icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow28 Jul 2024, 10:42 am

బోనాల పండుగలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు

Karimnagar, Telangana:

కరీంనగర్, రామనగర, మార్కండేయ కాలనీలో మున్నూరుకాపు కులస్తులు నిర్వహించిన పోచమ్మ నాట్లు ఉత్సవంలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో మెరుగు స్వప్నశ్రీ, పిట్టల రవీందర్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నెల్లి నరేష్, పెద్దిగారి తిరుపతి, ఉప్పరి అజయ్, అల్వాల భరత్, కంపల్లి కీర్తికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Bengaluru Crime News: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!

Bengaluru, Karnataka:

Bengaluru Rape Case: బెంగళూరులోని మారుతినగర్‌లో దారుణమైన ఘటన జరిగింది. ఓ ఇంట్లో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఓ యువతి ఫిర్యాదు మేరకు, తలఘట్టపుర పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. దేవనహళ్లికి చెందిన బాధితురాలికి శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు అమరేష్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే సోమశేఖర్ అనే వ్యక్తి, కలబురిగి నుండి తన స్నేహితులు బెంగళూరుకు వచ్చారని, ఆమెను కలవాలనుకుంటున్నారని ఆమెకు చెప్పాడు.

ఆ యువతి సాయంత్రం 7 గంటల సమయంలో బైక్ టాక్సీలో ఆ ప్రదేశానికి చేరుకుంది. నిందితులు ఐదుగురిలో ఇద్దరు ఆమెకు పరిచయస్తులేనని పోలీసులు తెలిపారు. ఈ దాడి జరగడానికి ముందు ఆ బృందం కొంత సమయం కలిసి గడిపి, మద్యం సేవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సమయంలో నిందితులలో ఒకరైన అమరేష్ ఆమెపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనలో మిగిలిన నలుగురు నిందితుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు వారి బారి నుండి తప్పించుకుని, వెంటనే 112 అత్యవసర హెల్ప్‌లైన్‌కు కాల్ చేసింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను రక్షించి, అక్కడే ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు అయిన వారిలో అమరేష్, సోమశేఖర్ మరో ముగ్గురు ఉన్నారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. తలఘట్టపుర పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను విచారిస్తున్నారు. సీన్ రీక్రియేషన్, ప్రతి అనుమానితుడి పాత్రను బట్టి తదుపరి దర్యాప్తును కొనసాగుతోంది. బాధితురాలి వాంగ్మూలం, వైద్యపరమైన ఆధారాలు, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తుది అభియోగాలు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

Also Read: Mumbai Floods 2026: సముద్రాన్ని తలపిస్తున్న ముంబై..భారీ వరదలతో ఆర్థిక నగరం అల్లకల్లోలం!

Also Read: టెలిగ్రామ్‌కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు..15 రోజుల్లో పైరసీ ఆపాల్సిందే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Siya Goyal: సియా గోయల్ మిడిల్ ఫింగర్ వివాదం.. అసలు నిజం బైటపెట్టిన తండ్రి.. ఏమన్నాడంటే..?

Hyderabad, Telangana:

Siya goyal father on Middle finger gesture row: కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడ్ ను పెంచారు. ఇటీవల పూణె కోర్టు సైతం మరోసారి సియాకు పోలీసుల కస్టడీకి అనుమతించింది. జులై 16 వరకు సియా, చేతన్ చౌదరీలకు పూణె కోర్టురిమాండ్ విధించింది. ఈ క్రమంలో సియా గోయల్ ఇటీవల పోలీసుల విచారణలో భాగంగా పూణేలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసానికి తీసుకెళ్లారు అక్కడ ఆమె నేరం జరిగిన రోజున ఆమె ధరించినట్లు ఆరోపించబడిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.

 

ఆ తర్వాత బైటకు వచ్చే క్రమంలో సియా తన మధ్య వేలు చూపిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెట్టింట దుమారం చెలరేగింది. సియాకు ఇంత కూడా పశ్చాత్తాపంలేదు.. మిడిల్ ఫింగర్ చూపిస్తు నీచంగా ప్రవర్తించందని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై తాజాగా.. సియాగోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ స్పందించాడు.

సియా గోయల్ విచారణకు వచ్చినప్పుడు ఆమె చేతి వేలు కారు డోర్ లో ఇరుక్కుందని చెప్పాడు. ఆమె చేతి వేలికి గాయమైందని చెప్పాడు.వేలికి ప్లాస్టర్ కూడా ఉందని చెప్పాడు. కావాలంటే పోలీసులకు కూడా అడగొచ్చని స్పష్టం చేశాడు. సియా చేతికి గాయమైనట్లు ఒక ఫోటో ను సైతం సియా తండ్రి చూపించాడు. 

సియా మధ్య వేలు చూపించిందని ఆరోపణల్లో నిజంలేదని కొట్టిపారేశాడు. ఆమె చేతి వేలు వాచిపోయిందని. గోళ్లు కూడా నీలి రంగులోకి మారిపోయిందని ఆయన అన్నారు. దయచేసి ఫెక్ ప్రచారాలు చేయోద్దని ప్రవీణ్ గోయల్ అసలు విషయం బైటపెట్టాడు.

Read more: Siya Goyal: కేతన్‌ అగర్వాల్‌తో పెళ్లి జరగదు.!. స్నేహితురాలితో చాట్‌లో బైటపడ్డ సియా గోయల్ బండారం.!. పోలీసుల చేతికి కీలక ఆధారం..

మరోవైపు పూణే మర్డర్ కేసులో సియా తన స్నేహితురాలితో పెళ్లిపై చేసిన చాట్ బైటకు వచ్చింది. ఈ కేసులో చేతన్ చౌదరీ క్లాస్ మెట్ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొత్తంగా ఈ కేసులో రోజులు గడుస్తున్న కొలది ట్విస్ట్ ల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

రేవంత్‌ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రివర్స్ అయ్యింది: హరీశ్ రావు

Siddipet, Telangana:

Telangana Real Estate: కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రివర్స్ అయ్యిందని.. వచ్చేది మన ప్రభుత్వమే అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగం బాగా నడిస్తే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుందని గుర్తుచేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట అభివృద్ధి వంద కిలోమీటర్ల వేగంతో ప్రగతి పరుగులు పెట్టిస్తానని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్‌ రావు పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 'రియల్‌ ఎస్టేట్‌ వారందరి తలరాత మారాలి అంటే కేసీఆర్ అనే గీత పెట్టుకోవాలి.. ఆ గీతనే మీ భవిష్యత్ మారుస్తుంది' అని తెలిపారు. సిద్దిపేటకు రేవంత్ రెడ్డి గ్రహణం పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయని వెల్లడించారు.

'రియల్ ఎస్టేట్ రంగం బాగా నడిస్తే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుంది. సిమెంట్, స్టీల్, టైల్స్, శానిటరీ, మార్బుల్స్ వంటి అనేక రంగాలకు ఉపాధి లభిస్తుంది. వందలాది వ్యాపారాలు సజావుగా సాగుతాయి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయిందని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని, దాని ప్రభావంతో చిన్న వ్యాపారాలు, టీ హోటళ్లు, దుకాణాలు, ఇతర అనుబంధ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఇది ఒక్క సిద్దిపేట పరిస్థితి కాదు. రాష్ట్రం మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయిన పరిస్థితి. హైదరాబాద్‌లో చూసినా ఇదే, కరీంనగర్‌లో చూసినా ఇదే, నల్గొండలో చూసినా ఇదే, మహబూబ్‌నగర్‌లో చూసినా ఇదే, నిజామాబాద్‌లో చూసినా ఇదే పరిస్థితి' అని రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభాన్ని మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు. 'ఎక్కడ చూసినా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దుకాణాలు నడవడం లేదు. షాపులకు గిరాకీ లేదు. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది' అని కాంగ్రెస్‌ వైఫల్యాన్ని వెల్లడించారు.

హైడ్రా దెబ్బతో వ్యాపారాలు దెబ్బతిన్నాయని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సమస్యలు తీర్చడం కాదని.. సమస్యలు తెచ్చి పెడుతుందని ఆరోపించారు. 'సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నాడు కోటి రూపాలు పలికిన ఎకరం భూమి, నేడు రూ.60 లక్షలకు కొనేవారు లేరు. గతంలో ఎకరం భూమి రూ.10 లక్షల కంటే ఎక్కువ ఉండేది కాదు. కానీ బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోఇ వచ్చాక భూముల ధరలు పెరిగాయి' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తు చేశారు. కుంభకోణాల ప్రభుత్వం పోయి.. పథకాల ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. మళ్లీ కేసీఆర్‌ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీశ్‌ రావు తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పారు.

0
0
Report
Advertisement

జగిత్యాల KVకి 5 ఎకరాలు సరిపోవు.. 10 ఎకరాలు కేటాయించండి: సీఎంకు ఎంపీ అర్వింద్ లేఖ!

Hyderabad, Telangana:

Jagtial Kendriya Vidyalaya: జగిత్యాల జిల్లాలో ప్రతిపాదిత కేంద్రీయ విద్యాలయానికి (కేవీ) కనీసం 10 ఎకరాల భూమిని కేటాయించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్‌కు ఒక లేఖ రాశారు. చల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర కేబినెట్ 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడాన్ని స్వాగతిస్తూనే.. విద్యార్థుల భవిష్యత్తు, మౌలిక వసతుల దృష్ట్యా ఆ స్థలం ఏమాత్రం సరిపోదని ఎంపీ స్పష్టం చేశారు.

భవిష్యత్తు విస్తరణకు ఎలా?
కేంద్రీయ విద్యాలయ సంస్థ (KVS) నిబంధనల ప్రకారం.. మెట్రోయేతర ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కనీసం 10 ఎకరాల స్థలం అవసరమని ఎంపీ అర్వింద్ గుర్తుచేశారు. ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలు కేవలం ప్రాథమిక తరగతుల గదుల నిర్మాణానికి, కనీస అవసరాలకు మాత్రమే సరిపోతాయని ఆయన లేఖలో రాసిన్నట్లు తెలుస్తోంది.. భవిష్యత్తులో పాఠశాల విస్తరణ, ఆధునిక సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ రూమ్‌లు, అధునాతన డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలంటే మరికొంత స్థలం తప్పనిసరి అని లేఖలో పేర్కొన్నారు.

ప్లే గ్రౌండ్స్, హాల్స్ లేకుంటే ఎలా?
విద్యార్థుల మేధో వికాసంతో పాటు శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని.. కానీ 5 ఎకరాల పరిమిత స్థలంలో ఇండోర్, అవుట్‌డోర్ ప్లే గ్రౌండ్స్, అసెంబ్లీ హాల్స్, ఆడిటోరియంల నిర్మాణానికి వీలుండదని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించే క్రమంలో నాణ్యమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

రాజకీయాలకు తావివ్వకుండా నిర్ణయం తీసుకోవాలి..
విద్యాసంస్థల ఏర్పాటు విషయంలో చిల్లర రాజకీయాలకు తావివ్వకుండా.. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అర్వింద్ డిమాండ్ చేశారు. గతంలోనూ భూమి కేటాయింపు ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయారని.. ఇకనైనా కాలయాపన చేయకుండా స్పందించాలని కోరారు. జగిత్యాల కేంద్రీయ విద్యాలయం ఒక మోడల్ క్యాంపస్‌గా రూపుదిద్దుకోవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని.. భూ కేటాయింపును 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు పెంచుతూ తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

జగిత్యాలలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల రచ్చ.. అధికారుల తీరుపై లబ్ధిదారులు ఫైర్!

Hyderabad, Telangana:

Jagtial 2BHK Housing Row: జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కేటాయింపుల వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇండ్ల లబ్ధిదారులు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయానికి భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు చెప్పకుండా.. కండిషన్స్‌పై గుడ్డిగా సంతకాలు పెట్టించుకుంటున్నారంటూ.. అధికారుల తీరుపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

లబ్ధిదారుల సంతకాల సేకరణ..
హౌసింగ్ డిపార్ట్‌మెంట్ పంపిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా మున్సిపల్ అధికారులు ప్రస్తుతం లబ్ధిదారుల నుంచి సంతకాలను సేకరిస్తున్నారు. అయితే, తాము ఏ పత్రాలపై సంతకాలు పెడుతున్నామో.. ఆ నిబంధనలు ఏంటో తమకు కనీసం వివరించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అవగాహన కల్పించకుండా కేవలం సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేయడంపై వారు మండిపడ్డారు.

అధికారుల తీరుపై మండిపడ్డ బాధితులు..
సాధారణంగా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరే సమయంలో పారదర్శకత ఉండాలని.. కానీ ఇక్కడ అధికారులు లబ్ధిదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. నిరక్షరాస్యులైన పేద ప్రజలను గందరగోళానికి గురిచేస్తూ.. భయాందోళనల మధ్య సంతకాలు సేకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ప్రక్రియపై తక్షణమే లబ్ధిదారులందరికీ మున్సిపల్ యంత్రాంగం పూర్తి అవగాహన కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

హౌసింగ్ అధికారులదే బాధ్యత..
కార్యాలయం వద్ద లబ్ధిదారుల ఆందోళన తీవ్రం కావడంతో మున్సిపల్ కమిషనర్ స్పందించారు. గందరగోళాన్ని తగ్గించేందుకు కొంతమంది అధికారులు సంబంధిత అధికారులతో మాట్లాడిన్నట్లు తెలుస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వివరాల సేకరణ, లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల సంబంధించిన అన్ని వివరాలు వారి వద్దే ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా అన్ని వివరాలు హౌసింగ్ అధికారులే వివరిస్తారని కొంతమంది మున్సిపల్ అధికారులు తెలిపిన్నట్లు సమాచారం..

ఈ క్రమంలో హౌసింగ్ అధికారులే నేరుగా రంగంలోకి దిగి.. లబ్ధిదారులకు పూర్తి వివరాలు వివరించి.. వారి సందేహాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వివరాల సేకరణ చేపట్టాలని కమిషనర్ సంబంధిత అధికారులకు గట్టిగా సూచించారు. కమిషనర్ హామీతో లబ్ధిదారులు కొంత శాంతించినప్పటికీ.. తమకు న్యాయం జరిగే వరకు అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనతోనైనా అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తారో లేదో చూడాలి.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్‌లో కుండపోత వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన పెన్ గంగా, ప్రాణహిత!

Hyderabad, Telangana:

Telangana-Maharashtra Border Floods News: గత కొన్ని రోజులుగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఇరు రాష్ట్రాల సరిహద్దులు జలమయమయ్యాయి. సరిహద్దు గుండా ప్రవహించే ప్రాణహిత, పెన్ గంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తూ.. మహోగ్రరూపం దాల్చాయి. భారీగా వస్తున్న వరద నీటితో నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రాంతాల్లో జీవించేవారు బిక్కుబిక్కుమంటూ రోజులు గడపాల్సి వస్తుంది.

కాళేశ్వరం వద్ద ఉరకలేస్తున్న గోదావరి..
ప్రాణహిత నది గంలో ఎన్నడూ లేని విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. ఆ వరద ఉధృతి అంతా దిగువన ఉన్న గోదావరి నదిలోకి చేరుతోంది. ఫలితంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వద్ద గోదావరి నది ఊరకలు వేస్తూ పోటెత్తున్నట్లు తెలుస్తోంది.. త్రివేణి సంగమ క్షేత్రం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

పుష్కర ఘాట్లను ముంచెత్తిన వరద.. 
సిర్పూర్ నియోజకవర్గంలో వర్షాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని అధికారులు తెలుపుతున్నారు. కౌటాల మండలంలోని ప్రాణహిత నది పుష్కర ఘాట్లను తాకుతూ వరద నీరు చేరింది. ఘాట్లన్నీ దాదాపు మునిగిపోయే స్థితికి చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు, తాటిపెల్లి వద్ద పెన్ గంగా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ఇరువైపులా ఉన్న రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

అధికారుల తీవ్ర హెచ్చరిక..
మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తోందని.. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేట కోసం నదుల్లోకి వెళ్లకూడదని.. ఎవరూ నదులను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.

కొట్టుకుపోయిన ప్రధాన రహదారి.. 
భారీ వర్షాల ధాటికి సిర్పూర్ మండలంలో తీవ్ర నష్టం వాటిల్లింది. చీలపల్లి వద్ద వరద నీటి ఉధృతికి ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. రోడ్డు కొట్టుకుపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే పలు గ్రామాలకు నగరాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రాకపోకలు నిలిచిపోవడంతో అత్యవసర వైద్య సేవలు, నిత్యావసరాల కోసం స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి.. 
పరిస్థితి రోజు రోజుకి తీవ్రమవుతుండటంతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని.. స్థానిక అధికారుల సూచనలను పాటించాలని కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

నారా లోకేశ్‌ దక్షిణ కొరియా పర్యటన.. ఆరు రోజుల ఫారెన్‌ టూర్‌

Nuzendla, Andhra Pradesh:

Nara Lokesh South Korea Tour: ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ మరోసారి విదేశీ పర్యటన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల కోసం ఆయన విదేశాల్లో పర్యటించనున్నారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కొరియా పర్యటనకు లోకేశ్‌ సిద్ధమయ్యారు. అధికారిక సమావేశాలతో పాటు పెట్టుబడి చర్చలు చేసేందుకు కొరియాలో నారా లోకేశ్‌ బృందం పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భారత్ - దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్‌ కొరియాలో పర్యటించనున్నారు. ఈనెల 5 నుంచి 11వ తేదీ వరకు ఆరు రోజుల పాటు మంత్రి లోకేష్ దక్షిణ కొరియాను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ కొరియాలో వివిధ మంత్రిత్వశాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ అధికారిక సమావేశాలను నిర్వహిస్తున్నామని దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ (చెన్నయ్) చాంగ్ న్యూన్ కిమ్ తెలిపారు. ఇరుదేశాల నడుమ మరింత సహకారం, సంబంధాల బలోపేతం ఈ పర్యటన కీలక అడుగు కాగలదని భావిస్తున్నట్లు కిమ్ తెలిపారు.

షెడ్యూల్ ఇదే..
==> 
ఈనెల 5వతేదీన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశానికి హాజరై అక్కడి భారతీయులు, తెలుగువారిని ఉద్దేశించి నారా లోకేశ్‌ ప్రసంగించనున్నారు. 6వ తేదీన దక్షిణ కొరియా టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంతోపాటు వివిధ సంస్థలతో పెట్టుబడి చర్చల్లో ఏపీ బృందం పాల్గొననుంది. అనంతరం హ్యోసంగ్ భారీపరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో ఏపీ ప్రభుత్ బృందం సమావేశం కానుంది.

==> 7వతేదీన ఎల్జీ కెమ్ గ్లోబల్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్, ఎల్జీ ఓవర్ సీస్ కంపెనీస్ హెడ్ యున్ జు కోహ్ ఎల్జీ టవర్స్‌లో ఏర్పాటుచేసిన విందు సమావేశంలో నారా లోకేశ్‌ పాల్గొననున్నారు. ఎల్జీ అనుబంధ సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి.
==> 8వ తేదీన కొరియన్ మెరైన్ అక్విప్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం
==> 9వతేదీన కొరియన్ పొలిటికల్ ఎఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ మిస్. యుయి-హే సిసిలియా చుంగ్ తో భేటీ అనంతరం కొరియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్స్ డిప్యూటీ మినిస్టర్ కాంచన్ కాంగ్‌తో సమావేశం
==> 10వతేదీన వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడి చర్చలతోపాటు కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్న ఏపీ ప్రభుత్వ బృందం. అదేరోజు రాత్రి సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్–2026 విజయవంతం చేయాలని కోరుతూ  కొరియా కంపెనీల ప్రతినిధులతో రోడ్ షోలో నారా లోకేశ్‌ పాల్గొననున్నారు.

0
0
Report

AP Land Registration: రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..రూ.100లకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్!

Vijayawada, Andhra Pradesh:

AP Land Hereditary Registration: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులకు ఒక అద్భుతమైన ఊరటను ఇచ్చింది. కుటుంబంలో పెద్దలు మరణించిన తర్వాత, వారి వారసత్వ వ్యవసాయ భూములను తమ పేర్ల మీదకు మార్చుకునేందుకు గతంలో ఉన్న అతి సుదీర్ఘమైన ప్రక్రియకు ఏపీ సర్కార్ స్వస్తి పలికింది. ఇకపై కేవలం రూ.100 స్టాంపు డ్యూటీతో వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే సరికొత్త వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 

ఈ కొత్త విధానం ప్రకారం ఆస్తి విలువ సుమారు నామినల్ చార్జీలను నిర్ణయించారు. స్టేషన్ చేయించుకోబోయే వారసత్వ భూమి విలువ గనక రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం వంద రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ భూమి విలువ సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటే కేవలం రూ.1000 చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల సాధారణ, మధ్యతరగతి కుటుంబాలపై రిజిస్ట్రేషన్ ఫీజులు భారం భారీగా తగ్గనుంది. 

ఈ నూతన సంస్కరణలో కేవలం తక్కువ ఖర్చు మాత్రమే కాదు, అంతకు మించిన సాంకేతిక సౌలభ్యాన్ని కూడా ప్రభుత్వం జోడించింది. గతంలో రిజిస్ట్రేషన్ పుట్టిన తర్వాత కూడా రెవిన్యూ రికార్డుల్లో పేరు మార్చడానికి (మ్యుటేషన్ కోసం) రైతులు తహసీల్దారు లేదా విలేజి రెవెన్యూ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. లంచాలు, కాలయాపనతో విసిగిపోయేవారు. ఈ ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం ఈ ప్రక్రియకు ఆటోమొటేషన్ విధానాన్ని అనుసంధానం చేసింది. 

దీని ప్రకారం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వారసుల మధ్య ఆస్తుల విభజన లేదా బదిలీ డాక్యుమెంటరీ అవ్వగా.. ఆ సమాచారం ఆటోమేటిక్‌గా రెవిన్యూ శాఖ సాఫ్ట్‌వేర్ కు బదిలీ అవుతుంది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే, వెనువెంటనే రెవిన్యూ రికార్డుల్లో అంటే అడంగల్/1b ఫారాల్లో కొత్త వారసుల పేర్లు అప్డేట్ అయిపోతాయి. 

మొత్తంగా తాతలు, తండ్రులు లేదా తల్లులు మరణాంతరం భూహక్కుల మార్పిడి కోసం కార్యాలయాలు చుట్టూ తిరిగి తిప్పలు తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇది అటు డబ్బును ఇటు అమూల్యమైన కాలాన్ని ఆధారి చేయడమే కాకుండా, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Also Read: AP Gold Mines: ఏపీలో మరో బంగారు గని? లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు!

Also Read: "నీ తొడల సైజ్ ఎంత?".. స్టార్ డైరెక్టర్ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయిన మౌనీషా చౌదరి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ మరో పోరాటం.. రేపు కేటీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన

Metpalle, Telangana:

Kaleshwaram Project: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ రంగంలోకి దిగింది. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై మరో పోరాటానికి గులాబీ పార్టీ సిద్ధమైంది. కేసీఆర్‌ మీద కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఎత్తిపోయకపోవడంతో రేపు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనుండడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లు వెంటనే ఆన్ చేయాల్సిందేనని ఈ పర్యటనతో బీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టంగా చెప్పనుంది. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దునిద్ర వీడడంపై గులాబీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులకు ఇవ్వాల్సిందేనని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్‌ సర్కార్‌ నీళ్లు ఎత్తిపోయకపోవడాన్ని రేపు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎండగట్టనుంది.

కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై రేపు జూలై 5వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నేతృత్వంలోని పార్టీ బృందం సందర్శించనుంది. మంథని నియోజకవర్గంలోని కన్నెపల్లి వద్ద వృథాగా పోతున్న జలాలను బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం వలన గోదావరి బేసిన్‌లో కేవలం 23 శాతం మాత్రమే రిజర్వాయర్లు నిండి ఉండడంతో రైతులకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడనుంది.

ఇంజనీర్ల ఆందోళన
'ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గోదావరిలో 15 వేల క్యూసెక్కులు దాటి ప్రవాహం నమోదవుతోంది. రానున్న రోజుల్లో ప్రవాహాలు 60 వేల క్యూసెక్కులకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మేడిగడ్డ బరాజ్‌పై ఆధారపడకుండా కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌హౌజ్ దగ్గర నీటిని మళ్లించి.. పంపింగ్‌ చేపట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో ప్రస్తుతం లభిస్తున్న ప్రవాహాన్ని వాడుకొని వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు నీరు అందించే మార్గం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ చెబుతోంది. ఇదే విషయాన్ని చెప్పేందుకు.. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే రేపు కేటీఆర్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శించనుంది. ఈ పర్యటనకు పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు తరలివెళ్లే అవకాశం ఉంది. కన్నెపల్లి పంపుహౌస్‌ సందర్శనకు బీఆర్‌ఎస్‌ పార్టీ వెళ్తుండడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్రమత్తమైందని తెలుస్తోంది.

0
0
Report
Advertisement

మందుబాబులకు పండగే.. ఇక్కడ Chivas Regal, Teachers బ్రాండ్స్ ఎంత చీపో తెలుసా!

Hyderabad, Telangana:

Chivas Regal 18 Price In Goa: గోవా అంటే కేవలం బీచ్‌లు, సముద్రపు అందాలు మాత్రమే కాదు.. అక్కడ లభించే వివిధ రకాల బ్రాండ్ల లిక్కర్‌ కూడా పర్యాటకులను ఎంతగానో ఆకర్శిస్తుంది. అయితే, గోవాలో లభించే అత్యంత ఖరీదైన, లగ్జరీ స్కాచ్ విస్కీల ధరలను ఎప్పుడైనా తెలుసుకున్నారు? ఇటీవల గోవాలోని ప్రముఖ వైన్స్‌ షాపుల్లో ఉన్న టాప్ స్కాచ్ బ్రాండ్ల ధరలకు సంబంధించిన వివరాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. మందుబాబుల ఫేవరెట్ బ్రాండ్ల ధరలు చాలా చీప్‌గా ఉండడం వల్ల ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఏ బ్రాండ్‌లకు సంబంధించిన లిక్కర్‌ ఏయే ధరల్లో అందుబాటులో ఉందో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

రూ.8,500కే షివాస్ రీగల్..
చాలా మంది షివాస్ రీగల్‌ మందు అంటే ఇష్టపడుతూ ఉంటారు. అత్యంత ఖరీదైన బ్రాండ్‌గా షివాస్ రీగల్ 18 ఇయర్స్ ఓల్డ్‌గా భావించవచ్చు. దీని ధర రూ.8,500తో ప్రారంభమవుతుంది.. స్కాచ్ ప్రియులు ఎంతో ఇష్టపడే ఈ 18 సంవత్సరాల నాటి విస్కీ బాటీల్‌ రాయల్ లుక్‌తో పాటు దానికి తగ్గట్లుగానే ధరను కలిగి ఉంది. అలాగే షివాస్ 12 ఇయర్స్ ఏజ్డ్ బాటిల్ ఇక్కడ కేవలం రూ.3,400కే అందుబాటులో ఉంది. మరో ప్రముఖ లగ్జరీ బ్రాండ్ అయిన మేకర్స్ మార్క్ (Maker's Mark) బాటిల్ ధర రూ.6,000 నుంచి ప్రారంభమవుతుంది.

టీచర్స్ బ్రాండ్లలో రకాలు.. 
మద్యం ప్రియులకు ఎంతగానో ఇష్టపడే టీచర్స్ బ్రాండ్లలో ఎన్నో రకాల ధరలతో ఇక్కడ లభిస్తున్నాయి. టీచర్స్ 12 ఇయర్స్ ఏజ్డ్ (గోల్డెన్ థిస్టిల్) ఇక్కడ కేవలం రూ. 2,700 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా టీచర్స్ 50 కేవలం రూ.2,000తో అందుబాటులో ఉండడం విశేషం. టీచర్స్ హైలాండర్ క్రీమ్ రూ.1,420 ధరతో లభిస్తోంది. 

స్కాచ్ బ్రాండ్లు ఇవే..
భారీ ధరలు మాత్రమే కాకుండా.. కొంతవరకు బడ్జెట్ ధరల్లో ఉండే అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఎంతో పాపులర్ అయిన జేమ్సన్ (Jameson) ఐరిష్ విస్కీ ధర రూ.2,500 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే  జిమ్ బీమ్ (Jim Beam) బోర్బన్ విస్కీ బాటిల్ రూ. 1,890కే అందుబాటులో ఉండడం విశేషం. స్కాచ్‌లో కాస్త తక్కువ ధరలో లభించే బ్లాక్ అండ్ వైట్ ధర ఇక్కడ రూ.1,500కే లభిస్తోంది. విస్కీ లవర్స్ ఎక్కువగా కొనుగోలు చేసే విలియం లాసన్స్‌తో పాటు వ్యాట్ 69 (Vat 69) బ్రాండ్లు కేవలం రూ.1,050 లకే లభించడం విశేషం. ఇక్కడ లాబ్రాడాగ్ 3 ఇయర్స్ ఏజ్డ్ (డబుల్ బ్యారెల్ స్కాచ్) ధర కేవలం రూ. 1,350 నుంచి మాత్రమే లభిస్తోంది. దీంతో పాటు బ్లాక్ డాగ్  ప్రైవేట్ రిజర్వ్ స్టాక్‌ను బట్టి ప్రత్యేక ధరల్లో లభిస్తోంది.

Also Read: Goaలో ఇంత చీప్‌గా బీరా, కరోనా, కింగ్‌ఫిషర్ దొరుకుతున్నాయా? 2026 లేటెస్ట్ రేట్లు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

0
0
Report
Advertisement

'సర్‌' బండి సంజయ్‌ అప్రమత్తం.. హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆందోళన

Vemulawada, Telangana:

Telangana SIR: తెలంగాణలో జరుగుతున్న సర్‌ ప్రక్రియపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అప్రమత్తం అయ్యారు. 'సర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది' అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అధికారులకు ప్రభుత్వం సహకరించడం లేదని. మజ్లిస్‌తో కుమ్కక్కై కాంగ్రెస్ హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు.

వేములవాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్ర ప్రభుత్వం సర్‌ను ఉపయోగించుకుని హిందువల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో హిందువుల ఇళ్లకు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదు. తెలంగాణలోని హిందువులంతా జాగృతం కావాలని.. లేనపోతే హిందువులంతా మైనారిటీలయ్యే ప్రమాదం ఉంది' అని బండి సంజయ్‌  హెచ్చరించారు. 

ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఎన్నికల తరువాత తన ధ్యాస, శ్వాస అంతా అభివృద్దే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు బండి సంజయ్‌ ప్రకటించారు. రాజకీయాలకతీతంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అనే వివక్ష లేకుండా ఓటేసిన ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తానని చెప్పారు. 'రేవంత్ రెడ్డి ఇంత అప్పు చేసి ఏం చేశాడంటే.. చేసిందేమీ లేదు. ఇయాళ జీతాలు, పెన్షన్లు, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలంటే కూడా పైసల్లేని దుస్థితి ఏర్పడింది' అని వివరించారు. అప్పులు, అవినీతి, అక్రమాలు మాత్రమేనని కాంగ్రెస్‌ పాలనపై విమర్శించారు. 

'కాంగ్రెస్ పాలనలో దోచుకున్నదంతా ఢిల్లీకి పెద్దలకు మూటలు పంపుతున్నారు. రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్రం ఇస్తున్న నిధులతోనే' అని బండి సంజయ్‌ తెలిపారు. తెలంగాణను రేవంత్ రెడ్డి శ్రీలంక, పాకిస్తాన్‌లా మార్చే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అప్పుల ఊబి నుంచి బయటకు రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అప్పుల బాధ తీరదు.. అవినీతి ఆగదు. అభివృద్ది జరగదని తెలిపారు. వీబీజీ రామ్ జీ పథకంతో పనిదినాలు పెంచి ఆస్తులు సృష్టించడం తప్పా.. దీనిపై కోర్టుకు వెళ్లడం ఏమిటని బండి సంజయ్‌ ప్రశ్నించారు. మోదీకి మంచి పేరొస్తే ఓర్వలేరా? అని నిలదీశారు.

0
0
Report

IND Vs ENG 2nd T20: నేడే భారత్ Vs ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్..వైభవ్ సూర్యవంశీ గ్రాండ్ ఎంట్రీ పక్కా!

Stretford, England:

IND Vs ENG 2nd T20I Preview: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా ఐదు టీ20 మ్యాచ్‌లను ఆడనుండగా.. అందులో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరుజట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఇదే మ్యాచ్‌లో భారత యువ కెరటం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 

అయితే ఇంతకు ముందు ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా జరిగిన టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడన్న వార్తలు వచ్చాయి. అయితే అది కుదరలేదు. కేవలం వైభవ్ బెంచ్ మార్క్‌‌కు పరిమితమవ్వగా.. ఆ సిరీస్‌లో ఐర్లాండ్‌తో వైట్‌వాష్‌కు గురయ్యింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం వస్తుందని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. 

ఈ వారం ప్రారంభంలో డర్హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపించినప్పటికీ, జట్టు యాజమాన్యం తమ సాధారణ ఓపెనింగ్ జోడీతోనే ముందుకు సాగింది. అయితే, సంజు శాంసన్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటంతో, త్వరలోనే సూర్యవంశీ అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.

అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ పర్యటనలో ఇప్పటికే రెండు అర్ధశతకాలు (మొదటిది ఐర్లాండ్‌పై, రెండోది జూలై 1న ఇంగ్లాండ్‌పై) సాధించాడు. కాబట్టి జట్టులో అతని స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. పరుగులు సాధించాల్సిన ఒత్తిడి పూర్తిగా సంజు శాంసన్‌పైనే ఉంది. వర్షం కారణంగా రద్దయిన తొలి మ్యాచ్‌లో, శాంసన్ ఏడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 

భారత్‌కు మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. కొత్తగా ఎంపికైన వైస్ కెప్టెన్ తిలక్ వర్మ పేలవమైన ఫామ్. అతని స్ట్రైక్ రేట్ ఎంత ఆందోళనకరంగా ఉందో, స్లో బాల్స్‌ను ఎదుర్కోవడంలో అతని తీరు కూడా అంతే ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ఏడాది ఆడిన గత 12 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ కేవలం 12 సిక్సర్లు మాత్రమే కొట్టగలిగాడు. అంటే సగటున మ్యాచ్‌కు ఒకటి చొప్పున అన్నమాట. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో, ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఎలాంటి మార్పులు లేకుండా బౌలింగ్ విభాగం పటిష్టంగా కొనసాగే అవకాశం ఉంది.

ఇంగ్లాండ్ విషయానికొస్తే, మొదటి T20Iలో పూర్తిస్థాయిలో కనిపించని వారి బ్యాటింగ్ లైనప్ భారత్‌కు గట్టి సవాలు విసిరే అవకాశం ఉంది. సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి రాగా, జోష్ టంగ్ కూడా జట్టులో చేరారు. టంగ్ ఈ రోజు తన వైట్-బాల్ అరంగేట్రం చేయనున్నారు.

భారత్ vs ఇంగ్లాండ్ రెండో T20I ఎప్పుడు,ఎక్కడ?
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 మ్యాచ్‌ల T20I సిరీస్‌లో రెండో మ్యాచ్, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో శనివారం, జూలై 4న సాయంత్రం 7:00 గంటల (IST) నుండి జరుగుతుంది. ఈ 5 మ్యాచ్‌ల సిరీస్ మొత్తాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ ఛానెళ్లలోనూ, అలాగే సోనీ లివ్ (Sony LIV) యాప్ లేదా వెబ్‌సైట్‌లోనూ ప్రసారం చేస్తున్నారు.

Also Read: క్రికెట్ ప్రపంచంలో మరో కొత్త క్రష్..ఆస్ట్రేలియా మహిళల టీమ్‌లో భారత సంతతి యువతి!

Also Read: అమెరికన్ పాప్ సింగర్ పోటిగా విరాట్ కోహ్లీ..అందులో కిమ్ కర్దాషియన్‌‌నే మించిపోయాడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Peddi OTT Release: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన రామ్‌చరణ్ 'పెద్ది'..ఆ ఫ్యాన్స్ మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే!

Hyderabad, Telangana:

Peddi OTT Release Date: బాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ వేదికగా విడుదలకు సిద్ధమైంది. 

10 రోజుల్లో రూ.378 కోట్లు..!
టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో 'పెద్ది' సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుటి వరకు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. 

ఆ ఓటీటీలో విడుదలకు సిద్ధం..
కేవలం 35 రోజుల థియేటర్ రన్ తర్వాత ఓటీటీలో విడుదల కానుండడం విశేషం. ఈ సినిమాను ఓటీటీలో విడుదల తేదీని ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. జూలై 9న తమ ప్లాట్‌ఫారమ్‌లో సినిమాను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అయితే ఈ సినిమాను త్వరలోనే హిందీ వెర్షన్‌లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

సినిమా ప్రత్యేకతలు..నటీనటుల ప్రతిభ
డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. సినిమాలో క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్‌గా రామ్ చరణ్ చూపించిన వేరియేషన్స్, అద్భుత నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి.

అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, అప్పల సూరి పాత్రలో జగపతి బాబు నటనకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, సత్య తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించాయి.

వృద్ధి సినిమాస్ సమర్పణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ 'మైత్రీ మూవీ మేకర్స్', 'సుకుమార్ రైటింగ్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించాయి. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇదొక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: టాలీవుడ్ చరిత్రలో సమంత అతిపెద్ద రికార్డు..అనుష్కని వెనక్కి నెట్టిన లేడీ సూపర్‌స్టార్

Also Read: మూడో పెళ్లికి రెడీ అయిన బాలీవుడ్ స్టార్ హీరో..60 ఏళ్ల వయసులో ప్రియురాలితో పరిణయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top