icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow28 Jul 2024, 10:42 am

బోనాల పండుగలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు

Karimnagar, Telangana:

కరీంనగర్, రామనగర, మార్కండేయ కాలనీలో మున్నూరుకాపు కులస్తులు నిర్వహించిన పోచమ్మ నాట్లు ఉత్సవంలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో మెరుగు స్వప్నశ్రీ, పిట్టల రవీందర్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నెల్లి నరేష్, పెద్దిగారి తిరుపతి, ఉప్పరి అజయ్, అల్వాల భరత్, కంపల్లి కీర్తికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Lingamaneni Sanjush: కారు ప్రమాదంలో యువతి మృతి.. జనసేన ఎంపీ లింగమనేని రమేశ్‌ కొడుకుపై కేసు

Hyderabad, Telangana:

Lingamaneni Sanjush Accident Case: ఐటీ కారిడార్‌లో భోజనం చేసి రోడ్డు దాటుతూ వెళ్తున్న యువతిని అత్యంత వేగంగా కారుతో దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఆమె ఎగిరి కిందపడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం చేసిందెవరో కాదు ఏపీలోని జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేశ్‌ కుమారుడు లింగమనేని సంజూశ్‌. ప్రమాదం జరిగి నాలుగు రోజుల తర్వాత పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంకా అరెస్ట్‌ చేయకపోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఇన్‌ఆర్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పనిచేసే ఇద్దరు మహిళా ఉద్యోగులు భారతి ముఖి (26),  పూజా అశోక్ ఆగస్టు 16న భోజనం కోసం రోడ్డు అవతల ఉన్న హోటల్‌కు వెళ్లారు. భోజనం చేసి వారిద్దరూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి విధుల్లో చేరేందుకు వస్తూ రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో స్పోర్ట్స్‌ కారు (టీజీ09జీ0666) కారు అత్యంత వేగంగా దూసుకువచ్చి భారతి ముఖిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు భారతి ముఖి ఎగిరి కిందపడగా.. పూజా అశోక్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

కారును ఏపీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్‌ కుమారుడు లింగమనేని సంజూశ్‌ డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ప్రమాదం అనంతరం వెంటనే తీవ్ర గాయాలపాలైన భారతి ముఖికి హుటాహుటిన అదే కారులో జూబ్లీహిల్స్‌లోని  అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాద సమయంలో భారతి ముఖితో ఉన్న పూజా అశోక్ వెంటనే ఈ విషయాన్ని లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ అశ్విన్ కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అశ్విన్ కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లగా భారతి ముఖి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి భారతి ముఖి మృతికి కారణమైన ఎంపీ కుమారుడు సంజూశ్‌పై మాదాపూర్‌ పోలీసులకు లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ మేనేజర్‌ అశ్విన్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. అడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రైమ్ నంబర్ 1238/2026 నమోదు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రమాదానికి కారణాలు
నిత్యం బిజీగా ఉండే కేబుల్‌ బ్రిడ్జ్‌ సమీపంలో అత్యంత వేగంగా రావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ఉండడంతో పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రమాద సమయంలో రోడ్డు పరిస్థితులు, సీసీటీవీ దృశ్యాలు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు, వాహనం వివరాలు, డ్రైవర్ పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

పెద్దల ఒత్తిడి?
ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచిన తర్వాత నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవింగ్‌ చేసిన ఎంపీ కుమారుడు సంజూశ్‌పై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు విమర్శలు వస్తున్నాయి. నాలుగు రోజుల తర్వాత కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కుమారుడు సంజూశ్‌ను కాపాడుకునేందుకు ఎంపీ లింగమనేని రమేశ్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు.. పెద్దల ద్వారా పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా మృతురాలు ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. కేసు నమోదు కాకుండా తీవ్ర ప్రయత్నాలు జరిగాయని.. మృతురాలి కుటుంబీకులను ప్రత్యేకంగా విమానంలో హైదరాబాద్‌కు రప్పించినట్లు.. బాధితులతో మాట్లాడి వారితో బేరసారాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమి జరిగినా ఒకరి ప్రాణం తీసిన ఎంపీ కుమారుడిని అరెస్ట్‌ చేసి శిక్ష పడేలా చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

0
0
Report
Advertisement

Konda Surekha: 'నా బిడ్డ కామెంట్లకు నాకేం సంబంధం'.. వివరణ ఇచ్చిన కొండా సురేఖ

Baddipadaga, Telangana:

Konda Susmita vs Revanth Reddy: 'అధికారం వచ్చాక రేవంత్‌ రెడ్డికి కళ్లు నెత్తికి ఎక్కాయని.. ఆయన అవినీతి భాగోతాలు చెబుతానని.. బీసీలను అణగదొక్కుతున్నారు' అని కొండా సుష్మిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా కమిటీ వివరణ ఇవ్వాలని నోటీసు పంపించగా దానికి మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను వివరణ అడగడాన్ని తప్పుబట్టారు. ఆమె వ్యాఖ్యలకు తనకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు.

టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన వివరణతో కూడిన లేఖను టీసీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు. లేఖలో క్రమశిక్షణా కమిటీకి మంత్రి తన వివరణలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 'ఆగస్టు 19వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు నిర్వహించడంతోపాటు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నా స్వస్థలమైన గీసుకొండతో నా కూతురు సుస్మితా పటేల్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్తె కొండా సుస్మితా పటేల్ పాల్గొన్నారు' అని కొండా సురేఖ వివరించారు.

ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ లేఖలో వివరించారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని సూచించారు. తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. మరి ఈ వివరణతో క్రమశిక్షణా కమిటీ సంతృప్తి చెందుతుందా? లేదా తదుపరి ఏం జరుగుతుందనేది ఉత్కంఠ నెలకొంది. మరో వైపు కొండా సుష్మితపై కాంగ్రెస్‌ పార్టీ మహిళా నాయకులు రెచ్చిపోతున్నారు. ఆమెపై తీవ్ర విమర్శలతోపాటు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయో వేచి చూడాలి.

0
0
Report
Advertisement

Chandrababu: నదీ జలాలపై దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకుసాగాలి: చంద్రబాబు

Salavankuppam, Tamil Nadu:

Southern Zonal Council Meeting: తెలంగాణ, ఏపీ విభజన జరిగి పుష్కర కాలం దాటినా విభజన చట్టంలోని అంశాలు ఇంకా నెరవేరలేదని దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదని గుర్తుచేశారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నదీ జలాల అంశంలో దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.

మహాబలిపురంలో హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. నదీ జలాలపై దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యం. కేంద్రం, రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలి' అని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు ప్రతిపాదన చేశారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ నడపాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి- బెంగళూరు- చెన్నై నగరాలను అనుసంధానించే రవాణా వ్యవస్థ ఉండాలని కోరారు.

'దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలి. దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించాలి. దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలి' సమావేశంలో సీఎం చంద్రబాబు కోరారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు.

'దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉంది. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలి' అని చంద్రబాబు తెలిపారు. 'పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు  కేంద్ర సహకారంతో సాకారం అవుతున్నాయి. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించాం. వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలి. దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలి' అని సీఎం చంద్రబాబు కోరారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కడప జేఎస్‌డబ్ల్యూ రైల్వే లింక్‌కు కేంద్ర అనుమతులు ఇవ్వాలన్నారు.

గోదావరి–కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదన సీఎం చంద్రబాబు చేశారు. గోదావరి–కావేరి అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అని పేర్కొన్నారు. నదీ జలాలపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. గంగా–కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరం అని గుర్తుచేశారు. నదుల అనుసంధానంపై కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం అని ప్రకటించారు.

0
0
Report
Advertisement

YS Jagan DSC Demands: "డీఎస్సీ లీకేజీలపై సీబీఐ విచారణ జరపాలి..లోకేష్‌ రాజీనామా చేయాలి" వైఎస్ జగన్‌ డిమాండ్‌!

Vijayawada, Andhra Pradesh:

YS Jagan Demands CBI Enquiry On DSC: ఆంధ్రప్రదేశ్‌ గతంలో జరిగిన మెగా డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణలో జరిగిన లీకేజీలు, అక్రమాలపై తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్‌.జగన్‌ డిమాండ్ చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్‌సీ (APPSC) అంశాలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను ఆయన మీడియా సమావేశంలో ప్రజల ముందుకు ఉంచారు. 

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తాము లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం గింజుకుంటోంది కానీ, సీబీఐ విచారణకు మాత్రం ముందుకు రావడం లేదని జగన్‌ ఆరోపించారు. 

ఈ అక్రమాలను గట్టిగా లేవనెత్తుతామనే భయంతోనే తమకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని, చివరికి ప్రతిపక్షం లేకుండానే సభను నడుపుతున్నారని జగన్ విమర్శించారు. ప్రత్యర్థి జట్టు లేని చోట, బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీ కొడుకులు ఇద్దరూ బ్యాటింగ్ చేసుకుంటూ తాము అద్భుతంగా చేశామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

డీఎస్సీ లీకేజీలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ తమ ఎమ్మెల్సీలు (MLCలు) నాలుగు రోజుల పాటు శాసనమండలిని స్తంభింపజేసినా ప్రభుత్వం చర్చకు సిద్ధపడలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అలాగే డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడం ద్వారా పారదర్శకతకు పాతరవేసి, లీకేజీలకు స్వయంగా ద్వారాలు తెరిచారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ప్రశ్నల తయారీ అనేది ఎస్సీఈఆర్టీ (SCERT) డైరెక్టర్ బాధ్యత కాగా, పరీక్ష నిర్వహించే బాధ్యత డీఎస్సీ కన్వీనర్‌దని ఆయన అన్నారు. 

అయితే, ఈ రెండింటినీ ఒకే వ్యక్తికి అప్పగించినట్లు లోకేష్‌ స్వయంగా అంగీకరించడమే కాకుండా, అందులో తప్పేముందని దబాయించారని విమర్శించారు. ఈ రెండు వ్యవస్థల మధ్య ఉండాల్సిన కనీస నియంత్రణలను ఎందుకు తొలగించారో.. అలాగే ఒకే వ్యక్తి చేతిలో రెండు కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలడానికి దర్యాప్తు జరగాలని జగన్ డిమాండ్ చేశారు. 

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి 'నవీన్' వివాదం.. 
డీఎస్సీ ప్రశ్నపత్రాలు తయారు చేసే విభాగంలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి 'నవీన్'కు పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని ప్రభుత్వం ఒప్పుకుందని వైఎస్ జగన్‌ తెలిపారు. క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉన్న నవీన్‌కు మొదటి ర్యాంక్ రావడంతో లీకేజీ స్పష్టంగా జరిగిందని, ఇది బయటపడితే గొడవ అవుతుందనే భయంతోనే మెరిట్ లిస్ట్ మార్చి అతనిని పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. మొదటి మెరిట్ లిస్టులో ఉన్న నవీన్ పేరును తొలగించి, రెండవ మెరిట్ లిస్టును ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. 

సీబీఐ దర్యాప్తునకు డిమాండ్..
నవీన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని తండ్రీ కొడుకులు ఇద్దరూ అసెంబ్లీలో, కోర్టులో అధికారుల చేత చెప్పించారని విమర్శించారు. అయితే, అభ్యర్థి ఐడీని బ్లాక్ చేసి, కనీసం కాల్ లెటర్ కూడా పంపనప్పుడు నవీన్ వెరిఫికేషన్‌కు ఎలా రాగలుగుతాడని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఆధారాలతో నవీన్ హైకోర్టులో అఫిడవిట్ కూడా వేశాడని పేర్కొన్నారు. అసెంబ్లీలో వీటికి తండ్రీ కొడుకులు (చంద్రబాబు, లోకేష్) సమాధానం ఎందుకు చెప్పలేదని జగన్ నిలదీస్తూ, ఈ తప్పులన్నింటిపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

Also Read: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కీలక అప్‌డేట్..మరి ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి ఇదే

Also Read: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం.. నదిలో దూకిన ఏఈ కుటుంబం..ముగ్గురు గల్లంతు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Eshwar Sai Madhuri Rathod: ఫోక్ డాన్సర్ల వివాదం.. ఈశ్వర్ సాయి భార్యపై రివర్స్ కేసు పెడుతున్న మాధురి రాథోడ్?

Hyderabad, Telangana:

Eshwar Sai Madhuri Rathod Controversy: ప్రముఖ ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి వివాహేతర సంబంధానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ల అక్రమ సంబంధం వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్‌లకు చేరి, ఇరు వర్గాల మధ్య పరస్పర ఫిర్యాదులు, తీవ్ర ఆరోపణలతో సంచలనం సృష్టిస్తోంది.

అయితే ఈ వివాదం వేములవాడలోని రెడ్డి భవన్‌లో మొదలైంది. ఈశ్వర్ సాయి కోసం అతని భార్య శరణ్య, ఆమె సోదరి కలిసి అక్కడికి వెళ్లగా, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరూ ఒకే ఇంట్లో పట్టుబడ్డారు. ఆ సమయంలో అక్కడ ఒక చిన్నారి కూడా ఉంది. దీనికి సంబంధించిన దృశ్యాలను శరణ్య సోదరి తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేసింది. 

ఇదే విషయమై తాము ప్రశ్నించినందుకు ఈశ్వర్ సాయి, అతని అసిస్టెంట్ తమపై దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మొబైల్ ఫోన్లు లాక్కున్నారని శరణ్య సోదరి ఆరోపించింది. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లోని రాయిదుర్గం పోలీస్ స్టేషన్‌లో శరణ్య సోదరి ఫిర్యాదు చేసింది. 

అయితే, ఇల్లీగల్ అఫైర్ వ్యవహారం తమ పరిధిలోకి రాదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పరస్పర ఇష్టంతో ఉండే సంబంధాలు నేరం కిందకు రావని పోలీసులు స్పష్టం చేశారు. దాడులు లేదా ఫోన్ లాక్కున్న ఘటన వేములవాడలో జరిగింది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేసుకోవాలని రాయిదుర్గం పోలీసులు వారికి సూచించారు.

మరోవైపు ఈ వ్యవహారంలో సదరు మాధురి రాథోడ్ కమ్యూనిటీకి చెందిన వారు ఎదురుదాడికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తను తన స్నేహితుడైన ఈశ్వర్ సాయితో ఉన్న సమయంలో శరణ్య, ఆమె సోదరి అకారణంగా లోపలికి వచ్చి, తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని మాధురి పేర్కొంది. 

అంతేకాకుండా తనను కులం పేరుతో దూషిస్తూ అవమానించారని.. వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసి పరువు తీశారని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై శరణ్య, ఆమె సోదరిపై వేములవాడ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేందుకు మాధురి చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే, మాధురి రాథోడ్ పక్కనే ఉంటూ నటిస్తూ, తన భర్తను వలలో వేసుకుని, లొంగతీసుకుని ఇల్లు చేరకుండా చేస్తోందని ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఇరువర్గాలు చట్టపరమైన చర్యల కోసం సిద్ధమవుతుండటంతో వేములవాడ పోలీసులు వీటిపై దృష్టి సారించారు.

Also Read: నటి మీనా భర్త మృతి వెనుక అసలు నిజం ఇదే..ఇంటర్వ్యూలో చెబుతూ కంటతడి పెట్టిన హీరోయిన్!

Also Read; 'ఇరుముడి' సినిమా ఫస్ట్ రివ్యూ..రవితేజ కంబ్యాక్..థియేటర్లలో అయ్యప్ప శరణుఘోష పక్కా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

AC Side Effects Monsoon: వర్షాకాలంలో కూడా ఏసీ వాడుతున్నారా? అయితే మీరు ఈ సమస్యలు తెచ్చిపెట్టుకున్నట్టే!

Hyderabad, Telangana:

AC Side Effects In Monsoon: వర్షాకాలంలో ఉక్కపోత, తేమ నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఎక్కువ సమయం ఏసీ (AC) గదుల్లోనే గడుపుతుంటారు. అయితే ఏసీ నుండి వచ్చే చల్లని, పొడి గాలి చర్మానికి తీవ్ర హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ చర్మవాధుల నిపుణుల సూచనల ప్రకారం.. ఈ సీజన్లో ఏసీ వాడేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో, వాటిని ఎలా నివారించాలో ఇక్కడ చూద్దాం.

చర్మం పొడిబారడం, ఇన్ఫెక్షన్లు..
బయటి వాతావరణంలోని తేమకు, ఏసీ గదిలోని పొడి గాలికి మధ్య జరిగే నిరంతరం మార్పు వల్ల చర్మం సహజ తేమను కోల్పోతుంది. దీనివల్ల చర్మం పొడిబారి, తీవ్రమైన దురద, చికాకు కలుగుతాయి. గోకడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

చేయకూడని తప్పులు..
1) తక్కువ ఉష్ణోగ్రతలో ఏసీ వాడకం అనగా చాలా మంది ఏసీని 16 లేదా 18 డిగ్రీల వద్ద సెట్ చేస్తుంటారు. అలా కాకుండా ఉష్ణోగ్రతను 25 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం చర్మానికి మంచిది.

2) నేరుగా గాలి తగలకుండా చూసుకోవడం అంటే.. ఏసీ లేదా కార్ వెంట్స్ నుంచి వచ్చే బలమైన గాలి నేరుగా ముఖానికి తగిలేలా ఉంటే చర్మం త్వరగా పొడిబారుతుంది. గాలి పక్కకు వెళ్లేలా వెంట్లను సర్దుబాటు చేసుకోవాలి.

3) తగినంత నీరు తాగకపోవడం అనగా.. రోజంతా ఏసీ ఆఫీసుల్లో ఉండేవారు తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు. ఇది చర్మాన్ని నిర్జీవంగా మారుస్తుంది.

4) మాయిశ్చరైజర్ వాడకపోవడం మంచిది. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి తేలికపాటి మాయిశ్చరైజర్, పెదవులకు లిప్ బామ్ రాసుకోవడం వల్ల చర్మంలో తేమ నిలుస్తుంది.

చర్మ పరిశుభ్రత, ఆహారం..
వర్షాకాలంలో తేమ, చెమట కారణంగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. అందుకే మంచి సబ్బుతో రోజుకు రెండుసార్లు స్నానం చేయడం, ముఖాన్ని శుభ్రమైన నీటితో రోజుకు 2-3 సార్లు కడుక్కోవడం మంచిది. అలాగే పోషకాలున్న పండ్లు, ఆకుకూరలు తింటూ చర్మాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

Also Read: బరువు తగ్గడానికి 'యాపిల్ సైడర్ వెనిగర్' మంచిదా..?

Also Read: Weight Loss Tips: వాకింగ్ Vs రన్నింగ్..ఫాస్ట్‌గా బరువు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Konda Surekha: వివాదాల కేరాఫ్ అడ్రస్‌గా మంత్రి కొండా సురేఖ.. డిఫెన్స్‌లో కాంగ్రెస్!

Hyderabad, Telangana:

Minister Konda Surekha News: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా మంచి గుర్తింపు పొందిన మంత్రి కొండా సురేఖ చుట్టు వివాదాలు వీడకుండా చుట్టూ ముడుతూనే ఉన్నాయి.. తనదైన దూకుడు శైలిలో వార్తల్లో నిలిచే ఆమె.. చేసిన వరుస వ్యాఖ్యలతో పాటు చోటు చేసుకున్న పరిణామాలు ప్రభుత్వానికి.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతూ వస్తున్నాయి.. గత కొద్ది కాలంగా ఒక వివాదం ముగిసేలోపే మరొకటి తెరపైకి వస్తూ ఆమెను రాజకీయంగా సుడిగుండంలోకి నెడుతోంది..

సినీనటి సమంత విడాకుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.. రాజకీయ విమర్శల క్రమంలో సినీ ప్రముఖుల పేర్లను ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఇతర రాజకీయ పార్టీ నాయకులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు న్యాయపరమైన వివాదాలకు కూడా దారి తీసిన సంగతి తెలిసిందే. పరిస్థితి తీవ్రతను గమనించిన ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం కాస్త సర్దుమనిగిపోయింది..

సమంత వివాదం చల్లారుతున్న సమయంలోనే.. మంత్రులు ఫైల్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర ఆగ్రహానికి దారి తీసేలా చేశాయి.. క్యాబినెట్ సహచరులపైనే తీవ్ర ఆరోపణలు చేసినట్లు అవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సంగతి కూడా తెలిసిందే.. ఈ ప్రకటనతో అటు ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శల దాడికి దిగాయి.

 Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?

మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేత కడియం శ్రీహరితో జరిగిన ప్రోటోకాల్ వివాదం కూడా పార్టీ వర్గాల్లో తీవ్రమైన చర్చనీ అంశానికి దారితీసింది.. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో టెండర్ల ప్రక్రియకు సంబంధించిన అంశాలు కూడా అంతర్గత విభేదాలను రచ్చకెక్కించేలా చేశాయి.. ఇలా వరుస వివాదాలతో సతమతమవుతున్న తరుణంలో.. తాజాగా ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు మంత్రి సురేఖకు మరింత తలనొప్పిగా మారేలా చేశాయి.. సొంత పార్టీ నేతలతో సమన్వయం లేకపోవడంతో పాటు దూకుడుగా మాట్లాడే శైలి ఆమెను మరింత డిఫెన్స్లో పడేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. వరుస వివాదాల నేపథ్యంలో అధిష్టానం ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది..

 Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top