి నుంచి తప్పుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.

"ఇది ముగింపు అని నేను అనుకోవడం లేదు. ఇది ఒక కొత్త దశకు ఆరంభం అని భావిస్తున్నాను" అని ఆయన వెల్లడించారు. "నేటి మ్యాచ్ ఫలితాన్ని పరిగణనలోకి తీసుకున్నా సరే, ప్రస్తుతం ఉన్న జట్టుతో బ్రెజిల్ ఈ ప్రపంచకప్‌లో చివరి వరకు పోటీపడే సత్తా కలిగి ఉండేదని నా అభిప్రాయం." 2002లో జపాన్‌లో చివరిసారిగా టైటిల్ గెలిచిన బ్రెజిల్, తమ ఆరో ప్రపంచకప్ విజయం కోసం చేసే నిరీక్షణ ఇప్పుడు పావు శతాబ్దానికి పైగా కొనసాగనుంది.

Also Read: ఫీఫా వరల్డ్ ‌కప్‌లో విచిత్ర సంఘటన..ఇంగ్లాండ్ ప్లేయర్లకు వయాగ్రా ఇచ్చారు! ఎందుకంటే?

Also Read: గ్రౌండ్‌లో కంటతడి పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ..క్యాప్ అందుకున్న తర్వాత భావోద్వేగం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

116 ఏళ్ల బామ్మకు టీటీడీ బంపరాఫర్.. రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం

Tirupati Urban, Andhra Pradesh:

116 Old Years Devotee In Tirumala: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన ఏడుకొండలను ఎక్కడం అంటే ఆ శ్రీవారి కరుణాకటక్షం ఉంటేనే సాధ్యం. యుక్త వయస్సు వారే అలసి సొలసి తిరుమల మెట్లు ఎక్కుతుంటారు. అలాంటి వందేళ్లు పైబడిన ఓ భక్తురాలు తిరుమల మెట్లు ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె అచంచల భక్తి, దేవుడిపై ఉన్న నమ్మకంతోనే 116 ఏళ్ల బామ్మ తిరుమల మెట్లు ఎక్కారని అందరూ పేర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆ పెద్దావిడను రేపు వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది.

0
0
Report
Advertisement

మజ్లిస్ అంటే భయమా? ప్రేమా? రేవంత్‌ రెడ్డిపై నిప్పులు కక్కిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Fatima College Building Issue: బరితెగించి మాట్లాడుతున్న మజ్లిస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోరా? అని రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ అండతోనే ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. 'హైకోర్టునే బెదిరించేలా ఒవైసీ మాట్లాడుతున్నారు. అడ్డగోలు తప్పులు చేస్తూ హైకోర్టునే ప్రశ్నిస్తారా? కోర్టులు, చట్టాలంటే ఎంఐఎంకు గౌరవం లేదు. ఫాతిమా విద్యా సంస్థలపై ప్రభుత్వం నోరెందుకు మెదపడం లేదు?' అని రేవంత్‌ రెడ్డిని కేంద్ర మంత్రులు ప్రశ్నించారు.

'హైకోర్టు ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా జాప్యమెందుకు చేస్తున్నారు . చెరువును ఆక్రమించుకుని విద్యా సంస్థలను నిర్మించడమే తప్పు. గండిపేటలో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న విద్యా సంస్థలను కూల్చేస్తామంటూ నోటీసుల మీద నోటీసులిస్తున్నారు. ఒవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా విద్యా సంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? ఒవైసీకి ఒక న్యాయం... ఇతరులకు ఇంకో న్యాయమా? ఒవైసీ విద్యా సంస్థ మిలిటెంట్లకు షెల్టర్ ఇచ్చింది నిజం కాదా? విద్యార్థులకు చదువు ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారా?' అని మజ్లిస్‌తోపాటు రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. 'బీజేపీ అధికారంలోకి వస్తే  ఫాతిమా సంస్థలను కూల్చివేస్తాం. అక్రమార్కులకు, అవినీతిపరులకు భయమంటే ఏమిటో చూపిస్తాం. ఆ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపిస్తాం' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్‌
'మజ్లిస్ అంటే భయమా? ప్రేమా? లేక రెండూ ఉన్నాయా? భూములు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కమీషన్ల కోసం ఆరాటపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇందుకోసం సామాన్య ప్రజల జీవనోపాధిని బలిచేస్తోంది. అదే సమయంలో మజ్లిస్ పార్టీని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడటం లేదు' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. 'రేవంత్ సర్కార్.. సెలక్టివ్ గవర్నెన్స్ (పక్షపాత పాలన)కు హైడ్రా ఓ ఉదాహరణ. సామాన్య ప్రజల విషయంలో మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్‌లో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బారిష్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ విషయంలో మాత్రం మౌనంగా ఉంటూ.. మీనమేషాలు లెక్కిస్తోంది' అని రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

'తెలంగాణ హైకోర్టు పలుమార్లు జోక్యం చేసుకుని.. ప్రభుత్వ జాప్యంపై చీవాట్లు పెట్టినా ప్రభుత్వ తీరులో మార్పులేదు. హైడ్రా, విద్యాశాఖ సహా పలు శాఖల నుంచి వివరాలు కోరినా.. సామాన్య ప్రజల విషయంలో చూపే తొందరపాటును.. ఫాతిమా కాలేజ్ వ్యవహారంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చూపించలేదు' అని కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరును కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీని యావత్ ముస్లిం సమాజానికి ప్రతినిధిగా భావిస్తున్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ మిత్రుడైన ఒవైసీకి ఇబ్బంది కలగకూడదన్నట్లు.. మజ్లిస్ ప్రయోజనాలకు కాపాడేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని కిషన్‌ రెడ్డి తెలిపారు. 

'మతపరమైన, ఓటు బ్యాంకు రాజకీయాలను చేయడం రేవంత్‌ రెడ్డి మానుకోవాలి. ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం అనే సూత్రాన్ని అమలుచేయాలి' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం.. అన్న ప్రభుత్వ తీరుతో.. ప్రజల్లో సర్కారు పట్ల విశ్వాసం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ గమనిస్తున్న ప్రజలు త్వరలోనే రేవంత్ రెడ్డికి  దిమ్మదిరిగే సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.

0
0
Report

హైదరాబాద్ మెట్రో రైలుపై మళ్లీ రేవంత్‌ రెడ్డి ఆందోళన.. కేంద్ర మంత్రి ఖట్టర్‌కు లేఖ

Hyderabad, Telangana:

Revanth Reddy Letter: హైదరాబాద్‌ మెట్రో రైలుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ఫేజ్‌-2 నిర్మాణంపై ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తులు చేసినా కూడా స్పందన రాకపోవడంతో రేవంత్‌ రెడ్డి కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. మెట్రో ఫేజ్-2కు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరుతూ కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు లేఖ రాసి విజ్ఞప్తి చేశారు. వెంట‌నే మెట్రో రైలుపై ప్ర‌త్యేక చొర‌వ తీసుకోవాల‌ని కోరారు. ఫేజ్-1ను తెలంగాణకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాల‌ని అభ్య‌ర్థించారు. ఇక వాటితోపాటు ఎస్‌బీఐ క్యాప్స్‌ను తక్షణమే నియమించాల‌ని.. ఒక‌వేళ ఆలస్యమైతే ప్రాజెక్టు వ్యయం మ‌రింత పెరిగే ప్రమాదం ఉంద‌ని లేఖలో తెలంగాణ సీఎం ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి ఖట్టర్‌కు రాసిన లేఖలో సీఎం కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని లేఖలో రేవంత్‌ రెడ్డి అభ్య‌ర్థించారు. ఈ రెండు అంశాలు పరస్పరం ముడిపడి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాజెక్టు అమలు దెబ్బతింటుందని, వ్యయం కూడా గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని లేఖలో రేవంత్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 24వ తేదీన‌ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 అంశాలపై విస్తృతంగా చర్చించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్ర‌త్యేకంగా గుర్తు చేశారు. ఆ సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇప్పటికీ అమలులోకి రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 24వ తేదీన జ‌రిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (ఎస్‌బీఐ క్యాప్స్)కు హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, ఆర్థిక పరిస్థితుల సమీక్ష, తెలంగాణ ప్రభుత్వానికి బదిలీకి అవసరమైన ఆర్థిక పరిశీలన వంటి కీల‌క‌ బాధ్యతలు అప్పగించాలని అంగీకరించినట్లు లేఖలో రేవంత్‌ రెడ్డి వివరించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రో రైలు ఫేజ్-1పై ఉన్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చే (రిఫైనాన్సింగ్) అవకాశాలను కూడా ఎస్‌బీఐ క్యాప్స్ పరిశీలించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు లేఖలో రేవంత్‌ రెడ్డి ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయని.. దీంతో అదే సంస్థ ఫేజ్-2కు అవసరమైన ఆర్థిక నమూనా, దీర్ఘకాలిక రుణాల సమీకరణ, నిధుల సమీకరణ మార్గాలు, ఆర్థిక వ్యూహం కూడా రూపొందించాలని సమావేశంలో నిర్ణయించినట్లు లేఖలో కేంద్ర మంత్రికి వివరించారు. ఫేజ్-1 ప్రాజెక్టు విలువ నిర్ధారణ, రుణాల పునర్వ్యవస్థీకరణ, ఫేజ్-2 నిధుల సమీకరణ వంటి అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించేలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియ సమన్వయం కోసం మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించినట్లు ప్రస్తావించారు. ఎస్‌బీఐ క్యాప్స్‌కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినా ఇప్పటివరకు నియమించలేదని వెల్లడించారు.

టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను కూడా ఇంకా ఖరారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి పంపలేదని లేఖలో రేవంత్‌ రెడ్డి గుర్తుచేశారు. దీంతో మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియలో అనిశ్చితి నెలకొనడంతో పాటు రోజువారీ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఎస్‌బీఐ క్యాప్స్ నియామకం ఆలస్యమవడంతో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు (డీపీఆర్‌లు) కేంద్ర అనుమతులు రావడం మ‌రింత‌ ఆలస్యమవుతోందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

0
0
Report
Advertisement

AP Rain Alert: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్..రాబోయే 24 గంటల్లో అల్లకల్లోలం..విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు!

Vijayawada, Andhra Pradesh:

AP Heavy Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది . ఈ నేపథ్యంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల వద్ద నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలి. 

వర్ష సూచన వివరాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఒకటి లేదా రెండు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటువైపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక..
"వర్షం పడే సమయంలో ప్రయాణికులు, సాధారణ ప్రజలు రోడ్లపై ఉన్న పెద్ద పెద్ద చెట్లు, పాతబడిన హోర్డింగులు (ప్రకటనల బోర్డులు), విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దు" అని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ తెలియజేసింది.

ఈ అల్పపీడన ప్రభావంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున, హోర్డింగులు లేదా చెట్లు విరిగిపడే అవకాశం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, గొర్రెల కాపరులు ఉరుములు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది.

Also Read: Bus Accident Gadwal: ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి

Also Read: "నా కొడుకుని మేకులు కొట్టి చంపారు..బూడిదైనా ఇవ్వండి!" సాయికృష్ణ తల్లి ఆవేదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది నిజాయితీ.. రూ.5 లక్షల ఆభరణాలు బ్యాగ్‌ అప్పగింత

Tirupati Urban, Andhra Pradesh:

Honesty Of Tirumala House Keeping Staff: కంగారులో రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలు భక్తుడు మరచిపోయి వెళ్లగా.. హోటల్‌ గది శుభ్రం చేయడానికి వచ్చిన హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు. బంగారు ఆభరణాలు కనిపించగానే గుట్టుచప్పుడు కాకుండా తీసుకోకుండా నిజాయితీగా పోగొట్టుకున్న బాధిత భక్తుడికి అప్పగించారు. అయితే పోయిన ఆభరణాలు తిరిగి లభించడంతో ఆ భక్తుడు ఆనందం వ్యక్తం చేశాడు. తిరుమల కొండపై ఎవరికీ అన్యాయం జరగదని ఆ భక్తుడి కుటుంబం భావించింది.

తిరుమలలో మరోసారి హౌస్ కీపింగ్ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన భక్తుడు సుధీర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వచ్చారు. కొండపైన అన్నమయ్య భవన్‌లోని రూమ్ నంబర్-3లో జూలై 4వ తేదీన బస చేశారు. స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్న సుధీర్‌ కుటుంబసభ్యులు జూలై 5వ తేదీ మధ్యాహ్నం 1 గంట 16 నిమిషాలకు గదిని ఖాళీ చేశారు. తమ స్వస్థలం తిరుగుప్రయాణమైన సుధీర్‌ కుటుంబం గదిలో బంగారు ఆభరణాలు మరచిపోయారు.

గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన హౌస్ కీపింగ్ సిబ్బందికి బంగారు నగలు కనిపించడంతో వెంటనే వారు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఆ బంగారు ఆభరణాలను భద్రపరిచిన అధికారులు భక్తుడి వివరాలు తెలుసుకున్నారు. గది బుక్‌ చేసుకునే సమయంలో ఇచ్చిన వివరాల ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన సుధీర్‌కు ఫోన్‌ చేశారు. నగలు మరచిపోయారు వచ్చి తీసుకెళ్లమని చెప్పడంతో ఆ భక్తుడి కుటుంబం షాక్‌కు గురయ్యింది. పోయిన నగదు తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

వెంటనే కొండపైకి వచ్చిన సుధీర్‌కు టీటీడీ అధికారులు సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను సురక్షితంగా అప్పగించారు. హౌస్ కీపింగ్ సిబ్బంది నిజాయితీని కొనియాడుతూ టిటిడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది మరోసారి తమ నిబద్ధత, నిజాయితీని చాటుకున్నారని అధికారులు పేర్కొన్నారు. హౌస్‌ కీపింగ్‌ సిబ్బందిని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభినందించారు. ఈ వార్త వైరల్‌గా మారింది.

భక్తులు జాగ్రత్తగా ఉండాలి
తిరుమల కొండపై ఎవరికీ అన్యాయం జరగదని.. అంతా శ్రీనివాసుడు చూసుకుంటాడనే అభయం ఈ ఘటనతో భక్తులకు మరోమారు తెలిసింది. అయినా కూడా భక్తులు జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. బంగారు నగలు హౌస్‌ కీపింగ్‌ సిబ్బంది కాకుండా మరేఇతర ఎవరైనా చూసి ఉండి ఉంటే వాటిని ఎత్తుకెళ్లేవారని టీటీడీ విజిలెన్స్‌ అధికారులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్త చర్యలు.. ఎంత నిఘా ఉంచినా కూడా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ వస్తువులకు తామే బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇకనైనా భక్తులు తమ వస్తువుల పట్ల జాగ్రత్తగా చూడాలని చెబుతున్నారు.

0
0
Report

Karimnagar: కరీంనగర్ కాంగ్రెస్‌లో నామినేటెడ్ జోష్..

Hyderabad, Telangana:

Congress Nominated Posts: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌కు బూస్ట్ ఇచ్చేలా నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించిన్నట్లు తెలుస్తోంది.. ఇందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS) ప్రభుత్వం ఛైర్మన్‌తో పాటు సభ్యులతో కూడిన నూతన పాలక వర్గాలను నియమించేందుకు రెడీ అయ్యింది. ఈ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తల మధ్య గట్టి పోటీ నెలకొంది.

6 సంఘాల నియామకం పూర్తి.. 
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం 6 సంఘాలకు మాత్రమే పాలక వర్గాలను నియమించింది. దీంతో మిగిలిన 125 సంఘాల ఛైర్మన్, సభ్యుల పదవుల కోసం స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించారు. ముందువచ్చిన వారికే పదవులు అనే తరహాలో ఎవరికి వారు తమ ఉన్నంతగా ఉన్న లీడర్స్‌ ద్వారా ఒత్తిడి తెస్తున్నారు.

బీఆర్ఎస్ నియోజకవర్గాల్లో ముమ్మర ప్రయత్నాలు..
ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ప్రస్తుతం 4 చోట్ల BRS ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్‌ఛార్జ్‌లతో పాటు సీనియర్ నేతలు ఈ ప్యాక్స్ పదవులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట తమ పట్టు నిలుపుకోవడానికి ఈ సహకార సంఘాల పదవులు కీలకమని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.. దీంతో ఆయా పరిధుల్లోని ఛైర్మన్, పాలకవర్గ పదవులను తమ అనుచరులకే దక్కించుకునేలా నాయకులు వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం..

మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు.. 
తమకు అనుకూలమైన అభ్యర్థులకు ప్యాక్స్ ఛైర్మన్ పీఠం దక్కేలా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులతో పాటు రాష్ట్రస్థాయి కీలక నేతల వద్ద కాంగ్రెస్ లీడర్లు ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాసాలతో పాటు క్యాంప్ ఆఫీసుల చుట్టూ కరీంనగర్ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, త్వరలోనే మరికొన్ని సంఘాల పాలకవర్గాల జాబితా విడుదలయ్యే అవకాశం ఉండడంతో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అధిష్టానం ఎవరిని కరుణిస్తుందో.. ఎవరికి ఏ పదవి దక్కుతుందో చూడాలి..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Mcd Test: భారత్‌లోకి సరికొత్త విప్లవం.. ఒకే రక్త పరీక్షతో 10 క్యాన్సర్ల గుర్తింపు..

Hyderabad, Telangana:

MCD Cancer Blood Test: క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ప్రాణాలను రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ, చాలా మందిలో కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ ముదిరిన తర్వాతే బయటపడుతుంది. అయితే, వైద్య శాస్త్ర రంగంలో ఒక సరికొత్త ఆవిష్కరణ ఇప్పుడు క్యాన్సర్‌పై పోరాటంలో గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది. శరీరంలో క్యాన్సర్ కణాలు ఇప్పుడిప్పుడే పుడుతున్న దశలోనే వాటిని పసిగట్టే సరికొత్త రక్త పరీక్ష త్వరలోనే భారతదేశంలో అందుబాటులోకి రాబోతోంది.. కేవలం ఒకే ఒక్క బ్లడ్ టెస్ట్ ద్వారా దాదాపు 10 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ రక్త పరీక్ష పేరేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఔషధ, టీకాల తయారీ సంస్థ జైడస్ లైఫ్‌సైన్సెస్ (Zydus Lifesciences) ఈ అత్యాధునిక పరీక్షా విధానాన్ని దేశంలోకి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షకు  షీల్డ్ మల్టీ-క్యాన్సర్ డిటెక్షన్ (MCD) అని పేరు పెట్టారు. అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ గార్డెంట్ హెల్త్ (Guardant Health) ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇప్పుడు జైడస్ సంస్థ అమెరకా సంస్థతో డీల్‌ కుదుర్చుకుని.. భారతీయ ప్రజల శారీరక స్థితిగతులకు అనుగుణంగా ఈ పరీక్షను దేశంలో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపింది.

తొలి విడతగా ప్రధాన నగరాల్లో ప్రారంభం..
భారతదేశంలో ఈ పరీక్షను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా స్పీడ్‌గా జరుగుతున్నట్లు తెలుస్తోంది.. జైడస్ సంస్థ ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తోంది.. తొలిత హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, డిల్లీ నగరాల్లో ఈ రక్త పరీక్ష అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దేశంలోని ఇతర నగరాలు, ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ పరీక్షకు ఎంత ఖర్చవుతుందనే వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఒకే పరీక్షతో 10 రకాల క్యాన్సర్లు ఎలా సాధ్యం?
సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పాటు లివర్ క్యాన్సర్ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్‌లను గుర్తించడానికి వేర్వేరు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రోగులకు శారీరక శ్రమతో పాటు ఆర్థిక భారం కూడా విపరీతంగా పెరగుతుంది.. అయితే, ఈ సరికొత్త విధానంలో కేవలం ఒకే ఒక్కసారి రక్తం నమూనా సేకరించి.. 10 రకాల క్యాన్సర్లను స్క్రీనింగ్ చేయవచ్చు. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరుగుతున్నప్పుడు.. వాటిలోని చిన్న చిన్న డీఎన్‌ఏ (DNA) ముక్కలు రక్త ప్రవాహంలోకి చేరుతాయి. వైద్య పరిభాషలో వీటిని సర్క్యులేటింగ్ సెల్-ఫ్రీ డీఎన్‌ఏ (ccfDNA) అని పిలుస్తారు. ఈ సరికొత్త బ్లడ్ టెస్ట్ ద్వారా రక్తంలో ఈ క్యాన్సర్ డీఎన్‌ఏ ఎంత పరిమాణంలో ఉందో.. అందులో ఎలాంటి రసాయన మార్పులు జరుగుతున్నాయో సులభంగా గుర్తించవచ్చు.

ఈ పరీక్ష ద్వారా సులభంగా వీటిని గుర్తించవచ్చు..
✾ రొమ్ము క్యాన్సర్ (Breast Cancer)
✾ కాలేయ క్యాన్సర్ (Liver Cancer)
✾ ప్రోస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer)
✾ కోలన్ క్యాన్సర్ (Colon Cancer)
✾ మూత్రపిండాలతో పాటు మూత్రాశయ క్యాన్సర్ (Bladder Cancer)
✾ ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer)
✾ అన్నవాహిక క్యాన్సర్ (Esophageal Cancer)
✾ కడుపు క్యాన్సర్ (Stomach Cancer)
✾ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ (Pancreatic Cancer)
✾ అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer)

Also Read: వంటకు నువ్వుల నూనె మంచిదా? ఆవనూనె మంచిదా? భారతీయ వంటకాల్లో దేనిది పైచేయి?

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top