icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow28 Jul 2024, 10:42 am

బోనాల పండుగలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు

Karimnagar, Telangana:

కరీంనగర్, రామనగర, మార్కండేయ కాలనీలో మున్నూరుకాపు కులస్తులు నిర్వహించిన పోచమ్మ నాట్లు ఉత్సవంలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో మెరుగు స్వప్నశ్రీ, పిట్టల రవీందర్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నెల్లి నరేష్, పెద్దిగారి తిరుపతి, ఉప్పరి అజయ్, అల్వాల భరత్, కంపల్లి కీర్తికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Dharmendra Pradhan: ప్రజా ఉద్యమానికి ఎవరైనా తలొగ్గాల్సిందే.. మోదీపై 'బొద్దింకల' విజయం

New Delhi, Delhi:

Dharmendra Pradhan Resignation: నీట్‌ పేపర్‌ లీక్‌ అంశం భారతదేశాన్ని ఒకతాటిపైకి తెచ్చింది. రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించే హక్కు.. పోరాడే హక్కుతో విద్యార్థులు మొక్కవోని సంకల్పంతో పోరాడారు. నీట్‌ పేపర్‌ లీక్‌తో అమాయకులైన విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. లోపభూయిష్టమైన పరీక్ష విధానంతో లక్షలాది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా.. దానిపై విద్యార్థులు ఉద్యమించారు. న్యాయస్థానంలో బొద్దింకలుగా అవమానపడిన విద్యార్థులే ఇప్పుడు భారత ప్రభుత్వాన్ని కదిలించారు. ఢిల్లీ పీఠాలను కదిలించి గొప్ప విజయం సాధించారు. కొన్ని నెలలుగా సాగుతున్న పోరాటానికి.. కొన్ని వారాలుగా విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. విద్యార్థులు చేసిన ప్రధాన డిమాండ్‌ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా. ఆయన రాజీనామా చేయడంతో విద్యార్థులు గెలిచారు. ఇది ఒక్క విద్యార్థుల విజయం కాదు ప్రజాస్వామ్య భారతదేశం గెలుపు. అన్యాయంపై బాధితులు సాధించిన విజయం ఇది.

కొన్ని వారాల విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఎట్టకేలకు రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ లేఖ విడుదల చేశారు. ఆ లేఖను ప్రధానమంత్రికి పంపినట్లు ఎక్స్‌ వేదికగా ప్రకటించడంతో విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌పై దేశ యువత కొన్ని నెలలుగా తీవ్ర పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో విద్యార్థుల పోరాటం తీవ్ర రూపం దాల్చింది.

అలుపెరగని పోరాటం
అనంతరం కాక్రోచ్‌ జనతా పార్టీ జంతర్‌ మంతర్‌ వద్ద కొన్ని వారాలుగా అలుపెరగని పోరాటం చేసింది. లాఠీచార్జ్‌ చేసినా.. బాష్పవాయువు ప్రయోగించినా.. కేసులు పెడతామని హెచ్చరించినా.. పాస్‌పోర్టులు రద్దు చేస్తామని ప్రకటించినా.. అత్యంత ప్రమాదకర వస్తువులు వాడి భద్రతా బలగాలు బెదిరింపులకు దిగినా విద్యార్థులు వెనకడుగు వేయలేదు. విద్యార్థుల పోరాటానికి యావత్‌ భారతదేశం కదిలివచ్చింది. ఢిల్లీలో ఆందోళనలు దేశంలోని ప్రతి గల్లీకి చేరాయి. ఒక్క అధికార పక్షం తప్ప అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామ్య సంఘాలు, విద్యార్థి, యువత, సామాజిక సంస్థలు అన్నీ కూడా ఈ పోరాటంలో భాగమయ్యాయి. భావి భారత పౌరులకు సంబంధించిన ఉద్యమంలో అందరూ చేరారు. దీంతో మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయడంతో విద్యార్థుల పోరాటం ఫలించింది. విద్యార్థుల పోరాటానికి నరేంద్ర మోదీ మెడలు వంచారు.

ఎంతటి నియంత అయినా
ప్రజాస్వామ్య దేశంలో ఎంతటి నియంత అయినా ప్రజా ఉద్యమానికి తలొగ్గాల్సిందే. పన్నెండేళ్లుగా భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న నరేంద్ర మోదీ ఎట్టకేలకు ప్రజా ఉద్యమానికి దిగివచ్చాడు. విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మోడీ మెడలు వంచాడు. నీట్‌ పేపర్‌ లీక్‌ అంశంపై నూనుగు మీసాల పోరగాళ్లు చేస్తున్న ఉద్యమంతో ఢిల్లీ పీఠాలు కదిలాయి. దీంతో సుదీర్ఘ కాలం తర్వాత ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజా ఉద్యమం గెలిచింది. 

అవమానం నుంచి విజయం దాకా
తరచూ తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులను దేశ సర్వోన్నత న్యాయస్థానం బొద్దింకలు అంటూ అవహేళన చేయగా.. నేడు అవే బొద్దింకలే నేడు భారత ప్రభుత్వం మెడలు వంచేలా చేశాయి. తిరుగులేని అధికారంతో.. విశ్వగురుగా పేరొందిన నరేంద్ర మోదీపైనే బొద్దింకలుగా పేర్కొన్న ఆ విద్యార్థులే విజయం సాధించారు. జయహో విద్యార్థుల్లారా అందుకో అభినందనలు.

0
0
Report

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన రాజీనామా..'నేను బాధ్యత నుంచి తప్పించుకోలేదు' అంటూ ట్వీట్‌!

Hyderabad, Telangana:

Dharmendra Pradhan Resigns: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. జరిగిన పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా విద్యార్థులు, సీజేపీ తీవ్రంగా స్పందించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. గత నాలుగు దశాబ్దాలుగా తాను విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం అంకితభావంతో పనిచేశానని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సేవ చేసే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, 2026 మే 3న జరిగిన నీట్ పరీక్ష లీకేజీ విషయం వెలుగులోకి రాగానే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించడంతో పాటు పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించింది. పరీక్షలను వచ్చే ఏడాది నుంచి పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తామని కూడా ప్రకటించామని ఆయన అన్నారు.

 

 

 కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్య శక్తిపై తనకు ఎల్లప్పుడూ అచంచలమైన విశ్వాసం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని, యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు, దేశ నిర్మాణానికి ప్రధాన శిల్పులని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గత పది రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలను చూసి తన మనసు తీవ్రంగా కలత చెందిందని, ఇది వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని, భారతీయ యువశక్తే దేశానికి అసలైన బలం అని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వ్యతిరేక శక్తుల ప్రయోజనాలను వినియోగించుకోకుండా చూడాలని, దేశ ఐక్యత దెబ్బతినకూడదని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదని, వారు తమ భవిష్యత్తును చదువుకే కేటాయించి దేశ నిర్మాణంలో దృష్టి పెట్టాలని కోరుతూ, ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రాజీనామా పత్రాన్ని గౌరవనీయ ప్రధానమంత్రి గారికి పంపించానని ధర్మేంద్ర ప్రధాన్ రాసుకొచ్చారు. అలాగే, తనపై నమ్మకం ఉంచి, నిరంతరం సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనతో కలిసి పనిచేసిన సహచర మంత్రులకు, మంత్రిత్వ శాఖ అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ, దేశసేవ తన జీవితంలో అత్యున్నత ప్రాధాన్యత అని, అందులో తాను ఎప్పటికీ అంకితభావంతో ఉంటానని పేర్కొన్నారు. శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో భరతమాతకు, ఒడిశా ప్రజలకు, దేశ యువత ఆకాంక్షల సాధనకు భవిష్యత్తులో కూడా తన వంతు సేవలు అందిస్తూనే ఉంటానని ధర్మేంద్ర ప్రధాన్ తన లేఖలో ఎమోషనల్‌ అయ్యారు. 

Also Read:​ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?

Also Read:​ వివాదాలొచ్చినా చెక్కుచెదరని పదవి.. ధర్మేంద్ర ప్రధాన్‌పై మోదీకి అంత నమ్మకమెందుకు?

'ఇది విద్యార్థుల విజయం'..
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో, ఇది విద్యార్థుల విజయమని నెటిజన్లు పేర్కొంటున్నారు. వారు అనుకుంటే ఏదైనా సాధించవచ్చని పోస్టులు పెడుతూ, అనుకున్నది సాధించారని ప్రశంసిస్తున్నారు. విద్యార్థులు పట్టుబట్టి తలుచుకుంటే ఏ ప్రభుత్వమైనా దిగిరావాల్సిందేనని వారు మరోసారి నిరూపించారని అంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Dharmendra Pradhan: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కేంద్ర క్యాబినేట్ మద్దతు..అసలు ఎవరీ ధర్మేంద్ర ప్రధాన్, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?

Hyderabad, Telangana:

Dharmendra Pradhan Biography: ప్రస్తుత విద్యాసంబంధ పరిణామాలు, నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురించి నెట్టింట, విద్యార్థి వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన నేపథ్యం, విద్యార్హతలు, రాజకీయ ప్రయాణం ఎలా సాగిందనే వివరాలు పరిశీలిద్దాం.

కుటుంబ నేపథ్యం, జననం
ధర్మేంద్ర ప్రధాన్ 1969 జూన్ 26న ఒడిశా రాష్ట్రంలోని తల్చేర్‌లో జన్మించారు. ఆయన తండ్రి డా.దేవేంద్ర ప్రధాన్ ప్రముఖ రాజకీయ నాయకుడు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ఆయన కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడం వల్ల ధర్మేంద్ర ప్రధాన్‌కు చిన్నతనం నుంచే ప్రజా జీవితంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.

విద్యార్హతలు
ధర్మేంద్ర ప్రధాన్ తన ప్రాథమిక విద్యను ఒడిశాలోనే పూర్తి చేశారు. ఆ తర్వాత తల్చేర్ కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం భువనేశ్వర్‌లోని ప్రఖ్యాత ఉత్కల్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యనభ్యసించి, ఆంత్రోపాలజీ (మానవ శాస్త్రం)లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

రాజకీయ ప్రయాణం
ఆయన విద్యార్థి దశలోనే రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉత్కల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో ఆరెస్సెస్ విద్యార్థి సంఘమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా (BJYM)లో చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. ఒక దశలో BJYM జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎన్నికల రాజకీయాలు, పదవులు
2000 సంవత్సరంలో తొలిసారిగా ఒడిశా శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాలంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా సుదీర్ఘకాలం సేవలందించారు. ప్రస్తుతం ఆయన ఒడిశాలోని సంబల్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కేంద్ర మంత్రిగా సేవలు
నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ధర్మేంద్ర ప్రధాన్ పలు కీలక శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. గతంలో పెట్రోలియం & సహజ వాయువు శాఖ, ఉక్కు శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రులుగా పనిచేశారు. ఆ తర్వాత 2021 జూలైలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఒడిశా రాజకీయాల నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన బీజేపీ ప్రముఖులలో ఆయన ఒకరు.

Also Read; కేంద్ర మంత్రి పదవికి రవ్‌నీత్ సింగ్ రాజీనామా..రాష్ట్రపతి ఆమోదం..!

Also REad: "విద్యార్థులతో పాటు నిరసన చేయడానికి డబ్బులిస్తున్నారు" నటి ఆకాంక్ష సంచలన కామెంట్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

ముందు NEET అంటే ఏంటో చెప్పండి.. విద్యార్థుల వీడియో వైరల్..

Hyderabad, Telangana:

 CJP Protesters Viral Video: NEET రచ్చ చేస్తున్న కొన్ని రాజకీయ శక్తులకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు గట్టి షాక్ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు పేరిట, క్లాసులను బంద్ చేయించి తమ నిరసనల్లో పాల్గొనాలని బలవంతం చేయడానికి వచ్చిన  కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులకు ఆంధ్రా విద్యార్థుల తెలివితేటలు, పదునైన ప్రశ్నల ముందు నోట మాట రాలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఈ విద్యార్థులకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థుల క్షేమం కోసమే పోరాడుతున్నామని హంగామా చేస్తూ.. వచ్చిన CJP ఆందోళనకారులను ఆంధ్రా విద్యార్థులు అడ్డుకున్నారు. ముందుగా వారి అవగాహనను పరీక్షించేందుకు.. అసలు మీకు NEET Full Form ఏమిటో చెప్పండి?" అని ప్రశ్నించారు. ఈ బేసిక్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక నిరసనకారులు ఒక్కసారిగా నీళ్లు నమలాల్సి వచ్చింది.

ఆంధ్రా యూత్ గట్టి కౌంటర్..
కనీస సమాచారం కూడా లేకుండా నిరసనల పేరుతో కాలేజీలపై పడటంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మీరు దేనికోసం పోరాడుతున్నారో.. ఆ పరీక్ష పేరు ఏమిటో కూడా మీకు తెలియదు. అలాంటప్పుడు విద్యార్థుల తరఫున పోరాడుతున్నామని ఎలా చెప్తారు? అని నిలదీశారు. దీంతో డిఫెన్స్‌లో పడ్డ నిరసనకారులు.. అవన్నీ మాకు అవసరం లేదు.. మేం విద్యార్థుల కోసమే చేస్తున్నాం.. అంటూ మాట దాటవేసేందుకు.. కవర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, విద్యార్థులు ఏమాత్రం తగ్గకుండా.. మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని వాడుకోవద్దు.. ముందు విషయాన్ని తెలుసుకుని రండి.. అంటూ వారిని తిప్పి పంపించారు.

 
 
 
 
 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అవగాహన కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం విద్యాసంస్థలను, విద్యార్థులను వాడుకుంటే.. ఇలానే ఉంటుందని, విద్యార్థులు చేసిన పనికి నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఇలా స్పందిస్తున్నారు. ఏ విషయంపై పోరాడుతున్నారో తెలియకుండా జెండాలు పట్టుకుని తిరిగే నాయకులకు ఆంధ్రా విద్యార్థులు ఇచ్చిన కౌంటర్ సూపర్.. అని కామెంట్లు పెడుతున్నారు. విద్యార్థులు చూపిన ఈ చైతన్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

AP SIR 2026 Completed: ఆంధ్రప్రదేశ్‌లో SIR పూర్తి..44.71 లక్షల ఓట్లు తొలగింపు..తుదిజాబితా విడుదల అప్పుడే!

Vijayawada, Andhra Pradesh:

AP SIR 2026 Completed News: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా కీలక దశ విజయవంతంగా ముగిసింది. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ అర్ధరాత్రి 12 గంటలకు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 44,71,523 మంది ఓటర్లను 'అన్ కలెక్టబుల్'గా గుర్తించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇది రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 10.74%గా ఉంది.

'అన్ కలెక్టబుల్' ఓటర్ల వర్గీకరణ
గుర్తించిన జాబితాలో ప్రధానంగా ఈ కొన్ని కేటగిరీల వారు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఆ జాబితాలో మరణించిన ఓటర్లు, ఆచూకీ లభించని వారు (Untraceable), శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు (Permanent Shift), ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్న డబుల్ ఎంట్రీలు వంటి వాటిగా గుర్తించారు. వీటన్నింటిని అన్‌ కలెక్టబుల్‌ ఓటర్ల వర్గీకరణలోకి తెచ్చి ఆ ఓట్లను తొలగించనున్నారు.

ముసాయిదా ఓటరు జాబితా విడుదల
ఈ నెల 31వ తేదీన ఎన్నికల సంఘం ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనుంది. ఈ ముసాయిదాలో 'అన్ కలెక్టబుల్'గా తేలిన ఓటర్ల వివరాలను కూడా అందుబాటులో ఉంచనున్నారు.

దరఖాస్తులు, మార్పులకు అవకాశం
ముసాయిదా ప్రదర్శన అనంతరం అర్హులైన కొత్త ఓటర్లు పేర్ల నమోదుకు, లేదా చిరునామా మార్పుల కోసం ఫామ్-6, ఫామ్-8 దరఖాస్తులను సమర్పించుకోవచ్చు.

ఒకవేళ అన్ కలెక్టబుల్ జాబితాలో పేరుండి, తాము అర్హులని భావించే వారు తిరిగి పేరు నమోదు చేసుకోవడానికి ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ (చిరునామా ధ్రువీకరణ పత్రం) తదితర అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలని అధికారులు సూచించారు.

తుది ఓటరు జాబితా విడుదల
ప్రజాధారణ పొందిన అభ్యంతరాలు, సవరణలు, నూతన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, అక్టోబర్ 3వ తేదీన తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేయనుంది. దీనితో ఏపీలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తిగా ముగియనుంది.

Also REad: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ఘోర ప్రమాదం..ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి!

Also REad: Seediri Appalaraju Arrest: కొడుకు కోసం కటకటాల్లోకి మాజీ మంత్రి..సీదిరి అప్పలరాజుకు వైసీపీ మద్దతు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Mercury Transit: పుష్య నక్షత్రంలోకి బుధుడు.. ఆగస్టు 8 నుంచి ఈ 4 రాశులకు తిరుగులేని అదృష్టం..

Hyderabad, Telangana:

Mercury Transit In Pushya Nakshatra Telugu: గ్రహాల రాశి, నక్షత్ర సంచారాలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంచారాల కారణంగా ఏర్పడే ప్రభావం మానవ జీవితాలపై, ముఖ్యంగా వివిధ రాశులవారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుద్ధి, వాక్కు, వ్యాపారానికి కారకుడిగా భావించే బుధ గ్రహం ఆగస్టు 8న అత్యంత కీలకమైన నక్షత్ర సంచారం చేయబోతోంది. ఆగస్టు 8న ఉదయం 07:23 గంటలకు బుధుడు, శని గ్రహానికి సంబంధించిందిన పుష్య నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఆగస్టు 16 వరకు బుధుడు ఇదే నక్షత్రంలో సంచార దశలో ఉండబోతున్నాడు.

జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. శని నక్షత్రమైన పుష్య నక్షత్రంలోకి వ్యాపార కారకుడైన బుధుడు ప్రవేశించడం వల్ల అత్యంత శుభప్రదమైన యోగం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ గ్రహ సంచారం కారణంగా 4 రాశుల వారికి జాతకం అద్భుతంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించని ప్రగతి కనిపించడమే కాకుండా.. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు..
కన్యా రాశి:
కన్యా రాశికి అధిపతిగా భావించే బుధుడు నక్షత్ర మార్పు చేయడం వీరికి అదృష్టాన్ని అందిస్తుంది.. ముఖ్యంగా వీరికి ఆదాయం ఒక్కసారిగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్‌లో సరైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తుకు బలమైన పునాదిని అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మేష రాశి:
పుష్య నక్షత్రంలో బుధుడి సంచారం మేష రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి.. ఉద్యోగంలో పురోగతి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీలో ఆత్మవిశ్వాసం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది.. ఫలితంగా కార్యాలయంలో ప్రశంసలతో పాటు పదోన్నతి, జీతం పెరుగుదల ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలకు పెద్ద ప్రాజెక్టులు దక్కే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు చేతికి అంది.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది..

మిథున రాశి:
మిథున రాశివారికి ఈ సమయం సువర్ణాధ్యాయం లాంటిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి.. కొత్త ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఆర్థికంగా బాగా కలసివస్తుంది. పెట్టిన పెట్టుబడుల నుంచి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు అందుతాయి.

వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సంచారం ఎన్నో రకాల శుభఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన ప్రతీ పనిలో విజయం తప్పకుండా కలుగుతుంది.. ఉద్యోగస్తులకు కొత్త జాబ్ ఆఫర్ లెటర్లు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చాలా కాలంగా పూర్తికాకుండా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో సులభంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. పాత గొడవలు సర్దుమణిగి బంధాలు బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

విద్యార్థుల సైకోయిజం.. గుండెను పిండేస్తున్న రిపోర్టర్‌ వీడియో..

Hyderabad, Telangana:

 Zee News Reporter Viral Video: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు, సామాన్య పౌరులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఇదిలా ఉంటే, సమాజంలో ఏం జరుగుతుందో క్షణక్షణానికి ప్రజలకు చేరవేసేందుకు.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయికి వెళ్లిన ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్ట్‌కు ఎదురైన అవమానం ప్రతి ఒక్కరి గుండెను పిండేస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ జీ న్యూస్‌కి సంబంధించిన వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను చూసి స్టూడెట్స్‌పై మండిపడుతున్నారు. అయితే, ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

విద్యార్థులు ధర్నా నుంచి నిజాయితీగా ప్రత్యక్ష ప్రసారం (Live Reporting) అందిస్తున్న జీ న్యూస్ రిపోర్టర్‌ను నిరసనకారులు, కొందరు ఉన్మాదంతో ప్రవర్తించి ఆయన చుట్టుముట్టారు. చుట్టూ ముసిరి.. అతని ముందే చేతులు ఊపుతూ.. లూజర్.. లూజర్ అంటూ వికృత చేష్టలతో భయభ్రాంతులకు గురిచేశారు. ఏ క్షణంలో ఏమవుతుందో తెలియని భయాందోళనల నడుమ, కేవలం తన వృత్తిధర్మాన్ని నెరవేర్చడానికి నిలబడిన ఆ విలేకరిపై చూపిన ఈ అనాగరిక వైఖరి యావత్ మీడియా రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

మీడియాపై కక్ష సాధింపా? 
కొన్ని ఛానెళ్లు తమ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయనే నెపంతో.. క్షేత్రస్థాయిలో వార్తలు సేకరిస్తున్న ఒక సామాన్య విలేకరిపై తమ కోపాన్ని ప్రదర్శించడం ఎంతవరకు సమంజసం? వార్త నచ్చకపోతే ప్రశ్నించే హక్కు ఉంది కానీ.. రాత్రింబవళ్లు శ్రమిస్తూ..  ప్రజాసమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టుల స్వేచ్ఛను హరించే హక్కు ఎవరిచ్చారు? విద్యార్థులమని చెప్పుకుంటూ.. వార్తాల రిపోర్టింగ్‌కి అంతరాయం కలిగించడం, వృత్తిపరమైన బాధ్యతల్లో ఉన్నవారిని మానసికంగా వేధించడం ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది.

 
 
 
 
 

జర్నలిస్టులకు భద్రతేది?
ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాల్లో వైరల్ కావడంతో నెటిజన్లతో పాటు, జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. విధులు నిర్వర్తిస్తున్న ప్రతినిధిపై ఇలాంటి అరాచకానికి పాల్పడటాన్ని మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. జర్నలిస్టుల రక్షణే ధ్యేయంగా పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ముంబైలో భారీగా భద్రతా బలగాలను మోహరించినప్పటికీ.. నిజాయితీగా పనిచేసే విలేకరులపై జరుగుతున్న ఇటువంటి దాడులు మీడియా రంగానికి పెద్ద సవాలుగా మారాయి. మైకులతో నిలబడే జర్నలిస్ట్ వెనుక ఒక కుటుంబం, ఒక బాధ్యత ఉంటాయని విద్యార్థులు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
0
Report

ప్లాన్‌తో పోలీసులపై దాడులు.. జంతర్ మంతర్ ఉద్రిక్తత వెనుక 2,500 మంది క్రిమినల్స్?

Hyderabad, Telangana:

Jantar Mantar Violence: CJP ఆందోళనలపై జరుగుతున్న దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు అత్యంత కీలకమైన విషయాలను వెల్లడించారు. దేశ రాజధానిలోని నిరసన ప్రాంగణం జంతర్ మంతర్ వద్ద జూలై 21 నుంచి 23 మధ్య జరిగిన ప్రదర్శనల్లో నేర చరిత్ర కలిగిన వందలాది మంది వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు అధికారికంగా ధృవీకరించారు.

ఢిల్లీ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) ద్వారా నిర్వహించిన చెకింగ్‌లో భాగంగా ఏకంగా 2,500 మందికి పైగా పాత నేరస్థులు, క్రిమినల్ రికార్డులు ఉన్న వ్యక్తులు నిరసనల్లో చురుగ్గా పాల్గొన్నట్లు గుర్తించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సాధారణ పౌరుల ముసుగులో ఈ దుండగులు ప్రవేశించినట్లు దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

భద్రతా దళాలపై పథకం ప్రకారం దాడులు..
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఆందోళనకారుల గుంపులో కలిసిపోయిన దుండగులు ముందస్తు ప్రణాళిక ప్రకారమే.. భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారు. తీవ్రమైన ఉద్రిక్తతలను సృష్టించేందుకు వీరు కత్తులతో పాటు కొడవళ్లు, ఇతర పదునైన ఆయుధాలతో విధుల్లో ఉన్న పోలీసులపై దాడులకు పాల్పడ్డారని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ అనూహ్య దాడితో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది.

సాధారణ ప్రజలు, నిరసనకారుల వెనుక దాక్కుని నేరస్థులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించారని.. భద్రతా దళాలపై పదునైన ఆయుధాలతో దాడులు చేయడం చాలా బాధకరమని ఢిల్లీ పోలీస్‌ అధికారులు తెలిపారు...

రంగంలోకి FRS..
జూలై 20న జంతర్ మంతర్ ప్రాంతంలో చెలరేగిన తీవ్ర హింసాకాండను గమనించిన పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించేందుకు.. నిరసన ప్రదేశానికి వచ్చే వారిపై నిఘా పెట్టేందుకు అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను (FRS) అక్కడ హుటాహుటిన ఏర్పాటు చేశారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను పాత నేరస్థుల డేటాబేస్‌తో పోల్చి.. చూడగా ఈ ఊహించని నిజాలు బయటపడ్డట్లు తెలుస్తోంది..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

15 కేసులు నమోదు..
ఈ నిరసనలు, తదనుగుణంగా జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. FRS సాంకేతికత ద్వారా గుర్తించిన 2,500 మంది నేరస్థుల వివరాలతో పాటు వీడియో ఫుటేజ్‌ల ఆధారంగా వారిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల.. 2218 భారీ ఉద్యోగాలు, జీతం 7వ పే స్కేల్ ప్రకారం!  

Hyderabad, Telangana:

AIIMs Delhi Nursing Jobs 2026: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) న్యూఢిల్లీ, నర్సింగ్ ఆఫీసర్ (Norcet 11) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 24 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 2218 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు 18 నుండి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎయిమ్స్ నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు విధానం..
ఎయిమ్స్ నర్సింగ్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 జూలై 24 నుండి మొదలైంది. దరఖాస్తు ఫీజు వస్తే, జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 3000, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 2400 చెల్లించాల్సి ఉంటుంది. ఆగస్టు 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పరీక్షల విషయానికొస్తే, మొదటి సిబిటి (CBT-1) పరీక్ష సెప్టెంబర్ 12న, రెండో సిబిటి (CBT-2) పరీక్ష సెప్టెంబర్ 30న నిర్వహించనున్నారు. పరీక్షకు ముందు అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు విడుదల చేస్తారు. దరఖాస్తుదారులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా ఫీజు చెల్లించవచ్చు. అయితే, దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న నిబంధనలను, వివరాలను క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది.

అర్హత వివరాలు..
ఈ ఎయిమ్స్ నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ డిప్లొమా కలిగి ఉండాలి. వీటితో పాటు కనీసం 50 పడకలు ఉన్న ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ పొంది, స్టేట్ లేదా నర్సింగ్ కౌన్సిల్‌లో పనిచేసిన అనుభవం తప్పనిసరి. ఈ పోస్టులు గ్రూప్ 'బి' పరిధిలోకి వస్తాయి. జీతం 7 పే స్కేల్ ప్రకారం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది.. ఇందులో అర్హత సాధించిన వారికి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు.

Also Read:  రైల్వే ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. RRB గ్రూప్‌ డీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల..!

Also Read: బ్యాంక్ ఉద్యోగాల వేటలో ఉన్నారా? IBPS నుంచి 7400 పైగా పోస్టులతో భారీ నోటిఫికేషన్!

దరఖాస్తు చేసుకునే విధానం:
ముందుగా అధికారిక ఎయిమ్స్ వెబ్‌సైట్‌ https://www.aiimsexams.ac.in/ ను ఓపెన్ చేసి, అక్కడ 'నార్సెట్ 11 లింక్' లేదా 'నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్' సెక్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ నోటిఫికేషన్‌లోని వివరాలను, మీ విద్యార్హత, వయస్సు వంటి అంశాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలి. అంతా సరిగ్గా ఉంటే 'అప్లై ఆన్‌లైన్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ మీ పేరు, కాంటాక్ట్ వివరాలు, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఒక పాస్‌వర్డ్ వస్తుంది. ఆ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ మీ వ్యక్తిగత వివరాలు, విద్యా అర్హతలు, అనుభవ వివరాలను నమోదు చేయాలి. వీటితో పాటు ఇటీవల తీసుకున్న పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం, ఇతర సర్టిఫికేట్ల స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేయాలి. చివరగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజు చెల్లించాలి. పేమెంట్ విజయవంతమైన తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేసి, దాని కాపీని డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోవాలి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Modi Instagram Usage: మంత్రులకు క్లాస్‌ పీకిన నరేంద్ర మోదీ.. ఇన్‌స్టాగ్రామ్‌ వాడాలని సూచన

New Delhi, Delhi:

NEET Students Protest: నీట్‌ పరీక్ష పేపర్‌ లీక్‌ అంశంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. యువత ఆందోళనలతో దేశం అట్టుడుకుతుంటే కేంద్ర ప్రభుత్వ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం, ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాలని దేశ యువత కోరుతోంది. తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రులకు క్లాస్‌ తీసుకున్నారు. అది కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగంపై తీసుకోవడం గమనార్హం. మంత్రులందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండాలని సూచన చేయడం తీవ్ర వివాదం రాజుకుంది.

Also Read: NEET: నీట్‌ విద్యార్థులకు తలొగ్గని కేంద్రం.. ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా ఉండదే ఉండదు

వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాలు, దేశ యువత ఉద్యమాలు చేపట్టడంతో శుక్రవారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రిమండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వింత సలహాలు ఇచ్చారు. మంత్రులందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. యువత ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని.. మంత్రులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ వారితో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ప్రధాని మోదీ సూచన చేశారు. 'ప్రభుత్వ పథకాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం కాదు. పథకాల గురించి అర్థమయ్యేలా వీడియోలు పోస్ట్‌ చేయాలి' అని కేంద్ర మంత్రులకు నరేంద్ర మోదీ సూచించారు.

Also Read: తగ్గేదేలే అంటున్న కాక్రోచ్‌ పార్టీ.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాల్సిందే!

కేంద్ర మంత్రులకు నరేంద్ర మోదీ చేసిన సూచన తీవ్ర వివాదంగా మారింది. జెన్‌జీ యువతరం ఇన్‌స్టాగ్రామ్‌ అత్యధికంగా వాడుతున్న నేపథ్యంలో.. సోషల్‌ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో నరేంద్ర మోదీ స్పందించారు. యువత ఉద్యమ బాట పట్టకుండా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారానే కేంద్ర మంత్రులు యువతను దృష్టి మరల్చే ప్రయత్నం చేయాలని ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది.

కాగా ప్రధాని ఇన్‌స్టాగ్రామ్‌ సూచనపై కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. మనకు చదువుకున్న ప్రధానమంత్రి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. 'పేపర్ లీక్ అంశంలో ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్యలు తీసుకోవాలని అడిగితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండాలని ప్రధానమంత్రి మంత్రులకు చెబుతున్నాడు. మనకు చదువుకున్న వ్యక్తి ప్రధానిగా ఉంటే బాగుండేది' అని అభిజిత్‌ తెలిపారు.

0
0
Report

Tholi Ekadasi 2026: రేపే తొలి ఏకాదశి..శ్రీమహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్రమైన రోజు..ఉపవాసం నియమాలు ఇవే!

Hyderabad, Telangana:

Tholi Ekadasi Fasting Rules: హిందూ సంప్రదాయంలో ఆషాఢ శుక్ల ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. దీనినే తొలి ఏకాదశి, దేవశయన ఏకాదశి, హరిశయని ఏకాదశి, పద్మనాభ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. చాతుర్మాస్య వ్రతారంభానికి సంకేతమైన ఈ పవిత్ర దినాన శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఆచరించడం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయని నమ్ముతారు.

తొలి ఏకాదశి ఎందుకు అంత ప్రత్యేకం?
ఆషాఢ శుక్ల ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తారు. నాలుగు నెలల పాటు (చాతుర్మాస్యం) యోగనిద్రలో ఉండే స్వామివారు, కార్తీక శుక్ల ఏకాదశి (ఉత్తాన ఏకాదశి) నాడు మేల్కొంటారు. దక్షిణాయనం ప్రారంభమయ్యాక వచ్చే తొలి ప్రధాన ఏకాదశి కావడంతో దీనికి 'తొలి ఏకాదశి' అని పేరు వచ్చింది.

ఇంట్లో పూజా విధానం, నియమాలు
బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి, ఇల్లు శుభ్రం చేసుకుని స్నానాంతరం పూజా మందిరాన్ని సిద్ధం చేసుకోవాలి. లక్ష్మీనారాయణులు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీనరసింహస్వామి లేదా శ్రీవేంకటేశ్వరస్వామి చిత్రపటానికి గంధం, కుంకుమలతో తిలకం దిద్ది పూలతో అలంకరించాలి.

పచ్చకర్పూరం కలిపిన తీపి నైవేద్యాన్ని సమర్పించి దీపారాధన చేయాలి. తులసీదళాలతో (లేదా తెల్ల గన్నేరు, నందివర్ధనం, తుమ్మి, జాజి పూలతో) అరిచిస్తూ  “ఓం లక్ష్మీ నారాయణాయ నమః” అనే మంత్రాన్ని 21, 54 లేదా 108 సార్లు జపించాలి. పూజ ముగిశాక పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో సానుకూల (పాజిటివ్) శక్తి పెరుగుతుంది.

ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామం
ఇంటి పూజ అనంతరం సమీపంలోని విష్ణు ఆలయాన్ని సందర్శించి తులసి మాల సమర్పించడం, ధ్వజస్తంభం వద్ద ఆవునెయ్యితో దీపం వెలిగించడం శుభప్రదం. ఆలయం చుట్టూ 2, 4, 6 లేదా 8 (సరి సంఖ్యలో) ప్రదక్షిణలు చేయడం ద్వారా విష్ణువు కటాక్షం లభిస్తుంది. ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి.

ఏకాదశి ఉపవాస విధానం
భక్తులు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి క్రింది విధానాల్లో ఉపవాసం ఆచరించవచ్చు. నిరాహారంగా ఉండడం, కేవలం నీరు మాత్రమే తీసుకోవడం, పాలు లేదా పండ్లతో ఉపవాసం చేయడం, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం వంటి వాటిని ఆచరించవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు కఠిన ఉపవాసాలు చేయకుండా తమ ఆరోగ్యానికి అనుగుణంగా నడుచుకోవడం మంచిది.

ఉపవాస విరమణ, దాన ధర్మాలు
ఏకాదశి ఉపవాసాన్ని మరుసటి రోజున 'ద్వాదశి' తిథిలో విరమించాలి. ఆహారం స్వీకరించే ముందు పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి అన్నదానం చేయడం ఉత్తమమైన ఆచారం. శారీరక కారణాల వల్ల ఉపవాసం ఉండలేని వారు నిరాశ చెందకుండా బియ్యం, పండ్లు, వస్త్రాలు లేదా ఆహార పదార్థాలను దానం చేయడం ద్వారా పుణ్యఫలాన్ని పొందవచ్చు.

(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు పురాణాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, సంప్రదాయ ఆచారాల ఆధారంగా అందించబడ్డాయి.)

Also Read: నాన్‌వెజ్ తిని ఆలయానికి వెళ్తున్నారా? హిందూ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెబుతోంది?

Also Read: ఈ రోజు నుంచి బుధ ఎఫెక్ట్‌.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం.. ధన లాభం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Ravneet Singh Resign: కేంద్ర మంత్రి పదవికి రవ్‌నీత్ సింగ్ రాజీనామా..రాష్ట్రపతి ఆమోదం..!

New Delhi, Delhi:

Ravneet Singh Resignation: కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(2) ప్రకారం రాష్ట్రపతి ఈ రాజీనామాకు ఆమోదం తెలిపారు. రవ్‌నీత్ సింగ్ బిట్టు భారత ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆయన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత బీంత్ సింగ్ మనవడు, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అయితే రాజ్యసభ సభ్యునిగా ఆయన పదవీకాలం జూన్ నెలలోనూ ముగిసింది. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిట్టు పోటీ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Also Read: "ఢిల్లీలో అరాచక శక్తులు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయి" బండి సంజయ్ కామెంట్స్!

ALso Read: పేపర్ లీక్ చేస్తే రూ.10 కోట్ల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష..బిల్లుకు క్యాబినేట్ ఆమోదం?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Advertisement
Back to top