చర్లపల్లి జోరువానలో కూలీ పనికి వచ్చిన ఓ బాలికను చూసి సంజయ్ కారు ఆపాడు
Karimnagar, Telangana:కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గం చర్లపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. కూలీల గుంపులో ఓ మైనర్ బాలికను చూసి.. 'అమ్మా.. పనికి వెళ్తున్నావా? నీకు చదువుకోవాలని అనిపించలేదా నీ కుటుంబ పరిస్థితి గురించి అడిగాడు. తన పేరు బొల్లా అక్షయ్ అని, తాను 10వ తరగతి పాసయ్యానని, అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో కూలీ పనులకు వెళ్తున్నానని బదులిచ్చారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Fatty Liver Drink: లివర్ ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం..ఫ్యాటీ లివర్కు చెక్ పెట్టే ఇంటి చిట్కా!
Hyderabad, Telangana:Fatty Liver Healthy Drink: మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. దీని పనితీరు మందగిస్తే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అయితే మారిన ఆధునిక ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా నేడు చాలా మందిలో కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోయి 'ఫ్యాటీ లివర్' సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్యను నివారించి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో 'పచ్చి పసుపు' ఒక అద్భుతమైన సూపర్ హెర్బ్లా పనిచేస్తుంది. పసుపులో లభించే 'కర్కుమిన్' అనే బయోయాక్టివ్ సమ్మేళనం కాలేయానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
కాలేయానికి పచ్చి పసుపు కలిగించే ముఖ్యమైన ప్రయోజనాలు..
కొవ్వును కరిగిస్తుంది: పసుపులోని కర్కుమిన్ కాలేయంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును (ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్) కరిగించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది లిపిడ్ జీవక్రియను మెరుగుపరిచి, ఫ్యాటీ లివర్ లక్షణాలను తగ్గిస్తుంది.
వాపు, ఆక్సీకరణ ఒత్తిడి నివారణ: పసుపునకు సహజంగానే శక్తివంతమైన శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి కాలేయ వాపును తగ్గించడంతో పాటు, కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ను సమర్థవంతంగా అడ్డుకుంటాయి.
కాలేయ ఎంజైమ్ల నియంత్రణ: కాలేయం దెబ్బతిన్నప్పుడు హెచ్చుతగ్గులకు గురయ్యే ALT, AST వంటి కాలేయ ఎంజైమ్ల స్థాయిలను పసుపు క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా లివర్ పనితీరు మెరుగవుతుంది.
నేచురల్ డిటాక్సిఫికేషన్: పచ్చి పసుపు రక్తంలోని విషతుల్యాలను తొలగించి, కాలేయాన్ని శుభ్రపరిచే నేచురల్ క్లెన్సర్గా పనిచేస్తుంది. అలాగే ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది.
పచ్చి పసుపును ఏ విధంగా తీసుకోవాలి?
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకుని, డిటాక్స్ చేయడానికి 'పచ్చి పసుపు నీరు' అత్యుత్తమ మార్గంగా నిపుణులు చెబుతున్నారు. దాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే..ముందుగా తాజా పచ్చి పసుపు కొమ్మును తీసుకుని శుభ్రంగా కడిగి, మెత్తగా నూరాలి లేదా తురుముకోవాలి. ఈ పసుపు తురుమును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. రుచి కోసం ఇందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.
ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా కాలేయం పనితీరు మెరుగుపడటంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని ఆరోగ్య నివేదికల ద్వారా పేర్కొన్నాము. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Weight Loss Tips: వాకింగ్ Vs రన్నింగ్..ఫాస్ట్గా బరువు తగ్గాలంటే ఏది బెస్ట్?
Also Read: Gastric Home Remedies: ఏళ్ల తరబడి ఎసిడిటీతో బాధపడుతున్నారా? ఇది చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
T Jeevan Reddy: ధర్మేంద్ర ప్రదాన్కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది: జీవన్ రెడ్డి
Raikal, Jagtial, Telangana:Jeevan Reddy vs Revanth Reddy: రైతుల విషయంలో రేవంత్ రెడ్డి మాటలు వింటూ ఉంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ పరిస్థితే వారికి కూడా పడుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి తెలిపారు. వరి నాట్లు వేసే సమయం దాటిపోయాక ఇప్పుడు ఆరుతడి పంటలు వేయాలనడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎండగట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ అందిస్తే.. నేడు సాయంత్రం పూట కరెంట్ కోతలు మొదలయ్యాయని, బావుల్లో నీళ్లు అడుగంటి రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్హౌస్ వద్ద కేవలం రూ10 కోట్ల ఖర్చుతో కాపర్ డ్యామ్ నిర్మిస్తే 15 రోజుల్లో నీటి సమస్య తీరుతుందని సూచించారు.
జగిత్యాల జిల్లా రాయికల్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కాలం తెచ్చిన కరువు కాదని.. రేవంత్ రెడ్డి మార్క్ పాలన తెచ్చిన కృత్రిమ కరువు అని తెలిపారు. జగన్నాథ్పూర్ - బోర్నపల్లి బ్రిడ్జి నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నడుమ సమన్వయం లేదని చెప్పారు. స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.17.50 కోట్లతో తొలి సంతకం చేసి టెండర్లు కూడా పూర్తి చేస్తే.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మళ్లీ కేంద్ర గిరిజన శాఖకు ప్రతిపాదనలు పంపడం ఏమిటని ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై నమ్మకం లేదా అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిలదీశారు. టెండర్లు పూర్తయినా పనులు ఎందుకు ప్రారంభించడం లేదని, రామాజీపేట్, మైతాపూర్ వంతెనల అప్రోచ్ రోడ్ల విషయంలో డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్నినో హెచ్చరికలు ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు నివారణ చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
పోలవరం వద్ద నీ గురువు చంద్రబాబు కాపర్ డ్యామ్ కట్టలేదా అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుర్తుచేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని నిలదీశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ లేదని.. రేవంత్ రెడ్డి మాటలు వింటూ ఉంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ పరిస్థితే వారికి కూడా పడుతుందని చురకలు అంటించారు.
ధాన్యం సేకరణ, ఉచిత విద్యుత్, నీటి యాజమాన్యంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. రైతుల సహనాన్ని పరీక్షించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. పంజాబ్, హర్యానా రైతుల తరహాలోనే తెలంగాణ రైతులు కూడా ఉద్యమించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు.
Puri Jagannadh Mother: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం..కూతురు పవిత్ర ఎమోషనల్ పోస్ట్!
Hyderabad, Telangana:Puri Jagannadh Mother Passed Away: టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ తల్లి (అమ్మాజీ) కన్నుమూశారు. ఈ విషాదకర వార్తను పూరి కూతురు పవిత్ర సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
పవిత్ర ఎమోషనల్ పోస్ట్
శనివారం (జూలై 25) నాడు తన నానమ్మ మరణించినట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పవిత్ర వెల్లడించారు. ఆ పోస్ట్ లో.. "ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెట్టుకుంటారు? నీతో మరోరోజు గడిపే అవకాశమొస్తే బాగుండు. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లు పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ" అని పోస్ట్ పెట్టింది.
ఇలా ఆమె రాసుకొచ్చిన భావోద్వేగ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పూరి కుటుంబానికి తమ ప్రగాష్ట సానుభూతి, సంఘీభావం తెలుపుతున్నారు.
పూరి జగన్నాథ్ సినిమాల ప్రస్థానం
ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా అనేక బ్లాక్బస్టర్ హిట్లు అందించిన పూరి జగన్నాథ్ కెరీర్ పరిశీలిస్తే.. 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం', 'బద్రి', 'ఇడియట్', 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి', 'శివమణి', 'పోకిరి', 'దేశముదురు', 'బిజినెస్ మెన్', 'టెంపర్' వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. అయితే గత కొంతకాలంగా ఆయనకు సరైన విజయాలు దక్కలేదు. 'ఇస్మార్ట్ శంకర్' మినహా మిగిలిన చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ALso Read: మెగా పవర్స్టార్ రామ్చరణ్కు మరోసారి సర్జరీ..కోయంబత్తూరుకు వెళ్లిన మెగా ఫ్యామిలీ!
Also REad: "విద్యార్థులతో పాటు నిరసన చేయడానికి డబ్బులిస్తున్నారు" నటి ఆకాంక్ష సంచలన కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
E20 Fuel Protest: కేంద్ర ప్రభుత్వానికి మరో నిరసన సెగ..E20 పెట్రోల్పై జూలై 31న రాజధానిలో భారీ ర్యాలీ!
New Delhi, Delhi:Delhi E20 Petrol Protest: దేశంలో మారుతున్న ఇంధన విధానాలు, వినియోగదారుల ఎంపిక హక్కుల పరిరక్షణ కోసం 'టీమ్ భారత్' (Team Bharat) సంస్థ శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈనెల 31న ఢిల్లీలో 'గాడీ మార్చ్, గాంధీ మార్చ్' పేరుతో భారీ శాంతియుత వాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇండియా గేట్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ పార్లమెంట్ స్ట్రీట్ వరకు సాగనుంది.
ఆందోళనలకు అసలు కారణం ఏమిటి?
దేశంలో విక్రయిస్తున్న E10, E20 పెట్రోల్ (ఇథనాల్ కలిపిన పెట్రోల్) వల్ల వాహనాల మైలేజీ భారీగా తగ్గిపోతోందని, ఇంజిన్ రిపేర్ సమస్యలు వస్తున్నాయని వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగించడం వల్ల ఎలాంటి సాంకేతిక సమస్యలు రావని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో పౌరుల వేదిక అయిన 'టీమ్ భారత్' ఇంధన విధానంలో పారదర్శకత, వినియోగదారుల హక్కుల కోసం ఈ ఉద్యమానికి నడుం బిగించింది.
ఈ ర్యాలీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడేందుకు కాదని, ఇథనాల్ 20 (E20) విధానంపై వాహనదారుల్లో నెలకొన్న ఆందోళనలను శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే పౌరుల ఉద్యమమని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ మార్చ్ ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ప్రారంభమై.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి నివాసాలు, కార్యాలయాల మీదుగా వెళ్లి పార్లమెంట్ స్ట్రీట్ వద్ద ముగియనుంది.
టీమ్ భారత్ ప్రధాన డిమాండ్లు..
1) E10 ఇంధనానికి అనుకూలంగా రూపొందించిన పాత వాహనాల కోసం మార్కెట్లో E10 పెట్రోల్ను అందుబాటులో ఉంచాలి.
2) E20 పెట్రోల్ ధరపై 20 శాతం ప్రత్యేక తగ్గింపు ఇవ్వాలి. అలాగే ప్యూర్ పెట్రోల్ ధరలను తగ్గించాలి.
3) E20 ఇంధన విధానానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, సమాచారాన్ని దేశ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంచాలి.
4)2023కి ముందు తయారైన వాహనాలపై E20 పెట్రోల్ చూపుతున్న దుష్ప్రభావాలకు శాశ్వత పరిష్కారం చూపాలి.
5) చివరగా..ఇథనాల్ విధానం వల్ల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలి.
వాహనదారులకు పిలుపు
ఈ ర్యాలీలో కార్లు, బైక్ యజమానులు, కుటుంబాలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీమ్ భారత్ పిలుపునిచ్చింది. "మేరీ గాడీ.. మేరా అధికార్", "మేరీ బైక్.. మేరీ చాయిస్", "అవర్ వెహికల్స్.. అవర్ చాయిస్.. అవర్ రైట్" వంటి నినాదాలతో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా తమ నిరసన తెలపాలని కోరింది.
ఇథనాల్ విధానంపై వాదనలు..
దేశంలో ఇంధన దిగుమతులను తగ్గించడం, రైతులకు మద్దతునివ్వడం, ఇంధన భద్రతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం E20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ను ప్రోత్సహిస్తోంది. అయితే, 2023కి ముందు తయారైన వాహనాలపై దీని ప్రభావం వల్ల మైలేజ్ తగ్గిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడంపై వాహనదారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వివాదం నేపథ్యంలో జూలై 31న జరగనున్న 'గాడీ మార్చ్' దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also REad: కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే..కేంద్రమంత్రికి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు!
Also REad: CJP Next Target: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత.. బొద్దింకల పార్టీ టార్గెట్ వీరిపైనే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Siddaramaiah: రాజీనామాతో తీవ్ర అసంతృప్తి.. రాజకీయాలకు మాజీ సీఎం సిద్ధరామయ్య గుడ్బై
Mandya, Karnataka:Siddaramaiah Good Bye To Politics: కర్ణాటక రాజకీయాల్లో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. ఇక తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. 2028లో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సిద్ధరామయ్య ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. వయసు మీద పడడం, ఆరోగ్యంతోపాటు అవినీతి రాజకీయాలు పెరిగిపోతుండటం కారణంగా తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయాలు అవినీతిమయం
మాండ్య జిల్లాలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ సీఎం సిద్ధరామయ్య పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు అవినీతిమయంగా మారాయని తెలిపారు. ఈ కారణంగా తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టత ఇచ్చారు. తాను ప్రజల కోసం పని చేస్తానని.. ప్రజల కష్టాలపై తన గొంతు విప్పుతానని సిద్ధరామయ్య ప్రకటించారు.
ರಾಜಕೀಯ ಕ್ಷೇತ್ರ ಇಂದು ಕಲುಷಿತಗೊಂಡಿರುವುದರಿಂದ 2028ರ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ನಾನು ಸ್ಪರ್ಧಿಸುವುದಿಲ್ಲ. ಆದರೆ, ಸಕ್ರಿಯ ರಾಜಕಾರಣದಲ್ಲಿದ್ದು, ಜನರ ಕಷ್ಟ, ಸುಖಗಳಿಗೆ ಧ್ವನಿಯಾಗಿ ನಿಲ್ಲುತ್ತೇನೆ.
ಮತ್ತೊಮ್ಮೆ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಸ್ಪರ್ಧಿಸುವಂತೆ ವರುಣ ಕ್ಷೇತ್ರದ ಜನರು ಒತ್ತಾಯಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಆದರೆ ನಾನು ಇನ್ನು ಮುಂದೆ ಯಾವುದೇ… pic.twitter.com/v0S4tCQ30o
— Siddaramaiah (@siddaramaiah) July 26, 2026
మళ్లీ పోటీ చేయను
'వరుణ నియోజకవర్గ ప్రజలు నన్ను మళ్లీ పోటీ చేయమని అడుగుతున్నారు. కానీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా' అని మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రకటన చేశారు. బహిరంగ సభలో ప్రకటించిన విషయాన్ని సోషల్ మీడియా వేదిక కూడా ఇదే చెబుతూ పస్టు చేశారు. 79 ఏళ్ల వయస్సు ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటు. కన్నడ రాజకీయాల్లో అపర చాణక్యుడుగా గుర్తింపు పొందిన సిద్ధరామయ్య మొన్నటి దాకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. 2013 మే 13 నుంచి 2018 మే 16వ తేదీ వరకు సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు 1996- 1999 వరకు, తర్వాత 2004- 2005 వరకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
రాజకీయ జీవితానికి 50 ఏళ్లు
కర్ణాటక రాజకీయాల్లోకి 1978లో సిద్ధరామయ్య ప్రవేశించారు. తాలుకా బోర్డు నుంచి అతడి రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1983 నుంచి నేటి వరకు సిద్ధరామయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నియోజకవర్గాలు మారుస్తున్నా కూడా ఎక్కడా ఓటమన్నదే లేకపోవడం విశేషం. 2028వ సంవత్సరం వరకు ఆయన రాజకీయ జీవితానికి 50 ఏళ్లు పూర్తవుతాయి. దీంతో అప్పుడు పూర్తిగా రాజకీయాలకు గుడ్బై చెప్పే అవకాశం ఉంది.
KCR: పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై మాజీ సీఎం కేసీఆర్ ఆందోళన.. కేటీఆర్, హరీశ్ రావుకు ఫోన్
Hyderabad, Telangana:Peddi Sudarshan Reddy Health Condition: తెలంగాణ ఉద్యమకారుడు.. బీఆర్ఎస్ పార్టీ ఆరంభం నుంచి ఉన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురవడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. గుండెపోటుకు గురయ్యారనే సమాచారం అందుకున్న పార్టీ నాయకత్వం వెంటనే అప్రమత్తమై వైద్య సేవలు సత్వరమే అందేలా చర్యలు తీసుకుంది. పెద్ది సుదర్శన్ ఆరోగ్యంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. పెద్ది సుదర్శన్కు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఆదేశించారు. నిరంతరం కేటీఆర్, హరీశ్ రావుతో ఫోన్లో కేసీఆర్ వివరాలు తెలుసుకుంటూ అవసరమైన సూచనలు చేస్తున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కేసీఆర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని కేటీఆర్కు ఆదేశించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై పార్టీ ముఖ్య నాయకులను అప్రమత్తం చేశారు. అస్వస్థతకు గురైన విషయం తెలిసి ఆందోళన చెందిన కేసీఆర్ ఉదయం నుంచి పెద్ది ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్లో వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ను అధినేత ఆదేశించారు.
పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే…
— BRS Party (@BRSparty) July 26, 2026
సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులతో పాటు, పార్టీ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు, వినోద్ కుమార్, వరంగల్ జిల్లా నాయకులతో కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స అందేలా తగిన ఏర్పాట్లు చేయాలి అని సూచిస్తున్నారని వెల్లడించింది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య సమాచారాన్ని,. మెరుగైన చికిత్స కోసం వారు చేస్తున్న కృషిని వైద్యులు కేసీఆర్కు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని తెలిసీ కేసీఆర్ ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం.
ఆరోగ్య స్థితిపై టీపీసీసీ చీఫ్ ఆరా
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు (పీసీసీ) మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడం ఊరటనిచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
ప్రాణాలు పోసిన డాక్టర్ మమత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కాపాడేందుకు వైద్యురాలు డాక్టర్ మమత రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. ఫలితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ప్రాణంతో ఉన్నారు. ఆమె చేసిన ప్రయత్నం అందరినీ కదిలించింది. ఉదయం 8 గంటల నుంచి ఆయనను కాపాడేందుకు ఆమె వైద్య బృందంతో కలిసి నిర్విరామంగా శ్రమించారు. పలుమార్లు సీపీఆర్ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో వైద్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తొమ్మిదోసారి పెద్ది సుదర్శన్ రెడ్డికి చేసిన సీపీఆర్తో పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె కొట్టుకోవడం ప్రారంభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత కావాల్సిన వైద్యం అందిస్తున్నారు. మమత చూపిన చొరవపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశంసలు కురిపించారు.
ముద్రగడ పద్మనాభం మృతికి నా చెల్లెలే కారణం: ముద్రగడ గిరిబాబు
Kirlampudi, Andhra Pradesh:Mudragada Giribabu Hot Comments On His Father Padmanabham Death Watch VideoKCR: పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై మాజీ సీఎం కేసీఆర్ ఆందోళన
Hyderabad, Telangana:Former CM KCR Asked About Peddi Sudarshan Reddy Health Condition Watch VideoBJP: మోదీని అస్తిరపర్చాలని యువతను రెచ్చగొట్టారు: డీకే అరుణ
Hyderabad, Telangana:DK Aruna Reaction About Dharmendra Pradhan Resign And Students Protest Watch VideoDK Aruna: ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు రేవంత్ రెడ్డి సంబరాలు: డీకే అరుణ
Hyderabad, Telangana:Students Protest: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరగలేదా? రాహుల్ గాంధీ తన వీపు తాను చూసుకోకుండా సందట్లో సడేమియాల వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తప్పుబట్టారు. మీడియాలో కొంతమంది మాట్లాడే మాటలు చదువు సంస్కారం ఉన్న వాళ్లు మాట్లాడారు. నేపాల్, బంగ్లాదేశ్ల భారత్ చేస్తామని కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలో కొందరు చేశారు' అని డీకే అరుణ విమర్శించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదో తరగతి పేపర్ లీక్ అయ్యింది.. ఇక్కడ ఎవరూ రాజీనామా చేశారు? అని బీజేపీ ఎంపీ డీకే అరుణ నిలదీశారు. 'దేశ కీర్తి, మోదీని అపహాస్యం చేసేందుకు యువతను ఉసిగొల్పారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఏ ఒక్క విషయంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా లేరు. కానీ నల్ల బట్టలు వేసుకొని మాత్రం రోడ్డుపై ధర్నాలు చేస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవినీతి చేస్తున్నారు. ఆ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీని నడిపించే డబ్బుల ముఠాలు ఢిల్లీకి పంపుతున్నారు' అని డీకే అరుణ విమర్శలు చేశారు.
'నీట్ పేపర్ లీక్ అవ్వగానే రద్దు చేసి తిరిగి తక్కువ సమయంలో ఎగ్జామ్ పెట్టీ పొరపాటును సరిదిద్దారు. కేంద్రం అన్ని చర్యలు తీసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పని చేసే ఒక వ్యక్తి మోదీ నాయకత్వాన్ని అస్తిరపరచాలని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు' మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పేపర్ లీక్ అయితే అప్పుడెందుకు ఎవరు రాజీనామా చేయలేదు? అని ప్రశ్నించారు.
'విద్యార్థుల ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఏ అరాచక శక్తులు ఇందులో ఉన్నాయో అన్ని బయటికి వస్తాయి. భారతదేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులను భారతీయులు సహించరు. నీట్ రద్దు అవ్వగానే రాహుల్ గాంధీ ధర్నా ఎందుకు చేయలేదు? ఎవరో ధర్నా చేస్తే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీ కొట్టేయాలని మోడీ ఇంటి ముందు ధర్నా చేశారు' బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు చేశారు. కేటీఆర్, రేవంత్ రెడ్డికు పేపర్ లీక్పై మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.
'మోదీ నాయకత్వాన్ని చూస్తే మీకెందుకంత బాధా! ఈర్ష్య? నిరసనలో విద్యార్థుల కంటే ఎక్కువ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఉన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అన్నం తినే వారిలా కాకుండా గడ్డి తినే వారిలా మాట్లాడుతున్నారు. దేశ వ్యతిరేకులు విదేశాల నుంచి ఫుడ్, డబ్బులు పంపించి అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేశారు' అని బీజేపీ ఎంపీ డీకే అరుణ వివరించారు. యువత మంచి మార్గంలో నడిచి దేశ సంప్రదాయాలను కాపాడాలని విన్నవించారు.
'ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు రేవంత్ రెడ్డి సంబరాలు చేస్తూ ర్యాలీ తీస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై కట్టడి చేయడం బీజేపీకి 5 నిమిషాల పని. ఐదేళ్లు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం' అని ఎంపీ డీకే అరుణ తెలిపారు. 'పంజాబ్లో ఆప్ ప్రభుత్వం హయాంలో ఫార్మా ఉద్యోగుల పేపర్ లీక్ అయ్యింది. ఆప్ నాయకులు వచ్చి కూడా ఉద్యమంలో మాట్లాడుతున్నారు' అని వివరించారు. పేపర్ లీకేజీపై శాశ్వత పరిష్కారం తీసుకురావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. కఠిన చట్టాల రూపకల్పనకు అందరూ ముందుకి వచ్చి మద్దతు ఇవ్వకుండా.. సలహాలు సూచనలు స్వీకరిస్తామని ప్రకటించారు. మోదీ కీర్తిని దెబ్బ తీయాలనే దురాలోచలోనే మాత్రమే ఉన్నారని.. సరైన సమయంలో అందరికీ తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు.
Ram Charan Surgery: మెగా పవర్స్టార్ రామ్చరణ్కు మరోసారి సర్జరీ..కోయంబత్తూరుకు వెళ్లిన మెగా ఫ్యామిలీ!
Hyderabad, Telangana:Ram Charan Wrist Surgery: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల 'పెద్ది' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన మణికట్టుకు గాయమైంది. ఆ సమయంలో సినిమా ప్రమోషన్లలో కూడా ఆయన చేతికి కట్టుతోనే ప్రత్యక్షమయ్యారు. ఈ గాయానికి త్వరలోనే సర్జరీ అవసరమవుతుందని అప్పట్లో వార్తలు రాగా.. అయితే సినిమా విడుదల దగ్గర పడడంతో ఆ సమయంలో సర్జరీ చేయించుకోవడం వీలు కాలేదు. ఇప్పుడు ఆ సర్జరీ కోసం రామ్చరణ్ తన ఫ్యామిలీతో పాటు కోయంబత్తూరు బయల్దేరారు. కోయంబత్తూరులోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం ఈ సర్జరీ జరగనుంది.
కోయంబత్తూరుకు కుటుంబ సభ్యులు
రామ్ చరణ్కు ధైర్యం చెప్పేందుకు, అండగా నిలిచేందుకు ఆయన తల్లిదండ్రులు మెగాస్టార్ చిరంజీవి, సురేఖతో పాటు భార్య ఉపాసన కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసి, రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Mega Power Star #RamCharan Garu has departed for Coimbatore with his family to undergo a scheduled hand surgery. Megastar Chiranjeevi Garu is by his side during this time. ❤️ pic.twitter.com/Ej1TvyRbeq
— SivaCherry (@sivacherry9) July 26, 2026
సర్జరీ అనంతరం కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. ఆయన తదుపరి ప్రాజెక్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడో వచ్చినప్పటికీ, రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది వేసవిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలే విడుదలైన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం దాదాపుగా రూ.400 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా.. హీరో రామ్చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా అలరించింది. వీరితో పాటు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్కుమార్, బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మ, జగపతిబాబు, రావు రమేష్ వంటి వారు నటించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోనూ విడుదలై సందడి చేస్తుంది.
Also Read: "విద్యార్థులతో పాటు నిరసన చేయడానికి డబ్బులిస్తున్నారు" నటి ఆకాంక్ష సంచలన కామెంట్స్!
Also Read: "ఆ డైరెక్టర్ నగ్నంగా నటించమని చెప్పాడు"..అనురాగ్ కశ్యప్పై హీరోయిన్ హాట్ కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
6,700 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యం మాయం.. భువనగిరిలో భారీ అక్రమ దందా!
Hyderabad, Telangana:Yadadri Bhuvanagiri Rice Mill Fraud: ప్రభుత్వం పేదల బియ్యం కోసం కస్టమ్ మిల్లింగ్ (CMR) కింద కేటాయించిన వేలాది టన్నుల ధాన్యం పక్కదారి పట్టింది. అధికారుల కన్ను పడటంతో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఓ ప్రముఖ రైస్ ఇండస్ట్రీలో జరుగుతున్న భారీ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. సుమారు 6,700 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించుకొని.. ఏకంగా రూ.24 కోట్ల మేర గోల్మాల్ చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
అసలేం జరిగింది?
భువనగిరి సమీపంలోని ఓ రైస్ ఇండస్ట్రీస్కు పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం.. సీఎంఆర్ (Custom Milling Rice) కోసం ప్రభుత్వం పెద్ద మొత్తంలో ధాన్యాన్ని కేటాయించింది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి రైస్ రూపంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు అప్పగించాల్సి ఉంది.
అయితే, ఈ నెల 24వ తేదీన జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సదరు రైస్ మిల్లులో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యం నిల్వలను, మిల్లు గోదాముల్లో ఉన్న సరుకుతో సరిపోల్చి చూశారు. ఆ సమయంలో రికార్డుల్లో చూపించిన ధాన్యానికి, అక్కడ ఉన్న నిల్వలకు అస్సలు పొంతన లేకపోవడంతో అధికారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
రూ.24 కోట్ల ధాన్యం మాయం..
తనిఖీల సమయంలో గోదాముల్లో ఉండాల్సిన సుమారు 6,700 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.24 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ఈ భారీ తేడాపై మిల్లు యాజమాన్యాన్ని అధికారులు నిలదీయగా.. వారు సరైన ఆధారాలు చూపలేక నీళ్లు నమలడం.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అధికారులకు పక్కాగా అనుమానం వచ్చింది. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా బయట మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని గ్రహించిన సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ (DM) హరికృష్ణ తక్షణమే చర్యలు తీసుకున్నారు..
ఐదుగురిపై కేసు నమోదు..
డీఎం హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భువనగిరి రూరల్ పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. ప్రభుత్వ సొమ్మును తప్పుదోవ పట్టించి.. అక్రమాలకు పాల్పడిన రైస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నూనె వెంకటేశ్వర్లు తో పాటు మరో నలుగురు బాధ్యులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Viral Video: బ్యాంకు మేనేజర్ చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం మనవరాలు
Chennai, Tamil Nadu:Kayalvizhi Alagiri Video: బ్యాంకులో ఓ మాజీ ముఖ్యమంత్రి మనవరాలు హల్చల్ చేశారు. బ్యాంకులో తిట్ల పురాణం అందుకోవడమే కాదు బ్యాంకు మేనేజర్నే చెంప ఛెళ్లుమనిపించారు. అతడు ఏమైనా చేశాడా అంటే లేదు. కానీ ఓ విషయమై అతడితో వాగ్వాదానికి దిగి ఒక్కసారిగా లేచి ఆమె కొట్టారు. చిన్న విషయమై ఆమె రాద్ధాంతం చేయడంతో ఈ సంఘన సంచలనం రేపుతోంది. అయితే దాడి చేసి మాజీ సీఎం మనవరాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేనేజర్పై దాడి చేస్తున్న వీడియో వైరల్గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని చెన్నైలో అడయార్ ప్రాంతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎన్ఆర్ఐ శాఖ ఉంది. ఈ బ్యాంకు కార్యాలయానికి మాజీ కేంద్ర మంత్రి ఎంకే ఆళగిరి కుమార్తె, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనవరాలు కయల్విళి అళగిరి వచ్చారు. అయితే బ్యాంకు కొనసాగుతున్న వాణిజ్య సముదాయం యజమాని కయల్విళి అళగిరి. ఇటీవల ఆ భవనంలోని లిఫ్ట్ పని చేయకపోవడంతో బ్యాంక్ శాఖ మేనేజర్ హర్షిన్ సింగ్ మొదట మెయింటెనెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. సమస్యపై సరైన స్పందన రాకపోవడంతో బ్యాంకు మేనేజర్ భవన యజమాని కయల్విళి అళగిరికి ఫోన్ చేసి లిఫ్ట్ సమస్యను వివరించారు.
🚨 SBI Chief Manager in Chennai slapped by Former Union Minister's Daughter.
Former Union Minister MK Alagiri's daughter Kayalvizhi has slapped SBI Chief Manager. The alleged incident was captured on CCTV. The footage showed Kayalvizhi arguing with the bank manager of State… pic.twitter.com/352IQUJEjg
— Hellobanker (@Hellobanker_in) July 25, 2026
లిఫ్ట్ సమస్యపై ఫోన్ చేసి తనకు ఫిర్యాదు చేయడంతో కయల్విళి అళగిరి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనకే ఫిర్యాదు చేస్తారా అని ఈ నెల 20వ తేదీన నేరుగా బ్యాంకుకు ఆమె వచ్చారు. నేరుగా మేనేజర్ ఛాంబర్లోకి వెళ్లి తీవ్ర వాగ్వాదానికి దిగారు. కూర్చుని మేనేజర్ ప్రశాంతంగా సమాధానం ఇస్తుండగా ఒక్కసారిగా లేచిన కయల్విళి ఆవేశంలో మేనేజర్ హర్షిన్ సింగ్ చెంపపై కొట్టారు. అంతటితో ఆగకుండా తిట్లతో విరుచుకుపడ్డారు. దీనికి తీవ్ర పర్యవసానాలు ఉంటాయని మేనేజర్ను బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సంఘటన బ్యాంక్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డవగా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తమ బ్యాంకు మేనేజర్పై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎస్బీఐ చీఫ్ మేనేజర్ నమచ్చివాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడయార్ పోలీసులు కయల్విళి అళగిరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం, భౌతిక దాడికి పాల్పడటం, దుర్భాషలాడటం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడటం వంటి తీవ్ర ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు ప్రస్తుతం సమగ్ర విచారణ చేస్తున్నారు. గొప్ప రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇలా బ్యాంక్ మేనేజర్పై దాడికి దిగడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎంత రాజకీయ నాయకురాలు అయినా కూడా ఇలా భౌతిక దాడులు చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Vivo S2: ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. భారత్లోకి Vivo S2 రీ-ఎంట్రీ..
Hyderabad, Telangana:Vivo S2 India Launch: టెక్ దిగ్గజం సంస్థ వివో (Vivo) భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరొక స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. గత కొన్ని సంవత్సరాల పాటు విడుదల చేస్తానున్న ప్రకటించి.. ఐకానిక్ S సిరీస్ను భారత్లో తిరిగి విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైంది. 2019లో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వివో S1 తర్వాత.. దాదాపు ఏడేళ్ల తర్వాత వివో S2 మోడల్ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ క్రమంలో కంపెనీ ఇప్పటికే ఒక అధికారిక పోస్టర్ను విడుదల చేయగా.. టెక్ వర్గాల్లో ఈ ఫోన్పై భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది.. ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ ఆగస్టు 6న భారత్లో అధికారికంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. లాంచ్ అయిన కొద్ది రోజులకే.. అంటే ఆగస్టు 11 నుంచి దీనిని విక్రయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..
వివో S2 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
కంపెనీ ఇంకా పూర్తి స్థాయి స్పెసిఫికేషన్లను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. లీకైన వివరాల ప్రకారం ఈ ఫోన్ అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ 6.59-అంగుళాల OLED ప్యానెల్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 1.5K రిజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్కు ఇది అద్భుతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా సులభంగా అన్లాక్ చేయడానికి ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) చిప్సెట్ను కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 8GB RAM వేరియంట్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. దీని స్టోరేజ్ విషయానికి వస్తే.. 128GB (బేస్ మోడల్)తో పాటు 256GB ఆప్షన్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.. వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఫోన్ సఫైర్ బ్లూ (Sapphire Blue), రీగల్ బ్రాంజ్ (Regal Bronze)తో పాటు సిల్క్ వైట్ (Silk White) అనే మూడు రాయల్ కలర్స్లో లభించనుంది.
ధర వివరాలు..
భారత మార్కెట్లో వివో S2 ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో పోటీపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 38,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫుల్ ఆప్షన్స్ ఉన్న టాప్ వేరియంట్ ధర రూ. 42,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. డిజైన్, పనితీరుకు ప్రాధాన్యతనిచ్చే.. స్మార్ట్ఫోన్ ప్రియులకు ఈ వివో S2 ఒక మంచి ఆప్షన్గా నిలవబోతోందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
సినిమా ఫక్కీలో స్కెచ్.. సిద్ధిపేట ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్!
Hyderabad, Telangana:Siddipet Latest News: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శనివారం తీవ్ర కలకలం రేగింది. వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ ఖైదీ.. పోలీసుల కళ్లుగప్పి సినిమా ఫక్కీలో పరారైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బైక్ దొంగతనాల కేసులో రిమాండ్లో ఉన్న నిందితుడు సాయికుమార్ తప్పించుకోవడంతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బైక్ దొంగతనాల కేసులో నిందితుడైన సాయికుమార్తో పాటు మొత్తం ఏడుగురు ఖైదీలను క్రమశిక్షణా ప్రక్రియలో భాగంగా.. అలాగే జైలు నిబంధనల ప్రకారం.. మెడికల్ చెకప్ నిర్వహించేందుకు సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న సాయికుమార్.. పోలీసులు అజాగ్రత్తగా ఉన్న సమయంలో వారి దృష్టిని మళ్లించి ఒక్కసారిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఖైదీ మాయమైనట్లు గమనించిన సిబ్బంది వెంటనే తేరుకుని ఆసుపత్రి పరిసరాల్లో వెతికినప్పటికీ.. అప్పటికే అతడు పరారయ్యాడు.
పరారైన సాయికుమార్ పలు బైక్ దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తూ.. పోలీసులకు చిక్కాడు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలకు తీసుకురాగా ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది.
ఖైదీ పరార్ వార్త తెలిసిన వెంటనే జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనపై తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోకి వెళ్లే ప్రధాన రహదారుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేసిన్నట్లు తెలుస్తోంది.. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీని సేకరించి.. అతడు ఏ వైపు పరారయ్యాడనే అంశంపై విశ్లేషిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
