icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow28 Jul 2024, 02:18 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

KTR: దేశ తలరాతను నిర్ణయించేది జెన్ జీ ఓటర్లే.. అప్రమత్తం కావాలి: కేటీఆర్‌

Hyderabad, Telangana:

KTR Speech: దేశ తలరాతను నిర్ణయించేది జెన్‌జీ ఓటర్లేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదం.. నిజాలు చెప్పేవారిని జైల్లో పెడుతున్నారని గుర్తుచేశారు. హేట్ స్పీచ్ బిల్లు తెచ్చే ముందు పాలకులే విద్వేష ప్రసంగాలు మానాలని రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు. మీడియా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కొత్త తరాన్ని అర్థం చేసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.

ఓ దినపత్రిక వార్షికోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన 'రాజ్యాంగం-ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ' అనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఉన్న సభా వేదికపై కేటీఆర్‌ ఆసక్తికర ప్రసంగం చేశారు. కొందరు సభపైన ఉన్న వారికే చురకలు అంటించారు. కచ్చితంగా కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా తర్వాత జరిగే ఈ పత్రిక వార్షికోత్సవానికి వస్తారని ప్రకటించడం ఆసక్తికరంగా నిలిచింది.

'వచ్చే 2029 ఎన్నికల నాటికి దేశంలో 50 శాతానికి పైగా ఓటర్లు జెన్ జీ యువతే ఉంటారు. దేశ తలరాతను నిర్ణయించేది వారే. దీంతో మీడియా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కొత్త తరాన్ని అర్థం చేసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దేశంలో పత్రికా స్వేచ్ఛ క్రమంగా హరిస్తున్నారని.. నిజాలు చెప్పేవారిని జైళ్లకు పంపుతున్నారని, ప్రభుత్వాలు మీడియాను నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.

'ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఉనికి కోసం పోరాడుతుండగా, సోషల్ మీడియా ప్రభావం వేగంగా పెరుగుతోంది. ఓ సంస్థ అధ్యయనం ప్రకారం 18 నుంచి 24 ఏళ్ల యువతలో 56 శాతం మంది వార్తాపత్రికలు చదవడం లేదు. సోషల్ మీడియా ద్వారానే వార్తలు తెలుసుకుంటున్నారు. నేటి తరం వార్తలను తమకు అవసరమైనప్పుడు మాత్రమే వినియోగిస్తోంది. మీడియా కూడా కాలానికి అనుగుణంగా మారకపోతే వెనుకబడిపోతుంది' అని మీడియా రంగానికి మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు.

'ఢిల్లీలో ఇటీవల యువత చేపట్టిన ఆందోళనలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సాగాయి. కొత్త తరానికి దేశం, సమాజం పట్ల అపారమైన కమిట్‌మెంట్ ఉందని ఆ ఉద్యమం నిరూపించింది. ప్రధాన మీడియా పట్టించుకోకపోయినా యువత దేశవ్యాప్తంగా చర్చను మార్చగలిగింది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తుచేశారు. దేశంలో మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు పెరుగుతున్నాయని, మీడియా మేనేజ్‌మెంట్, హెడ్‌లైన్ మేనేజ్‌మెంట్, నెరేటివ్ మేనేజ్‌మెంట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

'వార్తను వార్తగా రాసే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రమంత్రి కుమారుడిపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు, లగచర్ల ఘటన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశాలను ప్రధాన మీడియా నిర్లక్ష్యం చేసింది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నవారే ముందుగా విద్వేష ప్రసంగాలు మానేసిన తర్వాతే హేట్ స్పీచ్ బిల్లు తీసుకురావాలని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌తో పాటు ప్రధాన మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలపై కూడా ఫ్యాక్ట్ చెక్ జరగాలని మీడియాకు కేటీఆర్‌ సూచనలు చేశారు.

ప్రగతి భవన్‌లో 152 బెడ్‌రూమ్‌లు ఉన్నాయనే ప్రచారం, కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో జరిగిన ప్రచారాలను ఉదాహరణగా మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రస్తావన చేశారు. మీడియా అధికారాన్ని చూసి భయపడడం ప్రారంభిస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని పేర్కొన్నారు. మంచి జరిగితే మంచిగా, తప్పు జరిగితే తప్పుగా నిర్భయంగా రాయాలని సూచించారు.

0
0
Report

Telangana: తెలంగాణ రైజింగ్-2047లో భాగస్వామ్యం కావాలి: ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు పిలుపు

Hyderabad, Telangana:

Hyderabad: తెలంగాణ రైజింగ్- 2047 లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని కార్పొరేట్ సంస్థలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. 'ఆర్థిక వృద్ధితోపాటు సామాజిక పురోగతి సమాంతరంగా సాగేలా.. ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించేలా.. అభివృద్ధి ప్రతి నియోజకవర్గానికి, దాని ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించాం' అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ), హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కొండాపూర్‌లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్‌లో రెండ్రోజుల పాటు జరుగుతున్న ‘50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్’ను శనివారం మంత్రి శ్రీధర్‌ బాబు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కీలక ప్రసంగం చేశారు. 'కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలి. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్ఠిగా కృషి చేస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది' అని ప్రకటించారు. 

'తెలంగాణ రైజింగ్-2047' అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని.. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాకారమయ్యే అభివృద్ధి విజన్ అని శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక పురోగతి సమాంతరంగా సాగేలా.. ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించేలా.. అభివృద్ధి ఫలాలు ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వం... పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ రంగం భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.

సీఎస్ఆర్ ద్వారా సమాజంలో మార్పు తెచ్చే కార్యక్రమాల అమలుకు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి ప్రతి దశలోనూ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భాగస్వామిగా, సహాయకారిగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఏఐ, డేటా గవర్నెన్స్, సైబర్ భద్రత వంటి అంశాలు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సవాళ్లుగా మారుతున్న నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలు.. కేవలం కంప్లయన్స్ నిపుణులుగా కాకుండా స్ట్రాటజిక్ బోర్డ్ అడ్వైజర్లుగా మారాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు కేవలం లాభార్జనే కాకుండా సస్టైనబుల్, ఎథికల్ వ్యాపార వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. మరిన్ని కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

0
0
Report
Advertisement

Traffic Alert: వాహనదారులకు బిగ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి సికింద్రాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

Secunderabad, Telangana:

Secunderabad Traffic Diversions: వాహనదారులకు రేపు, ఎల్లుండి బిగ్‌ అలర్ట్‌. రెండు రోజుల పాటు హైదరాబాద్‌ నగరంలో భారీ ట్రాఫిక్‌ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ మేరకు వాహనదారులతోపాటు ట్రాఫిక్‌ పోలీసులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆషాఢ మాసంలో ప్రతియేటా సికింద్రాబాద్‌ ప్రాంతంలో అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతాయి. ఈ ఏడాది ఆషాఢ మాస బోనాల సందర్భంగా సికింద్రాబాద్‌ ప్రాంతంలో వాహనాల దారి మళ్లింపు చేయనున్నారు. 

సికింద్రాబాద్‌లో ఆగస్టు 2వ తేదీ నుంచి 4 వరకు జరగనున్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న ట్రాఫిక్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి హైదరాబాద్ ట్రాఫిక్-I డీసీపీ అవినాశ్‌ కుమార్ శనివారం సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ అడిషనల్ డీసీపీ రాములు, ట్రాఫిక్ సికింద్రాబాద్ జోన్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఖైరతాబాద్ జోన్ ఏసీపీ మోహన్ కుమార్, ఇతర అధికారులు లక్ష్మణ్, సీహెచ్‌ శోభన్ బాబు ఉన్నారు.

జాతర సందర్భంగా భక్తులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేడుకలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చూడాలని హైదరాబాద్ ట్రాఫిక్-I డీసీపీ అవినాశ్‌ కుమార్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లతో జాతర పరిసర ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి కావాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

పోలీసులకు సూచనలు
==> బోనాల జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ముందస్తుగా రూపొందించిన ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలి.
==> భక్తుల రద్దీని నియంత్రించడంలో, పార్కింగ్ స్థలాల వద్ద వాహనాలను క్రమబద్ధీకరించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
==> లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలి.
==> జాతరకు వచ్చే భక్తులు, వాహనదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు తక్షణమే అందించాలి.
==> ప్రజా సౌకర్యం, భద్రతే ధ్యేయంగా ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా విధి నిర్వహణలో నిమగ్నం కావాలి.

0
0
Report

Wines Close: మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి వైన్స్‌ షాపులు బంద్‌

Secunderabad, Telangana:

Wine Shops Close For Two Days: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్‌. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్‌ ఉండనున్నాయి. రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క మద్యం దుకాణాలే కాకుండా బార్లు కూడా మూతపడనున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతమైన సికింద్రాబాద్‌ ప్రాంతంలో వైన్స్‌ మూసివేయనున్నారు. ఇంతకీ ఎందుకంటే సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మద్యం విక్రయాలు బంద్‌ పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈ మేరకు మద్యం దుకాణాలు మూత వేయనున్నారు.

ఆషాఢమాసంలో రెండో ఆదివారం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి జాతర అంగరంగ వైభవంగా చేస్తుంటారు. సికింద్రాబాద్‌ బోనాలను పురస్కరించుకుని రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఆగస్టు 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 4 ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులతోపాటు ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బోనాల జాతర నేపథ్యంలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లకు రెండు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

సికింద్రాబాద్‌ బోనాల సందర్భంగా మార్కెట్, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధ బార్లు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. మల్కాజిగిరి జోన్ పరిధిలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ, బోనాల వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ఈ మేరకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.

0
0
Report
Advertisement
Advertisement
Advertisement

Tirumala: తిరుమల సేవలో జపాన్ ఓపెన్ చాంపియన్ పీవీ సింధు.. ఇతర ప్రముఖులు

Tirupati Urban, Andhra Pradesh:

PV Sindhu In Tirumala: కోరిన కోరికలు మొక్కులు తీర్చే కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సాధారణ భక్తులతోపాటు వీఐపీలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. శనివారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా, తమిళనాడు మంత్రి వినోద్‌, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఎమ్మెల్సీ పద్మశ్రీ తిరుమలకు విచ్చేసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టీటీడీ అధికారులు ప్రముఖులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

స్వామి సేవలో పీవీ సింధు
తిరుమల శ్రీవారిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఉదయాస్తమాన సేవలో భాగంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న పీవీ సింధు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు పీవీ సింధుకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన పీవీ సింధిని చూసేందుకు ఆలయ పరిసరాల్లో భక్తులు ఆసక్తి చూపించారు. ప్రపంచ వేదికపై ఇటీవల చాంపియన్‌గా నిలిచి భారతదేశానికి పీవీ సింధు గౌరవం తీసుకువచ్చారు. బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక జపాన్‌ ఓపెన్‌లో పీవీ సింధు చాంపియన్‌గా నిలిచారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఒక టైటిల్‌ సాధించడంతో సింధు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు.

కొనసాగుతున్న భక్తుల రద్దీ
నిన్న శ్రీవారిని మొత్తం 71,393 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 27,846 మంది భక్తులు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం హుండీ కానుకలు రూ.4.46 కోట్లు వచ్చాయని.. లడ్డూ విక్రయాలు 4.33 లక్షలు జరిగాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక అన్నప్రసాదాలు 2.58 లక్షల మంది భక్తులు స్వీకరించారని.. వైద్య సేవలు 2,946 మంది భక్తులు పొందారు. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో 31 కంపార్ట్‌మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్ ఉంది. సర్వదర్శనానికి (ఎస్‌ఎస్‌డీ టోకెన్‌లు లేకుండా) 12 గంటలు సమయం పడుతోంది.

0
0
Report
Advertisement
Advertisement
Back to top