icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Revanth Reddy: వంద రోజుల్లో మూసీ నదీ ఫేజ్‌-2 పనులకు శ్రీకారం: రేవంత్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Musi River Project: హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరం అని చెప్పుకుంటే సరిపోదు. ఆ స్థాయిలో అభివృద్ధి జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్‌ నగరంలో 122 కి.మీ మేరకు అన్ని వైపుల మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉంది. నాగోల్ నుంచి ఎల్పీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయం వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు విస్తరిస్తాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణకు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. మెట్రోతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన వంటి నగర అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. నగర అభివృద్ధిలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Kishan Reddy: నా నిబద్ధతపై రేవంత్ రెడ్డి‌ సర్టిఫికెట్ అవసరం లేదు: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి రూ.1,511 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం రేవంత్‌ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ నది ప్రక్షాళన ఫేజ్-2 కు వంద రోజుల్లో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవం కోసం తొలి దశగా గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు ప్రారంభించగా.. మరో దశగా నాగోల్ నుంచి గౌరెల్లి వరకు కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని తెలిపారు.

'గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమనా రివర్ ఫ్రంట్, యూపీలో గంగానది ప్రక్షాళన చేసుకున్నప్పుడు మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయొద్దు. 55 కిలోమీటర్ల మూసీ నదిని ప్రక్షాళన చేసుకుంటే హైదరాబాద్‌ నగరం అభివృద్ధి సాధించడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి' అని రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారని చెప్పారు.

Also Read: Harish Rao: చంద్రబాబుకు డూడూ బసవన్నలా రేవంత్‌ రెడ్డి తలూపుతుండు: హరీశ్‌ రావు

'నివసించడానికి ఏమాత్రం వీలులేకుండా కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విపరీతమైన వ్యర్థాలు, పారిశ్రామిక కాలుష్యం, కళేబరాలతో విషయం నల్గొండ ప్రజల జీవితాలను కాటేస్తోంది. నల్గొండ జిల్లాలో ఒకవైపు ఫ్లోరైడ్, మూసీ కాలుష్యంతో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదా? ఏ పేదవాడికి అన్యాయం చేయం. ఏ పేదవాడిని నిరాశ్రయులుగా చేయబోం. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు ఇస్తాం. వారి పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తాం' అని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

అభివృద్ధికి అడ్డంకిగా
ఈ మల్కాజిగిరి ప్రాంతం పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్‌తో కలిసి నాలుగు రకాల పరిపాలన జరిగేది. ఒకరి మధ్య మరొకరికి సమన్వయం లేక అభివృద్ధికి అడ్డంకిగా మారింది. అంతర్జాతీయ నగరం అని చెప్పుకోవడం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి జరిగినప్పుడే గుర్తింపు వస్తుంది' అని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. ఓఆర్ఆర్ లోపల 1.34 కోట్ల మంది ప్రజలు, వివిధ అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటవుతున్న సందర్భంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు, మెట్రో, విద్యుత్, పోలీసు, మురుగునీటి పారుదల, మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

మెట్రో విస్తరణ
పరిపాలనా సౌలభ్యం కోసం జీహెచ్‌ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు కార్పొరేషన్లుగా వికేంద్రీకరించినట్టు రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఇదే పద్ధతిలో పోలీసు వ్యవస్థను కూడా వికేంద్రీకరించామని చెప్పారు. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో మెట్రో విస్తరణతో పాటు ప్రతి పనిని చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత తనదని ప్రకటించారు.

శంకుస్థాపనలు ఇవే!
ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ లే అవుట్‌లో రూ.1,511 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన

==> 10 ఎకరాల్లో 98 కోట్లతో నిర్మించే మల్కాజ్‌గిరి మునిసిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం

==> రూ.960 కోట్లతో ఏఓసీ సెంటర్‌లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం

==> రూ.416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్‌లో 6 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం

==> రూ.37.50 కోట్లతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం

0
0
Report

Kishan Reddy: నా నిబద్ధతపై రేవంత్ రెడ్డి‌ సర్టిఫికెట్ అవసరం లేదు: కిషన్ రెడ్డి

Hyderabad, Telangana:

Kishan Reddy vs Revanth Reddy: అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయ ప్రసంగం చేయడమే కాకుండా తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్‌ రెడ్డిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నన్ను తెలంగాణ పొలిమేరలు దాటనివ్వనని రేవంత్‌ రెడ్డి అంటున్నాడు. తెలంగాణ గడ్డపై నన్ను ఆపే వ్యక్తి ఎవరూ లేరు. నేనెవరో నేనేంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు' అని రేవంత్‌ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు.

ఉప్పల్‌ భగాయత్‌లో జరిగిన సమావేశంలో రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కిషన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి తన వ్యాఖ్యలతో బుద్ధి చెప్పారు. తాను రేవంత్ రెడ్డిలా పార్టీలు మారలేదని కౌంటర్‌ ఇచ్చారు. '​పన్నెండు పార్టీలు తిరిగి బీజేపీలోకి వచ్చిన వ్యక్తిని కాదు. బీజేపీలోనే పుట్టి.. ఈ పార్టీలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించా. బీజేపీలోనే కొనసాగుతా' అని కిషన్‌ రెడ్డి ప్రకటించారు.

వ్యక్తిగత స్థాయికి దిగజారి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రేవంత్‌ రెడ్డి ఇలా మాట్లాడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హితవు పలికారు. ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదని సూచించారు. 'నా గురించి ఇలా మాట్లాడటం తెలంగాణ సమాజం గమనిస్తోంది. ​తెలంగాణ కోసం నేను చేసిన పనులకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు' అని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ కోసం తీసుకొచ్చిన ప్రాజెక్టులు, నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, విశ్వాసమే గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని కిషన్‌ రెడ్డి తెలిపారు. 'తెలంగాణ ప్రజల తీర్పే మాకు సర్టిఫికెట్. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది ఎంపీ స్థానాలు ఇచ్చి తమ విశ్వాసాన్ని చాటారు' అని గుర్తుచేశారు.

'తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో అధికారం మారినా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదు. అడ్డగోలుగా అబద్ధపు హామీలు, చేతగాని అసమర్థ పాలన, అడుగడుగునా నమ్మకద్రోహం నడుమ క్షేత్రస్థాయి సమస్యలను గాలికి వదిలి గాల్లోమేడలు కడుతూ.. విదేశాలపై వ్యామోహం చూపిస్తూ.. సొంత దేశంలో జరుగుతున్న అభివృద్ధిపై కారుకూతలు కూసిన ముఖ్యమంత్రి గ్రాఫ్‌ పాతాళానికి పడిపోయింది' అని 'ఎక్స్‌' వేదికగా కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఇలాగే మాట్లాడి ప్రజాగ్రహాన్ని చవిచూసి ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి కూడా విదేశీ భాషలో మాట్లాడుతూ తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడు. రేవంత్ రెడ్డికి కూడా.. పదవీ పోక తప్పదు. అదేగతి తప్పదు' అని కిషన్‌ రెడ్డి తెలిపారు. ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు.

0
0
Report
Advertisement

Telangana Schools Reopen: అమావాస్య రోజున (జూన్ 15) స్కూల్స్ రీఓపెన్ ఎందుకు..సీఎం రేవంత్ రెడ్డికి పేరెంట్స్ సూటిప్రశ్న!

Hyderabad, Telangana:

Telangana Schools Reopen Amavasya Sentiment: తెలంగాణలో జూన్ నెలలో పాఠశాలల పునఃప్రారంభం (స్కూల్స్ రీఓపెన్) కానుండటంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జూన్ 15న విద్యాసంస్థలను తెరవాలనే విద్యాశాఖ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి వ్యతిరేకత కేవలం ఎండల తీవ్రతపైనే కాకుండా, ఆ రోజున ఉన్న 'అమావాస్య' సెంటిమెంట్‌ చుట్టూ తిరుగుతుండటంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు, నెటిజన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, విద్యాశాఖ అధికారులపై తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అమావాస్య రోజే ఎందుకు?
నిజానికి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలు జూన్ 12నే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జూన్ 13వ తేదీ రెండో శనివారం, జూన్ 14వ తేదీ ఆదివారం కావడంతో సెలవులు వచ్చాయి. దీనివల్ల స్కూళ్ల రీఓపెనింగ్‌ను ప్రభుత్వం జూన్ 15కి వాయిదా వేసింది. కానీ, దురదృష్టవశాత్తూ ఆ జూన్ 15వ తేదీ నాడే 'అమావాస్య' రావడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది.

మన దేశంలో అమావాస్య రోజున ఎలాంటి కొత్త పనులను, శుభకార్యాలను ప్రారంభించరు. విద్యాసంవత్సరం అనేది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన ఘట్టం. అలాంటి కొత్త చదువుల ప్రయాణాన్ని అమావాస్య రోజున ప్రారంభించడం సరికాదని సెంటిమెంట్‌ను నమ్మే మెజారిటీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పిల్లల చదువులకు సెంటిమెంట్లు ఉండవా?
ఈ నిర్ణయంపై ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. "రాజకీయ నాయకులు తాము పదవులు చేపట్టేటప్పుడు, నామినేషన్లు వేసేటప్పుడు, కొత్త పథకాలు ప్రారంభించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మంచి రోజు, ముహూర్తం చూసుకుంటారు కదా? మరి పిల్లల విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడానికి మాత్రం ఇలాంటి సెంటిమెంట్స్ ఉండవా?" అని జనం ప్రశ్నిస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరాన్ని అమావాస్య రోజున ప్రారంభించడం ప్రజల నమ్మకాలను, విశ్వాసాలను అవమానించడం కాదా అనే చర్చ నడుస్తోంది.

"రేవంత్ రెడ్డి సర్కారుకు తిధులు, ముహూర్తాలు, విశ్వాసాలపై నమ్మకం లేదా? ఒకవేళ నమ్మకం లేకపోతే.. మరి మంచి రోజులు చూసుకొని ప్రభుత్వ అధికారిక మీటింగ్‌లు ఎందుకు పెడుతున్నారు? ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణాలు ఎందుకు నిర్వహిస్తున్నారు? అవన్నీ చేసినప్పుడు, విద్యాసంవత్సరం ప్రారంభించే విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త తీసుకుంటే ఏం పోయింది? ప్రజల నమ్మకాలు కేవలం పిల్లల భవిష్యత్తు దగ్గరకు వచ్చేసరికి అనవసరమైపోయాయా?" అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"ఇక్కడ ప్రశ్న 'అమావాస్య చెడ్డ రోజా కాదా' అన్నది కాదు.. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం, అదే ప్రజల పిల్లల విషయంలో మాత్రం ఎందుకు ఆ నమ్మకాలను పక్కన పెడుతుందనేదే అసలు ప్రశ్న. సాధారణంగా మన ఇళ్లలో పెద్దవాళ్లు (అమ్మలు, నాన్నలు) అమావాస్య రోజున పిల్లలను కొత్తగా స్కూలుకు పంపడానికి ఇష్టపడరు. అలాంటిది విద్యాశాఖ ఈ విషయాన్ని ఎందుకు గమనించలేకపోయింది?" అని విద్యార్థుల తల్లీదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి బాధ్యతలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చూస్తున్నారు. ఆయన చుట్టూ ఉండే ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారులు క్యాలెండర్ చూసేటప్పుడు ఈ కనీస విషయాలను, ప్రజా సెంటిమెంట్‌ను ఎందుకు గమనించలేదు? ముఖ్యమంత్రి గారికి వీటి గురించి ఎందుకు వివరించలేదు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అమావాస్యలను నమ్మని వాళ్లు అధికారులుగా ఉంటే ఉండొచ్చు. కానీ సమాజంలో మెజారిటీ ప్రజల భావోద్వేగాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనేది జగమెరిగిన సత్యం.

జీవోపై పునరాలోచన చేస్తారా?
తీవ్రమైన ఎండలు, ఉక్కపోత ఒకవైపు వేధిస్తుంటే.. మరోవైపు ఈ అమావాస్య సెంటిమెంట్ వివాదం తోడైంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తాను జారీ చేసిన జీవో (GO) మీద పునరాలోచన చేస్తుందా లేదా అనేది చూడాలి. కనీసం ఆ ఒక్క రోజు (జూన్ 15) మినహాయించి, మరుసటి రోజు జూన్ 16 లేదా 17 నుండి పాఠశాలలను ప్రారంభించాలని ఉపాధ్యాయ సంఘాలు, పేరెంట్స్ అసోసియేషన్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల నమ్మకాలను గౌరవించి తేదీని మారుస్తుందో లేదో వేచి చూడాలి.

Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..స్కూళ్లకు మరోసారి వరుస సెలవులు..రీఓపెన్ రోజే సెలవు!

Also Read: 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్..ఇలా అప్లే చేయండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Pensions: విద్యుత్ పెన్షనర్ల గోస.. 8 రోజులుగా నిలిచిన పింఛన్లు.. ఆ IAS అధికారిపైనే అనుమానాలు!

Hyderabad, Telangana:

Telangana Power Sector Pensioners: రాష్ట్రంలోని విద్యు శాఖ రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా మారింది. గత 8 రోజులుగా పెన్షన్లు జమ కాకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 2100 మంది విద్యుత్ పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. వృద్ధాప్యంలో మందుల ఖర్చులతో పాటు నిత్యజీవిత అవసరాలకు డబ్బులు లేక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 కోట్లకు పైగా పెన్షన్ నిధులు నిలిచిపోవడంతో పెన్షనర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది.

సాధారణంగా ప్రతినెల ఒకటో తేదీ లేదా అంతకంటే ముందే వచ్చే పెన్షన్.. ఈసారి 8 రోజులు గడుస్తున్నప్పటికీ రాకపోవడం వెనక పెద్ద రాజకీయంతో పాటు పరిపాలనపరమైన వ్యూహం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కమ్ అంశంపై విద్యుత్ పెన్షనర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు... ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ వారు తమ అభిప్రాయాలను బహిరంగంగా పంచుకున్నారు. ఆ నిరసనల పరిణామాల తర్వాతే సరిగ్గా ఈ నెల పెన్షన్ల నిలిపివేత జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది..

ఉన్నతాధికారి టార్గెట్ చేశారా? 
ఈ పెన్షన్ల జాప్యం వెనక విద్యుత్ శాఖలో కీలక చక్రం తిప్పుతున్న ఒక ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారి పాత్ర ఉందని గుసగుసలు కూడా విద్యుత్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. రైతు డిస్కం ప్రతిపాదనను వ్యతిరేకించినందుకు కక్ష సాధింపు చర్యగా.. సదరు ఐఏఎస్ అధికారి కావాలనే ఫైళ్లను తొక్కిపెట్టి నిధుల విడుదల కాకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోందని.. సీనియర్ పెన్షనర్లకు సంబంధించిన కొంతమంది నాయకులు ఆరోపిస్తూ వస్తున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

ఆందోళన బాటలో...
జీవితాంతం సంస్థ కోసం రక్తం చెమట కార్చి పనిచేసిన తమను.. వృద్ధాప్యంలో కూడా ఇలా ఇబ్బందులకు గురి చేయడం దుర్మార్గమని పెన్షనర్లు మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల అంతర్గత పట్టింపులతో పాటు రాజకీయాల కారణాలతో తమ పొట్ట పొట్ట వద్దని వేడుకుంటున్నారు.. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిలిచిపోయిన నూట ఎనభై కోట్ల పెన్షన్ నిధుల విడుదలను చేయాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలతో పాటు ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని పెన్షనర్లకు సంబంధించిన సంఘాలు హెచ్చరిస్తూ వస్తున్నాయి..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Harish Rao: చంద్రబాబుకు డూడూ బసవన్నలా రేవంత్‌ రెడ్డి తలూపుతుండు: హరీశ్‌ రావు

Baddipadaga, Telangana:

Telangana Bhavan: గోదావరికి పూర్తిగా నీటిని మళ్లించి తెలంగాణకు ద్రోహం చేయాలని రేవంత్‌ రెడ్డి చూస్తున్నాడని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు మండిపడ్డారు. ఏపీ కుట్రలను ప్రశ్నించకుండా కాంగ్రెస్ నాయకులు నిశ్శబ్దంగా ఉంటున్నారని చెప్పారు. తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం రేవంత్ రెడ్డి పని చేస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నీ గురువు కోసం తెలంగాణకు ద్రోహం చేస్తున్నావని మండిపడ్డారు.

హైదరాబాద్‌‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తిడితే మేం పడతాం.. కానీ ప్రశ్నిస్తూనే ఉంటామని ప్రకటించారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. గతంలో కృష్ణా, ఇప్పుడు గోదావరి నది నీటి విషయంలో తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన గురువుకు తొత్తుగా మారి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని విమర్శించారు. మమ్మల్ని తిడితే పడతాం కానీ.. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు.

'పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్, పాలమూరుకు అన్యాయం చేస్తున్నాడు. 16 టీఎంసీల కృష్ణా నీళ్లను ఆపుకోమని ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకు క్లియరెన్స్ ఇస్తుంది. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది మన జూరాల ప్రాజెక్టే. అటు కృష్ణాలో అన్యాయం, గోదావరిలో అన్యాయం.. శాశ్వతమైన ద్రోహం మనకు జరుగుతుంది' బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు. బనకచర్ల విషయంలో ప్రశ్నించింది బీఆర్‌ఎస్‌ పార్టీనేనని గుర్తుచేశారు. మిగులు జలాలు లేనప్పుడు ప్రాజెక్టులు ఎలా కడతారని ప్రశ్నించారు. 'గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కొత్తగా అంటున్నారు. పోలవరం నుంచి గోదావరి నీళ్లను ఏపీకి మళ్లించాలని చూస్తున్నారు. పోలవరం నుంచి మళ్లిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 'మా నీళ్లు మాకు ఇవ్వడానికి కొత్త డ్రామాలా?' అని ప్రశ్నించారు.

తెలంగాణ నీటి హక్కులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సోయి లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ చేతగాని ప్రభుత్వంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ఒక్క ప్రాజెక్టుకైనా క్లియరెన్స్ తెచ్చారా అని ప్రశ్నించారు. పోలవరం-కావేరి లింక్ అయ్యాక.. గోదావరి మీద తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తారా? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోరు.. కానీ ఏపీ ప్రయోజనాలు పట్టించుకుంటారా? అని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించిన 90 టీఎంసీలు తెలంగాణ హక్కే. మన నీళ్లను మనం వాడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనవోసీ ఎందుకు అవసరం? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయించబోయే 1050 టీఎంసీలలో తెలంగాణకు 700 టీఎంసీలు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో 90 టీఎంసీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్ఓసీ తీసుకుంటే, ట్రిబ్యునల్ అవార్డులో తెలంగాణ వాటా నుంచి 90 టీఎంసీలు కోత పడుతుంది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

'మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ కూడా ఇవ్వకుండా సీక్రెట్‌గా మీటింగులు పెట్టుకొని.. 167 టీఎంసీలతో బనకచర్ల ప్రాజెక్టు కట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి. ఆ మీటింగులకు తెలంగాణ తరఫున చంద్రబాబు నాయుడు నమ్మిన బంటు ఆదిత్యనాథ్‌దాస్ ఒక్కడే వెళ్తున్నాడు. బాబు కళ్లలో ఆనందం కోసం రేవంత్ తెలంగాణను పట్టించుకుంటలేడు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు.

0
0
Report

Telangana: తెలంగాణకు వాన గండం.. రాబోయే వారం రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Hyderabad, Telangana:

Telangana Rain Forecast: ఎండల తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని శుభవార్త చెప్పేసింది.. రాష్ట్రంలోని ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించడంతో.. రాగల వారం రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో వర్షాలు విపరీతంగా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి.. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది..

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. 
ఋతుపవనాల కదలికలు బలంగా ఉండడంతో సోమవారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేరుకుంది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. ఉత్తర మధ్య తెలంగాణ లోని రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు కరీంనగర్, పెద్దపెల్లి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన.. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, వికారాబాద్ లకు కూడా ఈ అలర్ట్ వర్తిస్తుందని తెలిపింది. దీంతోపాటు దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ నుంచి నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేయడం విశేషం.. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో పాటు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. 
 
గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు..
వర్షం పడే సమయంలో వాతావరణం లో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వారి హెచ్చరించారు. పాత భవనాలతో పాటు హోల్డింగులు, బలమైన చెట్ల కింద ఎవరు ఆశ్రయం పొందవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. అయితే, వర్షాలు పడినప్పటికీ పగటిపూట నమోదయ్యే గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చు అని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

రుతుపవనాల ప్రభావం..
నైరుతి రుతుపవనాల ప్రభావం తెలంగాణపై బలంగా ఉందని.. వారం రోజులపాటు వర్షాలు దంచి కొట్టబోతున్నాయని.. రైతులతో పాటు ప్రయాణికులు వాతావరణ హెచ్చరికలను గమనించి తమ పనులను ప్లాన్ చేసుకోవాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఋతుపవనాల రాకతో సాగు పనులకు సిద్ధమవుతున్న రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ వర్షాలు విత్తనాలు వేయడానికి ఎంతో అనుకూలంగా మారతాయని వ్యవసాయ శాఖ నిపుణులు సైతం చెబుతున్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న హైదరాబాద్ నగరవాసులకు ఈ వాన పెద్ద ఊరట నివ్వబోతోంది..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Alliance PUC: అలయన్స్ పీయూసీలో 'ఇగ్నైట్ 2026–27' ప్రారంభం.. విద్యార్థులకు దిశానిర్దేశం

Bengaluru, Karnataka:

Alliance PUCIGNITE 2026–27: కొత్తగా చేరిన విద్యార్థులకు బెంగళూరులోని అలయన్స్ యూనివర్సిటీలో అలయన్స్ ప్రి యూనివర్సిటీ కాలేజ్ ఇగ్నైట్ 2026–27' పేరిట నూతన విద్యా సంవత్సరానికి నాంది పలికింది. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సంస్థ విద్యా సంస్కృతి, విలువలు, అందుబాటులో ఉన్న అవకాశాల గురించి వివరించింది. విద్యార్థులు విద్యతోపాటు ఇతర అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని అతిథులు, అధ్యాపకులు సూచించారు. విద్యార్థులలో క్రమశిక్షణ, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, నిరంతర అభ్యాసన అలవాట్లను పెంపొందించడంపై అవగాహన కల్పించారు.

ఏపీయూసీ ప్రిన్సిపాల్ డాక్టర్ బీహెచ్ఎస్ తిమ్మప్ప స్వాగతోపన్యాసం చేస్తూ కీలక విషయాలు తెలిపారు. క్రమశిక్షణ, విద్యా నైపుణ్యం, సమగ్ర అభివృద్ధి విద్యార్థుల విజయానికి పునాదులు అని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు పాఠ్యేతర కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని ఊచించారు. అలయన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ (ఇంక్యూబేషన్, ఇన్నోవేషన్)డాక్టర్ రే టైటస్ కీలక ప్రసంగం చేశారు. ఆవిష్కరణలు, సృజనాత్మకత, వ్యవస్థాపక ఆలోచనలను విద్యార్థులు పెంపొందించుకోవాలని చెప్పారు. వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో పట్టుదల, అనుకూలత, నిరంతర అభ్యాసం చాలా ముఖ్యమని గుర్తుచేశారు.

అలయన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి.ప్రిస్లీ షాన్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ లక్ష్యాలను పట్టుదలతో, ఉత్సాహంతో సాధించాలని చెప్పారు. వ్యక్తిత్వ నిర్మాణం, నిరంతర అభ్యాసం చేయాలని సూచించారు. విద్యార్థులు పెద్ద కలలు కనాలని, వాటిని సాధించడానికి నిరంతరం శ్రమించాలని కోరారు. యూనివర్సిటీ విద్యా విధానాన్ని వివరిస్తూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం విశ్వనాథయ్య మాట్లాడుతూ.. విజయానికి మార్గదర్శకాలుగా నిలిచే  లక్ష్యం, ఆచరణ, వైఖరి, సాధన, అంచనా అనే ఐదు సూత్రాలను వివరించారు.

అలయన్స్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ జనరల్ సురేఖ శెట్టి క్యాంపస్‌ అందిస్తున్న సౌకర్యాలు వివరించారు. విద్యాసంస్థ కల్పిస్తున్న విద్యా, సహ-పాఠ్య, పాఠ్యేతర అవకాశాలను విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి దిశగా తీర్చిదిద్దడానికి కట్టుబడి ఉందని తెలిపారు. కొత్తగా చేరిన 180 మంది విద్యార్థుల విద్యా ప్రయాణానికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒక స్పూర్తిదాయకమైన ఆరంభమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీయూసీ అసోసియేట్ డైరెక్టర్ జ్యోతి ఎస్ఆర్ పాల్గొన్నారు.

0
0
Report
Advertisement

Kavitha: అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోకుంటే నన్ను కట్టేసి రాళ్లతో కొట్టండి: కవిత

Sangareddy, Telangana:

Kavitha Politics: తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగ సందర్భంగా పటాన్‌చెరు, సంగారెడ్డిలో పార్టీ అధ్యక్షురాలు కవిత జెండా ఎగురవేశారు. అనంతరం ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. 'పటాన్‌చెరులో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడున్న ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు కావచ్చు. ఆయన బాగా అభివృద్ధి చెందారు తప్ప ప్రజలు మాత్రం అభివృద్ధి చెందలేదు' అని విమర్శించారు.

పటాన్‌చెరుని దోపిడీ
'బీజేపీ ఎంపీ  రఘునందన్ రావు ఇక్కడ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తాడు. అన్ని పార్టీల నాయకులు కలిసికట్టుగా కలిసి పటాన్‌చెరుని దోపిడీ చేస్తున్నారు. పటాన్‌చెరులో ప్రభుత్వ పాఠశాలని బుల్డోజర్లతో కలిసి కూల్చేశారు. అందరూ కలిసి పట్టపగలే స్కూల్ ని కూల్చేసి దోపిడీకి పాల్పడుతున్నారు' అని మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. సంగారెడ్డి అంటే ఆషామాషీ కాదు.. సంగారెడ్డికి తెలంగాణలో ఎంతో ఘన చరిత్ర ఉందని తెలిపారు. 

కొత్త రాజకీయ శక్తిగా అవకాశం
'తెలంగాణలో రకరకాల పార్టీలు ఉన్నాయి. కొత్త పార్టీ అవసరం ఏముందని అడిగితే ఎన్ని పార్టీలు ఉన్న మన ప్రాంతం ఆత్మ కలిగిన పార్టీ మనది అని చెప్పండి' పార్టీ శ్రేణులకు కవిత సూచించారు. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా అవకాశం ఇవ్వాలని.. యువతకు ప్రాతినిధ్యం ఇవ్వాలని పార్టీని పెట్టినట్లు వివరించారు. తెలంగాణలో పరిస్థితి మారాలంటే మార్పు రావాలని.. ఆడబిడ్డగా.. ఒక తల్లిగా తాను అడుగు ముందుకువేసినట్లు వెల్లడించారు.

రాబోయే ఎన్నికల్ల తెలంగాణ రక్షణ సేన పార్టీ అధికారంలోకి వస్తుందని సంగారెడ్డి నుంచి తాను చెబుతున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. 'అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకపోతే ఇదే తెల్లాపూర్‌ శాసనం వద్ద నన్ను కట్టేసి రాళ్లతో కొట్టండి' అని కవిత తెలిపారు. ఇది తాను బాధతో.. దుఃఖంతో చెబుతున్నట్లు పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్య, వైద్యం ఖరీదైందని.. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పరిస్థితి మారలేదని తెలిపారు.

వేర్వేరు పార్టీల్లో ఉన్నా
'సింగూరు ప్రాజెక్టు కుంగుబాటుకు గురవుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదు. సింగూరుపై ఆధారపడి 60 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. హైదరాబాద్‌కు తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు' అని మాజీ ఎమ్మెల్సీ కవిత వివరించారు. 'సంగారెడ్డిలో రాజకీయం బాగా ఉంటుంది. జగ్గారెడ్డి, చింతా ప్రభాకర్‌, రఘునందన్‌ రావు, హరీశ్‌ రావు, దామోదర రాజనర్సింహ ఉంటారు. వీరంతా వేర్వేరు పార్టీల్లో ఉన్నా వారంతా కలిసి ఉంటారు. ఇక్కడ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయాలు నడుస్తున్నాయి' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీ ప్రాంతం, నిమ్జ్‌ ప్రాంతంలో బుల్లెట్‌ ట్రైన్‌ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కొత్తగా వచ్చిన డీపీఆర్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ ఎందుకు లేదు?' అని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావును కవిత నిలదీశారు. 'ఏమైంది రఘునందన్‌ రావు? ఎంపీగా ఉండి డీపీఆర్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ లేకుంటే ఎందుకు మాట్లాడడం లేదు. నోటికి ఎందుకు తాళం వేసుకున్నారు?' అని ప్రశ్నించారు. జహీరాబాద్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చేదాకా తాము కొట్లాడుతామని ప్రకటించారు.

మంత్రి బావమరిది 200 ఎకరాలు కబ్జా
'దామోదర రాజనర్సింహ బావమరిది సింగూరు ప్రాజెక్టు కింద 200 ఎకరాల భూమి కబ్జాకు పాల్పడుతున్నారు' అని మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. 'దీనిపై ఎవరూ ప్రశ్నించడం లేదు. ఎందుకు? అని నిలదీశారు. వీటన్నింటిపై పోరాడుతామని ప్రకటించారు. తాము ప్రకటించిన పాంచజన్యం హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పక నెరవేరుస్తామని కవిత ప్రకటించారు.

0
0
Report

EPF e-Nomination: పీఎఫ్ ఖాతాదారులు చేసే ఆ ఒక్క చిన్న తప్పు.. కుటుంబానికి భారీ నష్టం.. ఈ పని ఇప్పుడే పూర్తి చేయండి..!!

BBhoomi8h ago
Lakshmapur, Telangana:

E-Nomination: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 1952 ఈపీఎఫ్ స్కీమ్  నిబంధనల ప్రకారం..ఈపీఎఫ్ సభ్యులందరికీ ఇ-నామినేషన్‌ను తప్పనిసరి చేసింది. చెల్లుబాటు అయ్యే నామినేషన్ ఉండటం వలన, సభ్యుడు మరణించిన సందర్భంలో నామినీకి ఈపీఎఫ్ఓ బెనిఫిట్స్ అందేలా చేస్తుంది.  నామినీని జోడించే సౌకర్యం EPFO ​​పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. PF ఖాతాదారులు తమ ఇంట్లో నుంచే నామినేషన్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఇ-నామినేషన్ సకాలంలో ఇ-సంతకం చేస్తేనే.. చెల్లుబాటు అవుతుంది.

మీరు మీ PF ఖాతాకు నామినీని చేర్చి, ఇ-సంతకం పెట్టడం మర్చిపోయినట్లయితే..  ఆ ప్రక్రియ పూర్తి కానట్లే.  దీనివల్ల నిధులు అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. EPF ఇ-నామినేషన్ పత్రం ప్రకారం, ఒకవేళ సభ్యుడు మరణిస్తే, కేవలం దాఖలు చేసి, సంతకం చేయని PDF ఇ-నామినేషన్‌ను ప్రాసెస్ చేయరు.

మీ EPF ఇ-నామినేషన్‌పై ఇ-సంతకం ఎలా చేయాలి?
EPF ఇ-నామినేషన్‌ను ధృవీకరించడానికి, సభ్యులు ఇ-సంతకం ప్రక్రియను పూర్తి చేయాలి. నామినీ వివరాలను సమర్పించిన తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుస్తోంది. 

దశ 1: EPFO ​​సభ్యుల పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి

దశ 2: 'నిర్వహణ' ట్యాబ్‌కు వెళ్లి, ఆపై 'ఇ-నామినేషన్'ను ఎంచుకోండి.

దశ 3: 'ఇ-సైన్' లింక్‌పై క్లిక్ చేసి, తదుపరి పేజీలో చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి.

దశ 4: రెండు ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోండి.

ఆధార్ సంఖ్య/వర్చువల్ ID (VID)

5వ దశ: మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడిని నమోదు చేసి, వెరిఫై బటన్‌ను నొక్కండి.

6వ దశ: సభ్యుని ఆధార్ అనుసంధానిత మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడుతుంది.

7వ దశ: OTPని ఎంటర్ చేసి, ఆపై సబ్మిట్ బటన్‌ను నొక్కండి

OTP ధృవీకరించబడిన తర్వాత, నామినేషన్ వివరాలు EPFO ​​డేటాబేస్‌లో భద్రపరచబడతాయి మరియు ఇ-నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

16-అంకెల ఆధార్ వర్చువల్ ఐడి (VID)ని ఎలా రూపొందించాలి

ఇ-సైనింగ్ కోసం వర్చువల్ ఐడిని ఉపయోగించాలనుకునే సభ్యులు ఈ క్రింది దశలను అనుసరించి UIDAI వెబ్‌సైట్ నుండి దానిని సృష్టించుకోవచ్చు:

మొదటి దశ: UIDAI వెబ్‌సైట్ uidai.gov.in ను సందర్శించండి.

దశ 2: ఆధార్ సేవల క్రింద ఉన్న 'వర్చువల్ ఐడి (VID) జనరేటర్' పై క్లిక్ చేయండి

దశ 3: మీ 12 అంకెల ఆధార్ నంబర్ మరియు క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి

దశ 4: 'OTP పంపండి' పై క్లిక్ చేసి, ఆపై నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి

5వ దశ: కింది వాటిలో ఒకదాన్ని ఎంచుకోండి:

Also Read: Maruti Suzuki June Offers: జూన్‌లో కారు కొంటున్నారా? Nexa మోడల్స్ పై రూ. 2.15 లక్షల వరకు భారీ డిస్కౌంట్..!!

కొత్త VIDని క్రియేట్  చేసుకోండి / లేదంటే ఉన్న VIDని పొందండి

ఈ దశలన్నీ పూర్తి చేసిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు 16 అంకెల వర్చువల్ ఐడి వస్తుంది. అయితే సభ్యులు ఒక విషయాన్ని గమనించాలి. వారు ఇప్పటికే ఒక VIDని కలిగి ఉన్నట్లయితే.. ఆ తర్వాత మరొకటి క్రియేట్ చేస్తే.. కొత్త VID మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కొత్త VID క్రియేట్ చేసిన  తర్వాత మీరు పాత VIDని ఎంటర్ చేస్తే, ఆ VID ఇన్ వ్యాలిడ్ అనే మెసేజ్ వస్తుంది. 

EPF నామినేషన్ నియమాలు:
EPF-EPS లకు నామినేషన్ నియమాలు వేర్వేరుగా ఉంటాయి. EPF చట్టం ప్రకారం, కుటుంబం అంటే.. పురుష ఉద్యోగులకు , వారి భార్య, పిల్లలు (వివాహితులు లేదా అవివాహితులు), వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు, కుమారుని వితంతువు,  పిల్లలు కుటుంబంగా పరిగణిస్తారు. మహిళా ఉద్యోగి విషయంలో..అయితే.. ఆమె భర్త, పిల్లలు (వివాహితులు లేదా అవివాహితులు), ఆమెపై ఆధారపడిన తల్లిదండ్రులు, భర్తపై ఆధారపడిన తల్లిదండ్రులు, కొడుకు వితంతువు, పిల్లలు కుటుంబంగా పరిగణిస్తారు. 

EPS అయితే  కుటుంబం అంటే  ఉద్యోగి   భార్య/భర్త, ఉద్యోగి   మైనర్ కుమారుడు లేదా కూతురు,   దత్తపుత్రుడు లేదా కుమార్తె నామినీగా పరిగణిస్తారు. 

Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది! ఈసారి 'దశావతారమే' అంటూ నాగ్ వీడియో రిలీజ్!

Hyderabad, Telangana:

Bigg Boss 10 Telugu Promo: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' సరికొత్త మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు విజయవంతంగా 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన 10వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. ఇటీవల ముగిసిన 9వ సీజన్‌లో కామన్ మెన్ కేటగిరీ నుంచి వచ్చిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ మా విడుదల చేసిన బిగ్ బాస్ సీజన్ 10 అఫీషియల్ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

హోస్ట్ ఎవరంటే..!
ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారనే ఉత్కంఠకు తెరదించుతూ.. కింగ్ నాగార్జున తనదైన స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఎనర్జీతో ప్రోమోలో ప్రత్యక్షమయ్యారు. 'నాగ్ సార్‌కి మేము కల్ట్ ఫ్యాన్స్' అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌తో సాగిన ఈ ప్రోమోలో నాగార్జున హోస్టింగ్ హైలైట్‌గా నిలిచింది.

"బిగ్ బాస్ అంటే ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం" అంటూ నాగ్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్లో జోష్ నింపాయి. అయితే ఈ మహా సామ్రాజ్యాన్ని రూల్ చేసేది తాను కాదని, బిగ్ బాస్‌ను అమితంగా ప్రేమించే అభిమానులేనని ఆయన స్పష్టం చేశారు.

ఈసారి ప్రోమోను కాస్త విభిన్నంగా, ప్రజలకు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. సాధారణ సెలూన్ షాపుల నుండి హైటెక్ ఐటీ ఆఫీసుల వరకు.. ఇళ్లలోని కుటుంబ సభ్యులందరూ బిగ్ బాస్ కోసం ఎంతగా ఎదురుచూస్తారో ఇందులో చూపించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదొక డైలీ డోస్ ఎంటర్టైన్‌మెంట్‌గా మారిందని.. సరికొత్త ఎమోషన్స్, గొడవలు, నవ్వులతో ఈ షో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతుందని హింట్ ఇచ్చారు.

ప్రోమో చివర్లో నాగార్జున చెప్తూ.. "ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతోంది. ఈ సారి మీరు చూడబోయేది బిగ్ బాస్ 'దశావతారం'. ఈ సారి  ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్!" అంటూ షోపై అంచనాలను భారీగా పెంచేశారు. కింగ్ నాగ్ మార్క్ ఎనర్జీతో ఉన్న ఈ 'కమింగ్ సూన్' ప్రోమో చూస్తుంటే, ఈ సారి కంటెస్టెంట్ల ఎంపిక, టాస్కులు మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ పదో సీజన్ త్వరలోనే గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

Also Read: జీ స్టూడియోస్‌లో సినిమా ఛాన్స్..! విజేతలకు రూ.5 లక్షల బహుమతి!

Also Read: స్వర్గానికి దారి చూపిస్తానంటూ ఊరిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి..జిమ్‌లో అందాల ఆరబోత!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Talliki Vandanam 2026: 'తల్లికి వందనం' నిధుల విడుదల తేదీ మార్పు! అకౌంట్లోకి డబ్బులు పడేది ఆ రోజే!

Vijayawada, Andhra Pradesh:

Talliki Vandanam List 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదల తేదీపై కీలక అప్‌డేట్ వచ్చింది. స్కూళ్లు, ఇంటర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ కావాల్సిన ఈ ఏడాది నిధుల విడుదల కాస్త ఆలస్యం కానుంది. ముందుగా అనుకున్న తేదీ కంటే వారం రోజులు ఆలస్యంగా, జూన్ 19న ఈ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

తేదీ మారడానికి ప్రధాన కారణం ఇదే!
1) పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం స్కూళ్ల నుండి సేకరించిన విద్యార్థుల డేటాను నిశితంగా పరిశీలించడానికి సచివాలయాలకు పంపారు.

2) ప్రభుత్వం ఈసారి కఠినమైన గైడ్‌లైన్స్ జారీ చేయడంతో, నిబంధనల ప్రకారం లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో అధికారులు అత్యంత పారదర్శకంగా తనిఖీ చేస్తున్నారు.

3) ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న డేటాను పరిశీలించి, తుది జాబితాను ఖరారు చేయడానికి మరింత సమయం పడుతోంది.

రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం కొత్త విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానుంది. అయితే పాఠశాలలు తెరిచే రోజే ఈ నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, పైన పేర్కొన్న సాంకేతిక, పరిశీలన ప్రక్రియల కారణంగా జూన్ 12న నిధుల విడుదల సాధ్యం కావడం లేదు.

తాజా సమాచారం ప్రకారం.. జూన్ 19న తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయి, అర్హుల తుది జాబితా సిద్ధమైన వెంటనే దీనిపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది. జూన్ 19 లేదా ఒక రోజు అటుఇటుగా నిధుల జమ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా చూపిస్తూ మహిళకు సర్జరీ..ఏపీలో బ్రెయిన్ సర్జరీ సక్సెస్!

Also Read: టీచర్లు, క్లాస్‌రూమ్‌లు లేని సరికొత్త 'స్కూల్ 21'లో నారా లోకేష్, శ్రీకృష్ణ దేవరాయలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Kondagattu: కొండగట్టు ఆలయంలోకి.. తుపాకీతో లోపలికి వెళ్లిన మాజీ మంత్రి సెక్యూరిటీ!

Hyderabad, Telangana:

Kondagattu Temple Security Breach Latest News: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో శనివారం తీవ్ర కలకలం రేగింది.. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలతో లోపలికి ప్రవేశించడంపై భక్తులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మాజీమంత్రి అల్లోల ఇంద్రకీరణ్ రెడ్డి పర్యటనలు చోటు చేసుకున్న ఈ భద్రతా లోపం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయుధాలతో హనుమాన్ మందిరంలోకి వెళ్లడానికి గల కారణాలేంటి? ఈ అంశానికి సంబంధించిన అన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కుటుంబ సమేతంగా మాజీ మంత్రి పూజలు..
మాజీ మంత్రి అల్లోల ఇంద్ర కిరణ్ రెడ్డి శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.. అనంతరం ఇంద్రకీరణ్ రెడ్డి స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ ఆయనకు.. ఆయన కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు..

తుపాకీతో ప్రవేశం..
ఈ పర్యటన అంతా బాగానే సాగుతున్న సమయంలో.. మాజీ మంత్రి వెంట వచ్చిన వ్యక్తిగత భద్రత సిబ్బంది ఒకరు తన అధికారిక తుపాకీతో నేరుగా ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించారు.. కొండగట్టు అంజన్న క్షేత్ర నిబంధనల ప్రకారం ఆలయ ప్రాంగణంలోకి ఎలాంటి ఆయుధాలతో పాటు నిషిద్ధ వస్తువులను తీసుకురాకూడదు.. అంతేకాకుండా కొన్ని రకాల ఐరన్ వస్తువులను కూడా తీసుకురాకూడదని నిబంధనలో ఉన్నట్లు తెలుస్తోంది..

భద్రత సిబ్బంది వెపన్తో గర్భాలయ పరిసర ప్రాంతాల్లో.. తిరుగుతున్నప్పటికీ ఆలయ అధికారులతో పాటు భద్రత సిబ్బంది కనీసం పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. సాధారణ భక్తులను తనిఖీల పేరుతో గంటల తరబడి ఇబ్బందులు పెట్టే అధికారులు.. రాజకీయ నాయకులు వస్తే మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతారా? ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అని అక్కడున్న పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

అధికారులు నిర్లక్ష్యం పై విమర్శలు..
ఇటీవల కాలంలో ఆలయ భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం అధికారుల నిర్లక్ష్యానికి అడ్డం పడుతుందని భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. వీఐపీల పర్యటనల సమయంలో నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింపజేయాలని.. ఆలయ ప్రాంగణంలోకి ఆయుధాలతో ప్రవేశించిన భద్రత సిబ్బందిపై.. దానికి బాధ్యులైన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులతో పాటు అంజన్న భక్తులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Lpg Price: సంక్షోభంలోనూ సామాన్యుడికి ఊరట.. అమెరికా, పాకిస్తాన్ల కంటే మన దేశంలోనే చాలా తక్కువ ధరకే వంటగ్యాస్ సరఫరా..!!

BBhoomi9h ago
Lakshmapur, Telangana:

 Lpg Price: మిడిల్ ఈస్ట్ లో నెలకున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం దేశీయ వినియోగదారులపై ఆ భారం పడకుండా కాపాడుతోంది.  సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య సుమారు 46శాతం పెరగడంతో ప్రస్తుతం ఒక గ్యాస్ సిలిండర్ అసలు సరఫరా ఖర్చు రూ. 1600 దాటిపోయింది. అయినా కూడా సామాన్యులకు భద్రత కల్పిస్తూ సాధారణ వినియోగదారులకు 942 రూపాయలకే సిలిండర్ అందిస్తోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు లభించే అదనపు సబ్సిడీ వల్ల వారు కేవలం రూ. 642 కే సిలిండర్ పొందుతున్నారు. మన పొరుగు దేశాలు అయిన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి అభివ్రుద్ధి చెందిన దేశాల కంటే కూడా భారత్ లోనే వంటగ్యాస్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. 

ప్రభుత్వ గణాంకాల ప్రకారం..  ప్రస్తుతం ఒక గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్ సరఫరా ఖర్చు రూ. 1,600 దాటింది. అయినప్పటికీ, సాధారణ వినియోగదారులకు సిలిండర్లు రూ. 942కే అందుబాటులో ఉంచుతున్నారు. అంటే, వినియోగదారులు కాకుండా ప్రభుత్వం,  చమురు కంపెనీలే ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ. 700 భారాన్ని మోస్తున్నాయి. నగరాలను బట్టి పంపిణీ ఖర్చులు కొద్దిగా మారవచ్చు.  కానీ మొత్తమ్మీద, గృహ వినియోగదారులకు మార్కెట్ ధర కంటే గణనీయంగా తక్కువ ధరకే గ్యాస్ అందుతోంది.

భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్ పోకడలచే ప్రభావితమవుతాయి. ఎల్పీజీ విషయంలో, దేశం తన అవసరాలలో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి చేసుకున్న ఎల్పీజీ ధర ప్రధానంగా సౌదీ అరామ్కో నిర్దేశించిన సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్  పై ఆధారపడి ఉంటుంది. అయితే, అంతర్జాతీయ ధరలు పెరిగినప్పటికీ, దేశీయ వంటగ్యాస్ ధరలలోని పూర్తి పెరుగుదల వినియోగదారులకు బదిలీ కాలేదు. ఈ కారణంగానే దేశీయ సిలిండర్ ధరలు మార్కెట్ ధరల కంటే గణనీయంగా తక్కువగా ఉంటాయి.

Also Read: Maruti Suzuki June Offers: జూన్‌లో కారు కొంటున్నారా? Nexa మోడల్స్ పై రూ. 2.15 లక్షల వరకు భారీ డిస్కౌంట్..!!

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధిలో అంతరాయాలు ప్రపంచ ఎల్‌పిజి మార్కెట్‌పై కూడా ప్రభావం చూపాయి. ఫిబ్రవరిలో సౌదీ ప్రామాణిక ఎల్‌పిజి ధర టన్నుకు సుమారు $543గా ఉండగా, ప్రాంతీయ సంక్షోభం తర్వాత అది గణనీయంగా పెరిగింది.  ఏప్రిల్‌లో ధర టన్నుకు $775కు పెరగగా, జూన్‌లో అది దాదాపు టన్నుకు $790కి చేరుకుంది. ఫిబ్రవరితో పోలిస్తే అంతర్జాతీయ ఎల్‌పిజి బెంచ్‌మార్క్‌లో ఇది దాదాపు 46 శాతం పెరుగుదలను సూచిస్తుంది, దీనివల్ల దిగుమతి ఖర్చులు గణనీయంగా పెరిగాయి.

ప్రభుత్వం ప్రకారం, పశ్చిమ ఆసియాలో సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ, ఇంధన దిగుమతులు, సరఫరాలు సజావుగా సాగిన కొద్ది దేశాలలో భారతదేశం ఒకటిగా నిలిచింది. హోర్ముజ్ జలసంధిలో సవాళ్లు ఎదురైనప్పటికీ, దేశం పెట్రోలియం ఉత్పత్తుల కొరతను ఎదుర్కోలేదు.  భారతదేశంలో గృహ వంటగ్యాస్ ధరలు పొరుగు దేశాల కంటే తక్కువగా ఉండటమే కాకుండా, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా,  కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా గణనీయంగా చౌకగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. పెరుగుతున్న ప్రపంచ ఖర్చులు,  భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, వినియోగదారులకు ఉపశమనం అందించడానికి సబ్సిడీలు,  ధరల నియంత్రణలు కొనసాగిస్తోంది. 

కాగా దేశీయ ఎల్పీజీ ధరలు జూన్ 7వ తేదీన రూ. 29 పెరిగాయి. 3 నెలల్లో దేశీయ గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి. అయినప్పటికీ, వంటగ్యాస్ అమ్మకాలలో భారతదేశం అత్యంత చౌకైన దేశాలలో ఒకటిగా ఉందని ప్రభుత్వం చెబుతోంది.

Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report
Advertisement
Advertisement
Back to top