icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow26 Jul 2024, 01:02 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Indonesia Couple Kiss: టిక్‌టాక్‌‌లో లవర్స్ కిస్సింగ్ వీడియో..పబ్లిక్‌లో దారుణంగా కొరడా దెబ్బలు కొట్టిన మతపెద్దలు!

Central Kalimantan:

Indonesia Couple Kiss Video:  ఇండోనేషియాలో ఓ నిర్ఘాంతపోయే సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన ఓ పెళ్లి కాని జంట టిక్‌టాక్ యాప్‌లో ముద్దులు పెట్టుకునే వీడియో ఒకటి పోస్ట్ చేశారు. అయితే ఆ కారణంగా ఆ జంటకు 21 సార్లు కొరడా దెబ్బలను శిక్షగా విధించారు. ఈ విషయం ప్రపంచంలోని ఇతర దేశాల ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆచే అనే ఇండోనేషియాలోని ఒక సంప్రదాయవాద ప్రావిన్స్. ఇక్కడ నివసిస్తున్న ఒక యువ జంట కొన్ని నెలల క్రితం టిక్‌టాక్‌ లైవ్ క్రియేట్ చేసి అందులో ముద్దు పెట్టుకున్నారు. ఫలితంగా వారు ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించారనే ఆరోపణలతో.. గత వారంలో ఒక ఇస్లామిక్ షరియా కోర్టుచే బహిరంగంగా కొరడా దెబ్బలు తిన్నారు.

అయితే ఇండోనేషియా దేశంలో పెళ్లి కాకుండా జంట ముద్దు పెట్టుకోవడం పెద్ద నేరంగా పరగణిస్తారు. అయితే టిక్‌టాక్‌ లైవ్‌లో ఈ విధంగా ముద్దులు పెట్టుకున్న ఆ జంటకు.. నగర షరియా కోర్టు వారిద్దరికీ చెరో 21 సార్లు కొరడా దెబ్బలు కొట్టాలని ఆదేశించింది. ఆచే నగరంలోని బుస్తానుసలాదిన్ పార్కులో ఇలాంటి శిక్షల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై.. ముసుగులు ధరించిన బృందం ఆ ప్రేమ జంటను పబ్లిక్‌గా కొరడాలతో కొట్టింది. ఈ చర్యను కనీసం 100 మంది చూశారని స్థానికులు చెబుతున్నారు. అలా చూడటమే కాకుండా వీడియో కూడా తీసినట్లు తెలుస్తోంది. 

టిక్‌టాక్ లైవ్‌లో ముద్దు పెట్టుకుంటూ పట్టుబడిన ఆ జంట వయసు వరుసగా 25, 22 సంవత్సరాలు. వారిద్దరూ ఈ ఏడాది ఫిబ్రవరిలో టిక్‌టాక్ లైవ్‌లో ముద్దు పెట్టుకున్నారు. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత షరియా అధికారులకు పలు ఫిర్యాదులు అందడంతో ఏప్రిల్‌లో వారిని అరెస్టు చేశారు. ఈ టిక్‌టాక్ లైవ్ వీడియో ఉన్న సెల్ ఫోన్, యూఎస్‌బి ఫ్లాష్ డ్రైవ్‌ను కోర్టు సాక్ష్యంగా స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

న్యాయస్థానం మొదట ఆ జంటకు చెరో 25 కొరడా దెబ్బల శిక్ష విధించింది. అయితే, ఆ నేరానికి గాను ఇద్దరూ అప్పటికే నాలుగు నెలలు జైలు శిక్ష అనుభవించినందున, ఆ 25 కొరడా దెబ్బలను 21కి తగ్గించింది.

ఇండోనేషియాలో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేసే ఏకైక ప్రావిన్స్ ఆచే అని అంటారు. వేర్పాటువాద యుద్ధాన్ని ముగించడానికి కుదిరిన 2006 శాంతి ఒప్పందంలో భాగంగా, ఆ దేశ లౌకిక కేంద్ర ప్రభుత్వం ఈ ప్రావిన్స్‌కు మతపరమైన చట్టాలను అమలు చేసే హక్కును మంజూరు చేసింది. పైన పేర్కొన్న ఆచే ప్రావిన్స్ జనాభాలో 1% ఉన్న ముస్లిమేతరులను కూడా చేర్చడానికి ఈ చట్టాన్ని 2015లో విస్తరించారు. 

శిక్ష ఇంకా దేనికి ఉంటుంది?
పైన పేర్కొన్న చట్టం వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం వంటి విషయాలను అనైతిక నేరాలుగా పరిగణిస్తుంది. అటువంటి నేరాలకు 100 కొరడా దెబ్బల వరకు శిక్ష విధించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. 2025లో బహిరంగంగా కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్నందుకు ఇద్దరు పురుషులకు కొరడా దెబ్బలు వేశారు. అదేవిధంగా మద్యం సేవించేవారికి, జూదం ఆడేవారికి, శుక్రవారం ప్రార్థనలకు హాజరుకాని పురుషులకు ఈ కొరడా దెబ్బల శిక్ష విధిస్తారు. 

మానవ హక్కుల ఉల్లంఘన..
ఇండోనేషియాకు చెందిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆచే ప్రావిన్స్‌లో పిల్లలను బహిరంగంగా కొరడాతో కొట్టడాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ఖండించింది. దీనిని క్రూరమైన, అమానుషమైన శిక్షగా అభివర్ణించింది. దీనిని రద్దు చేయడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందానికి కూడా ఈ సంస్థ మద్దతు తెలిపింది.

Also Read: 15 ఏళ్ల బాలికపై ఆస్ట్రేలియా క్రికెటర్ అత్యాచారం..జైలుకు వెళ్లనున్న ఆసీస్ బౌలర్!

Also Read: "నీ తొడల సైజ్ ఎంత?".. స్టార్ డైరెక్టర్ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయిన మౌనీషా చౌదరి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

తిరుమలలో ఒడిశా, కర్ణాటక గవర్నర్లు.. బండ్ల గణేశ్, దిల్ రాజుతో సహా పలువురు సినీ ప్రముఖులు

Tirupati Urban, Andhra Pradesh:

VIPs Tirumala Darshan: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల కొండకు భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం కావడం.. మంచి రోజులు ఉండడంతో తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖుల రాకతో తిరుమలలో సందడి నెలకొంది. గవర్నర్లు, కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తిరుమలకు తరలివచ్చారు. శ్రీనివాసుడిని ప్రత్యేక దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు.

శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుతోపాటు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ కూడా వచ్చారు. వీరిద్దరూ వేర్వేరుగా స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు.

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్ కూడా శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వారు ఆలయ సంప్రదాయాల ప్రకారం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సినీ, రాజకీయ ప్రముఖులు
తిరుమల వేంకటేశ్వర స్వామివారిని సినీ, రాజకీయ ప్రముఖులు కూడా దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినీ నటుడు సుమన్ స్వామిని దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం పలువురు ప్రముఖులు ఆలయ వెలుపల మీడియాతో స్వల్పంగా మాట్లాడి, శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.

0
0
Report

Aaron Summers Jail: 15 ఏళ్ల బాలికపై ఆస్ట్రేలియా క్రికెటర్ అత్యాచారం..జైలుకు వెళ్లనున్న ఆసీస్ బౌలర్!

Aaron Summers Jailed: మైనర్ బాలికను లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ సమ్మర్స్‌కు జైలు శిక్ష పడనుంది. 2018లో బిగ్‌బాష్ లీగ్ జరిగే క్రమంలో ఓ మైనర్ బాలికను లోబరచుకొని, లైంగికంగా వేధించడమే కాకుండా అసభ్యకరమైన వాటిని ప్రేరేపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో సదరు క్రికెటర్ జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది. 

గతంలో ఆస్ట్రేలియా దేశీయ క్రికెట్‌లో హోబార్ట్ హరికేన్స్, టాస్మానియాకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడు.. ఈ నేరాన్ని స్వయంగా ఒప్పుకోవడం గమనార్హం. 2018లో బిగ్‌బాష్ లీగ్ జరిగే సమయంలో ఓ 15 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పరుచుకొని.. ఆ తర్వాత ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుందా.. అసభ్యకరమైన విషయాలను ప్రేరేపించినట్లు సదరు క్రికెటర్‌పై అభియోగాలు నమోదయ్యాయి. 

కోర్టు విచారణ ప్రకారం.. క్రికెటర్ సమ్మర్స్ హోబార్ట్ హరికేన్స్ జట్టులో ఉన్నప్పుడు ఈ నేరాలు జరిగాయి. ఈ సంఘటన జరగడానికి ముందు సమ్మర్స్ సోషల్ మీడియా ద్వారా బాధితురాలిని సంప్రదించాడని టాస్మానియా సుప్రీంకోర్టు విచారణలో వెల్లడైంది.

విచారణ సందర్భంగా.. సమ్మర్స్ తరఫు న్యాయవాది కరోలిన్ గ్రేవ్స్, అతను సామాజికంగా ఒంటరిగా ఉంటూ, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్న తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన కాలంలో ఈ నేరాలు జరిగాయని వాదించారు. అప్పటి నుండి సమ్మర్స్ తన చర్యల గురించి పునరాలోచించుకున్నాడని, మళ్లీ నేరం చేసే ప్రమాదం చాలా తక్కువగా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు.

ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్ బౌలర్లలో ఒకరిగా పరిగణించే ఆరోన్ సమ్మర్స్.. ఆ సమయంలో అంతర్జాతీయ ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉందని భావించారు. "నేరం జరిగిన సమయంలో, అతను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడు, అందుకే అతన్ని అంతర్జాతీయంగా ఆడటానికి ఎంపిక చేశారు" అని అతడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. "ఆస్ట్రేలియాలో గానీ, విదేశాలలో గానీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తాను ఎప్పటికీ అడుగుపెట్టలేనని అతనికి తెలుసు" అని ఆమె జోడించారు.

2021లో బాలల దుర్వినియోగ సామగ్రిని కలిగి ఉండటం, ప్రసారం చేయడంతో సహా వేర్వేరు బాలల లైంగిక దోపిడీ నేరాలకు పాల్పడినట్లు అంగీకరించిన తర్వాత, సమ్మర్స్ గతంలో నార్తర్న్ టెరిటరీలో జైలు శిక్ష అనుభవించాడు. అతని న్యాయవాది శిక్షను వాయిదా వేయాలని కోరారు. కానీ న్యాయమూర్తి హెలెన్ వుడ్ అది సాధ్యం కాదని సూచించారు. బెయిల్‌పై ఉన్న సమ్మర్స్‌ను కస్టడీకి అప్పగించగా.. అతడికి ఆగస్టులో అతనికి శిక్ష విధించనున్నారు. 

Also Read: గంభీర్ మార్క్ లెవల్ భారీ ప్లాన్..ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు జట్టులో భారీ మార్పులు!

Also Read: టీ20 ప్రపంచకప్‌‌లో భారత్ ఘోర పరాజయం..ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత టోర్నీ నుంచి అవుట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

అన్నీ వర్గాలకు వెన్నుపోటు.. వెన్నుపోటుకు పేటెంట్ చంద్రబాబు: గుడివాడ అమర్‌నాథ్‌

Visakhapatnam, Andhra Pradesh:

YSRCP: అందరినీ వెన్నుపోటు పొడిచే ఘనత చంద్రబాబుకే దక్కుతుందని.. వెన్నుపోటుకు పేటెంట్‌ చంద్రబాబు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఆరోపించారు. 'పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు. భూములు ఇచ్చిన రైతులకు వెన్నుపోటు.. ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు' అని విమర్శించారు. 'ఏ ప్రభుత్వం అధికారం వచ్చిన మొదటి నాలుగేళ్లు పాలన చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ చంద్రబాబు పాలనకు అలా లేదు' అని తెలిపారు.

'కడప స్టీల్ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేసినట్టు చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి చేసిన పనులకు శంకుస్థాప లు, ఉపాధి కల్పన లాంటి వాటికి చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారు' మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. రెండేళ్లు గడిచినా ఇంతవరకు నూతనంగా ఎలాంటి సంస్థలు.. కొత్తగా ఎలాంటి శంకుస్థాపన చేసినా దాఖలాలు లేవని తెలిపారు. 'గతంలో నేను మంత్రిగా ఉన్న శాఖకు స్టీల్ ప్లాంట్ కోసం కడపలో భూమి ఇచ్చాం. 2022 డిసెంబర్ జీఓ ఇచ్చాం. అక్కడ ఉపాధి కల్పన పెరిగేలా కావలసిన మౌలిక వసతులు ఇచ్చాం. నీరు , విద్యుత్‌, భూమి, రోడ్లకు అనుసంధానం కోసం హామీ ఇస్తూ అన్ని సదుపాయాలకు అనుమతులు ఇచ్చాం' అని గుడివాడ అమర్‌నాథ్‌ గుర్తుచేశారు. స్టీల్‌ ప్లాంట్‌ పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడంతో కాస్త పనులు నిలిచిపోయాయని తెలిపారు. 

'ఓ సినీ నటుడి రాజకీయ క్రీడతో కొంతమంది ఐపీఎస్‌ అధికారులపై అభియోగం చేశారు. ఇప్పటికీ వారికి పోస్టింగ్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. వీరు చేసిన పనులకు భయంతో పెట్టుబడిదారులు తెలంగాణ, మహారాష్ట్రకు తిరిగి వెళ్లిపోయారు' అని కూటమి పాలనపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శలు చేశారు. 'ఇప్పుడు అదే ప్రాంతంలో శంకుస్థాపన చేస్తున్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పీక్‌గా నడిపిస్తున్నారు. శిలాఫలకాలు, ఇటుక, మట్టితో ప్రచారం చేస్తూ మళ్లీ మళ్లీ జరగాలి పెళ్లి అంటూ సాగిస్తున్నారు' అని తప్పుబట్టారు.

'మా నాయకుడు వైఎస్‌ జగన్‌పై పలు విధాలుగా విమర్శలు చేస్తూ ఉంటారు. ఎలాంటి సభలో అయినా జగన్ నామస్మరణతో చంద్రబాబు గడుపుతున్నాడు. వ్యవస్థలపై గౌరవంతో మహిళా కమిషన్ ముందు వెళ్లా. అన్ని మాటలకు కట్టుబడి ఉన్నానని తెలిపా' అని మాజీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశిస్తూ సైకోగా ప్రస్తావిస్తూ.. అతడి నాయకత్వంతో వెళ్తున్నామని విమర్శలు చేయటం సరికాదని చంద్రబాబుకు హితవు పలికారు.

బాలకృష్ణ, చింతమనేని ప్రభాకర్, చిత్తూరు ఎమ్మెల్యే మాటలు ఎవరి సైకో అండతో మాట్లాడారు? అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. మహిళలలను రోడ్డుపై కొట్టి హింసిస్తున్న మీరు ఇలాంటి మాటలు ఆడటం విడ్డూరంగా ఉందని కూటమి నాయకులపై మండిపడ్డారు. రోడ్లపై దాడులు చేసే సంస్కృతి సరికాదని చెప్పారు. 'కూటమి నాయకులు కుల ప్రస్తావనాలు తీసుకువస్తున్నారు. ఇలాంటి చేష్టలు చేస్తున్న వారు కూటమి నాయకులే సైకో అని ప్రజలకు తెలుసు' అని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

0
0
Report

Vivo T4 Lite: రూ.27,999 విలువైన Vivo 5G ఫోన్ కేవలం రూ.5,199కే!

Hyderabad, Telangana:

Vivo T4 Lite 5g Flipkart Goat Sale Offers: కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇదొక అద్భుతమైన అవకాశం.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వేదికగా వివో (vivo) బ్రాండ్‌కు సంబంధించిన ఒక అద్భుతమైన 5G మొబైల్‌పై ఊహించని ఆఫర్స్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లతో మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కలిగిన vivo T4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని రేంజ్‌లో డిస్కౌంట్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్శిస్తోంది. అయితే, దీనిపై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో? ఎలా కొనుగోలు చేస్తే చీప్‌ ధరకే లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Flipkart GOAT సేల్‌లో భారీ తగ్గింపులు..
ప్రస్తుతం మార్కెట్లో 4 GB ర్యామ్‌తో పాటు 64 GB స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన ఈ vivo T4 Lite 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర (MRP) రూ.27,999తో అందుబాటులో ఉంది. అయితే, ఫ్లిప్‌కార్ట్‌ బ్లాక్‌ మెంబర్‌షిప్‌ (Flipkart Black Membership) కలిగిన వినియోగదారులకు జూలై 3వ తేదీ నుంచి ప్రారంభమైన Flipkart GOAT సేల్‌లో భాగంగా ఏకంగా రూ.15,000 వరకు ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది.. ఈ భారీ డిస్కౌంట్ కారణంగా ఎటువంటి అదనపు ఆఫర్లు లేకుండానే నేరుగా ఈ ఫోన్‌ను రూ.14,999 లోపే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.

అదనపు బ్యాంక్ ఆఫర్లతో మరింత సేవింగ్స్..
ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్ల కోసం అదనపు బ్యాంకింగ్ బెనిఫిట్స్ కూడా ఫ్లిప్‌కార్ట్‌ అందుబాటులో ఉంచింది.. ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) లేదా ఎస్‌బీఐ (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసి.. కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.1,800 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ధర మరింత చీప్‌ ధరకే లభిస్తుంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

అద్భుత ఎక్చేంజ్ ఆఫర్..
ఇక అన్నింటికంటే అతిపెద్ద హైలైట్ ఏమిటంటే.. ఇందులో లభిస్తున్న ఎక్చేంజ్ బోనస్ ఆఫర్.. ఒకవేళ మీరు ఏదైన బ్రాండ్‌కి సంబంధించిన మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాలనుకుంటే.. మీకు దాదాపు రూ.8,000 వరకు ఎక్చేంజ్ బోనస్ లభించే అవకాశం ఉంది. ఈ ఎక్చేంజ్ బోనస్ అనేది పూర్తిగా మీరు ఎక్చేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ కండీషన్‌తో పాటు బ్రాండ్ వ్యాల్యూ‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ పాత ఫోన్‌కు పూర్తి ఎక్చేంజ్ వాల్యూ లభిస్తే.. బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఈ ప్రీమియం vivo T4 Lite 5G ఫోన్‌ను కేవలం రూ.5,199 లోపే మీరు సొంతం చేసుకోవచ్చు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

AP Gold Mines: ఏపీలో మరో బంగారు గని? లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు!

Tirupati, Andhra Pradesh:

Andhra Pradesh Gold Mines: ఆంధ్రప్రదేశ్‌లోని 14 ప్రాంతాల్లో సుమారు 1.58 లక్షల హెక్టార్లలో భారీగా బంగారం నిక్షేపాలు ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే కర్నూలు జిల్లాలోని జొన్నగిరి బంగారు గనుల్లో ఉత్పత్తి ప్రారంభం చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బంగారుగనుల వేట మొదలైంది. శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, ప్రకాశం జిల్లాలో కూడా ఖనిజాన్వేషణ జోరుగా సాగుతోంది. జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ నిధులు సహాయంతో ఈ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా సాగుతోంది. 

బంగారం అన్వేషణ జరిగే 4 కీలక దశలు..
భూమిలో బంగారు నిలవాలని గుర్తించి, మైనింగ్ ప్రారంభించేందుకు శాస్త్రవేత్తలు నాలుగు దశల ప్రక్రియను అనుసరిస్తారు. 

G4 దశ (ప్రాథమిక పరిశీలన): తొలి దశలో అక్కడ మట్టి రాళ్లను పరీక్షించి బంగారం లభించే అవకాశం ఉందో లేదో నిర్ధారిస్తారు.

G3 దశ (నమూనాల సేకరణ): సగటున ప్రతి 400 మీటర్లకు ఒక బోర్వెల్ వేసి భూమి లోపల నుంచి నమూనాలను శాంపిల్స్ తీసి పరిశీలిస్తారు. 

G2 దశ (విస్తృత అన్వేషణ): G3 ఫలితాలను సానుకూలంగా వస్తే మరింత స్పష్టత కోసం ప్రతి 200 మీటర్ల దూరం నుంచి ఒక బోర్వెల్ వేసి అన్వేషిస్తారు. 

G1 దశ (మైనింగ్ అనుమతి): పూర్తి నివేదికల ఆధారంగా ఖనిజాల లీజులను కేటాయించి.. వాణిజ్యపరమైన మైనింగుకు అనుమతిస్తారు.

వివిధ జిల్లాల్లో బంగారు అన్వేషణ పురోగతి వివరాలు..
జౌకులు (శ్రీ సత్యసాయి జిల్లా) 5000 హెక్టార్లు 

నంబలపూలకుంట మండలం జౌకుల పరిధిలోని భూములను 1000 హెక్టార్లు చొప్పున 6 బ్లాక్లుగా విభజించారు. ఎఫ్ బ్లాక్ లో మెగా సోలార్ పార్క్ ఉండటంతో దాన్ని మినహాయించి, మిగిలిన ఐదు బ్లాక్ లలో అన్వేషణకు వివిధ ప్రైవేట్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

A-బ్లాక్: క్రిటికల్ మినరల్ ట్రాకర్స్ 
B-బ్లాక్: జంకో కటి ఎక్స్‌ప్లోరేషన్ 
C-బ్లాక్: బూస్లిప్ మైన్స్ అండ్ మినరల్స్ 
D-బ్లాక్: జెమ్స్ ప్రాజెక్ట్స్
E-బ్లాక్: జియో ఎక్స్‌ప్లోర్
ఈ సంస్థలు ఇచ్చే ప్రాథమిక నివేదిక ఆధారంగా జాతీయ ఖనిజాన్వేషణ అభివృద్ధి ట్రస్ట్ ఆర్థిక సాయం అందిస్తుంది. 

రామగిరిలో 3740 హెక్టార్లు 
శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి గతంలో ఎక్కడ భారత గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (AGML) గనులు ఉండేవి. వీటిని ఆనుకొని ఉన్న 2000 హెక్టార్లను ఉత్తర, దక్షిణ బ్లాక్లుగా విభజించి ముంబైకి చెందిన ఆంధ్ర మైనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో G4 దశ అన్వేషణ చేపట్టనున్నారు. 

అలాగే రొద్దం మండలం బొక్సాంపల్లి లోని ఉత్తర, దక్షిణ బ్లాక్లలోని 1,740 హెక్టార్లలో నిల్వలను గుర్తించగా.. ప్రస్తుతం జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో G3 దశ పరిశోధనలు జరుగుతున్నాయి. 

చిగురుగుంటలో భారీ నిల్వలు..
చిత్తూరు జిల్లాలోని చిగురు గుంట ప్రాంతంలో భారీగా బంగారం నిల్వలు ఉండే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

చిగురుగుంటలో సుమారు 273 హెక్టార్లలో మొత్తం ఖరీజం సంపద అంచినా రెండు లక్షల టన్నుల మేర ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీని నాణ్యత 5.64 గ్రాముల అంటే టన్నుకు బంగారం నాణ్యత అన్నమాట. మొత్తం బంగారం నిలువలు 12,500 కేజీలు ఉండొచ్చు అని అంచనా. ఒకవేళ ఈ గని ఉత్పత్తిని ప్రారంభిస్తే ఏడాదికి సుమారు 600 కేజీల నుంచి 1000 కేజీల వరకు బంగారాన్ని ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. ఒకవేళ ఈ అన్వేషణలు సఫలీకృతమైతే.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రముఖ స్వర్ణ గనుల కేంద్రంగా మారే అవకాశం ఉంది.

Also Read: 12 ఏళ్లు గడుస్తున్నా ఏపీ రాజధానిపై నో క్లారిటీ! రాజధాని లేకపోవడానికి కారణం వాళ్లే!

ALso Read: Gold Selling Reason: భారతీయులు గోల్డ్ ను అమ్ముకోవడానికి 10 కారణాలు ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Gajalaxmi Rajayogam 2026: జూలై 3 నుంచి ఈ 5 రాశులపై లక్ష్మీనారాయణుల అనుగ్రహం.. కోట్లల్లో ధనలాభం!

Hyderabad, Telangana:

Gajalaxmi Rajayogam 2026 Effect Telugu: ఖగోళంలో గ్రహాల కదలికలు మానవ జీవితాలపై ఎంతగానో ప్రభావం చూపుతూ ఉంటాయి.. ఈ క్రమంలో జూలై 2 గురువారం రోజు ఒక అద్భుతమైన శుభ యోగం ఏర్పడింది.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దేవగురువు బృహస్పతి, శుక్రుడు, బుధ గ్రహాల అనుకూల ప్రభావం వల్ల అత్యంత శక్తివంతమైన గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. దీనికి తోడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి శ్రవణా నక్షత్రంలోకి ప్రవేశిస్తూ.. మకర రాశిలో సంచారం చేసింది.. సూర్యుడి నుంచి చంద్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల  సమయోగం కూడా ఏర్పడింది. ఈ అరుదైన గ్రహాల కూటమి కారణంగా 5 రాశుల వారికి అదృష్టం వరించబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో ధనలాభాలు కలగడమే కాకుండా.. వృత్తిపరమైన విజయాలు చేకూరుతాయి. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి ధన లాభాలు:
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ రాశి నుంచి మూడవ స్థానంలో శుక్ర, గురువుల ప్రభావం వల్ల ఆర్థికంగా భారీ ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందం విపరీతంగా పెరుగుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరైతే వారి ఆత్మవిశ్వాసం, ధైర్యమైన నిర్ణయాల వల్ల విజయాలు కలుగుతాయి.

కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఊహించని గుర్తింపును అందిస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్‌ కూడా లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయంగా మారుతుంది. ఆదాయం పెరిగినప్పటికీ.. ఖర్చులను నియంత్రించుకోవడం అవసరమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగం మారాలనుకునే వారికి అద్భుతమైన అవకాశాలు తలుపు తట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

తులా రాశి (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా.. శుభప్రదంగా సాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్‌లో పురోగతి సాధించడానికి అదృష్టం లభిస్తుంది.. మానసిక ఆందోళనలు, దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.. ఊహించని విధంగా ధనలాభం కలగడంతో పాటు, ఆత్మీయుల నుంచి విలువైన బహుమతులు కూడా పొందుతారు. ఇష్టమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ రోజంతా ఉల్లాసంగా గడుపుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మకర రాశి (Capricorn)
చంద్రుడు మకర రాశిలోనే సంచరిస్తుండటంతో పాటు అతనిపై గురు, బుధ, శుక్రుల శుభ దృష్టి ఉండటం వల్ల ఈ రాశి వారికి విశేష ఆర్థిక లాభాలు కలుగుతాయి. మీ ఆలోచనలు పదును పెరిగి.. కొత్త ప్రణాళికలతో విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటాయి.. ప్రేమ జీవితం, వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈ రోజు ఎంతో శృంగారభరితంగా.. సంతోషంగా సాగుతుంది.

మీన రాశి (Pisces)
మీన రాశి వారికి ఈ రాజయోగం కఠిన శ్రమ చేయడం వల్ల అద్భుతమైన విజయాలు కూడా పొందుతారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులు విద్యారంగంలో మెరుగైన ప్రతిభ కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోని వనరుల ద్వారా ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

శనిదేవుని అఖండ కృప.. ఈ 4 రాశుల వారికి గోల్డెన్ టైమ్.. డబ్బే డబ్బు!

Hyderabad, Telangana:

Shani Nakshatra Gochar 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.. ముఖ్యంగా కర్మఫల ప్రదాత అయిన శనిదేవుడి కదలికలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాడు.. తాజాగా జూలై 2 గురువారం ఉదయం 8:22 గంటలకు శనిదేవుడు తన నక్షత్రాన్ని మార్చుకుని రేవతి నక్షత్రంలోకి సంచారం చేశాడు.. ఈ రేవతి నక్షత్రానికి అధిపతి బుధ గ్రహం.. బుద్ధి కారకుడైన బుధుడు, కర్మఫల ప్రదాత అయిన శని దేవుడి కలయిక వల్ల ఏర్పడే ఈ ప్రత్యేక సమయం కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభాలతో పాటు, అదృష్టాన్ని తీసుకురాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ నక్షత్ర మార్పు కారణంగా ప్రధానంగా 4 రాశుల వారి జీవితాలు మలుపు తిరగబోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితంలో వీరికి తిరుగులేని విజయాలు దక్కబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ సమయం అత్యంత కీలకమైనదిగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని రీతిలో భారీ లాభాలు కలుగుతాయి.. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా వేగవంతం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏదైనా విలువైన వస్తువును లేదా ఆస్తిని పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. గతంతో పోలిస్తే.. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి రిటర్న్స్ పొందుతారు. వ్యాపార విస్తరణకు ఇది ఎంతో అనుకూలమైన సమయం.

కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ నక్షత్ర మార్పు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.. ఉద్యోగ రీత్యా లేదా వృత్తిపరమైన కారణాల వల్ల సుదూర ప్రయాణాలు చేయవలసి వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఇవి వీరికి ఎంతో లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగులు తమ కార్యాలయంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సమాజంలో మీ ప్రతిష్ట, కీర్తి పెరుగుతాయి. ఉన్నతాధికారులు మీపై నమ్మకంతో పెద్ద బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో సుఖసంతోషాలతో పాటు సంపదలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కల త్వరలోనే నెరవేరబోతోంది. ఆస్తికి సంబంధించిన పాత వివాదాలు లేదా కోర్టు కేసులు ఏవైనా ఉంటే.. అవి ఇప్పుడు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో లేదా బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. జీవితంలో ఏదైనా పెద్ద శుభవార్త వినే అవకాశం ఉంది. దీనివల్ల మీ మనస్సు ఎంతో సంతోషంగా ఉంటుంది.

ధనుస్సు రాశి (Sagittarius) 
ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఆర్థిక పురోభివృద్ధికి కొత్త బాటలు వేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో.. ఆత్మీయులతో బంధాలు మరింత బలోపేతం అవుతాయి. పరస్పర ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. జీవితంలో భోగభాగ్యాలు, విలాసాలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు చేసే సుదూర ప్రయాణాలు అఖండ లాభాలను తెచ్చిపెడతాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మారుతుంది. కార్యాలయంలో మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి.. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

ఇంత బలుపా?.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్, వీడియో వైరల్!

Hyderabad, Telangana:

Siya Goyal Middle Finger Video: తన కాబోయే భర్తను చంపిన సియా గోయల్‌లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించకపోవడంతో, సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆమె మీడియాకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ ప్రవర్తించిన వీడియో చర్చనీయాంశమైంది. విచారణ కోసం పోలీసులు ఆమెను ఇంటికి తీసుకెళ్తుండగా జరిగిన ఈ ఘటనపై, హత్య చేసినా ఆమెకు ప్రశాంతత లేదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఎక్స్ (X) వేదికగా 17 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. పూనేలోని మార్కెట్ యార్డ్‌లో ఉన్న తన ఇంటికి పోలీసులు ఆమెను తీసుకువెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నలుపు రంగు టీ షర్ట్, ముఖానికి మాస్క్ ధరించిన సియా, ఒక్కసారిగా మీడియా వైపు చూసి మిడిల్ ఫింగర్ చూపించింది. తన అహంకారాన్ని బయట పెట్టింది. దీంతో నెట్టింటా సియాను ఏకిపారేస్తున్నారు. కాబోయే భర్తను చంపినా పొగరు తగ్గలేదు అని కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా.. పూనే బిజినెస్‌మెన్ కేతన్ అగర్వాల్ మృతి కేసును మొదట ప్రమాదంగా భావించిన పోలీసులు, ఆ తర్వాత ఇది పక్కా పథకం ప్రకారం కాబోయే భార్య చేసిన హత్య అని నిర్ధారించారు. సియా తన లవర్‌ చేతన్‌తో కలిసి కేతన్‌ను 400 అడుగుల లోయలోకి తోసి ప్రాణాలు తీసింది. మొదట విచారణలో తప్పుడు సమాధానాలు చెప్పిన ఆమె, పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించింది. 

 

చేతన్‌ను ప్రేమించడమే కాకుండా, కేతన్‌కు జుట్టు లేదు, అతను విగ్గు పెట్టుకునేవాడు, నత్తి కూడా ఉంది. అందుకే నచ్చలేదని, తన కుటుంబం ఆ విషయాలను పట్టించుకోలేదని ఆమె చెప్పిందట. కుటుంబ సభ్యులను బాధ పెట్టడం కంటే అతడిని చంపడం సులువు అని ఆమె భావించినట్టు సమాచారం.

Read more:  సియా గోయల్ ఇచ్చిన సిగ్నల్ అదేనా.!. పూణె మర్డర్ కేసులో బైటపడ్డ షాకింగ్ నిజం..!

Read more: పూణె మర్డర్ కేసులో కీలక పరిణామం.. లోహగఢ్ కోటకు సియా గోయల్, చేతన్ చౌదరీ... ఎందుకో తెలుసా..?.

ఈ సంచలన హత్య కేసుపై నేటిజన్లు కేతన్‌కు సానుభూతి వ్యక్తం చేశారు. పెళ్లి నచ్చకపోతే చంపేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. హత్యకు నాలుగు రోజుల ముందే సియా అతడిని అదే లోయలోకి తోసి చంపడానికి ప్రయత్నించినట్లు కేతన్ తండ్రి ఆరోపించారు. బయటకు పాము వచ్చిందని భయపడి ఆమె నాటకం ఆడిందని, కేతన్ చనిపోయాక ఎమోషనల్ పోస్టులు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, సియా, కేతన్ కలిసి ఆనందంగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వీరి పెళ్లి కోసం రాజస్థాన్‌లో రూ.16 కోట్ల లగ్జరీ వేడుకను బుక్ చేసినట్లు తెలుస్తోంది. కేతన్ కుటుంబం ఆస్తుల విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా సియా కేతన్ కుటుంబం వీరి పెళ్లిని నవంబర్‌లో ఫిక్స్ చేశారు. ఇక కేతన్‌, సియా రిలేషన్షిప్ పై ఆమె ప్రియుడు చేతన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఇద్దరు పన్నాగం పన్ని కేతన్ ని హతమార్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report
Advertisement

Mars Effect: జూలై 24 నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగులేదు.. కుజుడి సంచారంతో ఊహించని ధనలాభాలు!

Hyderabad, Telangana:

Mars Entry Into Mrigasira Nakshatra 2026 News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది.. ముఖ్యంగా శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పాటు భూమికి కారకుడైన కుజుడు జూలై నెలలో ఒక కీలకమైన నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు.. 2026 జూలై 24, శుక్రవారం తెల్లవారుజామున 03:29 గంటలకు కుజుడు తన సొంతం నక్షత్రమైన మృగశిర నక్షత్రంలోకి సంచారం చేస్తాడు.. ఆగస్టు 12 వరకు కుజుడు ఇదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతాడు.. కుజుడు మృగశిరలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని అద్భుత మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్టలు, అపారమైన ఆత్మవిశ్వాసం లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో అదృష్టం పొందే రాశులవారి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మేష రాశి (Aries) 
మృగశిర నక్షత్రంలో కుజుడి ప్రవేశం మేష రాశి వారికి అద్భుతమైన శక్తిని, సాహసాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగాలతో పాటు వ్యాపార రంగాలలో ఉన్న వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు సుగమవుతాయి. ఆకస్మిక ధనలాభం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగవుతుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. తండ్రి వైపు నుంచి పూర్తి సపోర్ట్‌ లభిస్తుంది. దీనివల్ల నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.

కర్కాటక రాశి (Cancer) 
కర్కాటక రాశి జాతకులకు ఈ కుజ సంచారం అత్యంత శుభప్రదంగా, లాభదాయకంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో మీ ఎదుగుదలకు తోడ్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కోరికలు నెరవేరే సమయం వచ్చింది.. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావడమే కాకుండా.. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

సింహ రాశి (Leo) 
సింహ రాశి వారి జీవితాల్లో కూడా కుజుడి సంచారంతో కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభఫ్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి కెరీర్ ఊపందుకుంటుంది.. ఉద్యోగులకు జీతాల పెంపు (Salary Hike) లేదా పదోన్నతి (Promotion) లభించే బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఒక ముఖ్యమైన, పెద్ద డీల్‌ను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీలోని నాయకత్వ లక్షణాలు (Leadership Skills) అందరినీ ఆకట్టుకుంటాయి.

వృశ్చిక రాశి (Scorpio) 
కుజుడి నక్షత్ర మార్పు వృశ్చిక రాశి వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి (Spouse) నుంచి మీకు పూర్తి సహకారం, ప్రేమ లభించబోతున్నాయి. వ్యాపార రంగంలో పరిస్థితులు చాలా వేగంగా మెరుగుపడతాయి. ఉద్యోగస్తులు కెరీర్‌లో అఖండ విజయాలను సాధించేందుకు చక్కటి అవకాశాలను పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

దేశంలోనే తొలిసారిగా.. మహిళా రైతుల కోసం చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం..!!

BBhoomi4h ago
Secunderabad, Telangana:

Maharashtra Women Farmers Empowerment Bill: మహారాష్ట్ర శాసనసభ దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ తీసుకోని అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రైతు సాధికారత బిల్లుకు రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో వ్యవసాయం లేదా వ్యవసాయ సంబంధిత పనుల్లో నిమగ్నమైన మహిళలకు అధికారికంగా రైతు హోదా లభిస్తుంది. ఇక నుంచి వారు ప్రభుత్వ పథకాల నుంచి నేరుగా లబ్ది పొందుతారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో లక్షలాది మంది మహిళలకు సామాజిక గౌరవాన్ని అందించడమే కాదు.. పురుగోతికి కూడా మార్గం సుగుమం చేసిందని చెప్పాలి. 

గ్రామాల్లో విత్తనాలు నాటడం నుంచి పంట కోయడం వరకు మహిళలు.. పురుషులతో సమానంగా కష్టపడుతుంటారు. అయినా కూడా భూమి పురుషుల పేర్ల మీదే ఉండటం వల్ల ప్రభుత్వ రికార్డుల్లో మహిళలను ఏనాడూ రైతులుగా పరిగణించలేదు. దీంతో వారు బ్యాంకు లోన్స్ లేదా ప్రభుత్వ సహాయానికి దూరమయ్యారని చెప్పాలి. ఈ కొత్త చట్టం ఈ అంతరాన్ని పూడ్చివేసి..కష్టపడిపనిచేసే మహిళలకు నిజమైన గుర్తింపు లభించేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పాలి. 

ఈ కొత్త చట్టం.. మహిళా రైతు నిర్వచనాన్ని మరింత విస్త్రుతం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి పంటలు పండించేవారే కాదు.. పశుపోషణ, పాడి, కోళ్ల పెంపకం, మత్స్య పరిశ్రమ, తేనెటీగల పెంపకం చేస్తున్న వారు కూడా రైతుల కోవాలోకి వస్తారు. ప్రభుత్వం ఈ మహిళలందరికీ మహిళా రైతు గుర్తింపు కార్డులు కూడా జారీ చేయనుంది. ఈ ఒక్క కార్డు ద్వారా వారు బ్యాంకులోన్స్, పంటల బీమా, ప్రభుత్వ రాయితీలు, విత్తనాలు, ఎరువులు సులభంగా పొందుతారు. అంతేకాదు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది. 

మొత్తం వ్యవస్థ మరింత  సజావుగా పనిచేసే విధంగా..  ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన చట్రాన్ని రూపొందిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు త్వరలోనే  రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కేవలం గుర్తింపు పత్రాలు ఇవ్వడం మాత్రమే సరిపోదని సభలో చర్చ సందర్భంగా వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆరోగ్యం, పోషణ, ఆర్థిక సాధికారత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని పేర్కొంది. కుటుంబ వ్యవసాయ భూముల్లో మహిళలను సహ-యజమానులుగా చేయాలనే కొన్ని సూచనలు కూడా వెలువడ్డాయి.

ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, మహిళలు ఇకపై పొలాల్లో కేవలం కూలీలుగా కాదు... వారికి స్వతంత్ర రైతుల హోదా లభిస్తుంది. ఈ చర్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వారు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారు. తమ సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

Also Read: వెండి కొంటున్నారా? అయితే గుడ్ న్యూస్...భారీగా పడుతున్న సిల్వర్ ధర...ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా..?

Also Read:  EPFO 3.0: ఇక ATMకెళ్లి పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

భక్తుల రద్దీ.. తిరుమల వెంకటేశ్వర క్షేత్రానికి రాజకీయ ప్రముఖుల తాకిడి

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు పోటెత్తారు. సాధారణ భక్తులతోపాటు ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ ప్రముఖులతోపాటు పలువురు సినీ ప్రముఖులు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నది ఎవరెవరో తెలుసుకుందాం.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం జరిగే దివ్య దర్శనాల్లో భాగంగా గురువారం పలువురు ప్రముఖులు వేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం అనంతరం వారు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి తిరుమల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం వీఐపీ దర్శన ఏర్పాట్లలో భాగంగా స్వామివారి సన్నిధికి చేరుకుని వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.

మాజీ గవర్నర్‌ దర్శనం
తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకులు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్వామివారి కృపతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

సినీ ప్రముఖులు
 సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా తిరుమలలో దర్శనం చేసుకున్నారు. ప్రముఖ నటుడు సాయికుమార్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం సాయికుమార్‌ మాట్లాడుతూ.. 'తిరుమల దర్శనం జీవితంలో అత్యంత పవిత్రమైన అనుభవం' అని తెలిపారు. ప్రముఖ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్రప్రసాద్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ వాతావరణాన్ని ఎంతో ప్రశాంతంగా అనుభూతి చెందినట్లు తెలిపారు. దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. 'ఆయ‌నే ప‌ద్మాస‌నుడు. ప‌ద్మ‌ ఇప్పించింది ఆయ‌నే. నా జీవితంలో ఏదీ జ‌రిగినా ‌వారికి చెప్పుకోవ‌టం నాకు అల‌వాటు. అందుకే స్వామిని ద‌ర్శించుకున్నా. నాకు వ‌చ్చిన అవార్డు మీ అంద‌రికీ వ‌చ్చిన‌ట్లే' అని రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

నారా లోకేశ్‌, పీవీఎన్‌ మాధవ్‌
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్  కూడా తిరుమల వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుమలలో  కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని కంపార్ట్‌మెంట్లు  27 క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 10 నుంచి 15 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లు కలిగిన భక్తులకు 6 నుంచి 8 గంటలు సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2.3 గంటల సమయం పడుతుండగా.. నిన్న ఒక్కరోజే 78,067 మంది భక్తులు స్వామినిదర్శించుకున్నారు. స్వామివారికి 31,158 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీకి రూ.4.39 కోట్లు ఆదాయం లభించింది.

0
0
Report
Advertisement
Advertisement
Back to top