Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Karimnagar505001

బోనాల పండుగలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు

Jul 28, 2024 10:42:02
Karimnagar, Telangana

కరీంనగర్, రామనగర, మార్కండేయ కాలనీలో మున్నూరుకాపు కులస్తులు నిర్వహించిన పోచమ్మ నాట్లు ఉత్సవంలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో మెరుగు స్వప్నశ్రీ, పిట్టల రవీందర్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నెల్లి నరేష్, పెద్దిగారి తిరుపతి, ఉప్పరి అజయ్, అల్వాల భరత్, కంపల్లి కీర్తికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 15, 2026 10:22:48
New Delhi, Delhi:

8th Pay Commission Fraud: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న కొత్త వేతన సంఘం మరింత ఆలస్యమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఉద్యోగ వర్గాలు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. జనవరి 2026 నుంచి అమలు కావాల్సిన కొత్త వేతన సంఘం అతీగతీ లేదు. పాలకవర్గం నియమించి తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులను కొందరు అమాయకంగా మోసం చేస్తున్నారు. ఉద్యోగుల ఆశలను తమ పెట్టుబడిగా చేసుకుని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. ఏపీకే ఫైల్స్‌, వాట్సప్‌ సందేశాలతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: Maha Shivaratri: మహా శివరాత్రి తర్వాతి రోజు ఏం చేయాలి? ఉపవాసం తర్వాతి రోజు ఏం తినాలి?

ఎనిమిదో వేతన సంఘంలో జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పింఛన్‌దారులను సైబర్‌ నేరస్తులు సులువుగా మోసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లే లక్ష్యంగా సైబర్‌ మోసగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. 8వ వేతన సంఘం ప్రకారం జీతం ఎంత పెరుగుతుందో కచ్చితంగా అంచనా (క్యాలికులేట్‌) వేసి చెబుతామంటూ వాట్సప్‌లో సందేశాలు పంపుతున్నారు. మీకు పెరిగే జీతాన్ని అంచనా వేసి చెబుతామంటూ నేరగాళ్లు వాట్సప్‌లో సందేశం పెడుతూనే.. ‘8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్‌’, ‘శాలరీ రివిజన్‌ టూల్‌’ పేరుతో ఏపీకే ఫైల్స్‌ను జత చేస్తున్నారు. 

Also Read: BRS Clean Sweep: బీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌.. కేసీఆర్‌కు గూడెం మహిపాల్‌ రెడ్డి గిఫ్ట్‌

ఆ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేయడంతో ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించిన వివరాలు అన్నీ సైబర్‌ నేరస్తులకు చిక్కుతున్నారు. ఏపీకే ఫైల్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న ఫోన్‌ మొత్తం సైబర్‌ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. ఫోన్‌ యజమాని వ్యక్తిగత డేటా, బ్యాంకుల సమాచారం, ఎస్‌ఎంఎస్‌, ఓటీపీలు అన్నీ కూడా మోసగాళ్లకు చేరిపోతాయి. దీంతో ఉద్యోగులు, పింఛన్‌దారులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి నగదు బదిలీ జరుగుతున్నాయి. తమ అకౌంట్లు ఖాళీ అవుతుండడంతో ఉద్యోగులు, పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

Also Read: Mahabubnagar: చరిష్మా లేని రేవంత్‌ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు అంటే?

8వ వేతన సంఘం పేరిట మోసాలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలా చోట్ల పలు కేసులు నమోదవడంతోపాటు సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగులు, పింఛన్‌దారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వాట్సాప్‌ ద్వారా ఎలాంటి ఏపీకే ఫైల్స్‌ పంపదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త సైబర్‌ స్కామ్‌పై జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతోపాటు పింఛన్‌దారులను ప్రభుత్వం హెచ్చరించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RGRenuka Godugu
Feb 15, 2026 09:27:36
Hyderabad, Telangana:

3 Hindu Candidates Won In Bangladesh Elections 2026: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు హిందూ అభ్యర్థులు గెలిచి రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న బంగ్లా పరిస్థితుల్లో ఇలా హిందూవులు గెలవడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. అయితే, ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా బీఎన్‌పీ పార్టీ తరఫున గెలిచారు. ఇక ఈ బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం బీఎన్‌పీ పార్టీ 212 స్థానాలు గెలుచుకొని మెజారిటీ సాధించింది. ప్రధాన ప్రత్యర్థి జమాత్ ఈ ఇస్లామి కేవలం 68 సీట్లతో సరిపెట్టుకుంది. 

 అయితే బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ముగ్గురు హిందూ అభ్యర్థులు. వారు బంగ్లా సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. ప్రత్యర్థులపై భారీ ఓట్ల తేడాతో వీరు గెలుపొందారు. వీరు ముగ్గురు బీఎన్‌పీ పార్టీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఆ ప్రాంతాల్లో గెలిచి రికార్డు బ్రేక్ చేశారు.  బంగ్లాదేశ్ ఎన్నికల్లో BNP పార్టీ తరఫున బరిలోకి దిగిన గయేశ్వర్ చంద్రరాయ్‌ ఢాకా-3 నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన జమాత్ ఈ ఇస్లామి పార్టీ అభ్యర్థి మహమ్మద్ షాహినూర్ ఇస్లాంపై గెలుపొందారు.  మొత్తంగా 15,899 ఓట్ల తేడాతో గయేశ్వర్ గెలిచారు. గతంలో రాష్ట్ర మంత్రిగా , BNP స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 

 తర్వాత చెప్పుకోవాల్సింది లాయర్ దీపెన్‌ దేవాన్ ఆయన కూడా ఈ బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్‌పీ పార్టీ తరఫు నుంచి నిలబడి గెలిచారు. ప్రధానంగా రంగమతి పార్లమెంటు సీటు నుంచి ఈయన మొత్తంగా ప్రత్యర్థిపై 9678 ఓట్ల తేడాతో గెలిచారు. 

బంగ్లాదేశ్ ఎన్నికల్లో చివరగా చెప్పుకోవాల్సింది నితాయ్‌ చౌదరి. ఆయన కూడా మగురా 2 పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రభావంతమైన మైనారిటీ వ్యక్తిగా పరిగణిస్తా.రు మొత్తంగా 30 వేలకు పైగా ఓట్ల తేడాతో జమాత్‌ ఇ ఇస్లాం అభ్యర్థి ముస్తార్షిత్ బిల్లా ను ఓడించారు. ఈ ఎన్నికల్లో జమాత్ కు చెందిన ఏకైక హిందూ అభ్యర్థి మాత్రం ఓడిపోయారు. ఖుల్నా1 స్థానంలో పోటీ చేసిన కృష్ణ నంది 70 వేలకు పైగా ఓట్లు సాధించినప్పటికీ BNP అభ్యర్థి చేతిలో ఓడిపోవడం గమనార్హం. 

 ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలు తమ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని BNP చీఫ్ తారిఖ్ రెహమాన్ అన్నారు. ఇండియాతో సంబంధాలకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఈ గెలుపు బంగ్లాది.. ఇప్పుడు మనం స్వేచ్ఛను పొందాం హక్కులను అసలైన అర్ధాన్ని తిరిగి సంపాదించుకున్నాం . ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్న అన్నారు..

 ఇక భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమని కోరుతామని అక్కడి తాజా ఎన్నికల్లో గెలుపొందిన BNP పార్టీ ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు తమ అభ్యర్థనను భారత్‌కు తెలియజేసినట్లు సమాచారం. పొరుగుదేశంలో ప్రధానంగా సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి విదేశాంగ శాఖ స్థాయిలో దీని పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. ఇక 2024 ఆగస్టు లో బంగ్లాదేశ్ లో జరిగిన అంతర్గత అల్లర్ల కారణంగా హసీనా భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బంగ్లాలో ఐసిజే కోర్టు ఆమెకు మరణశిక్ష కూడా విధించింది.

Also Read:​ 'ప్రగతిశీల బంగ్లాదేశ్‌కు అండగా నిలుస్తాం'.. తారిక్‌ చారిత్రాత్మక విజయంపై ప్రధాని మోదీ అభినందనలు..!

Also Read:​  ప్రపంచంలోనే అతిచిన్న 10 దేశాలు.. మ్యాప్‌లో వెతికినా కనిపించవు..! కాలినడకనే చుట్టేయొచ్చు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Feb 15, 2026 09:10:19
Amaravati, Andhra Pradesh:

Nara Lokesh On Kova Bun Incident: కర్నూలుకు చెందిన 'కోవా బన్' వ్యాపారి షేక్ వలీకి జరిగిన అవమానంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా వలీకి అండగా నిలుస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, త్వరలోనే ఆయనను వ్యక్తిగతంగా కలుస్తానని ప్రకటించారు. కర్నూలులో కోవా బన్ విక్రయించే వలీపై కొందరు వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు.

మంత్రి లోకేష్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో వలీకి మద్దతుగా పోస్ట్ చేస్తూ కింది విషయాలను పంచుకున్నారు. చిరు వ్యాపారి వలీపై జరిగిన ఆరోపణలు తనను కలచివేశాయని, ఆయనకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వలీ తయారు చేసే ప్రసిద్ధ 'కోవా బన్' రుచి చూసేందుకు తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కర్నూలు పర్యటనలో భాగంగా లేదా అమరావతిలో వలీని త్వరలోనే కలుస్తానని లోకేష్ పేర్కొన్నారు.

ఐక్యతకు భంగం కలిగిస్తే సహించేది లేదు
సమాజంలో మత సామరస్యాన్ని లేదా ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి ప్రవర్తనకు సభ్య సమాజంలో స్థానం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

ఏం జరిగిందంటే?
కొద్దిరోజుల క్రితం కర్నూలులో కోవా బన్ విక్రయించే వలీ వ్యాపారంపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. దీనివల్ల ఆయన వ్యాపారం దెబ్బతినడమే కాకుండా మానసిక వేదనకు గురయ్యారు. ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి రావడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.

Also Read: Ind Vs Pak Weather Update: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ముందు భారీ వర్షం?! కొలంబోలో వాతావరణం ఎలా ఉంది? మ్యాచ్ జరుగుతుందా..లేదా?

Also Read: School Holiday: విద్యార్థులకు, తల్లీదండ్రులకు గుడ్‌న్యూస్..రేపు సోమవారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..ఉత్తర్వులు జారీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 15, 2026 09:08:32
Srisailam, Andhra Pradesh:

Maha shivratri Deeksha Dos And Donts: పరమశివుడి కోసం మహాశివరాత్రి రోజు చేసే ఉపవాస దీక్ష అత్యంత నియమ నిష్టతో చేయాల్సి ఉంది. ఒకపొద్దును పవిత్రంగా చేసి భగవన్నామస్మరణలో మునగాలి. ఉపవాసం రోజంతా దైవ చింతనలో మునగాలి. ఉపవాసం సాయంత్రం ఫలహారంతో విరమించాలి. తర్వాతి రోజు అంటే మహా శివరాత్రి తర్వాతి రోజు ఉపవాసం చేసిన వారు ఎలా ఉండాలనేది ఒక పద్దతి ఉంది. మహా శివరాత్రి తర్వాతి రోజు కూడా చాలా పద్ధతిగా ఉండాలి. ఉపవాసం విరమించామని ఎలా పడితే అలా ఉండరాదు. ఆ రోజు కూడా నియమ నిష్టతో ఉండాలి. మహాశివరాత్రిని పద్ధతిగా చేయాల్సి ఉంటుంది. అలా చేయనివారు మహాశివరాత్రికి ఉపవాసం, జాగరణ వంటివి చేయరాదు.

ఉపవాసం విరమించిన తర్వాతి రోజు ఆహారం మితంగా తినాలి. ఉపవాసం ఉన్నాం కదా అని తర్వాతి రోజు ఇష్టానుసారంగా తినరాదు. అలా చేస్తే అనారోగ్యానికి గురవుతారు. వాంతులు, విరేచనాలు అయ్యే ఆస్కారం ఉంది. ఉపవాసం ఉన్నవారు సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే పాలన్నం.. దద్దోజనం (పెరుగన్నం) వంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. నూనె, ఉప్పు, కారం అధికంగా ఉన్న ఆహారాన్ని తినరాదు. వీటికి దూరంగా ఉంటే మంచిది. రోజంతా ఉపవాసం ఉన్నవారు తర్వాత ఉప్పు, కారాలతో కూడిన ఆహారం తీసుకుంటే కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు రావొచ్చు. ఇక మాంసాహారం.. మద్యం, ధూమపానం వంటి జోలికి వెళ్లరాదు. తమ పనులు చేసుకుంటే శివరాధన చేయాలి.

Also Read: Mahabubnagar: చరిష్మా లేని రేవంత్‌ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు ఎన్ని స్థానాలు అంటే?

ఇలా జాగరణ చేయరాదు
మహాశివరాత్రి రోజు తప్పనిసరిగా జాగరణ చేస్తారు. ఉపవాసం చేసేవారితోపాటు ఇతర భక్తులు కూడా జాగరణ చేయవచ్చు. ఉదయం ఆరు గంటల వరకు జాగరణ చేయాల్సి ఉంటుంది. అయితే జాగరణను ఎలా పడితే అలా చేస్తే ప్రతిఫలం లభించదు. జాగరణ పేరిట రాత్రిళ్లు విచ్చలవిడిగా తిరగడం చేయరాదు. సినిమాలు, ఆటలు వంటి చేయరాదు. ఒకవేళ సినిమాలు చూస్తే భక్తికి సంబంధించినవై ఉండాలి. జాగరణ అంటే భగవంతుడిని స్మరించడమే. తెల్లవార్లు మెలకువతో శివరాధన చేస్తే జాగరణకు ప్రతిఫలం లభిస్తుంది.

Also Read: KTR: మున్సిపల్‌ ఫలితాలతో సంతృప్తి చెందాం.. 2029లో కేసీఆర్‌ సీఎం కావడం పక్కా: కేటీఆర్‌

ఎన్నో ప్రయోజనాలు
మహా శివరాత్రి ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనది.. విశిష్టమైనదో.. ఆరోగ్యకరంగా.. మానసికపరంగా అంతే ముఖ్యమైనది. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఒక్కటే కాదు భగవంతుడి నామస్మరణ చేయడం.. నిష్టగా ఉండడం.. జాగరణ చేయడం వంటి వాటి వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆహారం అంటే అమితంగా ఇష్టపడే వారు ఉపవాసం ఉంటే కొంత నోటికి తాళం వేసిన వారవుతారు. అంతేకాకుండా తినకుండా కూడా ఉండగలమనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆహారం వృథా చేసేవారు ఆకలి విలువ తెలియదు. శివరాత్రి ఉపవాసం ఉంటే ఆకలి విలువ తెలియడంతో పాటు ఆహారాన్ని వృథా చేయరు. ఇకపై పద్ధతిగా తింటారు. శివరాత్రి రోజు చేసే కఠిన ఉపవాస దీక్షతో ఇంద్రియాలను నియంత్రించుకుంటారు. ఇంద్రియాలను నియంత్రించుకుంటే మన శరీరం మన ఆధీనంలో ఉంటుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 15, 2026 08:38:07
Hyderabad, Telangana:

Realme Pad 3 5g Price Cut: ఎప్పటినుంచో మంచి టాబ్లెట్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు సమయం రానే వచ్చేసింది.. ఇటీవల ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్ మీ విడుదల చేసిన రియల్ మీ పాడ్ 3 (Realme Pad 3)టాబ్లెట్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్ తో పాటు అద్భుతమైన కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ముఖ్యంగా అద్భుతమైన ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అయితే, ఈ టాబ్లెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇది ఏయే డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రియల్ మీ ప్యాడ్ 3 (Realme Pad 3) అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ 11.61 అంగుళాల 2.8K LCD డిస్‌ప్లేతో విడుదల చేసింది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది. ఇక ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7300-మ్యాక్స్ (MediaTek Dimensity 7300-Max) ప్రాసెసర్ పై రన్ అవుతోంది. అలాగే 8 జిబి ర్యామ్‌, 128 GB, 256 జిబి స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది ప్రస్తుతం మార్కెట్లో వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 

ఈ (Realme Pad 3)టాబ్లెట్‌కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 12,200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా చార్జ్ చేసేందుకు ప్రత్యేకంగా 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు కూడా లభిస్తుంది. అలాగే అదనంగా దీనికి కంపెనీ 6.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఇక ఈ టాబ్లెట్‌కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 8MP కెమెరా బ్యాక్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ భాగంలో 8MP కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత realme UI 7.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఇందులో కంపెనీ డాల్బీ అట్మోస్ సపోర్టుతో కూడిన క్వాడ్ (4) స్పీకర్లు సౌండ్ సెటప్ ను కూడా అందిస్తోంది..

ప్రస్తుతం మార్కెట్లో ఈ టాబ్లెట్ మొత్తం మూడు స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో నీ మొదటి స్టోరేజ్ ఆప్షన్ 8 జిబి ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.. దీని ధర రూ.26,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవది సేమ్ ఇదే స్టోరేజ్ వేరియంట్ కానీ.. ఇది వైఫైతో పాటు 5G సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. ఇది మార్కెట్లో ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇందులోనే 256 జిబి వేరియంట్ రూ.31,999తో లభిస్తోంది. అయితే, అత్యంత తగ్గింపు ధరకే కొనుగోలు చేయాలనుకునేవారు.. బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది.. కెనరా బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే.. ఏకంగా దీనిపై రూ.2 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

అలాగే ఈ స్మార్ట్ (Realme Pad 3) ట్యాబ్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పాటు ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,489 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లో భాగంగా ఏదైనా స్మార్ట్ ఫోన్ లేదా యాపిల్ బ్రాండ్, సాంసంగ్ బ్రాండ్లకు సంబంధించిన టాబ్లెట్లను ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.27,250 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్నీ పోను.. ఈ కొత్త ట్యాబ్ కేవలం రూ.3 వేల లోపే పొందవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 15, 2026 08:30:55
Colombo, Western Province:

India Vs Pakistan Match Weather Forecast: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. కానీ, ప్రస్తుతం కొలంబోలో నెలకొన్న వాతావరణం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. నేడు అనగా ఫిబ్రవరి 15 సాయంత్రం జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ పోరుపై వరుణుడి ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 

తాజా వెదర్ రిపోర్ట్
ప్రారంభ అంచనాలతో పోలిస్తే.. ప్రస్తుత రిపోర్ట్స్ క్రికెట్ ప్రేమికులకు కొంత ఊరటనిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకు వర్షం పడే అవకాశం 51% గా ఉంది. దీనివల్ల టాస్ వేయడంలో ఆలస్యం జరగవచ్చు. అయితే రాత్రి 7 గంటలకు (మ్యాచ్ ప్రారంభ సమయం) మాత్రం వర్షం ముప్పు 40% కి తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత రాత్రి 8:30 గంటల సమయానికి వర్షం పడే సూచనలు కేవలం 27% మాత్రమే ఉన్నాయి. రాత్రి 9 గంటల తర్వాత ఆకాశం క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

వాతావరణ పరిస్థితులను బట్టి నిపుణులు కింది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే ఓవర్ల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. మ్యాచ్ ఫలితం తేలాలంటే డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల పాటు ఆడాల్సి ఉంటుంది. ప్రేమదాస స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది. వర్షం ఆగిపోయిన కొద్ది నిమిషాల్లోనే గ్రౌండ్‌ను సిద్ధం చేసే సదుపాయం ఉండటం ప్లస్ పాయింట్.

అభిమానుల ఆందోళన
ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15, ఆదివారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది టీవీల ముందు కూర్చోవడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా అభిషేక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన చూడాలని ఆరాటపడుతున్న ఫ్యాన్స్‌కు వరుణుడు అడ్డుపడకూడదని కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.

కొలంబో వాతావరణం క్షణక్షణం మారిపోతుంటుంది. వర్షం వల్ల కొద్దిసేపు ఆట ఆగినా, రాత్రికి పూర్తి స్థాయి లేదా కుదించిన ఓవర్లతోనైనా ఫలితం వస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: India vs Pakistan Preview: టీ20 ప్రపంచకప్‌లో నేడే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్..రెండు జట్ల బలాలు, పిచ్ రిపోర్ట్ వచ్చేసింది!

Also Read: MS Dhoni Pension From BCCI: రిటైర్మెంట్ తర్వాత ధోనీ పెన్షన్ ఎంతో తెలుసా? కపిల్ దేవ్, సచిన్, యువరాజ్‌లకు బీసీసీఐ ఎంత ఇస్తుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 15, 2026 08:21:57
Hyderabad, Telangana:

Motorola Edge 60 Fusion Price Cut: ఎప్పటినుంచో మోటరోలా బ్రాండ్‌కి సంబంధించిన మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు అవకాశం రానే వచ్చేసింది.. ప్రముఖ మోటరోలా సంస్థ ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ (Motorola Edge 60 Fusion) స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువ ధరలోనే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం కెమెరా సెటప్‌తో లాంచ్ అయింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్స్ వివరాలు ఏంటో? ఇది ఏయే ఫీచర్లతో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మోటోరోలా Edge 60 Fusion 5G స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల 1.5K ఆల్-కర్వ్‌డ్ P-OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు డిస్ప్లే రక్షణ కోసం కంపెనీ Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది.. 

ఈ మోటోరోలా Edge 60 Fusion మొబైల్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 (4nm) చిప్‌సెట్ ప్రాసెసర్ పై లాంచ్ అవుతుంది. దీంతోపాటు వెనక భాగంలో అద్భుతమైన Sony LYT-700C సెన్సార్, OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా లభిస్తోంది. దీంతోపాటు 13MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇక ఫ్రంట్ భాగంలో వీడియో కాలింగ్ కోసం కంపెనీ 32MP కెమెరా కెమెరాను కూడా అందిస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన ఫోర్ కే రికార్డింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ Motorola Edge 60 Fusion మొబైల్ ఎంతో శక్తివంతమైన 5500 mAh భారీ బ్యాటరీ, ఇది 68W టర్బో చార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్ అయింది. 

ఈ మోటోరోలా Edge 60 Fusion మొబైల్ చాలా అద్భుతమైన ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆధారిత ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్‌తో పాటు నాలుగేళ్ల పాటు ప్రత్యేకమైన సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తోంది. ఇక మార్కెట్‌లో ఇది వివిధ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా 8gb ర్యామ్, 256gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ.22 వేలలోపు లభిస్తుంది. 12gb ర్యామ్ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ.24 వేల లోపు అందుబాటులో ఉంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా ఈ రోజే కొనుగోలు చేయాలనుకునే వారికి బేస్ వేరియంట్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది మార్కెట్‌లో రూ.24,999 కాగా.. 16 శాతం తగ్గింపుతో కేవలం రూ.20,999కే అందుబాటులో ఉంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ఒక క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ. 2 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే సాధారణ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పాటు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఎక్స్చేంజ్‌ బోనస్ వినియోగించాలనుకునేవారు ఏదైనా స్మార్ట్‌ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.19 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మోటోరోలా Edge 60 Fusion మొబైల్ కేవలం రూ.1,999 లోపే పొందవచ్చు..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 15, 2026 07:55:45
Hyderabad, Telangana:

Side Effects of Watermelon: వేసవి కాలంలో పుచ్చకాయ ఒక అద్భుతమైన వరప్రసాదం. శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ, దాహాన్ని తీర్చే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారికి పుచ్చకాయ అమృతంలా కాకుండా విషంలా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయలో 90 శాతం నీరు, విటమిన్ ఎ, సి, బి6, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ, కింది సమస్యలు ఉన్నవారు దీనిని పరిమితంగానే తీసుకోవాలి.

మధుమేహం
పుచ్చకాయలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. డయాబెటిస్ ఉన్నవారు దీనిని అధికంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వైద్యుల సలహా మేరకు స్వల్ప పరిమాణంలోనే తీసుకోవాలి.

జీర్ణకోశ సమస్యలు
పుచ్చకాయలో 'లైకోపీన్' అనే పదార్థం ఉంటుంది. ఇది గుండెకు మంచిదే అయినప్పటికీ, అధికంగా తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు దీనిని మితంగా తినాలి.

కిడ్నీ సమస్యలు
పుచ్చకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా ఇది గుండెకు మంచిదే, కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగితే గుండె లయ తప్పడం, కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తవచ్చు.

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత
అతిగా పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో నీటి శాతం విపరీతంగా పెరిగి, సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. దీనిని 'వాటర్ ఇంటాక్సికేషన్' అని పిలుస్తారు. దీనివల్ల కాళ్లలో వాపులు, అలసట, మెదడుపై ప్రభావం పడే అవకాశం ఉంది.

పుచ్చకాయ తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు..
1) రాత్రి సమయంలో పుచ్చకాయ తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. తరచుగా మూత్ర విసర్జన జరగడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
2) కొంతమందికి ఖాళీ కడుపుతో పుచ్చకాయ తింటే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది.
3) రోజుకు 200 నుండి 300 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకపోవడం ఉత్తమం.

గమనిక: పుచ్చకాయ ఆరోగ్యకరమైన పండే అయినప్పటికీ, పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు తమ ఆహారంలో దీనిని చేర్చుకునే ముందు పోషకాహార నిపుణులను సంప్రదించడం మంచిది.

Also Read: MS Dhoni Pension From BCCI: రిటైర్మెంట్ తర్వాత ధోనీ పెన్షన్ ఎంతో తెలుసా? కపిల్ దేవ్, సచిన్, యువరాజ్‌లకు బీసీసీఐ ఎంత ఇస్తుందంటే?

Also Read: India vs Pakistan Preview: టీ20 ప్రపంచకప్‌లో నేడే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్..రెండు జట్ల బలాలు, పిచ్ రిపోర్ట్ వచ్చేసింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 15, 2026 07:22:39
Dubai, Dubai:

Indian Gold Or Dubai Gold Which Is Better: దుబాయ్ అనగానే గుర్తొచ్చేది ఆకాశహర్మ్యాలు, మెరిసిపోయే బంగారం. భారత్‌తో పోలిస్తే అక్కడ పసిడి ధర తక్కువని, నాణ్యత అధికమని చాలా మంది ప్రయాణికులు దుబాయ్‌లో బంగారం కొనేందుకు ఆరాటపడుతుంటారు. అయితే, కస్టమ్స్ నిబంధనలు, పన్నుల లెక్కలు తెలియకుండా బంగారం కొంటే లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. 

భారతదేశం కంటే దుబాయ్‌లో బంగారం చౌకగా ఉండటానికి ప్రధాన కారణం అక్కడి పన్ను విధానం. కానీ, దానిని భారత్‌కు తీసుకువచ్చేటప్పుడు ఉండే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.

దుబాయ్‌లో ధర ఎందుకు తక్కువ?
భారత్‌లో బంగారంపై దిగుమతి సుంకం, జీఎస్‌టీ కలిపి పన్ను భారం ఎక్కువగా ఉంటుంది. దుబాయ్‌లో దిగుమతి సుంకాలు తక్కువగా ఉండటం, తయారీ ఖర్చులు తక్కువగా ఉండటంతో అక్కడ గ్రాముపై భారత్ కంటే రూ.300 నుండి రూ.500 వరకు వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.

ఎంత బంగారం తీసుకురావచ్చు?
విదేశాల నుండి వచ్చే భారతీయులకు కస్టమ్స్ శాఖ నిర్దిష్ట పరిమితులను విధించింది. ఈ రాయితీలు మీరు కనీసం ఒక సంవత్సరం విదేశాల్లో నివసిస్తేనే వర్తిస్తాయి. మహిళలు గరిష్టంగా 40 గ్రాముల వరకు (విలువ రూ.1 లక్ష లోపు) పన్ను లేకుండా తీసుకురావచ్చు. అలాగే పురుషులు గరిష్టంగా 20 గ్రాముల వరకు (విలువ రూ.50 వేల లోపు) పన్ను లేకుండా బంగారాన్ని స్వదేశానికి తెచ్చుకోవచ్చు. ఏడాది కంటే తక్కువ వయసున్న చిన్నారులకు ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే ఈ రాయితీ వర్తిస్తుంది. 

ఆభరణాలు vs బిస్కెట్లు: తేడా ఏంటి?
చాలా మంది చేసే తప్పు ఇక్కడే ఉంది. పైన చెప్పిన పన్ను మినహాయింపులు కేవలం బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తాయి. మీరు కాయిన్స్ లేదా బిస్కెట్లు తీసుకువస్తే, మొదటి గ్రాము నుండే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పరిమితికి మించి తెచ్చే బంగారంపై సుమారు 12.5% నుండి 15% వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి రావచ్చు. అప్పుడు దుబాయ్ బంగారం ధర, భారత్ ధరతో సమానమవుతుంది.

మీ వద్ద పరిమితికి మించి బంగారం ఉంటే ఎయిర్‌పోర్టులోని 'రెడ్ ఛానల్' వద్ద అధికారులకు స్వచ్ఛందంగా తెలియజేయాలి. కొనుగోలు చేసిన దుకాణం నుండి ఒరిజినల్ బిల్లులను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ఒకవేళ అధికారులకు చెప్పకుండా దాచి తీసుకువస్తూ పట్టుబడితే, భారీ జరిమానాతో పాటు సెక్షన్ 135 కింద జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది.

అక్కడ కొనడం లాభమేనా?
మీరు పరిమితికి లోబడి (మహిళలైతే 40గ్రా, పురుషులైతే 20గ్రా) కొనుగోలు చేస్తే దుబాయ్ బంగారం కచ్చితంగా లాభదాయకమే. కానీ, భారీ మొత్తంలో కొని పన్నులు చెల్లిస్తే.. ప్రయాణ ఖర్చులు, పన్నులు కలిపి భారత్‌లో కొన్న ధరకే సమానమవుతుంది. కాబట్టి, లెక్కలు చూసుకుని కొనుగోలు చేయడం ఉత్తమం.

Also REad: India vs Pakistan Preview: టీ20 ప్రపంచకప్‌లో నేడే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్..రెండు జట్ల బలాలు, పిచ్ రిపోర్ట్ వచ్చేసింది!

Also Read: School Holiday: విద్యార్థులకు, తల్లీదండ్రులకు గుడ్‌న్యూస్..రేపు సోమవారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..ఉత్తర్వులు జారీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 15, 2026 06:33:00
Colombo, Western Province:

India Vs Pakistan T20 World Cup 2026: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. టీ20 ప్రపంచకప్‌‌లో నేడు అనగా ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ మ్యాచ్ జరగనుంది. దాయాదీ దేశాల మ్యాచ్‌ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రేజీయస్ట్ మ్యాచ్ శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు పిచ్ రిపోర్టు, ఇరు జట్లు బలాబలాల గురించి అంచనాకి వద్దాం.

పాత రికార్డులు ఏంటి?
ఐసీసీ నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ చరిత్రలో టీమ్ఇండియా, పాకిస్థాన్ మధ్య మొత్తం 16 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో 13 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా.. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టుపై భారత్ ఆధిపత్యం తెలియజేస్తుంది. 

అయితే వీటిలో ఆశ్చర్యం ఏమిటంటే.. జరిగిన మ్యాచ్‌ల్లో 75 శాతం ఛేజింగ్ జట్టు విజయం సాధించడం విశేషం. దీన్ని బట్టి చూస్తే నేడు టాస్ ని బట్టి కూడా గెలుపోటములు ఓ సుమారు అంచనాకు రావొచ్చని అర్థం అనమాట. టాస్ గెలిచిన జట్టుకు మానసికంగానే కాకుండా డ్యూ విషయంలోనూ కలిసొచ్చే అంశం కానుంది. మరోవైపు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే సాధారణంగా తక్కువ స్కోర్లు నమోదవుతాయి. ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు 159 కాగా.. అత్యల్ప స్కోరు 118 కావడం కొసమెరుపు.

పిచ్ రిపోర్ట్..
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోని పిచ్ సాధారణంగా నెమ్మది స్వభావం కలిగినది. ఈ పిచ్‌పై 200+ స్కోరు చేసిన సందర్భాలు చాలా అరుదు. ఒకవేళ 150 నుంచి 160 మధ్య మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులు రాబడితే మ్యాచ్ మరింత టైట్‌గా నడిచే అవకాశం ఉంది.

ప్రేమదాస స్టేడియంలోని పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. మ్యాచ్ కొనసాగే కొద్దీ బ్యాటర్లకు కష్టతరమవుతుందట. అయితే ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌‌లలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించడం గమనార్హం. అయితే ఈ రోజు టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 

క్రికెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిచ్ నెమ్మదిగా ఉంటే, 150-155 పరుగులు బెస్ట్ స్కోరుగా నిలవనుంది. ముందుగా బ్యాటింగ్ చేసే టీమ్ అదిరిపోయే ఆరంభం పొందగలిగితే మ్యాచ్ కంట్రోల్ చేసేందుకు 160 నుంచి 170 రన్స్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ 175+ స్కోర్ చేస్తే..ఛేజింగ్ జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది. 

అయితే ఈ మ్యాచ్‌ల్లో స్పిన్ బౌలర్లు ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉంది. టీమ్ఇండియాలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు. అలాగే పాకిస్థాన్‌ టీమ్‌లో మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్ ఉన్నారు. ఒకవేళ పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు పెద్ద ఇబ్బందిగా మారనుంది. 

Also Read: MS Dhoni Pension From BCCI: రిటైర్మెంట్ తర్వాత ధోనీ పెన్షన్ ఎంతో తెలుసా? కపిల్ దేవ్, సచిన్, యువరాజ్‌లకు బీసీసీఐ ఎంత ఇస్తుందంటే?

Also Read: School Holiday: విద్యార్థులకు, తల్లీదండ్రులకు గుడ్‌న్యూస్..రేపు సోమవారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..ఉత్తర్వులు జారీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 15, 2026 05:50:10
Hyderabad, Telangana:

MS Dhoni Monthly Pension From BCCI: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలను జట్టుకు అందజేసిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు. 2020లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే అందరి ఉద్యోగుల లాగే ధోనీకి కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి నెలా నెలా పెన్షన్ అందుతుంది. అయితే ధోనీ నెలా నెలా ఎంత పెన్షన్ తీసుకుంటున్నాడు. అతనితో పాటు మిగిలిన మాజీ క్రికెటర్లకు ఎంతమేరు ఫించను లభిస్తోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

క్రికెటర్లలో స్టార్ క్రికెటర్లు కోట్ల కొద్ది సంపాదించినా.. వారికి ప్రకటనల ప్రచారకర్తల ద్వారా ఎంత డబ్బు ముట్టినా.. వారు బీసీసీఐ కాంట్రాక్ట్‌లో పనిచేస్తూ రిటైర్ అయితే వారికి తప్పనిసరిగా పెన్షన్ అందుతుంది. దేశానికి సేవ చేసినందుకు గుర్తుగా వారికి ఈ పెన్షను అందజేస్తారు. టీమ్ఇండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా క్రికెటర్ పెన్షన్‌ను బీసీసీఐ నిర్ణయిస్తుంది. 

2022లో బీసీసీఐకి అధ్యక్షత వహించిన సౌరవ్ గంగూలీ నేతృత్వంలో క్రికెటర్ల పెన్షన్‌ను పెంచారు. నిబంధనల ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు వారు రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.70,000 పెన్షన్ అందుతుంది. అయితే ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో 90 టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ తరఫున ప్రాతినధ్యం వహించిన క్రమంలో అతనికి అత్యున్నత కేటగిరి పెన్షన్ రూ.70,000 లభిస్తుంది. 

అయితే ధోనీతో పాటు బీసీసీఐ నుంచి నెలకు రూ.70,000 అందుకుంటున్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఈ లిస్టులో ఉన్నారు.  అలాగే మరికొందరు స్టార్ క్రికెటర్లు అయిన యువరాజ్ సింగ్ ‌కు నెలకు రూ.60,000 పెన్షన్ లభిస్తుంది. వారితో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఆటగాళ్లు, మహిళా క్రికెటర్లకు వారి అనుభవం, మ్యాచ్‌ల సంఖ్యను బట్టి వారికి నెలకు రూ.30,000 నుంచి రూ.45,000 వరకు పెన్షన్ అందజేస్తుంది బీసీసీఐ. 

ఎంఎస్ ధోనీ సాధించిన రికార్డులు ఇవే..
2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్ఇండియా క్రికెట్ రూపురేఖలను మార్చేశాడు. ఆయన కెప్టెన్సీలో భారత జట్టు సాధించిన ప్రధాన విజయాలు ఇవే.

1) 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ గెలుపు

2) దాదాపుగా 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2011లో వన్డే వరల్డ్ కప్ కైవసం

3) 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత

4) క్రికెట్‌లో ధోనీ చేసిన కృషికి గాను 2025లో ICC హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం దక్కింది

ధోనీ తన కెరీర్‌లో మొత్తం 538 అంతర్జాతీయ మ్యాచుల్లో 17,266 రన్స్ రాబట్టాడు. వికెట్ కీపింగ్‌లోనూ ఎందరికో అందని రికార్డులను ఆయన నెలకొల్పాడు.

Also Read: School Holiday: విద్యార్థులకు, తల్లీదండ్రులకు గుడ్‌న్యూస్..రేపు సోమవారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..ఉత్తర్వులు జారీ!

Also Read: Hardik Pandya Violation: బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా..పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు లవర్‌తో ఇలా! వేటు తప్పదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 15, 2026 05:20:53
Hyderabad, Telangana:

Sun Venus Saturn Conjunction Effect On Zodiac Telugu: 2026 సంవత్సరం ప్రారంభం నుంచి అనేక గ్రహాలు కదలికలు చేయడమే కాకుండా.. కొన్ని ప్రధాన గ్రహాలు రాశి సంచారం చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైన సంయోగం జరగబోతోంది. ఈ సమయంలో రాహువుతో పాటు బుధుడు శుక్రుడు వంటి ప్రధాన గ్రహాలు కుంభరాశిలో కలిసి ఉండబోతున్నాయి. నిజానికి ఏవైనా రెండు గ్రహాలు కలిస్తేనే ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటిది ఈ నెలలో కుంభరాశిలో చాలా శక్తివంతమైన గ్రహాలు కలయిక జరపడం విశేషం..దాదాపు 120 సంవత్సరాల తర్వాత ఇలా కొన్ని గ్రహాలు కుంభరాశిలో సంయోగం చెందబోతున్నాయి.. ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఫిబ్రవరి 23వ తేదీన కుజుడు వెళ్తాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది.  ఇప్పటికే కొన్ని గ్రహాలు కుంభరాశిలో సంచార దశలో ఉన్నాయి. దీంతో అన్ని గ్రహాలకు కలయిక జరుగుతుంది. దీని ప్రభావం ఈ క్రింది రాశుల వారిపై పడబోతోంది. 

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
వృషభ రాశి 
ముఖ్యంగా కుంభరాశిలో ఈ గ్రహాల కలయిక కారణంగా కెరీర్ పరంగా చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అద్భుతమైన లాభాలు పొందుతారు. చాలా కాలంగా కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో బాధ్యత కూడా విపరీతంగా పెరుగుతుంది.  గౌరవం పెరగడమే కాకుండా ఈ సమయంలో అనేక రకాల లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసే వ్యక్తులకు కొత్త లాభాలు ఎంతో సంతోషాన్ని అందిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా మారుతుంది. అలాగే ఇప్పటికే వ్యాయామాలు చేస్తున్నవారు అలాగే కంటిన్యూ చేయడం మంచిది. 

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా వీరికి పెండింగ్లో ఉన్న ప్రతి పని విజయం సాధించే దిశగా ముందుకు సాగుతుంది. అలాగే సామాజిక జీవితం కూడా చాలా బాగుంటుంది. భాగస్వామ్య జీవితంలో సంబంధాలు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మానసిక సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాలు అందించబోతోంది.

ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా కలిసి రాబోతోంది. విద్యతో పాటు వృత్తిపరమైన జీవితంలో సానుకూలమైన ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. పాత వివాదాల నుంచి ఎంతో సులభంగా పరిష్కారం లభించబోతోంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం కాబోతున్నాయి. కుటుంబం నుంచి కూడా మంచి మద్దతు కూడా లభించబోతోంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. దీంతోపాటు ఈ సమయంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Also Read:  Mahashivratri 2026: మహా శివరాత్రి ఎప్పుడు..?.. ఉపవాసం, జాగరణ నియామలు ఏంటో తెలుసా..?

మకర రాశి 
మకర రాశి వారికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా.. ఈ సమయంలో ఎన్నో రకాల ఆదాయ వనరులు పొందుతారు. పాత ప్రణాళికలు ఆకస్మిక ధన లాభాలను తెచ్చిపెడతాయి. పనుల్లో కష్టపడటం వల్ల ప్రశంసలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో చాలా బాగుంటా. చిన్నచిన్న ఉద్రుక్తతలు వచ్చినప్పటికీ.. ఈ సమయం చాలా బాగుంటుంది. అంతేకాకుండా అవగాహన పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:  Mahashivratri 2026: మహా శివరాత్రి ఎప్పుడు..?.. ఉపవాసం, జాగరణ నియామలు ఏంటో తెలుసా..?

Also Read: Mahashivratri 2026: మహా శివరాత్రి ఎప్పుడు..?.. ఉపవాసం, జాగరణ నియామలు ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 15, 2026 05:08:38
Jagtial, Telangana:

Mahashivratri 2026 Special Story Telugu: ఈ మహాశివరాత్రి వేళ లోకమంతా హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమోగుతున్న సమయంలో జగిత్యాల జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్తన భక్తిని వినూత్నంగా చాటుకున్నారు.. మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచంలోనే ఎవరు ప్రయత్నించని రీతిలో.. ఓ చిన్న సూదిపై నాగుపాము పడగ నీడలో కొలువుదీరిన పరమశివుని విగ్రహాన్ని రూపొందించారు. ఇంత సూక్ష్మంగా ఆ స్వామి వారి విగ్రహం చెక్కడం ఇదే మొదటిసారి.. 

సాధారణంగా చాలామందికి సూది కంటికి సరిగ్గా కనిపించదు.. అలాంటిది అతను అదే సూది మనపై ఒక నాగుపాము పడగను విప్పుతున్నట్లు.. ఆ నీడలో శివయ్య ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న రూపం చాలా అద్భుతంగా చెక్కారు.. ఈ సూక్ష్మ విగ్రహాన్ని కేవలం సూది, నైలాన్ పెన్సిల్ రంగులను ఉపయోగించి తయారు చేసినట్లు ఆయన తెలిపారు.  ఎంతో కష్టపడి.. ఈ చిన్న విగ్రహాన్ని చెక్కినట్లు ఆయన తెలిపారు..

ఈ అద్భుతాన్ని తీర్చిదిద్దడానికి దయాకర్ సుమారు 10 గంటల పాటు కఠినంగా శ్రమించినట్లు తెలుస్తోంది.  అత్యంత ఏకాగ్రతతో కంటిపై ఒత్తిడి పడిన ఏమాత్రం లెక్కచేయకుండా.. అతను ఈ శివలింగ రూపాన్ని మలిచినట్లు  సమాచారం. లోకమంతా మహాశివరాత్రి సంబరాలు జరుపుకుంటున్న వేల.. నా ప్రత్యేకమైన కళ ద్వారా అందరికీ ఆ మహా శివుడి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ.. నాగుపాము నీడలో ఉన్న ఈ శివయ్యను ఇంత సూక్ష్మంగా రూపొందించడం ఇదే మొదటి సారి అంటూ.. గుర్రం దయాకర్ తెలిపారు.

గుర్రం దయాకర్ అద్భుతమైన కళాకారుడు.. తన ప్రతిభను గుర్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ప్రత్యేకమైన గౌరవం అందించింది. అంతేకాకుండా గౌరవ డాక్టరేట్ కూడా ఆయన అందుకున్నారు. సూక్ష్మ కళ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ.. ప్రతి పండగకు ఇలాంటి వినూత్న కళాఖండాలను సృష్టిస్తూ సమాజాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.. ఇలాంటి విగ్రహాలను ఇప్పటివరకు అతను వందల సంఖ్యలు చెక్కినట్లు తెలుస్తోంది.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 14, 2026 16:01:43
Nunna, Vijayawada, Andhra Pradesh:

School Holiday Tomorrow: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహాశివరాత్రి మరుసటి రోజును ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ (GAD) ఉత్తర్వులు జారీ చేసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు. ఈ నేపథ్యంలో మరుసటి రోజున విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. ఫిబ్రవరి 16, 2026 (సోమవారం) మహాశివరాత్రి తర్వాతి రోజున ఆప్షనల్ హాలిడే గా ప్రకటించారు. అంటే, సెలవుల జాబితా ప్రకారం అర్హత ఉన్న వారు ఈ సెలవును వాడుకోవచ్చు.

ఎందుకు ఈ నిర్ణయం?
సాధారణంగా మహాశివరాత్రి నాడు శివాలయాల్లో భక్తులు రాత్రంతా 'లింగోద్భవ కాల' పూజలు, జాగరణలు నిర్వహిస్తారు. రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల మరుసటి రోజున కార్యాలయాలకు లేదా విధులకు హాజరుకావడం ఉద్యోగులకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. భక్తులు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ వెసులుబాటు కల్పించింది.

సెలవుల క్యాలెండర్‌లో మార్పులు
ప్రభుత్వం ప్రతి ఏటా విడుదల చేసే సాధారణ సెలవుల, ఐచ్ఛిక సెలవుల (Optional Holidays) జాబితాలో భాగంగా ఈ అప్‌డేట్‌ను చేర్చారు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి (ఆదివారం) సందర్భంగా సాధారణ సెలవు ఉండగా..  ఫిబ్రవరి 16న శివరాత్రి తర్వాతి రోజు (సోమవారం) ఆప్షన్ హాలీడేని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఉత్తర్వులతో శివ భక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని, మరుసటి రోజున హాయిగా విశ్రాంతి పొందే అవకాశం కలిగింది. అయితే ఇది ఐచ్ఛిక సెలవు కాబట్టి, ఆయా కార్యాలయాల నిబంధనలకు లోబడి దీనిని వినియోగించుకోవాల్సి ఉంటుంది.

Also Read: Mahashivaratri 2026: మహాశివరాత్రి 2026..శుభ ముహూర్తాలు, పూజా సమయాలు, అభిషేకాలకు అనుకూల సమయం ఇదే!

Also Read: Gold Investment India: భారత్‌లో రూ.452 లక్షల కోట్ల పసిడి..ప్రపంచంలోనే అత్యధికంగా 'బంగారు'కొండలు ఇక్కడే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top