బోనాల పండుగలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు
Karimnagar, Telangana:కరీంనగర్, రామనగర, మార్కండేయ కాలనీలో మున్నూరుకాపు కులస్తులు నిర్వహించిన పోచమ్మ నాట్లు ఉత్సవంలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో మెరుగు స్వప్నశ్రీ, పిట్టల రవీందర్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నెల్లి నరేష్, పెద్దిగారి తిరుపతి, ఉప్పరి అజయ్, అల్వాల భరత్, కంపల్లి కీర్తికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Used Cars: మహీంద్రా థార్, ఫార్చ్యూనర్ కార్లు సగం ధరలకే.. రూ.50 వేల నుంచే ఇక్కడ కార్లు ప్రారంభం!
Hyderabad, Telangana:Mahindra Thar And Fortuner At Half Price: సొంతగా ఒక మంచి కారు కొనుగోలు చేయాలనేది సగటు మధ్యతరగతి కుటుంబాల చిరకాల కోరిక.. కానీ ప్రస్తుతం కొత్త కార్ల ధరలు ఆకాశాన్ని తాకుతుండడంతో చాలామంది సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గుచూపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కార్ల ప్రియుల కోసం ఢిల్లీతోపాటు హర్యానాలో సెకండ్ హ్యాండ్ షో రూమ్లు కుప్పలు చెప్పనుగా పుట్టుకొచ్చాయి. ఇక్కడ అత్యంత తక్కువ ధరల్లోనే బంపర్ ఆఫర్స్తో విక్రయిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని బ్రాండ్లకు సంబంధించిన కార్లు ఇక్కడ అత్యంత తక్కువ ధరతో సగం ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీకి సమీపంలో ఉన్న ఈ షోరూమ్స్లో ఎక్కువగా లగ్జరీ కార్ల నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్టోల వరకు అన్ని అత్యంత చీప్ ధరలకే అందుబాటులో ఉండడం విశేషం.
ముఖ్యంగా హర్యానాలోని ఓ ప్రాంతంలో నైతే కార్లు ఊహించని స్థాయిలో విక్రయిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా అద్భుతమైన మైలేజీతో కూడిన మింట్ కండిషన్ కలిగిన కార్లు ఇక్కడ చీప్ ధరలకే లభించడం విశేషం. అలాగే సాధారణ సెకండ్ హ్యాండ్ కార్లు అనగానే టెస్ట్ డ్రైవ్ ల విషయంలో కొనుగోలుదారులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ కస్టమర్ల నమ్మకం కోసం వందల కిలోమీటర్ల మేర లాంగ్ డ్రైవ్ టెస్ట్ చేసుకుని సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఎంపిక చేసిన కొన్ని కార్లపై మూడు నెలలు లేదా ఐదు వేల కిలోమీటర్ల వరకు ప్రత్యేకమైన వారంటీ సదుపాయాన్ని కూడా అందిస్తూ వస్తున్నారు.
ఇక్కడున్న సెకండ్ హ్యాండ్ కార్లు మార్కెట్లో రూ.50 వేల నుంచి లక్షల్లో కార్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వారికి అనుకూలమైన ధరల్లో టాప్ ఎండ్ కార్లు ఇక్కడ లభించడం చాలా విశేషం. ముఖ్యంగా 2019 మోడల్ టయోటా ఫార్చ్యూనర్ వీఐపీ నెంబర్ కలిగిన లగ్జరీ కార్లు ఇక్కడ కేవలం రూ.21 లక్షల నుంచే ప్రారంభమవుతున్నాయి.. అంతేకాకుండా యువత ఎంతగానో ఇష్టపడే 2026 మోడల్ మహీంద్రా థార్ 4x2 కారు కేవలం ఇక్కడ రూ.13 లక్షలకే అందుబాటులో ఉంది. అయితే, ఇది 3000 కిలోమీటర్లు మాత్రమే తిరిగినట్లు అక్కడ ఉండే నిర్వాహకులు చెబుతున్నారు.
Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
2021 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఎస్ వేరియంట్ కలిగిన కార్లు ఇక్కడ కేవలం రూ.4.95 నుంచే ప్రారంభమవుతున్నాయి. అంతేకాకుండా 2020 మోడల్ మారుతి స్విఫ్ట్ కేవలం బడ్జెట్ కస్టమర్ల కోసం ఇక్కడ మూడు లక్షలకే అందిస్తున్నారు. అదేవిధంగా స్కార్పియో ఎన్, ఆడి Q7, వేగన్ ఆర్, బ్రెజ్జా, ఆల్ట్రోజ్ వంటి ప్రముఖ కంపెనీల కార్లు కూడా భారీ డిస్కౌంట్ ధరల్లో లభించడం విశేషం.. ఈ ఇక్కడ ఉండే షోరూమ్స్ కు సంబంధించిన ప్రత్యేకత ఏమిటంటే ఎక్స్చేంజ్ ఆఫర్.. అవును మీ ఇంట్లో ఉన్న పాత పాడైపోయిన, రిపేర్ లో ఉన్న, స్టార్ట్ కానీ పాత కార్లు ఏవైనా ఉంటే వాటిని ఇక్కడ తీసుకువచ్చి మంచి ధరలకే ఎక్స్చేంజ్ చేసి కొత్త కారణం తీసుకెళ్లవచ్చు..అదేవిధంగా ఎన్నో రకాల ప్రత్యేకమైన ఆమర్చి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PBKS Vs RCB Prediction: ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి..బెంగళూరు గెలవాలని చెన్నై ఫ్యాన్స్ పూజలు..ఎందుకో తెలుసా?
Jhikli Barol, Himachal Pradesh:PBKS Vs RCB Match Prediction: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. ధర్మశాల స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి టేబుల్ టాప్ ప్లేస్ పదిలం చేసుకోవడం సహా ప్లేఆఫ్స్కు అధికారికంగా అర్హత సాధించాలని ఆర్సీబీ యోచిస్తుండగా.. ఇందులో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని పంజాబ్ కసరత్తులు చేస్తుంది.
ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్లేఆఫ్స్కు వెళ్లే అవకాశాలు మెరుగవుతాయి. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఉప్పు-నిప్పులా ఉండే ఆర్సీబీ, సీఎస్కే ఫ్యాన్స్.. తొలిసారి ఆర్సీబీ గెలవాలని సీఎస్కే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ప్రస్తుతం పాయింట్ల పట్టిక ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆడిన 12 మ్యాచ్ల్లో 8 గెలుపొంది 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు ఆడిన 12 మ్యాచ్ల్లో 6 గెలుపొంది కేవలం 13 పాయింట్లతో (ఒక మ్యాచ్ డ్రా) నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే పంజాబ్ ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. ఒకవేళ ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. కానీ, ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓడినా ప్లేఆఫ్స్కు చేరే అవకాశం ఉంది.
పంజాబ్ కింగ్స్ జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ను వరుస విజయాలతో మొదలెట్టి..ఆ తర్వాత వరుస ఓటములతో సతమతమవుతుంది. పంజాబ్ ఆడిన గత 5 మ్యాచ్ల్లో వరుస ఓటమి పాలవ్వడం గమనార్హం. పంజాబ్ పేలవ ప్రదర్శన కారణంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లకు ప్లేఆఫ్ రేసులో నిలిచే పంజాబ్ మార్గం చూపినట్లు అయ్యింది.
మరోవైపు ఆర్సీబీ జట్టు ప్రస్తుత సీజన్లో నిలకడగా రాణిస్తుంది. ఆడిన 12 మ్యాచ్ల్లో +1.053 నెట్ రన్ రేట్తో కలిపి మొత్తం 16 పాయింట్లు సాధించింది. అయితే కేవలం 4 మ్యాచ్ల్లో ఆర్సీబీ ఓటమి పాలవ్వడం గమనార్హం. బ్యాటింగ్, బౌలింగ్లో రాణిస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని కసరత్తులు చేస్తోంది.
హెడ్-టూ-హెడ్ మ్యాచ్లు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 37 సార్లు తలపడ్డాయి. వీరిద్దరి పోటీ హోరాహోరీగా ఉంటుంది. ఎందుకంటే 18 మ్యాచ్ల్లో పంజాబ్ గెలవగా.. 19 మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలవడం గమనార్హం.
పంజాప్ కింగ్స్ తుదిజట్టు అంచనా..
ప్రియాంష్ ఆర్య, విష్ణు వినోద్ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంష్ షెడ్గే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్. (ఇంపాక్ట్ ప్లేయర్: ప్రభ్సిమ్రాన్ సింగ్).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, వెంకటేష్ అయ్యర్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రకీష్ సలాం దార్, జోష్ హేజిల్వుడ్. (ఇంపాక్ట్ ప్లేయర్: జాకబ్ డఫీ)
Also Read: పెళ్లిపీటలు ఎక్కనున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్..ప్రేయసితో పెళ్లికి పాండ్యా రెడీ..
Also Read: గుజరాత్ టీమ్కు గోల్డెన్ ఛాన్స్..గెలిస్తే అగ్రస్థానానికి, KKR ట్విస్ట్ ఇస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Adhika Masam 2026: నేటి నుంచే అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం.. ఈ నెలలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు?
Hyderabad, Telangana:Adhika Jyeshtha Masam 2026 Date Latest News: సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే.. మూడేళ్లకోసారి మాత్రమే వచ్చే అధికమాసం ఈ ఏడాది జేష్ఠ మాసంలో ప్రారంభమవ్వడం విశేషం. మే 15 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం అయ్యింది. ఈ పవిత్ర కాలానికి హిందూ శాస్త్రంలో విశేషమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనిని భగవంతుడి పేరిట పురుషోత్తమ మాసం అని కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పిలుచుకుంటారట.. ఈ నెల రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలని ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
అధికమాసం అంటే ఏంటి?
చాంద్రమాన, సౌరమాన, ఖగోళ గణిత కాలాల మధ్య వ్యత్యాసాన్ని సరిచేయడానికి ఈ అధికమాసం ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రమానం ప్రకారం ఒక సంవత్సరానికి 3504 రోజులు ఉంటాయి.. అదే సౌరమానం ప్రకారం 365 రోజులు ఉంటాయి. ఈ రెండు మాసాల మధ్య లేటా వచ్చే దాదాపు 11 రోజుల తేడా సమానం చేయడానికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అదనపు మాసం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శాస్త్ర సాంకేతిక పరంగా చూస్తే.. ఏ చాంద్రమానం లోనైతే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారే సూర్య సంక్రాంతి జరగదో.. ఆ మాసాన్ని అధికమాసంగా పరిగణిస్తూ ఉంటారు.
పంచాంగ కర్తల లెక్కల ప్రకారం.. 2026 సంవత్సరంలో మే 17వ తేదీ ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమై. జూన్ 15వ తేదీతో ముగుస్తుంది. ఆ తర్వాత జూన్ 16 నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం అవుతుంది.. అధిక మాసంలో శూన్య శక్తులు ఎక్కువగా ఉంటాయని నమ్మకంతో వివాహాలతో పాటు గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, ఉపమానాలు, వంటి లౌకికపరమైన శుభకార్యాలను సాధారణంగా నిర్వహించరు.. అయితే, ఆధ్యాత్మికపరంగా ఈ మాసం అత్యంత బలమైందని.. ఈ సమయంలో చేసే సత్యనారాయణ వ్రతాలతో పాటు హోమాలు విష్ణు సహస్రనామ పారాయణాలు, జపాన్ తీర్థయాత్రలు నదీ పుణ్య స్నానాలు మొదలైన దైవకార్యాలు ఎంతో శ్రేష్ఠమైనవిగా భావిస్తారు..
ఈ కాలంలో చేసే చిన్న పుణ్యకార్యానికైనా సరే.. సాధారణ రోజులకంటే అనేక రెట్లు అధిక ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి. లౌకిక శుభకార్యాలు నిషిద్ధమైనప్పటికీ.. పితృ కార్యాలతో పాటు శ్రద్ధ కర్మలు, యధావిధిగా నిర్వహించుకోవచ్చు.. ఈ సమయంలో ముఖ్యంగా దానధర్మాలకు, అన్నదానానికి, వస్త్రధానానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ నెలరోజుల పాటు నిరుపేదలకు అన్నదానం చేయడంతో పాటు సాయంత్రం వేళల్లో శివాలయాలు, విష్ణు దేవుడికి సంబంధించిన ఆలయాల్లో దీపారాధన చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి ప్రారంభం అయినా ఈ పవిత్ర మాసంలో భక్తులందరూ దైవ నామస్మరణతో గడుపుతూ దానధర్మాలు ఆచరించి ఆ పురుషోత్తముని అనుగ్రహానికి పాత్రులు కావాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆకాంక్షిస్తున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ketu Transit 2026: మాఘ నక్షత్రంలోకి కేతువు సంచారం.. జూన్ 30 వరకు ఈ 3 రాశుల వారికి కష్టకాలం!
Hyderabad, Telangana:Ketu Transit In Magha Nakshatra 2026 Telugu: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు గ్రహాన్ని ఛాయాగ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా దీనిని మోక్షానికి కారకంగా కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని పనులు చెబుతూ ఉంటారు. రాహువు కేతువు గ్రహాలు ఎల్లప్పుడూ వక్రమార్గంలోనే సంచారం చేస్తూ ఉంటాయి.. అంతేకాకుండా కేతు తన నక్షత్రాన్ని మార్చుకున్నప్పుడల్లా అది వ్యక్తుల మానసిక స్థితితో పాటు వృత్తి ఆర్థిక పరిస్థితులు జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆయా రాశుల వారికి అనేక మార్పులను తీసుకొస్తూ ఉంటాయి. మే 29న కేతువు మాఘ నక్షత్రంలోని మూడవ స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కేతువు గ్రహం జూన్ 30వ తేదీ వరకు అదే నక్షత్రంలో కొనసాగుతూ ఉంటాడు.. అయితే, ఈ నక్షత్రానికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాంటిది రాబోయే 32 రోజుల పాటు అన్ని రాశులు బుధుడితో పాటు కేతువు గ్రహాల వల్ల ప్రభావితమవుతాయి. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి ఊహించని నష్టాలు వాటిలో అవకాశాలు ఉన్నాయి.
ఈ రాశులవారికి కష్టకాలమే..
మిథున రాశి
కేతు సంచారంతో మిధున రాశి వారికి జీవితంలో తీవ్రమైన మానసిక సంఘర్షణతో పాటు గందరగోళం ఏర్పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వాగ నక్షత్రానికి అధిపతి బుధుడు కావడం కారణంగా ఈ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తీవ్రంగా తగ్గిపోతుంది. అలాగే కార్యాలయాల్లో ఉన్నత అధికారులతో అనేక విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. దీంతోపాటు ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి నష్టాలు తప్పవని జ్యోతిష్యులు చెబుతున్నారు. లాటరీలు కొనుగోలు చేసే వారికి ఈ సమయంలో నష్టాలు కూడా వాటిలే అవకాశాలు ఉన్నాయి. సంపాదనపరంగా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.
కన్యా రాశి
కన్య రాశి వారికి కేతు నక్షత్ర సంచారంతో వీరికి ఈ సమయంలో తీవ్ర దృశ్య ప్రభావాలు కలుగుతాయి.. ముఖ్యంగా క్రమక్రమంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితం నిజమైన లక్ష్యం నుంచి పక్కకు తప్పుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కష్టం చేసినప్పటికీ ఎలాంటి ఫలితాలు లేకుండా ఉంటాయి. ముఖ్యంగా కార్యాలయంలో మీ పనికి తగ్గ ప్రశంసలు లభించకపోవచ్చు. అలాగే ఎలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకపోవడం మంచిది.. ముఖ్యంగా ఆరోగ్యం పై ఈ సమయంలో ప్రత్యేకమైన దృష్టి సారించడం మంచిది.
మీన రాశి
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు కేతువు సంచారం వల్ల మాటలు తడబడడంతో పాటు కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశాలున్నాయి. జీవితంలో వీరికి ఆనందంతో పాటు సంతోషం కరువయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆకస్మికంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.. అలాగే వైవాహిక జీవితంలో అనేక అపార్ధాలు రావచ్చు. ముఖ్యంగా భాగస్వామితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తప్పవని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... మాఘ నక్షత్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఏవైనా కొన్ని గ్రహాలు ఈ నక్షత్రం లోకి ప్రవేశించడం కారణంగా లాభాల కంటే ఎక్కువగా నష్టాలే కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కేతులాంటి కీడు గ్రహాలు ఎందులోకి సంచారం చేస్తే అనేక రకాల వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ముఖ్యంగా కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం తొలగిపోతుంది.. అలాగే అనుకున్న పనుల్లో కూడా విజయాలు సాధించకపోవచ్చు ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: కింగ్ కోబ్రా ముఖంపై సిగరెట్ పొగ ఊదుతూ యువకుడి వికృత చేష్టలు.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Cobra Video Watch Now: సోషల్ మీడియాలో లైకులతో పాటు వ్యూస్ కోసం కొందరు యువకులు ఎంతటి తెగింపుకైన వెనకాడడం లేదు.. ప్రాణాలకే ముప్పు తెచ్చి ప్రమాదకరమైన జంతువులతో విన్యాసాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సోషల్ మీడియా వినియోగదారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తోంది. ఈ వీడియోలో ఒక యువకుడు ఏకంగా రెండు అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాలతో చెలగాటం ఆడుతూ ఉండడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి పచ్చిక మైదానంలో కూర్చుని ఉండడంతో పాటు అతని ముందు రెండు ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలు పడగవిప్పి నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. సాధారణంగా పాములను చూస్తేనే ఎవరైనా పురాణ భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కానీ ఈ యువకుడు మాత్రం ఎలాంటి భయం లేకుండా వాటి ముందే కూర్చుని ఉండడం మీరు చూడొచ్చు. అంతటితో ఆగకుండా.. నోట్లో సిగిరెట్ పెట్టుకొని కాలుస్తూ.. ఆ పొగను నేరుగా ఒక కింగ్ కోబ్రా ముఖంపై ఊదడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. పొగ ప్రభావానికి ఆ పాము ఒక్కసారిగా ఆగ్రహానికి గురైనట్లు కూడా వీడియోలో గమనించవచ్చు.
ఈ వికృత చేష్టాలు అంతటితో ఆగలేదు.. ఆ తర్వాత ఆ యువకుడు ఊహించని విధంగా పాము తలపై ముద్దు పెట్టుకోబోయాడు. అవును ఈ దృశ్యాలను కూడా మీరు వీడియోలో కళ్లకు కట్టినట్లు చూడొచ్చు. కొద్దిగా తేడా వచ్చిన క్షణాల్లో ప్రాణాలు తీయగల ఆ విష సర్పాల ముందు అతడు చేసిన ఈ స్టెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.. ఈ వీడియోను ఒక సోషల్ మీడియా వినియోగదారుడు తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సదరు యువకుడి పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ధైర్యం కాదు ముమ్మాటికి మూర్ఖత్వమే అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తుంటే. మరి కొంతమంది వన్యప్రాణులను హింసించినందుకు.. వాటి ప్రాణాలతో ఆడుకుంటున్న అందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. లైకుల పిచ్చితో ఇలాంటి ప్రాణాంతకమైన పనులు చేసి సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని పలువురు కామెంట్ల ద్వారా ప్రశ్నిస్తూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Jagtial: జగిత్యాల ఎమ్మెల్యే ఒక జోకర్.. ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు!
Mannegudem, Telangana:MP Arvind Vs MLA Sanjay Kumar: జగిత్యాల జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చల్గల్ విద్య సంస్థల భూముల అంశంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్..జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటూ సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఎంపీ అరవింద్ విడుదల చేసిన ఒక వీడియో నియోజకవర్గంలో సంచలనగా మారింది. ఎమ్మెల్యే సంజయ్ ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి..
ఎంపీ అరవింద్ విడుదల చేసిన వీడియోల్లో ఆయన అత్యంత ఘాటుగా స్పందించారు. జగిత్యాలకు ఒక జోకర్ ఎమ్మెల్యే ఉన్నాడు.. ఆయనే సంజయ్ కుమార్ అంటూ తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. చలిగల్ విద్యాసంస్థల వ్యవహారంలో ఎమ్మెల్యే తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఇకపై తాను జగిత్యాల నియోజకవర్గ రాజకీయాలపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారని స్పష్టం చేశారు. స్థానికంగా జరుగుతున్న అక్రమాలతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతానని.. రాజకీయంగా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ధర్మపురి అరవింద్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.
గత కొద్ది రోజులుగా చలిగాలు పరిధిలోని విద్యాసంస్థల భూములతో పాటు నిధుల కేటాయింపుపై వీరు నేతల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తనపై చేస్తున్న ఆరోపణలు ఎంపీ బండి సంజయ్ పూర్తిగా తిప్పికొడుతున్నారు. అభివృద్ధిని అడ్డం పెట్టుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది ఎమ్మెల్యేనని ఆయన ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎంపీ వ్యాఖ్యలపై అధికార పార్టీ శ్రేణులతో పాటు ఎమ్మెల్యే అనుచరులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ.. స్థానిక ఎమ్మెల్యేను జోకర్ అని సంబోధించడం ఆయన సంస్కారానికి నిదర్శనం అని మండిపడుతున్నారు.
Also Read: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..
సాధారణంగానే జగిత్యాల జిల్లా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటుంది. ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే మధ్య వ్యక్తిగత దూషణల స్థాయికి వివాదం చేరడంతో క్షేత్రస్థాయిలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. రానున్న రోజుల్లో ఈ ఇద్దరి నేతల మధ్య పోరు ఏ తీరాలకు చేరుతుందోనని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎంపీ అరవింద్ వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లాలో బిజెపి కాంగ్రెస్ శ్రేణుల మధ్య సోషల్ మీడియా వేదికగా కూడా పోస్టల్ యుద్ధం మొదలైంది.
Also Read: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్..
Jadcherla Vaishnavi Murder: జడ్చర్ల మర్డర్ కేసులో ఊహించని ట్విస్ట్.. యువతిని హత్య చేసిన తేజ మృతి! పూర్తి వివరాలు..
Hyderabad, Telangana:Jadcherla Vaishnavi killer Teja Dies: తనను నమ్మించి మోసం చేసిందనే ఆరోపణతో జడ్చర్లలో శనివారం వైష్ణవి(22) అనే యువతిని హైదరాబాద్కు చెందిన తేజ గొంతు కోసి నిన్న సాయంత్రం హత్య చేశాడు. గతంలో వీళ్లిద్దరూ హైదరాబాదులో ఒకే చోట పని చేసేవారు. ఆ పరిచయంతో ప్రేమ పేరుతో వేధించాడని సమాచారం. పోలీసుల ప్రకారం ప్రేమ పేరుతో యువతిని వేధించిన యువకుడు ఆమె గొంతు కోసి హత్య శనివారం హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో శనివారం సాయంత్రం జరిగింది. రామచంద్రయ్య, శ్రీలత దంపతుల కూతురు వైష్ణవి(22) ఓ ప్రైవేట్ కాలేజీలో రిసెప్షనిస్టుగా పనిచేస్తుంది. హైదరాబాద్కు చెందిన తేజ(28) ప్రేమ పేరుతో వెంటపడుతున్నట్లు సమాచారం.
అయితే, తనను దూరం పెడుతూ వస్తోందనే కోపంతో తేజ శనివారం పాఠశాల నుంచి తిరిగి వస్తున్న వైష్ణవిని కత్తితో గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో వైష్ణవి కింద పడిపోగా స్థానికులు వెంటనే గమనించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు సమాచారం. హత్య చేసి తేజ పారిపోతున్న క్రమంలో స్థానికులు వెంబడించి పట్టుకుని చేతులు, కాళ్లు కట్టేసి బండరాళ్లతో దాడి చేశారు. దీంతో అతడు కూడా తీవ్ర గాయపడ్డాడు. వెంటనే స్థానికులు పోలీసులకు ఈ ఘటనపై సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక తీవ్రంగా గాయపడ్డ తేజను చికిత్స నిమిత్తం పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తేజా కూడా మృతి చెందాడు. అయితే, తనను వైష్ణవి ప్రేమ పేరుతో మోసం చేసి డబ్బులు కాజేసిందని యువకుడు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. కాగా.. నిన్న జడ్చర్లలోని నిమ్మబావి గడ్డలో వైష్ణవి అనే యువతిని హైదరాబాద్కు చెందిన యువకుడు హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. వీరిద్దరి మధ్య పరిచయమా? లేదా ప్రేమా? అసలు కారణం బయటకు రావాల్సి ఉంది. కానీ, క్షణికావేశంతో తేజ తీసుకున్న నిర్ణయం వల్ల ఇద్దరు ప్రాణాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పోలీసులు ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం! రెండు కోచ్లకు వ్యాపించిన మంటలు
Also Read: సిటీలో మళ్లీ రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.. డాక్టర్కే మత్తుమందిచ్చి సినీ ఫక్కీలో 60 తులాల బంగారం ఊడ్చేశారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Dhanalakshmi Rajayogam: మే 18 నుంచి ధనలక్ష్మి రాజయోగం.. ఈ 4 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, అదృష్టం!
Hyderabad, Telangana:Dhanalakshmi Rajayogam Effect On Zodiac: మే 18వ తేదీ నుంచి ధనలక్ష్మి రాజయోగం ప్రారంభం కాబోతోంది. మిథున రాశిలో గురు గ్రహం శుక్ర గ్రహ కలయిక కారణంగా ఈ శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది.. ఈ యోగంతో ద్వాదశరాశుల వారికి ఆశ్చర్యం కలిగించే ధన లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇది అన్ని శక్తివంతమైన రాజయోగాల్లో చాలా శుభ్రమైనదిగా భావిస్తారు. మే 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి వృత్తిలో పురోగతితో పాటు భారీ ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనలక్ష్మి రాజయోగ ప్రభావంతో మే 18 నుంచి కొన్ని రాశుల వారు తప్పకుండా ధనవంతులవుతారట. అలాగే ఎన్నో రకాల సమస్యల నుంచి తప్పకుండా పరిష్కారం కూడా కలుగుతుంది. ముఖ్యంగా తీవ్ర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి తప్పకుండా ఈ సమయంలో వాటి నుంచి విముక్తి లభించి.. మానసికంగా చాలా వరకు మెరుగుపడతారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా పరిష్కారం లభించబోతోంది.
ఈ రాశులవారికి పండగే..
మేష రాశి
ధనలక్ష్మి రాజయోగం కారణంగా మేషరాశి వారికి అనేక విధాలుగా అదృష్టం కలిసి రాబోతోంది.. ముఖ్యంగా కెరీర్ పరంగా పెద్ద పురోగతి లభించడమే కాకుండా ఆఫీసుల్లో పనులు సజావుగా సాగుతాయి. మీకు నచ్చిన వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఈ వారం ఆదాయం కూడా భారీ మొత్తంలో పెరుగుతుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది.. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలోనే ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి ప్రయోజనాలు కూడా పొందుతారు. ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోయి ఉంటే.. తప్పకుండా ఈ సమయంలో పూర్తవుతుంది. దీంతోపాటు కార్యాలయంలో మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి. అలాగే వృత్తి జీవితంలో గొప్ప పురోగతి సాధించే అవకాశాలున్నాయి. ఇంటి సంబంధిత సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో గొప్ప గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తికి సంబంధించిన అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. నిలిచిపోయిన డబ్బును కూడా తిరిగి పొందుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అద్భుతమైన శుభసమయంగా మారబోతోంది. అంతేకాకుండా ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలు ఎంతో సులభంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో అనేక విధాలుగా లాభదాయకంగా ఉండబోతోంది. ఈ వారం ప్రారంభంలోనే సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి జీవితం ఎంతో లాభదాయకంగా మారబోతోంది. కొత్త కోరికలు నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన వారు తమ పనులన్నీ సమయానికి పూర్తిచేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Venus Transit 2026: పునర్వాసు నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశుల వారికి లక్కీ లాటరీ తగిలినట్లే!
Hyderabad, Telangana:Venus Transit In Punarvasu Nakshatra 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని మనందరికీ తెలుసు. అలాగే శుక్ర గ్రహాన్ని అత్యంత శుభగ్రహంగా కూడా చెప్పుకుంటారు. ఈ రెండు గ్రహాలు జ్యోతిష్య శాస్త్రంలో చాలా శక్తివంతమైనవి, శుభప్రదమైనవిగా భావిస్తారు. ఇదిలా ఉంటే శుక్రుడు, గురు గ్రహానికి సంబంధించిన పునర్వాసు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నక్షత్రాన్ని కూడా చాలా శుభప్రదమైనదిగా జ్యోతిష్యులు చెబుతున్నారు.. మే 31వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో సంతోషం శ్రేయస్సు ప్రేమ సంపదకు కారకుడైన శుక్రుడు పునర్వాసు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో భారీ మొత్తంలో డబ్బులు వించబోతోంది అలాగే ప్రేమ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో శుక్రుడి అనుగ్రహం పొంది అత్యధిక లాభాలు పొందబోతున్న రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి ఊహించని జాక్పాట్..
మిథున రాశి
పునర్వాసు నక్షత్రంలో శుక్రుడి సంచారం మిధున రాశి వారికి గొప్ప గొప్ప ఫలితాలను అందించబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రేమ సంబంధాల్లో అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వృత్తి జీవితం ఇప్పుడు సానుకూలంగా మారుతుంది. మీరు మీ భవిష్యత్తు గురించి అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ సమయంలో మీకు కొత్త ఆదాయ మార్గాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా లభిస్తుంది. కుటుంబంతో మంచి సమయాన్ని కూడా గడుపుతారు. సమస్యలన్నీ ఈ సమయంలో సులభంగా పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా శుక్రుడి నక్షత్రం మార్పు కారణంగా వృత్తి జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు. ఈ సమయంలో డబ్బు కూడా విపరీతంగా ఆదా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా జీవితంలో శాంతి నెలకొంటుంది. అలాగే ప్రేమ సంబంధాలు అద్భుతంగా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మధ్య ఉన్న వివాదాలు కూడా చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పురోగతి లభించడమే కాకుండా పెద్ద మొత్తంలో ప్రమోషన్స్ లభిస్తాయి.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడి సంచార ప్రభావంతో స్వర్ణ యుగం ప్రారంభం కాబోతోంది. వీరికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం సంపూర్ణంగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో సంబంధాలు మరింత మెరుగుపడి అద్భుతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు గౌరవం పెరగడమే కాకుండా వృత్తిపరంగా గొప్ప గొప్ప అవకాశాలు లభించవచ్చు. అలాగే మీకు ఇష్టమైన వ్యక్తులు మీకు అనుకూలంగా మారి వారి ద్వారా అద్భుతమైన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు..
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడి సంచారం సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తి జీవితం లాభదాయకంగా మారుతుంది. ప్రేమ సంబంధాలు సజావుగా సాగడమే కాకుండా ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం అంచలంచెలుగా పెరగడంతో ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా లభిస్తాయి. వీరు ఈ సమయంలో ఒత్తిడి లేని జీవితాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala: టీటీడీ సంచలన ప్రకటన.. శ్రీవాణి టికెట్ల గోల్మాల్ ఆరోపణలపై క్లారిటీ, ఆ వార్తలన్నీ అబద్ధం!
Hyderabad, Telangana:TTD Strongly Condemns Allegations Against Srivari Ttickets Booking System: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం దేశ నలుమూలలే కాదు ప్రపంచ స్థాయిగా భక్తులు శ్రీవారి దర్శన నిమిత్తం వస్తారు. అయితే శ్రీవారి దర్శనానికి ప్రత్యేక దర్శన టోకెన్లు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిని ముందస్తుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన శ్రీవాణి ట్రస్ట్ ఆన్లైన్ టికెట్లు కేవలం ఒక్క నిమిషంలోనే మాయం చేస్తుంది. కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమణ కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే టీటీడీ దీనికి సంబంధించి తాజాగా స్పందించింది. ఆన్లైన్ విధానాన్ని ఎలా అమలు చేస్తున్నారో వివరించింది.
ముందు యాక్సెస్ చేసేవారికే ముందు టిక్కెట్లు..
2019 మే నెలలో టీసీఎస్ సహకారంతో ప్రారంభించిన ఈ శ్రీవాణి ఆన్లైన్ టికెట్ విధానాన్ని తాము కొనసాగిస్తున్నామని తెలిపింది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఆఫ్ లైన్ ద్వారా ఏ రోజుకి ఆ రోజు కూడా జారీ చేయడానికి కూడా మార్పు చేశామంది. ఎవరైతే సాఫ్ట్వేర్ అప్లికేషన్ ముందుగా యాక్సెస్ చేస్తారో వారికే టికెట్ వచ్చే విధంగా సాఫ్ట్వేర్ తయారు చేశామన్నారు. కేవలం ఒకటిన్నర నిమిషంలో ముందు వచ్చిన వారికే టికెట్ లాక్ అవుతూ ఉందని చెప్పారు. తదుపరి పేమెంట్ గేట్ వే విజయవంతంగా డబ్బులు చెల్లించిన వారికే టికెట్లు జారీ చేస్తున్నామన్నారు. చెల్లింపు జరగని సమయంలో టికెట్లను తిరిగి పూల్లోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇందులో మానవ ప్రమేయం లేదు, సిస్టం ఆటోమేటిక్గా పనిచేస్తుందన్నారు.
2019 టీసీఎస్ సాఫ్ట్వేర్లు మాత్రమే తాము వినియోగిస్తున్నాం, ఇప్పటికీ కొత్త సాఫ్ట్వేర్ రాలేదు, ఎప్పటికప్పుడు భక్తుల నుండి వచ్చే సలహాలు, సూచనలు తీసుకొని మరి మార్పు చేస్తున్నామన్నారు. ఇక పది నిమిషాల తర్వాత టికెట్ల జారీ చేయడం వాస్తవమే పేమెంట్ వద్ద చెల్లింపు సమయంలో సాంకేతిక లోపం వల్ల టీటీడీకి డబ్బు జమ అయినట్లు మెసేజ్ రాకుంటే వెంటనే ఆ టికెట్లను ఫూల్ లోకి తీసుకువచ్చి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామన్నారు.
అంతేకాదు జీఎం ఐటీగా కనీస అర్హతలు లేని వ్యక్తిని నియమించారని చెప్పడం విరుద్ధం, ఎంటెక్, ఎంఎస్లో వీరికి ఇన్ఫర్మేషన్ సిస్టం, కంప్యూటర్ సైన్స్ అర్హత, 32 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న వారిని జీఎంఐటి ఎఫ్ఎసిగా నియమించడం జరిగిందన్నారు. అంతేకాదు భక్తుల సౌకర్యం టీటీడీ ఆటో ఫిల్లింగ్, కాపీ పేస్ట్ ప్రక్రియ విధానాలను పూర్తిగా రద్దు చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూన్నారు. సిస్టం ఆడిట్లను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ప్రతి సంవత్సరం ఆడిట్ చేస్తుందన్నారు.
తిరుమల ఆగస్టు నెల కోట దర్శనం వివరాలు..
రేపటి నుంచి ఆగస్టు నెల కోట ప్రత్యేక దర్శన టోకెన్లు మంజూరు చేయనున్నారు. సుప్రభాతం, తోమాల అర్చన, అష్టాదళ పాదపద్మారాధన సేవకు సంబంధించి రేపు 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తారు. ఇక లక్కీ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన వారు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరు అవుతాయి.
Read more: Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆగస్టు నెల దర్శన టికెట్ల షెడ్యూల్ వచ్చేసింది, ఏ రోజు ఏ కోటా అంటే?
Read more: తిరుమల మాడవీధులను ఇకపై ఈ పేర్లతో పిలుస్తారు.. టీటీటీ కీలక నిర్ణయం..
మే 21వ తేదీన కళ్యాణోత్సవం, ఊంజాల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక వర్చువల్ సేవ కోటా స్లాట్ లో కూడా మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేస్తుంది.
23వ తేదీ అంగప్రదక్షిణ టోకెన్ల కోటను ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనుంది. శ్రీవారు ట్రస్టు దర్శన టోకెన్లు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించేందుకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు కూడా విడుదల చేస్తారు.
ఇక మే 25వ తేదీన తిరుమల ప్రత్యేక దర్శనం రూ. 300 టికెట్లు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంతాలలో గదుల కోటను కూడా విడుదల చేస్తారు. అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి అర్చిత సేవలు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
MP Lavu Krishna Devarayalu: ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మంచి మనసు..ఎస్టీ విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచిత చదువుకు హామీ!
Narasaraopeta, Andhra Pradesh:MP Lavu Krishna Devarayalu Latest News: ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క ఎస్టీ విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదన్నదే తమ సంకల్పమని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన పల్నాడు జిల్లా ఎస్టీ విద్యార్థులకు నరసరావుపేటలోని ఎస్.ఎస్.ఎన్ (SSN) కళాశాలలో ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రూపుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన ఎస్టీ ప్రతిభావంతులను ప్రత్యేకంగా అభినందించి, సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇంటర్లో 600 పైబడి మార్కులు సాధించిన 287 మంది షెడ్యూల్డ్ తెగలకు (ST) చెందిన విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచితంగా సీటు కల్పించి, ఉచిత విద్యను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తల్లిదండ్రులు పిల్లల చదువులను మధ్యలోనే ఆపేసే పరిస్థితి రాకూడదని, ధైర్యంగా పైచదువులకు పంపాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా 346 మంది ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వగా.. అందులో ఏకంగా 287 మంది (83% పైగా) ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించడం జిల్లాకే గర్వకారణమని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కొనియాడారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్థులకు, రాత్రింబవళ్లు కష్టపడి వారికి మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కనీసం డిగ్రీ వరకు చదివించాలి..
ఎస్టీ కుటుంబాల నుంచి ఒక్కో గ్రామానికి కనీసం నలుగురు చొప్పున చదువుకొని ఉన్నత స్థాయిల్లో స్థిరపడాలన్నదే తమ కోరికని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆకాంక్షించారు. వారిని చూసి గ్రామంలోని మరో పది మంది స్ఫూర్తి పొంది చదువుకుంటారని చెప్పారు. ఎస్టీ విద్యార్థులు కనీసం డిగ్రీ వరకైనా పూర్తి చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా సులువవుతుందని, కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను డిగ్రీ పూర్తయ్యే వరకు ఖచ్చితంగా ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదే వేదికపై నరసరావుపేట పరిసర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం ఒక కొత్త ప్రభుత్వ జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలని స్థానిక ఉపాధ్యాయులు.. ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు.. నరసరావుపేటలో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన మాటిచ్చారు.
Also Read: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్..'తల్లికి వందనం' రూ.15,000 మరింత పెంపు?
Also Read: ఏపీలో అతిపెద్ద బంగారు గనీ..తవ్వేకొద్ది వచ్చి పడుతున్న బంగారం..సీఎం కీలక ప్రకటన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bandi Bhageerath Case: బండి భగీరథ్ కోసం రంగంలోకి దిగిన పోలీసులు..ఇల్లు తనిఖీ చేసిన పోలీసులు!
Hyderabad, Telangana:Bandi Bhageerath Case News: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు వెతుకులాడుతున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి భగీరథ్ ఆచూకీ కోసం పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని కూడా తనిఖీ చేశారని సమాచారం అందుతోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ను ఎట్టి పరిస్థితుల్లో అదుపులోకి తీసుకోవాలని పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.AP CM Chandrababu: గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు..మూడో బిడ్డకు రూ.30,000..నాలుగో బిడ్డకు రూ.40,000!
Narasannapeta, Andhra Pradesh:CM Chandrababu On Population: నేడు శ్రీకాకుళంలోని నర్సన్నపేటలో జరిగిన "స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర" కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి గురించి మాట్లాడుతూనే జనాభా పెరుగుదల అవసరమని ఆయన అన్నారు. జనాభా పెరుగుదలకు ప్రోత్సాహంగా మూడో బిడ్డకు రూ.30,000.. అలాగే నాలుగో బిడ్డ పుట్టిన తర్వాత రూ.40,000 అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.Peddi Chiru Leaks: 'పెద్ది' మూవీ ట్రైలర్పై చిరూ లీక్స్..వీడియో చూసి డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్..డైరెక్టర్కి క్షమాపణ!
Hyderabad, Telangana:Peddi Trailer Chiru Leaks: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది'. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన 'చిరు లీక్స్'తో హైప్ను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లారు. మే 18న ముంబైలో ఈ సినిమా ట్రైలర్ను గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. అయితే, అంతకంటే ముందే ఈ ట్రైలర్ చూసిన చిరంజీవి, సోషల్ మీడియా వేదికగా తన రివ్యూను పంచుకోవడమే కాకుండా, ఒక పవర్ఫుల్ డైలాగ్ను కూడా లీక్ చేశారు.
'పెద్ది' ట్రైలర్ చూసిన ఆనందంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. తన ఎక్సైట్మెంట్ను ఆయన పెట్టిన పోస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. "పెద్ది ట్రైలర్ చూసాను! జస్ట్ వావ్..అంతే. 3 నిమిషాలు… ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్.. ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు.. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ఈ ట్రైలర్ ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్.. అన్నీ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి" అని 'పెద్ది' టీమ్పై ప్రశంసల వర్షం కురింపించారు.
అయితే ఈ సినిమా ట్రైలర్ గురించి వివరిస్తూనే.. ఓ డైలాగ్ను మెగాస్టార్ చిరంజీవి లీక్ చేశారు. చిరూ లీక్స్కు పని చెప్పి చాలా రోజులు అవుతుందని చిరంజీవి చమత్కరించారు. చాలా రోజుల తర్వాత తన మార్క్ 'పెద్ది' ట్రైలర్లోని ఓ డైలాగ్ను లీక్ చేశారు. 
"మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు..." అనే డైలాగ్ లీక్ చేసి ఫ్యాన్స్లో క్యూరియాసిటీని మరింత పెంచారు. అయితే ఈ సినిమా ట్రైలర్లోని డైలాగ్ లీక్ చేయడం వల్ల 'పెద్ది' సినిమా డైరెక్టర్కు మెగాస్టార్ చిరంజీవి సారీ చెప్పారు. "Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా!" అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు.
బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ 'పెద్ది' సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్చరణ్ తేజ్ కథానాయకుడిగా నటించగా.. ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. ఇందులో కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా.. మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కించాయి. మే 18న సినిమా ట్రైలర్ విడుదల చేయనుండగా.. జూన్ 4న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Also Read: టాలీవుడ్ నిర్మాతతో గొడవ పెట్టుకున్న త్రిష..సినిమాలో హీరోయిన్గా తీసుకోలేదని రచ్చ!
Also Read: విజయ్ నుంచి హన్సిక వరకు..విడాకులు తీసుకున్న సెలబ్రిటీ జంటలు వీళ్లే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Monsoon Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు..రాష్ట్రంలో వర్షాలు కురిసేది అప్పటి నుంచే..
Ram Krishna Pur, Andaman and Nicobar Islands:Southwest Monsoon Update: ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లటి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. దీనితో దేశంలో వర్షాల సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. అయితే మన తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు చేరేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు అండమాన్, నికోబార్ దీవుల్లోని మెజారిటీ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. అలాగే ఆగ్నేయ అరేబియా సముద్రంలోనూ ఇవి ప్రవేశించాయి. మరో 3-4 రోజుల్లో ఇవి మరింత ముందుకు సాగడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది.
మే చివర్లో కేరళలోకి ఎంట్రీ!
సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1వ తేదీ నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. కానీ ఈసారి వాతావరణ మార్పుల వల్ల అంతకంటే ముందే భారత్ను పలకరించబోతున్నాయి. ఈ ఏడాది మే 26 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ తేదీకి ఒక నాలుగు రోజులు అటుఇటుగా (మే చివరి వారంలో) ఎప్పుడైనా కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించవచ్చు.
తెలుగు రాష్ట్రాలకు రాక ఎప్పుడు?
కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత సాధారణంగా దేశమంతటా విస్తరించడానికి సమయం పడుతుంది. కేరళను తాకిన దాదాపు 7 నుండి 10 రోజుల్లో రుతుపవనాలలోని రాయలసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఈసారి మే నెలాఖరులోనే కేరళకు వస్తే, జూన్ మొదటి వారంలోనే ఏపీలో తొలి రుతుపవన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏపీలో ప్రవేశించిన కొద్దిరోజులకే తెలంగాణ అంతటా రుతుపవనాలు విస్తరించి వర్షాలు కురిపిస్తాయి. సెప్టెంబర్ వరకు ఈ వర్షాల కాల సీజన్ అలాగే కొనసాగుతుంది.
గత ఏడాది కూడా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థల కారణంగా సాధారణ సమయం కంటే 8 రోజులు ముందుగానే రుతుపవనాలు కేరళను తాకాయి. 2009 తర్వాత అంత త్వరగా నైరుతి రుతుపవనాలు రావడం గత ఏడాదే కావడం విశేషం.
వాతావరణ శాఖ నుంచి చల్లటి సమాచారం రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఖరీఫ్ సాగు పనులకు, విత్తనాలు సిద్ధం చేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు రుతుపవనాలు తోడ్పతాయి. దీంతో రుతుపవనాల రాక కోసం తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Also Read: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్..'తల్లికి వందనం' రూ.15,000 మరింత పెంపు?
Also Read: ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు..నో వెహికల్ డే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
