కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి సుడా అధ్యక్షుడు కేటీఆర్పై మండిపడ్డారు
Karimnagar, Telangana:కరీంనగర్ జిల్లా ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ ఆత్మగౌరవంతో బాధపడుతున్నారని, కొన్నిసార్లు తుపాకి రాముడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పడంలో భాగంగానే డిస్కో డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్లు చేయవద్దని మంత్రి నరేంద్రరెడ్డి చెప్పడంతో చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయన్నారు జరిగింది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Tariff Price Hike: మొబైల్ వినియోగదారులకు భారీ షాక్? భారీగా పెరగనున్న రీచార్జ్ ప్లాన్ల ధరలు
Wadgaon, Maharashtra:Tariff Price Hike: ఇప్పటికే అన్నీ ధరలు పెరిగిపోతుండడంతో సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్తోపాటు గ్యాస్ ధరలు పెరుగుతున్న వేళ ప్రజల నెత్తిపై మరో భారీ భారం పడబోతున్నది. జీవితంలో నిత్యావసరంగా మారిన మొబైల్ ఫోన్కు సంబంధించిన ధరలు భారీగా పెరగనున్నాయి. టెలికామ్ సంస్థలు భారీగా తమ టారిఫ్ చార్జీల ధరలు పెంచబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. మొబైల్ రీఛార్జ్ల భారం పెద్ద ఎత్తున పడబోతుందనే వార్తతో మొబైల్ఫోన్ వినియోగదారుల్లో ఆందోళన ఏర్పడింది.
టెలికాం వినియోగదారులకు త్వరలోనే భారీ షాక్ తగలబోతున్నది. మరోసారి మొబైల్ రీఛార్జ్ల భారం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ధరలను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. టారిఫ్లను సుమారు 10 శాతం మేర పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్కెట్ విశ్లేషకులు, బ్రోకరేజ్ సంస్థలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. టారిఫ్ ఛార్జీల పెంపుపై యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో 15 నుంచి 20 శాతం చొప్పున భారీగా టారిఫ్ ధరలు పెంచగా.. ఈసారి ఆ స్థాయిలో లేకపోయినా భారీగానే పెరగనున్నాయని చెప్పారు. ఈసారి పరిమిత స్థాయిలో ధరల సవరణ ఉండే అవకాశం ఉందని ఓ ఆంగ్ల ప్రధాన మీడియాతో పంచుకున్నారు.
టారిఫ్ ధరల పెంపుతోనే టెలికాం రంగంలో ఆదాయ వృద్ధిపై ఆధారపడడం లేదని యాక్సిస్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరవ్ మల్హోత్రా తెలిపారు. అధిక డేటా ప్రయోజనాలు, 5జీ సేవలు, ప్రీమియం ప్లాన్లపై వినియోగదారులు దృష్టిసారిస్తుండడంతో వారి నుంచి వచ్చే సగటు ఆదాయం సహజంగానే పెరుగుతోందని వివరించారు. టారిఫ్ పెంపు లేకుండానే ఏఆర్పీయూ ఏటా 4 నుంచి 5 శాతం మేర పెరుగుతోందని చెప్పారు. ధరలు పెరుగుతున్నా వినియోగదారుల నుంచి వ్యతిరేకత లేకపోవడంతో టెలికామ్ సంస్థలు ఛార్జీల పెంపుపై ఆసక్తి కనబరుస్తున్నాయి. 5జీ సేవల వినియోగం పెరగడం, అధిక విలువ కలిగిన ప్లాన్లకు మారుతున్న కస్టమర్ల సంఖ్య పెరుగుతుండడంతో టెలికాం కంపెనీలకు ఆదాయం పెరుగుతోంది. దీంతో భారీ ధరల పెంపు ప్రభావం వినియోగదారులపై కనిపించడం లేదని విశ్లేషకులు గౌరవ్ మల్హొత్రా పేర్కొన్నారు.
బ్రోకరేజ్ సంస్థలు కూడా టారిఫ్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయిని అంచనా వేశాయి. టెలికాం టారిఫ్ల పెంపుపై బ్రోకరేజ్ సంస్థలు ఇప్పటికే తెలిపారు. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన సంస్థలు 10 నుంచి 15 శాతం వరకు టారిఫ్లను పెంచవచ్చని జెఫరీస్ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. టారిఫ్ ఛార్జీల పెంపుపై కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా ఇప్పటివరకు ఏ టెలికాం సంస్థ ధరల పెంపును ప్రకటించలేదు. టారిఫ్ ఛార్జీలు పెంచాలంటే టెలికాం కంపెనీలు, మార్కెట్ పరిస్థితులు, పోటీ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
Revanth Reddy: పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం: రేవంత్ రెడ్డి
Mahbubnagar, Telangana:Palamuru Lift Irrigation Scheme: 'మన భూములకు సాగునీళ్లు రాలేదు.. మన కష్టాలు తీరలేదు. దొంగలకు సద్దులు మోసెటోళ్లు నిన్నమొన్న పాదయాత్ర చేస్తామని మాట్లాడుతున్నారు. పాదయాత్ర కాదు.. కాశీదాక పొర్లు దండాలు పెట్టినా మీరు చేసిన పాపాలు తొలిగిపోవు' అని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు జిల్లాలో 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలనే సంకల్పంతో పని చేస్తున్నామని తెలిపారు.
Also Read: Palamuru Projects: పాలమూరులో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. లేకుంటే చరిత్ర క్షమించదు: రేవంత్ రెడ్డి
జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రెండురోజులుగా జిల్లా రైతులకోసం సాగునీరు ప్రాజెక్టులను పరిశీలించా. వలసల కష్టాలు, ఆత్మహత్యల నష్టాలు మనకు తెలుసు. పాలమూరులో ఊరు లేకపోయినా.. పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వలసవచ్చిన కొందరిని ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఒక తల్లిగా ఇక ఏ తల్లికి గుండెకోత ఉండొద్దని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు' అని రేవంత్ రెడ్డి వివరించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు.
'పదేళ్లలో కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్… ఉద్దండపూర్ మునిగితే 800 కోట్లు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నిర్వాసితులను జైల్లో పెట్టి కొట్టించాడు' అని వివరించారు. అందుకే మట్టికి పోయినా మనోడే పోవాలని పెద్దలు చెప్పారని.. పాలమూరు బిడ్డగా జిల్లాలో ప్రాజెక్టుల కోసం ఈ 30 నెలల్లో రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. 'జైళ్లు కట్టాలని వాళ్లు అనుకుంటే స్కూళ్లు కట్టాలని మనం అనుకున్నాం. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నాం. చదువొక్కటే మీ జీవితాల్లో వెలుగు నింపుతుంది. పిల్లల్ని చదివించండి.. చదువుకుంటేనే బతుకులు బాగుపడతాయి' అని పేర్కొన్నారు.
ప్రాజెక్టులు పూర్తి కావాలి
'జిల్లాల్లో వలసలు ఆగాలన్నా, రైతులు సంతోషంగా ఉండాలన్నా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇందిరమ్మ ఇల్లు లేని గూడేలు లేవు. పాలమూరు ప్రజలు మట్టి తీసుడే కాదు మట్టితో కప్పడం కూడా తెలుసు' అని తెలిపారు. పాలమూరు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని ప్రకటించారు. జిల్లాలో ఒక్కరిని కూడా ఎమ్మెల్యేగా గెలవనీయం అని శపథం చేశారు. 'రేవంత్ రెడ్డి ఏం చేసిండని కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారు. 15 లక్షల రేషన్ కార్డులు అందించాం. 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాం. రూ.పది వేల కోట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు చేశాం' అని చిట్టా వివరించారు.
అడుగుతాం…కడుగుతాం
'గోదావరి జలాలపై చర్చిద్దామంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దాగుడుమూతలాడుతున్నారు. బీజేపీ నాయకులు తప్పించుకు తిరుగుతున్నారు. ఎన్నాళ్లు తప్పించుకు తిరుగుతారు? ఎవరు దాగుడుమూతలాడినా, తప్పించుకు తిరిగినా అడుగుతాం…కడుగుతాం.. తుమ్మిడిహెట్టి కట్టి తీరుతాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మీరు బురద చల్లినా, తలకిందులుగా తపస్సు చేసినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి 90 టీఎంసీలకు ఒప్పించే బాధ్యత తనదని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేసే బాధ్యత తనదని తెలిపారు. 'పాలమూరు బిడ్డలు అప్రమత్తంగా ఉండాలి… దొంగలు వస్తారు… దోపిడీదారులు వస్తారు. దొంగలకు సద్దులు మోసెటోళ్లతో జాగ్రతగా ఉండండి. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారం. 2029లో కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం' అని రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
Sharmila Rajya Sabha: వైఎస్ షర్మిళకు కాంగ్రెస్ మొండిచేయి..పార్టీని విలీనం చేసినా నో ఛాన్స్!
Hyderabad, Telangana:Sharmila Rajya Sabha News: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.. అది కాంగ్రెస్ పార్టీలో అయితే మరీ కష్టం! వైఎస్ఆర్ కూతురు అనే బ్రాండ్ ఇమేజ్, సొంత పార్టీ (YSRTP) వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసినప్పుడు లభించిన హామీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో ఉన్న అత్యంత ఆప్తబంధం.. ఇవేవీ చివరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పార్లమెంట్కు పంపించలేకపోయాయి. కర్ణాటక కోటా నుంచి రాజ్యసభ రేసులో నిలిచిన షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం గట్టి షాకే ఇచ్చింది.
'ఢిల్లీ' రాయబారం విఫలం!
రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి షర్మిల పేరు కర్ణాటక స్థానానికి ప్రముఖంగా వినిపించింది. "నాకు ఇచ్చిన హామీ గుర్తుంది కదా.. రాజ్యసభ సీటు ఇవ్వాలి" అంటూ వారం రోజుల క్రితమే ఆమె అధిష్టానానికి గుర్తు చేశారు. నేరుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్లను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఇటీవల హైదరాబాద్లో ఖర్గే సైతం షర్మిలకు రాజ్యసభ హామీ ఉందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. ఏపీలో పార్టీ గొంతుకను పార్లమెంట్లో బలంగా వినిపించాలంటే తనకు ఈ అవకాశం ఇవ్వాలని షర్మిల భావించారు. కానీ, తాజాగా విడుదలైన కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల తుది జాబితాలో ఆమె పేరు లేకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
విలీన హామీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ వెనక్కి తగ్గడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కర్ణాటక స్థానాన్ని పొరుగు రాష్ట్ర నేతకు కేటాయించడంపై అక్కడి కాంగ్రెస్ స్థానిక నాయకత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. స్థానికేతరులకు ఇస్తే క్యాడర్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అధిష్టానాన్ని హెచ్చరించారు.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. షర్మిల కేవలం వైఎస్ జగన్ను టార్గెట్ చేయడానికే పరిమితమయ్యారని, కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఆశించిన స్థాయిలో పోరాటాలు చేయలేదనే ఫిర్యాదులు ఢిల్లీకి చేరాయి. ఏపీ కాంగ్రెస్లోని కొందరు సీనియర్ నేతలతో షర్మిలకు సఖ్యత లేకపోవడం కూడా ఆమెకు మైనస్గా మారింది. జాతీయ స్థాయిలో పార్టీ అవసరాల దృష్ట్యా ఏఐసీసీ మీడియా ఇంచార్జ్ పవన్ ఖేరా వంటి కీలక నేతలకు అవకాశం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.
తదుపరి వ్యూహం ఏంటి?
ప్రస్తుతం షర్మిల బెంగళూరులోనే ఉన్నారు. డీకే శివకుమార్తో భేటీ అయినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సీటు దక్కనందుకు అధిష్టానాన్ని ప్రశ్నించడం కంటే.. ప్రస్తుతానికి వివాదాలకు దూరంగా ఉంటూ ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపైనే ఆమె దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 'సరే.. ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి!' అన్న చందంగా సాగుతోంది ప్రస్తుత షర్మిల రాజకీయ ప్రస్థానం.
Also Read: నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త! SBI బ్యాంకులో 7,150 ఉద్యోగాలు..నెలకు జీతం ఎంతంటే?
Also REad: వెండి కొనే వారికి బ్యాడ్న్యూస్..భారీగా పెరగనున్న వెండి ధరలు..కేంద్రం ఝలక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Palamuru Projects: పాలమూరులో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. లేకుంటే చరిత్ర క్షమించదు: రేవంత్ రెడ్డి
Mahbubnagar, Telangana:Palamuru Pending Projects: పాలమూరులోని ప్రతి ఇంచు సాగునీటితో తడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతలతోపాటు మరికొన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి కావాలంటే..
రూ.55 వేల కోట్లు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. వాళ్లు (బీఆర్ఎస్ పార్టీ) 50 శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా.. 90 శాతం పనులు పూర్తి చేయడం ఎలా సాధ్యం? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
'రూ.27 వేల కోట్లు పంపులు, లిఫ్ట్లకే ఎక్కువ ఖర్చు చేశారు. ప్రజలు అమాయకులు కాదు.. అన్నీ గమనిస్తున్నారు. భూసేకరణ పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డి పనులు పూర్తి చేస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తక్కువ భూసేకరణతో ఎక్కువ నీరు నిల్వ చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కర్ణాటక తరహాలో బ్రిడ్జి కమ్ బ్యారేజీలపై దృష్టి పెట్టామని చెప్పారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. కేసీఆర్కు ఊడిగం చేయడం మాని జిల్లా అభివృద్ధికి అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. భూసేకరణను అడ్డుకునేలా వ్యవహరించొద్దని సూచించారు. భూసేకరణను అడ్డుకునేలా వ్యవహరించొద్దని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడకుండా ఉంటే అదే పెద్ద సాయం అని పేర్కొన్నారు. తనపై కోపంతో కొడంగల్ ఎత్తిపోతలను తొక్కిపెట్టారని రేవంత్రెడ్డి తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అత్యంత కీలకమని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. 90 టీఎంసీల నీళ్లతో 26 లక్షల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని.. సాగునీటితో పాటు పరిశ్రమలకూ పెద్ద ప్రయోజనం చేకూరేది అని వివరించారు. 'బీఆర్ఎస్ పార్టీ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారు. కమీషన్లు దండుకుని ఎక్కడి పనులు అక్కడే వదిలేశారు' అని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు
'బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కనీసం భూసేకరణ కూడా చేయలేదు' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పంపులు, లిఫ్టుల్లో జరిగిన అవినీతిపై నాగం జనార్ధన్ రెడ్డి పోరాటం చేశారని తెలిపారు. పాలమూరులో ఏ ఒక్క ప్రాజెక్టును బీఆర్ఎస్ పూర్తి చేయలేదని చెప్పారు. కష్టకాలంలో ఆదుకున్న పాలమూరును తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బీఆర్ఎస్ నాయకులకు నరనరాన అబద్దం జీర్ణించుకుపోయింది' అని మండిపడ్డారు.
మనకెందుకు శ్రమ
ఇటీవల పవన్ కల్యాణ్ వ్యవహారంపై తీవ్ర దుమారం రేపగా.. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఇష్టపడలేదు. 'పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.. మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారు. ఇక మనకెందుకు శ్రమ' అని చెప్పి ముగించారు.
CM Vijay Trisha: హీరోయిన్ త్రిషకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన సీఎం విజయ్..ఉపఎన్నికలో స్టార్ హీరోకి ఎమ్మెల్యే సీటు!
Nagalapuram, Tamil Nadu:Trisha Raghava Lawrence: తమిళనాట రాజకీయాలు, సినిమా పుకార్లు ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతుంటాయి. దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, తన 'టీవీకే' (TVK) పార్టీతో అఖండ విజయం సాధించి సీఎం పీఠాన్ని అధిరోహించినప్పటి నుంచి.. హీరోయిన్ త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా మారుమోగుతోంది. ఈ క్రమంలో హీరోయిన్ త్రిష త్వరలోనే రాజకీయాల్లో నెక్ట్స్ లెవెల్కు వెళ్తుందని ప్రచారం సాగింది. కానీ, తాజా సమాచారం ప్రకారం విజయ్ ఆమెకు షాక్ ఇచ్చి, ఆ స్థానంలోకి మరో స్టార్ హీరోను రంగంలోకి దించుతున్నట్లు తమిళ పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
తిరుచిరాపల్లి సీటు కథేంటి?
విజయ్, త్రిషల మధ్య 'సమ్ థింగ్ సమ్ థింగ్' అంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి త్రిష ఆయనతోనే ఎక్కువగా కనిపిస్తుండటంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. విజయ్ రెండు నియోజకవర్గాల్లో విజయం సాధించగా.. ఆయన తన తిరుచిరాపల్లి స్థానానికి రాజీనామా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ తిరుచిరాపల్లి ఉపఎన్నికలో త్రిషను పోటీ చేయించి, గెలిచిన తర్వాత ఆమెకు 'డిప్యూటీ సీఎం' పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆమె తమిళనాడుకు మరో జయలలిత కాబోతుందంటూ కొందరు కామెంట్లు కూడా చేశారు. అయితే ఇప్పుడు త్రిషకు విజయ్ హ్యాండ్ ఇచ్చారని, ఆ స్థానం నుండి ఆమెను కాకుండా ఒక స్టార్ హీరోను బరిలోకి దించబోతున్నారని గట్టిగా వినిపిస్తోంది.
త్రిషకు నో ఛాన్స్!
తిరుచిరాపల్లి ఉపఎన్నిక రేసులో త్రిష స్థానాన్ని భర్తీ చేయబోయే ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్. తన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది అనాథలకు, వికలాంగులకు సేవ చేస్తూ రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్, త్వరలోనే అధికారికంగా విజయ్ నేతృత్వంలోని 'టీవీకే' పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. రాఘవ లారెన్స్కు ఉన్న సేవా గుణం, ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని, త్రిష కంటే ఆయనే తిరుచిరాపల్లి స్థానానికి సరైన అభ్యర్థి అని విజయ్ భావిస్తున్నట్లు కోలీవుడ్ టాక్ నడుస్తోంది.
ప్రచారంపై నిజమెంత?
ఈ మార్పులపై విజయ్ నుంచి గానీ, టీవీకే పార్టీ నుండి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ.. తమిళనాట మాత్రం ఈ ప్రచారం ఒక ఊపు ఊపుతోంది. మరోవైపు రాజకీయ పక్కన పెడితే, వ్యక్తిగతంగా త్రిష ఇప్పటికీ విజయ్ సరసన కనిపిస్తూనే ఉంది. ఇటీవలే స్టార్ హీరో అజిత్ తల్లి మరణించినప్పుడు కూడా విజయ్, త్రిషలు ఒకే కారులో వెళ్లి పరామర్శించడం విశేషం. మరి ఈ తిరుచిరాపల్లి ఉపఎన్నిక సీటు నిజంగానే లారెన్స్కు దక్కుతుందా? లేక ట్విస్టుల మధ్య త్రిషకే లభిస్తుందా? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే!
Also Read: మద్యం మత్తులో దారుణం..భర్తను కర్రతో చావకొట్టిన భార్య..పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది
Also Read: 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్..ఇలా అప్లే చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Peddi Day 1 Collection: రూ.200 కోట్లతో బాక్సాఫీసు బద్దలు కొట్టిన రామ్చరణ్..'పెద్ది' సూపర్ హిట్ టాక్!
Hyderabad, Telangana:Peddi Day 1 Collection News: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పెద్ది' నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తొలిరోజు కలెక్షన్స్ గురించి చిత్రబృందం ఓ పోస్టర్ ద్వారా అప్డేట్ ఇచ్చింది. తొలి రోజు దాదాపుగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపింది. అదే విధంగా సినీ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా మరో రూ.40 కోట్లు వచ్చినట్లు.. దీంతో ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్స్ రూ.200 కోట్ల మార్క్ను చేరినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.Pawan Kalyan Telangana: "పవన్పై విమర్శలు వద్దు".. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకు హైకమాండ్ హుకుం!
Hyderabad, Telangana:Pawan Kalyan Telangana Congress: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ఇటీవలే కొందరు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయమై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ను విమర్శించడం వల్ల ఆయన తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావడం సహా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర సెటిలర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది.Free Electricity: 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్..ఇలా అప్లే చేయండి!
Hyderabad, Telangana:Free Electricity 300 Units: నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు విద్యుత్ బిల్లులు భారం తగ్గించేందుకు ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీయోజన'. ఈ పథకం కింద ఇళ్లపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఉచితంగా కరెంటు పొందడమే కాకుండా, విద్యుత్ను అమ్మి సొమ్ము కూడా సంపాదించుకోవచ్చు.
తాజాగా కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పథకంపై కీలక ప్రకటన చేశారు. 2026 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 75 లక్షలు ఇళ్లకు సోలార్ ప్యానల్స్ అమర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 25 లక్షలు ఇళ్లల్లో వీటిని విజయవంతంగా ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.
సబ్సిడీ లభించే వివరాలు..
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 75 వేల కోట్లను కేటాయించింది. ఏర్పాటు చేసుకుని ప్యానల్స్ సామర్ధ్యాన్ని బట్టి భారీగా రాయితీ (సబ్సిడీ) అందిస్తుంది.
సోలార్ ప్యానల్ సామర్థ్యం 1 కిలో వాట్ (Kw) ఇంటిపై అమర్చేందుకు కేంద్రం రూ.30,000 స్థిర సబ్సిడీని అందజేస్తుంది. అలాగే రెండు కిలో వాట్ సామర్థ్యంతో ఏర్పరిచే ప్యానల్స్ కు ఖర్చులో 60 శాతం రాయితీ ఇవ్వనుండగా.. అలాగే రెండు నుంచి మూడు కిలోమీటర్లు సామర్థ్యం ఉన్న సూర్యఫలకాలకు అదనపు సామర్థ్యం పై 40% రాయితీ ఇవ్వనున్నారు. చివరగా 3 కిలో వాట్ల సామర్థ్యం సోలార్ ప్యానల్స్ పై గరిష్టంగా 78 వేల రూపాయల వరకు సబ్సిడీని అందించనున్నారు.
ఈ పథకం ముఖ్య ప్రయోజనాలు..
1) ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వాడుకోవచ్చు.
2) సోలార్ ద్వారా తయారైన కరెంట్ లో మీ ఇంటి అవసరాలకు పోను మిగిలిన విద్యుత్ స్థానిక డిస్కౌంట్ కంపెనీలకు విక్రయించి డబ్బు సంపాదించవచ్చు.
3) జీవితకాలం కరెంట్ బిల్లు భయం ఉండదు.
అర్హులు ఎవరు?
> దేశంలోని పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.
> సొంత ఇల్లు కలిగి ఉండి, రూఫ్ టాప్ (పై కప్పు)పై సోలార్ ప్యానల్స్ ఏర్పాటుకు స్థలం ఉండాలి.
> రెసిడెన్షియల్ వినియోగదారులు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: మద్యం మత్తులో దారుణం..భర్తను కర్రతో చావకొట్టిన భార్య..పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది
Also REad: జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే తొలి అభ్యర్థి ఇతనే! డిప్యూటీ సీఎం పవన్ అనూహ్య నిర్ణయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Madhya Pradesh Crime: మద్యం మత్తులో దారుణం..భర్తను కర్రతో చావకొట్టిన భార్య..పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది!
Chhatarpur, Madhya Pradesh:Madhya Pradesh Crime News: మద్యం మత్తులో ఓ భర్త చేసిన విపరీత చేష్ట.. ఒక ప్రాణాన్ని బలి తీసుకోగా, ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసింది. కన్న బిడ్డను కాపాడే క్రమంలో ఓ భార్య.. భర్తను కర్రతో కొట్టి చంపిన షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ జిల్లాలో వెలుగుచూసింది.
పోలీస్ కథనం ప్రకారం.. ఛతర్ పూర్ కు చెందిన నీలం కుశ్వాహ, తన భర్త దీన్ దయాళ్ కుష్వాహతో విభేదాల కారణంగా గత నాలుగేళ్లుగా పుట్టింటిలోనే ఉంటుంది. జూన్ 1న దీన్ దయాళ్ ఎప్పుడైతే సంఘం మద్యం సేవించి నీలం ఉంటున్న పుట్టింటికి వచ్చాడు. బలవంతంగా తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన అతను.. అంతటితో ఆగకుండా తన సొంత కొడుకును కాళ్లు పైకి పెట్టి తలకిందులుగా వేలాడదీశాడు.
మద్యం మత్తులో తన బిడ్డను ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో నీలం తీవ్ర ఆందోళనకు గురైంది. కన్న బిడ్డను కాపాడుకునే క్రమంలో తీవ్ర ఆవేశానికి లోనైనా ఆమె, ఇంట్లో ఉన్న కర్రతో దాడి చేసింది. ఆమె బలంగా కొట్టిన మొదటి దెబ్బకే దీన్ దయాళ్ మంచంపై పడిపోయాడు. అయినా ఆగకుండా నీలం వరుసగా కొట్టడంతో తీవ్ర గాయాలు పాలైన దీన్ దయాళ్ అక్కడితో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
శవం పక్కనే ఎనిమిది గంటలు..
భర్త చనిపోయాడని నిజం తెలిశాక నీలం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఏం చేయాలో అర్థం కాక భర్త మృతదేహం వద్ద 8 గంటల పాటు నిశ్చయస్తూ రాలే కూర్చుండిపోయింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి స్థానిక ఆలయానికి వెళ్లి తాను చేసిన తప్పును క్షమాపణ కోరుతూ దేవుడి ముందు ఒక 10 నిమిషాల పాటు కూర్చుని ప్రార్థించింది.
ఆ తర్వాత గుడి నుంచి నేరుగా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ కి చేరుకుంది. రాత్రి 8 గంటల సమయంలో స్టేషన్కు వచ్చిన నీలం తానే తన భర్తను చంపేసినట్లు అంగీకరించింది. ఇదే విషయాన్ని సివిల్ లైన్స్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు.
మహిళా ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, మంచంపై పడి ఉన్న దీన్ దయాళ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. భర్త నుంచి ఎదురైన వేధింపులు, బిడ్డపై జరిగిన దాడి కోణాలతో పాటు అన్ని కోణాల్లోనూ కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: వెండి కొనే వారికి బ్యాడ్న్యూస్..భారీగా పెరగనున్న వెండి ధరలు..కేంద్రం ఝలక్!
Also Read: నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త! SBI బ్యాంకులో 7,150 ఉద్యోగాలు..నెలకు జీతం ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP TET 2026: ఏపీ టెట్ నోటిఫికేషన్ అవుట్.. ఫీజు, దరఖాస్తు చేసుకునే విధానం ఇదే!స్టెప్ బై స్టెప్ ప్రాసెస్!
Hyderabad, Telangana:AP TET 2026 Notification Apply Link: కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తయిన అభ్యర్థులతోపాటు ప్రస్తుతం టీచర్లుగా పనిచేస్తున్న వారు కూడా దీనికి అర్హత సాధించాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2026 నోటిఫికేషన్ను ఈరోజు నుండి అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో ఉన్న వివరాలను పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోవాలి. టెట్ పాస్ అయిన వారు ప్రభుత్వ, ప్రైవేటు రంగ పాఠశాలల్లో టీచర్లుగా చేరవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి జూలై 5, 2026 వరకు సమయం ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేస్తూ రూ.1000 ఫీజు చెల్లించాలి.
దరఖాస్తుల ప్రక్రియ జూన్ 5, 2026 నుండి ప్రారంభమై జూలై 5 వరకు కొనసాగుతుంది. జూలై 15 నుండి ఆన్లైన్లో మాక్ టెస్టులు ప్రారంభమవుతాయి. హాల్ టికెట్లు అదే నెల 25వ తేదీ నుండి అందుబాటులో ఉంటాయి. ఏపీ టెట్ పరీక్షలను ఆగస్టు 5 నుండి ఆగస్టు 21 వరకు నిర్వహిస్తారు. పరీక్షల తర్వాత, ఆగస్టు 24న ప్రాథమిక సమాధాన పత్రాలను విడుదల చేస్తారు. అభ్యంతరాల కోసం ఆగస్టు 25 నుండి 31 వరకు అవకాశం ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 8న తుది సమాధాన పత్రాన్ని విడుదల చేస్తారు. ఏపీ టెట్ ఫలితాలను సెప్టెంబర్ 15న విడుదల చేస్తారు. దీని తర్వాత అక్టోబర్ 2026లో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వస్తుంది, డీఎస్సీకి టెట్ తప్పనిసరి.
ఏపీ టెట్ 2026 దరఖాస్తు విధానం..
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ https://tet2dsc.apcfss.in/ ను ఓపెన్ చేయాలి. అక్కడ ఉన్న 'ఏపీ టెట్ 2026' అప్లికేషన్ లింక్పై క్లిక్ చేసి, మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఫోటో, సంతకాన్ని అప్లోడ్ చేసిన తర్వాత, మీ విద్యా అర్హతలను నమోదు చేసి మీకు కావలసిన పేపర్ను ఎంచుకోవాలి. చివరగా ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు పూర్తయ్యాక కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు.
Also Read: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడు ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, డీఎస్సీపై క్లారిటీ, ఈసారి పరీక్షలు కీలకం!
Also Read: తెలంగాణ లాసెట్, పీజీఎల్సెట్ రిజల్ట్స్ వచ్చేశాయి, స్కోర్కార్డ్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
ఏపీ టెట్ 2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహించబడుతుంది. ప్రతి పేపర్కు 150 నిమిషాల సమయం ఉంటుంది. పరీక్ష రెండు షిఫ్టుల్లో జరుగుతుంది.. మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. పేపర్-1 అనేది 1 నుండి 5వ తరగతి వరకు బోధించే టీచర్ల కోసం, పేపర్-2 అనేది 6 నుండి 8వ తరగతి వరకు బోధించే అభ్యర్థుల కోసం రూపొందించారు. ఒక్కో పేపర్కు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: కరీంనగర్ మైనింగ్ శాఖలో సీఐడీ మెరుపు దాడులు.. పదేళ్ల రికార్డుల స్కాన్..
Hyderabad, Telangana:Mining Department Cbcid Raids: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న గ్రానైట్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మైనింగ్ శాఖ కార్యాలయంలో సీబీసీఐడీ (CBCID) అధికారులు మెరుపు తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయానికి చేరుకున్న ప్రత్యేకమైన బృందాలు.. అక్కడి కీలక రికార్డులతో పాటు ఫైలను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు విశ్వాసనీయ సమాచారం. గత కొంతకాలంగా గ్రానైట్ పారిల్లో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి అన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈ విచారణ ప్రారంభం కావడం మైనింగ్ రంగంలో తీవ్ర కలకలం రేపుతోంది.
2014 నుంచి రికార్డులు స్క్రీనింగ్..
ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు ప్రధానంగా గత పదేళ్ల కాలానికి సంబంధించిన రికార్డులపై దృష్టి సాధించినట్లు తెలుస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకు జిల్లాల్లో జరిగిన గ్రానైట్ లీజులతో పాటు వాటి బదిలీల వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా అధికారులు కొన్ని విషయాలపై సమగ్రంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన క్వారీ లీజుల బదిలీలతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన కోట్లాది రూపాయల రాయల్టీని కొందరి వ్యాపారులు అధికారులు కుమ్మక్కై ఎలా గండి కొట్టారని కోణాన్ని పరిశీలిస్తున్నారట..
అక్రమంగా గ్రానైట్ తవ్వకాలు..
అంతేకాకుండా లీజు పరిధి దాటి.. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా జరిపిన గ్రానైట్ తవ్వకాలతో పాటు వే పర్మిట్లు లేకుండా తక్కువ పరిమాణాన్ని చూపిస్తూ భారీ ఎత్తున జరిగిన గ్రానైట్ రవాణా వ్యవహారాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.. గతంలో విజిలెన్స్ అండ్ ఇన్ఫోసిమెంట్ విభాగం ఇచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకుని సిఐడి ఈ విచారణను వేగవంతం చేసింది. వాస్తవానికి క్వారీల నుంచి తరలిన గ్రానైట్ పరిమాణానికి.. ప్రభుత్వానికి చెల్లించిన సీనరేజ్ సొమ్ముకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. రేపుల ద్వారా విదేశాలకు ఎగుమతి అయిన కంటైనర్ల వివరాలతో పాటు ఇక్కడ రికార్డులను సరి సరిపోల్చే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ప్రభుత్వ ఆదాయానికి గండి..
తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. మైనింగ్ రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన అధికారులపై, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐడి ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.. ఈ తనిఖీల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రముఖ గ్రానైట్ వ్యాపారులు, మైనింగ్ శాఖకు చెందిన కొందరు ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. రానన్న రోజుల్లో ఈ కేసులో మరికొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Karimnagar: కరీంనగర్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల భారీ దందా.. విద్యుత్ శాఖ విచారణలో షాకింగ్ నిజాలు!
Hyderabad, Telangana:Karimnagar Fake Certificates: ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యా కేంద్రంగా ఉండడమే కాకుండా.. తెరచాటున అక్రమ సర్టిఫికెట్ల దందాలకు అడ్డాగా మారిందని సంచలన ఆరోపణలు వినిపిస్తూ వస్తున్నాయి.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు.. అంటే 2010 సంవత్సరం నుంచి 2014 మధ్యకాలంలో కరీంనగర్ కేంద్రంగా కొన్ని ప్రైవేటు స్టడీ సెంటర్లు నకిలీ విద్యార్హత పత్రాల వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగించినట్లు సమాచారం.. ఎలాంటి చదువు రాని వారికైనా ప్రత్యేకంగా నకిలీ సర్టిఫికెట్లను తయారుచేసి విక్రయించారని ఆరోపణలు విపరీతంగా వస్తున్నాయి..
ఆన్లైన్ లేకపోవడం కారణంగానే..
ఆ కాలంలో విద్యాసంస్థల్లో ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే సాగేది. ప్రస్తుతమున్న డిజిటల్ లేదా ఆన్లైన్ ధృవీకరణ వ్యవస్థ అప్పట్లో అందుబాటులో లేకపోవడాన్ని కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని పేరు ఊరు లేని యూనివర్సిటీల పేర్లతో.. అలాగే కొన్ని గుర్తింపు లేని బోర్డుల పేరుతో పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్లను భారీ మొత్తంలో విక్రయించినట్లు సమాచారం..
విద్యుత్ శాఖ విచారణలో కీలకమైన అంశాలు..
ఇటీవల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల సర్టిఫికెట్లు నకిలీవని అంతర్గత విచారణలో తేలడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీ అంశానికి దారితీసింది. ఈ ఉద్యోగులు సమర్పించిన పత్రాలు కరీంనగర్ కేంద్రంగా నడిచిన స్టడీ సెంటర్ల ద్వారానే విక్రయించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. దీంతో ఈ నెట్వర్క్ ఎంత మేరకు విస్తరించి ఉందో తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది.
ప్రభుత్వ ఎంక్వయిరీ డిమాండ్..
కరీంనగర్ నుంచి సాగిన ఈ అక్రమ నెట్వర్క్ ద్వారా వందలో అది మంది ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ఉద్యోగులు పొందినట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం విద్యుత్ శాఖలోనే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ఈ కాలంలో చేరిన వారి విద్యార్హత పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని.. అర్హత లేని వారి కీలక పదవుల్లో ఉండటం వల్ల వ్యవస్థకు ముప్పని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ప్రస్తుత ప్రభుత్వం ఈ వ్యవహారం పై సమగ్ర విచారణకు ఆదేశించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయ్యా స్టడీ సెంటర్ల నిర్వాహకులు ఎవరు? ఆనాడు ఏఏ యూనివర్సిటీల పేరిట దందా జరిగింది? అన్న కోణంలో పోలీసులతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది. నిజం తేలితే అనేకమంది నకిలీ మేధావుల ఉద్యోగాలు ఊడటమే కాకుండా క్రిమినల్ కేసులో నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ స్టడీ సెంటర్ల నుంచి చాలామంది నకిలీ సర్టిఫికెట్లను విక్రయించినట్లు కూడా తెలుస్తోంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలున్నాయి..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Janasena Rajya Sabha: జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే తొలి అభ్యర్థి ఇతనే! డిప్యూటీ సీఎం పవన్ అనూహ్య నిర్ణయం!
Chinnakakani, Andhra Pradesh:Janasena Rajya Sabha Candidate: ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కడం ఖాయం కావడంతో, అభ్యర్థుల ఖరారుపై సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో భాగంగా టిడీపీకి మూడు స్థానాలు, జనసేనకు ఒక సీటు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.
అంతేకాదు 2024 ఎన్నికల సమయంలో జనసేన కొన్ని లోక్సభ స్థానాలు త్యాగం చేసినందుకుగానూ.. 2029 లోపు జనసేనకు మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు ఇచ్చేలా కూటమిలో ముందస్తు హామీ లభించింది. అందులో భాగంగా ఇప్పుడు దక్కే ఒక సీటుతో జనసేన పార్టీ తొలిసారి రాజ్యసభలు అడుగుపెట్టబోతుంది.
పవన్ ఎంపిక ఎవరు?
తొలిసారి దక్కుతున్న ఈ రాజ్యసభ స్థానం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత పార్టీ వర్గాల్లో ఇద్దరి పేర్లు సుముఖంగా వినిపిస్తున్నాయి.
అందులో ఒకరు లింగమనేని రమేష్ పేరు వినిపిస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరొందిన ఈయన ఈ సీటు దాదాపు ఖరారు అయిందని ప్రచారం చాలా రోజులుగా సాగుతుంది. ఆర్థిక, సామాజిక సమీకరణాలపరంగా ఈయన పేరు ముందంజలో ఉంది.
మరోవైపు రాజ్యసభకు మెగా బ్రదర్ నాగబాబు కూడా రేసులో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఒకవేళ చివరి నిమిషంలో సమీకరణాలు మారితే నాగబాబుని ఢిల్లీకి పంపే యోజనలో పవన్ ఉన్నట్లు తెలుస్తుంది. నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందని భావించిన సాధ్యపడలేదు. ఆయన రాజ్యసభకు పంపేందుకు అప్పట్లో పెండింగ్లో పెట్టారని టాక్ కూడా ఉంది.
లింగమనేని రమేష్ లేదా నాగబాబు.. వీరిద్దరిలోనే ఒకరు జనసేన తరఫున మొదటి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తీసుకోబోయే అనూహ్య నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: జనసేనాని పవన్ కళ్యాణ్పై గద్దర్ కూతురు ఘాటు వ్యాఖ్యలు..సీఎం చంద్రబాబు మద్దతు!
Also Read: గుడ్న్యూస్! కేరళంను తాకిన నైరుతి రుతుపవనాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kohli Livingstone: "కోహ్లీ అందుకే ఇండియాలో ఉండడానికి ఇష్టపడడు!" ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:Livingstone On Virat Kohli: క్రికెట్ మైదానంలో అడుగు పెడితే చాలు అగ్రెసివ్గా మారిపోయే విరాట్ కోహ్లీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. లండన్ వీధుల్లో సాధారణ వ్యక్తిగా తిరుగుతూ, కెమెరా కంటికి చిక్కకుండా ఉండటానికి ఆయన మొగ్గు చూపుతారు. తాజాగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ వ్యక్తిత్వం, లండన్ పట్ల ఆయనకున్న ఇష్టం, ఐపీఎల్ లో ఆయన ఆటతీరు మారటానికి గల కారణాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్న అనుభవాన్ని లివింగ్ స్టోన్ గుర్తుచేసుకున్నారు. "విరాట్ అందరితో చాలా సరదాగా, ఫ్రెండ్లీగా ఉంటాడు. నేను చూసిన అత్యంత పోటీతత్వం గల ఆటగాడు కోహ్లీనే. ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచడంలో ఆయన స్టైలే వేరు. ఇండియాలో కోహ్లీకి ఉన్న క్రేజీ అంతా కాదు. ఎయిర్పోర్ట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు.. ఎక్కడికి వెళ్ళినా నిరంతరం మీడియా, అభిమానుల నిఘా ఆయనపై ఉంటుంది. ఈ విపరీతమైన అటెన్షన్ కోహ్లీకి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది" అని లివింగ్ స్టోన్ అన్నాడు.
క్రికెట్ కు దూరంగా ఉన్నప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా, కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి కోహ్లీ ఇష్టపడతాడని లివింగ్ స్టోన్ వెల్లడించాడు. అందుకే నిరంతరం మీడియా ఫోకస్ నుంచి విరామం కోసమే ఆయన భారత్ నుంచి వచ్చి ఇంగ్లాండ్ లో కొంత సమయాన్ని గడుపుతున్నట్లు లివింగ్ స్టోన్ పేర్కొన్నాడు.
కోహ్లీ ఆట తీరు మారడానికి కారణం ఇదే?
ఇటీవల కాలంలో కోహ్లీ బ్యాటింగ్లో స్పష్టమైన మార్పు వచ్చింది. ముఖ్యంగా టీ20లో దూకుడుగా ఆడుతున్నాడు. దీనిపై కూడా లివింగ్ స్టోన్స్ స్పందించాడు. ఆర్సీబీ మేనేజ్మెంట్లో వచ్చిన మార్పులే దీని కారణమని చెప్పాడు.
"ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ల ఆధ్వర్యంలో కోహ్లీ తన ఆటను తదుపరి స్థాయికి తీసుకెళ్లాడు. పవర్ ప్లే లో మరింత టాకింగ్ ఆడటం స్పిన్నర్లపై భారీ షాట్లు కొట్టడం వెనక వీరి ప్రణాళికలు ఉన్నాయి" అని లివింగ్ స్టోన్ తెలిపాడు. మైదానంలో అగ్నిపర్వతంలా రగిలిపోయే కింగ్ కోహ్లీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం కుటుంబమే లోకంగా బతికే ప్రశాంతమైన వ్యక్తి అని లివింగ్ స్టోన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read: తెలుగు క్రికెటర్ సంచలన నిర్ణయం..32 ఏళ్ల రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్!
ALso REad: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అంతర్గత విభేదాలు..కావ్య పాపపై ఇంగ్లాండ్ ఆటగాడు ఫైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Maoist Devji: కత్తి కన్నా కలం గొప్పదని నిరూపించిన దేవ్జీ.. 60 ఏళ్ల వయసులో లాసెట్లో ఊహించని ర్యాంకు..
Hyderabad, Telangana:Former Maoist Devji: ఆయుధం పట్టిన చేతులు అక్షరం వైపు మళ్లాయి.. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకొని.. విప్లవ పంథాలో ముందుకు సాగిన ఓ మాజీ మావోయిస్టు అగ్రనేత ఇప్పుడు న్యాయ శాస్త్రం వైపు అడుగులు వేస్తున్నారు. ఉద్యమ బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తిప్పరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ.. తాజాగా విడుదలైన తెలంగాణ లాసెట్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు..
43 ఏళ్ల తర్వాత ఇంటర్ పూర్తి చేశారు..
తిరుపతి ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం.. ఆయన సుమారు 43 ఏళ్ల క్రితమే కోరుట్లలోని ఇంటర్మీడియట్ చదువుకున్నారు.. అయితే అప్పట్లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులై అడవి బాట పట్టడంతో చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది.. ఆ సమయంలో ఆయన ఇంటర్మీడియట్లో తెలుగు పేపర్ బ్యాక్లాగ్గా ఉండిపోయింది. ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆయన.. చదువుపై ఉన్న మక్కువతో ఆ పాత బాకీని తీర్చుకున్నారు. ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల్లో ఆ ఒక్క పేపర్ను రాసి.. నాలుగు దశాబ్దాల తర్వాత ఇంటర్ను అధికారికంగా పూర్తి చేశారు..
కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేయడమే కాకుండా.. న్యాయ శాస్త్రం చదవాలని బలమైన సంకల్పంతో ఆయన లాసెట్ పరీక్షకు హాజరయ్యారు.. నిన్న విడుదలైన ఫలితాల్లో తిరుపతి 57 మార్కులు సాధించి.. రాష్ట్రస్థాయిలో 349 ర్యాంకు కైవసం చేసుకున్నారు. 60 ఏళ్లకు పైబడిన వయస్సులో కూడా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పుస్తకాలు పట్టి ఈ స్థాయి ర్యాంకు సాధించడం పట్ల విద్యార్థులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
పేదల కోసమే న్యాయం..
తన విజయానికి గల కారణాలను వివరిస్తూ తిరుపతి బాగోద్వేగానికి లోనయ్యారు.. అడవిలో ఉన్నప్పుడు ప్రజల సమస్య కోసం పోరాడారని.. ఇప్పుడు సమాజంలో ఉంటూ చట్టం ద్వారా పేదలకు అండగా ఉండాలనుకుంటున్నారన్నారు.. అందుకే లా చదవాలని నిర్ణయించుకున్నారని.. తనకున్న అనుభవంతో పాటు న్యాయ శాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించి నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం చేయడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. తుపాకీ గొట్టం ద్వారానే మార్పు వస్తుందని నమ్మిన ఒకప్పటి అగ్రనేత.. నేడు రాజ్యాంగం కల్పించిన చట్టం ద్వారా మార్పు కోసం ప్రయత్నించడం ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది.. కత్తికన్నా కలం గొప్పది.. అనే మాటను తిరుపతి నిజం చేసి చూపించారని పలువురు మేధావులు ప్రశంసిస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
