icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow28 Jul 2024, 02:18 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

UK Grooming Gang Report: 2,50,000 అమ్మాయిలపై అత్యాచారం చేసిన పాకిస్థానీ టీమ్..పనికట్టుకొని మరీ బాలికలకు ఎర!

England:

UK Grooming Gang News: బ్రిటన్‌లో గత కొన్ని దశాబ్దాలుగా సాగిన అమానవీయ 'గ్రూమింగ్ గ్యాంగ్' వ్యవస్థీకృత బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన నమ్మలేని నిజాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు (MP) రూపెర్ట్ లోవ్ నేతృత్వంలోని ఒక స్వతంత్ర విచారణ సంస్థ జూన్ 16న విడుదల చేసిన 'సామూహిక అత్యాచార విచారణ నివేదిక' దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘోరాల బారిన పడి కనీసం 2,50,000 మంది బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారని ఈ నివేదిక వెల్లడించింది.

బాధితురాలి నుండి సామాజిక కార్యకర్తగా మారిన సామీ వుడ్‌హౌస్ అధ్యక్షతన, కోర్టు రికార్డులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ దారుణాల్లో బాధితులుగా మారిన వారిలో అత్యధిక శాతం మంది శ్వేతజాతీయులైన బ్రిటిష్ బాలికలే కావడం గమనార్హం. 2005 నుండి 2017 మధ్య కాలంలో బాలల లైంగిక దోపిడీకి పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారిలో 84 శాతం మంది దక్షిణాసియా ముస్లిం (ప్రధానంగా పాకిస్తానీ మూలాలున్న) పురుషులేనని నివేదిక స్పష్టం చేసింది.

యూకేలోని దాదాపు 40 శాతం ప్రాంతాలు (149 స్థానిక అధికార జిల్లాలు) ఈ ముఠాల బారిన పడ్డాయి. రోథర్‌హామ్, ఆక్స్‌ఫర్డ్, టెల్ఫోర్డ్, రోచ్‌డేల్ వంటి నగరాల్లో ఇవి తీవ్రస్థాయిలో సాగాయి.

ముఠాల అమానుష వ్యూహం
ఈ వ్యవస్థీకృత ముఠాలు విచ్ఛిన్నమైన కుటుంబాలు, సంరక్షణ గృహాలకు చెందిన 11 ఏళ్ల లోపు బలహీనమైన బాలికలను లక్ష్యంగా చేసుకునేవి. పాఠశాలల వద్ద, వీధుల్లో బాలికలతో స్నేహం చేసి.. వారికి బహుమతులు, మద్యం, మాదకద్రవ్యాలు ఎరగా వేసి టాక్సీలలో రహస్య ప్రాంతాలకు తరలించేవారు.

ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో వారిపై పదేపదే సామూహిక అత్యాచారాలు, చిత్రహింసలు జరిపేవారని నివేదికలు వెల్లడించాయి. బ్లాక్‌మెయిల్ చేయడం కోసం వాటిని చిత్రీకరించి, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి, కొన్నిసార్లు విదేశాలకు సైతం అక్రమ రవాణా చేసేవారు. ఈ క్రూరత్వం కారణంగా ఎంతోమంది మైనర్ బాలికలు గర్భవతులయ్యారు. బలవంతపు అబార్షన్లు, తీవ్ర మానసిక ఆఘాతాల వల్ల గర్భస్రావాలకు గురయ్యారు.

బ్రిటన్ జాతీయ ఆరోగ్య సంస్థ (NHS) 13 ఏళ్ల చిన్న పిల్లలలో జననేంద్రియ గాయాలు, లైంగిక వ్యాధులు, ఆత్మహత్యాయత్నాలను గుర్తించినప్పటికీ, బాధితులకు సరైన రక్షణ కల్పించడంలో విఫలమై తిరిగి వారిని అదే నరకంలోకి నెట్టేసిందని నివేదిక తీవ్రంగా తప్పుబట్టింది.

దశాబ్దాలుగా సాగిన ఈ దారుణాలను అణచివేయడంలో పోలీసులు, సామాజిక సేవా సంస్థలు, విద్యాసంస్థలు, ఎన్‌హెచ్ఎస్, ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. నివేదిక ఆరోపణ ఆధారంగా.. నేరస్థుల జాతి, మతపరమైన నేపథ్యం కారణంగా, తమపై ఎక్కడ "జాత్యహంకారులు" అనే ముద్ర పడుతుందోననే భయంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడారు. కొన్ని ముస్లిం సమాజాల్లోని సాంస్కృతిక వైఖరులు, ముస్లిమేతర అమ్మాయిలను తక్కువగా చూసే ధోరణి కూడా ఈ నేరాలు పెరగడానికి దోహదపడ్డాయి.

నివేదిక చేసిన కఠిన సిఫార్సులు
సమూహ ఆధారిత బాలల లైంగిక దోపిడీకి పాల్పడే ప్రధాన సూత్రధారులకు కనీసం 50 సంవత్సరాలు, సహకరించిన వారికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘోరాలకు పాల్పడినట్లు రుజువైన విదేశీ పౌరుల బ్రిటిష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలి. ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారితో సహా అందరినీ వెంటనే దేశం నుండి బహిష్కరించాలి. ప్రాణాలతో బయటపడిన బాధితులకు ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయి పునరావాసం, మానసిక వైద్యం అందించాలి. ప్రజల నుంచి సేకరించిన నిధులతో, బాధితుల ఆధ్వర్యంలోనే సాగిన ఈ స్వతంత్ర విచారణ నివేదిక ప్రస్తుతం యూకేలో బాలల రక్షణ, వలసల విధానం, చట్టపరమైన జవాబుదారీతనంపై తీవ్రస్థాయి చర్చకు దారితీసింది.

Also Read: హిజాబ్ లేకుండా పాట పాడిందని లేడీ సింగర్‌కు 74 కొరడా దెబ్బలు!

Also Read: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం..యుద్ధం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Prakash Raj Arrest: నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలని ఆదేశం!

Hyderabad, Telangana:

Prakash Raj Arrest Warrant: సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఇటీవల 'ధర్మస్థల' కేసుతో వార్తల్లో నిలిచిన బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరో చిక్కులో పడ్డారు. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారన్న ఆరోపణపై నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.

ప్రకాష్ రాజ్‌పై దిలీప్ కుమార్ కేసు నమోదు చేయడంతో బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారన్న ఆరోపణలపై దిలీప్ కుమార్ కేసు దాఖలు చేశారు. ఆ తర్వాత, 48వ ఏసీజేఎం కోర్టు ప్రకాష్ రాజ్‌పై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేయగా, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

కోర్టు ద్వారా రెండుసార్లు సమన్లు ​​జారీ చేసినా, రెండుసార్లు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసినా ప్రకాష్ రాజ్ హాజరు కాకపోవడంతో, మేజిస్ట్రేట్ కోర్టు ఇప్పుడు ఆయనపై మూడోసారి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా నటుడు ప్రకాష్ రాజ్ కోర్టుకు హాజరు కాలేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు.. ఈ నాలుగు రాష్ట్రాల్లో చట్టవిరుద్ధమైన ఓటర్ ఐడి కలిగి ఉన్నారనే తీవ్రమైన ఆరోపణలను ప్రకాష్ రాజ్ ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకే ఒక ఓటర్ ఐడి కార్డును మాత్రమే కలిగి ఉండటానికి అనుమతి ఉంది.

కానీ నటుడు ప్రకాష్ రాజ్ నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డులు పొందారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, నిందితుడు ప్రకాష్ రాజ్ సమన్లు, వారెంట్లను పట్టించుకోకుండా కోర్టుకు హాజరు కాకపోవడంపై ఏసీజేఎం కోర్టు ఆగ్రహంగా ఉందని అంటున్నారు. దీంతో, మేజిస్ట్రేట్ కోర్టు ఇప్పుడు ప్రకాష్ రాజ్ కోసం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఏ సమన్లు, వారెంట్లకూ హాజరుకాని ప్రకాష్ రాజ్‌పై ఇప్పుడు చట్ట ఉల్లంఘన ఆరోపణలు కూడా నమోదయ్యాయి. ఈ కారణాలన్నిటి వల్ల నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు.

Also Read: మరణించిన తర్వాత ఆరుగురికి ప్రాణం పోసిన రాజ్..ముంబై కుర్రాడి హృదయ విదారక గాథ!

Also Read: భారీగా తగ్గిన ధరలు.. బంగారంపై రూ.3 వేలు.. వెండి రూ.14 వేలు డౌన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో 'చెన్నై లవ్‌ స్టోరీ బృందం', ఇతర ప్రముఖులు

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Rush: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం పూట సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు పలు రాష్ట్రాల న్యాయమూర్తులు స్వామిని దర్శించుకున్నారు. దీంతో భక్తులతో తిరుమల కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగిసినా కూడా భక్తుల తాడికి తిరుమలకు తగ్గడం లేదు. వారికి ప్రత్యేక దర్శనం కల్పించిన అనంతరం టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

సినీ ప్రముఖులు
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చెన్నై లవ్ స్టోరీ చిత్ర బంధం కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తిరుమల స్వామిని ఆదివారం ఉదయం కిరణ్‌ అబ్బవరంతోపాటు హీరోయిన్‌ శ్రీ గౌరి ప్రియ, నిర్మాత శ్రీనివాస్ కుమార్, రచయిత అనంత శ్రీరామ్, సంగీత దర్శకుడు మణిశర్మ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించిన టీటీడీ అధికారులు.. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. దర్శనానంతరం సినిమా బృందం ఆలయం వెలుపల సందడి చేశారు. తమ సినిమా విజయం సాధించాలని.. ప్రేక్షకుల ఆదరణ పొందాలని స్వామివారి సన్నిధిలో వారు ప్రార్థించినట్లు సినీ నటుడు కిరణ్‌ అబ్బవరం తెలిపారు

న్యాయమూర్తులు
శ్రీవారిని తెలంగాణ, మేఘాలయ న్యాయమూర్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేఘాలయ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రామలింగం సుధాకర్, తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి శ్రవణ కుమార్ ఆలయ దర్శనానికి రాగా.. అధికారులు వారికి వేద ఆశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు . 

తిరుమలలో భక్తుల రద్దీ
వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్‌లలోని క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లు కలిగిన భక్తులకు 2-5 గంటలు దర్శనానికి సమయం పడుతుంటా.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2-6 గంటల సమయం కొనసాగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 20వ తేదీన స్వామివారిని 93,303 మంది భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. స్వామివారికి తలనీలాలు 46,688 మంది భక్తులు సమర్పించగా.. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు వచ్చింది.

0
0
Report
Advertisement

Team India ODI Squad: వన్డే జట్టులో ఎట్టకేలకు విరాట్ కోహ్లీ ఆగమనం..కానీ, ఆ పని చేస్తేనే ఆడే ఛాన్స్!

Mumbai, Maharashtra:

Team India ODI Squad Vs England: జూలైలో ఇంగ్లాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. చాలా రోజుల తర్వాత వన్డే జట్టులో కోహ్లీకి అవకాశం కల్పించగా.. అయితే ఈ నెలాఖరులో జరిగే ఫిట్‌నెస్ పరీక్షలో అతను నెగ్గాల్సి ఉంటుంది. తాజాగా బీసీసీఐ ప్రకటించిన వన్డే జట్టుకు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తుండగా.. జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా జట్టు జూలై 14 నుంచి 19 వరకు మూడు వన్డేలు ఆడనుంది. 

బీసీసీఐ ప్రకటించిన వన్డే జట్టులో ఎవరెవరు ఉన్నారంటే?
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (ఫిట్‌నెస్ పరీక్ష నెగ్గాలి), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.

గత నెల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విరాట్ కోహ్లీ.. ఫైనల్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీకి'హామ్‌స్ట్రింగ్' గాయం బారిన పడ్డాడు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ వేగంగా కోలుకుంటున్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. లండన్‌లో BCCI వైద్య బృందం అతన్ని పరీక్షించి, పునరావాస ప్రక్రియలో ప్రాథమిక దశను కొనసాగించడానికి ఒక ప్రణాళికను అందించింది. తదుపరి పరిశీలన, ప్రణాళిక, అనుమతి కోసం అతను జూన్ 22, 2026న CoE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లో రిపోర్ట్ చేయనున్నారు.

జైస్వాల్, హార్దిక్‌లకు చోటు లేదు
ఆఫ్ఘనిస్తాన్‌తో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు కోహ్లీ దూరమయ్యాడు. ఆ సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కోహ్లీ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌కు అవకాశం లభించింది. ఈ యువ లెఫ్ట్-హ్యాండ్ బ్యాటర్ ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని, జూన్ 20 శనివారం నాడు చెన్నైలో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అయితే, ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల వన్డే జట్టులో యశస్వికి చోటు దక్కలేదు.

గాయం సమస్యల నుండి ఇంకా కోలుకుంటున్నందున హార్దిక్ పాండ్యాను ఈ వన్డే పర్యటనకు ఎంపిక చేయలేదు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్‌లో పూర్తి ఫిట్‌గా ఉండేందుకు ఇబ్బంది పడిన ఈ ఆల్‌రౌండర్, ఈ నెల ప్రారంభంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ తీసుకుంటుండగా క్వాడ్రిసెప్స్ కండరాల గాయానికి గురయ్యాడు. అతని గైర్హాజరీలో, నితీష్ కుమార్ రెడ్డి ప్రధాన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడు.

శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా తన స్థానాన్ని నిలుపుకోగా.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్‌కు అవకాశం కల్పించేందుకు ఓపెనింగ్ స్థానాన్ని ఖాళీ చేసిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బ్యాటింగ్ ఆర్డర్‌లో తిరిగి ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. లక్నోలో ఆఫ్ఘనిస్తాన్‌పై 125 పరుగులు చేసి తనదైన ముద్ర వేసిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

బుమ్రా పునరాగమనం
ఆఫ్ఘనిస్తాన్ వన్డేలకు, యూకే పర్యటనలోని టీ20లకు (ఐర్లాండ్‌తో మూడు టీ20లు, ఇంగ్లాండ్‌తో ఐదు) విశ్రాంతి తీసుకున్న జస్‌ప్రీత్ బుమ్రా, వన్డే జట్టులోకి తిరిగి రానున్నాడు. 2027 ప్రపంచకప్‌కు ముందు బుమ్రా టెస్ట్ క్రికెట్ ఆడి, వన్డేలపై దృష్టి పెట్టాలన్న ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం ఉంది.

బుమ్రాకు పూర్తిస్థాయి పేస్ బౌలింగ్ దళం అందుబాటులో ఉంటుంది. ఇందులో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాతో పాటు, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తన తొలి వన్డే సిరీస్‌లో ఏడు వికెట్లతో ఆకట్టుకున్న కొత్త ఆటగాడు గుర్నూర్ బ్రార్ కూడా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్‌కు జట్టు నుంచి మినహాయింపు లభించింది.

Also Read: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్..94 మ్యాచ్‌లతో మెగా టోర్నీ..ఆర్సీబీకి పండగే!

Also Read: పాకిస్థాన్ బౌలర్ మెడ పట్టుకున్న టీమ్ఇండియా బ్యాటర్..సోషల్ మీడియాలో వైరల్ వీడియో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Rythu Bharosa 2026: జూన్ 30న రైతు భరోసా విడుదల.. రూ.15 వేలు వస్తాయా.. రూ.12 వేలా?

Hyderabad, Telangana:

Rythu Bharosa Funds Release On June 30: రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు ఊపు అందుకుంటున్న సమయంలో రైతందానికి పెట్టుబడి సహాయం అందించే రైతు రైతు భరోసా నిధుల పంపిణీ పై అన్నదాతల్లో ఉత్కంఠ నెలకొంది.. ఈనెల 30వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో వానాకాలం పెట్టుబడి సాయం నిధులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది.. అయితే ప్రస్తుతం ఏకరానికి ఏడాది రూ.12 వేల చొప్పున అందుతుండడంతో.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి 15వేల సాయం ఎప్పటి నుంచి అందుతుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం ఎదురుచూస్తూ వస్తోంది..

జూన్ 30న మధిర సభలో నిధుల విడుదల..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు.. జూన్ 30వ తేదీన ఖమ్మం జిల్లాలోని మధిరలో నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి ఈ నిధుల పంపిణీని అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో దాదాపు పది రోజుల వ్యవధిలోనే నేరుగా ఈ పెట్టుబడి సాయాన్ని జమ చేసేందుకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం..

రూ.15 వేల పెంపుపై అన్నదాతల ప్రశ్నలు..
ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల్లో ఒకే ఒక అంశంపై ప్రధానంగా చర్చ నడుస్తూ వస్తోంది.. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరానికి ఏడాదికి ఏకంగా 15000కు పెంచుతామని హామీ ఇచ్చింది.. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైన.. పాత పద్ధతిలోనే ఎకరానికి 6000 చొప్పున 12000 మాత్రమే జమయ్యే అవకాశాలు ఉండడంతో రైతులు కొంత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు..

పెంచిన 15వేల సాయాన్ని ఈ వానాకాలం నుంచి వర్తింప చేస్తారా? లేక తదుపరి యాసంగి సీజన్ నుంచి అమలు చేస్తారా? అనే విషయంపై స్పష్టత కరువైంది.. ప్రస్తుతం ఎరువులతో పాటు విత్తనాలు, దుక్కుల ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో సాగు పెట్టుబడుల కోసం రైతులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో పెంచిన సాయం త్వరగా అందితే తమకు మరింత ఊరట లభిస్తుందని కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో చిన్న సన్న కారు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

రైతుల డిమాండ్..
ప్రభుత్వం జూన్ 30 నుంచి ఇచ్చే నిధులతో పాటు పెంచిన 15 వేల సాయం అమలుపై కూడా తక్షణమే ఒక అధికారిక ప్రకటన చేయాలని.. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు.. కౌలు రైతుకు ఈ సాయం అందేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతున్నారు. ఖాతాల్లో నిధులు జమావుతున్నప్పటికీ వారు సంతోషించినప్పటికీ.. పెరిగిన సాయం ఎప్పటినుంచి చేతికి అందుతుందో తెలియక.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది అన్నదాతలు ఇప్పుడు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Russia Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ మెగా డ్రోన్ ఎటాక్.. ట్యూమెన్ ఆయిల్ రిఫైనరీపై విధ్వంసం!

Hyderabad, Telangana:

Russia Ukraine Drone Attack: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధం సరికొత్త వ్యూహాత్మక మలుపు తిరిగింది.. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా ఉక్రేన్ సైన్యం శత్రుదేశంపై మునుపేన్నడు లేనివిధంగా అత్యంత సుదూర పరిధి నుంచి విధ్వంసకర దాడికి తెగబడింది.. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి ఏకంగా 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యకు గుండెకాయ లాంటి యురల్స్ (Urals) ప్రాంతంలో ఉన్న ట్యూమెన్ ఆయిల్ రిఫైనరీ ఫై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా భూభాగంలో ఇంత సుదూర ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక కేంద్రాన్ని ఉక్రెన్ టార్గెట్ చేయడం అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తుంది..

ఆయిల్ రిఫైనరీలే టార్గెట్.. రష్యాకు భారీ నష్టం..
గత కొంతకాలంగా రష్యాకు చెందిన చమురు నిల్వలతోపాటు ఇంధన మౌలిక వసతులే లక్ష్యంగా వుక్రీన్ వరస దాడులకు పాల్పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా రష్యాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీలో ఒకటైన Tyumen ప్లాంట్‌పై ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా చేదించాయి.. అత్యంత ప్రతిష్టమైన రష్యా వైమానిక రక్షణ వ్యవస్థ దాటుకుంటూ వెళ్లిన ఈ డ్రోన్లు రిఫైనరీ సమీపంలోని పేలిపోయినట్లు తెలుస్తోంది. ఈ దాడితో రష్యా ఇంధన సరఫరాకు భారీ నష్టం కలిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి రష్యా భూభాగంపై తాము సాధించిన ఈ సుదూర డ్రోన్ దాడి పై ఉక్రెయిన్ అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదొక అద్భుతమైన, గొప్ప విజయమని ఆయన అభివర్ణించారట.. శత్రువు మాపై దాడులు చేస్తూ సురక్షితంగా ఉంటాం అనుకుంటే అది పొరపాటేనని.. రష్యా భూభాగంలో ఏ మూలన దాక్కున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. వారి రక్షణ రంగ ఇంజనీర్లు రాత్రి పగళ్ళు శ్రమించి అత్యంత అధునాతన సాంకేతికతతో సరికొత్త లాంగ్ రేంజ్ డ్రోన్లను అభివృద్ధి చేశారని.. ఇవి ఏకంగా మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలమని జెలన్స్ కి తెలిపారు..

3,000 కి.మీ రేంజ్ డ్రోన్లతో రష్యాకు కొత్త ముప్పు..
బుక్ గ్రీన్ సరికొత్తగా తయారుచేసిన ఈ లాంగ్ రేంజ్ డ్రోన్లు రష్యా సైన్యానికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.. సాధారణంగా చిన్న పరిధిలో పనిచేసే డ్రోన్ల స్థానంలో.. వేల కిలోమీటర్లు ప్రయాణించి వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం వీటికి ఉంది. 3000 కిలోమీటర్ల పరిధి అంటే కేవలం సరిహద్దు ప్రాంతాలే కాకుండా.. రష్యాలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాలతో పాటు పారిశ్రామిక కేంద్రాలు ఇప్పుడు ఉక్రెయిన్ డ్రోన్ల నిఘా నీడలొకి వచ్చినట్లేనని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు..

ఆందోళనలో రష్యా..
సరిహద్దుకు అత్యంత దూరంలో ఉన్న ప్రాంతంపై దాడి జరగడంతో మాస్కో వర్గాలు తీవ్ర దిబ్రాంతుకు గురైనట్లు సమాచారం.. ఈ డ్రోన్ దాడితో రష్యా తన అంతర్గత రక్షణ వ్యవస్థను పునర్సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఒకవైపు అంతర్జాతీయ ఆంక్షలుతో సతమతమవుతున్న రష్యాకు.. ఈ ఆయిల్ రిఫైనరీ లపై దాడులు మరింత ఆర్థిక నష్టాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఈ ఘటనతో రాబోయే రోజుల్లో ఇరుదేశాల మధ్య దాడులు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది..

Also Read:  International Yoga Day 2026: యోగాతో దేశానికి చైతన్యం.. ప్రధాని మోడీ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Karimnagar: ఘోర ప్రమాదం.. 37 మంది ప్రయాణికులను కాపాడిన రియల్ హీరో..

Karimnagar, Telangana:

Karimnagar EV Bus Fire Latest News: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సమీపంలో ఆదివారం భారీ ప్రమాదం తప్పింది.. ఎల్ఎంటి సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న ఒక ఎలక్ట్రిక్ బస్సు లో హఠాత్తుగా ఘోరమైన మంటలు చెలరేగాయి.. బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక తీవ్రభయాందోళనకు గురయ్యారు.. అయితే బస్సు డ్రైవర్ ప్రశాంత్ చూపిన అసాధారణ సమయస్ఫూర్తితో పాటు ధైర్యం కారణంగా ఒక పెద్ద విపత్తు తృటిలో తప్పింది.. బస్సు పూర్తిగా బూడిదైనా.. ప్రయాణికులు అందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు..

అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ వైపు ప్రయాణికులతో వెళుతున్న ఎలక్ట్రిక్ బస్సు తిమ్మాపూర్ సమీపంలోని కాకతీయ కెనాల్ వద్దకు చేరుకోగానే.. బస్సు వెనుక భాగం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం మొదలయ్యాయి.. దీనిని గమనించిన కొందరు ప్రయాణికులు భయాందోళనతో గట్టిగా అరిచారు.. వెంటనే అలెర్ట్ అయిన డ్రైవర్ ప్రశాంత్.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా చాకచక్యంగా వ్యవహరించాడు.. బస్సు రోడ్డు పక్కకు సురక్షితంగా ఆపేసి.. ప్రయాణికులను ఏమాత్రం కంగారు పడవద్దు అని ధైర్యం చెప్పారు.. బస్సు తలుపులు తెరిచి.. లోపల ఉన్న 37 మంది ప్రయాణికులను త్వర త్వరగా కిందికి దింపేశారు..

చివరి ప్రయాణికుడు దిగేవరకు బస్సులోనే..
సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణభయంతో ఎవరైనా ముందుగా బయటపడాలని అనుకుంటూ ఉంటారు.. కానీ డ్రైవర్ ప్రశాంత్ మాత్రం వృత్తి ధర్మాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు.. ఏమాత్రం బస్సులో మంటలు వస్తున్నప్పటికీ భయపడకుండా 37 మంది ప్రయాణికులను అతనే త్వర త్వరగా అతని బయటికి పంపించాడు.. చివరి ప్రయాణికుడి వరకు అక్కడే ఉండి.. చివరిగా అందరూ దిగిన తర్వాతే డ్రైవర్ ప్రశాంత్ కాలుతున్న బస్సులో నుంచి దిగాడు...

క్షణాల్లో బస్సులో మంటలు..
ప్రయాణికులు అందరూ కిందికి దిగిన కేవలం కొద్ది నిమిషాల్లోనే.. బ్యాటరీ ప్రభావంతో మంటలు బసంత వేగంగా వ్యాప్తించాయి. చూస్తూ చూస్తూనే.. లక్షలాది రూపాయల విలువైన ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది.. అంతేకాకుండా బస్సు అంతా కాలిపోయి ఒక అస్తిపంజరంలా మారిపోయింది.. స్థానికులతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు..

ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 37 మంది ప్రయాణికులతో పాటు వారి కుటుంబ సభ్యులు డ్రైవర్ ప్రశాంత్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నువ్వే కనుక సరైన సమయంలో బస్సు ఆపకపోయి ఉంటే.. మా పరిస్థితి ఏంటో ఊహించుకుంటూనే భయమేస్తోందని.. అతను వారికి మళ్లీ పునర్జన్మను ఇచ్చారని.. ప్రయాణికులు బాగోదు ద్వేగానికి లోనవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా డ్రైవర్ ప్రశాంత్ రియల్ హీరో అంటూ సోషల్ మీడియా వినియోగదారులు సైతం ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
0
Report

Indian Treasure Act: మీ భూమిలో లంకెబిందెలు, వజ్రాలు దొరికితే ఏం చేయాలి? మీకు సొంతం కావాలంటే చట్టం ఏం చెబుతుంది?

Hyderabad, Telangana:

Hidden Treasure Laws In India: మన సొంత భూమి లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తిపై మనకు సర్వహక్కులూ ఉంటాయని భావించడం సహజం. కానీ, భారతీయ చట్టాల ప్రకారం భూమి ఉపరితలంపై ఉండే హక్కులకు, భూగర్భంలో లభించే వనరులపై ఉండే హక్కులకు చాలా తేడా ఉంది. రజనీకాంత్ 'నరసింహ' సినిమాలో చూపించినట్లుగా సొంత భూమిలో ఖనిజాలు దొరకగానే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావడం నిజ జీవితంలో సాధ్యం కాదు. మీ భూమిలో లంకెబిందెలు, వజ్రాలు లేదా ఖనిజాలు లభిస్తే చట్టం ఏం చెబుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

భూమిలో ఖనిజాలుంటే హక్కు ఎవరిది?
మీ భూమి అడుగున బొగ్గు, ముడి ఇనుము, పెట్రోలియం, బంగారం లేదా వజ్రాలు వంటి ఏ రకమైన సహజ ఖనిజ సంపద బయటపడినా.. దానిపై మీకు ఎలాంటి హక్కు ఉండదు.

చట్టం ఏం చెబుతోంది?
'మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం, 1957' ప్రకారం భూగర్భంలో ఉండే అన్ని రకాల ఖనిజాలపై పూర్తి నియంత్రణ, హక్కులు కేవలం ప్రభుత్వం (రాష్ట్ర లేదా కేంద్ర) పరిధిలోనే ఉంటాయి. 2024 జులై నాటి చారిత్రాత్మక 'మినరల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ' కేసుతో పాటు 2025లో కూడా సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై స్పష్టతనిచ్చింది. భూమి మీదే అయినప్పటికీ, ప్రభుత్వ అనుమతి (లీజు) లేకుండా, రాయల్టీ చెల్లించకుండా అందులో మైనింగ్ చేసే హక్కు ఎవరికీ లేదు.

లంకెబిందెలు లేదా నిధులు దొరికితే?
పాతకాలం నాటి బంగారు నాణాలు, వెండి ఆభరణాలు లేదా లంకెబిందెలు దొరికినప్పుడు 'ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్, 1878' అమల్లోకి వస్తుంది. చట్టప్రకారం పది రూపాయల కంటే ఎక్కువ విలువైన ఏ వస్తువు దొరికినా అది 'నిధి' కిందకే వస్తుంది. నిధి దొరికిన వెంటనే ఆ విషయాన్ని స్థానిక జిల్లా కలెక్టర్‌కు గానీ లేదా రెవెన్యూ అధికారులకు గానీ రాతపూర్వకంగా తెలియజేయాలి.

సమాచారం అందిన తర్వాత కలెక్టర్ 4 నుండి 6 నెలల గడువుతో పబ్లిక్ నోటీసు ఇస్తారు. ఆ నిధిని ఎవరు, ఎప్పుడు దాచారనే కోణంలో విచారణ జరుగుతుంది. ఒకవేళ ఆ నిధి 100 ఏళ్ల లోపుదా అని తేలి, దానికి సంబంధించిన వారసులు సరైన ఆధారాలు చూపిస్తే వారికి అప్పగిస్తారు. ఒకవేళ ఆధారాలు లేకపోతే దానిని 'యజమాని లేని నిధి'గా ప్రకటిస్తారు.

నిధి పంపిణీ ఎలా జరుగుతుంది?
ఎటువంటి వివాదాలు లేని పక్షంలో, దొరికిన నిధిలో 75 శాతం దాన్ని కనుగొన్న వ్యక్తికి, 25 శాతం భూమి యజమానికి దక్కుతుంది. ఒకవేళ ఆ నిధికి చారిత్రక లేదా పురావస్తు ప్రాధాన్యత ఉంటే, ప్రభుత్వం దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. అలాంటి సమయంలో ఆ నిధి మార్కెట్ విలువకు అదనంగా మరో 20 శాతం పరిహారాన్ని కలిపి కనుగొన్న వ్యక్తికి, భూ యజమానికి పంచుతారు.

అయితే నిధి దొరికిన విషయాన్ని దాచిపెట్టి, రహస్యంగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే చట్టప్రకారం నిధిపై హక్కు కోల్పోవడమే కాకుండా, ఏడాది పాటు జైలు శిక్ష లేదా జరిమానా (లేదా రెండూ) విధించే అవకాశం ఉంది.

వజ్రాలు సొంతం చేసుకోవచ్చా?
వర్షాకాలంలో పల్నాడు జిల్లాలోని కోళ్లూరు ప్రాంతం.. కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో, రోడ్లపై వజ్రాలు దొరుకుతుంటాయనే పుకారు ఉంది. చట్టప్రకారం ఈ వజ్రాలపై కూడా వెతికిన వారికి ఎలాంటి హక్కు ఉండదు. అది ఎవరి పొలంలో దొరికినా అది ప్రభుత్వ ఆస్తి కిందకే వస్తుంది. వాటిని వెంటనే పోలీసులకు లేదా రెవెన్యూ అధికారులకు అప్పగించాలి.

ఎవరైనా దొరికిన వజ్రాన్ని నిజాయితీగా అధికారులకు అప్పగిస్తే, ప్రభుత్వం దాన్ని అధికారికంగా వేలం వేస్తుంది. ఆ వేలం ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కొంత శాతాన్ని (సాధారణంగా సగం వరకు) ఆ వ్యక్తికి నజరానాగా అందిస్తారు. మిగిలిన మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.

ప్రస్తుతం క్షేత్రస్థాయిలో దళారుల ప్రమేయం వల్ల బ్లాక్ మార్కెట్ నడుస్తున్నప్పటికీ, చట్టపరంగా చూస్తే భూమిలో దొరికే ఎలాంటి ఖనిజాలు, లంకెబిందెలైనా ప్రభుత్వానికే చెందుతాయి. వాటిని అధికారులకు అప్పగించి చట్టబద్ధంగా వచ్చే వాటాను లేదా నజరానాను పొందడమే సురక్షితమైన మార్గం.

Also Read: ఆంధ్రప్రదేశ్‌కు కూతవేటు దూరంలో మరో బంగారం నిధి..దక్షిణ భారతదేశంలో రెండో బంగారు గని!

Also Read: కొత్త ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎఫ్ అకౌంట్లో రూ.15,000 జమ..ఎప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Flipkartలో బంపర్ ఆఫర్.. సగం ధరకే Motorola Edge 60 Fusion 5G ఫోన్‌..

Hyderabad, Telangana:

Motorola Edge 60 Fusion 5g Huge Discount: మోటరోలా కంపెనీ ఎప్పటికప్పుడు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ అత్యంత తక్కువ ధరల్లో విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్లో ఈ మొబైల్స్ ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఎక్కువగా ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను యువతే కొనుగోలు చేయడం విశేషం.. తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం కారణంగా.. సేల్స్ విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మోటరోలా కంపెనీ ఎప్పటికప్పుడు మంచి మంచి మొబైల్స్ విడుదల చేస్తూ వస్తోంది. 

ప్రస్తుతం మంచి డిమాండ్ కలిగిన మోటోరోలా మొబైల్స్‌లో Motorola Edge 60 Fusion 5G ఒకటి. దీనికి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. చాలామంది యువత ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.. అత్యంత తక్కువ ధరలోనే ప్రీమియం కెమెరా సెట్ అప్ తో ఎన్నో రకాల ఫీచర్లతో అందుబాటులోకి రావడం వల్ల మొబైల్ మార్కెట్లో హైలెట్‌గా నిలిచింది.. మీరు కూడా ఎప్పటినుంచో Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం.. ఎందుకంటే దీనిపై ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ ఫ్లిప్‌కార్ట్‌అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేస్తే సగం కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్స్చేంజి బోనస్ ఆఫర్ వినియోగిస్తే చాలా చీప్ ధరకే పొందవచ్చు..

ప్రస్తుతం మార్కెట్లో 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ MRP ధర రూ.27,999 లకు విక్రయిస్తోంది. అయితే, దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ బ్యాంకు ఆఫర్స్‌లో భాగంగా.. దీనిని ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు తోపాటు ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. 

ముఖ్యంగా దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ అందిస్తుంది. ఇందులో భాగంగా మీ దగ్గర ఉన్న ఏదైనా పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్ చేస్తే దాని కండిషన్ను బట్టి.. అలాగే ఆ మొబైల్ బ్రాండ్ ను బట్టి.. అదనంగా దాదాపు రూ.9 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ బోనస్ కొత్త మొబైల్ కొనుగోలు చేసే క్రమంలో వినియోగిస్తే..దాదాపు ఈ Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.1,7999 లోపే సొంతం చేసుకోవచ్చు..

ఇక ఈ Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో అద్భుతమైన 6.67 ఇంచుల Super HD+ (1.5K) pOLED క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీన్ని డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్టును కలిగి ఉంటుంది. అలాగే ఈ స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం.. Corning Gorilla Glass 7i సపోర్టుతో అందుబాటులో ఉంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 (4nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. గేమింగ్‌తో పాటు మల్టీ టాస్టింగ్ కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.. ఇది ఎంతో శక్తివంతమైన 5500 mAh బ్యాటరీ ను కలిగి ఉంటుంది. దీనికి కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 68W TurboPower సపోర్టును కూడా అందిస్తోంది.. అదేవిధంగా వెనక భాగంలో స్పెషల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉండడం విశేషం.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఈ Motorola Edge 60 Fusion 5G మొబైల్‌కు సంబంధించిన కెమెరా సెటప్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో ప్రత్యేకమైన 50 MP ప్రధాన కెమెరా (Sony LYTIA 700C సెన్సార్, OIS సపోర్ట్)తో పాటు 13 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ (లింక్డ్ మేక్రో విజన్) కెమెరాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 32 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇవే కాకుండా మోటరోలా కంపెనీ ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్స్ ను కూడా అందిస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Shani Vakragati 2026: శని వక్రగతితో ఈ రాశుల వారికి బంపర్ లాభాలు.. అదృష్టం పట్టబోయే ఆ 4 రాశులు ఇవే!

Hyderabad, Telangana:

Shani Vakragati 2026 Effect On Zodiac: శని ప్రస్తుతం మీనరాశిలో సంచార దశలో కొనసాగుతోంది. దీని ఫలితంగా కొన్ని రాశులు అర్థాష్టమ శని ప్రభావంతో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ గ్రహం జూలైలో తన గమనాన్ని మార్చుకోబోతోంది.. ముఖ్యంగా జులై 27వ తేదీన శని వక్రగతిలోకి వెళ్ళబోతోంది. అయితే, ఇది డిసెంబర్ 11వ తేదీ వరకు ఇదే స్థితిలో కొనసాగుతుంది. దాదాపు 138 రోజులపాటు ఐదు రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోబోతున్నాయి. గతంలో ఉద్యోగాల్లో తీవ్ర ఇబ్బందులు పడ్డ వ్యక్తులందరికీ ఈ సమయంలో పరిష్కారం లభించబోతోంది.. అంతేకాకుండా జీవితంలో సమస్యలు పూర్తిగా తగ్గి మానసిక ప్రశాంతత లభించబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, శని వక్రగతిలోకి వెళ్లడం కారణంగా ఏ రాశుల వారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుందో? విశేషమైన లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
కుంభరాశి 
శని వక్రగతిలోకి ప్రవేశించడం కారణంగా కుంభరాశి వారికి మంచి మంచి ఫలితాలు కలుగుతాయి.. 138 రోజులపాటు వీరికి నిలిచిపోయిన పనులన్నీ తిరిగి పూర్తవుతాయి. వృత్తి జీవితంలో గొప్ప పురోగతి లభించే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ఉద్యోగాలు చేసే వ్యక్తులందరికీ జీతాలు విపరీతంగా పెరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత చెక్కబడతాయి. ఇబ్బందులతో పాటు అశాంతి తొలగిపోయి.. ఉత్తమమైన సమయం లభించబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు..

మీన రాశి 
మీన రాశి వారికి శని వక్రగతి ప్రభావంతో జూలై నెల నుంచి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం రెట్టింపవడమే కాకుండా పరీక్షల్లో విద్యార్థులు అద్భుతమైన ఉత్తీర్ణత సాధించబోతున్నారు. వృత్తిపరంగా పురోగతి లభించి.. భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. వ్యాపారాలు అనుకూలంగా మారి ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనేక వ్యాధులు ఈ సమయంలో నయమవుతాయి. ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మేష రాశి 
మేషరాశిలో జన్మించిన వ్యక్తులందరికీ శని వక్ర దశ ప్రారంభం కాబోతున్న సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కొత్త ఉద్యోగాలు లభించడమే కాకుండా.. ఉన్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా కలుగుతాయి. విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న వారి కోరికలు నెరవేరి ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సహ ఉద్యోగుల అండతో అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా కుటుంబంలో మంచి రోజులు వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అశాంతి మానసిక సమస్యలన్నీ తొలగిపోయి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి..

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులందరికీ వక్రగతి కారణంగా 138 రోజులపాటు వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో పని బాధ్యతలు పెరిగి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి.. కార్యాలయంలో ప్రతి ఒక్కరితో ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే బాస్ అండదండలు లభించి మంచి ప్రశంసలు కూడా పొందగలుగుతారు. వ్యాపారాలు కూడా అభివృద్ధి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులందరికీ ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా అత్యున్నతమైన సమయాన్ని గడపగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Madhubala Daughters: మధుబాల కూతుళ్లను చూశారా? అందంలో తల్లినే మించిపోయారు..వైరల్ వీడియో

Hyderabad, Telangana:

Madhubala Daughters Video: 90వ దశకంలో తన నటన, అద్భుతమైన సౌందర్యంతో దక్షిణాది చిత్రపరిశ్రమను ఏలిన స్టార్ హీరోయిన్ మధుబాల. మణిరత్నం దృశ్యకావ్యం 'రోజా' చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఆమె, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. శ్రీదేవి, ఐశ్వర్యారాయ్ ల తర్వాత అంతటి అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న మధుబాల అసలు పేరు 'మధు'. దర్శకేంద్రుడు కె.బాలచందర్ సలహాతో ఆమె తన పేరును మధుబాలగా మార్చుకుని, 1991లో ఆయన దర్శకత్వం వహించిన 'అళగన్' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు.

సినీ నేపథ్యం - వ్యక్తిగత జీవితం
మధుబాల సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఆమె ప్రముఖ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలినికి మేనకోడలు. మధుబాల తండ్రి టి.రఘునాథ్ చలనచిత్ర నిర్మాత కాగా, తల్లి రేణుక. తల్లి వద్దే భరతనాట్యం నేర్చుకున్న మధుబాల, కేవలం 13 ఏళ్ల వయసులోనే మాతృవియోగాన్ని పొందారు. ఆ తర్వాత తన మేనత్త హేమామాలినిని ఆదర్శంగా తీసుకుని సినీ రంగ ప్రవేశం చేశారు.

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఆమె, తెలుగులో 'అల్లరి ప్రియుడు', 'ఆవేశం', 'గణేష్', 'చిలక్కొట్టుడు' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత 1999 ఫిబ్రవరి 19న హేమామాలిని, జుహీ చావ్లాలకు బంధువైన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ షాను వివాహం చేసుకున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీ
పెళ్లి తర్వాత సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చిన మధుబాల, సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీ-ఎంట్రీ ఇచ్చారు. నిఖిల్ నటించిన 'సూర్య వర్సెస్ సూర్య' చిత్రంతో పాటు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా 'నాన్నకు ప్రేమతో'లో కీలక పాత్ర పోషించి మెప్పించారు. ఇటీవల 'శాకుంతలం', 'ప్రేమదేశం', 'ఈగల్' సినిమాతో పాటుగా మంచు విష్ణు ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప' వంటి సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా మారిపోయారు.

అమ్మను మించిన అందంతో కూతుళ్లు..
మధుబాల, ఆనంద్ షా దంపతులకు అమేయా, కేయా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మధుబాల తన కుమార్తెలతో కలిసి దిగిన లేటెస్ట్ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అచ్చం అమ్మ పోలికలతో, దేవకన్యల్లా మెరిసిపోతున్న వీరిద్దరి అందం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

"అందంలో అచ్చం అమ్మలాగే ఉన్నారు", "అప్సరసలను తలపిస్తున్నారు", "త్వరలోనే హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తారేమో" అంటూ నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Also Read: హిజాబ్ లేకుండా పాట పాడిందని లేడీ సింగర్‌కు 74 కొరడా దెబ్బలు! ఘోరమైన శిక్ష ఎందుకంటే?

Also Read; సోషల్ మీడియా నుంచి తప్పుకున్న 'డ్రాగన్' హీరోయిన్..బ్యూటీకి ఏం బాధ కలిగిందో?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Karimnagar: కరీంనగర్-హైదరాబాద్ హైవేపై పెను ప్రమాదం.. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం!

Karimnagar, Telangana:

Karimnagar-Hyderabad EV Bus Fire Latest News: రాజధాని హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రభుత్వ ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం సృష్టించింది.. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మంటల్లో పూర్తిగా కాలి బూడిదైపోయింది. తిమ్మాపూర్ మండలం పరిధిలోని ఎల్‌ఎండీ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ అప్రమత్తత వల్ల ఒక పెద్ద ప్రాణా నష్టం తప్పింది.. బస్సులో ప్రయాణిస్తున్న 37 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు..

అసలేం జరిగిందంటే..?
పోలీసులతో పాటు ఆర్టీసీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ 2 చెందిన అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సు 37 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు బయలుదేరింది.. బస్సు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ సమీపంలోకి చేరుకోగానే.. ఇంజన్ భాగం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం డ్రైవర్ గమనించారు.. ప్రమాదాన్ని ముందే ఊహించిన డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సు వెంటనే రోడ్డు పక్కనే నిలిపే వేశాడు..బస్సులో మంటలు చెలరేగుతున్నాయని గమనించి.. ప్రయాణికులను తక్షణమే కిందికి దిగిపోవలసిందిగా గట్టిగా కేకలు వేశారు.. డ్రైవర్ హెచ్చరికతో అప్రమత్తమైన ప్రయాణికులు ఒకరికొకరు తోసుకుంటూ.. ప్రాణ భయంతో లగేజీలను సైతం వదిలేసి బస్సులో నుంచి కిందికి పరుగులు తీశారు..

క్షణాల్లో వ్యాపించిన అగ్నికీలలు.. పూర్తిగా దగ్ధం..
ప్రయాణికులు అందరూ కిందుకు దిగిన కొద్ది క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని వేగంగా వ్యాప్తించాయి.. బ్యాటరీ లోపం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఉదృత రూపం దాల్చినట్లు సమాచారం.. దట్టమైన నల్లటి పొగతో పాటు అగ్నికీలలు ఎగసిపడడంతో ఆ ప్రాంతం మొత్తం భయానక వాతావరణము నెలకొంది..

స్థానికులతో పాటు ఆర్టీసీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.. అయితే ఫైర్ ఇంజన్ ఘటన స్థలానికి చేరుకునే లోపే మంటల తీవ్రతకు ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా ఖాళీ కేవలం ఇనుప అస్తిపంజరంగా మారింది.. రోడ్డుపై బస్సు అగ్నికి ఆహుతి కావడంతో ఆ మార్గంలో ప్రయాణించే ఇతర వాహనదారులు కూడా తీవ్రభయాందోళనకు గురయ్యారు.. ప్రమాదం కారణంగా కరీంనగర్ హైదరాబాద్ రాజీవ్ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది..

దర్యాప్తుకు ఆదేశించిన అధికారులు..
ఈ ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. కళ్ళ ఎదుట బస్సు తగలబడిపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. సమాచారం అందుకున్న ఆర్టీసీ ఉన్నతాధికారులతో పాటు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.. పర్యావరణహితం, అధునాతన రక్షణ వసతులు ఉన్నాయని భావించే ఎలక్ట్రిక్ బస్సులో ఈ తరహా ప్రమాదం జరగడంపై అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Economy Growth By Yoga: కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు.. దేశ ఆర్థిక వ్యవస్థకూ Yoga బూస్టింగ్.. ఏకంగా 115 బిలియన్ డాలర్ల బిజినెస్..!!

BBhoomi7h ago
Secunderabad, Telangana:

Economy Growth By Yoga: నేడు జూన్ 21వ తేదీ ఆదివారం.. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నిరూపితమైన ఈ యోగ.. ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో దోహదం చేస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన శరీరాన్ని, మనస్సును కాపాడుకునేందుకు ప్రపంచానికి ఒక సూత్రాన్ని అందించింది. ఈ శాస్త్రంపై అవగాహన పెరిగి, యోగా సంబంధిత వ్యాపారాల వ్రుద్ధికి దారితీసిందని చెప్పాలి. యాక్టివేర్లు, యాక్సెసరీలు, క్లబ్బులు, మ్యాట్స్, యోగా కేంద్రాలు ఇవన్నీ కూడా యోగా వ్యాపారం వ్రుద్ధికి దోహదపడ్డాయి. ఈ వ్యాపార విస్తరణకు ఆజ్యం పోశాయని చెప్పాలి. ఈ ప్రత్యేక రోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను పెంచింది. అంతేకాదు భారత ఆర్థిక వ్యవస్థకూ ఊపునిచ్చింది. 

యోగా బిజినెస్ వృద్ధిపై EMR విడుదల చేసిన నివేదిక ప్రకారం..  2024- 2032 మధ్య ప్రపంచ యోగా మార్కెట్ ఏటా 9 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని పేర్కొంది. 2023లో ప్రపంచ యోగా మార్కెట్ పరిమాణం సుమారు  115.43 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇది 2032 నాటికి  250.70 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది.  అంతేకాదు యోగా బిజినెస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇది వలయాకార ఆర్థిక వ్యవస్థను కూడా ప్రోత్సహిస్తోంది. ఎందుకంటే.. యోగా కోసం ఉపయోగించే మ్యాట్‌లు, కుషన్‌లు, బ్లాక్‌లు, దుస్తులు, ఇతర వస్తువులకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగింది. కానీ చాలా కంపెనీలు వాటిని రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేస్తున్నాయి. 

యోగాకు పెరుగుతున్న ప్రజాదరణ మహిళలకు గణనీయమైన సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యోగా నిపుణులలో 72శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. ఒక్క భారతదేశంలోనే.. యోగా తరగతుల పరిశ్రమ ఆదాయం సుమారుగా  2.6 బిలియన్ డాలర్లు కాగా.. మొత్తం యోగా పరిశ్రమ ఆదాయం 80 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. కోవిడ్-19 తర్వాత.. ఇది 154శాతం వరకు వృద్ధిని సాధించడం గొప్ప విషయంగా పేర్కొంది. 

మహిళలతో సహా యోగా నిపుణులందరికీ ఇదొక వ్రుత్తిగా మారింది. యోగా ఆఫ్‌లైన్ మార్కెట్‌తో పాటు ఆన్‌లైన్ మార్కెట్‌కు కూడా ప్రయోజనం చేకూరుస్తోంది. ప్రజలు యోగా స్టూడియోలు, యోగా క్లబ్‌లు,  జిమ్‌లలో యోగా కోర్సులు తీసుకుంటుండగా, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కూడా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆన్‌లైన్ యోగా తరగతులను అందిస్తున్నారు.

Also Read: దుబాయ్‌లో Taxi drivers salaries ఎంత ఉంటాయో తెలుసా?

వయసు రీత్యా, యోగా అనేది ఇకపై కేవలం వృద్ధులకు లేదా పెద్దలకు సంబంధించిన అంశం కాదు. పని ఒత్తిడి, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, జీవనశైలి సంబంధిత అనారోగ్యాలను  నడుము నొప్పి, ఆందోళన, మధుమేహం వంటివి ఎదుర్కోవడానికి యోగాను స్వీకరిస్తున్న 30 నుండి 49 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగ నిపుణులలో అత్యధిక వాటా ఉంది. మొత్తం మార్కెట్‌లో ఈ వయస్సు వర్గం వాటా సగానికంటే ఎక్కువ ఉంది. తర్వాతి స్థానంలో 18-29 ఏళ్ల వారు  ఉన్నారు. వీరు ఫిట్‌నెస్, క్రీడాకారుల వంటి రూపం, సోషల్ మీడియా ప్రభావం కారణంగా యోగా వైపు ఆకర్షితులవుతున్నారు. అదే సమయంలో, 50 ఏళ్లు పైబడిన వారు  ప్రధానంగా దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం,  చికిత్స కోసం యోగాను ఆశ్రయిస్తున్నారు.

భారత మార్కెట్ 2033 నాటి గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం  12.7శాతం అద్భుతమైన సమ్మేళన వార్షిక వృద్ధి రేటుతో వృద్ధి చెందుతుందని పేర్కొంది. దీనితో 2033 నాటికి భారత యోగా మార్కెట్ విలువ సుమారు రూ. 1.48 లక్షల కోట్లు పెరుగుతుందని అంచనా వేసింది. గ్రాండ్ వ్యూ రీసెర్చ్ ప్రకారం, ప్రపంచ యోగా మార్కెట్ 2026- 2033 మధ్య 9.9శాతం సమ్మేళన వార్షిక వృద్ధి రేటుతో వృద్ధి చెంది..  2033 నాటికి భారీగా US$269.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఈ అభివృద్ధి చెందుతున్న యోగా వ్యాపారం, ప్రపంచం సంపూర్ణ ఆరోగ్యం వైపు మళ్లుతోందని స్పష్టం చేస్తోంది. బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన అవకాశాన్ని సూచిస్తుంది.

Also Read: రూ. 6 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి.. Tesla కారు ఇంటికి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

Gold Rate Today: జూన్ 21వ తేదీ ఆదివారం.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు తగ్గాయా? పెరిగాయా?

BBhoomi9h ago
Secunderabad, Telangana:

Gold Rate Today:  బంగారం కొనాలనుకునేవారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే బంగారం ధరలు ఆల్ టైం గరిష్టస్థాయి నుంచి దాదాపు 40వేల వరకు పడిపోయాయి. ఈ ఏడాది జనవరిలో 1.90లక్షలకు చేరుకున్న బంగారం ధర అక్కడి నుంచి భారీగా  పతనం అవుతూ వస్తోంది. వెండి ధర కూడా ఆల్ టైం గరిష్టం నుంచి దాదాపు 2లక్షల వరకు తగ్గింది. అయితే గత రెండు మూడు రోజులుగా భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. అంతర్జాతీయ భౌగోళిక కారణాల వల్ల పసిడి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని చెప్పాలి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడంతోపాటు డాలర్ బలపడటం వంటి కారణాల వల్ల బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయని చెప్పాలి. 

అయితే నేడు జూన్ 21 వ తేదీ ఆదివారం బంగారం వెండి ధరలు చూసినట్లయితే హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1, 46, 080గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1, 33, 900 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ 1,46,230 ఉండగా.. 22 క్యారెట్లు 1,34,050గా ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయని గమనించవచ్చు. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ. 2,55,000 ఉంది. ఢిల్లీలో  2,50,900గా ఉంది. 

గత వారం శుక్రవారం ముగింపు సమయానికి ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో జూలై 3 గడువుతో ఉన్న వెండి ధర కిలోకు రూ. 2,46,186గా నమోదైంది. ప్రస్తుత ధరతో పోలిస్తే, కేవలం 5 రోజుల్లోనే కిలో వెండి ధర రూ. 13,460 మేర చౌకైంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లోనే కాకుండా.. దేశీయ మార్కెట్‌లో కూడా వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి.  ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ ధరలను పరిశీలిస్తే, జూన్ 12, శుక్రవారం సాయంత్రం 1 కిలో వెండి ధర రూ. 2,42,582 వద్ద ముగిసింది.జూన్ 19న ట్రేడింగ్ ముగిసే సమయానికి.. దీని ధర కిలోకు రూ. 2,31,973కి పడిపోయింది.  అంటే కిలోకు రూ. 10,609 మేర తగ్గింది. 
 
వెండి ధర వలే బంగారం  ధర కూడా గత 5 రోజుల్లో భారీగా పడిపోయింది.ఎంసీఎక్స్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,50,528 నుండి రూ. 1,47,239కి పడిపోయింది. దీంతో 10 గ్రాములకు రూ. 3,289 మేర తగ్గింది. ఒక్క గత శుక్రవారం రోజే, గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 2,070 లేదా 1.39శాతం మేర పడిపోయాయి. 

Also READ: మన కళ్ళు ఎన్ని మెగాపిక్సెల్స్? వాటి రిజల్యూషన్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే

Also Read:  Cafe Niloufer సిబ్బంది జీతాలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!! 

Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

8th Pay Commission Attendance Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. PM MODI సర్కార్ కీలక నిర్ణయం.. లేటుగా వస్తే సగం రోజు జీతం కట్

BBhoomi10h ago
Secunderabad, Telangana:

8th Pay Commission Attendance Rules: కేంద్రంలో మోదీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 8వ పే కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇది పనితీరు ప్రారంభించి దాదాపు 6 నెలల గడిచింది. మరో 11 నెలల్లో 8వ పే కమిషన్ సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందనున్నాయి. మొత్తం 18 నెలల పాటు జరగనున్న ఈ అధ్యయనంలో 1 కోటి మందికిపైగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సర్వీసులను సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నారు. 8వ వేతన సంఘం ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాల నుంచి ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి తమ విజ్నప్తులను పంపించాల్సిన చివరి తేదీని నిర్ణయించగా ఆ చివరి తేదీ కూడా దాటింది. 

ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను 8వ పే కమిషన్ ముందుంచాయి. వాటిలో ముఖ్యమైంది అటెండెన్స్, లీవ్ నిబంధనలు. వీటిపై కొన్ని కీలకమైన డిమాండ్లను వేతన సంఘం ముందుకు పెట్టారు. ఉద్యోగ సంఘాలు చేసిన ప్రతిపాదనలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగులకు నెలకు 2 సార్లు ఒక 1గంటల వరకు ఆఫీసుకు ఆలస్యంగా వచ్చే అనుమతి ఉంది. ఈ పరిమితి దాటి ఎన్నిసార్లు ఆలస్యంగా ఆఫీసుకు వస్తే ప్రతిసారి వారి అకౌంట్ నుంచి సగం రోజు క్యాజువల్ రూపంలో కట్ అవుతుంది. దీనిపై మార్పులు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం నగరాల్లో ట్రాఫిక్ భారీగా పెరిగిపోయినందున బయో మెట్రిక్ విధానం అన్ని నగరాల్లో అమల్లో  ఉన్న నేపథ్యంలో ఈ కఠినమైన హాజరు నిబంధనలను సడలించాలని నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ఉద్యోగ సంఘం డిమాండ్ చేసింది. 

దానికి బదులుగా ఎన్నిసార్లు ఆలస్యంగా వచ్చినా నెలకు మొత్తం 120 నిమిషాల పాటు అంటే 2 గంటల పాటు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలంటూ ప్రతిపాదన ముందుంచారు. అంటే ఒక నెలలో ఆలస్యమైన సమయం అంతా కలిపినట్లయితే 120 నిమిషాలు దాటిన తర్వాత మాత్రమే సగం రోజు శాలరీ కట్ చేయాలని అంతకంటే లోపు ఉంటే ఎలాంటి కోతలు విధించకూడదని ప్రతిపాదన చేశారు. విధి నిర్వహణలో గాయపడిన ఉద్యోగులకు వర్క్ మెన్స్ కాంపెన్సేషన్ ఆక్ట్ కింద ఇచ్చే పరిహారంలో ఎలాంటి కోతలు విధించకుండా పూర్తి జీతంతో కూడిన సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read: ఈ ఒక్క డిమాండ్‌ను నెరవేరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top