Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Karimnagar505001

కరీంనగర్ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఐద్వాలో ప్రారంభమయ్యాయి

Jul 26, 2024 13:02:38
Karimnagar, Telangana

ఈరోజు స్థానిక కరీంనగర్ లోని ముకుంద్ లాల్ మిశ్రా భవన్ లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో నాలుగు రోజుల పాటు రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ తరగతుల్లో మహిళా సమస్యలపై చర్చించి భవిష్యత్‌ పోరాటాలపై చర్చిస్తామన్నారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Feb 19, 2026 16:08:48
Hyderabad, Telangana:

Burnt Ironing Shirt Video Watch Here: ఫ్యాషన్ ప్రపంచంలో వింతలకు అసలు కొదవే లేకుండా పోతోంది.. అప్పుడప్పుడు కొన్ని లగ్జరీ బ్రాండ్లు తీసుకువచ్చి డిజైన్లు అసలు సాధారణ మనుషులకు అర్థం కాకపోవడమే కాకుండా... కొన్ని డిజైన్లు అయితే ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.. తాజాగా ప్రముఖ అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ వెట్‌మెంట్స్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చిన తెల్లచొక్కా ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు అయితే విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ చొక్కాలో ఏముంది? ఇంత చర్చనీ అంశానికి దారి తీయడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా మనం బట్టలు ఇస్త్రీ చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇస్త్రీ పెట్టె వేడికి బట్టలు కాలిపోతూ ఉంటాయి.. అంతేకాకుండా తెల్లటి దుస్తులపై.. కాలిపోయిన నల్లటి మచ్చలు పడుతూ ఉంటాయి. అలాంటి చుక్కలను మనం బయట పారేస్తూ ఉంటాం.. లేదా ఇంట్లో వివిధ రకాల పనులకు వినియోగిస్తాం.. కానీ ఈ బ్రాండ్ విడుదల చేసిన వైట్ షర్ట్ కాలిన గుర్తు డిజైన్‌తో రూపొందించారు.. వైట్ ఐరనింగ్ బర్న్ గ్రాఫిక్స్ షర్ట్ అని మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.

ఈ కాలిన గుర్తు ప్రింటింగ్ షర్ట్ ధర అక్షరాల 1000 డాలర్లకు పైగానే ఉంది.. అంటే భారత కరెన్సీలో సుమారు ఒక లక్ష రూపాయలకు పైమాటే.. ఈ చొక్కాపై జేబు భాగంలో ఇస్తిరి పెట్టతో కాలినట్లు ఉండే గ్రాఫిక్స్.. మనం ఫోటోలో చూడొచ్చు. అయితే, ఈ చొక్కాపై కాలినట్లు కనిపించినప్పటికీ.. చాలామంది దీనిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. కొన్ని చోట్ల అయితే ఇవి హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి..

అయితే, ఈ చొక్కాపై సోషల్ మీడియా వినియోగదారులు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.. కొంతమంది అయితే నేను ఇలాంటి డిజైన్లను ఎన్నో ఏళ్లుగా ఉచితంగా ఇంట్లోనే తయారు చేస్తున్నాను.. ఇప్పుడు నా పాత బట్టలన్నీ లగ్జరీ ఫ్యాషన్ కిందికి వస్తాయన్నమాట.. ఒక సోషల్ మీడియా వినియోగదారుడు ఫన్నీగా కామెంట్ చేశాడు.. అలాగే ధనవంతులు నుంచి డబ్బులు ఎలాగా గుంజాను చూపేందుకు లగ్జరీ బ్రాండ్లు చేస్తున్న అత్యద్భుతమైన ప్రయోగం ఇది అని.. మరొక సోషల్ మీడియా వినియోగదారుడు కామెంట్ చేశాడు.. ఇలా చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ చేస్తూ వచ్చారు..

Also Read: జనరల్‌ బోగీల్లో ప్రయాణించేవారికి ఇండియన్‌ రైల్వే బంపర్‌ ఆఫర్‌..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 19, 2026 15:52:20
Hyderabad, Telangana:

 Old Woman Viral Video Watch Here: వయస్సు పైబడిన వారు చాలావరకు విశ్రాంతి తీసుకుంటారు.. అయితే, విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో.. ఒక 70 ఏళ్ల వృద్ధురాలు తన ఆత్మ గౌరవం కోసం పడుతున్న తపన సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. పశ్చిమ బెంగాల్ హౌరాకు చెందిన ఓ వృద్ధురాలు గత 30 ఏళ్లుగా రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుతూ జీవనం కొనసాగిస్తూ వస్తోంది.. ఆమె దగ్గరికి పదుల సంఖ్యలో కస్టమర్లు ఉన్నారు. అయితే, ఆ వృద్ధురాలు పడుతున్న కష్టాన్ని ఇంస్టాగ్రామ్ కు సంబంధించిన ఓ కంటెంట్ క్రియేటర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.  

భర్త మరణించిన తర్వాత వృద్ధురాలు దీపాలి ఘోష్‌కు ఈ చిన్న హోటల్ ఒక ప్రధాన ఆధారమైంది.. ఉదయాన్నే కూరగాయలు కొనుగోలు చేయడం నుంచి.. వంట చేయడం, గిన్నెలు శుభ్రం చేయడంతో పాటు పరిసరాలను శుభ్రం చేయడం ఇలా అన్ని ఆమె ఒక్కరే చేసుకుంటునారు.. ఆమెకు సహాయం చేసే వారు ఎవ్వరూ లేరు.. ఈ వయస్సులో సరిగ్గా వినిపించక పోయిన.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ.. కేవలం తిండి, ఔషధాల ఖర్చులకోసం ఆమె ప్రతిరోజు ఇలా శ్రమించాల్సి వస్తోంది.

అన్నింటికంటే బాధ పడాల్సిన విషయం ఏంటంటే.. ఆ చిన్న హోటలే ఆమెకు నివాసం.. మసి పట్టిన గోడలతో పాటు చిల్లులు పడిన పైకప్పు ఉన్న ఇరుకైన గదిలోనే ఆ వృద్ధురాలు చిన్న చెక్క ముక్క పై పడుకుంటుంది. ముఖ్యంగా లాక్‌డౌన్ తర్వాత ఆమె పరిస్థితి ఊహించని స్థాయిలో దిగజారింది. అయినప్పటికీ ఆ వృద్ధురాలు ఎవరిపైన ఇసుమంత ఆధారపడలేదు.. అంతేకాకుండా వృద్ధాశ్రమానికి వెళ్లే ఆలోచన లేక తనని తానే మనస్సును దృఢంగా చేసుకొని ఎంతో పట్టుదలతో శ్రమిస్తూ వచ్చింది..

 
 
 
 
 

Also Read: జనరల్‌ బోగీల్లో ప్రయాణించేవారికి ఇండియన్‌ రైల్వే బంపర్‌ ఆఫర్‌..!

అయితే, ఈ వీడియో చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు.. వెంటనే ఆ బామ్మ ఉంటున్న దుకాణాన్ని బాగు చేయడమే కాకుండా.. ఆమెకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.. మరి కొంతమంది ఈ వీడియోను చూసి ఆమె ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు. ఈ వయస్సులో కూడా ఎవ్వరి దగ్గర రూపాయి అడగకుండా కష్టపడుతున్న ఆమె నిజంగా చాలా గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.  అంతేకాకుండా ఆమెకు ఆర్థిక సహాయం చేయడానికి.. హోటల్ ను బాగు చేయడానికి ముందుకు వస్తున్నారు.

Also Read: జనరల్‌ బోగీల్లో ప్రయాణించేవారికి ఇండియన్‌ రైల్వే బంపర్‌ ఆఫర్‌..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 19, 2026 15:35:05
Hyderabad, Telangana:

India And Bangladesh Relations Latest News: భారత్ బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఉధృప్తతలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి.. మీరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు చాలా రోజుల తర్వాత మళ్లీ గాడిన పడుతున్నాయి అనే సంకేతాలు గత రెండు మూడు రోజుల నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి.. బంగ్లాదేశ్‌లో భారత్ త్వరలో అన్ని రకాల వీసా సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించబోతున్నట్లు భారత ఉన్నత స్థాయి దౌత్యవేత్త అనిరుద్ధ దాస్ వెల్లడించారు. దీంతో బంగ్లాదేశ్లో చదువుకోవాలనుకుంటున్న యువతకు ఇది ఎంతగానో సహాయ పడబోతోంది. 

2024 ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం.. ఆ తర్వాత ఏర్పడిన రాజకీయ అస్థిరత కారణంగా భారత్ తన వీసా సేవలను నిలిపివేసిన సంగతి మనందరికీ తెలిసిందే.. ముఖ్యంగా భారత రాయబార కార్యాలయం పై దాడుల ముప్పు పొంచి ఉండడంతో.. భద్రతా కారణాల దృశ్య.. 2025 సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన వీసా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేశారు. అప్పటినుంచి కేవలం అత్యవసర వైద్య చికిత్సలతో పాటు డబుల్ ఎంట్రీ వీసాలను మాత్రమే పరిమితంగా జారీ చేశారు.

సిల్హెట్‌లో ఉన్న భారత సీనియర్ కన్సులర్ అధికారి అనిరుద్ధ దాస్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం మెడికల్ తో పాటు డబుల్ ఎంట్రీ వీసాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని.. అతి త్వరలోనే టూరిస్ట్ వీసాలతో పాటు అన్ని ఇతర రకాల కేటగిరీలకు సంబంధించిన సేవలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.. అని తెలిపారు. బంగ్లాదేశ్లో తారీక్ రెహమాన్ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్తో సంబంధాలను మెరుగుపరచుకోవడంలో పురోగతి కనిపిస్తోంది..

మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం హయాంలో..  భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.. అయితే ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారత్తో సానుకూల ధోరణితో వ్యవహరిస్తూ వస్తోంది. రెండు దేశాల ప్రజలే ఈ సంబంధానికి ప్రధాన భాగస్వాములు.. మన ఆలోచనలు సాంస్కృతులు ప్రాచీన కాలం నుంచే ఒకే దారంతో అల్లారని.. అనిరుద్ధ దాస్ మీడియా ముఖంగా తెలిపారు..

Also Read: జనరల్‌ బోగీల్లో ప్రయాణించేవారికి ఇండియన్‌ రైల్వే బంపర్‌ ఆఫర్‌..!

గతంలో రోజుకు సగటున ఎనిమిది వేల వీసాలను భారత్ జారీ చేస్తూ ఉండేది.. అయితే ఉద్రిక్తత తల కారణంగా ఈ సంఖ్యను కేవలం 1500 కు తగ్గించింది.. ఇప్పుడు అన్ని సేవలు పునరుద్ధరిస్తే సాధారణ పౌరులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడడమే కాకుండా మీరు దేశాల మధ్య వాణిథ్యం కూడా మెరుగుపరవచ్చు. అంతేకాకుండా సాంస్కృతిక బంధాలు మళ్లీ బలపడే అవకాశాలు ఉండబోతున్నాయి..

Also Read: జనరల్‌ బోగీల్లో ప్రయాణించేవారికి ఇండియన్‌ రైల్వే బంపర్‌ ఆఫర్‌..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 19, 2026 11:59:26
Hyderabad, Telangana:

Hyderabad Biryani Tax Scam Telugu Latest News: హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్‌లో సాధారణంగా మొదలైన తనిఖీలు.. దేశవ్యాప్తంగా రెస్టారెంట్‌ రంగంలోని జరుగుతున్న ఊహించని కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చాయి. కొన్ని హోటల్స్‌కి సంబంధించిన యజమానులు అత్యాధునిక సఫ్ట్‌వేర్లను అడ్డంపెట్టుకుని ప్రభుత్వానికి దాదాపు రూ. 70,000 కోట్ల మేర పన్నులు ఎగవేసినట్లు అధికారు గుర్తించారు. దీంతో ఈ వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

జరిగింది ఇదే..
హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ సెంటర్లపై ఐటీతో పాటు GST అధికారులు దాడులు నిర్వహించగా.. అసలు విషయం అప్పుడు బయటపడింది.. హోటళ్లు వాడుతున్న బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్లను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పాటు ప్రత్యేకమైన అనలిటిక్స్ వినియోగించి పూర్తిగా విశ్లేషించగా.. అందులో ఊహించని స్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్లు తేలింది.. దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లు ఇదే తరహా సాఫ్ట్‌వేర్‌ను వాడుతూ పన్నులు ఎగ్గొడుతున్నట్లు అధికారులు  నిర్ధారించిన్నట్లు తెలుస్తోంది. 

అసలు వ్యూహం ఇదే...
వినియోగదారులు బిల్లులు చెల్లించి వెళ్లిన తర్వాత.. ఆ లావాదేవీలకు సంబంధించిన రికార్డులను సాఫ్ట్‌వేర్‌ల నుంచి ఎంతో సులభంగా చాలా రహస్యంగా డిలీట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా క్యాష్‌తో వచ్చే ఆదాయాన్ని లెక్కల్లో చూపించకుండా.. పూర్తిగా మాయం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని సమయాల్లో ఒక రోజు లేదా నెల రోజుల అమ్మకాలను సైతం ఎంతో సులభంగా రికార్డ్‌ల నుంచి తొలగిస్తున్నారు. చాలా తక్కువ మొత్తంలో ఆదాయం చూపిస్తూ.. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. 

దీనికి సంబంధించిన కొన్ని కీలక గణాంకాలను అధికారులు బటపెట్టారు. దేశవ్యాప్తంగా రూ. 13,000 కోట్లకు పైగా బిల్లులను సాఫ్ట్‌వేర్ నుంచి డిలీట్ చేయగా.. కేవలం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.5,100 కోట్ల మేర విక్రయాలను దాచి ఉంచిన్నట్లు అధికారులు గుర్తించారు. పన్ను ఎగవేతలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ, తమిళనాడు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం సుమారు రూ. 70,000 కోట్లు కుంభకోణం జరిగిన్నట్లు అధికారులు వెల్లడించారు. గత 6 సంవత్సరాలకు సంబంధించిన  60 టెరాబైట్ల డేటాను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన్నట్లు తెలుస్తోంది.. కేవలం నగదు మాత్రమే కాకుండా, కార్డ్‌తో పాటు యూపీఐ చెల్లించిన వాటిలో కూడా అవకతవకలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 19, 2026 11:36:57
Tirupati Urban, Andhra Pradesh:

Heritage Controversy in AP Assembly: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదంలో వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హెరిటేజ్ సంస్థ తితిదేకు నెయ్యి సరఫరా చేసిందంటూ అసత్య ప్రచారాలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ సంస్థ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తితిదేకు ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని, ఇది 'నిప్పులాంటి నిజం' అని తిరుమల తిరుపతి దేవస్థానముల ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.

చీజ్ ప్యాకెట్‌ను నెయ్యి అన్నారా?
శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీరును ఆయన తప్పుబట్టారు. "హెరిటేజ్ చీజ్ ప్యాకెట్‌ను చూపిస్తూ అది నెయ్యి అని చెప్పి వైకాపా తన పరువును తానే పోగొట్టుకుంది" అని ఎద్దేవా చేశారు. స్వామివారి అన్న ప్రసాదాల నాణ్యత విషయంలో తమ పాలకవర్గం అత్యంత కఠినంగా ఉందని ఆయన తెలిపారు. గతంలో లాగా తక్కువ ధరలకు నాణ్యత లేని సరుకులు కొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

నెయ్యి ధరలపై వైకాపా నేతలు చేస్తున్న విమర్శలను కొట్టిపారేస్తూ, ఓపెన్ టెండర్ల ద్వారా అత్యంత పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బొత్స సత్యనారాయణ వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోకుండా, జగన్ చెప్పినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. 

"స్వామివారికి సమర్పించే నైవేద్యాల విషయంలో ఎంత ఖర్చవుతుందనే లెక్కలు వేయం. భక్తులకు అందే అన్న ప్రసాదాలు, లడ్డూల నాణ్యత పెంచడమే మా మొదటి ప్రాధాన్యత. దేవుడి సొమ్మును ఆయన సేవకే ఖర్చు చేస్తున్నాం" అని బీఆర్ నాయుడు తన ప్రకటనలో వివరించారు.

Also Read: AP Crime News: కోరిక తీర్చాలని వదినను బలవంతపెట్టిన మరిది..యాసిడ్‌తో దాడికి యత్నం..చివరికి!

Also Read: MLC Anantha Babu Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక మలుపు..వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు భార్యపై 'ఏ-2'గా అభియోగాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 19, 2026 11:09:29
Rompicharla, Andhra Pradesh:

Rompicherla Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రక్షణగా ఉండాల్సిన మరిదే వదినపై కన్నేసి, లోబడకపోతే యాసిడ్ దాడికి తెగబడిన ఈ ఉదంతం బయటపడింది.

అన్న చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వదినకు అండగా నిలవాల్సిన మరిది, కామంతో కళ్లు మూసుకుపోయి ఆమె జీవితాన్ని నరకప్రాయం చేశాడు. తన కోరిక తీర్చకపోతే యాసిడ్ పోసి చంపుతానంటూ బరితెగించిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఏం జరిగింది?
రొంపిచర్ల మండలానికి చెందిన ఓ 34 ఏళ్ల మహిళ, తన భర్త ఏడాదిన్నర క్రితం మరణించడంతో ముగ్గురు పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆమెపై, భర్త తమ్ముడైన శామ్యూల్ కన్నేశాడు. గతంలోనూ శామ్యూల్ ఆమెపై అత్యాచార యత్నం చేయగా, గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అప్పట్లో తప్పు ఒప్పుకుని, వదిన కాళ్లు పట్టుకుని వేడుకోవడంతో ఆమె క్షమించి వదిలేసింది.

బుద్ధి మార్చుకోని శామ్యూల్, ఫిబ్రవరి 16వ తేదీ అర్ధరాత్రి ఆమె నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో, వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమెపై పోసేందుకు ప్రయత్నించాడు. సమయస్ఫూర్తితో ఆమె అక్కడి నుండి తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

పోలీసుల రంగప్రవేశం
మరిది వేధింపులు మితిమీరిపోవడంతో పాటు ప్రాణహాని ఉందని గ్రహించిన బాధితురాలు, బుధవారం తన బంధువులతో కలిసి రొంపిచర్ల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. "అమ్మలా చూడాల్సిన వదిన అని కూడా చూడకుండా, గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. పంచాయితీలో కాళ్లు పట్టుకుని కూడా మళ్లీ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. నాకూ, నా పిల్లలకు రక్షణ కల్పించండి" అని ఆమె పోలీసులను వేడుకుంది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు శామ్యూల్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఒంటరి మహిళలపై జరుగుతున్న ఇటువంటి దాడులు సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Ginger Buttermilk Benefits: మజ్జిగలో ఇది కలిపి తాగితే చాలు..పొట్ట చుట్టూ ఎంత మొండి కొవ్వైనా వెన్నలా కరిగిపోవాల్సిందే!

Also REad: MLC Anantha Babu Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక మలుపు..వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు భార్యపై 'ఏ-2'గా అభియోగాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 19, 2026 09:50:49
Hyderabad, Telangana:

Buttermilk With Ginger Benefits For Weight Loss: వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరిచే పానీయాల్లో మజ్జిగకు సాటి లేదు. అయితే, కేవలం చల్లదనం కోసమే కాకుండా, బరువు తగ్గడానికి కూడా మజ్జిగను ఒక ఆయుధంగా వాడుకోవచ్చని మీకు తెలుసా? ఒక గ్లాసు మజ్జిగలో ఒక చెంచా అల్లం రసం కలిపి తీసుకుంటే శరీరంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్, అల్లంలోని ఔషధ గుణాలు కలిస్తే శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. అల్లం శరీరంలో జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ప్రతిరోజూ మజ్జిగలో అల్లం రసం కలిపి తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కణాల విచ్ఛిన్న ప్రక్రియ వేగవంతమై, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.

అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఇది సరైన పరిష్కారం. ఆకలి లేని వారికి మజ్జిగలో అల్లం రసం కొద్దిగా ఉప్పు కలిపి ఇస్తే ఆకలి పెరుగుతుంది. అలాగే అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, మజ్జిగలోని లాక్టోస్ శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శరీరంలో లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ (మంట) తగ్గించడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ఉత్పత్తి పెరిగి, రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఇది కాలేయ పనితీరును మెరుగుపరిచి, శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.

ఎలా తయారు చేసుకోవాలి?
ఒక గ్లాసు చిక్కని మజ్జిగ తీసుకోండి. అందులో ఒక టీస్పూన్ తాజా అల్లం రసం, కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు, రుచి కోసం కొత్తిమీర లేదా పుదీనా ఆకులు కలపండి. దీనిని మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా ఎండలో బయటకు వెళ్లి వచ్చినప్పుడు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.

(గమనిక: ఈ సమాచారం ప్రాథమిక అవగాహన, ఆయుర్వేద చిట్కాల ఆధారంగా పేర్కొన్నాము. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ఏదైనా చికిత్స పొందుతున్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే దీనిని అనుసరించాలి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: MLC Anantha Babu Case: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక మలుపు..వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు భార్యపై 'ఏ-2'గా అభియోగాలు!

Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..మార్చి నెలలో ఏకంగా 11 రోజులు స్కూళ్లకు సెలవులు! ఎప్పుడెప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 19, 2026 08:53:42
Nunna, Vijayawada, Andhra Pradesh:

Driver Subramanyam Case Anantha Babu Wife: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు భార్య ప్రమేయంపై సిట్ (SIT) సంచలన విషయాలను వెల్లడించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గ పాత్ర ఉన్నట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో సిట్ బృందం అదనపు చార్జిషీట్‌ను దాఖలు చేసింది.

సిట్ నివేదికలో ఇలా..
ఈ హత్య కేసులో ఆమెను రెండవ నిందితురాలిగా (A-2) సిట్ పేర్కొంది. సుబ్రహ్మణ్యం హత్యలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా, ఆధారాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారని అధికారులు కోర్టుకు వివరించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాల విశ్లేషణ తర్వాతే ఆమెపై ఈ అభియోగాలు మోపినట్లు సిట్ వెల్లడించింది.

ప్రస్తుతం లక్ష్మీ దుర్గ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సిట్ అధికారులు కోర్టుకు తెలిపారు. గతంలో విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినప్పుడు, ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఏం జరిగిందంటే?
2022 మే 19న వైయస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంత బాబు వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించారు. అర్ధరాత్రి సమయంలో అనంత బాబు స్వయంగా సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం పెను దుమారం రేపింది. తొలుత ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, తీవ్ర నిరసనల మధ్య విచారణ జరిపి అనంత బాబును ప్రధాన నిందితుడిగా అరెస్ట్ చేశారు.

సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గతేడాది జూలైలో ప్రభుత్వం ఈ కేసుపై తదుపరి విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ గన్‌మెన్లు, అనుచరులను విచారించిన సిట్, తాజాగా అనంత బాబు భార్య ప్రమేయాన్ని నిర్ధారిస్తూ చార్జిషీట్ దాఖలు చేయడం కేసులో కీలక మలుపుగా మారింది. ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంత బాబు ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. ఇప్పుడు ఆయన భార్యపై కూడా తీవ్రమైన క్రిమినల్ అభియోగాలు నమోదు కావడంతో ఈ కేసు విచారణ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: Vizag AI Data Centre: విశాఖలో గూగుల్ మెగా ఏఐ హబ్..గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భారీ ప్రకటన!

Also REad; School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..మార్చి నెలలో ఏకంగా 11 రోజులు స్కూళ్లకు సెలవులు! ఎప్పుడెప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 19, 2026 07:32:05
Hyderabad, Telangana:

Vivo X300 Fe Launch Date: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వీవో మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదల చేయబోతోంది.. దీనిని కంపెనీ వివో X300 FE మొబైల్‌ పేరుతో విడుదల చేయబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. దీని బట్టి చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ వివో X300 FE స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ వివో S50 ప్రో మినీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిని వీవో కంపెనీ త్వరలో భారత్‌లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. టిప్‌స్టర్ అన్విన్ (@ZionsAnvin) తెలిపిన వివరాల ప్రకారం, ఈ Vivo X300 FE స్మార్ట్‌ఫోన్‌ మొత్తం రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ 256GB స్టోరేజ్‌తో పాటు 512GB స్టోరేజ్‌ వేరియంట్స్‌లో విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు సమాచారం.. 

Vivo X300 FE స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మోడల్‌ నెబంర్‌ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ Geekbenchలో కూడా నమోదు చేశారు. అయితే, ఇది మార్కెట్‌లోకి V2537 మోడల్ నంబర్‌తో లాంచ్‌ కాబోతోంది. అంతేకాకుండా  సింగిల్-కోర్ పరీక్షలో 2,701 పాయింట్లు సాధించిన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్‌తో లాంచ్‌ కాబోతోంది. అలాగే ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో పాటు 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు Wi-Fi, బ్లూటూత్‌తో పాటు NFC వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌తో లభిస్తోంది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో విడుదల చేసిన Vivo S50 Pro Mini రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కూడా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.31-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది Android 16 ఆధారంగా OriginOS 6 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. ఇది మోస్ట్ వపర్‌ఫుల్ 6,500 mAh బ్యాటరీతో పాటు 40 W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ సోనీ ప్రధాన కెమెరాతో లభిస్తోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 19, 2026 06:54:20
Tirupati Urban, Andhra Pradesh:

QR Code Based Footwear Tracking System: తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు తమ పాదరక్షలను ఎక్కడ వదిలేయాలో తెలియక, రోడ్ల పక్కన పడేయడం వల్ల అవి పోవడం లేదా వెతుక్కోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ ఇబ్బందులను అధిగమించడానికి టీటీడీ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది.

ఏమిటీ ట్రాకింగ్ సిస్టమ్?
సాధారణంగా పాదరక్షల కౌంటర్ల వద్ద ఉండే రద్దీని తగ్గించడానికి, భక్తుల సమయాన్ని ఆదా చేయడానికి ఈ క్యూఆర్ (QR) కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. భక్తులు తమ పాదరక్షలను కౌంటర్‌లో ఇచ్చినప్పుడు, వారికి ఒక క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు.

దీనివల్ల పాదరక్షలను డిపాజిట్ చేయడం, తిరిగి తీసుకోవడం చాలా వేగంగా జరుగుతుంది. పాత పద్ధతిలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీ పాదరక్షలు ఎక్కడున్నాయో ఈ సిస్టమ్ ద్వారా ట్రాక్ చేయడం సులభం, కాబట్టి అవి పోయే అవకాశం ఉండదు.

త్వరలో మరిన్ని కౌంటర్లు
ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్న ఈ సేవలను, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తరిస్తోంది. త్వరలోనే కొన్ని కీలక ప్రాంతాల్లో స్మార్ట్ కౌంటర్లు ఏర్పాటు కానున్నాయి. కళ్యాణకట్ట, ఏటీసీ (ATC) సర్కిల్, బేడి ఆంజనేయస్వామి ఆలయం వంటి ప్రాంతాల్లో ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టును 'కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్' సంస్థ సహకారంతో టీటీడీ నిర్వహిస్తోంది.

దీనివల్ల కలిగే ప్రయోజనాలు..
భక్తులు రోడ్ల పక్కన పాదరక్షలు వదలకపోవడం వల్ల తిరుమల మాడ వీధులు, రోడ్లు పరిశుభ్రంగా ఉంటున్నాయి. ఇప్పటివరకు సుమారు 8.45 లక్షల మందికి పైగా భక్తులు ఈ సేవలను వినియోగించుకోవడం విశేషం. ప్రధాన కౌంటర్ల వద్ద రద్దీ తగ్గి, భక్తులకు ప్రశాంతమైన దర్శన అనుభూతి కలుగుతోంది.

భక్తులకు సూచన: తిరుమలకు వెళ్ళినప్పుడు అపరిచిత ప్రదేశాల్లో పాదరక్షలు వదిలి ఇబ్బంది పడకండి. టీటీడీ ఏర్పాటు చేసిన ఈ ఉచిత స్మార్ట్ కౌంటర్లను వినియోగించుకుని మీ ప్రయాణాన్ని సుఖమయం చేసుకోండి.

Also Read: Diabetes Control Tips: డయాబెటిస్ నియంత్రణకు వంటింటి చిట్కా..మెంతి పొడితో ఇలా చేస్తే అద్భుత ప్రయోజనాలు!

Also Read: Vijay And Rashmika Net Worth: వారంలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి? వీరిద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 19, 2026 06:38:54
Hyderabad, Telangana:

Samsung Galaxy A37 5g Launch Date: సాంసంగ్‌ నుంచి మార్కెట్‌లోకి కొత్త గెలాక్సీ A సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ గెలాక్సీ A37తో పాటు గెలాక్సీ A57 మోడల్స్‌ తీసుకు రాబోతోంది. అలాగే ఇప్పటికే కంపెనీ  సింగపూర్ IMDA సర్టిఫికేషన్ డేటాబేస్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ మోడల్స్‌ వివరాలు కనిపించిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీటికి సంబంధించిన ఫీచర్స్‌ కూడా సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. అయితే, ఈ మొబైల్స్‌కి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ స్మార్ట్‌ఫోన్స్‌ కంపెనీ A376B/DSతో పాటు SM-A576B/DS మోడల్‌ నెంబర్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో ప్రత్యేకంగా డ్యూయల్-సిమ్ స్పీడ్‌ నెట్‌వర్క్‌ ఆప్షన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే గ్లోబల్‌ వేరియంట్‌లో అనేక రకాల స్పెషల్ ఫీచర్స్‌ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇందులో కొన్ని కనెక్టివిటీ ఫీచర్స్‌ కూడా ఉన్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన ఫీచర్స్‌ లీక్‌ అవ్వడం ఇదే మొదటి సారి కాదు.. వీటికి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఫీచర్స్‌ ఎన్నో సార్లు సోషల్‌లో మీడియాలో కనిపించిన్నట్లు తెలుస్తోంది.. ఇక దీనిని కంపెనీ 2026 సంవత్సరం మార్చిలో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

లీక్‌ అయిన వివరాల్లోకి వెళితే.. Samsung Galaxy A37 స్మార్ట్‌ఫోన్‌ Exynos 1480 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఎంట్రీ-లెవల్ మొబైల్స్‌ కంటే.. మధ్య శ్నేణి విభాగానికి సంబంధించిన మోడల్‌గా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీనిని కంపెనీ 6జీబీ ర్యామ్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన బ్యాక్‌ ప్యానెల్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 50MP సెన్సార్‌తో ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది.

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో అదనంగా 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు 5MP మాక్రో లెన్స్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో పాటు 45W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌ అవుతోంది. అలాగే ఇందులో మరెన్నో అద్భుతమైన ఫీచర్స్‌ను కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వన్ UI 8.5తో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. 

ఈ గెలాక్సీ A57 స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌లో కొన్ని స్పెషల్ ఫీచర్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన Exynos 1680 ప్రాసెసర్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా  లీక్‌ అయిన వివరాల ప్రకారం, 6.6-అంగుళాల AMOLED ప్యానెల్‌ డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతో పాటు 45W ఛార్జింగ్‌ సపోర్ట్‌ కూడా లభిస్తోంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RGRenuka Godugu
Feb 19, 2026 06:06:09
Hyderabad, Telangana:

Gang Rape In Hyderabad Narsingi: హైదరాబాద్‌లోని నార్సింగిలో మరోసారి రౌడీషీటర్లు రెచ్చిపోయారు. బాలికకు బలవంతంగా గంజాయి తాగించి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా ఈ వార్తా సంచలనంగా మారింది. అయితే ఈ బాలిక మాత్రం చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మాయిగా పోలీసులు గుర్తించారు. నార్సింగి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదయింది. ఆమె నానమ్మతో కలిసి ఉంటున్న అమ్మాయి మిస్ అవ్వటం జరిగింది. సదరు అమ్మాయిని కిడ్నాప్ చేసి బలవంతంగా గంజాయి తాగించారు. మత్తులో ఉన్న ఆ బాలిక పైశాచికానికి పాల్పడ్డారు. గంజాయి రౌడీషీటర్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘతంలో కూడా ఈ నార్సింగి పరిధిలో మైనర్‌ బాలికపై దారుణం జరిగిన సంగతి తెలిసిందే. 

రెండు రోజుల క్రితమే బాలిక మిస్ అయినట్లు కేసు కూడా నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే నిందితులు ఇద్దరు కూడా మైనర్లని పోలీసు అధికారి హరీష్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఘటన చింగిచెర్ల ప్రాంతంలో జరిగినట్లు వెల్లడించారు. రెండు రోజుల నుంచి అమ్మాయి కనిపించడం లేదని మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. తాజా ఘటనతో నిందితులపై పోక్సోకేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. కోకాపేట్ నివాసులు అయిన బాధిత కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read more:​  సునీత ఆ పోస్టులు పెట్టకుంటే బతికేదేమో..? అక్కసుతోనే నెలరోజులుగా రెక్కీ వేసి అంతమొందించాడు..!

Read more:​ Konda Surekha: వేలిముద్ర వాళ్లు కూడా సీఎం అవుతారు.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 19, 2026 05:49:26
Hyderabad, Telangana:

Diabetes Home Remedies: నేటి కాలంలో డయాబెటిస్ (మధుమేహం) అనేది ఒక పెద్ద ఆరోగ్య సవాలుగా మారింది. శరీరం తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేనప్పుడు లేదా ఉన్న ఇన్సులిన్‌ను సరిగ్గా వినియోగించుకోలేనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్‌ను పూర్తిగా నయం చేయడం కష్టమైనప్పటికీ, సరైన ఆహారపు అలవాట్లు, వంటింటి దినుసులతో దానిని సులభంగా నియంత్రించవచ్చు.

మెంతులు చక్కెరను ఎలా నియంత్రిస్తాయి?
మెంతులు కేవలం రుచికే కాదు, ఔషధ గుణాలకు కూడా పెట్టింది పేరు. ఇందులో ఉండే కొన్ని ప్రత్యేక అంశాలు మధుమేహ రోగులకు మేలు చేస్తాయి. మెంతుల్లో ఉండే 'గెలాక్టోమన్నన్' అనే పీచు పదార్థం జీర్ణక్రియ వేగాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఆహారం తిన్న తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది.

ఇందులో ఉండే '4-హైడ్రాక్సీఐసోలూసిన్' అనే అమైనో ఆమ్లం క్లోమ గ్రంథిని ప్రేరేపించి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. మెంతులు శరీరంలో కార్బోహైడ్రేట్లు, చక్కెర గ్రహించే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి.

మెంతి పొడిని ఎలా వాడాలి?
గరిష్ట ఫలితాల కోసం మెంతి పొడిని ఈ క్రింది పద్ధతుల్లో తీసుకోవచ్చు. ఒక టీస్పూన్ మెంతి పొడిని గ్లాసు గోరువెచ్చని నీటితో కలిపి ఉదయాన్నే తీసుకోవాలి. మధ్యాహ్నం భోజన సమయంలో ఒక కప్పు పెరుగులో చెంచా మెంతి పొడి కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

రాత్రిపూట ఒక టీస్పూన్ మెంతులను నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగి, గింజలను నమిలి తినడం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కూరలు లేదా ఇతర వంటకాలపై అర టీస్పూన్ మెంతి పొడిని చల్లుకోవడం ద్వారా రోజువారీ ఆహారంలో దీనిని భాగం చేసుకోవచ్చు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్త ఆహారపు అలవాటును ప్రారంభించే ముందు లేదా మందులకు బదులుగా వీటిని వాడే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించండి.)

Also Read: Vijay And Rashmika Net Worth: వారంలో విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి? వీరిద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారో తెలుసా?

Also REad: Madanapalle Girl Incident: బాలిక హత్యాచార నిందితుడు ఆత్మహత్య..మదనపల్లెలో బాణాసంచాతో సంబరాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RGRenuka Godugu
Feb 19, 2026 05:20:35
Hyderabad, Telangana:

Vanasthalipuram Ex Husband Kill Software Update: వనస్థలిపురం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మాజీ భర్త నరికి చంపిన ఘటన తెలిసిందే. అయితే దీనిపై అనేక కారణాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఆమె మొదటి భర్త పై కేసులు పెట్టడం.. రెండో వివాహంతో మృతురాలు సునీత సంతోషంగా ఉంటున్నాను అంటూ ఆమె సోషల్ మీడియా పోస్టులు పెట్టడమే కారణం. మహారాష్ట్రకు చెందిన సునీత.. పెద్దపల్లి వాసి అయిన మహేశ్‌ను 2022 లో పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు నేపథ్యంలో 2024 లోనే విడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్‌ ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేస్తోన్న ఇంజనీర్ శ్రీనాథ్‌ని సునీత వివాహం చేసుకుంది. ఇక రెండో పెళ్లితో తాను ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్లు ఆమె పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ చూసి రగిలిపోయాడు మొదటి భర్త మహేష్. 

 దీంతో నెల రోజులుగా రెక్కీ వేసి ఆ అక్కసుతోనే ఆమెను అంతమొందించాడు.  సీఐ మహేష్ ప్రకారం బీఎన్‌ రెడ్డిలోని గ్రీన్ సిటీ కాలనీలో ఉండే సునీత (30)కు మహేష్ (30) తో వివాహం జరిగింది . వీళ్ళు కొన్ని కారణాలవల్ల మనస్పర్థాలతో విడిపోయారు. సునీత గుట్టు చప్పుడు కాకుండా 2025 లోనే శ్రీనాథ్‌ని రెండో పెళ్లి కూడా చేసుకుంది. 

అయితే వీళ్ళు 2024 లోనే చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె జీవితం కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవల హైదరాబాద్లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో కూడా ఉద్యోగంలో చేరింది. అక్కడే ఆ కంపెనీలోనే పరిచయం ఏర్పడంతో శ్రీనాథ్‌ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి వనస్థలిపురం గ్రీన్ సిటీలో ఉంటున్నారు. అయితే ఇటీవలే మహేష్ కూడా కెనడా వెళ్లేందుకు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే ఆమె సునీత పెట్టిన పాత కేసుల నేపథ్యంలో అతనికి వీసా రిజెక్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తన జీవితం నాశనమైంది.. తను మాత్రం రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా సాగిస్తోందని కక్షతో ఆమెను చంపాలని డిసైడ్ అయ్యాడు మహేష్. ఈ క్రమంలోనే నెల రోజులుగా తుర్కయంజాల్ ప్రాంతంలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఆమెపై రెక్కి వేశాడు. కత్తి, రంపం పదునైన ఆయుధాలు బ్యాగులో పెట్టుకొని తిరిగాడు. భర్త బయటకు వెళ్లిన సమయంలో అపార్ట్‌మెంట్లో మెట్ల మార్గం ద్వారా వెళ్లి సునీత ఇంటి తలుపు తట్టాడు. వెంటనే అతని చూసి షాక్ అయిన సునీతను మహేష్ బలవంతంగా గొడవకు దిగాడు. అనంతరం తెచ్చుకున్న కత్తులతో ఆమెను నరికేశాడు. దీంతో అత్త పెద్దగా కేకలు వేయడంతో పక్కింటి వారు వచ్చి చూసేసరికి గదిలోనే ఉన్న మహేష్ లోపల నుంచి గడియ పెట్టాడు. ఆ తర్వాత పోలీసులు వెంటనే రావడంతో తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. ఇక పోలీసులు చాకచక్యంగా నిందితుడిని అరెస్టు చేశారు.

Read more:​ విద్యార్థులకు తల్లిదండ్రులకు అలెర్ట్‌.. మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు..!

Read more:​ Konda Surekha: వేలిముద్ర వాళ్లు కూడా సీఎం అవుతారు.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top