icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow28 Jul 2024, 02:18 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

IMD Weather Alert: ఏపీ, తెలంగాణకు భారీ తుఫాను ముప్పు..బంగాళాఖాతంలో తీవ్ర అలజడి!

Nunna, Vijayawada, Andhra Pradesh:IMD Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కీలక వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 7 రోజుల పాటు విస్తారంగా వర్షాలు, పిడుగులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన తాజా వివరాలు ఇలా ఉన్నాయి.
0
0
Report

కదులుతున్న రైలు డోర్‌ను పట్టుకుని ప్రాణాలకు తెగించి డ్యాన్స్.. షాకింగ్ వీడియో వైరల్!

Hyderabad, Telangana:

Viral Train Stunt Video: సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్, ఫాలోవర్ల కోసం నెటిజన్లు ఎంతటి సాహసానికైనా వెనుకాడటం లేదు.. రోజురోజుకూ రీల్స్ క్రేజ్ పరాకాష్ఠకు చేరుతోంది.. సోషల్ మీడియాలో ఒక్కరాత్రిలోనే వైరల్ అయిపోవాలనే.. తపనతో కొందరు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియో చూస్తే.. ఎవరైన ఆశ్చర్యపోవాల్సిందే. కదులుతున్న రైలు తలుపుల నుంచి వేలాడుతూ ఒక మహిళ చేసిన విన్యాసాలు ప్రస్తుతం నెటిజన్లను ఊహించని స్థాయిలో ఆశ్చర్యానికి గురిచేస్తోంది..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో అందుబాటులో ఉన్న 12 సెకన్లు కలిగిన ఈ వీడియోలో.. ఓ మహిళ వేగంగా వెళ్తున్న రైలు తలుపుల నుంచి నిలబడి ప్రమాదకర రీతిలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. రైలు డోర్‌కు ఇరువైపులా ఉన్న హ్యాండిల్స్‌ను పట్టుకుని.. చుట్టూ ఉన్న ప్రమాదాన్ని పూర్తిగా మర్చిపోయి.. కెమెరా ముందు రకరకాల డ్యాన్స్ స్టెప్పులేసింది. రైలు అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ.. చిన్నపాటి పట్టు తప్పినా లేదా రైలుపై నుంచి కాలు జారినా నేరుగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిసి.. కూడా ఆమె ఏమాత్రం భయపడకుండా రీల్ చిత్రీకరించడం స్పష్టంగా కనిపిస్తోంది..

               pic.twitter.com/SCpgWcRfse

నెటిజన్ల తీవ్ర ఆగ్రహం..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే ఆలస్యం.. వేల సంఖ్యలో వ్యూస్, కామెంట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే, చాలామంది యూజర్లు సదరు మహిళ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొన్ని లైక్స్, కామెంట్స్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు మంచిదని? అని ప్రశ్నిస్తున్నారు. వేగంగా వెళ్తున్న రైలులో గాలి తీవ్రత లేదా హ్యాండిల్ జారితే క్షణాల్లో దారుణమైన ప్రమాదం జరుగుతుందని.. ఇటువంటి ప్రమాదకరమైన పనులను ఎంతమాత్రం ప్రోత్సహించకూడదని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేసే వారిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణాల సమయంలో ప్రయాణికుల భద్రత అత్యంత కీలకమని.. ఇటువంటి ఘటనలు ఇతరులకు, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశాన్ని ఇస్తాయని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రైలు పట్టాలపై, కదులుతున్న బోగీలపై రీల్స్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ తరహా స్టంట్లపై కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

 

 

0
0
Report

School Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్..భారీ వర్షాలు, బోనాల సందడి..వరుసగా 4 రోజులు సెలవులు?

Hyderabad, Telangana:

Telangana School Holidays: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో పుంజుకోవడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండగా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

భారీ వర్షాలు-విద్యాసంస్థలకు సెలవులు
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గురువారం (జూలై 30) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. జగిత్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్ష తీవ్రతను బట్టి స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.

వారమంతా సెలవుల జోరు 
జూలై 30 నుండి ఆగస్టు 1 వరకు వర్షాలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు తదితర జిల్లాలకు రెడ్, ఆరెంజ్, యెల్లో అలర్ట్‌లు జారీ చేశారు. పరిస్థితులను బట్టి శుక్ర, శనివారాల్లో కూడా స్థానిక కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశాలున్నాయి.

బోనాల వేడుకలు-ప్రత్యేక సెలవులు
ఈ వర్షాల జోరు మధ్యే ఆషాడమాస బోనాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.

ఆగస్టు 2 (ఆదివారం): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. నగర నలుమూలల నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి బోనాలతో మొక్కులు చెల్లించుకుంటారు.

ఆగస్టు 3 (సోమవారం): బోనాల మరుసటి రోజు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 'భవిష్యవాణి' (రంగం), సాయంత్రం పలహారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ప్రాంతంలోని విద్యాసంస్థలకు సోమవారం కూడా సెలవు ఉండే అవకాశం ఉంది.

ఇవాళ (గురువారం) భారీ వర్షాల కారణంగా ఇచ్చిన సెలవులను భర్తీ చేసేందుకు, రాబోయే ఆగస్టు 8వ తేదీ (రెండో శనివారం) విద్యాసంస్థలు పని చేయాలని అధికారులు తెలిపారు. అంటే ఇవాళ సెలవున్న స్కూళ్లకు ఆగస్టు 8న సెలవు ఉండదు. దీంతో ఆ విద్యాసంస్థలకు రావాల్సిన లాంగ్ వీకెండ్ బ్రేక్ పడే అవకాశం ఉంది.

మరో లాంగ్ వీకెండ్ (ఆగస్టు 8, 9, 10)
సికింద్రాబాద్ బోనాల తర్వాత, ఆగస్టు 9న (ఆదివారం) లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారితో పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రధాన బోనాల ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆషాడమాసపు చివరి ఆదివారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోనాల మరుసటి రోజు ఆగస్టు 10 (సోమవారం) తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ఉండనుంది. ఫలితంగా ఆగస్టు 8, 9, 10 తేదీలలో (శని, ఆది, సోమవారాలు) విద్యార్థులకు మరో లాంగ్ వీకెండ్ రానుంది.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జూలై 31, ఆగస్టు 1న ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

E20 Petrol Mileage: E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా? రాజ్యసభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు!

New Delhi, Delhi:

E20 Petrol Mileage Nitin Gadkari: భారతదేశంలో పర్యావరణ పరిరక్షణతో పాటు విదేశీ ఇంధన దిగుమతుల భారాన్ని గణనీయంగా తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను వేగంగా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే 20 శాతం ఎథనాల్ కలిపిన 'E20 పెట్రోల్' వాడకంపై వాహనదారుల్లో అనేక సందేహాలు, అపోహలు నెలకొన్నాయి. ముఖ్యంగా పాత వాహనాల ఇంజన్లు దెబ్బతింటాయనే వార్తలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో స్పష్టమైన ప్రకటన చేశారు. 2016 కంటే ముందు తయారైన పాత BS-III వాహనాల్లో కొన్ని విడిభాగాలకు మాత్రమే స్వల్ప మార్పులు అవసరమవుతాయని ఆయన వెల్లడించారు.

అధికారిక సర్వే నివేదికలో వెల్లడైన నిజాలు
E20 ఇంధనం వల్ల వాహనాల పనితీరు, మైలేజ్, ఇంజన్ మన్నికపై పడే ప్రభావం గురించి ప్రముఖ సంస్థలైన ఇండియన్ ఆయిల్ (IOCL), ఐఐపీ దేహ్రాదూన్, సియామ్ (SIAM), ఏఆర్ఏఐ (ARAI) సంయుక్తంగా క్షేత్రస్థాయిలో విస్తృత అధ్యయనం నిర్వహించాయి. ద్విచక్ర, చతుశ్చక్ర వాహనాలపై జరిపిన ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల స్టార్టింగ్, డ్రైవింగ్ అనుభూతిలో ఎలాంటి తేడా ఉండదని తేలింది. ఇంజన్‌లోని అంతర్గత భాగాలు, ప్లాస్టిక్ విడిభాగాలకు ఎలాంటి ముప్పు లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది.

ఏ వాహనాలకు మార్పులు అవసరం?
2016కి ముందు నాటి వాహనాలు కోసం అనగా.. 2005 ఏప్రిల్ 1 నుండి 2016 మధ్య కాలంలో తయారైన పాత BS-III మోడల్ వాహనాలపై ఈ పెట్రోల్ ప్రభావం కొంతవరకు ఉండే అవకాశం ఉంది. ఈ రకం వాహనాల్లో ఉపయోగించిన కొన్ని రబ్బరు విడిభాగాలు, గాస్కెట్లు E20 పెట్రోల్ ప్రభావానికి గురై త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది.

అయితే దీనికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణంగా వాహన సర్వీసింగ్ చేయించే సమయంలోనే ఈ చిన్నపాటి రబ్బరు పార్ట్స్‌ను ఎంతో సులభంగా మార్చుకోవచ్చని మంత్రి గడ్కరీ వివరించారు.

మైలేజ్ తగ్గడానికి అసలు కారణాలు ఇవే!
E20 పెట్రోల్ వాడకం వల్ల తమ వాహనాల మైలేజ్ పడిపోతోందని, ఇంజన్ల నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని కొందరు వాహనదారులు భావిస్తుంటారు. అయితే, కేవలం ఇంధనం ఒక్కటే మైలేజ్‌ను ప్రభావితం చేయదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వాహన మైలేజ్ తగ్గడానికి క్రింది అంశాలు ప్రధాన కారణమవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. వాహనం నడిపే విధానం (రైడింగ్/డ్రైవింగ్ స్టైల్), సరైన సమయంలో ఇంజన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్లు మార్చకపోవడంతో పాటు టైర్లలో తగినంత గాలి ఒత్తిడి లేకపోవడం సహా విపరీతంగా ఏసీని ఉపయోగించడం వల్ల మైలేజీ కలిసి రాదని అంటున్నారు.

కాబట్టి, వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకుంటూ ఉంటే E20 పెట్రోల్‌తో పాత వాహనాలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని, మైలేజ్ సమస్య తలెత్తదని స్పష్టమవుతోంది.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

Also Read: డీమార్ట్‌లో షాపింగ్ ఏ రోజు చేస్తే బెటర్..ఈ టైమ్‌లో షాపింగ్ చేస్తే డబ్బు, సమయం ఆదా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

IMD Weather Alert: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

Hyderabad, Telangana:

IMD Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కీలక వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే 7 రోజుల పాటు విస్తారంగా వర్షాలు, పిడుగులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన తాజా వివరాలు ఇలా ఉన్నాయి. 

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితి
జూలై 29, 30 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో పాటు ఈదురు గాలులు వీయనున్నాయి. జూలై 30 రాత్రి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 31న స్వల్పంగా వర్షాలు పడగా, ఆగస్టు 1 నుండి 4 వరకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగుతాయి.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తొలి రెండు రోజులు మోస్తరు వర్షాలు, పిడుగులు, ఈదురు గాలుల ఉధృతి ఉంటుంది. జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు ఒకటిరెండు చోట్ల మాత్రమే వర్షాలు పడినప్పటికీ బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

అలాగే రాయలసీమలో జూలై 29 నుండి ఆగస్టు 2 వరకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. వరుసగా ఐదు రోజుల పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాల్లో రెండ్రోజుల పాటు వానలు దంచికొట్టనున్నాయి. జూలై 29 రాత్రి  నుంచి జూలై 30 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.

జూలై 30 నుంచి జూలై 31 ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మరోసారి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు.

ఆగస్టు 1 నుండి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత కొంత తగ్గినప్పటికీ, చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

ఐఎండీ వర్షపాత ప్రమాద హెచ్చరికల వర్గీకరణ
తేలికపాటి: 2.5 - 15.5 మి.మీ.
మోస్తరు: 15.6 - 64.4 మి.మీ.
భారీ: 64.5 - 115.5 మి.మీ.
చాలా భారీ: 115.6 - 204.4 మి.మీ.
అత్యంత భారీ: 204.5 మి.మీ.కు పైగా (రెడ్, ఆరెంజ్, యెల్లో, గ్రీన్ అలర్ట్‌ల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు).

ప్రజలకు అధికారుల సూచనలు
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంది. రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు విద్యుత్, తాగునీటి సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఏర్పడవచ్చు. ప్రజలు బలహీనమైన గోడలు, పాత చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలవొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ALso Read: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..'జాబ్ క్యాలెండర్-2026'పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జూలై 31, ఆగస్టు 1న ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

రాజన్న సిరిసిల్లలో భారీ వర్షాలు.. తృటిలో తప్పిన ప్రమాదం!

Hyderabad, Telangana:

Sircilla Rains: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ముసురు వర్షాల కారణంగా జిల్లా ప్రజల సాధారణ జీవనం స్తంభించిపోవడమే కాకుండా.. పలు ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే గురువారం సిరిసిల్ల పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే.. పెద్ద బజార్ ప్రాంతంలో ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నేల తడిసి ముద్దయి.. రహదారి పక్కన ఉన్న ఒక భారీ వేప చెట్టు వేర్లు బలహీనపడడంతో ఒక్కసారిగా నేలకొరిగింది. కారు వెళ్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ ఉన్న వ్యాపారులు, బాటసారులు తీవ్ర భయాందోళనకు గురయిన్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో కారు పైభాగం స్వల్పంగా దెబ్బతినగా.. వాహనం లోపల ఉన్న వ్యక్తికి అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం తప్పింది. వేప చెట్టు నేరుగా పడకుండా కొమ్మల వైపు కూలడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పినట్లయింది.

మెరుపు వేగంతో స్పందించిన స్థానికులు..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక నివాసితులతో పాటు దారినపోయే వాహనదారులు అత్యంత సమయస్ఫూర్తితో స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కారు తలుపులు తెరిచి.. లోపల చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. తక్షణమే ప్రాథమిక చికిత్స అందించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు చూపిన చొరవను పలువురు అభినందించారు.

రంగంలోకి దిగిన యంత్రాంగం..
సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, మున్సిపల్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ, కటింగ్ మిషన్ల సహాయంతో రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టు కొమ్మలను వేగంగా తొలగించారు. చెట్టు కూలిపోవడంతో పెద్ద బజార్ ప్రాంతంలో నిలిచిపోయిన ట్రాఫిక్‌ను అధికారులు క్లియర్‌ చేసి.. వాహనాల రాకపోకలను యథావిధిగా పునరుద్ధరించారు.

వర్షాలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పట్టణ ప్రజలు, వాహనదారులు ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు.. పాతబడిన భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు, పురాతన భవనాల సమీపంలో వాహనాలు నిలిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. 

Also Read: Revanth Reddy: కేటీఆర్‌ బర్త్‌డేపై రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్‌డే దావత్‌ అడగాలి'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Google Pixel 11 Pro డిజైన్ ఇదే.. కొత్త పిక్సెల్ గ్లో ఫీచర్‌తో అదిరిపోయే లుక్!

Hyderabad, Telangana:

Google Pixel 11 Pro Latest News: ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్  పిక్సెల్ 11 (Pixel 11 Series) ల్యాంచ్‌కు సిద్ధం చేసింది.. అధికారిక విడుదలకు ముందే కస్టమర్స్‌లో ఆసక్తిని పెంచేందుకు గూగుల్ పిక్సెల్ 11 ప్రొ (Google Pixel 11 Pro) కి సంబంధించిన టీజర్ వీడియోను కంపెనీ విడుదల చేసింది. ఆగస్టు 12న అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగే Made by Google 2026 కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది..

ప్రీమియం డిజైన్..
లాంచ్‌ అయిన టీజర్‌లో పిక్సెల్ 11 ప్రొ డిజైన్ స్పష్టంగా కనిసిస్తోంది.. ఈ ఫోన్ వెనుక భాగంలో క్లాసిక్ హారిజాంటల్ కెమెరా మైక్రో-మోడ్యూల్ సెటప్‌ను అందిస్తోంది.. అయితే, ఈసారి ఇందులో కంపెనీ పిక్సెల్ గ్లో (Pixel Glow) అనే కొత్త డిజైన్ ఎలిమెంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కెమెరా చుట్టూ పిన్‌విల్ (Pinwheel) గుండ్రంగా తిరిగే అద్భుతమై లైటింగ్‌ యానిమేషన్ వినియోగదారులను విశేషంగా ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది.. ఫోన్‌లో వివిధ నోటిఫికేషన్లతో పాటు కాల్స్ లేదా AI ఫీచర్స్‌ వినియోగించినప్పుడు ఇది విజువల్ ఇండకేటర్‌గా పనిచేస్తుందని సమాచారం..

గూగుల్ ఈకోసిస్టమ్..
గూగుల్ గతేడాది ప్రారంభించిన ఆస్క్ మోర్ ఆఫ్ యువర్ ఫోన్ (Ask More Of Your Phone) క్యాంపెయిన్ ఆధారంగా ఈ టీజర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. నాస్ (Nas) అద్భుతమైన పాట ఐ క్యాన్ (I Can) ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో దీనిని రూపొందించిన్నట్లు సమాచారం.. ప్రతి రోజు ప్రపంచంలోని ప్రజలు గూగుల్ సేవలు ఎంత మొత్తంలో వినియోగిస్తున్నారని తెలుపుతూ.. Gemini AI, Gmail, Google Maps, Search, Photos, Calendar, Docs వంటి ప్రముఖ అప్లికేషన్లను పిక్సెల్ 11 ప్రొ ఎంత వేగంగా.. ఎలా పని చేస్తుందో చూపించే ప్రయత్నం చేశారు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఆగస్టు 12న విడుదల..
ఆగస్టు 12న జరిగే ఈ కార్యక్రమంలో గూగుల్ కేవలం పిక్సెల్ 11 ప్రొ మాత్రమే కాకుండా.. పిక్సెల్ 11 (Pixel 11)తో పాటు పిక్సెల్ 11 ప్రొ ఎక్స్‌ఎల్ (Pixel 11 Pro XL) మోడళ్లను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. వీటితో పాటు అద్భుతమైన జెమిని AI ఫీచర్లు, గూగుల్ ఎకోసిస్టమ్‌కు సంబంధించిన మరిన్ని హార్డ్‌వేర్ పరికరాలను మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.

ఈ టెక్‌ నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. టెన్సర్ G6 ప్రాసెసర్, అద్భుతమైన కెమెరా సెన్సార్లు, అద్భుతమైన డిస్‌ప్లే క్వాలిటీతో రాబోతున్న ఈ పిక్సెల్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయమని చెబుతున్నారు. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

Add Zee News as a Preferred Source

0
0
Report
Advertisement

Ajinkya Rahane Captaincy: రహానే కెప్టెన్సీలో భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు..కానీ, చివరికి జట్టు నుంచి పక్కన పెట్టారు!

Hyderabad, Telangana:

Ajinkya Rahane Captaincy Record: భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా.. ప్రామిసింగ్ బ్యాటర్‌గా నిలిచిన అజింక్య రహానే తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ రోజు నుంచి తాను క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు రహానే ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. అయితే ఆయన భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన టెస్టు, వన్డే మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా భారత్ ఓడిపోకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఆయన టెస్టు కెప్టెన్సీ రికార్డులను పరిశీలిద్దాం.

అడిలైడ్‌లో భారత్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయం చవిచూసిన తరుణంలో.. ప్రధాన ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతున్న జట్టును విజయవంతంగా నడిపించి, ఆస్ట్రేలియా గడ్డపై అజరామరమైన చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందించిన అజింక్య రహానె కెప్టెన్సీ ఎప్పటికీ చిరస్మరణీయమే. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో రహానె కెప్టెన్సీ ప్రస్థానం స్వల్పకాలమే అయినప్పటికీ, అది అత్యంత అద్భుతమైన, విజయవంతమైన అధ్యాయంగా నిలిచింది.

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ విజయం
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నటీ సెలవులపై స్వదేశానికి తిరిగి వెళ్లినప్పుడు, 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రహానె కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యంత కీలకమైన మలుపు.

36 పరుగులకే కుప్పకూలి తీవ్ర నైపుణ్య, మానసిక ఒత్తిడిలో ఉన్న జట్టుకు మెల్‌బోర్న్ (MCG) వేదికగా జరిగిన రెండో టెస్టులో రహానె తన అద్భుతమైన ప్రశాంతతతో ఒక అసాధారణ శతకం బాది జట్టును విజయపథంలో నిలిపారు. ఆ తర్వాత, కీలక ఆటగాళ్లు గాయాలపాలై బలహీనంగా మారిన జట్టును ఆస్ట్రేలియాలోని కంచుకోట అయిన గబ్బాలో అపూర్వ విజయానికి నడిపించి, 2-1 తేడాతో చారిత్రాత్మక సిరీస్‌ను కైవసం చేసుకునేలా చేశారు.

అజేయ రికార్డు, ప్రత్యేకత
ఐదు లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించి, ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఓడిపోని అతికొద్దిమంది భారత కెప్టెన్‌లలో రహానె ఒకరు. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత సవాలుతో కూడిన విదేశీ పర్యటనలలో, ఆయన ప్రదర్శించిన ప్రశాంతమైన కూడిన నాయకత్వ శైలి.. దేశంలోని అత్యుత్తమ తాత్కాలిక కెప్టెన్‌లలో ఒకరిగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేసింది.

రహానే కెప్టెన్సీ రికార్డు..
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజింక్య రహానే కెప్టెన్సీలో భారత జట్టు 6 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 4 విజయాలను నమోదు చేయగా.. రెండు మ్యాచ్‌లు డ్రాగా నిలిచాయి. అయితే రహానే కెప్టెన్‌గా వ్యవహరించిన మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓటమి పాలవ్వలేదు. దీంతో అజింక్య రహానే విజయాల శాతం 66.67గా నమోదైంది. దీంతో పాటు ఆస్ట్రేలియా వేదికగా 2020-21లో జరిగిన బోర్డర్ -గావస్కర్ ట్రోఫీని భారత జట్టు గెలుపొందింది. అలాగే 3 వన్డేల్లో మూడు విజయాలు.. టీ20ల్లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి మరొకటి ఓడింది. 

Also REad: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే రిటైర్మెంట్..ఎమోషనల్ వీడియో వైరల్!

Also Read: వన్డేల్లో రారాజుగా శుభ్‌మన్ గిల్..టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్ సూర్యవంశీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Ajinkya Rahane Retires: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే రిటైర్మెంట్..ఎమోషనల్ వీడియో వైరల్!

Hyderabad, Telangana:

Ajinkya Rahane Retirement: భారత క్రికెట్‌లో అత్యంత నమ్మకమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా నిలిచిన అజింక్య రహానే.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్నీ ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. జూలై 30 నుంచి తన రిటైర్మెంట్ అమలులో ఉంటుందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు.  

అజింక్య రహానే గత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు కెప్టెన్‌గా వ్యవహరించారు. అయితే ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడడం లేదు. ఈ క్రమంలో తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు రహానే స్పష్టంగా పేర్కొన్నారు.

38 ఏళ్ల రహానే, "క్యాప్ నంబర్ 278, ఇక సెలవు. ఇన్నేళ్లుగా మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు" అని రాశారు. "నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను." ఈ సందేశంతో అతను తన అభిమానులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్‌లకు, భారత క్రికెట్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ తన కృతజ్ఞతను తెలియజేశాడు.

క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలోనూ టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన కొద్దిమంది భారత ఆటగాళ్లలో అజింక్య రహానే ఒకరు. అతని కెప్టెన్సీ రికార్డు కూడా ఆకట్టుకునేలా ఉంది. టెస్ట్ క్రికెట్‌లో, అతను భారత్‌కు ఆరు మ్యాచ్‌లలో నాయకత్వం వహించగా, వాటిలో నాలుగు గెలిచి, రెండు డ్రా చేసుకున్నాడు. ముఖ్యంగా అతని కెప్టెన్సీలో భారత్ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వన్డే క్రికెట్‌లో రహానే మూడు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా, ఆ మూడూ విజయాలతో ముగిశాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో, అతను జట్టుకు రెండు మ్యాచ్‌లలో నాయకత్వం వహించగా, ఒకటి గెలిచి, ఒకటి ఓడిపోయాడు.

అజింక్య రహానే భారత్ తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతను మూడు ఫార్మాట్లలో కలిపి 35.95 సగటుతో 8414 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రహానే కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో రాయల్స్, రైజింగ్ పూణే సూపర్‌జైంట్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున ఆడాడు. రహానే 212 ఐపీఎల్ మ్యాచ్‌లలో 30.15 సగటుతో 5367 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం
అజింక్య రహానే కెరీర్‌లో అత్యంత ఆశాజనకమైన అధ్యాయం 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో కనిపించింది. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైన తర్వాత విరాట్ కోహ్లీ లేని సమయంలో, అతను జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మెల్‌బోర్న్ టెస్టులో అద్భుతమైన సెంచరీతో అతను భారత్‌ను తిరిగి సిరీస్‌లోకి తీసుకువచ్చాడు.

దీని తర్వాత, యువ జట్టు బ్రిస్బేన్‌లోని గబ్బాలో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో అత్యంత చిరస్మరణీయమైన విజయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. రహానే కెప్టెన్సీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

టెస్ట్ కెరీర్
> 85 మ్యాచ్‌లు, 5077 పరుగులు, 38.46 సగటు
> 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు, 49.50 స్ట్రైక్ రేట్
> 578 ఫోర్లు, 35 సిక్సర్లు

వన్డే కెరీర్
> 90 మ్యాచ్‌లు, 2962 పరుగులు, 35.26 సగటు
> 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు, 78.63 స్ట్రైక్ రేట్
> 293 ఫోర్లు, 33 సిక్సర్లు

టీ20 కెరీర్
> 20 మ్యాచ్‌లు, 375 పరుగులు, 20.83 సగటు
> 1 హాఫ్ సెంచరీ, 113.29 స్ట్రైక్ రేట్
> 32 ఫోర్లు, 6 సిక్సర్లు.

Also REad: వన్డేల్లో రారాజుగా శుభ్‌మన్ గిల్..టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్ సూర్యవంశీ!

Also Read: హార్దిక్ పాండ్యాను వదులుకోనున్న ముంబై ఇండియన్స్..కొత్త ఆటగాళ్ల లిస్టు ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

ఇన్‌ఫ్లుయెన్సర్‌గా బాగా చేస్తున్నారు.. ప్రధాని కుర్చీ ఖాళీ చేయండి.. మోదీపై అభిజీత్ దీప్కే సెటైర్లు..!!

BBhoomi5h ago
Secunderabad, Telangana:

Abhijit Dipke: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీట్ పేపర్ లీక్ కాంట్రవర్సీపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న వేళ.. విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేయడాన్ని ఎద్దేవా చేస్తూ.. ప్రధాని పదవి నుంచి తప్పుకుని సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా మారితే బాగుంటుందని సెటైర్లు వేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మహారాష్ట్రలోని తన స్వస్థలానికి చేరుకున్న దీప్కే మీడియాతో మాట్లాడారు. 

ప్రధాని మోదీ ఇప్పుడు ఇన్ ఫ్లుయెన్సర్ గా మారాలని భావిస్తున్నాను. ఆయన ఆ పనిని చాలా బాగా చేస్తున్నారు. ప్రధాని కుర్చీని ఖాళీ చేస్తే.. దేశాన్ని నడిపే బాధ్యతను మరో నాయకుడు చూసుకుంటారని ఆయన అన్నారు. ఆందోళన విరమించిన తర్వాత కూడా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను పలు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వేధిస్తున్నాయని అభిజీత్ దీప్కే ఆరోపించారు. సీజేపీ నిరసన విరమించిన తర్వాత ప్రభుత్వాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఆ వేధింపులు ఆపనట్లయితే.. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కేవలం కేంద్ర మంత్రి రాజీనామాతో యువతలో ఆగ్రహం చల్లారలేదని..వారి కోపమంతా ప్రభుత్వం పైనే ఉందని స్పష్టం చేశారు. 

విద్యార్థులపై వేధింపులు అలాగే కొనసాగినట్లయితే.. ఆందోళనను మళ్లీ ప్రారంభిస్తామని దీప్కే హెచ్చరించారు. నిరసన ముగిసిందని భావించకూడదు.. ఈ విద్యార్థులు టెర్రరిస్టులు కాదు.. ఈ దేశ భవిష్యత్తును ఇలా ఇబ్బంది పెడితే..రేపు మేమే ప్రభుత్వాన్ని మారుస్తామంటూ వ్యాఖ్యానించారు. అవసరం అయితే తదుపరి ఆందోళన చాలా పెద్దెత్తున ఉంటుందన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పెల్లెట్ గన్ ఉపయోగించడంపై బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీప్కే డిమాండ్ చేశారు. పెల్లెట్ గన్ కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన అమిత్ షా అయినా.. మరెవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. 

పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని మోదీ హామీ ఇచ్చినా.. తొలి విచారణే సీబిఐ న్యాయవాది హాజరవ్వకపోవడంతో వాయిదా పడిందని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఆయన్ను పార్లమెంటులో సన్నానించడంపై బీజేపీని ప్రశ్నించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ప్రధాన్ ను సన్మానించడానికి బీజేపీకి సిగ్గు అనిపించలేదా అని నిలదీశారు. కాక్రోచ్ పార్టీ నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన విమర్శలపై స్పందించారు. ఆమెను పార్ట్ టైమ్ రాజకీయ నాయకురాలిగా అభివర్ణించారు దీప్కే. సీరియస్ నాయకుల కామెంట్స్ కే తాను స్పందిస్తాను అన్నారు. 

Also Read: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 2 శుభవార్తలు..నెరవేరబోతున్న చిరకాల కోరిక..!!

Also Read: హెల్త్ కార్డులు, పీఆర్సీ కోసం రోడ్డెక్కిన పెన్షనర్లు..!!

Also Read: బ్రిక్స్ వేదికపై మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Advertisement
Back to top