icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow28 Jul 2024, 02:18 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

WAPL 2026: ఆంధ్ర క్రికెట్‌ సంఘం కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌లో ఆంధ్ర మహిళల క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌

Vijayawada, Andhra Pradesh:

Womens Andhra Premier League 2026: ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్‌ ప్రోత్సాహానికి విశేష కృషి చేస్తున్న ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ పురుషులకు విజయవంతంగా నిర్వహించిన ఆంధ్ర క్రికెట్‌ సంఘం ఇప్పుడు మహిళలకు కూడా ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. ఏపీ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహిస్తున్నట్లు.. ఈ టోర్నమెంట్‌ షెడ్యూల్‌ కూడా ఆంధ్ర క్రికెట్‌ సంఘం ప్రకటించింది. భారత మహిళల మాజీ క్రికెట్‌ మిథాలీ రాజ్‌ ఆధ్వర్యంలో ఈ టోర్నీ జరగనుంది.

ముఖ్యమైన మైలురాయి
భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. 'రెండు మూడేళ్లుగా ఏసీఏతో అనుబంధం పెంచుకున్నా. మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అనేది ఏసీఏలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఏసీఏ తీసుకున్న ఈ నిర్ణయం ఒక ప్రొఫెషనల్ సెటప్ లాంటిది. రాబోయే కాలంలో ఏసీఏ విమెన్స్ ప్రీమియర్ లీగ్ విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా' అని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారని.. వారికి అవకాశం.. ప్రోత్సాహం కావాలని పేర్కొన్నారు.

మహిళల క్రికెట్‌కు గుర్తింపు
'ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ద్వారా ఒక ప్రొఫెషనల్ స్ట్రక్చర్‌ను ఏసీఏ క్రియేట్ చేస్తోంది. దీనివలన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు క్రికెట్ ఆడాలనే  ఆసక్తి ఏర్పడుతుంది. విభిన్న కేటగిరీల ప్లేయర్లు ఈ టీమ్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తారు. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఉన్న ఫ్రాంచైజీలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ప్రతిభ కలిగిన క్రికెటర్లను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తోంది. మహిళల క్రికెట్‌కు బిడ్డింగ్ పెట్టడం ద్వారా దాని విలువ పెరుగుతుంది' అని సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ వెల్లడించారు. 'ఆంధ్రలో మహిళల క్రికెట్‌కు ఒక గుర్తింపు, ప్రాధాన్యం వస్తోంది. ఆంధ్ర నుంచి ఇంకా చాలా మంది ప్లేయర్లు ఇండియా తరఫున ఆడతారని ఆశిస్తున్నా' అని మిథాలీ రాజ్‌ తెలిపారు. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో కూడా మన ప్లేయర్లను చూసే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

షెడ్యూల్ విడుదల
ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కీలక విషయాలు వెల్లడించారు. ఆంధ్ర మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వహించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. సెప్టెంబర్‌ 15 - 26 వరకు మంగళగిరిలో డేఅండ్ నైట్ మ్యాచ్‌లు జరుగుతాయి. త్వరలోనే క్రికెట్ అకాడమీ కూడా ఇక్కడ ప్రారంభిస్తాం. సెప్టెంబర్ 15 నుంచి 26వ తేదీలోపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది' అని ప్రకటించారు. ప్రస్తుతం 4 టీమ్స్‌తో ప్రారంభమైన ఈ టోర్నమెంట్‌ను భవిష్యత్తులో మరిన్ని టీమ్స్‌తో విస్తరించాలనే ఆలోచన ఉందని చెప్ఆరు. మిథాలీరాజ్  సేవలను ఆంధ్ర క్రికెట్ సంఘం ఉపయోగించుకుంటుందని.. ఆంధ్రప్రదేశ్ నుంచి మహిళా క్రీడాకారులు కూడా వస్తున్నారని పేర్కొన్నారు.

'మహిళల క్రికెట్‌కి కూడా ప్రాధాన్యం వచ్చేలా ఆంధ్ర క్రికెట్ సంఘం పనిచేస్తోంది. రాబోయే కాలంలో మూలపాడులో చక్కటి అకాడమీ కూడా ప్రారంభించుకోబోతున్నాం. మహిళల క్రికెట్‌ను ప్రోత్సహించడానికి పాఠశాల విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నాం' అని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని ప్రకటించారు.

 

 

0
0
Report

Tragedy: స్వాతంత్య్ర దినోత్సవం రోజు తీవ్ర విషాదం.. కృష్ణా నదిలో ముగ్గురు యువకులు మృతి

Tadepalli, Andhra Pradesh:

Three Youths Dies In River: స్వాతంత్య్ర దినోత్సవం సెలవు కావడంతో సరదాగా ఆడుకుందామని కృష్ణా నదికి కొందరు యువకులు వచ్చారు. నది నీటిలో ఈత కొడుతూ సరదాగా గడుపుతున్నారు. అయితే ప్రమాదవశాత్తు నీటి లోపలికి మునిగిపోయారు. అలా ముగ్గురు మునిగిపోయి నీటిలో గల్లంతయ్యారు. లోతు ప్రాంతంలోకి వెళ్లడంతో వారంతా విగతజీవులుగా మారారు. ఈ సంఘటన ఏపీలోని తాడేపల్లిలో ఉన్న కృష్ణా నది వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన ముగ్గురు యువకులు వీసం గౌతమ్ (18), గడ్డం జాషువా (17), తీగుళ్ల తేజ (18) తాడేపల్లి సమీపంలోని కృష్ణలంక మెట్లబజారు పద్మావతి ఘాట్‌ వద్ద కృష్ణా నదిలోకి దిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సెలవు కావడంతో మిత్రులంతా కలిసి నదిలో ఈత కొట్టారు. సరదాగా ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. స్నానానికి నదిలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో ముగ్గురూ గల్లంతయ్యారు. ఈ విషయం తెలిసిన గత ఈతగాళ్లు, స్థానికులు గాలించగా ముగ్గురి మృతదేహాలు లభించాయి. ముగ్గురు యువకులు మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నదిలోకి స్నానానికి వెళ్లే సమయంలో ప్రజలు, ముఖ్యంగా యువకులు సాహసాలు చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
అనకాపల్లి జిల్లా చోడవరం అంబేడ్కర్ కాలనీలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తన భర్తను భార్య హత్య చేసింది. కొండ్ల వెంకటరావు (58), ఇందిర (54) భార్యాభర్తలు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. స్థానికంగా అంగన్‌వాడీ టీచర్‌గా ఇందిర తన భర్త ప్రవర్తనతో విసిగిపోయి హత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న చోడవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

బాకరాపేట ఘాట్‌లో భారీ రోడ్డు ప్రమాదం
తిరుపతి జిల్లా బాకరాపేట ఘాట్‌లో భారీ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 20 చక్రాల భారీ లారీ అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఘాట్ రోడ్డులో వెళ్తుండగా ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి లారీ పడిపోగా.. టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వ్యక్తిని స్థానికులు, పోలీసులు ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. లోయలో పడిపోయిన లారీని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లారీలో ఎంతమంది ఉన్నారనే దానిపై ఇంకా వివరాలు తెలియలేదు.

0
0
Report
Advertisement

Balapur Ganesh: పూరీ జగన్నాథ్ ఆలయ రూపంలో బాలాపూర్ గణేష్‌ మండపం

Balapur, Telangana:

Puri Jagannath Temple Theme: వినాయక చవితి ఉత్సవాల్లో విశిష్ట ప్రాధాన్యం ఉన్న బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈసారి కొత్త థీమ్‌తో బాలాపూర్‌ గణేశ్‌ రూపుదిద్దుకుంటోంది. అశేష సంఖ్యలో భక్తులు విచ్చేస్తుండడంతో వారికి మరపురాని అనుభూతి కల్పించేందుకు బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ నిర్వాహకులు ఈసారి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి యేడాది మాదిరి ఈ ఏడాది మరో కొత్త థీమ్‌తో వస్తున్నారు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ్‌ స్వామి ఆలయ రూపంలో మండపాన్ని రూపుదిద్దుతున్నారు.

ప్రతి సంవత్సరం భక్తులకు వైభవంగా దర్శనమిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న బాలాపూర్ గణేష్‌ 2026 సంవత్సరానికి సంబంధించి కొత్తగా కనిపించనున్నారు. ఈ ఏడాది మరో అద్భుతమైన రూపంలో భక్తులను కనువిందు చేయబోతున్నారు. గతంలో అరుణాచలేశ్వర ఆలయం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, యాదాద్రి స్వర్ణగిరి ఆలయం, అయోధ్య శ్రీరామ మందిరం వంటి పుణ్యక్షేత్రాల థీమ్‌లలో మండపాన్ని రూపొందించి బాలాపూర్ గణేష్‌ భక్తులకు దర్శనమిచ్చింది. కొత్త కొత్త థీమ్‌లకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తుండడంతో ఈ ఏడాది కూడా మరో పుణ్యక్షేత్రాన్ని ఎంచుకున్నారు. ఈసారి పూరీ ఆలయం రూపంలో మండపాన్ని తీర్చిదిద్దనున్నారు. ప్రతి సంవత్సరం సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ ఈ ఆలయ నమూనాలు వేస్తుండగా... ప్రతి రూపం భక్తుల్లో ఆధ్యాత్మిక భావన, భక్తి శ్రద్ధలను మరింత పెంచుతున్నాయి.

ఈ ఏడాది ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ స్వామి ఆలయ థీమ్‌లో బాలాపూర్ గణేష్‌ భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. జగన్నాథ స్వామి ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా బాలాపూర్‌ గణేశ్‌ మండపం రూపొందించనున్నారు. ఈ ఆలయంతో బాలాపూర్‌ గణేశ్‌ సరికొత్తగా కనిపిస్తాడని.. భక్తుల కళ్లకు పండుగలా, హృదయాలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచేలా ఉండబోతుందని ఉత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా వైభవోపేతంగా ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఈసారి అంతకుమించి ఉత్సవాలు నిర్వహించాలని బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక లడ్డూ వేలంలో రికార్డులు తిరగరాసే బాలాపూర్‌ లడ్డూ ఈసారి ఎంతకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.

0
0
Report

Pawan Kalyan Chandrababu: మరోసారి చంద్రబాబు కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ దూరం..అసలేం జరుగుతోంది?

Vijayawada, Andhra Pradesh:

Pawan Kalyan Chandrababu News: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో చీలికలు మొదలయ్యయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే గత నెల రోజులుగా ఏపీలోని కూటమి పార్టీల్లో లుకలుకలు మొదలైనట్లు తెలుస్తోంది. అందుకు రుజువుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూరంగా ఉండటమే అని విశ్లేషకులు అంటున్నారు. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గవర్నర్ నివాసంలో జరిగిన 'ఎట్ హోమ్' విందుకు కూడా ఆయన హాజరుకాలేదు.

'ఎట్ హోమ్' కార్యక్రమానికి గైర్హాజరు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లోక్‌భవన్‌లో సంప్రదాయంగా నిర్వహించే 'ఎట్ హోమ్' విందు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకావడం లేదని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. కాకినాడలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల తర్వాత, రాజమహేంద్రవరంలో అటవీశాఖకు చెందిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్‌ను ప్రారంభించే సమయంలో పవన్‌కు తీవ్ర జ్వరం వచ్చిందని, అందుకే కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించాల్సి వచ్చిందని జనసేన తెలిపింది.

రాజమహేంద్రవరంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ను వైద్యులు పరీక్షించి తగిన విశ్రాంతి సూచించడంతో, ఆయన అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఇటీవల కుడి భుజానికి జరిగిన శస్త్రచికిత్సకు సంబంధించి ఫిజియోథెరపీపై వైద్యుల సూచనలు తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌
ఇటీవల కాలంలో అమరావతిలో జరిగిన స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం వంటి పలు అధికారిక కార్యక్రమాలకు చంద్రబాబుతో పాటు పవన్ హాజరుకాకపోవడం, విశాఖపట్నంలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చకు దారితీసింది. అంతేకాకుండా, గతంలో వరుసగా కొన్ని కేబినెట్ సమావేశాలకు కూడా ఆయన దూరంగా ఉండటంతో కూటమి ప్రభుత్వంలో పార్టీల మధ్య అసలు ఏం జరుగుతోందనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.

Also Read: కర్నూలు పర్యటనలో వైఎస్ జగన్‌కు తీవ్ర అవమానం?! జైలులో మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం!

Also Read: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..జనసేనలోకి ఎమ్మెల్యే రాజాసింగ్..అసలు ట్విస్ట్ ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement

Harish Rao: పథకాలు, గ్యారంటీలపై బహిరంగ చర్చకు సిద్ధమా..! రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు సవాల్‌!

Siddipet, Telangana:

Harish Rao vs Revanth Reddy: స్వాతంత్య్ర దినోత్సవం రోజు అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడాల్సిన రేవంత్‌ రెడ్డి చిల్లర మాటలతో పచ్చి అబద్ధాలు ఆడడం సిగ్గుచేటు అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి రోత మాటలు మాట్లాడి ఉండరు. గాంధీ, పటేల్, నెహ్రూ లాంటి మహనీయులను తలచుకోవాల్సిన రోజున రేవంత్ రెడ్డి  చిల్లర రాజకీయాలకు తెరలేపాడు' అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సంగారెడ్డిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పందించారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి రేవంత్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'కాంగ్రెస్ మేనిఫెస్టోలో 420 హామీలు ఇచ్చారు. సంగారెడ్డి సభలో రేవంత్‌ రెడ్డి కరెక్టుగా సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ప్రసంగం ప్రారంభించి పూర్తిగా 420 మాటలే మాట్లాడారు' అని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15వ తేదీ రోజున సీఎం హోదాలో రేవంత్ రెడ్డి  ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం గురించి కూడా మాట్లాడలేదు. సంగారెడ్డి జిల్లా సాగునీటి కోసం కేసీఆర్‌ ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం మూలకు పడేసిందని ఆరోపించారు. వాటి గురించి కనీసం ఒక్క ముక్క కూడా రేవంత్‌ రెడ్డి మాట్లాడలేదని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. 

'బీఆర్ఎస్ పార్టీ హయాంలో మంజూరైన మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రోడ్లు తప్ప కాంగ్రెస్ వచ్చాక కొత్తగా ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదు. రేవంత్‌ రెడ్డి బహిరంగ సభలో అబద్ధాలు ఆడుతున్నారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో మనిషికి 4 కిలోల బియ్యం, కుటుంబానికి 20 కిలోల సీలింగ్ ఉండేదని కేసీఆర్ వచ్చాక సీలింగ్ ఎత్తివేసి మనిషికి 6 కిలోల చొప్పున ఎంత మంది ఉంటే అంత మందికి బియ్యం ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని ప్రకటించారు.

'కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చామని నిండు అసెంబ్లీలో చెప్పారు. కానీ సభలో మాత్రం రేవంత్‌ రెడ్డి 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్‌ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి' బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. ఒక ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీని తీసుకొచ్చి అశోక్ నగర్ లైబ్రరీ సాక్షిగా హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆ రాహుల్ గాంధీ పత్తాలేడని విమర్శించారు.

దమ్ముంటే గన్‌మెన్లను వదిలేసి అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఓయూ దగ్గరికి వస్తారా? అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా 30 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ పెట్టిపోయిన బకాయిలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. 'కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ రైతుబంధు ఇచ్చానని రేవంత్‌ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. రుణమాఫీ చేస్తానని దేవుడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన ఘరానా మోసగాడు రేవంత్ రెడ్డి అని' అని తీవ్ర విమర్శలు చేశారు. 'నా ఛాలెంజ్ స్వీకరించే దమ్ముంటే గన్‌మెన్లు లేకుండా నీ ఊరికి వస్తావా రేవంత్ రెడ్డి అని. నీ ఊళ్లో అందరికీ రుణమాఫీ జరిగిందని తేలితే నేను అక్కడే రాజీనామా చేస్తా. లేదంటే నువ్వు చేస్తావా?' అని సవాల్‌ విసిరారు.

0
0
Report

Devdutt Padikkal: రెండేళ్ల తర్వాత దేవదత్‌ పడిక్కల్‌ అద్భుత రీఎంట్రీ.. శ్రీలంక తొలి టెస్టులో సెంచరీ

Galle, Southern Province:

Devdutt Padikkal Century: సుదీర్ఘ విరామం తర్వాత టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్‌ ఆటగాడు దేవ్‌దత్త్ పడిక్కల్‌ శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అదరగొట్టాడు. తొలి రోజు బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు 288/2తో ఆటను ముగించింది. రీఎంట్రీతో పడిక్కల్‌ అద్భుతంగా ఆడి 131 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కేఎల్‌ రాహుల్‌ భారీగా దంచికొట్టినా రిటైర్డ్‌ ఔటవగా.. కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ తక్కువ స్కోర్‌ ఔటయి నిరాశపర్చాడు. స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రత్యర్థి గడ్డపై ఆడిన భారత జట్టు భారీ స్కోర్‌ సాధించింది. 73 ఓవర్లు ఆడిన భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.

గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభమవగా.. వర్షం అడ్డంకిగా నిలిచింది. పలుసార్లు వర్షం అంతరాయంతో మ్యాచ్‌కు బ్రేక్‌ ఇచ్చి మళ్లీ కొనసాగించారు. టాస్‌ గెలిచి భారత జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుని తొలి రోజు ఆటను రెండు వికెట్లకు 288 పరుగులతో ముగించింది. రెండేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన దేవదత్‌ పడిక్కల్‌ అద్భుతంగా ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ 134 బంతుల్లో అద్భుత సెంచరీతో తన మొదటి అంతర్జాతీయ శతకాన్ని నమోదు చేశాడు. మొత్తం 178 బంతులు ఆడిన దేవదత్‌ 131 పరుగులు చేయగా.. 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అదరగొట్టాడు. సాయిసుదర్శన్‌ గాయం కారణంగా లంకతో సిరీస్‌కు పడిక్కల్‌కు జట్టులో స్థానం లభించింది. చాలాకాలం తర్వాత తనకు లభించిన అవకాశాన్ని పడిక్కల్‌ సద్వినియోగం చేసుకున్నాడు. 

ఓపెనర్‌గా దిగిన యశస్వి జైస్వాల్‌ 37 బంతుల్లో 32 పరుగులు చేయగా.. వాటిలో ఐదు ఫోర్లు ఉన్నాయి. స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 77 పరుగులతో రాణించాడు. 162 బంతులు ఆడిన రాహుల్‌ 9 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాదాడు. కుడి చేయి నొప్పి రావడంతో ఇబ్బంది పడిన రాహుల్‌కు ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స చేసినా తగ్గకపోవడంతో రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానం వీడాడు. కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ 28 ంతుల్లో 16 పరుగులు చేసి ఔటవగా.. క్రీజులో 27 పరుగులతో రిషబ్‌ పంత్‌ ఉన్నాడు. శ్రీలంక బౌలర్లు వికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తొలి రోజు దెబ్బతీసేందుకు ప్రయత్నించగా అతి కష్టం మీద రెండు వికెట్లు తీశారు.

వరుణుడు ఆటంకం
భారత్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించాడు. లంచ్‌ బ్రేక్‌ సమయంలో వర్షం పడడంతో ఆటగాళ్లు ఆలస్యంగా మైదానంలోకి అడుగుపెట్టారు. వర్షం కారణంగా గంటన్నర సమయం వృథా అయ్యింది.

0
0
Report

Prabhas Fauzi New Poster: ప్రభాస్ 'ఫౌజీ' కొత్త పోస్టర్..ఒకవైపు గాంధీ, మరోవైపు మాస్‌లుక్‌లో డార్లింగ్!

Hyderabad, Telangana:

Prabhas Fauzi Poster News: ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ఫౌజీ'. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఒక సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మొహం చూపించకుండానే ప్రభాస్ సృష్టించిన విధ్వంసం, బ్యాక్‌డ్రాప్‌లో మహాత్మా గాంధీని చూపించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

పోస్టర్ విశేషాలు, కథా నేపథ్యం..
చార్మినార్ బ్యాక్‌డ్రాప్: తాజా పోస్టర్‌లో చార్మినార్ నేపథ్యంగా భారీ మారణహోమం జరిగినట్లు చూపించారు. దోతి ధరించి, రక్తంతో తడిచిపోయి, రెండు చేతుల్లో పిస్టల్స్ పట్టుకుని ఉన్న ప్రభాస్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

గాంధీజీ - ప్రభాస్ విభిన్న ధ్రువాలు: ఒకవైపు అహింసా మార్గాన్ని బోధించిన మహాత్మా గాంధీ వెనక్కి వెళ్తుంటే.. మరోవైపు తుపాకులు పట్టుకుని ప్రభాస్ హింసా మార్గంలో ముందుకు వెళ్తున్నట్లు ఈ పోస్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేశారు. "ఒంటరిగా పోరాడే ఒక బెటాలియన్" అనే క్యాప్షన్ ఈ సినిమా కథాంశం ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో స్పష్టం చేస్తోంది.

ఫ్యాన్స్ రియాక్షన్, అంచనాలు
ఇప్పటివరకు విడుదలైన రెండు పోస్టర్లలోనూ ప్రభాస్ ముఖాన్ని పూర్తిగా రివీల్ చేయనప్పటికీ, విపరీతమైన బ్లడ్ బాత్ (రక్తపాతం) ఉంటుందనే హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు
నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన 'ఆజాద్ హింద్ ఫౌజ్' సైనికుడి నేపథ్యంలో ఈ కథ సాగనుందని సమాచారం. ఈ చిత్రంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్ ఎస్మాయిల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై. రవి శంకర్, నవీన్ యెర్నేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: 'కల్కి 2' సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందా? మేకర్స్ అధికారిక ప్రకటన!

Also REad: మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Weight Loss Diet: ఉదయం పూట అరటిపండు, గుడ్డు తింటే నిజంగా బరువు తగ్గవచ్చా? అసలు విషయాలు ఇవే!

Hyderabad, Telangana:

Weight Loss With Egg Banana: ఉదయం చేసే అల్పాహారం మన రోజంతా శక్తిని, ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'అరటిపండు, గుడ్డు' కాంబినేషన్‌ను అల్పాహారంగా తీసుకుంటే రోజంతా శక్తి అందడంతో పాటు పొట్టలోని కొవ్వు ఇట్టే కరిగిపోతుందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉంది? దీనివల్ల ఆరోగ్యానికి నిజంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

అరటిపండు - గుడ్డు: పోషకాల సమ్మేళనం
ఈ రెండు ఆహార పదార్థాలు వేర్వేరు రూపాల్లో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

అరటిపండ్లు: కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ బి6, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.

గుడ్లు: శరీరానికి కావాల్సిన అధిక నాణ్యత గల ప్రోటీన్‌తో పాటు విటమిన్ బి12, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కండరాల బలానికి, ఆకలిని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. నూనె వాడకుండా ఉడికించిన గుడ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మరింత శ్రేయస్కరం.

బరువు తగ్గడంలో ఈ అల్పాహారం పాత్ర ఎంతవరకు?
కేవలం అరటిపండ్లు, గుడ్లు మాత్రమే తినడం ద్వారా ఎలాంటి మ్యాజిక్ జరిగి బరువు తగ్గడం సాధ్యం కాదు. బరువు తగ్గడానికి అసలైన సూత్రం కేలరీల సమతుల్యత (మనం తీసుకునే కేలరీల కంటే ఖర్చు చేసే కేలరీలు ఎక్కువగా ఉండటం).

ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఈ ఆహారాలు ఆకలిని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి కాబట్టి, వీటిని మీ ఆరోగ్యకరమైన డైట్‌లో భాగం చేసుకోవచ్చు. అయితే రోజంతా తీసుకునే మిగతా ఆహారంలో అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక చక్కెరలు ఉంటే మాత్రం కేవలం ఈ బ్రేక్‌ఫాస్ట్‌తో ఫలితం ఉండదు.

వ్యాయామం చేసేవారికి ఎలా ఉపయోగపడుతుంది?
వర్కౌట్‌కు ముందు.. ఉదయం వ్యాయామం చేసేవారికి అరటిపండులోని కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే వర్కౌట్ తర్వాత గుడ్లలోని ప్రోటీన్ కండరాల కోలుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది.

కేవలం అరటిపండు, గుడ్డు మాత్రమే కాకుండా మీ బ్రేక్‌ఫాస్ట్‌ను మరింత బ్యాలెన్స్‌డ్‌గా మార్చుకోవడానికి ఈ క్రింది మార్పులు చేయవచ్చు. గుడ్లతో పాటు తక్కువ నూనెతో కూడిన వెజిటబుల్ ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. ఉడికించిన గుడ్డు, అరటిపండుతో పాటు చక్కెర లేని పెరుగు లేదా కొన్ని తృణధాన్యాలను జోడించడం ద్వారా శరీరానికి వివిధ రకాల విటమిన్లు అందుతాయి.

గమనించాల్సిన ముఖ్యాంశాలు..
గుడ్లు లేదా అరటిపండ్ల పట్ల అలెర్జీ ఉన్నవారు వాటికి దూరంగా ఉండాలి. దీన్ని బరువు తగ్గించే ఎలాంటి "అద్భుత ఔషధం"గా భావించకూడదు. సరైన పోషకాహారం, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నిద్ర మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితోనే శాశ్వత బరువు నియంత్రణ సాధ్యమవుతుంది.

(గమనిక: ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. మీకు ప్రత్యేక అనారోగ్య సమస్యలు లేదా అలెర్జీలు ఉంటే నిపుణులైన డైటీషియన్ లేదా వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం ఉత్తమం.)

Also Read: Dates Benefits: ఖర్జూర తింటే స్వర్గమే..కూసాలు కదిలిపోయే రహస్యం!

Also Read: Heart Attack Prevention: ఈ గింజలు తింటే గుండెపోటుకు అడ్డుకట్ట వేయోచ్చా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

IND Vs SL Test: టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే వార్త..భారత్ - శ్రీలంక తొలి టెస్టు రద్దు అవ్వొచ్చు!

Galle, Southern Province:

IND Vs SL 1st Test Weather: భారత్, శ్రీలంక జట్ల మధ్య లాంగ్ ఫార్మాట్ పోరు ప్రారంభమైంది. శ్రీలంకలోని చారిత్రాత్మక గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌కు సర్వం సిద్ధమైనా, వరుణుడి రూపంలో అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అయినా మొదటి రోజు ఆటకు అంతరాయం ఏర్పడినా.. రేపటి నుంచి వర్షం మరింతగా విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

గాలే వేదికగా తొలి టెస్టు వాతావరణం..
భారత్ - శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ గాలే స్టేడియం వేదికగా ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఈ ఐదు రోజుల టెస్టులో ఏకంగా నాలుగు రోజుల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో వర్షం పరిస్థితి ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అందోళన చెందుతున్నారు. 

మ్యాచ్‌కు ముందు రోజు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండటంతో టీమిండియా ప్రాక్టీస్ సెషన్ తీవ్రంగా దెబ్బతింది. ఆటగాళ్లు మైదానంలో పూర్తి స్థాయిలో సాధన చేయలేకపోయారు. ఉదయం వర్షం తగ్గినప్పటికీ, రోజంతా అప్పుడప్పుడు కురిసిన చినుకులు ఆటకు అడ్డంకిగా మారాయి. 

వరుణుడి కరుణపైనే మ్యాచ్ భవితవ్యం
ఐదు రోజుల పాటు జరగాల్సిన ఈ మ్యాచ్‌లో నాలుగు రోజులు వర్షం పడే ఛాన్స్ ఉండటంతో, మ్యాచ్ ఫలితం కేవలం ఆటగాళ్ల ప్రదర్శనపైనే కాకుండా వాతావరణంపైనే పూర్తిగా ఆధారపడి ఉంది. వరుణుడు శాంతిస్తేనే ఈ హోరాహోరీ పోరును పూర్తిస్థాయిలో చూసే అవకాశం లభిస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

తొలిరోజు ఆట సాగిందిలా..
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (32 పరుగులు) దురదృష్టవశాత్తూ రన్ ఔట్ రూపంలో వెనుదిరిగారు. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను బాధ్యతాయుతంగా ముందుకు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు విలువైన 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లంక బౌలర్ల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న పడిక్కల్, 81 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో తన అద్భుత అర్ధశతరాన్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 2 వికెట్ల నష్టానికి 269 పరుగులు రాబట్టింది.

Also Read: Rohit Sharma West Indies: రిటైర్మెంట్ వార్తలకు చెక్..రోహిత్ శర్మ మరోసారి వన్డేల్లో!

Also Read; శ్రీలంకతో తొలి టెస్టులో టీమ్ఇండియా ప్లేయింగ్ 11 ఇదే! బెంచ్‌ మీద నలుగురు ఆటగాళ్లు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Allu Arjun Flag Controversy: మరో వివాదంలో హీరో అల్లు అర్జున్.. స్వాతంత్ర్య దినోత్సవ పోస్ట్ డిలీట్..ఏం జరిగిందంటే?

Hyderabad, Telangana:

Allu Arjun Independence Flag Controversy: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ తీవ్ర దుమారం రేపింది. నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.

వివాదానికి కారణం ఏమిటి?
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురుతున్నట్లుగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. అయితే, ఆ జెండా మధ్యలో ఉండాల్సిన అశోక చక్రం అందులో కనిపించలేదు.

దీంతో బాధ్యత గల ప్రముఖ నటుడిగా జాతీయ పతాకాన్ని సరిచూసుకోకుండా పోస్ట్ చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండాలో చక్రం లేకపోయినా, అల్లు అర్జున్ తన సొంత లోగోను మాత్రం స్పష్టంగా వేసుకున్నారని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలు పెరుగుతుండటంతో బన్నీ వెంటనే ఆ పోస్టును తొలగించారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

అల్లు అర్జున్ లైనప్ ప్రాజెక్ట్స్
మరోవైపు, అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ 'రాకా' భారీ బడ్జెట్‌తో వస్తోంది. గిరిజన, పురాణ నేపథ్యం, సమకాలీన కాలం అనే రెండు విభిన్న ప్రపంచాల నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని సమాచారం. 2027 సెకండాఫ్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆ తర్వాత అట్లీ సినిమాతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలోనూ బన్నీ ఒక సినిమా చేయనున్నారు. ఆ వెంటనే బన్నీ లైనప్‌లో సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న 'పుష్ప 3' సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది.

Also Read: బిగ్ బాస్ 10లోకి క్రేజీ యాంకరమ్మ.. అల్లు అరవింద్ మెచ్చిన హీరోయిన్ బ్యూటీ ఎంట్రీ ఖాయం

Also Read: "బిగ్‌బాస్ 'అగ్నిపరీక్ష' అంతా బోగస్" శ్రీముఖిని పొగడలేదని షో నుంచి బయటకు పంపించేశారట

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top