చర్లపల్లి జోరువానలో కూలీ పనికి వచ్చిన ఓ బాలికను చూసి సంజయ్ కారు ఆపాడు
Karimnagar, Telangana:కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గం చర్లపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. కూలీల గుంపులో ఓ మైనర్ బాలికను చూసి.. 'అమ్మా.. పనికి వెళ్తున్నావా? నీకు చదువుకోవాలని అనిపించలేదా నీ కుటుంబ పరిస్థితి గురించి అడిగాడు. తన పేరు బొల్లా అక్షయ్ అని, తాను 10వ తరగతి పాసయ్యానని, అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో కూలీ పనులకు వెళ్తున్నానని బదులిచ్చారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Bandi Bhageerath: ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ.. ఇక బండి భగీరథ్ అరెస్ట్ తప్పదా?
Hyderabad, Telangana:Bandi Bhageerath POCSO Case: బాలికపై అత్యాచారానికి పాల్పడి పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్కు ఊరట లభించలేదు. మధ్యంతర ముందస్తు బెయిల్కు తెలంగాణ హైకోర్టు నిరాకరణ చేసింది. బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసులో బండి భగీరథ్కు తాత్కాలిక ఉపశమనం లభించకపోవడంతో ఇక అతడి అరెస్ట్ తప్పదని స్పష్టమవుతోంది. పోక్సో కేసు నమోదై దాదాపు వారం దాటుతున్నా ఇంకా అరెస్ట్ చేయకపోవడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు కూడా నిరాకరించడంతో ఇప్పటికైనా నిందితుడు బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
Also Read: Bandi Bhageerath: 'మా కూతురిపై కుట్ర చేస్తున్నారు'.. పోక్సో బాధితురాలి తల్లి ఆవేదన
నిందితుడు బండి సాయి భగీరథ్ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలనే అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో శుక్రవారం రాత్రి బండి భగీరథ్ బెయిల్ పిటిషన్పై వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో పలు వాదనలు వినిపించారు. కేసులో నమోదైన ఫిర్యాదు, బాధితురాలి ప్రవర్తన, కాల్ రికార్డులు, చాటింగ్ వివరాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ వచ్చిన ఆరోపణలపై అనుమానాలు వ్యక్తం చేశారు.
Also Read: Bandi Bhageerath: కొడుకును అప్పగించకుండా బండి సంజయ్ ఎవరిని బెదిరిస్తున్నాడు?
'బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో తన కుమార్తెను డిసెంబర్ 31న రెండు రోజుల పాటు ఫామ్హౌస్లో ఉంచారని పేర్కొన్నరు. బలవంతంగా ఆల్కహాల్ తాగించారని కూడా ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయి. అయితే అదే ఫిర్యాదులో బాధితురాలు, నిందితుడితో పాటు మరో ఐదుగురు కూడా ఫామ్హౌస్లో ఉన్నట్లు పేర్కొన్నారు' అని న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఫొటోలు, వీడియోల అంశాన్ని కూడా ప్రస్తావించారు. స్నేహితులు తీసుకున్న ఫొటోలను పరిశీలిస్తే బాధితురాలు స్వచ్ఛందంగానే ఆల్కహాల్ తీసుకున్నట్లు కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. బాధితురాలిని కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని.. కానీ జరుగుతున్న దుష్ప్రచారంపై స్పష్టత ఇవ్వడం కోసమే ఈ విషయాలను వెల్లడిస్తున్నట్లు కోర్టులో వివరించారు. అవసరమైతే తమ వద్ద ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు.
Also Read: Bandi Sanjay Mother: పోక్సో కేసులో కీలక మలుపు.. బండి సంజయ్ తల్లికి తీవ్ర అస్వస్థత
కేసు నమోదు ఆలస్యంపైనా పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నలు లేవనెత్తారు. ఘటన జరిగిన నాలుగున్నర నెలల తరువాత ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. బాధితురాలు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ.. విషయం తెలిసిన వెంటనే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బండి భగీరథ్ వాదించారు. ఫిర్యాదులో 2025 అక్టోబర్ 25న శారీరక వేధింపులు జరిగాయని పేర్కొన్నారని.. కానీ ఆ తరువాత రోజే బాధితురాలు స్వయంగా నిందితుడిని సినిమాకు రావాలని ఆహ్వానిస్తూ టికెట్లు పంపిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
పూర్తి వాదనలు విన్న హైకోర్టు వారి వాదనలతో ఏకీభవించలేదు. కేసు తీవ్రత, ఆరోపణల స్వభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు బండి భగీరథ్కు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. కాగా ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగనుంది.
Bandi Sanjay Mother: పోక్సో కేసులో కీలక మలుపు.. బండి సంజయ్ తల్లికి తీవ్ర అస్వస్థత
Hyderabad, Telangana:Bandi Sanjay Mother Heart Attack: మైనర్పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బండి భగీరథ్ కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి గుండెపోటుకు గురయ్యారు. పోక్సో కేసుపై విచారణ కొనసాగుతున్న సమయంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురయి ఆస్పత్రి పాలయ్యారని తెలుస్తోంది. నిందితుడు బండి భగీరథ్ నాన్నమ్మ అస్వస్థతకు గురవడంతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురయ్యింది. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే బండి సంజయ్ ఆస్పత్రికి చేరుకున్నారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటుకు గురయ్యారు. దీంతో బండి సంజయ్ కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్కు తరలించారు. గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో శంకుతల చికిత్స పొందుతున్నారు. ఆమెకు గుండెకు స్టంట్ వేసి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి ఆరా తీశారు.
LSG vs CSK Highlights: లక్నో సంచలన విజయం.. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి
Lucknow, Uttar Pradesh:IPL 2026 Playoffs Race: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న వారిని ఎలిమినేట్ అయిన జట్లు భారీ నష్టాన్ని చేస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ను ముంబై దెబ్బతీయగా.. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ను లక్నో సూపర్ జియాంట్స్ తీవ్ర నష్టం కలిగింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నైను దెబ్బతీస్తూ లక్నో సంచలన విజయం సాధించి మూడో మ్యాచ్ను ఖాతాలో వేసుకుంది. రసవత్తరంగా సాగిన ఈ పోరులో చెన్నైపై లక్నో పైచేయి సాధించడం విశేషం. పోతూ పోతూ రేసులో ఉన్న వారిని తీసుకెళ్తున్న జట్టులో లక్నో కూడా చేరింది. ఈ మ్యాచ్కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
SRH Vs RCB Tickets: హైదరాబాద్ Vs బెంగళూరు మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో ఖాళీ..ధరలు భారీగా పెంచినా ఎగబడ్డ ఫ్యాన్స్!
Hyderabad, Telangana:SRH Vs RCB Match Tickets: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మే 22న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్లను తాజాగా విడుదల చేసింది సన్రైజర్స్ ఫ్రాంఛైజీ. అయితే ఈ SRH vs RCB మ్యాచ్ టికెట్ల వ్యవహారం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ల పోరును చూడాలని ఆశపడ్డ అభిమానులకు ఇప్పుడు పెద్ద షాకే తగిలింది.
మే 22న జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం నేడు అనగా గురువారం సాయంత్రం 5 గంటలకు టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. బుకింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే సుమారు 6 లక్షల మంది ఆన్లైన్ క్యూలో చేరడం విశేషం. భారీ ట్రాఫిక్ కారణంగా సర్వర్లు మొరాయించడంతో గంటల తరబడి వేచి చూసినా చాలా మందికి టికెట్లు దక్కలేదు. కొద్దిసేపటికే 'సోల్డ్ ఔట్' బోర్డు కనిపించడంతో ఫ్యాన్స్ అవాక్కయ్యారు.
ధరల పెంపుపై ఆగ్రహం
ఈ మ్యాచ్కు ఉన్న క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ టికెట్ల ధరలను భారీగా పెంచేసింది. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మ్యాచ్ల్లో రూ.750 గా ఉన్న కనీస టికెట్ ధరను ఈసారి రూ.1,950కి పెంచారు. సామాన్య అభిమానులకు భారంగా మారేలా ఇతర గ్యాలరీల ధరలను కూడా భారీగా పెంచడంపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
బ్లాక్ మార్కెట్ ఆరోపణలు
టికెట్ల కేటాయింపులో పారదర్శకత లేదని, అంతర్గతంగా భారీగా అక్రమాలు జరుగుతున్నాయని క్రీడా ప్రేమికులు మండిపడుతున్నారు. అధికారిక వెబ్సైట్లో నిమిషాల్లోనే మాయమైన టికెట్లు, బయట బ్లాక్ మార్కెట్లో విపరీతమైన ధరలకు లభిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే టికెట్లను హోల్డ్లో పెట్టి, కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారని అభిమానులు విమర్శిస్తున్నారు.
Also Read: బెంగళూరు Vs కోల్కతా..ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్త్ కోసం హోరాహోరీ పోరు..
Also Read: పంజాబ్ కింగ్స్ పతనం ఆగిపోతుందా? ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ నుంచి వైదొలగుతుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. పీఆర్సీ, ఈహెచ్ఎస్పై కీలక ముందడుగు
Baddipadaga, Telangana:Telangana Govt Employees: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను పరిష్కరించకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కరువు భత్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతన సవరణ సంఘం, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలపై కీలక ముందడుగు పడింది. హైదరాబాద్లోని సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులతో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ముఖ్య హామీలు తెలుసుకుందాం.
Also Read: Gold Operation: 1991లో భారతదేశం ఏం చేసింది..? ఒకేసారి 47 వేల కిలోల బంగారం తాకట్టు ఎందుకు?
ఉద్యోగ ఆరోగ్య పథకం
ఉద్యోగ ఆరోగ్య పథకం (ఎంప్లాయీస్ హెల్త్ స్కీం-ఈహెచ్ఎస్) జూన్ 2వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం చొప్పున వసూలు చేసి.. ప్రభుత్వం కూడా సమానమైన మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈహెచ్ఎస్ అమలు చేయనున్నట్లు తెలిపారు.
పీఆర్సీ
వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికపై త్వరలో తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. పీఆర్సీ నివేదిక తుది దశకు చేరుకుందని.. త్వరలో నివేదిక తెప్పించి దానిపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Erragadda TIMS: హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ ప్రపంచ స్థాయి వైద్యం అందించారు: కేటీఆర్
పెండింగ్ బిల్లులు చెల్లింపు
ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పెండింగ్ బిల్లులను 100 రోజులలోపు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉపాధ్యాయులకు పాత పెన్షన్
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్పై చర్చలు జరిగాయి. పాత పెన్షన్ అమలుపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
జిల్లాస్థాయిలో సమావేశాలు
రాష్ట్ర స్థాయిలో నిర్వహించినట్టుగానే జిల్లా స్థాయిలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం
విద్యా బుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ కార్యదర్శికి సూచించినట్లు సీఎస్ వెల్లడించారు.
ఏకీకృత సర్వీస్ రూల్స్
ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని విద్యాశాఖ కార్యదర్శికి సూచన
Also Read: Bandi Bhageerath: 'మా కూతురిపై కుట్ర చేస్తున్నారు'.. పోక్సో బాధితురాలి తల్లి ఆవేదన
స్పౌస్ కేటగిరీలో కేంద్ర ఉద్యోగులకు ఛాన్స్
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా స్పౌస్ కేటగిరీలో పరిగణించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
5 రోజుల పని విధానంపై పరిశీలన
వారంలో ఐదు రోజుల పని విధానాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇవ్వడం విశేషం.
తెలంగాణ అభివృద్ధికి పునరంకితం
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరింత నిబద్ధతతో పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.
ఐటీ వినియోగంపై అవగాహన పెంపు
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు టెక్నాలజీపై మరింత అవగాహన పెంచుకుని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సన్రైజర్స్ ఆటగాడు నితీశ్ కుమార్
Dharmavaram, Andhra Pradesh:Sunrisers Hyderabad Player Nitish Kumar Reddy Visits Tirumala Temple A Head IPL 2026 Watch VideoTirumala Donation: తిరుమల శ్రీవారికి ఇన్నోవా కారు విరాళం
Dharmavaram, Andhra Pradesh:Devotee Donates Innova Car Worth Of Rs 40 Lakhs To Tirumala Temple Watch VideoBandi Bhageerath: పోక్సో కేసులో పోలీసు విచారణకు బండి భగీరథ్ డుమ్మా..ఏం జరిగిందంటే?
Hyderabad, Telangana:Bandi Bhageerath Bail: పోక్సో కేసులో కోర్టుకు వెళ్లిన బండి భగీరథ్..బెయిల్ అభ్యర్ధనపై నేడు విచారణ!
Hyderabad, Telangana:Gold Operation: 1991లో భారతదేశం ఏం చేసింది..? ఒకేసారి 47 వేల కిలోల బంగారం తాకట్టు ఎందుకు?
Wadgaon, Maharashtra:47000 KGs Gold Airlifted: భారతదేశంలో బంగారంపై ఇప్పుడు అంతా చర్చ జరుగుతోంది. దిగుమతి సుంకాలు భారీగా పెంచేయడంతో బంగారం, వెండితోపాటు ప్లాటినం ధరలు రికార్డు స్థాయిలో పెరిగింది. ఇది అలా ఉంటే మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన 'బంగారం కొనరాదు' అనే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వరుస పరిణామాలు చోటుచేసుకోవడం వెనుక పెద్ద తతంగమే జరిగినట్టు కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలకు కట్టడి చేయడం.. బంగారంపై మోజు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 1991లో జరిగిన ఒక పెద్ద ఆపరేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారీ ఆపరేషన్ గురించి తెలుసుకుందాం.
Also Read: Erragadda TIMS: హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ ప్రపంచ స్థాయి వైద్యం అందించారు: కేటీఆర్
1980- 1990 మధ్య భారతదేశం విదేశీ చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. దీంతో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ సంక్షోభం నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భారీ ఆపరేషన్ చేపట్టింది. 1991లో 405 మిలియన్ల అత్యవసర రుణాన్ని సమీకరించడానికి నాడు కేంద్ర బ్యాంకు చర్యలు తీసుకుంది. ఆ సమయంలో దాదాపు 47,000 కిలోల బంగారాన్ని ఇంగ్లాండ్కు విమానంలో తరలించింది. రహస్యంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ బంగారాన్ని పంపించడంతోనే భారతదేశ ఆర్థిక సంస్కరణలకు మార్గం సుగమం పడింది.
Also Read: AP Govt Teachers: ప్రభుత్వ టీచర్లకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏం ప్రకటించారంటే?
బొంబాయిలోని శాంతా క్రూజ్ విమానాశ్రయంలో (ప్రస్తుతం ముంబై విమానాశ్రయం) ఒక కార్గో విమానంలోకి ట్రంకులను ఎక్కిస్తున్న చిత్రం దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 4 జూలై 1991న మొదటి సరుకు బయలుదేరింది. ఆ తర్వాత మరో రెండు సరుకు రవాణాలు జరిగాయి. దాదాపు 47 టన్నుల (47,000 కిలోల) బంగారాన్ని ఇంగ్లాండ్కు ఆర్బీఐ తాకట్టు పెట్టింది. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి భారీగా విదేశీ రుణం పొందింది.
Also Read: Bandi Bhageerath: 'మా కూతురిపై కుట్ర చేస్తున్నారు'.. పోక్సో బాధితురాలి తల్లి ఆవేదన
తెలంగాణ ముద్దుబిడ్డ, నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు, ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలో భాగంగా నాటి ఆర్బీఐ గవర్నర్ ఎస్. వెంకిటరమణన్ నేతృత్వంలో ఆ భారీ ఆపరేషన్ జరిగింది. ఒక విదేశీ బ్యాంకుకు బంగారాన్ని తాకట్టు పెట్టి దాదాపు 405 మిలియన్ డాలర్లను భారతదేశం రుణం తీసుకుని నాటి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కింది. ఈ ఆపరేషన్తో భారతదేశంలో బంగారం భద్రతకు, గర్వానికి, భావోద్వేగానికి ప్రతీకగా మారింది. ఈ విధంగా బంగారం భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుకుంది.
భారతదేశం 1991 నవంబర్ నాటికి బంగారం హామీగా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించింది. భారతదేశ ఆర్థిక స్థితి మారింది. ప్రధానమంత్రి పీవీ నరసింహ రావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ చేపట్టిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను సరళీకరించడంతో విదేశీ మారక నిల్వలు పెరిగాయి. మార్చి 2026 నాటికి ఆర్బీఐ వద్ద మొత్తం 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని, అందులో 77 శాతం (సుమారు 680 టన్నులు) ప్రస్తుతం దేశీయంగా నిల్వ ఉందని ఆర్బీఐ మార్చిలో ప్రకటించింది. ఇది మార్చి 2023 నాటి 38 శాతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల.
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు, దిగుమతిదారులలో ఒకటిగా ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారతదేశం బంగారం దిగుమతులను నివారించడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కూడా 1991 నాటి పరిస్థితి భారతదేశం ఎదుర్కొంటోందని తెలుస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడబోతుందని.. ఈ క్రమంలోనే బంగారం కొనరాదని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం దేశాన్ని కాపాడేది కూడా బంగారం అని చర్చ జరుగుతోంది.
Cobra Video: దాహంతో అలమటిస్తున్న కింగ్ కోబ్రా.. జగ్గుతో నీళ్లు తాగించిన యువకుడు..వీడియో..
Hyderabad, Telangana:Baby King Cobra Video Here: ప్రకృతిలో జీవరాశులన్నీ దాహానికి అతీతం కావని నిరూపించే ఒక అద్భుతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా కింగ్ కోబ్రా పేరు వినగానే ప్రాణాలు చేతులు పెట్టుకొని గజ గజలాడుతూ ఉంటారు. అలాంటిది ఒక అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా పిల్లకు ఒక వ్యక్తి ఏకంగా జగ్గుతో నీళ్లను తాగించడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఎండల తీవ్రత పెరగడంతో అటవీ ప్రాంతాల్లో నీటి వనరులు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో దాహంతో అలమటిస్తున్న ఒక కింగ్ కోబ్రా పిల్ల జనాభాసాల్లోకి వచ్చింది. దాని అవస్థను గమనించిన ఒక స్నేక్ క్యాచర్.. అది ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడకుండా మానవత్వంతో స్పందించాడు.. ఒక ప్లాస్టిక్ నీటి జగ్గును తీసుకొని ఆ పాము దగ్గరకు వెళ్ళాడు. అంతేకాకుండా ఆ పాముకు నీటిని పట్టించడం కూడా మీరు చూడొచ్చు..
వైరల్ అవుతున్న వీడియోలు ఒక వ్యక్తి ఒక చేత్తో పాము తోకను పట్టుకొని.. మరొక చేతితో నీటి జగ్గును పాము నోటి దగ్గరగా ఉంచి నీటిని విడవడం మీరు గమనించవచ్చు. సాధారణంగా మనుషులను చూడగానే బుసలు కొట్టే పాము.. ఈ వీడియోలో మాత్రం ఎంతో ప్రశాంతంగా నీటిని తాగడం విశేషం. ఆ వ్యక్తి జగ్గును వంచుతుంటే.. ఆ కింగ్ కోబ్రా పిల్ల ఎంతో సులభంగా దాహం తీర్చుకుంటూ నీటిని ఆస్వాదించడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఫిదా అవుతున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో పై సోషల్ మీడియాలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. మూగ జీవి దాహాన్ని గుర్తించి ప్రాణాలకు తెగించి నీళ్లను తాగించిన ఆ వ్యక్తి నిజమైన హీరో అంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం ఇది చాలా ప్రమాదకరమైన పని అని.. శిక్షణ లేని వారు ఇలాంటి సాహసాలు చేస్తే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరిస్తున్నారు.. విష సర్పాలు దాహంతో ఉన్నప్పుడు వాటికి సహాయం చేయాలనుకుంటే నేరుగా కాకుండా దూరంగా నీటిని ఉంచడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్..
Ebola Surge: కాంగోలో ఎబోలా కల్లోలం.. 65 మంది బలి, సరిహద్దులు దాటుతున్న మహమ్మారి! అసలు లక్షణాలివే..
Hyderabad, Telangana:Symptoms of Ebola Virus: కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ వ్యాప్తి వల్ల దాదాపు 65 మంది చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఇంకా 246 మందికి సోకినట్లు అంచనా వేస్తున్నారు. కాంగోలో ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పొరుగు దేశాల మధ్య నిఘా సహకారాన్ని కూడా బలోపేతం చేయనున్నారు. దీంతోపాటు ఇన్ఫెక్షన్ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడం, లాబొరేటరీ సేవలను మెరుగుపరచడం, వ్యాధి నిర్ధారణను కూడా వేగవంతం చేస్తున్నారు. మరణించిన వారికి సురక్షితమైన రీతిలో అంత్యక్రియలు చేస్తున్నారు. ఈ వ్యాధిని నిరోధించడానికి కావలసిన నిధులు, వైద్య పరికరాలను కూడా సమకూరుస్తున్నారు.
కాంగో ఇన్స్టిట్యూట్ నేషనల్ డి రీచార్చే బయో మెడికల్ ప్రకారం 20 మందిలో రక్త నమూనాలను సేకరించగా, 13 మందికి ఎబోలా వైరస్ సోకినట్లు ప్రకటించింది. ఎబోలా వైరస్ తీవ్రత మోంగ్వాలు, ర్వాంపారా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. బునియా ప్రాంతంలో కూడా ఎబోలా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఎబోలా వైరస్ కారణాలు..
ఎబోలా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం.. ఇది పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందడమే. ఇక్కడ ఎక్కువ జనాభా ఉంటారు. అందుకే ఇది త్వరగా వ్యాప్తి చెందుతుంది. మైనింగ్ వంటి పనుల కోసం ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో మోంగ్వాలు ప్రజలకు ఎక్కువగా వ్యాప్తి చెందింది.
వైరస్ రకం..
ఎబోలా వైరస్ బారిన పడిన వారి రక్త నమూనాల్లో సాధారణంగా కనిపించే రకానికి చెందిన 'జైర్ ' వైరస్ కాదని తేలింది. ఈ కొత్త రకం వైరస్ లక్షణాలు కచ్చితంగా తెలుసుకోవడానికి ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోందని చెబుతున్నారు.
Also Read: కడుపులో గడబిడ.. గ్యాస్.. ఉబ్బరానికి కారణమయ్యే 4 రోజువారీ ఆహారాలు, మీరు అస్సలు ఊహించరు!
Also Read: కనిపించని మృత్యువు హంటావైరస్.. సాధారణ జ్వరంలా వచ్చి కిడ్నీలను ఎలా పనిచేయకుండా చేస్తుందో తెలుసా?
వ్యాధి ఎలా సోకుతుంది అంటే:
ఎబోలా వైరస్ అనేది చాలా ప్రమాదకరమైనది.. అంతేకాదు ప్రాణాంతకం కూడా. ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి రక్తం, లాలాజలం ద్వారా సోకుతుంది. వారు ఉపయోగించిన దుస్తులు ముట్టుకున్నా, మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తాకడం ద్వారా కూడా ఇది సోకుతుంది. వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించడం వల్ల సురక్షితంగా ఉండవచ్చు.
ఎబోలా వైరస్ లక్షణాలు:
ఎబోలా వైరస్ బారిన పడిన వారికి జ్వరం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, తలనొప్పులు, వికారం, వాంతులు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో కాలేయ పనితీరు కూడా మందగిస్తుంది. వ్యాధి లక్షణాలు కనిపించగానే సాధారణ జ్వరం మాదిరి కాకుండా త్వరగా నిర్ధారించుకోవాలి. పరిస్థితి దాటిపోతే ప్రాణాంతకంగా మారుతుంది. జంతువులకు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన వైద్య సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Cobra On Scooter Video: యాక్టివాపై నాగుపాము హల్చల్.. ప్రాణాలకు తెగించి పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వీడియో..
Hyderabad, Telangana:Cobra On Scooter Video Watch Here: నేటి కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని వింత వింత ఆశ్చర్యం కలిగించే ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టక మానదు.. నడిరోడ్డుపై ఆగి ఉన్న ఒక యాక్టివా స్కూటీపై భారీ నాగుపాము పడగవిప్పి హల్చల్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ఆ స్కూటీ పైకి పాము ఎలా వచ్చిందనేది అసలు ఎవ్వరికీ తెలీదు. కానీ స్కూటీపై పడక విప్పి నిలబడి నానా హంగామా సృష్టించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..
సాధారణంగా పాములు పొదల్లోనూ.. పచ్చిక మైదానంలోనో.. అడవుల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఘటనలు ఒక వ్యక్తి తన యాక్టివ్ స్కూటీని రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగివచ్చి చూసేసరికి కూటి వెనక భాగంలో ఒక భారీ నాగుపాము బయటికి వచ్చి పడక విప్పి నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. ఈ పాము పరిమాణం.. దాని ఆవేశం చూసి అక్కడున్న వారంతా భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది..
స్కూటీపై పడగ విప్పి నాగుపాము..
రోడ్డుపై వెళ్లే వాహనదారులు స్కూటీపై పడగ విప్పి ఉన్న పామును చూసి ఆశ్చర్యపోయారు. క్షణాల్లో ఈ వార్త స్థానికంగా వ్యాపించడంతో స్థానికులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పాము ఎక్కడ వారిపై దాడి చేస్తుందోనని అందరూ భయాందోళనకు గురై.. ఆ స్కూటీకి దూరంగా నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. అయితే, స్థానికులు వెంటనే స్థానికంగా ఉన్న స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు.. రంగంలోకి దిగిన వారు అత్యంత చాకచక్యంగా ఆపరేషన్ను ప్రారంభించారు..
బుసలు కొడుతూ పాము హల్చల్..
ఆ పాము అత్యంత ప్రమాదకరమైన రీతిలో బుసలు కొడుతూ ఉండడం మీరు చూడొచ్చు. అయితే స్నేక్ క్యాచర్స్ ఎలాగోలా ఆ పామును పట్టుకొని ఒక సంచిలో బంధించి సురక్షితమైన పరిసరాల్లో వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ పామును పట్టుకోవడానికి స్నేక్ క్యాచర్స్ కొన్ని గంటలపాటు శ్రమించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను స్నేక్ క్యాచర్స్ బృందంలోని ఒకరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ తో పాటు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ వస్తోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
వైరల్ వీడియో..
వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో పాములు బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. వాహనాలు పార్కు చేసేటప్పుడు తిరిగి స్టార్ట్ చేసే సమయంలో వాటిని తప్పకుండా ఒకటికి రెండుసార్లు పరిశీలించడం చాలా మంచిదని వారంటున్నారు. లేకపోతే అత్యంత ప్రమాదకరమైన వన్యప్రాణులు వాహనాల్లో దూరి మనుషులపై దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్లోని సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలామంది ఈ వీడియో చూసి వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్..
Re NEET 2026: నీట్ ఎగ్జామ్ కొత్త తేదీ ప్రకటించిన NTA..పరీక్షకు 15 నిమిషాలు పెంపు!
Hyderabad, Telangana:Re NEET 2026 Date: ఇటీవలే జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ NEET) పేపర్ లీక్ నేపథ్యంలో దాన్ని తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రీ-నీట్ ను 2026 జూన్ 21న నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అయితే ఈసారి పరీక్ష రాసే అభ్యర్థులకు కొంతమేర ఊరట కలిగించారు. పరీక్ష రాసే విద్యార్థులకు 15 నిమిషాలు అదనంగా సమయం ఇస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.Used Cars In Delhi: కేవలం రూ.99 వేలకే మారుతి, టాటా కార్లు.. ఎక్కడో తెలుసుకోండి!
Hyderabad, Telangana:Best Second Hand Car Market Deals 2026: మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కువ సెకండ్ హ్యాండ్ కార్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా అత్యంత తక్కువ ధరల్లో లభించే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు కలిగిన కార్లు అత్యధికంగా కొనుగోలు చేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా చాలామంది ఢిల్లీలోని సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీనిని దృష్టిలో పెట్టుకొని అక్కడ నిర్వాహకులు కొన్ని కార్లపై ఎప్పటికప్పుడు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తూ వస్తున్నారు.
ఢిల్లీలో సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్..
ముఖ్యంగా ఢిల్లీలోని డిడిఎ మార్కెట్, సెక్టార్-16, రోహిణి, బై ఎన్.ఎస్, ఏ-బ్లాక్లో అందుబాటులో ఉన్న కొన్ని సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్ మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని అత్యంత తక్కువ ధరలలోనే మంచి మంచి కార్లను విక్రయిస్తూ వస్తున్నాయి. ఇక్కడ కొన్ని బ్రాండ్లకు సంబంధించిన కార్లు సగం ధరలకే లభించడం విశేషం..అంతేకాకుండా ఇక్కడి సెకండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన షోరూమ్స్ లో సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కేవలం రూ.99 వేల నుంచి కార్లు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ మారుతి వ్యాగన్ఆర్ నుంచి లగ్జరీ అన్ని రకాల ఎస్యూవీల వరకు అన్నీ అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా పండగల సందర్భంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉండడం విశేషం..
సెవెన్ సీటర్స్..
ఇక్కడ సెవెన్ సీటర్ గో ప్లస్ మోడల్ 2017 CNG కారు కేవలం 1,79,000 నుంచే ప్రారంభమవుతుంది. అంతేకాకుండా 2018 మోడల్కి సంబంధించిన రెనాల్ట్ ట్రైబర్ వంటి సెవెన్ సీటర్లు కేవలం రూ. 2.29 లక్షలకే విక్రయిస్తున్నారు. అలాగే ఇవే కాకుండా ఇక్కడ కొన్ని సెవెన్ సీటర్ కార్లు కేవలం మూడు లక్షల లోపే అందుబాటులో ఉన్నాయి..అదేవిధంగా హ్యాచ్బ్యాక్ కార్ల వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని.. మధ్యతరగతి వారి ఫేవరెట్ వ్యాగన్ఆర్ 2017 మోడల్ కార్లు కేవలం ఇక్కడ రెండు లక్షల 50 వేల లోపే విక్రయిస్తున్నారు. అంతేకాకుండా 2019 మోడల్ కు సంబంధించిన స్విఫ్ట్ డిజైర్ కార్ కేవలం నాలుగు లక్షల లోపే విక్రయిస్తూ రావడం విశేషం..
Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
రూ.99 వేలకే కారు..
అదేవిధంగా మారుతి ఆల్టో 2021 మోడల్ కార్లు ఇక్కడ కేవలం నాలుగు లక్షల 29 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా 2018 మోడల్ టాటా టియాగో కేవలం రెండు లక్షల లోపే అందుబాటులో ఉండడం విశేషం. అలాగే కారు నచ్చి బడ్జెట్ లేని వారి కోసం ఇక్కడ నిర్వాహకులు పెట్రోల్ కారును కేవలం రూ.99 వేలు కట్టిన వారికి విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కార్లు అయితే ఇక్కడ చాలా చీప్ ధరలకే లభిస్తున్నాయి.
Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
