icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow28 Jul 2024, 10:42 am

బోనాల పండుగలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు

Karimnagar, Telangana:

కరీంనగర్, రామనగర, మార్కండేయ కాలనీలో మున్నూరుకాపు కులస్తులు నిర్వహించిన పోచమ్మ నాట్లు ఉత్సవంలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో మెరుగు స్వప్నశ్రీ, పిట్టల రవీందర్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నెల్లి నరేష్, పెద్దిగారి తిరుపతి, ఉప్పరి అజయ్, అల్వాల భరత్, కంపల్లి కీర్తికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

సూర్య, గురుల అద్భుత కూటమి.. జూలై 29 నుంచి ఈ 4 రాశుల వారికి బంపర్ జాక్‌పాట్!

Hyderabad, Telangana:

Sun-jupiter Conjunction In Cancer Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులతో పాటు వాటి కలయికలకు చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా నవగ్రహాలకు రాజైన సూర్యుడితో పాటు దేవగురువైన బృహస్పతి ఒకే రాశిలో కలయిక జరిపినప్పుడు మానవ జీవితాలు చాలా వరకు ప్రభావితమవుతాయి. జూలై 29, బుధవారం సాయంత్రం 5 సమయంలో సూర్యుడు, గురుడు 0 డిగ్రీల కోణంలో కలయిక జరపబోతున్నాడు. ముఖ్యంగా ఈ సమయం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా మారబోతోంది. 

మిత్ర గ్రహాలైన ఈ రెండు గ్రహాల అరుదైన కలయిక వల్ల ఒక శక్తివంతమైన రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ శుభ యోగం కారణంగా అన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు కనిపిస్తున్నప్పటికీ.. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి మాత్రం అద్భుతమైన కాలం ప్రారంభమవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఈ కాలంలో వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు సమాజంలో కీర్తి, ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌ఫాట్:
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ గ్రహాల కలయిక అత్యంత శుభఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో ఆనందంతో పాటు సానుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త ప్రణాళికలు లేదా సరికొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా భావించవచ్చు.. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ మోతాదులో ఈ సమయంలో ధన లాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనివల్ల జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి (Cancer) 
ఈ అరుదైన గ్రహాల కలయిక కారణంగా కర్కాటక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్టం పూర్తిగా పెరుగుతుంది. దీర్ఘకాలంగా వివిధ అడ్డంకుల వల్ల నిలిచిపోయిన పనులు ఇప్పుడు చాలా సులభంగా పూర్తవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్‌లో పెద్ద శుభవార్త తప్పకుండా వింటారు. అలాగే ఆదాయానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. ఈ రాజయోగ ప్రభావంతో భూమి, ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులను కొనుగోలు చేయాలనే మీ కల ఎట్టకేలకు సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయి..

మిథున రాశి (Gemini)
సూర్య-గురుల కలయిక కారణంగా మిథున రాశి వారి కుటుంబ, వృత్తిపరమైన జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో సుఖసంతోషాలు, మానసిక ప్రశాంతత ఒక్కసారిగా పెరుగుతాయి.. కార్యాలయంలో మీ గౌరవంతో పాటు గుర్తింపు రెట్టింపు అవుతుంది.. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపు (Salary Hike) లభించే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో చాలా కాలంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మనస్సులోని ఆందోళన సులభంగా తగ్గుతుంది.

సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి సూర్యతో పాటు గురు గ్రహాల సంయోగం కారణంగా కొత్త కొత్త విజయాలు కలుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన అత్యంత ముఖ్యమైన పనులు ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి.. కార్యాలయంలో కొత్త బాధ్యతలు లేదా ఉన్నత ఉద్యోగ అవకాశాలు కూడా సులభంగా లభిస్తాయి.. ఉన్నతాధికారుల నుంచి మీకు పూర్తి సపోర్ట్‌ కూడా లభిస్తుంది. ప్రేమ బంధాలలో మరిన్ని మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా.. మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం అద్భుతంగా పెరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తుకు సంబంధించిన వాటిల్లో పెద్ద నిర్ణయాలను తీసుకుని చాలా ధైర్యంగా ఉంటారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

శ్రావణం నుంచి కార్తీక మాసం వరకు శని తిరోగమనం.. ఈ 4 రాశుల వారికి కాసుల వర్షం!

Hyderabad, Telangana:

Saturn Retrograde 2026 Effect Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయదేవతగా, కర్మఫల ప్రదాతగా భావిస్తూ ఉంటారు. శని దేవుని గమనంలో వచ్చే మార్పులు అన్ని రాశుల వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా  ఉంటే జూలై 27న ఒక పెద్ద జ్యోతిష్య మార్పు జరగబోతోంది.. ఇదే రోజు శని దేవుడు మీన రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. అంటే శని దేవుడు రివర్స్ గేర్‌లో ప్రయాణించనున్నాడు.

డిసెంబర్ 11 వరకు శని దేవుడు ఇదే స్థితిలో కొనసాగుతాడు. జూలై 25 నుంచి నవంబర్ 20 వరకు ఇదే దశలో కొనసాగబోతున్నాడు. శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఉండే ఈ నాలుగు నెలల కాలంలో శని తిరోగమనం వల్ల ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అపారమైన అదృష్టం వరించబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా 4 రాశుల వారి కెరీర్, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితంలో ఊహించని లాభాలు కలగనున్నాయి.. అయితే, శని ప్రభావంతో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి (Gemini)
శని గ్రహం వక్రగతి కారణంగా మిథున రాశివారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.. అంతేకాకుండా కెరీర్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమవుతాయి.. కార్యాలయంలో మీ ప్రతిష్ట విపరీతంగా పెరుగుతుంది.. అయితే, అతివిశ్వాసం, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. విద్యార్థులకు, నిపుణులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి (Taurus)
శని వక్రీ కాలం వృషభ రాశి వారి ఆత్మవిశ్వాసాన్ని, ఆర్థిక స్థితిని ఎంతగానో బలోపేతం చేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్న వారికి సరికొత్త పురోగతి అవకాశాలు కూడా కలుగుతాయి.. దీర్ఘకాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి వేగం పుంజుకుంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి పూర్తి సపోర్ట్ లభిస్తుంది. అయితే, ప్రతికూల ఆలోచనలు కలిగిన వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. 

సింహ రాశి (Leo)
జూలై ప్రారంభం నుంచి సింహ రాశి వారికి చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడం ప్రారంభమవుతాయి.. దీనివల్ల మానసిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. కెరీర్‌లో కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా విపరీతంగా లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరిగినప్పటికీ.. కోపం, అనవసర వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది.. కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ వైద్యుల సలహాలు పాటిచాల్సి ఉంటుంది.

ధనుస్సు రాశి (Sagittarius)
ఈ కాలం ధనుస్సు రాశి వారి కెరీర్, ఆర్థిక విషయాలలో సానుకూల మార్పులు ప్రారంభమవుతాయి.. ఉద్యోగ, వ్యాపారాలలో సరికొత్త లాభదాయక అవకాశాలు తలుపు తడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. కఠిన శ్రమ, క్రమశిక్షణ వల్ల అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

సూర్య-బుధుల అరుదైన కలయిక.. ఈ 5 రాశుల వారికి బంపర్ జాక్‌పాట్, అపార ధనలాభం!

Hyderabad, Telangana:

Sun Mercury Conjunction July 2026 Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలతో పాటు వాటి కలయికలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి.. ఈ సమయంలో జూలై 13న ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన ఖగోళ ఘట్టం జరిగింది.. బుద్ధి కారకుడైన బుధుడు, ఆత్మ కారకుడైన సూర్య భగవానుడు ఒకే రాశిలో.. ఒకే డిగ్రీలో కోణంలో కలయిక జరిగింది.. రెండు మిత్ర గ్రహాలు ఇలా ఒకే డిగ్రీలో కలయిక జరగడం వల్ల అత్యంత శుభప్రదమైన దృష్టి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. 0 డిగ్రీల కోణంలో ఈ రెండు గ్రహాల కలయిక ఒక సరికొత్త ప్రభావాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.. ఇది కొన్ని రాశులవారికి పాత సమస్యల నుంచి విముక్తి కలిగించి.. సరికొత్త సానుకూల శక్తిని నింపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ఈ అద్భుత గ్రహాల కలయిక వల్ల ముఖ్యంగా 5 రాశుల వారికి అపారమైన విజయాలు కలగడమే కాకుండా.. సమాజంలో గౌరవం, ఆకస్మిక ధనలాభం కలుగబోతున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్:
మిథున రాశి (Gemini)
బుధుడి అనుగ్రహం వల్ల మిథున రాశివారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే అత్యంత ప్రయోజనకరంగా కూడా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి నిర్ణయాత్మక శక్తులు అద్భుతంగా పెరుగుతాయి.. చాలా కాలంగా నిలిచిపోయిన వ్యాపార ఒప్పందాలు అకస్మాత్తుగా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమమవుతాయి.. ఇవే కాకుండా కమ్యునికేషన్‌ పరంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ సమయం ఒక వరం లాంటిదని భావించవచ్చు. 0 డిగ్రీల వద్ద ఏర్పడిన ఈ గ్రహాల కలయిక వృత్తి జీవితంలో సరికొత్త, ఆకర్షణీయమైన అవకాశాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చాలా కాలంగా ఉద్యోగం మారాలని చూస్తున్న వారికి లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రభుత్వ రంగంతో ముడిపడి ఉన్న వారికి విశేష లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సమాజంలో మీ ప్రభావం, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి..

తులా రాశి (Libra)
ఈ గ్రహాల అనుకూల కలయిక తులా రాశి వారికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సుదీర్ఘకాలంగా వేధిస్తున్న పాత సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. జీవితంలో ఒక మంచి స్థిరత్వం ఏర్పడబోతోంది.. పెట్టుబడుల నుంచి ఆశించిన దానికంటే మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా లభిస్తాయి.. ఉద్యోగ రంగంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. పెద్ద బాధ్యత లేదా గౌరవప్రదమైన పదవి మిమ్మల్ని వరించే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

సింహ రాశి (Leo)
సింహ రాశి అధిపతి అయిన సూర్యుడు 0 డిగ్రీల వద్ద బుధుడితో కలవడం వల్ల వీరి శక్తి రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభించబోతోంది.. పిత్రార్జిత ఆస్తి ద్వారా భారీ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కోర్టు లేదా చట్టపరమైన వ్యవహారాల్లో ఏవైనా సమస్యలు ఉంటే.. తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక స్థితి గతంలో కంటే చాలా బలంగా మారుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

నేడు భీమవరం, కిర్లంపూడికి వైఎస్ జగన్.. ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళి, ఆక్వా రైతులతో భేటీ!

Hyderabad, Telangana:

YS Jagan Tour: ఏపీ మాజీ సీఎం, వైఎస్ఆర్సీపి అధ్యక్షుడు వైయస్ జగన్ ఈరోజు భీమవరం, కిర్లంపూడి పర్యటనల కోసం బయలుదేరుతున్నారు. ప్రధానంగా కిర్లంపూడిలో మరణించిన ముద్రగడ పద్మనాభం గారి భౌతికకాయానికి ఆయన నివాళులు అర్పించనున్నారు. నిన్ననే కాపు ఉద్యమ నేత కన్నుమూసిన వార్త తెలియడంతో, రాజకీయ ప్రముఖులు, పలువురు నేతలు ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ నేరుగా వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ముందే ఆయన భీమవరంలోని ఆక్వా రైతులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆక్వా రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, పెరిగిన ఫీడ్ ధరలు, తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించకపోవడం వంటి అంశాలపై ఆయన రైతులతో నేరుగా చర్చించనున్నారు.

అనంతరం, మధ్యాహ్నం సుమారు ఒకటిన్నర గంటల సమయంలో భీమవరం నుండి హెలికాప్టర్ ద్వారా జగ్గంపేట చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వెళ్లి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రముఖ కాపు ఉద్యమ నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన అనంతరం, తిరిగి తాడేపల్లికి బయలుదేరుతారు.

ఈ రెండు ముఖ్యమైన పర్యటనల నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుండి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. భీమవరం చేరుకున్న తర్వాత, అక్కడ బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సభా వేదిక వద్ద ఆక్వా రైతులతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలను వింటాక కిర్లంపూడికి బయలుదేరుతారు. రైతుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపి చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. ఆక్వా రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు, కావున ఈ పర్యటన ద్వారా బాధిత రైతులతో నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారు.

Also Read: విశాఖ బోటు మత్య్సకారులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ఫ్లాప్‌: వైఎస్‌ జగన్‌

Also Read: విశాఖ తీరంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో వణకిన నగరం!

మరోవైపు, నిన్న మరణించిన కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణించిన వెంటనే, ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరిబాబుకు ఫోన్ చేసి ప్రత్యేకంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ధైర్యంగా ఉండాలని కోరుతూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం గారు చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, చిరస్మరణీయమైనవని ఆయన కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులు ఈ బాధను తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

విదేశీ గడ్డపై భారత్‌కు తొలి విజయం.. ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన

England:

IND vs ENG 1st One Day Highlights: విదేశీ పర్యటనలో భారత క్రికెట్‌ జట్టుకు వరుసగా ఎదురవుతున్న వైఫల్యాల నుంచి బ్రేక్‌ లభించింది. విదేశీ పర్యటనలో భారత జట్టు అద్భుతం చేసి తొలి విజయాన్ని అందుకుంది. ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లో వాషౌట్‌ అయిన టీమిండియా వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌పై భారీ విజయాన్ని సాధించి ఊరట పొందింది. జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న ఆటగాళ్లు సత్తా చాటి విమర్శకులకు చెక్‌ పెట్టారు. ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భారత్‌ గెలిచింది.

మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. 259 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 28 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అవకాశం చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ గిల్‌ 51 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌ అద్భుత ప్రదర్శనకు తోడు అక్షర్‌ పటేల్‌ చక్కగా సహకరించడంతో సునాయాసంగా మ్యాచ్‌ భారత్‌ వశమైంది. 75 బంతులు ఆడిన గిల్‌ 80 పరుగులు చేసి కాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్‌ హర్ట్‌ అయి మైదానం వీడాడు. అక్షర్‌ పటేల్‌ 52 బంతుల్లో 57 పరుగులతో అర్ధ శతకం చేసి మ్యాచ్‌ను ముగించాడు. చాలా రోజుల తర్వాత వాషింగ్టన్‌ సుందర్‌ అర్ధ శతకం నమోదు చేశాడు. 63 బంతుల్లో 52 పరుగులు చేయగా.. శ్రేయస్‌ అయ్యర్‌ 35 పరుగులతో రాణించాడు. అక్షర్‌, సుందర్‌ నిలకడగా ఆడుతూ పరుగులు తీస్తూ 102 పరుగుల చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ (11), విరాట్‌ కోహ్లీ (5), కేఎల్‌ రాహుల్‌ (1) తక్కువ పరుగులతో తీవ్ర నిరాశపర్చారు. లక్ష్యాన్ని కాపాడేందుకు ఇంగ్లాండ్‌ బౌలర్లు పోరాడినా చేదు ఫలితం దక్కింది. జోఫ్రా ఆర్చర్‌, జోష్‌ టంగ్‌, సామ్‌ కరన్‌ తలా ఒక్కో వికెట్‌ తీశారు.

అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 47.5 ఓవర్లలో 258 పరుగులకు కుప్పకూలింది. టీ20 సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన ఉత్సాహంతో ఆడిన ఇంగ్లండ్‌ బోల్తా పడింది. జో రూట్, లియామ్ డాసున్ అర్ధశతకాలు పూర్తి చేశారు. బెన్ డకెట్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. జాకబ్ బెతెల్, విల్ జాక్స్, ఆర్చర్ తక్కువ స్కోరు చేశారు. హ్యారీ బ్రూక్ (1), జోస్ బట్లర్ (5), సామ్ కరన్ (0) పూర్తిగా విఫలమయ్యారు. టీ20 సిరీస్‌ కోల్పోయినప్పుడు బాధపడిన భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో విజృంభించారు. అక్షర్ పటేల్ 4 వికెట్లతో అదరగొట్టగా.. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్‌ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. బుమ్రా, దూబే చెరో వికెట్ తీశారు.

0
0
Report

ముద్రగడ పద్మనాభం మృతికి తెలంగాణ ప్రముఖులు దిగ్భ్రాంతి.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ రావు సంతాపం

Baddipadaga, Telangana:

Mudragada Padmanabham: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మంత్రిగా పనిచేసిన ఏపీలో సామాజిక ఉద్యమాలు నడిపిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతితో తెలంగాణ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా.. ఎంపీగా.. రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ముద్రగడ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రితోపాటు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ముద్రగడ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.

కేసీఆర్ సంతాపం
ముద్రగడ పద్మనాభం మరణంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. నమ్మిన సిద్దాంతం కోసం రాజీలేని పోరాటం చేసిన నేత ముద్రగడ అని కొనియాడారు. ముద్రగడ మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరణం తీరని లోటు. పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. మంత్రిగా పనిచేసిన ముద్రగడ గొప్ప ప్రజా నాయకుడు. ముఖ్యంగా కాపు వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి గొప్పది' అని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ కొనియాడారు.

'భారత  రాజ్యాంగం కల్పించిన  హక్కులను కాపులు, అనుబంధ కులాలకు అందించాలనే తపనతో.. తాను నమ్మిన సిద్దాంతం కోసం జీవితకాలం రాజీలేని పోరాటం చేసిన ప్రత్యామ్న్యాయ రాజకీయ వేత్త ముద్రగడ పద్మనాభం. వారి మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటు. ఈ సమయంలో శోకతప్తులైన కుటుంబసభ్యులు, ముద్రగడ అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

కేటీఆర్‌ సంతాప ప్రకటన
'కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన ఆయన, కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం పోరాడిన నేతగా నిలిచిపోతారు. ముద్రగడ పద్మనాభం మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, ముఖ్యంగా సామాజిక ఉద్యమాలకు తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నా' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంతాప ప్రకటన విడుదల చేశారు.

హరీశ్‌ రావు సంతాపం
'మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా. ప్రజా జీవితంలో ఆయన తనదైన ముద్ర వేసి.. కాపు సామాజిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఆయన రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయమైనది. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా'
- హరీశ్‌ రావు, బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి

తెలంగాణ సీఎం సంతాపం
'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణించడం తీవ్ర విచారం. శాసనసభ్యుడిగా, లోక్‌సభ సభ్యుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నా' అని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటన చేశారు.

డిప్యూటీ సీఎం ప్రకటన
'ముద్రగడ మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. ప్రజా జీవితంలో ముద్రగడ పాత్ర చిరస్మరణీయం. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతర పోరాటం చేశారు. సామాజిక న్యాయం కోసం ముద్రగడ కృషి ఎప్పటికీ గుర్తుంటుంది. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి. ముద్రగడ పోరాట స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా'
- భట్టి విక్రమార్క, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి

'కాపు ఉద్యమ నాయకులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'

- కవిత, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు

0
0
Report

ముద్రగడ పద్మనాభం మృతికి చంద్రబాబు, జగన్‌, పవన్ కల్యాణ్ సంతాపం

Nuzendla, Andhra Pradesh:

Mudragada Padmanabham: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతితో ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన పద్మనాభం ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌, పవన్‌ కల్యాణ్‌, హరీశ్‌ రావు, కేటీఆర్‌, కవిత తదితరులు సంతాపం ప్రకటించారు.

సీఎం చంద్రబాబు సంతాపం
'మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్త విచారం కలిగించింది. పద్మనాభం కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా' అని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు.

తీవ్రంగా కలచివేసింది: వైఎస్‌ జగన్‌
'మా పార్టీ సీనియర్‌ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభం మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం' అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 'ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు' అని వైఎస్సార్‌సీపీ అధినేత గుర్తుచేశారు.

'ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి.. వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడేతత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం' అని ముద్రగడ పద్మనాభం సేవలను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు. ముద్రగడ మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు అని ప్రకటించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్టు చేశారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముద్రగడ ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు.

కుటుంబానికి వైఎస్‌ జగన్‌ ఫోన్‌
ముద్రగడ పద్మనాభం మృతితో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే పద్మనాభం కుమారుడు గిరిబాబుకు ఫోన్‌లో పరామర్శించారు. ముద్రగడ మరణం తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని పద్మనాభం కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రజల కోసం ముద్రగడ సేవలు చిరస్మరణీయమని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు.

పవన్‌ కల్యాణ్‌ దిగ్భ్రాంతి
'మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నా. ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. 1978లో తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికై ప్రజా క్షేత్రంలో ఉన్న ఆయన శాసనసభకు, ఒకసారి కాకినాడ నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ముద్రగడ పద్మనాభం సతీమణికి, కుమారులకు, కుమార్తెకు, ఇతర కుటుంబసభ్యులకు, వారి మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా' అని జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సంతాపం తెలిపారు.

వైఎస్ షర్మిల సంతాప ప్రకటన
'కాపు ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. కాపుల హక్కులకోసం జీవితాంతం పోరాడిన వ్యక్తిగా, ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా పద్మనాభం రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. పద్మనాభం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా' అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటన చేశారు.

0
0
Report
Advertisement

Singarayakonda Suicide: రైలు కింద కుటుంబం మొత్తం ఆత్మహత్య..బావ హత్య కేసులో నిందితుడు దారుణం..అసలు నిజం ఇదే?

Singarayakonda, Andhra Pradesh:

Singarayakonda Suicide News: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గూడ్స్ రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఆత్మహత్యల వెనుక ఒక ఘోరమైన హత్య, కోట్ల రూపాయల ఆస్తి వివాదం, పోలీసుల భారీ అవినీతి నెట్‌వర్క్ దాగి ఉన్నట్లు విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన బావను పథకం ప్రకారం హత్య చేయించిన నిందితుడు హరికృష్ణ, పోలీసుల విచారణకు భయపడి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆస్తి వివాదం.. నమ్మించి గొంతు కోసిన బావమరిది
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన శ్రీహరి వ్యవసాయాధికారిగా విధులు నిర్వహించేవారు. ఆయన తన బావమరిది హరికృష్ణను అమితంగా నమ్మి, తనకున్న కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను అతని పేరున రాసిచ్చారు. కొంతకాలం తర్వాత శ్రీహరి ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరడంతో, హరికృష్ణ అతడిని శాశ్వతంగా అడ్డుతొలగించుకోవాలని క్రూరమైన పథకం వేశాడు.

ఇంజెక్షన్ ఇచ్చి దారుణ హత్య
బావను హతమార్చడానికి హరికృష్ణ ఇద్దరు వ్యక్తులకు సుపారీ (డబ్బులు) ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నాడు. పథకం ప్రకారం.. జూన్ 15న శ్రీహరిని కారులో పెంచలకోనకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత తిరిగి వస్తున్న క్రమంలో ముందుగానే దారిలో కాపు కాసిన సుపారీ గ్యాంగ్ కారును అడ్డుకుంది. శ్రీహరికి బలవంతంగా కుక్కలను చంపే ఇంజెక్షన్లు ఇచ్చి దారుణంగా ప్రాణాలు తీశారు. అనంతరం శ్రీహరి గుండెపోటుతో చనిపోయాడంటూ హరికృష్ణ నమ్మించే ప్రయత్నం చేశాడు.

వెలుగులోకి రూ.75 లక్షల అవినీతి డీల్
మృతుడు శ్రీహరి శరీరంపై స్పష్టమైన గాయాలు ఉన్నప్పటికీ, స్థానిక పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారు. హరికృష్ణ ఈ హత్యను పూర్తిగా పక్కదారి పట్టించేందుకు ఏకంగా రూ.75 లక్షల భారీ డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. ఒక పోలీస్ ఉన్నతాధికారి కేసు నమోదు చేయకుండా ఉండేందుకు రూ.25 లక్షలు లంచంగా తీసుకున్నారు. మిగిలిన రూ.50 లక్షలను కింది స్థాయి పోలీసులకు, స్థానిక రాజకీయ నాయకులకు, మధ్యవర్తులకు హరికృష్ణ పంచిపెట్టాడు.

23 మంది పోలీసులపై వేటు
భర్త మరణంపై అనుమానం వచ్చిన శ్రీహరి భార్య లావణ్య, జూలై 6న జిల్లా ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు రట్టయింది. పోలీసుల అవినీతి బట్టబయలు కావడంతో ఎస్పీ తీవ్ర చర్యలు తీసుకున్నారు. కేసును తప్పుదోవ పట్టించినందుకు స్థానిక సీఐతో పాటు స్టేషన్‌లో ఉన్న 23 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. సీఐను వీఆర్‌కు (Vacancy Reserve) పంపుతూ, అతడిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.

భయంతో కుటుంబంతో సహా బలవన్మరణం
ఎస్పీ జోక్యంతో కేసు దర్యాప్తు తీవ్రమవ్వడం, సుపారీ ముఠా పట్టుబడటంతో ప్రధాన నిందితుడు హరికృష్ణ పరారయ్యాడు. చట్టం నుంచి తప్పించుకోలేనని భావించిన అతను, తీవ్ర మనస్తాపంతో మంగళవారం సింగరాయకొండలో తన భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక ఆస్తి ఆశ ముగ్గురి ప్రాణాలను బలిగొనడమే కాక, చివరకు నిందితుడి కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేసి అంతమొందించింది.

Also Read: Metro Lovers Kissing: మెట్రో రైలులో లవర్స్ ముద్దులాట..బూతులు తిడుతున్న ప్రయాణికులు!

Also Read: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్..తారక్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Mudragada Political Journey: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..ఆయన రాజకీయ నేపథ్యం ఇదే!

Hyderabad, Telangana:

Mudragada Padmanabham Political Journey: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం (78) కన్నుమూశారు. గత నెల రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించారు. కుటుంబసభ్యులతో పాటు ఆయన సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం నాటికి ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

జననం, కుటుంబ నేపథ్యం
ముద్రగడ పద్మనాభం 1948 మార్చి 7న తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుత కాకినాడ జిల్లా) కిర్లంపూడిలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్న వయసు నుంచే ప్రజా జీవితం వైపు ఆకర్షితులైన ఆయన, ప్రజా సేవలోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

రాజకీయ ప్రస్థానం, నిర్వహించిన పదవులు
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముద్రగడ, అతి తక్కువ కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. 1978లో ఆయన మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికై ప్రజా సమస్యలపై గళం విప్పారు. ఎమ్మెల్యేగా పనిచేస్తూనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా (రాష్ట్ర స్థాయి బాధ్యతలు) కీలక పదవులను నిర్వహించారు.

ఆయన రాజకీయ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. కాంగ్రెస్ నుంచి ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీలోకి, ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్‌లోకి మారారు. అనంతరం ప్రధాన రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ కాపు ఉద్యమమే శ్వాసగా బతికారు.

కాపు రిజర్వేషన్ ఉద్యమం, తుని ఘటన..
ముద్రగడ పద్మనాభం పేరు వినబడగానే కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే పోరాటమే గుర్తుకొస్తుంది. కాపు సామాజిక వర్గ సమస్యలపై ఆయన ఒక బలమైన గొంతుకగా నిలిచారు. అయితే 2016లో తునిలో ఏర్పాటు చేసిన కాపు రిజర్వేషన్ల కోసం బహిరంగ సభ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టడం, పోలీస్ స్టేషన్‌పై దాడి వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటన అనంతరం ముద్రగడ చేపట్టిన ఆమరణ దీక్ష, ఆయన అరెస్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరిక
2024 అసెంబ్లీ ఎన్నికల ముందు ముద్రగడ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)లో చేరిన ఆయన, తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసి రాజకీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించారు.

వారసత్వం, గుర్తింపు
ముద్రగడ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌లో ప్రారంభమయ్యి.. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి, మళ్లీ కాంగ్రెస్ చేరి మళ్లీ ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్ర ఉద్యమానికి నాయకుడిగా ఉన్నారు. చివరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతగా చేరారు. ఏ పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉండకుండా, తన డిమాండ్ల ఆధారంగానే రాజకీయ వైఖరిని మార్చుకునే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆయన కుమారుడు ముద్రగడ గిరి కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. కాపు ఉద్యమ సమయంలో కుటుంబ సభ్యులంతా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. కాపు ఉద్యమానికి ప్రతీకగా, తూర్పు గోదావరి రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నేతగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం చరిత్రలో నిలిచిపోతారు.

Also Read: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్..తారక్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన!

Also Read: "పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే 'కిల్లర్'.." ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

కొండగట్టు ఆలయంలో నిండు అమావాస్య రోజు నాగుపాము మృతి.. దేనికి సంకేతం?

Siddipet, Telangana:

Kondagattu Temple: నిండు అమావాస్య.. దీనికితోడు తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం. అమావాస్య రోజు ప్రముఖ ఆలయంలో నాగుపాము హల్‌చల్‌ చేసింది. కొద్దిసేపు హల్‌చల్‌ చేసిన నాగుపాము అకస్మాత్తుగానే చనిపోయింది. ఎలాంటి గాయం.. అనారోగ్యం లేకుండానే పాము ఆలయ ఆవరణలో మృతిచెందడం వైరల్‌గా మారింది. ఈ సంఘటన తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. అమావాస్య రోజు నాగుపాము మృతి చెందడం కలకలం రేపింది. 

జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం అమావాస్య రోజున నాగుపాము ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన నాగుపామును భక్తులు ఆసక్తిగా తిలకించారు. అక్కడ ప్రత్యక్షమైన నాగుపాముకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య రోజున స్వామివారి సన్నిధిలో నాగుపాము దర్శనం ఇవ్వడాన్ని భక్తులు విశేషంగా భావించారు.

భక్తులు ఆసక్తిగా గమనిస్తున్న సమయంలోనే హఠాత్తుగా నాగుపాము చనిపోయింది. కొద్దిసేపటికే ఎలాంటి గాయాలు లేకుండా, ఎవరూ హాని చేయకపోయినా నాగుపాము అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపోయింది. ఇది భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పాము ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆలయ పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన యాదృచ్చికంగా జరిగిందా, లేక ఏదైనా సంకేతమా అనే కోణంలో భక్తులు చర్చించుకుంటున్నారు. అమావాస్య రోజున జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వాస్తవంగా అమావాస్యను ప్రతికూలంగా భావిస్తుంటారు. ఆ రోజు చెడు జరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. నిండు అమావాస్య రోజు ఇలా నాగుపాము ప్రముఖ పుణ్యక్షేత్రంలో చనిపోవడం వెనుకాల ఏమై ఉంటుందా? అని భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటిది ఏమీ లేదని.. చెడు సంకేతం అలాంటిది ఏమీ లేదని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన నాగుపాము భక్తుల మధ్యకు రావడంతో ఎవరైనా దాడి చేయడంతో పాము మరణించి ఉంటుందని చెబుతున్నారు. దీనికి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు.

0
0
Report
Advertisement

అనారోగ్యంతో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూత

Kirlampudi, Andhra Pradesh:

Mudragada Padmanabham: కాపు సామాజికవర్గ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ పద్మనాభం కన్నుమూశారు. ఆయన మృతితో కాపు సామాజికవర్గం పెద్ద దిక్కును కోల్పోయింది. పద్మనాభం మృతికి సీఎం చంద్రబాబుతోపాటు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభం మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నెల రోజులుగా హైదరాబాద్‌లో కిడ్నీలకు సంబంధించి చికిత్స పొందారు. క్యాన్సర్ బారిన కూడా పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బుధవారం మృతదేహాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ముద్రగడ పద్మనాభ రెడ్ది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన కాపు సంఘం నాయకుడు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2024 వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమయంలో అకస్మాత్తుగా 2024 మార్చి 16వ తేదీన వైఎస్సార్‌సీపీలో చేరాడు.

ప్రముఖుల సంతాపం
ముద్రగడ పద్మనాభవం మృతితో ఏపీలోని ప్రధాన సామాజికవర్గమైన కాపు వర్గం పెద్ద దిక్కును కోల్పోయింది. కాపులకు ప్రతీకగా నిలిచిన ముద్రగడ పద్మనాభం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు నడిపించాడు. కాపులకు సంబంధించిన డిమాండ్లు, సమస్యలపై తీవ్ర పోరాటం చేశారు.

పద్మనాభం తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా 1962, 67 ఎన్నికల్లో విజయం సాధించారు. 1977లో తండ్రి హఠాన్మరణం పొందడంతో 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం రెడ్డి జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

కాపు ఉద్యమం
కాపుల సామాజికవర్గానికి ముద్రగడ పద్మనాభం కేంద్రంగా నిలుస్తున్నారు. 1994లో కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. 2016 జనవరి 31 నాడు తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభతో కాపులకు సంబంధించిన ప్రధాన డిమాండ్ల సాధనకు పోరాటం చేశారు. రైలు రోకో హింసాత్మకంగా మారింది. 

పిఠాపురంలో హోరాహోరీ
కాపులకు ప్రతినిధిగా ఉన్న ముద్రగడ పద్మనాభం 2024 ఎన్నికల్లో హల్‌చల్‌ చేశారు. ఆ ఎన్నికల ప్రచార సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురంలో ఓడిస్తానని సవాల్‌ చేశారు. ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ గెలవడంతో చేసిన మాట ప్రకారం కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు.

0
0
Report

Nepal Elephant Attack: పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి మరీ దాడి.. మ్యాటర్ ఏమిటంటే..?

Hyderabad, Telangana:

Dhurbe Elephant attack on same nepali family: సాధారణంగా మనం తరచుగా పాములు పగబడుతాయని వింటు ఉంటాం. దానికి ఎవరైన హనీ తలపెట్టిన లేదా, తోక తోక్కిన కూడా కోపంతో ఆ పనిచేసి వారిపై కాటు వేస్తాయి. కొన్నిసార్లు ఎన్ని రోజులైన కూడా పాములు పగ బడతాయని కొంత మంది నమ్ముతుంటారు. అయితే కొన్నిసార్లు ఇతర జంతువులు సైతం తమ పిల్లలకు అపకారం తలపెడితే దాడులు చేస్తాయి. మరీ నేపాల్ లో జరిగిన ఒక ఘటన స్థానికంగా అందరిని ఆశ్చర్యంకు గురిచేస్తుంది. 

నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో 'ధ్రుబే' అనే ఏనుగు సంచరిస్తుంది.  ఈ ఏనుగు అక్కడ నివసించే వారి మీద దాడి చేసి వారిని పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలో  2012 డిసెంబర్‌లో మాడి అనే పట్టణంలో ధ్రుబే ఏనుగు దాడి చేయడంతో శనిచర తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత నుంచి శనిచర ఈ ఏనుగు ప్రమాదం నుంచి బైటపడేందుకు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, రాప్తి నది దాటి దాదాపు 9 మైళ్ల దూరంలోని జగత్‌పూర్‌కు చేరుకున్నారు.

ఇంత దూరం వస్తే ఆ 'ధ్రుబే' ఏనుగు తమను ఏమిచేయదని భావించారు . కానీ వారు అనుకున్నదానికి రివర్స్ లో జరిగింది. 'ధ్రుబే' ఏనుగు దాదాపు.. 14 సంవత్సరాల తర్వాత, అదే ధ్రుబే ఏనుగు వాసన పసిగట్టి ... జగత్‌పూర్‌లోని శనిచర ఇంటిపై దాడి చేసింది. అతని 25 ఏళ్ల కోడలు ఆషికా బోటేను, 4 ఏళ్ల మనవడు భరత్ బోటేను అతి కిరాతకంగా కాళ్లతొ తొక్కి చంపింది. నార్మల్ గా ఈ ఏనుగు వారిపై ఎందుకంత పగను పెంచుకుందో మాత్రం విషయం బైటపడలేదు.  

'ధ్రుబే' అత్యంత ప్రమాద కర ఏనుగు అని  2010 నుంచి ఇప్పటివరకు ఈ ఒక్క ఏనుగే 25 మందిని చంపినట్లు చిత్వాన్ నేషనల్ పార్క్ అధికారులు వెల్లడించారు.  ఈ ఘటనతో అసలు ఆ ఏనుగు అక్కడి వారిని ఎందుకంత టార్గెట్ చేసుకుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Read more: Agra Ice shivling in Fridge: వావ్ అద్భుతం.. ఫ్రిజ్‌లో అమర్ నాథ్‌ లింగంలా ఏర్పడిన మంచు ప్రతిరూపం.. వీడియో వైరల్..

మరోవైపు  శనిచర అక్కడి నుంచి మరో ప్రాంతంకు వెళ్లాలని స్థానికులు సూచించారు.  ఇక ఫారెస్ట్ అధికారులు..  ధ్రుబే కదలికలను పర్యవేక్షించడానికి 2016 నుంచి  దానికి ట్రాకింగ్ కాలర్ కూడా అమర్చారు. 2020, 2023లో ఆ కాలర్‌ను మార్చినప్పటికీ, దానిని పూర్తిగా నియంత్రించలేకపోయారు. ఈ క్రమంలో ఏనుగు కూడా పగబడుతుందా అని జనాలు తలలు పట్టుకుంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report

ధర్మపురిలో వెలిసిన నరసింహ స్వామి.. నదిలో విగ్రహాన్ని చూసేందుకు పోటెత్తిన భక్తులు..

Hyderabad, Telangana:

Dharmapuri Latest News: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి గోదావరి నది తీరంలో పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహం లభ్యమైంది. నదిలో లభించిన ఈ దివ్య మంగళ విగ్రహాన్ని చూసేందుకు భక్తులతో పాటు స్థానికులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అస్సలు ఈ విగ్రహం ఎక్కడిది? ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చింది.? మొదట ఎవరు చూశారు? దీనికి సంబంధించని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇసుక తిన్నెల్లో లక్ష్మీనరసింహస్వామి..
గోదావరి నది దిగువ ప్రాంతంలో నిత్యం చేపల వేట సాగించే.. స్థానిక జాలర్లకు ఈ విగ్రహం తొలుత కనిపించింది. నదిలో నీటి మట్టం గణనీయంగా తగ్గడంతో.. ఇసుక కింద ఏదో విగ్రహం ఉన్నట్లు వారు గమనించారు. దగ్గరికి వెళ్లి ఇసుకను తొలగించి చూడగా.. సుమారు మూడు అడుగుల ఎత్తు ఉన్న పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహం బయటపడింది. జాలర్లు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ విగ్రహాన్ని నది నుంచి సురక్షితంగా బయటకు తీసి.. నదీ తీరానికి చేర్చారు.

వరద ఉధృతికి కొట్టుకొచ్చిందా? 
ఈ పురాతన విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందనే అంశంపై స్థానికంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోందని సమాచారం. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు.. గోదావరి నది ఉధృతంగా ప్రవహించిన సమయంలో ఏదైనా ఆలయం నుంచి ఈ విగ్రహం కొట్టుకువచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. నదిలో వరద నీరు తగ్గి.. ఇసుక మేటలు వేయడంతో ఈ విగ్రహం బయటపడిందని అంచనా తెలుస్తోంది. అయితే, శతాబ్దాల చరిత్ర కలిగిన ధర్మపురి క్షేత్రంలోనే ఈ విగ్రహం లభించడం వెనుక ఏదో దైవ సంకల్పం ఉందంటూ భక్తులు బలంగా నమ్ముతున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

తులసి మాలలతో ప్రత్యేక పూజలు.. 
విగ్రహం బయటపడిన వార్త వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరి తీరానికి చేరుకున్నారు. స్వామివారి విగ్రహానికి పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి.. తులసి మాలలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసింహ నామస్మరణతో గోదావరి తీరం మార్మోగిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించిన్నట్లు తెలుస్తోంది. దీని వెనక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని అంచనా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement
Advertisement
Back to top