icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow28 Jul 2024, 02:18 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement
Advertisement
Advertisement

Tirumala: తిరుమల సేవలో జపాన్ ఓపెన్ చాంపియన్ పీవీ సింధు.. ఇతర ప్రముఖులు

Tirupati Urban, Andhra Pradesh:

PV Sindhu In Tirumala: కోరిన కోరికలు మొక్కులు తీర్చే కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సాధారణ భక్తులతోపాటు వీఐపీలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. శనివారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా, తమిళనాడు మంత్రి వినోద్‌, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఎమ్మెల్సీ పద్మశ్రీ తిరుమలకు విచ్చేసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టీటీడీ అధికారులు ప్రముఖులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

స్వామి సేవలో పీవీ సింధు
తిరుమల శ్రీవారిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఉదయాస్తమాన సేవలో భాగంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న పీవీ సింధు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు పీవీ సింధుకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన పీవీ సింధిని చూసేందుకు ఆలయ పరిసరాల్లో భక్తులు ఆసక్తి చూపించారు. ప్రపంచ వేదికపై ఇటీవల చాంపియన్‌గా నిలిచి భారతదేశానికి పీవీ సింధు గౌరవం తీసుకువచ్చారు. బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక జపాన్‌ ఓపెన్‌లో పీవీ సింధు చాంపియన్‌గా నిలిచారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఒక టైటిల్‌ సాధించడంతో సింధు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు.

కొనసాగుతున్న భక్తుల రద్దీ
నిన్న శ్రీవారిని మొత్తం 71,393 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 27,846 మంది భక్తులు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం హుండీ కానుకలు రూ.4.46 కోట్లు వచ్చాయని.. లడ్డూ విక్రయాలు 4.33 లక్షలు జరిగాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక అన్నప్రసాదాలు 2.58 లక్షల మంది భక్తులు స్వీకరించారని.. వైద్య సేవలు 2,946 మంది భక్తులు పొందారు. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో 31 కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్ ఉంది. సర్వదర్శనానికి (ఎస్‌ఎస్‌డీ టోకెన్‌లు లేకుండా) 12 గంటలు సమయం పడుతోంది.

0
0
Report

ప్రాజెక్టులపై అవగాహన లేని కేటీఆర్‌ మళ్లీ అమెరికాలో ఉద్యోగానికి వెళ్లాలి

Old Pochampad, Telangana:

BRS Party vs Ministers: తెలంగాణ ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అవగాహన లేదని.. ఆయన మరోసారి ఉద్యోగం చేసుకునేందుకు అమెరికా వెళ్లాలని తెలంగాణ మంత్రి వివేక్‌ వెంకటస్వామి సూచించారు. ప్రాజెక్టుల విషయమై కేటీఆర్‌, హరీశ్‌ రావు ఇద్దరూ కలసి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు రావొద్దని బీఆర్‌ఎస్‌ పార్టీ కోరుకుంటోందని తెలిపారు. కాంగ్రెస్‌ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే నీళ్లు ఇచ్చుకుంటున్నామని చెప్పారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తుతుండడంతో వాటిని పరిశీలించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్‌ నిర్మల్ జిల్లాకు వచ్చారు. అనంతరం నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీటి మట్టం, ఇన్ ఫ్లోలు పరిశీలించిన అనంతరం మంత్రి వివేక్‌ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌, హరీశ్ రావులపై తీవ్ర విమర్శలు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ ప్రభుత్వంపై భారం పడిందని.. 60 టీఎంసీల నీరు వృథా కావడమే కాకుడా సుమారు రూ.3 వేల కోట్ల నష్టం మిగిలిందని వివేక్‌ వెంకటస్వామి విమర్శించారు. కేటీఆర్‌కు ప్రాజెక్టులపై అవగాహన లేదని.. మళ్లీ అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకోవడం మంచిదని ఎద్దేవా చేశారు. హరీశ్‌ ‌రావుతో కలిసి కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. వర్షాలు రాకూడదని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారని మండిపడ్డారు.

ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టిందని.. తామే కట్టామంటూ బీఆర్ఎస్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తప్పుబట్టారు. వాళ్లు (బీఆర్ఎస్‌ పార్టీ) కట్టిన ప్రాజెక్టులు కూలిపోయాయని తెలిపారు. ఎస్సారెస్పీకి పూర్వవైభవం తీసుకువస్తామని ప్రకటించారు. త్వరలోనే ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు సాగునీటిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు రాష్ట్రానికే గర్వకారణం అని ప్రకటించారు.

0
0
Report

తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల అప్ డేట్ పై ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు..!!

BBhoomi3h ago
Lakshmapur, Telangana:

Telangana EHS health card: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు మరింత సులభంగా, నాణ్యంగా అందేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (NEHS) అమలు ప్రక్రియను పటిష్టం చేస్తూ ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక (EBS-V) శాఖ స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్ జులై 31, 2026 నాటి సర్క్యులర్ మెమో ద్వారా అన్ని విభాగాల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు.

కొత్త హెల్త్ స్కీమ్ (NEHS) ప్రాముఖ్యత:
ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అలాగే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మెరుగైన కార్పొరేట్,  నిబంధనల పరిధిలోని వైద్య చికిత్సలను అందించడమే ఈ ఈహెచ్‌ఎస్ (EHS) ముఖ్య ఉద్దేశం. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయడానికి ఈ డేటా సేకరణ అత్యంత కీలకంగా మారింది.

IFMIS పోర్టల్‌లో కొత్త మార్పులు:
నూతన హెల్త్ కార్డుల మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక మార్పులు చేసింది. ఇందులో భాగంగా 'ఐఎఫ్ఎంఐఎస్' (IFMIS) పోర్టల్‌లోని "Employee Master" మోడ్యూల్‌లో డ్రాయింగ్ అండ్ డిస్‌బర్సింగ్ ఆఫీసర్ల (DDO) లాగిన్‌లకు అదనపు ఫీల్డ్స్‌ను జోడించింది. ఉద్యోగులు,  వారి కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని, సంబంధిత సర్వీస్ రికార్డులు,  ధ్రువీకరణ పత్రాల ఆధారంగా డీడీఓలు నిశితంగా పరిశీలించి ఈ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

ఆగస్టు 15 ఆఖరి తేదీ:
రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఉద్యోగి లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుడు ఈ పథకం నుంచి మినహాయించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. డీడీఓలు తమ పరిధిలోని సమాచారాన్ని సరిచూసి ఆగస్టు 15, 2026 నాటికి అప్‌డేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

కార్డుల జారీలో ఆలస్యం జరగకుండా ఉండాలంటే నిర్దేశిత కాలపరిమితిలోగా డేటా నవీకరణ పూర్తవ్వడం అత్యవసరమని అధికారులు స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా డీడీఓలు డేటా నమోదు పూర్తి చేసిన వెంటనే అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు నూతన ఈహెచ్‌ఎస్ (EHS) హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కాబట్టి ఉద్యోగులు కూడా తమ వివరాలను తక్షణమే డీడీఓల వద్ద సరిచూసుకోవాలని సూచించింది.

Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి

Also Read:  ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా

Also Read:  ఆ పరిచయమే కొంపముంచిందా?

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report
Advertisement

EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు.. అసలు కారణం ఇదే..!!

BBhoomi3h ago
Lakshmapur, Telangana:

EPF Pension: ప్రతి నెలా క్రమం తప్పకుండా తమ ఖాతాల్లో జమ కావాల్సిన ఈపీఎఫ్ఓ పింఛను నిధులు, ఆగస్టు 1వ తేదీ నాటికి కూడా జూలై నెలకు అందకపోవడంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారు. ఈపీఎఫ్ఓ సిస్టమ్స్‌లో చేసిన కొత్త సాఫ్ట్‌వేర్ మార్పులు, కేంద్రీకృత డేటాబేస్ అప్‌గ్రేడ్ ప్రక్రియే ఈ ఆలస్యానికి కారణమని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా, ఈపీఎఫ్ఓ పింఛను నిధులు ప్రతి నెలా 27వ తేదీలోగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. అయితే, ఈసారి సాంకేతిక మార్పుల వల్ల చెల్లింపులు ఆలస్యమయ్యాయి. ఫలితంగా, తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది పింఛనుదారులు తమ రోజువారీ అవసరాలు, వైద్య ఖర్చులు తీర్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణ: సుమారు 4.63 లక్షల మంది పింఛనుదారులు

ఆంధ్రప్రదేశ్: సుమారు 3.29 లక్షల మంది పింఛనుదారులు

ఆలస్యానికి ప్రధాన కారణం ఏమిటి?

ఈపీఎఫ్ఓ ఇటీవల తన పాత సాంకేతిక వ్యవస్థ స్థానంలో కేంద్రీకృత డేటాబేస్‌ను ఏర్పాటు చేసింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా పింఛన్ల ప్రాసెసింగ్, ఆమోదం జరుగుతోంది. కొత్త సిస్టమ్‌లోకి డేటాను మార్చేటప్పుడు ఈ సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. 

ఈపీఎఫ్‌ఓ పెన్షన్: పెన్షన్ నిధులు ఎప్పుడు జమ అవుతాయి?  
పెన్షనర్లకు ఈపీఎఫ్‌ఓ వర్గాలు కొంత ఉపశమనం కల్పించాయి:

స్లాట్ పూర్తి: రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చెల్లింపుల ప్రాసెసింగ్ స్లాట్ శుక్రవారానికే పూర్తయినట్లు సమాచారం. దీంతో నిధుల విడుదల ప్రక్రియ వేగవంతమైంది.

జమ చేసే తేదీ: సాంకేతిక సమస్యలు పరిష్కారమైనందున, శనివారం లేదా సోమవారం నాటికి పెన్షనర్ల ఖాతాల్లో నిధులు పూర్తిగా జమ అవుతాయని స్పష్టం చేశారు.

ఒక నెలకు పరిమితం: ఈ జాప్యం జూలై నెలకు మాత్రమే పరిమితం. రాబోయే నెలల్లో (ఆగస్టు నుండి) పెన్షన్లు యధావిధిగా పాత సమయానికి (నెల చివరి నాటికి) జమ అవుతాయి. 

Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి

Also Read:  ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా

Also Read:  ఆ పరిచయమే కొంపముంచిందా?

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

Korean Kanakaraju Trailer:'కొరియన్ కనకరాజు' ట్రైలర్ వచ్చేసింది! వరుణ్ తేజ్ డ్యుయెల్ రోల్..సత్య వేరే లెవల్ కామెడీ!

Hyderabad, Telangana:

Korean Kanakaraju Trailer Out: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఆగస్టు 7న ఈ సినిమా విుడదల కానుంది. ఇటీవలే యమా జోష్‌లో ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాలో కామెడీతో పాటు యాక్షన్, అతీంద్రియ శక్తుల అంశాలను మిళితం చేసి ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా రూపొందిచినట్లు తెలుస్తోంది. 

ట్రైలర్‌లోని అతిపెద్ద హైలైట్‌లలో ఒకటి వరుణ్ తేజ్ ద్విపాత్రాభినయం. హీరో వరుణ్ తేజ్ పోషించిన పాత్ర కనకరాజు అనంతపురానికి చెందిన యువకుడిగా, కొరియన్ మాఫియా డాన్‌గా రెండు పూర్తిగా విభిన్నమైన పాత్రలను పోషించాడు. ప్రతి పాత్రకు తగినట్లుగా అతను తన రూపాన్ని, హావభావాలను, బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకోవడం ట్రైలర్‌లో చూడవచ్చు. ఇది ఆ రెండు పాత్రలను విభిన్నంగా కనిపించేలా, అనిపించేలా చేస్తుంది. పాత్రల వ్యక్తిత్వాల మధ్య వైరుధ్యం సినిమాలోని కామెడీకి, అలాగే యాక్షన్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.

ఈ కథ హారర్, కామెడీలను కలగలిపి యాక్షన్ సన్నివేశాలను కూడా జోడించినట్లుగా కనిపిస్తుంది. విభిన్న సంస్కృతుల నేపథ్యం రెండు వేర్వేరు ప్రపంచాలను ఒకచోట చేర్చి, ఉత్కంఠ, హాస్యం రెండింటికీ దారితీసే పరిస్థితులను సృష్టిస్తుంది. 

ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ట్రైలర్ అంతటా అనేక ఫన్నీ వన్ లైనర్ డైలాగులతో అలరించారు. అతని కామెడీ టైమింగ్ కథకు తేలికపాటి ఊపును అందిస్తుంది. అలాగే ఉత్కంఠభరితమైన సన్నివేశాల్లో ఉపశమనాన్ని కలిగించేలా చేస్తుంది.

వరుణ్ తేజ్‌తో అతని సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఈ ట్రైలర్‌లో హీరోయిన్ రితికా నాయక్ అంతగా కనిపించలేదు. కానీ, ట్రైలర్ ఆద్యంతం హీరో వరుణ్ తేజ్, హాస్యనటుడు సత్య తమ ఇన్సెన్టివ్ డైలాగులతో అలరించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించగా.. ఇప్పటికే విడుదలైన రెండు పాటల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

Also Read: అందంలో హీరోయిన్లను మించిపోయిన నటి రోజా కూతురు..అన్షు లేటెస్ట్ ఫొటోలు!

Also Read: రెండో పెళ్లికి సిద్ధమైన నటి సురేఖా వాణి! కూతురు సుప్రీత పెళ్లి కూడా అప్పుడేనట!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

హైదరాబాద్ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే టికెట్..!!

BBhoomi4h ago
Lakshmapur, Telangana:

Hyderabad Metro: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రజా రవాణాను మరింత సులభం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మెట్రో రైలు, టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఒకే టికెట్ తో ప్రయాణించే వెసులుబాటును త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ అధ్యక్షతన జరిగిన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించారు. 

ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో, ఆర్టీసీ సేవలను అనుసంధానిస్తూ.. కామన్ మొబిలిటీ టికెటింగ్ విధానాన్ని రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం టీజీఎస్ ఆర్టీసీ అధికారులతో సంప్రదింపు జరపాలని.. ప్రయాణికులందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఉమ్మడి మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలని సూచించారు. అంతేకాదు మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రోజువారీ, వారపు, నెలలవారీ ట్రావెల్ పాసులను ప్రవేశపెట్టే అవకాశాలను కూడా పరిశీలించాలని కోరారు. మెట్రో నెట్ వర్క్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను ద్రుష్టిలో ఉంచుకుని అదనపు మెట్రో కోచ్ లు కొనుగోలు ప్రక్రియను వేగవంతం  చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మెట్రో రెండో దశకు సంబంధించి భూసేకరణ, ఇతర పనుల పురోగతిని కూడా సమీక్షించారు. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండవ దశ అనుమతుల తాజా ప్రగతిని సీఎస్ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. అదనపు బోగీలను కూడా వీలైనంత త్వరగా సమీకరించేందుకు తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. 

ఈ సమావేశంలో రోడ్లు,రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, డీజీపీ  శాంతి భద్రతలు మహేష్ భగవత్,  బోర్డు అఫ్ డైరెక్టర్లు మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్,  ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ వర్క్స్, సీవరేజ్ బోర్డు ఎండీ కె.అశోక్ రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.

Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి

Also Read:  ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా

Also Read:  ఆ పరిచయమే కొంపముంచిందా?

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report
Advertisement
Advertisement
Back to top