icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow28 Jul 2024, 10:42 am

బోనాల పండుగలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు

Karimnagar, Telangana:

కరీంనగర్, రామనగర, మార్కండేయ కాలనీలో మున్నూరుకాపు కులస్తులు నిర్వహించిన పోచమ్మ నాట్లు ఉత్సవంలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో మెరుగు స్వప్నశ్రీ, పిట్టల రవీందర్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నెల్లి నరేష్, పెద్దిగారి తిరుపతి, ఉప్పరి అజయ్, అల్వాల భరత్, కంపల్లి కీర్తికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

TGSRTC చరిత్రలోనే తొలిసారి.. ఒకే రోజు 422 ఉద్యోగుల రిటైర్మెంట్!

Hyderabad, Telangana:

Historic Day For TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) చరిత్రలో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవలందించిన 422 మంది ఆర్‌టీసీ ఉద్యోగులు మంగళవారం ఒకే రోజు సామూహికంగా ఉద్యోగ విరమణ చేశారు. సంస్థకు తమ జీవితాలను అంకితం చేసిన ఇంత పెద్ద సంఖ్యలో కార్మికులు ఒకేసారి రిటైర్ కావడం ఆర్‌టీసీ వర్గాల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.

97 డిపోల్లో వీడ్కోలు వేడుకలు..
రాష్ట్రంలోని 11 రీజియన్లు, 97 డిపోల పరిధిలో ఈ పదవీ విరమణలు కొనసాగాయి.. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బందితో పాటు శ్రామికులు, పరిపాలనా విభాగాలకు చెందిన అధికారులు ఇందులో ఉన్నారు. దశాబ్దాల పాటు సంస్థ ఎదుగుదలలో భాగస్వాములైన వీరందరికీ ఆయా డిపోల పరిధిలో అధికారులు, తోటి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది.. పూలమాలలు, శాలువాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా డిపోలన్నీ భావోద్వేగ వాతావరణంతో నిండిపోయిన్నట్లు తెలుస్తోంది.

కరీంనగర్ రీజియన్ నుంచి 38 మంది విరమణ..
ఈ మెగా రిటైర్మెంట్‌లో కరీంనగర్ రీజియన్ కీలక పాత్ర పోషించిందని భావించవచ్చు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి మొత్తం 38 మంది ఉద్యోగులు మంగళవారం తమ విధులకు స్వస్తి పలికారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి, సంస్థ లాభాల బాటలో పయనించడానికి తాము చేసిన కృషిని ఈ సందర్భంగా ఉద్యోగులు గుర్తుచేసుకున్నారు. కరీంనగర్ జోన్ పరిధిలోని వివిధ డిపోలలో వీరికి ఘన సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.

సేవలను కొనియాడిన యాజమాన్యం..
ఒకే రోజు ఇంతమంది ఉద్యోగులు రిటైర్ అవ్వడంతో ఆర్‌టీసీ యాజమాన్యం వారి సేవలను ప్రత్యేకంగా అభినందించింది. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల వైపు నడిపించడానికి, ముఖ్యంగా మహాలక్ష్మి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) వంటి భారీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అధికారులు కొనియాడారు. రిటైర్ అయిన ఉద్యోగులందరికీ రావలసిన బెనిఫిట్స్, ఇతర సెటిల్మెంట్లను ఎలాంటి ఆలస్యం లేకుండా సకాలంలో అందించేందుకు యాజమాన్యం తగిన చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

కొత్త నియామకాలపై ఆశలు..
ఒకే రోజు 422 మంది ఎక్పీరియన్స్‌ ఉన్న సిబ్బంది విరమణ పొందడంతో ఆయా స్థానాలను భర్తీ చేయడంపై సంస్థ దృష్టి సారించిన్నట్లు తెలుస్తోంది.. ఒకవైపు సుదీర్ఘ సేవలు ముగిసినందుకు సంతోషంగా ఉన్నా.. మరోవైపు తోటి సిబ్బందిని వదిలి వెళ్తున్నందుకు రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా, టీజీఎస్ ఆర్‌టీసీ చరిత్రలో ఈ మంగళవారం ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయిందని భావించవచ్చు.. 

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Redmi K90 Ultra: 8550mAh భారీ బ్యాటరీతో Redmi కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

Hyderabad, Telangana:

Redmi K90 Ultra Launch News: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి (Redmi) మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని చైనాలో అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది మార్కెట్‌లోకి రెడ్‌మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) పేరుతో లాంచ్‌ అయ్యింది. అయితే, కంపెనీ దీనిని మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన రెడ్‌మి K80 అల్ట్రా మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఇది బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి రావడం విశేషం. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రాసెసర్ వివరాలు..
ఈ రెడ్‌మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో కళ్లు చెదిరే పర్ఫార్మెన్స్ కోసం సరికొత్త  ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. దీనికి తోడుగా గ్రాఫిక్స్, అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి కంపెనీ చాలా ప్రత్యేకమైన D2 AI గేమింగ్ గ్రాఫిక్స్ చిప్ సెట్‌ను కూడా వినియోగించిన్నట్లు కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో చాలా ప్రత్యేకమైన యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం..

ఆకట్టుకునే డిస్‌ప్లే, అల్ట్రా బ్రైట్‌నెస్..
రెడ్‌మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ 6.83 అంగుళాల అమోలెడ్ (AMOLED) 1.5K డిస్‌ప్లేను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది 165Hz హై రిఫ్రెష్ రేట్‌తో పాటు 480Hz టచ్ సాంప్లింగ్ రేట్, ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. దీనివల్ల ఎండలో కూడా డిస్‌ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది..

8,550mAh మెగా బ్యాటరీ.. 
ఈ రెడ్‌మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని శక్తివంతమైన బ్యాటరీగా భావింవచ్చు. ఇందులో కంపెనీ ఏకంగా 8,550mAh భారీ బ్యాటరీని అందించింది.. స్మార్ట్‌ఫోన్ రంగంలోనే ఇది అత్యంత పెద్ద బ్యాటరీలలో ఒకటిగా కంపెనీ చెబుతోంది.. దీనితో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు 22.5W వైర్డ్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా చార్జ్ అవుతుందని కంపెనీ తెలుపుతోంది..

కెమెరా ఫీచర్స్‌..
ఫోన్ వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా సెటప్ కూడా అందుబాటులో ఉంది.. ఇందులో 50 మెగాపిక్సెల్ లైట్ హంటర్ 800 (Light Hunter 800) ప్రధాన కెమెరాతో పాటు అదనంగా చాలా ప్రత్యేకమైన 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు..
ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ 5G, Wi-Fi, బ్లూటూత్, GPSతో పాటు BeiDou, NavIC వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తూ వస్తోంది.. అంతేకాకుండా ఇది చాలా తక్కువ బరువు దాదాపు 227 గ్రాములతోనే అందుబాటులోకి రావడం విశేషం.. ఇది ఇప్పుడు బ్లూ, సిల్వర్‌తో పాటు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పలు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.. దీని బేస్‌ వేరియంట్‌ ధర రూ.39,000 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా హైఎండ్ వేరియంట్‌ ధర రూ.48,800తో లభించనుంది. అయితే, ఇది త్వరలో చైనా మార్కెట్‌లలో లభించబోతోంది. అలాగే త్వరలోనే ఈ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

AP EAPCET Results 2026: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే, ఇలా చెక్ చేసుకోండి!

Hyderabad, Telangana:

AP EAPCET Results Released: లక్షలాది మంది ఏపీ విద్యార్థులు ఈ  AP EAPCET ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు అధికారికంగా ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. మే 12 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన AP EAPCET పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx లో పొందుపరిచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ AP EAPCET పరీక్షల ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (X) ద్వారా ఈ ఫలితాలు విడుదలైనట్లు అధికారికంగా తెలియజేశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్ నంబర్‌తో నేరుగా ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల కోసం ఈ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. గతంలో జూన్ 30న ఈ ఫలితాలను విడుదల చేయాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. జూలై 2వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని కూడా అధికారికంగా తెలిపారు. కానీ ఈరోజు జూలై 1వ తేదీనే ఫలితాలను విడుదల చేశారు.

 

 

మంత్రి లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 1,82,317 మంది, అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో 63,546 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. విజయం సాధించిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తంగా ఫలితాల్లో 71.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

READ ALSO:  నేడే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్ట్ లింక్ ఓపెన్!

READ ALSO:   ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు వాయిదా..! జూలై 2న విడుదల! కారణం ఇదే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

July School Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్..వారంలో రెండు రోజులు సెలవులు..ఎప్పుడంటే?

Hyderabad, Telangana:

July School Holidays 2026: తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు జూలై నెలలో ఊహించిన విధంగా సెలవులు రానున్నాయి. సాధారణంగా జూలైలో ఎలాంటి పండుగలు, ప్రభుత్వ సెలవులు ఉండవు. కేవలం ఆదివారాలు, రెండో శనివారం మాత్రమే సెలవులు ఉన్నాయి. అయితే తాజాగా జూలై నెలలో రెండో శనివారం సెలవును కూడా ఇటీవలే రద్దు చేయగా.. జూలై నెలలో అత్యధికంగా 27 రోజుల పాటు విద్యాసంస్థల పనిదినాలను ప్రభుత్వం ప్రకటించింది. అయినా తాజాగా బంద్ మరి ఇతర సెలవులు నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడనున్నాయి. 

సాధారణంగా జూలై నెల వచ్చిందంటే విద్యార్థులకు ఎలాంటి పండగ హాలిడేలు దొరకవు. కానీ, తెలంగాణలో మాత్రం ఈసారి ఊహించిన విధంగా అదనపు సెలవులు రానున్నాయి. వేరువేరు డిమాండ్లతో బీసీ సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంధువులను పిలుపునివ్వడమే అందుకు కారణంగా తెలుస్తుంది. 

జూలై 2న బీసీ సంఘాల రాష్ట్ర వ్యాప్త బంద్ 
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రెండు రోజుల నిరసన కార్యక్రమాలు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా జూన్ 30వ తేదీన తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి, రాస్తారోకోలు నిర్వహించారు. జులై ఒకటిన విద్యా సంస్థలు ఎలాగో నడిచినప్పటికీ.. జూలై 2న అనగా గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు బంద్‌ను ప్రకటించారు. 

జులై 10న వామపక్ష విద్యార్థి సంఘాల బంద్..
బీసీ సంఘాల బంధు ముగిసిన వారం రోజులకే మరో బంద్ తెరపైకి రానుంది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్న పలు సంస్థలు పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు, జులై 10న బంద్‌ను పిలుపునిచ్చాయి. హైదరాబాదులో సమావేశమైన విద్యార్థుల సంఘాల నాయకులు ఈ మేరకు కార్యచరణ రూపొందించి పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. 

జులై 10 శుక్రవారం నాడు విద్యాసంస్థలు స్వచ్చందంగా ఇబ్బందులు పాటించాలని, అవాంఛనీయ పరిస్థితులు రాకుండా యాజమాన్యాలు, తల్లిదండ్రులు సహకరించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు వీకెండ్ కు ముందు మరో అదనపు సెలవు దొరకనుంది. 

జూలైలో మరిన్ని సెలవులు వచ్చే అవకాశం ఉందా? 
బందులతో పార్టీ నెలలో వర్షాల కారణంగా అదనపు సెలవులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఊపొందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫానుగా మరి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. 

గత ఏడాది కూడా భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు వరుసగా అత్యవసర సెలవులు ప్రకటించింది. ఏడాది కూడా అదే పరిస్థితి రిపీట్ అయితే, జులై నెలలో విద్యార్థులకు మరిన్ని సడన్ హాలిడేస్ దొరికే అవకాశం ఉంది.

Also Read: ముగ్గురు హీరోయిన్లతో హైటెక్ లెవల్ వ్యభిచారం..ముంబైలో చీకటి దందా బట్టబయలు

Also Read: "హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఉండొద్దంటే ఆ పని చేయండి"..జబర్దస్త్ నటుడు సంచలన వ్యాఖ్యలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

OnePlus: రూ.20 వేలకే 8,000mAh బ్యాటరీ ఫోన్.. మార్కెట్లో OnePlus N6 అరాచకం!

Hyderabad, Telangana:

OnePlus N6 Launched In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ OnePlus భారతీయ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్తను అందించింది.. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వినియోగదారులను టార్గెట్ చేస్తూ.. సరికొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ఫ్లస్‌ N6 (OnePlus N6) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్‌ చేసింది.. రూ.25,000 లోపు బడ్జెట్‌లోనే ఏకంగా భారీ 8,000mAh బ్యాటరీతో మొట్టమొదటి OnePlus ఫోన్ ఇదే కావడం విశేషం. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ వంటి అనేక రకాల కొత్త కొత్త హంగులతో ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ధరలు వివరాలు..
భారత మార్కెట్లో వన్‌ప్లస్ N6 రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ కలిగిన వేరియంట్‌ అసలు ధర రూ.22,999 కాగా.. బ్యాంక్ ఆఫర్లతో పాటు ప్రైమ్ డే డిస్కౌంట్లతో కలిపి ఎఫెక్టివ్ ధరతో కేవలం రూ.19,999లోపే సొంతం చేసుకోవచ్చు. ఇక రెండవ వేరియంట్‌ 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర రూ.24,999 కాగా.. ఆఫర్స్‌ వినియోగించి దీనిని కొనుగోలు చేసేవారికి ఇది కేవలం రూ.21,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రెష్ మింట్ (Light Green)తో పాటు మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది.. జూలై 4వ తేదీ రాత్రి 12:00 గంటల నుంచి అమెజాన్ ఇండియా, ఒన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్లలో దీని ఓపెన్ సేల్ మొదలు కాబోతున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది..

3 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌..
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 8,000mAh బ్యాటరీగా కంపెనీ భావిస్తోంది.. ఒకే ఒక్క పూర్తి ఛార్జ్‌తో సాధారణ వినియోగదారులు ఏకంగా మూడు రోజుల పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను వాడుకోవచ్చని కంపెనీ అధికారంగా ప్రకటించింది. దీనికి తోడు 45W సూపర్‌వూక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. ఇది కేవలం 47 నిమిషాల్లోనే 1 శాతం నుంచి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. అంతేకాకుండా, గరిష్టంగా 7 సంవత్సరాల పాటు బ్యాటరీ హెల్త్ 80 శాతం పైనే ఉండేలా 1,600 ఛార్జింగ్ సైకిల్స్ లైఫ్‌తో దీనిని డిజైన్ చేసిన్నట్లు సమాచారం. గేమింగ్ ప్రియుల కోసం నేరుగా పవర్ సోర్స్ నుంచి విద్యుత్ అందించే బై-పాస్ ఛార్జింగ్‌తో పాటు 5W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్లను కూడా అందుబాటులో ఉంచడం విశేషం..

డిస్‌ప్లేతో పాటు అద్భుతమైన ఫీచర్లు..
వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. 6.75-ఇంచుల HD+ LCD డిస్ల్పేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ ఎంతో అద్భుతంగా పని చేస్తుంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వేడిని సులభంగా తగ్గించేందుకు ఇందులో 5,300mm కలిగిన సెగ్మెంట్స్ లార్జెస్ట్ వేపర్ ఛాంబర్ (VC) కూలింగ్ సిస్టమ్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.. మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ (MediaTek Dimensity 6360 Apex) ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్, లేటెస్ట్ ఆక్సిజన్ ఓఎస్ 16 (OxygenOS 16) ఆధారిత ఆండ్రాయిడ్ 16 పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది.. దీనికి 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందిస్తూ వస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

AI ఎన్‌హాన్స్‌డ్ కెమెరా..
అద్భుతమైన ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను కూడా అందించింది.. ఇది 60 FPS వేగంతో వీడియో రికార్డింగ్ చేస్తుందని కంపెనీ తెలిపింది.. అలాగే ఫ్రంట్‌ భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది.. అంతేకాకుండా పెర్ఫెక్ట్ షాట్, అన్‌బ్లర్, ఏఐ ఎరేజర్‌తో పాటు రిఫ్లెక్షన్ ఎరేజర్ వంటి అద్భుతమైన ఏఐ (AI) ఫీచర్లు ఇందులో లభించడం విశేషం.. ఇక ప్రొటెక్షన్ విషయానికి వస్తే.. ఇందులో మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810) డ్యూరబిలిటీతో పాటు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్ కూడా అందించారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

యమధర్మరాజుతో పోరాడే ప్రత్యక్ష దైవాలు.. ICU మూసిన తలుపుల వెనుక డాక్టర్ల కథ ఇది!

Hyderabad, Telangana:

Doctors Life In ICU: ఆసుపత్రిలో ఐసీయూ(ICU) అనే మాట వినబడితేనే సాధారణంగా రోగుల బంధువుల గుండెల్లో గుబులు ప్రారంభమవుతుంది.. అక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తే.. అది ఒక పెద్ద అద్భుతంగా భావిస్తుంటారు. కానీ, ఆ మూసి ఉన్న తలుపుల వెనుక.. యమ ధర్మరాజుతో పోరాడి.. రోగులకు పునర్జన్మ ప్రసాదించే ప్రత్యక్ష దైవాలు మన వైద్యులు.. ప్రతి సెకను క్షణకాలంలా వెళ్లిపోయే, ఆ గదిలో డాక్టర్ల జీవితం ఎలా ఉంటుంది? జాతీయ వైద్యుల దినోత్సవం (Doctors Day 2026) సందర్భంగా ఐసీయూ లోపల వైద్యులు ఎదుర్కొనే సవాళ్లు, వారి అనుభవాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వార్త కథనం ద్వారా తెలుసుకుందాం..

ప్రతి సెకనూ పోరాటమే..
ఐసీయూ గదిలో పగలు, రాత్రి అనే తేడా ఉండదు.. అక్కడ ప్రతి నిమిషం అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. ఏ క్షణంలో ఏ రోగి పరిస్థితి విషమిస్తుందో ఊహించడం కష్టం.. ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వైద్యులు గుండె నిబ్బరం కోల్పోకుండా.. సమయస్ఫూర్తితో తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.. ముఖ్యంగా ఒకవైపు రోగి ప్రాణాలు కాపాడే ఒత్తిడి.. మరోవైపు బయట కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూసే కుటుంబ సభ్యులకు మేమున్నాం, ధైర్యంగా ఉండండి.. అని భరోసా ఇవ్వడం వైద్యుల జీవితంలో ఒక భాగమైంది..

ఎప్పటికీ విశ్రాంతి లేని గది.. 
ముంబైకి చెందిన ప్రముఖ సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ పంకజ్ అగర్వాల్ ఐసీయూ లోపలి విశేషాలను వైద్యుల దినోత్సవం సందర్భంగా పంచుకున్నారు.. న్యూరో ఐసీయూలో పనిచేయడం అంత సులువు కాదని.. బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం, ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలైన వారు ఇక్కడికి వస్తుంటారని. ఇక్కడ వైద్యులతో పాటు నర్సులు, థెరపిస్ట్‌లు అందరూ కలిసి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతారని... కోమాలోకి వెళ్లిన రోగి ఒక్కసారిగా కళ్లు తెరిచినా లేదా చేతులు, కాళ్లు కదిలించినా వారికి కలిగే ఆనందం  చెప్పుకోలేనిదని.. దానిని డబ్బుతో కొలవలేరని తెలిపారు.

క్షణాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు..
మరో సీనియర్ గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాయ్ పటంకర్ ఇలా మాట్లాడుతూ.. ఐసీయూ డాక్టర్‌కు పెద్ద బాధ్యతలు ఉంటాయని.. కడుపులో విపరీతమైన బ్లీడింగ్ కావడంతో పాటు లివర్ ఫెయిల్ అవ్వడం వంటి అత్యంత ప్రమాదకరమైన కేసులు వచ్చినప్పుడు క్షణాల వ్యవధిలో స్పందించి చికిత్స అందించాలని.. గంటల తరబడి డ్యూటీలు, భావోద్వేగ క్షణాలు ఎన్ని ఉన్నా.. రోగి కోలుకుని మళ్లీ తన సాధారణ జీవితాన్ని గడపాలన్నదే వారి ఏకైక సంకల్పమని ఈ సంద్భరంగా వివరించారు.

Also Read:  సెల్యూట్ టు డాక్టర్స్.. ఆ తెల్లటి కోటు వెనుక ఎన్నో త్యాగాలు, కన్నీళ్లు..!!

వైద్యులకు లభించే అసలైన బహుమతి ఇదే..
అత్యంత ఒత్తిడి, అలసటతో కూడిన ఈ వృత్తిలో వైద్యులకు లభించే అసలైన అవార్డు లేదా బహుమతి ఏంటో తెలుసా? చావు అంచుల్లోకి వెళ్లి వచ్చిన ప్రతి రోగి పూర్తిగా కోలుకుని.. ముఖంలో చిరునవ్వుతో వైద్యులకు చేతులెత్తి నమస్కరిస్తూ..  ఇంటికి వెళ్లే ఆ క్షణమే.. ఆ ఒక్క దృశ్యం వారు పడిన కష్టాన్ని.. అలసటను చిటికెలో మాయం చేస్తుంది.

Also Read:  సెల్యూట్ టు డాక్టర్స్.. ఆ తెల్లటి కోటు వెనుక ఎన్నో త్యాగాలు, కన్నీళ్లు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Goaలో ఇంత చీప్‌గా బీరా, కరోనా, కింగ్‌ఫిషర్ దొరుకుతున్నాయా? 2026 లేటెస్ట్ రేట్లు ఇవే!

Hyderabad, Telangana:

Goa Beer Price List 2026 News: భారత్‌లో పర్యాటక ప్రదేశాల్లో ఒక్కటైన గోవాకు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి యువత వెళ్తూనే ఉంటారు. అక్కడి అందమైన సముద్ర తీరాలతో పాటు రాత్రిపూట పార్టీలు యువతను ఎంతగానో ఆకట్టుకుంటాయి. వీటితో పాటు చాలా మందిని ఆకర్షించే మరో ముఖ్యమైన అంశం అక్కడ తక్కువ ధరలకే మద్యం అందుబాటులో ఉండడం.. ముఖ్యంగా బీర్ ప్రియులకు గోవా ఒక పెద్ద హబ్. అయితే, ఈ 2026 సంవత్సరంలో గోవాలోని వైన్ షాపుల్లో ప్రముఖ బ్రాండ్ల బీర్ల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. గోవాలోని అంజునా ప్రాంతంలో ఉన్న వైన్ స్టోర్‌లలో తాజాగా ఉన్న బీర్ ధరల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కింగ్‌ఫిషర్ ప్రియులకు పండగే.. 
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కింగ్‌ఫిషర్ బీర్ వివిధ రకాల్లో గోవాలో అందుబాటులో ఉంది. తాజా ధరల వివరాల్లోకి వెళితే.. కింగ్‌ఫిషర్ ప్రీమియం (Kingfisher Premium) ఇక్కడ కేవలం రూ.75 లకే లభిస్తోంది. అలాగే కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్ (Kingfisher Strong)ధర రూ. 85తో అందుబాటులో ఉంది.. ఇక కింగ్‌ఫిషర్ అల్ట్రా (Kingfisher Ultra) ప్రీమియం వేరియంట్ రూ.100కి, కింగ్‌ఫిషర్ అల్ట్రా మాక్స్ (Kingfisher Ultra Max) ధర రూ.110తో లబిస్తోంది.

ఇక కొత్త రుచులు ఇష్టపడే వారి కోసం కింగ్‌ఫిషర్ తెచ్చిన ఫ్లేవర్డ్ బీర్లు మరింత చీప్‌ ధరలకే అందుబాటులో ఉన్నాయి. కింగ్‌ఫిషర్ మ్యాంగో బెర్రీ ట్విస్ట్ (Mango Berry Twist)తో పాటు కింగ్‌ఫిషర్ లెమన్ మసాలా (Lemon Masala) క్యాన్లు కేవలం రూ.70లకే అందుబాటులో ఉండడం విశేషం..

ట్యూబోర్గ్, బడ్‌వైజర్‌, కార్ల్స్‌బర్గ్ ధరలు
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇతర బ్రాండ్ల ధరలు కూడా గోవాలో చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నట్లు తెలుసతోంది.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ కావడం గమనార్హం.

ముఖ్యంగా ట్యూబోర్గ్ గ్రీన్ (Tuborg Green)ధర రూ.80కే లభిస్తోంది. అలాగే ట్యూబోర్గ్ స్ట్రాంగ్ (Tuborg Strong) రూ. 90కే, బడ్‌వైజర్ ప్రీమియం (Budweiser Premium) ధర రూ.100తో, బడ్‌వైజర్ మాగ్నమ్ (Budweiser Magnum) స్ట్రాంగ్ బీర్ రూ.115తో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యువత ఎంతగానో ఇష్టపడే కార్ల్స్‌బర్గ్ స్మూత్ (Carlsberg Smooth)  ధర రూ. 100తో అందుబాటులో ఉంది. దీంతో పాటు కార్ల్స్‌బర్గ్ ఎలిఫెంట్ (Carlsberg Elephant) రూ.115కే అందుబాటులో ఉండడం విశేషం..

Also Read: ఇరాక్ MP ఇంట్లో బంగారు లోదుస్తులు సీజ్.. వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే!

ప్రీమియం, ఇంపోర్టెడ్ బీర్ల ధరల వివరాలు..
కాస్త ఖరీదైన, విదేశీ బ్రాండ్లను ఇష్టపడే వారి కోసం కూడా గోవాలో మరీ చీప్‌ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హైనెకెన్ సిల్వర్ (Heineken Silver) ధర రూ.110కే అందుబాటులో ఉండడం విశేషం.. దీంతో పాటు భారతీయులు ఎంతో ఇష్టపడే  బిరా వైట్ (Bira White) క్రాఫ్ట్ బీర్ ధర రూ.125కే లభిస్తోంది. అలాగే గ్లోబల్ బ్రాండ్ కరోనా ఎక్స్‌ట్రా (Corona Extra) ధర రూ.130కే సేల్‌ చేస్తున్నారు. దీంతో పాటు ఫేమస్ వీట్ బీర్  హోగార్డెన్ (Hoegaarden)  ధర రూ.120కే లభిస్తోంది.

Also Read: ఇరాక్ MP ఇంట్లో బంగారు లోదుస్తులు సీజ్.. వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

0
0
Report

జాతీయ వైద్యుల దినోత్సవం.. తెలంగాణ వైద్యులకు మంత్రి శుభాకాంక్షలు

Baddipadaga, Telangana:

National Doctors Day 2026: తమ నైపుణ్యం ద్వారా ప్రతి రోజూ వేల ప్రాణాలను డాక్టర్లు కాపాడుతున్నారని.. సమాజ ఆరోగ్య పరిరక్షణలో ప్రభుత్వ వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారు' అని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని, వారి సేవలు ఆరోగ్య వ్యవస్థకు ఎంతో కీలకమని ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైద్యులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆధునిక వైద్య సౌకర్యాలు, తగిన మానవ వనరులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులందరికీ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 440 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు, సుమారు 800 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశాం. డాక్టర్లతో పాటు ఇతర పోస్టులను కూడా పెద్ద సంఖ్యలో భర్తీ చేశామని చెప్పారు. సుమారు 15 వేల పోస్టులు భర్తీ చేశాం' అని వివరించారు.

'ఉద్యోగాల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డెంటిస్టుల ఆకాంక్షను నెరవేర్చుతూ 48 డెంటల్ సర్జన్ పోస్టులను భర్తీ చేశాం. ఈ రెండున్నర సంవత్సరాల్లో సుమారు 1,300 మంది డాక్టర్లకు పదోన్నతులు కల్పించాం. డాక్టర్ల దశాబ్ద కాల ఆకాంక్ష ఉస్మానియా నయా హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రారంభించాం. గాంధీ వైద్య కళాశాల, ఉస్మానియా వైద్య కళాశాలల్లో నూతన హాస్టళ్ల నిర్మాణం పూర్తికావొచ్చింది. త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం' అని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు.

'వైద్యులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర సిబ్బందికి మెరుగైన వర్క్ ఎన్విరాన్‌మెంట్ కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాలను 15 శాతం మేర పెంచాం. అద్దె భవనాలు, పాత భవనాల్లో కొనసాగుతున్న మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆధునిక భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం' అని మంత్రి వెల్లడించారు. 

భవిష్యత్తులోనూ వైద్యుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యులు తమ సేవలను కొనసాగించాలని కోరారు. డాక్టర్స్ డే సందర్భంగా మరోసారి రాష్ట్రంలోని వైద్యులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

0
0
Report

ఇరాక్ MP ఇంట్లో బంగారు లోదుస్తులు సీజ్.. దీని ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే!

Hyderabad, Telangana:

Iraqi MP Gold Underwear Seized News: ఇరాక్ దేశాన్ని కుదిపేస్తున్న భారీ అవినీతి, అక్రమ ఆస్తుల వ్యవహారంలో అక్కడి ప్రభుత్వం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఫెడరల్ ఇంటెగ్రిటీ కమిషన్‌తో పాటు ప్రత్యేక భద్రతా దళాలు ఉమ్మడిగా దేశవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఈ భారీ ఆపరేషన్‌లో భాగంగా పలువురు కీలక రాజకీయ నేతలతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు (MPs) జైళు పాలయిన్నట్లు తెలుస్తోంది. వారిలో ముఖ్యంగా ఇరాక్ సిట్టింగ్ ఎంపీ  హింద్ అల్-అబ్బాసిని భద్రతా దళాలు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టించింది.

కుబేరులను మించిన ఎంపీ.. 
సిట్టింగ్ ఎంపీ హింద్ అల్-అబ్బాసి అరెస్ట్ అనంతరం ఆమె నివాసాలతో పాటు కార్యాలయాల్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బయటపడ్డ సంపదను చూసి దర్యాప్తు సంస్థల అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యింది.. ప్రజల సొమ్మును ఏ స్థాయిలో లూటీ చేశారో కళ్లకు కట్టేలా అక్కడ లగ్జరీ వస్తువులు, నోట్ల కట్టలు దర్శనమివ్వడం విశేషం.

అధికారిక నివేదికల ప్రకారం.. ఎంపీ అల్-అబ్బాసి నివాసం నుంచి అధికారులు దాదాపు 57 మిలియన్ డాలర్లతో పాటు భారీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారు ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనితో పాటు ఏకంగా 27 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ఇంటిలో సీజ్‌ చేసిన్నట్లు తెలుస్తోంది.

బంగారు లోదుస్తులు.. 
ఈ సోదాల్లో కేవలం డబ్బు, బంగారమే కాకుండా అధికారులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిన మరో అంశం లగ్జరీ వస్తువులు.. సదరు ఎంపీ నివాసంలో విలాసవంతమైన వస్తువులతో పాటు, ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్న కోట్ల విలువైన బంగారు లోదుస్తులు (Golden Underwear) లభ్యమవ్వడం ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజాధనాన్ని దోచుకుని, ఎంతటి విలాసానికి అలవాటు పడ్డారో భావించవచ్చు.

వందల కోట్లు రికవరీ..
ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి.. అక్రమంగా ఆస్తులు కూడబెట్టిన వారిపై ఇరాక్ ఫెడరల్ అధికారులు ప్రస్తుతం తీవ్రస్థాయిలో దాడులు నిర్వహిస్తోంది. కేవలం హింద్ అల్-అబ్బాసి మాత్రమే కాకుండా.. వివిధ ప్రావిన్సుల్లో డజన్ల కొద్దీ ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నతాధికారులను సైతం భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. దోచుకున్న ప్రతి పైసాను తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేర్చడమే లక్ష్యంగా ఈ  యాంటీ గ్రాఫ్ట్ ప్రక్రియ కొనసాగుతోందని ఉన్నత అధికారులు చెబుతున్నారు..

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

0
0
Report
Advertisement

రేపు తెలంగాణలో కళాశాలల బంద్‌.. విద్యార్థులకు ఎందుకో తెలుసా?

Baddipadaga, Telangana:

July 2nd Colleges Bandh: తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత తొలిసారి అనూహ్యంగా సెలవు లభించనుంది. జూలై నెల ప్రారంభమైన రెండో రోజే కళాశాలలకు బంద్‌ ప్రకటించారు. రేపు అంటే జూలై 2వ తేదీన కళాశాలల బంద్‌ జరగనుంది. కొన్ని విద్యార్థి సంఘాలు ఈ బంద్‌ చేపట్టాయి. విద్యార్థులకు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం.. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారడంతో బీసీ విద్యార్థి సంఘాలతోపాటు ఇతర సంఘాలు కూడా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఇచ్చింది.

ఫీజుల బకాయిలు తక్షణమే చెల్లించాలని.. పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 2 తేదీన రేపు 'కళాశాల బంద్' చేపట్టారు. ఈ బంద్‌కు మద్దతుగా అఖిలపక్ష విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సాయంత్రం జరగనుంది. అంతకుముందు మంగళవారం బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను బీసీ విద్యార్థి సంఘాలు విడుదల చేశాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం బీసీ జేఏసీ ప్రతినిధులు మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు
బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి కళాశాల బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రటకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తప్పు చేస్తోందని మండిపడ్డారు. ఫీజులు అందకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలోనే ఆపేస్తున్నారని, మరికొందరు మనస్తాపంతో ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు బకాయిలను విడుదల చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రావాల్సిన రూ.7 వేల కోట్లు ఫీజులు బకాయి పడ్డాయి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెలిపారు. విద్యార్థుల ఆశలను అడియాశలు చేసిన రేవంత్ రెడ్డి 14 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతున్నాడని మండిపడ్డారు. 

అన్నీ పార్టీలు మద్దతు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి రకరకాల కుట్రలకు పాల్పడుతున్నాడని రేవంత్‌ రెడ్డిపై సీపీఐ సీనియర్‌ నాయకులు అజీజ్‌ పాషా, గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్‌, తాటికొండ విక్రమ్‌ గౌడ్‌, జాజుల లింగంగౌడ్‌ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 9 దానికి నిదర్శనం అని తెలిపారు. జీఓ 9ను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలో యథావిధిగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొనసాగించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ, సీపీఐ, ఇతర విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి.

0
0
Report

YS Jagan Press Meet: చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తిన వైఎస్ జగన్..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపణ!

Vijayawada, Andhra Pradesh:

YS Jagan Latest Press Meet: రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు, రైతాంగ సమస్యలు, కూటమి ప్రభుత్వంలో సాగుతున్న అరాచకాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 'రూల్ ఆఫ్ లా' (చట్టబద్ధ పాలన) స్థానంలో 'రూల్ ఆఫ్ ఫియర్' (భయాందోళనల పాలన) నడుస్తోందని ఆయన ఆరోపించారు.

రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. భయానక వాతావరణం
రెండేళ్ల క్రితం వరకు సంక్షేమం, విద్య, వైద్యం, పరిపాలనా సంస్కరణల్లో విప్లవాత్మక మార్పులతో దేశంలోనే ఏపీ పేరు మారుమోగిందని.. కానీ నేడు కస్టోడియల్ డెత్స్, శవాల మాయం, రెడ్‌బుక్ రాజ్యాంగం, అబద్ధాల పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని జగన్ విమర్శించారు.

చంద్రబాబు తన అవినీతి, దోపిడీని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రతిపక్షాలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులపై అరాచకాలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు పోలీస్ స్టేషన్లపై నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

లాకప్‌ డెత్స్‌.. అమానవీయ ఘటనలు
రాష్ట్రంలో సాగుతున్న 'జంగిల్ రాజ్' (రాక్షస పాలన)కు అద్దం పట్టేలా పలు ఘటనలను వైఎస్ జగన్ ఉదహరించారు. విజయవాడలో సాయికృష్ణ కేసు, పోలీసుల వేధింపులకు బలైన క్రాంతికుమార్ ఉదంతం, కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్, తెనాలిలో తిరుపతమ్మ, శ్రీకాకుళంలో కళావతి కేసులను ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఉదహరించారు. 

"కస్టడీలోని వ్యక్తిని దారుణంగా కొట్టి చంపి, కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వకుండా శవాన్ని మాయం చేయడం అత్యంత అమానవీయ, పాశవిక చర్య. స్టేట్ హెడ్‌క్వార్టర్స్ పోలీసులే దీనికి ఒడిగట్టడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది" అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

డైవర్షన్ పాలిటిక్స్..
ఈ ఘోరాలపై ప్రశ్నిస్తే చంద్రబాబు తన అనుకూల మీడియాతో ఎదురుదాడి చేయిస్తున్నారని.. ప్రజల దృష్టిని మళ్లించడానికి తన పొలిటికల్ పార్టనర్‌ను (సైడ్ క్యారెక్టర్‌లా) తెరపైకి తెచ్చి డ్రామాలు ఆడిస్తున్నారని విమర్శించారు. సాయికృష్ణను మొదట రౌడీషీటర్ అని అవమానించి, జనం ఛీత్కరించుకునేసరికి యూ-టర్న్ తీసుకుని సెక్రటేరియట్‌కు పిలిపించుకున్నారని ఎద్దేవా చేశారు.

నిందితులను కాపాడుతున్న సీపీ, డీజీపీ?
సాయికృష్ణ కేసులో రిమాండ్ రిపోర్టును గమనిస్తే పెద్దలను కాపాడేందుకు దర్యాప్తును ఎలా వీక్ చేస్తున్నారో స్పష్టమవుతోందని జగన్ ఆరోపించారు. 

ఉన్నతాధికారుల బాధ్యత ఏది?: టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను కృష్ణలంక పీఎస్‌కు అప్పగించినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. టాస్క్‌ఫోర్స్ నేరుగా పోలీస్ కమిషనర్ (CP) కింద పనిచేస్తుంది. మరి సిపిని ఎందుకు విచారించడం లేదు?

ఫిర్యాదులను పట్టించుకోలేదు: మే 28న సాయికృష్ణ తల్లి తన కొడుకు లాకప్ డెత్‌పై అనుమానాలు ఉన్నాయని విజయవాడ సీపీకి అర్జీ ఇచ్చినా, బంధువులు డీజీపీకి చెప్పినా ఎందుకు స్పందించలేదు?

రక్షణ వలయం: "ఇక్కడ సీఐని సీపీ కాపాడితే.. సీపీని డీజీపీ, డీజీపీని స్వయంగా చంద్రబాబు కాపాడుతున్నారు" అని జగన్ తీవ్ర విమర్శలు చేశారు. క్రాంతికుమార్ మరణవాంగ్మూలం వీడియో వైరల్ అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాము స్వయంగా బాధితులను పరామర్శించిన 4 రోజుల వరకు అరెస్టులు చేయలేదని, తానే గనుక వెళ్లకపోతే ఈ రెండు కేసులను పూర్తిగా నొక్కేసేవారని స్పష్టం చేశారు.

విజయవాడ నగరంలోనే ఇలాంటి ఘోరాలు జరిగితే.. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా సాగుతున్న ఈ రెడ్‌బుక్ పాలనలో.. ఆధారాలు నాశనం చేయడం, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం సర్వసాధారణమైపోయిందని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతటి మానవహక్కుల ఉల్లంఘనను తామెన్నడూ చూడలేదని జగన్ పేర్కొన్నారు.

Also REad: ముగ్గురు హీరోయిన్లతో హైటెక్ లెవల్ వ్యభిచారం..ముంబైలో చీకటి దందా బట్టబయలు

Also REad; AP New Pension: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Flipkart GOAT సేల్‌లో అదిరిపోయే ఆఫర్‌.. రూ.56 వేలకే Samsung Galaxy S25 ఫోన్‌..

Hyderabad, Telangana:

Flipkart GOAT Sale: ప్రీమియం Samsung స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం Flipkart ప్రారంభించబోతున్న GOAT (Greatest of All Time) సేల్‌లో భాగంగా Samsung ఫ్లాగ్‌షిప్ మొబైల్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను ప్రకటించింది. Samsung గెలాక్సీ సిరీస్‌లో ఎంతో క్రేజ్ ఉన్న Samsung Galaxy S25 5G స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్ ఆఫర్స్‌ అందుబాటులోకి రాబోతున్నాయి.. మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న ఈ ఫోన్‌ను ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే సొంతం చేసుకునే అద్భుతమైన ఛాన్స్ కస్టమర్లకు లభిస్తోంది.

రూ.18 వేల ఫ్లాట్ డిస్కౌంట్.. రూ.56 వేల లోపే..
సాధారణంగా Samsung ప్రీమియం మోడల్స్ ధరలు సామాన్యులకు కాస్త అందుబాటు దూరంలో ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే, ఈ సేల్‌లో 128 GB స్టోరేజ్ వేరియంట్ Samsung Galaxy S25 5G స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర MRP రూ. 74,999తో అందుబాటులో ఉండగా.. ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ. 18,999 ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది.. ఈ సేల్‌లో భాగంగా ఈ ఫ్లాట్ డిస్కౌంట్ వల్ల ఫోన్ ధర ఒక్కసారిగా రూ.56,000 లోపుకు పడిపోతుందని ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది.. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఆఫర్ పెద్ద పండగ లాంటిదని భావించవచ్చు.

అదనంగా బ్యాంక్ ఆఫర్స్..
ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్లకు మరింత ఉపశమనం కలిగించేలా బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తూ వస్తోంది. ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేటప్పుడు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ (Flipkart Axis Bank) లేదా ఎస్‌బీఐ (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే.. వినియోగదారులకు ఏకంగా దాదాపు రూ.3,500 వరకు అదనపు భారీ డిస్కౌంట్ లభిస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరింత అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

రూ. 26,050 ఎక్స్చేంజ్ బోనస్.. 
ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్‌లో అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే భారీ ఎక్స్చేంజ్ ఆఫర్‌గా భావించవచ్చు.. మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే, గరిష్టంగా రూ.26,050 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.. ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ చేసే పాత ఫోన్ కండిషన్ బాగుండి.. గరిష్ట బోనస్‌ను పొందితే.. ఈ ప్రీమియం Samsung Galaxy S25 5G ఫోన్‌ను కేవలం రూ.29,950 లోపే ఆర్డర్‌ చేసుకోవచ్చు.. అయితే, ఈ ఎక్స్చేంజ్ బోనస్ పూర్తిగా మీరు ఎక్స్చేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్‌తో పాటు బ్రాండ్ వ్యాల్యూతో పాటు స్క్రాచెస్ లేకపోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని ఫ్లిప్‌కార్ట్‌ తెలుపుతోంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

India Vs England: గంభీర్ మార్క్ లెవల్ భారీ ప్లాన్..ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు ఓపెనింగ్ జోడీలో భారీ మార్పు!

Hyderabad, Telangana:

India Vs England T20I Series: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ సిరీస్‌లో భారత జట్టు ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే అందులో భారత బ్యాటర్ల వైఫల్యం పెద్ద కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మేనేజ్‌మెంట్ జట్టులో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నేటి నుంచి అనగా జూలై 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ (5 మ్యాచ్‌లు)లో భారత కోచ్ సరికొత్త ప్లాన్‌తో రాబోతున్నారని తెలుస్తోంది.

ఓటమి తర్వాత ఒత్తిడిలో టీమిండియా..
భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత జులై 14 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ పర్యటనకు ముందు ఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సులువుగా గెలుస్తామనుకున్న మ్యాచ్ల్లో భారత బ్యాటర్ల నిర్లక్ష్యం కారణంగా సిరీస్ కోల్పోవడంతో పాటు భారత ఓపెనర్లు పేలవ ప్రదర్శనతో రాణించలేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. దీంతో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో బలమైన ఓపెనర్లను ప్లేయింగ్ లెవెల్ లోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది. 

ఐలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఓపెనింగ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజు సాంసంగ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. గత టీ20 వరల్డ్ కప్ టోర్నీలో వీరి కాంబినేషన్ పెద్దగా క్లిక్ కాలేదు. కానీ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో వీరిని మరోసారి ఓపెనింగ్ భాగస్వాములుగా తీసుకురావడం పట్ల విమర్శలు వెలుగుతున్నాయి. 

అభిషేక్ తోడుగా వైభవ్ సూర్యవంశీ 
వరుస వైఫల్యల నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరుగునున్న టీ20 సిరీస్ భారత భారత తుదిజట్టులో భారీ మార్పులు ఖాయమని సమాచారం అందుతుంది. ఐపీఎల్ 2026 సీజన్లో 16 మ్యాచ్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న యువ కెరటం సూర్యవంశంపై సెలెక్టర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. అయితే నేటి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఖరారు అయినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. 

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ లోనే వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని భావించిన అప్పుడు నిరాశ మిగిలింది. అయితే సంజూ శాంసన్ అభిశిక్ శర్మల పేలవ ప్రదర్శన కారణంగా ఓపెనింగ్ భాగస్వామ్యంలో వైభవ్ కు అవకాశం దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అదే జరిగితే ఇషాన్ కిషన్‌కు వికెట్ కీపర్ బాధ్యతలను విషయానికి చేపట్టే అవకాశం ఉంది.

Also REad: వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు? ఐర్లాండ్‌‌పై ఓటమితో మాజీ క్రికెటర్ సూటిప్రశ్న!

Also Read: టీ20 ప్రపంచకప్‌‌లో భారత్ ఘోర పరాజయం..ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత టోర్నీ నుంచి అవుట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు TGSRTC శుభవార్త.. కొత్తగా పెరిగిన స్టాప్‌ల లిస్ట్ ఇదే!

Hyderabad, Telangana:

Hyderabad To Bangalore New Bus Stops: తెలంగాణ, కర్ణాటక సరిహద్దు రాష్ట్రాలు కావడంతో, ప్రజల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. బంధువుల కోసం లేదా ఉద్యోగాల రీత్యా ఎక్కువ మంది తెలంగాణ నుండి బెంగళూరుకు, అలాగే బెంగళూరు నుండి తెలంగాణకు ప్రయాణిస్తుంటారు. వీరి సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ఒక బంపర్ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణించే వారికి బస్సు సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తూ, ఏసీ, స్లీపర్, నాన్-ఏసీ బస్సుల బోర్డింగ్ , అలైటింగ్ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

బెంగళూరు రూట్లలో కొత్త బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లు ఈ విధంగా ఉన్నాయి:
చందాపూర్ రూట్ ద్వారా వెళ్లేవారు.. చందాపూర్, బొమ్మసంద్ర, ఎలక్ట్రానిక్ సిటీ, బొమ్మనహళ్లి మెట్రో స్టేషన్, మడివాల కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్, అలహంక, బెంగళూరు ఎయిర్‌పోర్ట్ టోల్ ప్లాజా నుండి దేవనహళ్లి బైపాస్ వరకు పాయింట్లు ఉన్నాయి.

పీనియా రూట్ ద్వారా వెళ్లే వారికి.. యశ్వంత్ పురం మెట్రో స్టేషన్ నుండి కెంపెగౌడ బస్ స్టేషన్, బెంగళూరు ఎయిర్‌పోర్ట్ టోల్ ప్లాజా నుండి దేవనహళ్లి బైపాస్ వరకు సౌకర్యం ఉంటుంది.

మార్తహళ్లి రూట్ ద్వారా వెళ్లే వారికి.. వర్టూర్ జంక్షన్ నుండి మార్తహళ్లి, దొమ్మలూరు బ్రిడ్జి, కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్, అలహంక, బెంగళూరు ఎయిర్‌పోర్ట్ టోల్ ప్లాజా,దేవనహళ్లి బైపాస్ మీదుగా బస్సులు వెళ్తాయి.

హైదరాబాద్‌లో బోర్డింగ్, అలైటింగ్ పాయింట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రతిరోజూ హైదరాబాద్ నుండి వందలాది మంది బెంగళూరుకు ప్రయాణిస్తుంటారు. వీరి కోసం పటాన్చెరు, జేబీఎస్, హయత్ నగర్ వంటి ప్రాంతాలలో కొత్త పాయింట్లను అందుబాటులోకి తెచ్చారు.

జేబీఎస్ రూటు ద్వారా వెళ్లే బస్సులు ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వంటి అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఆగుతాయి. అలాగే పటాన్ చెరు నుండి వెళ్లే బస్సులు కూడా పటాన్ చెరు, ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్‌లోని ప్రధాన స్టాపుల్లో ఆగుతాయి. అంతేకాకుండా, హయత్ నగర్ రూట్ నుండి కూడా ఎంజీబీఎస్, ఆరెంజ్ మరియు హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాల్లో బోర్డింగ్, అలైటింగ్ సౌకర్యం ఉంది.

Also Read:​  SIR ఎన్యుమరేషన్ ఫారమ్‌ను తప్పులు లేకుండా ఆన్‌లైన్‌లో ఫిల్ చేయడం ఎలా? స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదిగో!

Also Read:​ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్‌ తీపి కబురు.. భారీగా నిధులు విడుదల

టీజీఎస్‌ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ, బెంగళూరు ప్రజలు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. ప్రయాణికుల సౌకర్యం కోసం  ఇంటికి దగ్గరలో ఉన్న పాయింట్ల వద్ద సులభంగా బోర్డింగ్, అలైటింగ్ చేసుకోవడానికి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు ముందుగానే బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్ల కోసం టీజీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ https://www.tgsrtcbus.in/ ను సందర్శించి, మీకు, మీ కుటుంబ సభ్యులకు కావాల్సిన సీట్లను సులభంగా రిజర్వ్ చేసుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Flipkart GOAT సేల్ ధమాకా.. iPhone 17 సిరీస్‌పై రూ. 22,000 భారీ డిస్కౌంట్!

Hyderabad, Telangana:

Flipkart GOAT Sale 2026 iPhone 17 Offer: యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన శుభవార్తను అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న  ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ (Flipkart GOAT Sale) జూలై 4 నుంచి మొదలు కాబోతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, హోమ్ అప్లయన్సెస్‌తో పాటు స్మార్ట్ వేరబుల్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లను అందిస్తోంది.. అయితే అన్నింటికంటే ముఖ్యంగా.. యాపిల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ అయిన  ఐఫోన్ 17 (iPhone 17) మోడల్స్‌పై ఊహించని స్థాయిలో ఏకంగా రూ.22,000 వరకు భారీ తగ్గింపును అందించబోతున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

బ్యాంక్ ఆఫర్లతో భారీ డిస్కౌంట్‌..
ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ కోసం ప్రముఖ బ్యాంక్ పార్ట్‌నర్లతో అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను అందిస్తూ వస్తోంది. ఐఫోన్ కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన ఫ్లాట్‌ డిస్కౌంట్‌తో పాటు, ఈ సేల్‌లో భాగంగా ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB)తో పాటు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది.. దీనితో పాటు ప్రత్యేకమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండడం విశేషం..

ఐఫోన్ 17 సిరీస్ ధర, ఆఫర్ల వివరాలు..
సాధారణంగా ఐఫోన్ 17 (iPhone 17) స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో ఇది ధర రూ. 82,900తో అందుబాటులో ఉండగా..  ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కేవలం రూ.70,990కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే, A19 చిప్‌సెట్‌తో పాటు 48MP+48MP కెమెరా సెటప్ అందుబాటులో ఉంది..ఇక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం తయారు చేసిన ఈ ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 1,34,000తో అందుబాటులో ఉండగా.. ఈ సేల్‌లో ఏకంగా రూ.22,000 తగ్గింపుతో రూ. 1,12,000కే అందుబాటులో రాబోతోంది. 

ఈ సిరీస్‌లోనే అత్యంత ప్రీమియం మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రో మాక్స్ (iPhone 17 Pro Max) ధర రూ. 1,49,900 నుంచి రూ.1,27,900 కి తగ్గబోతోందని ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకమైన బ్యానర్‌ రన్‌ చేస్తోంది.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.9 ఇంచుల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో పాటు 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన స్క్రీన్ అనుభూతిని అందిస్తుంది. దీంతో పాటు బడ్జెట్ ప్రీమియం రేంజ్‌లో లభించే ఈ ఐఫోన్ 17ఇ (iPhone 17e) స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ.64,900 కాగా.. ఈ సేల్‌లో రూ.60,900 ధరకే అందుబాటులో ఉంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్లిమ్‌తో పాటు స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకునే ఐఫోన్ ఎయిర్ (iPhone Air) రూ. 1,19,900 నుంచి భారీ డిస్కౌంట్‌ తర్వాత రూ.95,900కే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ శక్తివంతమైన A19 ప్రో ప్రాసెసర్ అందించింది. యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్‌లను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ ఫ్లిప్‌కార్ట్ GOAT సేల్ ఒక అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. జూలై 4న ప్రారంభమయ్యే ఈ సేల్‌లో స్టాక్ ముగిసేలోపే మీ నచ్చిన ఐఫోన్‌ను బుక్ చేసుకోండి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top