చర్లపల్లి జోరువానలో కూలీ పనికి వచ్చిన ఓ బాలికను చూసి సంజయ్ కారు ఆపాడు
Karimnagar, Telangana:కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గం చర్లపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. కూలీల గుంపులో ఓ మైనర్ బాలికను చూసి.. 'అమ్మా.. పనికి వెళ్తున్నావా? నీకు చదువుకోవాలని అనిపించలేదా నీ కుటుంబ పరిస్థితి గురించి అడిగాడు. తన పేరు బొల్లా అక్షయ్ అని, తాను 10వ తరగతి పాసయ్యానని, అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో కూలీ పనులకు వెళ్తున్నానని బదులిచ్చారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Abhishek Sharma Fined: ఐపీఎల్లో అభిషేక్ శర్మకు ఎదురుదెబ్బ..మ్యాచ్ గెలిచినా తప్పని తిప్పలు..జరిమానా కట్టాల్సిందే!
Kolkata, West Bengal:Abhishek Sharma Fined In IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నిన్న ఏప్రిల్ 2న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 65 రన్స్ భారీగా తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్లో సన్రైజర్స్ తొలి బోణీ కొట్టింది. అయితే తొలి గెలుపు ఆనందంలో ఉన్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి షాక్ ఇచ్చింది. ఐపీఎల్ నిబంధనలను ఉల్లఘించిన కారణంగా మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్న ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.
ఏం జరిగిందంటే?
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు తేల్చారు. అందుకు అనుగుణంగా అభిషేక్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అభిషేక్ శర్మకి కూడా తన ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ బీసీసీఐ చేర్చింది. ఐపీఎల్ రూల్స్లోని ఆర్టికల్ 2.3 కింద లెవెల్ 1 నేరానికి పాల్పడినట్లు అభిషేక్ శర్మ అంగీకరించినట్లు తేలింది. మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాకు అభిషేక్ శర్మ స్వీకరించడంతో ఇందులో తదుపరి విచారణ లేకుండా పోయింది.
ఎందుకు ఈ జరిమానా?
అయితే అభిషేక్ శర్మ ఏ కారణంగా జరిమానా విధించారో అనే విషయాన్ని ఐపీఎల్ తన అధికారిక ప్రకటనలో స్పష్టంగా చెప్పలేదు. అయితే ఆర్టికల్ 2.3 అనేది సాధారణంగా మ్యాచ్ జరగుతున్న సమయంలో అనుచిత భాషను మాట్లాడినా.. లేదా అసభ్య పదజాలంతో దూషించే వంటి అంశాలు ఈ రూల్ కిందకి వస్తాయి. అయితే అభిషేక్ శర్మ వికెట్ పడిన క్రమంలో అది నాటౌట్ను అంపైర్ ఔట్గా ప్రకటించడంపై తీవ్ర నిరాశకు లోనయ్యాడు. దీంతో ఆ ఉద్వేగభరిత క్షణంలో అభిషేక్ శర్మ నోరు జారినట్లు చెబుతున్నారు. అయితే ఆ సంఘటన ఈ జరిమానాకు కారణం అయ్యిండొచ్చని చెబుతున్నారు.
ఓ వైపు జరిమానా విధించినా.. మరోవైపు అభిషేక్ శర్మ కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. కేవలం 21 బంతుల్లో 48 పరుగులు (4 సిక్సర్లు, 4 ఫోర్లు) రాబట్టి.. సన్రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇదే తరుణంలో అభిషేక్ ఓ అరుదైన మైలురాయిని చేరాడు. సన్రైజర్స్ టీమ్ తరఫున 100 సిక్సర్లు బాదిన రికార్డు గతంలో డేవిడ్ వార్నర్ ఖాతాలో ఉండగా.. ఇప్పుడు దాన్ని అభిషేక్ శర్మ (మొత్తం 101 సిక్సర్లు) చేరుకున్నాడు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కేకేఆర్ 16 ఓవర్లలోనే 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahabubnagar: ఒక చిన్న మార్పు.. ఎన్నో ప్రాణాలకు రక్షణ.. వెంకట్రాంపురం గ్రామస్తులకు హ్యాట్సాఫ్!
Hyderabad, Telangana:Mahabubnagar Latest Telugu News: సాధారణంగా గ్రామ పొలిమేరలో మా ఊరికి స్వాగతం అని రాసి ఉన్న బోర్డులను మనం తరచుగా చూస్తూ ఉంటాం..కానీ మహబూబ్నగర్ జిల్లా వయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామం శివారులోకి వెళ్తే మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది.. హెల్మెట్ లేని వాహనదారులకు మా గ్రామంలోకి ప్రవేశం లేదు అంటూ అక్కడ వెలసిన బ్యానర్లు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్యానర్లు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీ అంశానికి దారితీస్తున్నాయి. ఆ ఊరిలో ఈ బ్యానర్లు వెలవడానికి గల కారణాలేంటి? అసలు వీటిని ఎవరు పెట్టారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గత కొంతకాలంగా మండల వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్లే అనేకమంది యువకులు ప్రాణాలు కోల్పోవడం.. తీవ్రమైన తల గాయాలతో మంచాన పడటం చూసి గ్రామస్తులు చలించి పోయారు.. ప్రాణ నష్టం జరిగినప్పుడు ఆ కుటుంబాలు పడే వేదనను కళ్లారా చూసిన ఊరి పెద్దలతో పాటు యువకులు కలిసి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు.. కేవలం జరిమానాల కోసం కాకుండా.. ప్రాణ రక్షణ కోసమే హెల్మెట్ ధరించాలని స్పృహను కల్పించేందుకు ఈ వినూత్న నిరసనను చేపట్టినట్లు తెలుస్తోంది.
గ్రామ శివారులో బుధవారం గ్రామస్తులందరూ కలిసి ప్రధాన రహదారిపై ఒక భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు హెల్మెట్ లేకుండా మా గ్రామంలోకి రావద్దు అంటూ స్పష్టమైన హెచ్చరికను అందులో పేర్కొన్నారు.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.. బయటి వ్యక్తులైన గ్రామస్తులైన ఈ రూల్ కు అతిథులు కారని.. నిబంధనలు పాటించని వారిని గ్రామస్తులు సరిహద్దుల పట్టే అడ్డుకోవడం జరుగుతుందని.. అక్కడి గ్రామస్తులు తెలిపారు..
గ్రామస్తులు స్వచ్ఛందంగా తీసుకున్న ఈ నిర్ణయం పై పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. సాధారణంగా పోలీసులు హెల్మెట్ పెట్టుకోమని చెబితే వినని ఈ రోజుల్లో.. ఒక గ్రామమే ఏకగ్రీవంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేస్తుంది.. కానీ ప్రజల్లో వచ్చే ఇలాంటి మార్పు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుందని.. స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులు చెబుతూ వస్తున్నారు..
వెంకట్రాంపురం గ్రామస్తుల ఆలోచన ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకుతోంది.. ఒక చిన్న మార్పు పెద్ద ప్రాణాలను కాపాడుతుందని నమ్మకంతో వారు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని అందరూ కోరుకుంటున్నారు.. ఈ గ్రామం చూపిన బాటలో మరిన్ని గ్రామాలు పయనిస్తే రోడ్డు ప్రమాదాల రహిత సమాజం తప్పకుండా సాధ్యమవుతుందని కొంతమంది అధికారులు చెబుతున్నారు.
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mangala Aditya Rajayoga 2026: ఈ 4 రాశుల వారికి రాజభోగాలు.. మంగళ ఆదిత్య రాజయోగం తెచ్చే అద్భుత ఫలితాలివే!
Hyderabad, Telangana:Mangala Aditya Rajayoga 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ గమనాలు మానవ జీవితం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. 2026 సంవత్సరంలో గ్రహాలు కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన మంగళ ఆదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. సూర్యుడు, కుజుడు ఒకే రాశిలో కలయిక జరపడం వల్ల ఏర్పడే ఈ రాజయోగం అన్ని రాశుల వారిపై సమాన ప్రభావం చూపుతుంది. కానీ ఈ సమయంలో నాలుగు రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో అదృష్టం వరించడంతో కొన్ని రాశుల వారికి ఎన్నో రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతున్నాయి అంతేకాకుండా జీవితం కూడా చాలా అద్భుతంగా సాగిపోతోంది.. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోతున్న రాశులేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేషరాశి
మేష రాశిలో జన్మించిన వ్యక్తులకు ఆదిత్య మంగళ రాజయోగం వల్ల అద్భుతమైన వృద్ధి కనిపిస్తుంది. అంతేకాకుండా నిలిచిపోయిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి.. గతంలో నుంచి చేస్తున్న పనులు కూడా ఇప్పుడు చివరి స్థాయికి చేరుకుంటాయి. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా అనుకోకుండా సమాజంలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. తండ్రి వైపు నుంచి ఉన్న ఆస్తులు కూడా భారీ మొత్తంలో పొందగలుగుతారు. అంతేకాకుండా విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే అనుకుంటున్న పనుల్లో విపరీతమైన ధన లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆదిత్య మంగళ రాజయోగం రాజభోగాలను తెచ్చి పెట్టబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా స్థిరాస్తి వివాదాలు పూర్తిగా పరిష్కారం కాబోతున్నాయి. కొత్త ఇళ్లతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే సూచనలు బలంగా ఉన్నాయి. అంతేకాకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అద్భుతమైన ధన లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు విదేశీ ప్రయాణాలు చాలా అద్భుతంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. పెట్టుబడిల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు అనేక సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hanumakonda: స్విమ్మింగ్ పూల్లో శవాలై తేలిన తల్లీకూతుళ్ల కేసులో వీడిన మిస్టరీ.. హతమార్చింది అతడే!
Hyderabad, Telangana:Mother And Two Children Swimming Pool Death Update: హనుమకొండ జిల్లాలో జరిగిన స్విమ్మింగ్ పూల్ మృతదేహాల ఘటనలో మిస్టరీ వీడింది. ఈ దారుణం మళ్ళీ ఆడపిల్ల పుడుతుందనే భయంతోనే భార్యా, ఇద్దరు కూతుర్లను హతమార్చింది భర్త అజారుద్దీన్ అని తేలింది. పోలీసుల ప్రకారం.. ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో నిన్న స్విమ్మింగ్ పూల్ లో విగత జీవులుగా ఈ ఫర్హాత్ (26), ఆమె కుమార్తెలు పడి ఉన్నారు. భార్యకు రెండుసార్లు అబార్షన్ చేయించాడు భర్త అజారుద్దీన్. అయితే, 4 ఏళ్ల తర్వాత మళ్లీ భార్య గర్భం ధరించింది. దీంతో మళ్ళీ అమ్మాయే పుడుతుందనే భయంతో భార్యతో పాటు ఇద్దరు కూతురు ప్రాణాలు కూడా తీశాడు. అయితే స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తు పడ్డారని పోలీసులును నమ్మబలికాడు. తమదైన స్టైల్ లో పోలీసులు విచారంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆడపిల్ల పుడుతుందని మరోసారి స్కానింగ్ చేయించాడా? లేదా? అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో అజారుద్దీన్ ఉన్నాడు. విచారణ చేస్తున్నారు. అయితే కుటుంబీకుల ప్రకారం కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయని సమాచారం. అందుకే కూతురు, మనవరాళ్ల మృతి పై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫరాద్ తల్లిదండ్రులు.
Also Read: తిరుమలకు వెళ్తుండగా ఘోర విషాదం.. కుటుంబాన్ని చిదిమేసిన కారు ప్రమాదం, ముగ్గురి స్పాట్ డెడ్..!
Also Read: ఇన్స్టాగ్రామ్ ప్రేమ విషాదాంతం.. యువకుడితో కలిసి కాలువలోకి దూకి వివాహిత ఆత్మహత్య..!
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక మృతదేహాలను నిన్న పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే మొదటగా వారిది ప్రమాదవశాత్తు మరణంగా బుకాయించాడు అజారుద్దీన్. తాను ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. తిరిగి వచ్చేసరికి ముగ్గురు నీళ్లలో పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పాడు. అయితే ఫర్హాత్ ,అజారుద్దీన్ కొన్ని రోజులుగా గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అబార్షన్లు కూడా జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆడపిల్ల పుడుతుందని కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. ఘటన స్థలంలో ఉన్న సీసీటీవీ ఫూటేజీ కూడా నిన్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు స్విమ్మింగ్ పూల్ లో పడటంతో వారిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా పడిపోయిందని అంత భావించారు. తాజాగా భర్త అజారుద్దీన్ వారిని హత్య చేశారని అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hanuman Shobha Yatra 2026: హనుమాన్ శోభాయాత్రలో మహిళల సందడి..కోలాటంతో ఆకట్టుకున్న వనితలు!
Hyderabad, Telangana:Hyderabad Hanuman Shobha Yatra 2026: హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు ఘనంగా జరిగింది. ఈ శోభాయాత్రలో పాల్గొన్న హిందూ మహిళలు కోలాటంతో సందడి చేశారు.Good Friday Holiday 2026: నేడు వారంలో రెండో సెలవు..నిలిచిపోనున్న స్టాక్ మార్కెట్లు..రేపు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఉంటుందా?
Mumbai, Maharashtra:Stock Market Holiday Today: గుడ్ ఫ్రైడే సందర్భంగా భారత స్టాక్ మార్కెట్ ఈరోజు అనగా శుక్రవారం ఏప్రిల్ 3, 2026న మూతపడనుంది. ఈరోజు స్టాక్ మార్కెట్ సెలవుదినం కారణంగా ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలైన BSE, NSEలలో ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేయనున్నారు. ఈ వారంలో ఇది రెండవ మార్కెట్ సెలవు, అయితే అదే విధంగా ఏప్రిల్ నెలలో మొదటిది. ఈ వారం ప్రారంభంలో మహావీర్ జయంతి సందర్భంగా మార్చి 31న స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) స్టాక్ మార్కెట్ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే సందర్భంగా ట్రేడింగ్ సెలవుగా చూపిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా ప్రకారం.. ఈక్విటీ సెగ్మెంట్, కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్స్ & NDS-RST, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ట్రై పార్టీ రెపో సెగ్మెంట్లు, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR) సెగ్మెంట్, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లలో ఈరోజు ట్రేడింగ్ నిలిపివేయనున్నారు. అయితే గుడ్ఫ్రైడే తర్వాత శనివారం (ఏప్రిల్ 4), ఆదివారం (ఏప్రిల్ 5) కావడం వల్ల స్టాక్ మార్కెట్లకు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చినట్లు అయ్యింది. ఈ క్రమంలో సాధారణ కార్యకలాపాలు ఏప్రిల్ 6 సోమవారం నాడు తిరిగి ప్రారంభమవుతాయి.
ఇదిలా ఉండగా గుడ్ ఫ్రైడే నేషనల్ హాలీడే కారణంగా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రధాన మార్కెట్లు కూడా నేడు మూతపడనున్నాయి. ఆసియా, యూరోపియన్ దేశాల్లో కొన్ని మార్కెట్లతో పాటు ఈ శుక్రవారం యూఎస్ స్టాక్ మార్కెట్ కూడా ట్రేడింగ్ కోసం మూతపడనుంది.
కమోడిటీ మార్కెట్ సెలవుదినం
దేశంలోనే అతిపెద్ద కమోడిటీ ఎక్స్ఛేంజ్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX), గుడ్ ఫ్రైడే సెలవుదినం సందర్భంగా ఏప్రిల్ 3 తేదీన మూతపడనుంది. MCX ఉదయం, సాయంత్రం సెషన్లు రెండింటిలోనూ సెలవు పాటిస్తుంది. అందువల్ల MCXలో బంగారం, వెండి, రాగి, బేస్ మెటల్స్, ముడి చమురు వంటి కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ రోజంతా సెలవుగా ఉండనుంది.
ఏప్రిల్లో రాబోయే సెలవులు
ఏప్రిల్ 3 అనగా నేటి గుడ్ఫ్రైడే సెలవుతో కలిపి ఏప్రిల్ నెలలో మొత్తం రెండు స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో తదుపరి స్టాక్ మార్కెట్ సెలవు 14వ తేదీన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా BSE, NSE సెలవుగా ఉండనున్నాయి. అందువల్ల వారాంతాలు కాకుండా ఈ నెలలో భారత స్టాక్ మార్కెట్ మరో రెండు రోజులు మూతపడనున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది స్టాక్ మార్కెట్కు 20 సెలవులు ఉండగా, వాటిలో నాలుగు వారాంతాల్లో అనగా శని, ఆదివారాల్లో వస్తున్నాయి. దీంతో సాధారణ పనిదినాల్లో మార్కెట్లు ట్రేడింగ్ కోసం మూతపడే సెలవు రోజుల సంఖ్య మొత్తం 16కి చేరింది. వీటిలో మార్కెట్లు ఇప్పటికే ఐదు సెలవులను పూర్తి చేసుకున్నాయి.
Also Read: Good Friday Wishes 2026: గుడ్ఫ్రైడే విషెస్ 2026, మెసేజెస్, గ్రీటింగ్స్, కోట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KKR vs SRH: కేకేఆర్కు రెండో ఓటమి.. 46 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం
Kolkata, West Bengal:KKR vs SRH Highlights: ఆల్ రౌండ్ ప్రదర్శనతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలర్లు బంతులతో చెలరేగి కలకత్తా నైట్రైడర్స్ జట్టును చిత్తు చేశారు. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన సన్రైజర్స్ రెండో మ్యాచ్కు గొప్పగా పుంజుకుని ఆడి మ్యాచ్ను సొంతం చేసుకుంది. కలకత్తాపై 65 పరుగుల భారీ తేడాతో సన్రైజర్స్ విజయం సాధించింది. అన్నింటిలో విఫలమైన కలకత్తా రెండో ఓటమిని చవిచూసింది.
Also Read: Harsha Veena: బ్రేకింగ్.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన పార్టీ దాడి
ఐపీఎల్ 2026 సీజన్లో ఆరో మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగ్గా.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కలకత్తా జట్టు 16 ఓవర్లలోనే 161కి కుప్పకూలిపోయింది. సన్రైజర్స్ బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా ఆడడంతో కలకత్తాను సునాయాసంగా ఓడించారు. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక ఓటమి.. విజయంతో సన్రైజర్స్ ఉండగా.. కలకత్తా జట్టు మాత్రం ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమిని చవిచూసింది.
Also Read: Chandrababu: అమరావతి అన్స్టాపబుల్.. ఇక రాజధానిపై ఎవరూ ఏం చేయలేరు: సీఎం చంద్రబాబు
తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ అద్భుతంగా ఆడి 226 పరుగులు సాధించింది. తొలి ఓవర్ నుంచి ఓపెనర్లు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో పవర్ ప్లే ముగిసేసరికి స్కోర్ 80 పరుగులు దాటింది. పదో ఓవర్ వచ్చేసరికి సన్రైజర్స్కు కష్టాలు మొదలయ్యాయి. ఒక్క బ్యాటర్ కూడా భారీ హిట్టింగ్ చేయలేకపోయారు. అందరూ ఔటవుతున్న వేళ క్లాసెన్ అద్భుతంగా ఆడి జట్టుకు భారీ పరుగులు అందించాడు. 35 బంతుల్లో 52 పరుగులు చేయగా... వాటిలో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అంతకుముందు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ భారీ హిట్టింగ్లతో శుభారంభం చేశారు. హెడ్ 21 బంతుల్లో 46 చేసి 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదితే.. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 చేసి కొద్దిలో అర్ధ శతకాన్ని కోల్పోయాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 14 పరుగులు మాత్రమే చేయగా. అనికేత్ వర్మ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. అనంతరం నితీశ్ కుమార్ 39 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. హర్ష్ దూబే (9), శివాంగ్ కుమార్ (4) కొన్ని పరుగులు జోడించారు. కలకత్తా బౌలర్లు పవర్ప్లేతోపాటు కొన్ని ఓవర్లు బ్యాటర్లకు అనుకూలంగా వేయగా.. తర్వాత తేరుకుని బ్యాటర్లను బంతికి దొరకబుచ్చుకుని మైదానం నుంచి పంపించారు. బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్లతో దుమ్మురేపగా.. వైభవ్ అరోరా రెండు, కార్తీక్ త్యాగి, అనుకూల్ రాయ్ తలా ఒక్కో వికెట్ తీశారు.
భారీ లక్ష్యాన్ని ఛేదనకు దిగిన కలకత్తా నైట్రైడర్స్ బ్యాటర్లు టపాటపా వికెట్లు కోల్పోయి 161 పరుగులకు మ్యాచ్ను 16 ఓవర్లలోనే ముగించారు. అంగ్క్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టు విజయానికి మార్గం చూపించాడు. కెప్టెన్ అజింక్యా రహనే 8 పరుగులకే ఔటవగా.. ఫిన్ అలెన్ 28 పరుగులతో రాణించాడు. గ్రీన్ రెండు పరుగులకే ఔటయిన పరిస్థితుల్లో మిగతా బ్యాటర్లు కూడా అదే మార్గంలో నడించారు. రింకూ సింగ్ 35 పరుగులతో రాణించగా.. అనుకూల్ రాయ్ డకౌట్ అయ్యాడు. బ్యాటర్లు చేసిన భారీ స్కోర్ను ప్రత్యర్థి బ్యాటర్లు చేయలేక సన్రైజర్స్ బౌలర్లు పటిష్టంగా బంతులు వేశారు. ఈసారి బౌలర్లకు మంచి అవకాశాలు లభించడంతో వారు రెచ్చిపోతున్నారు. ఈ విజయంతో సన్రైజర్స్ పైకి దూసుకెళ్లగా.. కలకత్తా రెండో ఓటమితో తీవ్ర దిగాలుగా పట్టికలో ఆఖరు స్థానంలో నిలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hanuman Shobha Yatra 2026: లవ్ జిహాదీలకు అమ్మాయిలు వార్నింగ్.."మా వెనుక ఉన్నది హనుమాన్"
Hyderabad, Telangana:Hyderabad Hanuman Shobha Yatra 2026: హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు ఘనంగా జరిగింది. అయితే ఈ శోభాయాత్రలో పాల్గొన్న హిందూ యువత లవ్ జిహాదీలకు వార్నింగ్ ఇచ్చారు.Harsha Veena: బ్రేకింగ్.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన పార్టీ దాడి
Koduru, Andhra Pradesh:Janasena Attack On Harsha Veena: లోబర్చుకుని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై తీవ్ర ఆరోపణలు చేసిన బాధితురాలు హర్షవీణపై ఆకస్మిక దాడి జరిగింది. మార్కెట్లో పూలు కొనుగోలు చేస్తున్న ఆమెపై జనసేన పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఆమెతో పాటు ఆమె వెంట ఉన్న వ్యక్తిపై దాడికి పాల్పడడంతో అక్కడ కలకలం ఏర్పడింది. ఈ దాడిపై స్థానిక పోలీసులకు హర్షవీణ ఫిర్యాదు చేశారు. ఈ వార్తకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Chandrababu: అమరావతి అన్స్టాపబుల్.. ఇక రాజధానిపై ఎవరూ ఏం చేయలేరు: సీఎం చంద్రబాబు
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఇటీవల ఓ వివాహిత తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అతడి అశ్లీల వీడియోలు సంచలనం సృష్టించాయి. తీవ్ర ఆరోపణలు చేసిన బాధితురాలు హర్షవీణ న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ వ్యవహారం విచారణ జరుగుతున్న సమయంలోనే ఆమెపై దాడి జరగడం శోచనీయం. రైల్వేకోడూరు టోల్గేట్ వద్ద గురువారం పూలు కొనేందుకు వెళ్లిన హర్షవీణపై జనసేన కార్యకర్తల దాడి చేశారు.
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు హర్షవీణ వెంట ఉండే గోపి అనే వ్యక్తిని చితకబాదారు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు హర్షవీణపై కూడా దాడి చేశారు. అరవ శ్రీధర్ అరాచకాలు, రాసలీలలను ప్రశ్నిస్తున్నందుకు పథకం ప్రకారం దాడికి దిగినట్లు బాధితురాలు ఆరోపణలు చేశారు. అరవ శ్రీధర్పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని హర్షవీణ ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ దీనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరారు.
Also Read: Liquor Shops: రేపు హైదరాబాద్లో 24 గంటలు వైన్షాపులు, బార్లు బంద్
జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే జనసేన పార్టీ అతడిని దూరం చేసి.. విచారణ కమిటీ నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ విచారణ చేసి నివేదికను పార్టీ నాయకత్వానికి సమర్పించింది. పలు పోలీస్ స్టేషన్లలో అరవ శ్రీధర్పై కేసు కూడా నమోదైంది. బాధితురాలు హర్షవీణపై కూడా కేసు నమోదు చేయడం గమనార్హం. ఇలా సంచలన పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో హర్షవీణపై దాడికి పాల్పడడం సంచలనం రేపుతోంది.
Also Read: Liquor Income:లిక్కర్తో తెలంగాణ ఖజానా గలగల.. ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hanuman Shobha Yatra 2026: "రాజాసింగ్ తర్వాత నేనే.." ఎవ్వడూ ఏమి చేయలేడంటూ రాజాసింగ్ కొడుకు వార్నింగ్!
Hyderabad, Telangana:Hyderabad Hanuman Shobha Yatra 2026: హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు ఘనంగా జరిగింది. అయితే రాజా సింగ్ తర్వాత శోభాయాత్ర నిర్వహణ బాధ్యతలను తాను తీసుకుంటానంటూ రాజా సింగ్ కుమారుడు స్పష్టం చేశారు.Sonali Bendre Land Dispute: మహేష్బాబు హీరోయిన్పై కేసు నమోదు..భూమి ఆక్రమించిందంటూ రైతు ఆవేదన..తల్లిపై దాడి చేశారని ఆరోపణ!
Pune, Maharashtra:Sonali Bendre Land Dispute News: హీరోయిన్ సోనాలి బెంద్రేతో పాటు అతని భర్త గోల్డీ బెహ్ల్పై కేసు నమోదయ్యింది. తన తాతల తరం నాటి భూమని ఇప్పుడు ఆ దంపతులు అక్రమంగా పత్రాలను తారుమారు చేశారని ఆరోపణలు చేశాడు. దీంతో పాటు ఆ ఎకరా భూమి తనదే అంటూ న్యాయపోరాటం కోసం కోర్టు మెట్లు ఎక్కాడు.
నటి సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బెహల్లపై ఇప్పుడు కేసు నమోదయ్యింది. పుణెలోని ఓ ఎకరం భూమి కొనుగోలు విషయంలో తమను మోసం చేశారని ఓ రైతు ఆవేదన ఇప్పుడు బయటకువచ్చింది. సోనాలి బెంద్రే భర్త గోల్డీ బెహల్ కొనుగోలు చేసిన భూమి తమ కుటుంబ పూర్వీకుల ఆస్తి అని ఇప్పుడు ఓ రైతు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఒప్పందంలో చట్టపరమైన వాస్తవాలను దాచిపెట్టారని ఆ రైతు స్పష్టం చేశారు.
పుణెలోని ఈ ఎకరం భూమి వివాదంలో గోల్డీ బెహల్, నటి సోనాలిపై ఆరోపణలు చేసిన రైతు పేరు చంద్రకాంత్ బాబు షిండే. ఏప్రిల్ 1, 1957 నుండి ఈ వివాదాస్పద భూమి తన తాత కేసు బాబాజీ షిండే పేరు మీద నమోదై ఉందని ఆయన వాదిస్తున్నారు. ఆ భూమిపై ఆయనకే పూర్తి హక్కులు ఉన్నాయని ఆ రైతు తెలిపారు. అయితే అసలు యజమాని నుంచి ఆ భూమిని మొదట మోసపూరిత పద్ధతుల ద్వారా బాలా షిండేకు అమ్మినట్లు చెప్పిన చంద్రకాంత్ షిండే.. ఆ తర్వాత పూర్తి హక్కులను చాకచక్యంగా దాచిపెట్టి గోల్డీ బెహల్ పేరు మీదకు బదిలీ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. రిజిస్టర్ పత్రాలను తారుమారు చేయడం ద్వారా ఆ భూమిపై తమ కుటుంబ హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది వన్రాజ్ షిండే ఈ విషయంలో గట్టిగా గళం వినిపిస్తున్నారు. కేవలం కొనుగోలు, అమ్మకం పత్రాలను రూపొందించడం లేదా భూమి రికార్డులలో ఒకరి పేరు ఉండటం వల్ల ఎవరూ చట్టబద్ధమైన యజమాని అయిపోరని ఆయన వాదిస్తున్నారు. ఆ ఎకరం భూమిపై తన క్లయింట్ కుటుంబానికి అన్ని చట్టపరమైన హక్కులు ఉన్నాయని ఆ లాయర్ తెలిపారు. వాటిని విస్మరించి అక్రమంగా రిజస్టర్ చేయించారని ఆయన తెలిపారు. ఇది పూర్తిగా తప్పు అని నొక్కిచెప్పారు.
2025 డిసెంబర్లో సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బెహ్ల్ ఈ వివాద భూమి వద్దకు వచ్చినప్పుడు అక్కడ తన తల్లితో విగ్వాదం జరిగినట్లు చంద్రకాంత్ షిండే తెలిపారు. గోల్డీ బెహ్ల్, అతని మనుషులు తన వృద్ధ తల్లిపై దాడి చేసి, ఆమెను దురుసుగా ప్రవర్తించారని రైతు చంద్రకాంత్ షిండే ఆరోపణలు చేస్తున్నారు. ఆ తర్వాత షిండే న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఈ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. ప్రస్తుతం గోల్డీ బెహ్ల్ తరఫు న్యాయవాది రాజు షిండే అన్ని ఆరోపణలను ఖండించారు. ఈ కేసు పూణేలోని వాద్గావ్ మావల్ కోర్టులో విచారణలో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LPG Cylinder Shortage: మార్కెట్లో మరో గ్యాస్ సిలిండర్ స్కామ్..సగం గ్యాస్తో సిలిండర్ల అమ్మకం.. ఎలా తెలుసుకోవాలంటే?
Hyderabad, Telangana:How To Check Gas Level In Cylinder: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎల్పీజీ సిలిండర్ల కోసం జనం ఎగబడుతున్నారు. ఒక సిలిండర్ను ఇంటికి తీసుకువెళ్లడానికి ప్రజలు గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. కానీ ఆ సిలిండర్ సగం మాత్రమే నిండి ఉంటే పరిస్థితి ఏమిటి? అయితే అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఫుల్ సిలిండర్ను ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఎల్పీజీ (LPG Gas) సంక్షోభం కొనసాగుతోంది. ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు పొడవైన క్యూల్లో గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది బ్లాక్లో సిలిండర్లను కొనే సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో సామాన్యులు అధిక ధరలను చెల్లించాల్సి వస్తుంది. ఈ క్రమంలో మీరు బ్లాక్లో పొందినా.. సరాసరి కంపెనీ నుంచి సిలిండర్ డెలివరీ పొందిన దాని పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
బ్లాక్లో సిలిండర్ విక్రయించే వారు కొన్నిసార్లు ఫుల్ సిలిండర్లను కాకుండా సగం అయిపోయన సిలిండర్లను అమ్మకాలు చేస్తున్నారు. దీంతో ఆయా సిలిండర్లలో ఎంతమేర గ్యాస్ ఉందనే విషయం సామాన్యులకు తెలియరావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ ఎంతమేర ఉందని తెలుసుకునేందుకు కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్లో నుంచి తెచ్చిన గ్యాస్ సిలిండర్ ఫుల్గా ఉందా? సగం వినియోగించినదా? అనేది తెలుసుకోవాలంటే కొన్ని సింపుల్ చిట్కాలను తెలుసుకుందాం. ఈ విధంగా తడి గుడ్డతో సిలిండర్లోని గ్యాస్ లెవల్ను తెలుసుకోవడం ఎంతో ఈజీగా కనిపిస్తోంది. ముందుగా ఒక పాత క్లాత్ను నీటిలో నానాబెట్టి.. ఆ తర్వాత పిండేయాలి. ఆ వెంటనే క్లాత్ను గ్యాస్ సిలిండర్ చుట్టూ గట్టిగా చుట్టేయాలి.
ఆ తర్వాత చుట్టేసిన పాత క్లాత్ను కొంతసేపు ఆగిన తర్వాత తీసేయాలి. ఆ వెంటనే 2 నుండి 3 నిమిషాలు ఆగి గ్యాస్ సిలిండర్ను జాగ్రత్తగా గమనించాలి. గ్యాస్ లేని పైభాగం త్వరగా ఆరిపోతుందట. గ్యాస్ ఉన్న భాగంలో ఎక్కువసేపు తడి అలానే ఉండటాన్ని మీరు గమనిస్తారట. సిలిండర్పై తడి గ్యాస్ ఉన్న భాగంలో అలానే కొద్దిసేపు కనిపిస్తుంది. కానీ, గ్యాస్ లేని ఖాళీ సిలిండర్పై తడి వెంటనే ఆరిపోతుంది. దీనికి కారణం.. ఎల్పిజి గ్యాస్ చల్లగా ఉండటమే కారణం. అది సిలిండర్లోని ఆ ప్రాంతాన్ని చల్లగా ఉంచి, తేమ త్వరగా ఆరిపోకుండా నిరోధిస్తుంది.
సీల్ కూడా డమ్మీనే!
సిలిండర్ గ్యాస్తో నిండి ఉందో లేదో తనిఖీ చేయడానికి ఇంకో సులభమైన మార్గం కూడా ఉంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్పై ఒక ప్లాస్టిక్ సీల్ ఉంటుంది. ఆ సీల్ను మళ్లీ అతికించారో లేక అది వదులుగా ఉందో మీరు తనిఖీ చేయాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు, గ్యాస్ పరిమాణాన్ని తగ్గించడానికి సిలిండర్ను తారుమారు చేసే అవకాశం ఉంది.
పైన పేర్కొన్న చిట్కాలతో పాటు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బరువు ద్వారా కూడా సిలిండర్ పూర్తిగా ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఫుల్ గ్యాస్ సిలిండర్ బరువు గురించి మీకు ఓ అవగాహన రావడానికి దీనిని తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఉంది. గ్యాస్ సిలిండర్లను జారీ చేసే కంపెనీల ద్వారా ఇంటికి వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పూర్తిగా నింపిన తర్వాత దాని బరువు సుమారుగా.. 29.5 కిలోలు ఉంటుంది. అయితే ఆ సిలిండర్లో సుమారుగా 14.2 కిలోలు గ్యాస్ ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chandrababu: అమరావతి అన్స్టాపబుల్.. ఇక రాజధానిపై ఎవరూ ఏం చేయలేరు: సీఎం చంద్రబాబు
Lingayapalem, Andhra Pradesh:Capital Amaravati Celebrations: 'పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందటం ప్రజాస్వామ్య గొప్పదనం, ప్రజా సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు ఇది. దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించ దగిన రోజుగా ఇది నిలిచిపోతుంది. అమరావతి చరిత్ర శాశ్వతం.. అందులో రైతులు చేసిన త్యాగం శాశ్వతం' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అనేక కుట్రలను ఎదుర్కొని రాజధానిని దక్కించుకున్నట్లు చెప్పారు. ఇక అమరావతి అన్స్టాపబుల్ అని తెలిపారు. 'ప్రజా రాజధానిని సాధించుకున్నాం.. ఇది ప్రజా విజయం. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ప్రధానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు చెప్పారు.
Also Read: Amaravati Capital: ఉభయసభల్లో రాజధాని బిల్లు ఆమోదం.. అధికారికంగా ఏపీ రాజధాని అమరావతి
పార్లమెంటులో అమరావతి చట్టబద్దత బిల్లు ఆమోదం తర్వాత రాజధాని ప్రాంతం ఉద్దండరాయుని పాలెం వద్ద అమరావతి రైతులు, మహిళలు నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లుకు హోం మంత్రి అమిత్ షా సహా కేంద్రం, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఈ బిల్లుకు సహకరించాయని వెల్లడించారు. 'పవిత్రమైన మట్టి- నీటిని రాజధాని శంకుస్థాపన చేసిన రోజున ప్రధాని తెచ్చారు. పార్లమెంట్ వద్ద ఉన్న పవిత్ర మట్టిని, పవిత్ర యమునా నది జలాలతో పునీతమైన పుణ్యభూమి ఇది. ఒక్క వైఎస్సార్సీపీ మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి ఇవాళ అండగా నిలబడ్డాయి' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ జాక్పాట్.. ఏపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్
'అమరావతిని శ్మశానం అన్నారు.. కానీ ఇవాళ పార్లమెంటులో అమరావతికి తిరుగులేని శాసనం చేసుకున్నాం. రాజధానితో మూడు ముక్కలాట ఆడారు అడ్రస్ లేకుండా పోయారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'ఓ నమ్మకంతో 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు రాజధానికి భూములిచ్చారు. అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నం. అమరావతికి అపజయం లేదు. రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుంది' అని పేర్కొన్నారు. 'రైతులు, రైతు కూలీలు, ప్రజల ఐకమత్యం వల్లే ఈ విజయం సాధించుకున్నాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
'2019లో మనల్ని ఏమార్చారు. ఐదేళ్ల పాటు చీకటి రోజులుగా రాష్ట్రానికి దాపురించాయి. ప్రజా వేదికతో విధ్వంసాన్ని ప్రారంభించి అమరావతిని ధ్వంసం చేశారు. దానిని అడ్డుకుంటూ రాజధాని రైతులు, మహిళలు వీరత్వం, ప్రతాపం చూపారు' అని రాజధాని రైతులపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. 'అమరావతి రైతులు, మహిళల ఉద్యమ శిబిరాలకు నాడు సతీ సమేతంగా వచ్చా. రైతుల ఉద్యమం చూసి భువనేశ్వరి చలించిపోయారు.. ఉద్యమానికి సంఘీభావం తెలిపి చేతికున్న రెండు బంగారు గాజులు ఇచ్చారు. భువనేశ్వరి ఒక్కరే కాదు రాష్ట్ర ప్రజలు, రాష్ట్రేతరులు చాలా మంది ఉద్యమానికి అండగా నిలిచారు. అమరావతి ఉద్యమం కోసం నేను స్వయంగా జోలె పట్టా' అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
'1631 రోజులు ఉద్యమం ఓ చరిత్ర... వీరోచితంగా పోరాడి రాజధానిని సాధించుకున్న అమరావతి సొంతం. న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. 2024లో కూటమి పార్టీకి అద్భుత విజయం అందించారు. ఇప్పుడు రాజధానికి చట్టబద్దత కలిగింది. ఆదర్శ రాజధాని తెలుగు జాతి గుండె, జాతి గౌరవం అమరావతే' అని సీఎం చంద్రబాబు వివరించారు. 'అమరావతి విషయంలో ఇంత జరిగినా వైసీపీకి మాత్రం బుద్ది రాలేదు. వారి పిచ్చి ఇంకా ముదిరింది. అమరావతికి చట్టబద్దత కల్పించే అంశంపై తీర్మానం పెడితే ఆ పార్టీ అసెంబ్లీకి కూడా హాజరు కాలేదు. వైసీపీని అంతా మరిచిపోవాలి, రాష్ట్రానికి ఆ పార్టీ పీడ విరగడవ్వాలి' అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
'మావిగన్ అంటూ ఓ కొత్త ప్రతిపాదన చేశారు. డిక్షనరిలో చూశాను నాకు అర్థం కాలేదు. వైఎస్సార్సీపీవి అన్నీ బుద్ది లేని వ్యాఖ్యలు.. దుర్మార్గపు ఆలోచనలే. అమరావతికి చట్టబద్దత కల్పిస్తుంటే చట్టసభ నుంచి ఆ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. ప్రజలు ఆ పార్టీ బ్లాక్ అవుట్ చేయాలి. అమరావతిని చంపాలనుకున్న వైసీపీ బాగుపడదు. ఇంతటి నీతిమాలిన రాజకీయం నా చరిత్రలో చూడలేదు' అని సీఎం చంద్రబాబు చెప్పారు. 'రాష్ట్రంలో ప్రతీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని అమరావతి సాక్షిగా ప్రజలకు హామీ ఇస్తున్నా. అమరావతి అన్ స్టాపబుల్.. అద్వితీయం, అజేయం, అజరామరం' అని ప్రకటించారు. 'ప్రజలు సహకరిస్తే ప్రపంచంలోని ప్రతీ అభివృద్ధి మోడల్ ను అమరావతికి తెస్తా. అమరావతికి శాశ్వతత్వం తెచ్చినందుకు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. పార్లమెంటులో చేసిన చట్టాన్ని ఎవరూ మార్చలేరు. ఇప్పటివరకు రాష్ట్రానికి అడ్రస్ లేదు. ఇప్పుడు మనకు ఓ అడ్రస్ వచ్చింది' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
8th Pay Commission: పోరుబాటకు సిద్ధమైన ప్రభుత్వ ఉద్యోగులు?! ఓపీఎస్, పెన్షన్లపై 8వ వేతన సంఘంతో పోరాటం.. ఇకపై చావో రేవో!
Hyderabad, Telangana:8th Pay Commission Union Demands: ఎన్నో రోజులుగా 8వ వేతన సంఘం ద్వారా జీతాలు, పెన్షన్ల పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్ల సహనం ఇప్పుడు నశిస్తోంది. దేశంలోని లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతిపెద్ద సంస్థ అయిన ఎన్సీ-జేసీఎం (NC-JCM) (స్టాఫ్ సైడ్) ఇప్పుడు పలు డిమాండ్లను చేస్తోంది. మోదీ సర్కార్ ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘానికి 9 అంశాల డిమాండ్ల జాబితాను వారికి సమర్పించింది.
ఏప్రిల్ 1, 2026 తేదీన రాసిన ఓ లేఖ ఆధారంగా.. ఎన్సీ-జేసీఎం కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా.. 8వ వేతన సంఘం సభ్య కార్యదర్శి పంకజ్ జైన్కు నిర్మొహమాటంగా ఇలా చెప్పారు. పే కమిషన్ జారీ చేసిన 18 ప్రశ్నలను సవరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఫార్మాట్లో అనేక ముఖ్యమైన అంశాలు లేవని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నారు. అయితే NC-JCM ఉద్యోగ సంఘం పే కమీషన్ ముందుంచిన ప్రముఖ డిమాండ్స్ను ఇప్పుడు తెలుసుకుందాం.
1. పాత పింఛను వ్యవస్థ (OPS) పునరుద్ధరణ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక, ప్రధాన డిమాండ్ పాత పెన్షన్ పథకం (OPS)ను పునరుద్ధరించడమేనని ఉద్యోగ సంఘం అభిప్రాయపడింది. NPS (నేషనల్ పెన్షన్ స్కీమ్) ఇటీవల ప్రకటించిన UPS (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్) పట్ల ఉద్యోగులు సంతృప్తిగా లేరని వారు స్పష్టం చేశారు. తాము కాంట్రిబ్యూటరీ పెన్షన్కు అనుకూలంగా లేమని CCS (పెన్షన్) రూల్స్, 1972 (ప్రస్తుతం 2021) ప్రకారం పాత నాన్-కాంట్రిబ్యూటరీ పెన్షన్ను కోరుకుంటున్నామని వారు పునరుద్ఘాటించారు.
2. పెన్షనర్ల హక్కుల పరిరక్షణ
పెన్షనర్ల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ పే కమిషన్ను కోరింది. ఇందులో కమ్యూటెడ్ విలువ పునరుద్ధరణ, పదవీ విరమణానంతర ప్రయోజనాలు, పెన్షన్ పెంపులో సమానత్వం వంటి అంశాలు ఉంటాయి.
3. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు
పని ప్రదేశ భద్రత, రుతుస్రావ సెలవు, ప్రసూతి ప్రయోజనాలు, శిశు సంరక్షణ సెలవు (CCL) పని ప్రదేశంలో సమానత్వం వంటి సున్నితమైన సమస్యలను కవర్ చేస్తూ.. మహిళా ఉద్యోగుల కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని వేతన సంఘాన్ని మొదటిసారిగా కోరారు.
4. విభాగాల్లో సమస్య పరిష్కారం
కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి విభాగంలో స్వతహాగా అనేక సవాళ్లు ఉన్నాయి. ప్రతి విభాగం పనితీరు వివిధంగా ఉంటుంది కాబట్టి, విభాగాల వారీ సమస్యలను పరిష్కరించడానికి కమిషన్ ప్రత్యేక నిబంధనలను రూపొందించాలని NC-JCM వాదిస్తోంది.
5. గడువు పొడిగింపు
8వ వేతన సంఘానికి విన్నపాలను అందజేసే వివిధ శాఖాపరమైన అంశాలపై వినతిపత్రాలు సమర్పించే గడువును మే 31, 2026 వరకు పొడిగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలు, యూనియన్లతో సంప్రదించడానికి మరికొంత సమయం పట్టే నేపథ్యంలో వారు ఈ విధంగా గడువు పొడిగించాలని వారు కోరుతున్నారు.
6. పరిమితి విస్తరణ
తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు 500 పదాల (3,500 అక్షరాల) పరిమితి చాలా తక్కువగా ఉందని ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్న క్రమంలో.. ఆ పరిమితిని 10,000 అక్షరాలను పెంచినట్లు AIDEF సెక్రటరీ జనరల్ సి.శ్రీకుమార్ ప్రకటించారు. అలాగే డాక్యుమెంట్ అటాచ్మెంట్ పరిమాణాన్ని (కెపాసిటీ) కూడా 2 MB నుండి 6 MBకి పెంచారు.
7. సాంకేతిక సమస్యలు
ప్రతి ప్రశ్నకు క్రమపద్ధతిలో సమాధానం ఇచ్చేలా ప్రశ్నావళి ఫార్మాట్ను సరళీకరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సాంకేతిక ఇబ్బందుల కారణంగా దీన్ని విస్మరించకుండా ఉండేలా ఆన్లైన్లో సమర్పణలతో పాటు ఇమెయిల్, హార్డ్ కాపీ ద్వారా కూడా వినతిపత్రాలను స్వీకరించాలని వారు అభ్యర్థిస్తున్నారు.
8వ వేతన సంఘం అందరినీ కలుపుకొని పోయేలా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు NC-JCM కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా స్పష్టం చేశారు. ఉద్యోగుల వాదనలు, సమాచారం, కారణాలను సమర్పించడానికి తగినంత అవకాశం, సమయం ఉండాలని ఆయన తెలియజేశారు.
NC-JCM ప్రస్తుతం అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి ఒక ఉమ్మడి ఒప్పంద పత్రాన్ని రూపొందిస్తోంది. ఉద్యోగుల వైఖరి దూకుడుగా ఉండడంతో పాటు వారు పింఛన్ల నుండి వేతనాల పెంపు వరకు ఉన్న సమస్యలపై రాజీ పడటానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. పైన పేర్కొన్న డిమాండ్లను ఎంత ప్రముఖంగా చేర్చాలనేది నిర్ణయం ఇప్పుడు 8వ వేతన సంఘం చేతిలో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kanpur: కాన్పూర్లో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. రూ.50 వేల గొడవతో బయటపడ్డ అంతర్జాతీయ మాఫియా!
Hyderabad, Telangana:Kidney Smuggling Gang Busted: క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఉండే ట్విస్టులు ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్లో నిజంగానే చోటుచేసుకున్నాయి. కేవలం రూ.50 వేల రూపాయల కోసం జరిగిన గొడవ.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఒక భారీ అంతర్జాతీయ కిడ్నీ విక్రయ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అమాయకులతో పాటు నిరుపేదలను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంలో విస్తుకుపోయే నిజాలు విచారణలో వెలుగులో బయటపడ్డాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీ అంశానికి దారితీసాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్ కు చెందిన ఒక యువకుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల తన కిడ్నీని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఒక మధ్యవర్తి ద్వారా కిడ్నీ విక్రయ ముఠాను సంప్రదించాడు.. యువకుడి కిడ్నీని సదరు విక్రయించే ముఠా.. 10 లక్షలుగా ధర నిర్ణయించి ఒప్పందం కుదుర్చుకుంది. అంత అనుకున్నట్లుగానే ఆపరేషన్ పూర్తయింది.. యువకుడు తన కిడ్నీని కోల్పోయాడు. అయితే ఒప్పందం ప్రకారం రూ.10 లక్షలు ఇవ్వాల్సిన ఆ ముఠా.. అతనికి కేవలం 9.5 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది..
మిగిలిన 50 వేల కోసం ఆ యువకుడు ముఠా సభ్యులతో వాగ్వాదానికి దిగాడు.. తాను చేస్తున్నది చట్ట విరుద్ధమని తెలిసిన మొండిగా పోలీసులను ఆశ్రయించాడు.. తనను మోసం చేశారంటూ ఫిర్యాదు చేశాడు.. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులకు మొదట ఇది సాధారణ గొడవల అనిపించిన.. లోతుగా దర్యాప్తు చేయడంతో కిడ్నీ మాఫియా నెట్వర్క్ చూసి అధికారులే ఆశ్చర్యపోయారు.. అంతేకాకుండా విచారణ జరుగుతున్న కొద్ది ఆశ్చర్యపరిచే విషయాలు బయటికి రావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు..
విచారణలు వెలుగులోకి వచ్చిన నిజాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దాతల నుంచి పది లక్షలకు కిడ్నీలను సేకరిస్తూ ఈ ముఠా అవసరం ఉన్న రోగులకు దానిని 60 లక్షల నుంచి 70 లక్షలకు విక్రయిస్తోంది. దీని వెనక అంతర్జాతీయ స్థాయి నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పత్రాలను సృష్టించడంలో వీరుదిట్టగా తేలింది. అప్పుల ఊబిలో ఉన్న వారితో పాటు నిరుద్యోగులే లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా ముందుకు కొనసాగుతోంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉన్న వృద్ధులను సైతం వీరు వదిలిపెట్టడం లేదు.. ఇలా వారి నుంచి కిడ్నీలను సేకరించి విక్రయిస్తూనే ఉన్నారు.. ఈ కేసులో ఇప్పటివరకు పలువురు కీలక సూత్రధారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
