Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Karimnagar505001

కరీంనగర్ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఐద్వాలో ప్రారంభమయ్యాయి

Jul 26, 2024 13:02:38
Karimnagar, Telangana

ఈరోజు స్థానిక కరీంనగర్ లోని ముకుంద్ లాల్ మిశ్రా భవన్ లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో నాలుగు రోజుల పాటు రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ తరగతుల్లో మహిళా సమస్యలపై చర్చించి భవిష్యత్‌ పోరాటాలపై చర్చిస్తామన్నారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 09, 2026 19:06:11
Hyderabad, Telangana:

Telangana Schools Holiday: కొత్త సంవత్సరంలో రెండో నెల రాగా.. ఈనెలలో అస్సలు సెలవులు లేవు. మొత్తం డ్రై డేగా ఉందనుకుంటున్న సమయంలో అనూహ్యంగా స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవులు వచ్చేశాయి. సంక్రాంతి పండుగ తర్వాత మళ్లీ భారీగా సెలవులు వస్తున్నాయి. మొత్తం నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. ఇప్పటివరకైతే అధికారికంగా వచ్చిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో రేపు సెలవు ఉంది. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఉండడంతో పోలింగ్‌ ఉన్న ప్రాంతంలో ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. ఇప్పటికే ఈ సెలవుకు సంబంధించిన ఉత్తర్వులు విడులయ్యాయి.

Also Read: Srisailam: శ్రీశైలం కొండపై కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. భక్తులు, శివస్వాముల ఆందోళన

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ సెలవులు ఉండనుంది. అయితే ఈ సెలవు తెలంగాణవ్యాప్తంగా కాకుండా పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉండనుంది. ఎందుకంటే మున్సిపల్‌ ఎన్నికలు కావడంతో పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లు మూసి వేసి ఉండనున్నాయి. కొన్ని జిల్లాలు, పట్టణాల్లో మాత్రమే ఈ సెలవు వర్తించనుంది. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగుతున్నాయి.  116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనుండగా.. ఈ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రచారం ముగియగా ఎన్నికలు రేపు అంటే ఫిబ్రవరి 11వ తేదీన జరగనున్నాయి. దీంతో విద్యాశాఖ అధికారులు ఫిబ్రవరి 11న సెలవు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో బుధవారం రోజున విద్యాసంస్థలు మూసి ఉండనున్నాయి.

Also Read: Govt Employees: 33 ఏళ్ల సర్వీస్‌కే ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ రిటైర్మెంట్‌.. కొత్త సర్వీస్‌ రూల్స్‌పై ఆగ్రహం

అయితే మరో మూడు సెలవులు కలిసి రానున్నాయి. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదీన వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా ప్రాంతాల్లో స్కూళ్లు, కార్యాలయాలకు సెలవులు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ సెలవుకు సంబంధించి ఇంకా ఉత్తర్వులు వెలువడలేదు. ఆ రోజు సెలవు లభిస్తే మాత్రం అదనంగా రెండు సెలవులు కలిసి రానున్నాయి. ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 14వ తేదీ రెండో శనివారం కాగా, 15న ఆదివారం ఉంది. శుక్రవారం సెలవు వస్తే ఈ వారంలో మొత్తం నాలుగు రోజులు కానున్నాయి. దీంతో విద్యార్థులు పండుగ చేసుకునే అవకాశం ఉంది. ఇక రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు మాత్రం కొందరికి ఆనందం నింపుతుండగా.. మిగతా వారికి చేదు అనుభవం మిగిల్చనుంది.

Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే యూటర్న్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 09, 2026 17:58:02
Srisailam, Andhra Pradesh:

Srisailam Temple: మహాశివరాత్రి నేపథ్యంలో శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న సమయంలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రశాంతంగా ఉండాల్సిన శ్రీగిరిపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ భక్తులతోపాటు శివస్వాములు క్యూలైన్‌లలో నిండిపోయారు. గంటల కొద్దీ దర్శనం కోసం క్యూలైన్‌లలో వేచి ఉండగా.. ఎంతకీ దర్శనానికి వదలకపోవడంతో శైవ భక్తుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో భక్తుల నిరసనలతో శ్రీశైలం క్షేత్రం మార్మోగింది.

Also Read: Govt Employees: 33 ఏళ్ల సర్వీస్‌కే ప్రభుత్వ ఉద్యోగులు తక్షణ రిటైర్మెంట్‌.. కొత్త సర్వీస్‌ రూల్స్‌పై ఆగ్రహం

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యూలైన్స్ కంపార్ట్‌మెంట్‌లలో గంటల తరబడి దర్శనం కోసం వేచి ఉండడంతో పలువురు భక్తులు కళ్లు తిరిగిపడిపోయారు. చాలా మంది నీరసించిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాగడానికి సరైన నీరు, వైద్య సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో శ్రీశైల ఆలయం వద్ద శివస్వాములు ఆందోళనకు దిగారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దేవస్థానం అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఏఎస్పీ యుగంధర్ బాబు, జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ప్రయత్నించినప్పటికీ ఉద్రిక్తత తగ్గలేదు.

Also Read: Harish Rao: కారు గుర్తు మీద గుద్దే ఓటుతో రేవంత్ రెడ్డికి గువ్వ పలగాలి: హరీశ్ రావు

భక్తుల రద్దీ నియంత్రణ పేరుతో పోలీసులు లాఠీలతో బెదిరింపులకు దిగారని శివదీక్ష భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పలువురు శివస్వాములు రాజగోపురం నుంచి దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగారు. శ్రీశైల ఆలయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని శివస్వాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం గందరగోళంగా మారడంతో శివభక్తులు, శివమాలధారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ నిబంధనలు కూడా ఈ పరిస్థితికి కారణమని శివస్వాములు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Revanth Reddy: మోరీ సమస్య వస్తే మోదీని కలుస్తారా? బీజేపీపై విరుచుకుపడ్డ రేవంత్‌ రెడ్డి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 09, 2026 14:00:36
Tadepalli, Andhra Pradesh:

Govt Employees Mandatory Retirement: అధికారంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌పై ఉద్యోగ వర్గాలతోపాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉద్యోగులపై ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అంటూ వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది. 33 ఏళ్ల సర్వీసుకే రిటైర్మెంటా? అని వైఎస్సార్‌సీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. కొత్త రూల్స్‌తో ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని? 33 ఏళ్లకే బలవంతంగా పదవీ విరమణ పొందాలనే నిబంధన సరికాదని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు తమ విలువైన సర్వీస్ కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రివర్స్‌లో కూటమి సర్కార్ రూల్స్ అని నలమారు చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. 'ఉద్యోగులపై సర్కార్ కపట ప్రేమ. ఎన్నికల హామీల్ని గాలికొదిలేసింది. ఒకటో తేదీకి జీతాలు ఇవ్వట్లేదు. మధ్యంతర భృతి, పీఆర్సీ మాటేలేదు' అని నలమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.

Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే యూటర్న్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి

తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు తప్పనిసరి రిటైర్మెంట్ ఇచ్చేలా తెస్తున్న నిబంధనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని కూటమి ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన బకాయిలతో పాటు మధ్యంతర భృతి, పీఆర్‌సీని గాలి కొదిలేసిందని గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగుల్ని  సర్వేల  పేరుతో తీవ్ర ఒత్తిడి చేసి వాళ్ల చావులకు కారణమవుతున్నారని ఆరోపించారు.

Also Read: Chandrababu: కాలం చెల్లిన చట్టాలను మార్చుకుందాం.. వేగంగా పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

'ఉద్యోగుల కోసం ప్రభుత్వం ముసాయిదా నిబంధనలు తీసుకొచ్చింది. కొత్త రూల్స్‌తో తమకు మేలు జరుగుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు భావిస్తుంటే.. ఆ నిబంధనలు చూస్తుంటే కూటమి ప్రభుత్వం రివర్స్‌లో వెళ్తుందనే భావన కలుగుతోంది. 33 ఏళ్ల సర్వీసు చేసిన వాళ్లను ప్రభుత్వం తొలగిస్తుందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది' అని నలమారు చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. కొత్త రూల్స్‌తో ప్రభుత్వం ఉద్యోగులను ఏం చేయాలనుకుంటుందోని ప్రశ్నించారు. '62 సంవత్సరాలు పదవీ విరమణ వయస్సు ఉంటే 33 ఏళ్ల సర్వీసు తర్వాత ఉద్యోగం నుంచి తొలగించాలనే నిబంధన తెస్తున్నారు. ఒక ఉద్యోగి 25 ఏళ్లకు సర్వీసులో చేరితే దానికి 33 సంవత్సరాలు కలుపుకుంటే 58 ఏళ్ల సర్వీసు అవుతుంది. దీంతో నాలుగేళ్ల సర్వీస్ కోల్పోవాల్సి వస్తోంది' అని నలమారు చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.

Also Read: Harish Rao: కారు గుర్తు మీద గుద్దే ఓటుతో రేవంత్ రెడ్డికి గువ్వ పలగాలి: హరీశ్ రావు

'ఉద్యోగ విరమణ వయస్సును జగన్‌ ప్రభుత్వం 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచితే.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 33 సంవత్సరాల సర్వీసు పూర్తయితే రిటైర్మంట్ ఇవ్వాలనుకుంటోంది. ఇదేనా ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ?' అని నలమారు చంద్రశేఖర్ రెడ్డి నిలదీశారు. 'ఉద్యోగులకు చెప్పేవన్నీ అబద్ధాలే. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇస్తామన్న హామీ, అలాగే పీఆర్సీ ఇస్తామన్న హామీ, బకాయిలు చెల్లింపు హామీ ఇప్పటివరకూ నెరవేర్చలేదు' అని గుర్తుచేశారు.

'సచివాలయ ఉద్యోగులు తమ  విధులతో పాటు అదనంగా బూత్ లెవెల్ అధికారులుగా ఎస్ఐఆర్ పని కూడా చేయాల్సి వస్తోంది. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి 6 ఏళ్ల సర్వీసు తర్వాత ప్రమోషన్ తర్వాత ఆటోమేటిక్ అడ్వాన్స్ మెంట్ పథకం కింద ఒక ఇంక్రిమెంట్ కూడా ఇవ్వాలి. కానీ సచివాలయ ఉద్యోగులకు ఈ ఇంక్రిమెంట్ ఇవ్వడం లేదు. వాలంటీర్ల విధులు కూడా వీరికి అప్పగించి సొంత ట్యాబ్‌లతో పని చేయిస్తున్నారు' అని నలమారు చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. 'పెండింగ్‌లో నాలుగు డీఏలు ఇవ్వకుండా.. 12వ పీఆర్సీకి కొత్త కమిషనర్‌ను నియమించకుండా ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.30 నుంచి 35 వేల కోట్లు ఉన్నాయి' అని నలమారు చంద్రశేఖర్ రెడ్డి గుర్తుచేశారు. వెంటనే కొత్త సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయొద్దని.. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌ బిల్లులు, డీఏలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 09, 2026 12:51:35
Medak, Telangana:

Municipal Elections: 'ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకు పోవడం ఖాయం అని.. అందుకే ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్ధం చేశాడు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలు మాయం చేశాడు. ప్రమాదవశాత్తు జరిగింది కాదు.. రేవంత్ డైరెక్షన్‌లో జరిగిన ప్రమాదం అది' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు పునరుద్ఘాటించారు. 'ఫోరెన్సిక్ ల్యాబ్ జరిగిన అగ్ని ప్రమాదం వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉంది. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ. జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది.. అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైదరాబాద్‌లో ఫోరెన్సిక్ ల్యాబ్‌ను దగ్ధం చేశాడు' అని హరీశ్‌ రావు వివరించారు.

Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే యూటర్న్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మెదక్‌లో మాజీ మంత్రి హరీశ్‌ రావు పర్యటించి కీలక ప్రసంగం చేశారు. 'పోలీసుల సహకారంతో ఈ కుట్ర పన్నాడు. హైదరాబాద్‌లో పేదల బతుకులు కూల్చాడు. జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలను మాయం చేశాడు. రేవంత్ డైరెక్షన్‌లో పోలీసులు చేసిన దహనకాండ. ఓటుకు నోటు కేసులో రేవంత్‌కు శిక్ష పడక తప్పడు, జైలుకు పోక తప్పదు' అని హరీశ్‌ రావు ప్రకటించారు. రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ చేసింది గుండు సున్నా అని తెలిపారు.

Also Read: Revanth Reddy: మోరీ సమస్య వస్తే మోదీని కలుస్తారా? బీజేపీపై విరుచుకుపడ్డ రేవంత్‌ రెడ్డి

'మెదక్‌కు వచ్చేందుకు రేవంత్ రెడ్డికి ముఖం లేదు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పడంతోనే భయం. రుణమాఫీ మాట తప్పి మోసం చేశాడు. రైతుబంధు ఎగ్గొట్టాడు.. ఎరువుల కరువు తెచ్చిండు రేవంత్ రెడ్డి' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. రేవంత్ బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని చేయలేదని ప్రకటించారు. 'రంజాన్ తోఫా, షాదీ ముబారక్, తులం బంగారం రేవంత్‌ రెడ్డి ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గురుకులాలు, షాదీఖానా ఏర్పాటు చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని సెక్యూలర్ పార్టీగా నిలబెట్టారు' అని గుర్తుచేశారు.

తెల్లవారితే కేసీఆర్‌ను తిడుతుంటాడు. కేసీఆర్‌ను తిడితే, హరీష్ రావును తిడితే పేదల కడుపు నిండుతుందా? అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి దారుణంగా మోసం చేశాడని.. ఎస్సీ, బీసీ, ఎస్టీ పిల్లల చదువులను ఆగం చేశాడని.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అని దగా చేశాడని వివరించారు. రెండు లక్షల ఉద్యోగాలను నిరుద్యోగులను మోసం చేశాడు.. మెదక్‌లో నీ పిట్ట బెదిరింపులకు, చిల్లర బెదిరింపులకు భయపడం అని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. బిల్లులు మీ జేబుల నుంచి ఇస్తున్నారా? మీ జాగీరా? అని ప్రశ్నించారు. బరాబర్ బిల్లులు వస్తయి, కొట్లాడి సాధించుకుంటామని హరీశ్‌ రావు ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 09, 2026 11:50:51
Hyderabad, Telangana:

Bitcoin Investment In India: క్రిప్టో మార్కెట్‌లో ధరల తగ్గుదల అనేది కొత్త పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించినప్పటికీ, అనుభవజ్ఞులకు మాత్రం అది ఒక సాధారణ ప్రక్రియ. ఫిబ్రవరి 2026 ప్రారంభంలో బిట్‌కాయిన్ ధరల్లో కనిపిస్తున్న ఒడిదుడుకులపై జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బరాజ్ తన విశ్లేషణను, పెట్టుబడిదారులకు అవసరమైన మూడు ముఖ్యమైన వ్యూహాలను వివరించారు.

ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల అనిశ్చితి, లాభాల స్వీకరణ వంటి కారణాలతో ప్రభావితమవుతున్నాయి. అయితే చరిత్రను పరిశీలిస్తే, ప్రతి పతనం తర్వాత బిట్‌కాయిన్ మరింత బలంగా కోలుకుందని స్పష్టమవుతోంది.

చరిత్రను గమనిస్తే, బిట్‌కాయిన్ గతంలో అనేకసార్లు భారీగా పడిపోయింది. 2018 & 2022 సంవత్సరాల్లో బిట్‌కాయిన్ తన గరిష్ట స్థాయిల నుండి 80% వరకు క్షీణించింది. కానీ, ఆ అనిశ్చితి సమయంలో ఓపికగా ఉన్న పెట్టుబడిదారులు తదుపరి బుల్ మార్కెట్‌లో అద్భుతమైన లాభాలను ఆర్జించారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మార్కెట్ దిగువ స్థాయిని ఖచ్చితంగా అంచనా వేయడం కంటే, అనిశ్చితిలోనూ పెట్టుబడిని కొనసాగించడం ముఖ్యం.

3 ప్రధాన వ్యూహాలు
1) సంయమనం ధరలు వేగంగా పడిపోతున్నప్పుడు భయంతో అమ్మేయడం పెట్టుబడిదారులు చేసే అతిపెద్ద తప్పు. మార్కెట్ నుండి 'బలహీనమైన చేతులు' బయటకు వెళ్ళిపోయిన తర్వాతే ధరలు స్థిరీకరించబడతాయి. అందుకే ఒత్తిడికి లోనుకాకుండా వేచి చూడటం మొదటి సూత్రం.

2) క్రమబద్ధమైన పెట్టుబడి ఒక్కసారిగా పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం కంటే క్రిప్టో SIP ఉత్తమ మార్గం. ధరలు తగ్గినప్పుడు ఎక్కువ కాయిన్లను, పెరిగినప్పుడు తక్కువ కాయిన్లను కొనడం ద్వారా మీ సగటు కొనుగోలు ధర తగ్గుతుంది. ఇది భావోద్వేగపూరిత నిర్ణయాలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

3) పోర్ట్‌ఫోలియో క్రమశిక్షణ మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం మేరకే పెట్టుబడి ఉండాలి. మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు అధిక లివరేజ్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలి. బిట్‌కాయిన్ ప్రయాణాన్ని రోజుల్లో కాకుండా, సంవత్సరాల ప్రాతిపదికన చూడాలి.

అస్థిరత అనేది క్రిప్టో మార్కెట్ ఒక సహజ లక్షణం. ప్రస్తుత ధరల తగ్గుదల అనేది కేవలం తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమే. దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉండేవారికి, ఈ సమయం తమ పోర్ట్‌ఫోలియోను పునఃసమీక్షించుకోవడానికి, క్రమంగా పెట్టుబడులను పెంచుకోవడానికి ఒక మంచి అవకాశం.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికలు, నిపుణుల ఆధారంగా సేకరించినది. వీటిలో పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.) 

Also Read: Suma Cash Program News: సుమ 'క్యాష్' అంతా మోసం..బండారం బయటపెట్టిన కమెడియన్ సుదర్శన్!

Also REad: Bird Flu Cases In AP: ఏపీలో బర్డ్‌ ఫ్లూ పంజా..భారీగా పెరిగిన కేసులు..చికెన్, కోడిగుడ్లు తింటున్నారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 09, 2026 11:23:37
Hyderabad, Telangana:

Telangana Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగింపు వేళ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. మున్సిపాలిటీల్లో మోరీ సమస్య వస్తే మోదీ వచ్చి పని చేస్తారా? అని ప్రశ్నించారు. పట్టణ ప్రాంత ప్రజల తీర్పు ఇవ్వబోతున్న నేపథ్యంలో తమ భవిష్యత్‌ను దృష్టి పెట్టుకుని తీర్పు ఇవ్వాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండబోతోందని ప్రకటించారు.

Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే యూటర్న్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మున్సిపల్‌ ఎన్నికలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'మూడుసార్లు అధికారంలో ఉన్న బీజేపీ, మోడీని చూసి ఓటేయమని వాళ్లు అన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రులుగా ఉన్న వారు గతంలో ఇచ్చిన హామీలు మర్చిపోయారు. నీట మునిగిన వారికి ఇంతవరకు సాయం చేయలేదు. ఓట్లేస్తే కేంద్రం నిధులు తెస్తామని మళ్లీ చెబుతున్న వాళ్లను నమ్ముతారా?' అని ప్రశ్నించారు. 'రూ.లక్షల కోట్లు ఇచ్చామని అంటున్నారు మరి ఆ డబ్బు ఎక్కడ పోయింది' అని నిలదీశారు.

Also Read: Chandrababu: కాలం చెల్లిన చట్టాలను మార్చుకుందాం.. వేగంగా పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

'పన్నుల ద్వారా వచ్చే డబ్బు అని తేలిన అందులో కూడా వివక్ష చేస్తున్నారు. వాటా సరిగ్గా దక్కడం లేదని ఫైనాన్స్ వాళ్లు క్లారిటీ ఇచ్చారు. ఉత్తరాది వాళ్లకు ఒక న్యాయం మనకో న్యాయం చేస్తున్నారు. మనం ఒక్క రూ. చెల్లిస్తే 42 పైసలే కేంద్రం నుంచి వస్తున్నాయి' అని బడ్జెట్‌ వివరాలు రేవంత్‌ రెడ్డి వివరించారు. 'బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి ఇద్దరూ ఇక్కడ ఉండి ఏం లాభం ఎందుకు అడగడం లేదు మీరు? మోదీ దగ్గర రాష్ట్ర పరువు ను తాకట్టు పెడుతున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'జాతీయ ప్రాజెక్టు కింద ఏమన్నా తెచ్చి ఉంటే వీళ్లు ప్రయత్నం చేసినట్టు. కానీ ఏమీ చేయలేదు. గుజరాత్‌కు సబర్మతీ రివర్ ఫ్రంట్‌కు ఇస్తారు. ఇలా చాలా రాష్ట్రాలకు ఇస్తారు ఇక్కడ మీరెందుకు ఏం చేయరు?' అని కేంద్ర మంత్రులను రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. వరదలొచ్చినా కూడా మనకు అన్యాయం చేశారని తెలిపారు. ఎయిర్‌ పోర్టులోను అన్యాయమేనని చెప్పారు.

Also Read: Harish Rao: హామీలు ఎగ్గొట్టిన రేవంత్‌ రెడ్డి అసలైన 'నకిలీ': హరీశ్‌ రావు

'మోరి సమస్య వస్తే మోడీ ని కలుస్తారా ? కౌన్సిలర్లు ఎందుకు ఓట్లు వేయమంటారు? వాళ్ల దేవుడు అసద్ మాత్రమే. ఎన్నో సార్లు తలుచుకుంటున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నారు' అని బీజేపీపై రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 'పదేళ్లు పాలించినా బీఆర్‌ఎస్‌ వాళ్లు ఓట్లు అడుగుతున్నారు. మొత్తం సీఎం నుంచి కౌన్సిలర్ పదవులు వరకు చేసిన బాగా చేస్తాము ఓట్లేయండి అంటే నమ్మేదెలా?' అని రేవంత్ రెడ్డి నిలదీశారు. 'మిగతా మంత్రులు తోలు బొమ్మలుగా ఉంచి మీ ముగ్గురే మాత్రమే కీలక శాఖల్లో ఉన్నారు. రూ.20 లక్షల కోట్లు ఇస్తే ఏం చేశారు ఇన్నేళ్లు. కనీసం రేషన్ కార్డులు కాదు సన్న బియ్యం ఇచ్చారా?' అని ప్రశ్నించారు.

Also Read: Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 09, 2026 11:03:51
Hyderabad, Telangana:

Suma Cash Program Fake Or Real: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన షోలలో యాంకర్ సుమ హోస్ట్ చేసిన 'క్యాష్' (Cash) ఒకటి. సెలబ్రిటీలు పాల్గొనే ఈ షోలో లక్షలాది రూపాయల నగదు గెలుచుకున్నట్లు చూపించే సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేవి. అయితే, నిజంగానే అంత నగదు ఇస్తారా? అక్కడ పగిలిపోయే ఫర్నీచర్ అసలైనదేనా? అనే సందేహాలకు కమెడియన్ సుదర్శన్ షాకింగ్ నిజాలను వెల్లడించారు. చాలా ఏళ్ల పాటు విజయవంతంగా నడిచిన 'క్యాష్' ప్రోగ్రామ్ గురించి జనాలు అనుకునేదానికి, అక్కడ జరిగేదానికి అస్సలు సంబంధం లేదని తేలిపోయింది.

కమెడియన్ సుదర్శన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. "నేను దాదాపు ఐదారు సార్లు 'క్యాష్' షోకి వెళ్లాను. వెళ్లిన ప్రతిసారీ రూ. 70-80 లక్షలు గెలుచుకున్నట్లు చూపించారు. అంటే మొత్తం మీద నేను రూ.3-4 కోట్లు సంపాదించానని మా ఊర్లో వాళ్లంతా నమ్మేశారు. కానీ, నిజానికి అక్కడ ఒక్క రూపాయి కూడా ఇవ్వరు" అని చెప్పుకొచ్చాడు.

షో రేటింగ్ కోసం, ఉత్కంఠ పెంచడం కోసం మాత్రమే ఆ భారీ ప్రైజ్ మనీని గ్రాఫిక్స్‌లో లేదా బోర్డులపై చూపిస్తారు. ప్రతి వారం వచ్చే సెలబ్రిటీలకు కోట్లాది రూపాయలు ఇవ్వడం ఏ ఛానల్‌కైనా అసాధ్యమైన పని.

ఆ పగిలిపోయే ఫర్నీచర్ కథేంటి?
షోలో సమాధానం తప్పు చెబితే పైనుంచి ఫర్నీచర్, టీవీలు, బైక్‌లు కిందపడి పగిలిపోతుంటాయి. దీని వెనుక ఉన్న రహస్యం ఆశ్చర్యకరమైనదే! అవి అసలైన ఫర్నీచర్ కాదు. ప్రేక్షకులకు నిజమైన అనుభూతి కలిగించేందుకు డమ్మీ వస్తువులను ఉపయోగిస్తారు. పైనుంచి కింద పడేసేటప్పుడు రకరకాల యాంగిల్స్‌లో షూట్ చేసి, ఎడిటింగ్‌లో అవి భారీ ఖరీదైన వస్తువులనే భ్రమను కలిగిస్తారు.

ప్రమోషన్ల కోసం రివర్స్ పేమెంట్!
సాధారణంగా షోకి వచ్చిన వారికి డబ్బులు ఇస్తారని అందరూ భావిస్తారు. కానీ, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ప్రమోషన్ కోసం ఈ షోకి వస్తాయి. తమ సినిమాను కోట్లాది మంది ప్రేక్షకులకు చేరువ చేసేందుకు మూవీ టీమ్స్ రివర్సులో ప్రొడక్షన్ హౌస్‌కు డబ్బులు చెల్లించి ఈ షోలో పాల్గొంటాయి.

'క్యాష్' నుండి 'సుమ అడ్డా' వరకు
కొన్ని కారణాల వల్ల 'క్యాష్' షోని నిలిపివేసి, ఇప్పుడు అదే తరహాలో 'సుమ అడ్డా' పేరుతో కొత్త షోని నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా వినోదానికి పెద్దపీట వేస్తూ సెలబ్రిటీలతో సందడి చేస్తున్నారు.

సుమ 'క్యాష్' ప్రోగ్రామ్ అనేది ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ షో. అందులో కనిపించే లక్షల రూపాయల నగదు, పగిలిపోయే ఖరీదైన వస్తువులన్నీ కేవలం స్క్రిప్ట్, షో ఫార్మాట్‌లో భాగమే. సుదర్శన్ మాటలతో ఈ షోపై ఉన్న మిస్టరీ వీడిపోయింది.

Also Read: Bird Flu Cases In AP: ఏపీలో బర్డ్‌ ఫ్లూ పంజా..భారీగా పెరిగిన కేసులు..చికెన్, కోడిగుడ్లు తింటున్నారా?

Also Read: Farewell Party Obscene Dance: స్కూల్లో రికార్డింగ్ డ్యాన్సులు..ఫెయిర్‌వెల్ పార్టీలో అశ్లీల నృత్యాలు..వీడియో వైరల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 09, 2026 10:31:07
Amaravati, Andhra Pradesh:

AP CM Review Meeting: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన అందిద్దామని అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు సూచించారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే రాష్ట్రాభివృద్ధి అని ప్రకటించారు. కాలం చెల్లిన చట్టాలను మార్చుకుందామని.. సంక్షేమంతోనే అసమానతలు తగ్గుతాయని తెలిపారు. ప్రపంచంతో పోటీ పడాలంటే.. ప్రపంచస్థాయి ప్రమాణాలు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంజీతో అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సమష్టి కృషితో లాభాల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్ అని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

Also Read: Gudem Mahipal Reddy: కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే యూటర్న్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి

వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలపై చర్చించారు. 2026-27లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై ప్రస్తావించారు. నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూయర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, శాంతిభద్రతలు తదితర అంశాలపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Harish Rao: హామీలు ఎగ్గొట్టిన రేవంత్‌ రెడ్డి అసలైన 'నకిలీ': హరీశ్‌ రావు

అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టుగా భావించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని.. వాటిని నిబద్దతతో క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంటుందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 'నెల వారీగా సమీక్షించుకోవాలి, క్షేత్రస్థాయిలో పనుల్ని బేరీజు వేసుకోవాలి. ప్రతీ నెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించి ఎస్ఐపీబీ ద్వారా ప్రాజెక్టులకు ఆమోదం ఇస్తున్నాం. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, ఇంఛార్జ్ మంత్రులు కూడా అదే వేగంతో పనులు జరిగేలా చూడాలి' అని సూచించారు.

Also Read: Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌

'ఏపీలో చేపట్టిన కార్యక్రమాలు, టెక్నాలజీ సహా ఏఐ అప్లికేషన్ల వినియోగం ఎలా జరుగుతుందో అంచనా వేసుకోవాలి. ప్రతీ మూడు నెలలకోసారి ప్రభుత్వ ప్రగతి, పనుల పురోగతిపై బేరీజు వేస్తున్నాం. ఇలా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏమేరకు చేరుకున్నామన్నదానిపై స్పష్టతతో ఉంటున్నాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. 'గత పాలన అగాధం, అంధకారం నుంచి రాష్ట్రాన్ని బయటపడేశాం. వ్యవస్థలను తిరిగి గాడీన పెట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం' అని ప్రకటించారు.

'సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. తల్లికి వందనం ద్వారా రూ.10 వేల కోట్ల తల్లుల ఖాతాల్లో వేశాం. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మొబిలిటి పెరిగి 4.29 కోట్ల మేర ఉచిత ప్రయాణాలు చేశారు. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.6,310 కోట్ల ఆర్ధిక సహకారం అందించాం. రాయలసీమలో హార్టి కల్చర్ హబ్, కోస్తాలో ఆక్వా కల్చర్ పెంచేలా చర్యలు చేపట్టాం. రైతు ఆత్మహత్యలనేవి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం' అని సమావేశంలో సీఎం చంద్రబాబు వివరించారు. 

'దీపం 2.0 ద్వారా 4 విడతల్లో 3.64 కోట్ల గ్యాస్ సిలెండర్లు ఇప్పటి వరకూ ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా రూ.58 వేల కోట్ల మేర ఆర్ధిక చేయూత అందించాం. పేదలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు అవసరమే' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రజల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. అవుట్ డేటెడ్, అవసరం లేని చట్టాలను సమీక్షించుకుని ముందుకు వెళ్దామని.. మెరుగైన ఫలితాలు సాధించడానికి లక్ష్యాలు నిర్దేశించుకుని అంతా కలిసి పని చేద్దామని అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 09, 2026 10:12:46
Masapet, Andhra Pradesh:

Bird Flu Cases In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ బర్డ్‌ ఫ్లూ (ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా) కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లాలో కోళ్ల మరణాలకు బర్డ్‌ ఫ్లూయే కారణమని ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా పౌల్ట్రీ రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది. అన్నమయ్య జిల్లాలోని సదుం మండలంలో కోళ్లు పెద్ద సంఖ్యలో మరణించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వైరస్ ఎలా నిర్ధారణ అయింది?
సదుం మండలంలోని పుత్తవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లో కోళ్లు మృతి చెందడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD) కు పంపగా, అక్కడ 'ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా' పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చనిపోయిన కోళ్లను శాస్త్రీయ పద్ధతిలో లోతైన గోతులు తీసి పాతిపెడుతున్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆరోగ్య శాఖలు కలిసి పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. మదనపల్లెలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అనుమానాలు ఉంటే 70139-14401, 93982-62752 నంబర్లకు సంప్రదించవచ్చు.

చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో కూడా కోళ్లు అనుమానాస్పదంగా మృతి చెందుతున్నాయి. అధికారులు అక్కడి నుంచి కూడా నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. పౌల్ట్రీ రైతులు కఠినమైన 'బయోసెక్యూరిటీ' నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.

బర్డ్ ఫ్లూ పక్షుల నుంచి మనుషులకు సోకడం చాలా అరుదు, కానీ అప్రమత్తంగా ఉండటం అవసరమని వైద్యులు చెబుతున్నారు. చికెన్ లేదా గుడ్లను 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బాగా ఉడికించి తినాలి. సగం ఉడికించిన మాంసం లేదా ఆమ్లెట్లు తినడం ప్రస్తుతానికి మానుకోవాలి. పచ్చి మాంసాన్ని తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

ప్రస్తుతానికి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికారులు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. చనిపోయిన పక్షులు లేదా కోళ్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి.

Also Read: Farewell Party Obscene Dance: స్కూల్లో రికార్డింగ్ డ్యాన్సులు..ఫెయిర్‌వెల్ పార్టీలో అశ్లీల నృత్యాలు..వీడియో వైరల్!

Also REad: EPFO EDLI Scheme: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్..ఉచితంగా రూ.7 లక్షలు.. ఎలా పొందాలో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 09, 2026 09:47:27
Hyderabad, Telangana:

Telangana Municipal Elections: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో మార్పు వస్తోంది. ఈ క్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకున్నారు. కొంత కాలంగా కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉన్న ఆయన మున్సిపల్‌ ఎన్నికల వేళ తిరిగి గులాబీ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సోదరుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన విషయం తెలిసిందే. అతడి చేరికకు సర్వం సిద్ధమైందని.. గూడెం మహిపాల్‌ రెడ్డి తిరిగి గులాబీ గూటికి చేరుతారని చర్చ జరుగుతున్న సమయంలో ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో కొత్త లేబర్‌ కోడ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సమయంలో ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కాకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీల్లో గూడెం తన మద్దతుదారులను గెలిపించాలని కోరారు. మూడుసార్లు బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పటాన్‌చెరు ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్‌ రెడ్డి గెలుపొందారు.

Also Read: Harish Rao: హామీలు ఎగ్గొట్టిన రేవంత్‌ రెడ్డి అసలైన 'నకిలీ': హరీశ్‌ రావు

2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో కోల్పోయి కాంగ్రెస్‌ వచ్చింది. కొన్ని నెలలకే మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించారు. అయితే పార్టీలో జరిగిన తర్వాత అతడికి గౌరవం దక్కపోవడం.. తన అనుచరులకు అవకాశాలు రాకపోవడంతో గూడెం మహిపాల్‌ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉండడంతో మహిపాల్‌ రెడ్డి పునరాలోచనలో పడ్డాడు. తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: YS Sharmila: నామ్ నరేందర్.. కాం సరెండర్: ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

ఈ క్రమంలోనే ఇటీవల కాంగ్రెస్‌లో చేరి తప్పు చేసినట్లు ఓ సమావేశంలో ప్రకటించారు. అందులో భాగంగా తన సోదరుడిని గులాబీ అధినేత కేసీఆర్‌తో సమావేశమై తిరిగి రావడంపై చర్చించినట్లు సమాచారం. తిరిగి చేర్చుకునేందుకు ససేమిరా అన్నారని దీంతో ఆయన గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది. రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి మారడంతో గూడెం మహిపాల్‌ రెడ్డి భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. తిరిగి చేరేందుకు సిద్ధమవగా మరి బీఆర్‌ఎస్‌ పార్టీ ఆహ్వానం పలుకుతుందా లేదా అనేది తెలియాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top