icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
SShankerreddyFollow22 Aug 2024, 04:30 am

2లక్షల రుణమాఫీకీ కోర్రిలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంఆందోళనలో రైతులు

Karimnagar, Telangana:

2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కరీంనగర్‌ రూరల్‌ బీజేపీ అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కరీంనగర్‌ రూరల్‌ ఎంఎంఆర్‌వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోంది.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

Gold Operation: 1991లో భారతదేశం ఏం చేసింది..? ఒకేసారి 47 వేల కిలోల బంగారం తాకట్టు ఎందుకు?

Wadgaon, Maharashtra:

47000 KGs Gold Airlifted: భారతదేశంలో బంగారంపై ఇప్పుడు అంతా చర్చ జరుగుతోంది. దిగుమతి సుంకాలు భారీగా పెంచేయడంతో బంగారం, వెండితోపాటు ప్లాటినం ధరలు రికార్డు స్థాయిలో పెరిగింది. ఇది అలా ఉంటే మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన 'బంగారం కొనరాదు' అనే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వరుస పరిణామాలు చోటుచేసుకోవడం వెనుక పెద్ద తతంగమే జరిగినట్టు కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలకు కట్టడి చేయడం.. బంగారంపై మోజు తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 1991లో జరిగిన ఒక పెద్ద ఆపరేషన్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారీ ఆపరేషన్‌ గురించి తెలుసుకుందాం.

Also Read: Erragadda TIMS: హైదరాబాద్‌ ప్రజలకు కేసీఆర్‌ ప్రపంచ స్థాయి వైద్యం అందించారు: కేటీఆర్‌

1980- 1990 మధ్య భారతదేశం విదేశీ చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. దీంతో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఈ సంక్షోభం నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భారీ ఆపరేషన్‌ చేపట్టింది. 1991లో 405 మిలియన్ల అత్యవసర రుణాన్ని సమీకరించడానికి నాడు కేంద్ర బ్యాంకు చర్యలు తీసుకుంది. ఆ సమయంలో దాదాపు 47,000 కిలోల బంగారాన్ని ఇంగ్లాండ్‌కు విమానంలో తరలించింది. రహస్యంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ బంగారాన్ని పంపించడంతోనే భారతదేశ ఆర్థిక సంస్కరణలకు మార్గం సుగమం పడింది.

Also Read: AP Govt Teachers: ప్రభుత్వ టీచర్లకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏం ప్రకటించారంటే?

బొంబాయిలోని శాంతా క్రూజ్ విమానాశ్రయంలో (ప్రస్తుతం ముంబై విమానాశ్రయం) ఒక కార్గో విమానంలోకి ట్రంకులను ఎక్కిస్తున్న చిత్రం దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 4 జూలై 1991న మొదటి సరుకు బయలుదేరింది. ఆ తర్వాత మరో రెండు సరుకు రవాణాలు జరిగాయి. దాదాపు 47 టన్నుల (47,000 కిలోల) బంగారాన్ని ఇంగ్లాండ్‌కు ఆర్‌బీఐ తాకట్టు పెట్టింది. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి భారీగా విదేశీ రుణం పొందింది.

Also Read: Bandi Bhageerath: 'మా కూతురిపై కుట్ర చేస్తున్నారు'.. పోక్సో బాధితురాలి తల్లి ఆవేదన

తెలంగాణ ముద్దుబిడ్డ, నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు, ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక సంస్కరణలో భాగంగా నాటి ఆర్‌బీఐ గవర్నర్ ఎస్. వెంకిటరమణన్ నేతృత్వంలో ఆ భారీ ఆపరేషన్‌ జరిగింది. ఒక విదేశీ బ్యాంకుకు బంగారాన్ని తాకట్టు పెట్టి దాదాపు 405 మిలియన్ డాలర్లను భారతదేశం రుణం తీసుకుని నాటి ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కింది. ఈ ఆపరేషన్‌తో భారతదేశంలో బంగారం భద్రతకు, గర్వానికి, భావోద్వేగానికి ప్రతీకగా మారింది. ఈ విధంగా బంగారం భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడుకుంది.

భారతదేశం 1991 నవంబర్ నాటికి బంగారం హామీగా తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించింది. భారతదేశ ఆర్థిక స్థితి మారింది. ప్రధానమంత్రి పీవీ నరసింహ రావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ చేపట్టిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను సరళీకరించడంతో విదేశీ మారక నిల్వలు పెరిగాయి. మార్చి 2026 నాటికి ఆర్‌బీఐ వద్ద మొత్తం 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉందని, అందులో 77 శాతం (సుమారు 680 టన్నులు) ప్రస్తుతం దేశీయంగా నిల్వ ఉందని ఆర్‌బీఐ మార్చిలో ప్రకటించింది. ఇది మార్చి 2023 నాటి 38 శాతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల.

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిల్వలు, దిగుమతిదారులలో ఒకటిగా ఉంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా భారతదేశం బంగారం దిగుమతులను నివారించడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కూడా 1991 నాటి పరిస్థితి భారతదేశం ఎదుర్కొంటోందని తెలుస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడబోతుందని.. ఈ క్రమంలోనే బంగారం కొనరాదని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం దేశాన్ని కాపాడేది కూడా బంగారం అని చర్చ జరుగుతోంది.

0
0
Report

Cobra Video: దాహంతో అలమటిస్తున్న కింగ్ కోబ్రా.. జగ్గుతో నీళ్లు తాగించిన యువకుడు..వీడియో..

Hyderabad, Telangana:

Baby King Cobra Video Here: ప్రకృతిలో జీవరాశులన్నీ దాహానికి అతీతం కావని నిరూపించే ఒక అద్భుతమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా కింగ్ కోబ్రా పేరు వినగానే ప్రాణాలు చేతులు పెట్టుకొని గజ గజలాడుతూ ఉంటారు. అలాంటిది ఒక అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా పిల్లకు ఒక వ్యక్తి ఏకంగా జగ్గుతో నీళ్లను తాగించడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 

ఎండల తీవ్రత పెరగడంతో అటవీ ప్రాంతాల్లో నీటి వనరులు ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో దాహంతో అలమటిస్తున్న ఒక కింగ్ కోబ్రా పిల్ల జనాభాసాల్లోకి వచ్చింది. దాని అవస్థను గమనించిన ఒక స్నేక్ క్యాచర్.. అది ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడకుండా మానవత్వంతో స్పందించాడు.. ఒక ప్లాస్టిక్ నీటి జగ్గును తీసుకొని ఆ పాము దగ్గరకు వెళ్ళాడు. అంతేకాకుండా ఆ పాముకు నీటిని పట్టించడం కూడా మీరు చూడొచ్చు.. 

వైరల్ అవుతున్న వీడియోలు ఒక వ్యక్తి ఒక చేత్తో పాము తోకను పట్టుకొని.. మరొక చేతితో నీటి జగ్గును పాము నోటి దగ్గరగా ఉంచి నీటిని విడవడం మీరు గమనించవచ్చు. సాధారణంగా మనుషులను చూడగానే బుసలు కొట్టే పాము.. ఈ వీడియోలో మాత్రం ఎంతో ప్రశాంతంగా నీటిని తాగడం విశేషం. ఆ వ్యక్తి జగ్గును వంచుతుంటే.. ఆ కింగ్ కోబ్రా పిల్ల ఎంతో సులభంగా దాహం తీర్చుకుంటూ నీటిని ఆస్వాదించడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఫిదా అవుతున్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

ఈ వీడియో పై సోషల్ మీడియాలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. మూగ జీవి దాహాన్ని గుర్తించి ప్రాణాలకు తెగించి నీళ్లను తాగించిన ఆ వ్యక్తి నిజమైన హీరో అంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం ఇది చాలా ప్రమాదకరమైన పని అని.. శిక్షణ లేని వారు ఇలాంటి సాహసాలు చేస్తే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరిస్తున్నారు.. విష సర్పాలు దాహంతో ఉన్నప్పుడు వాటికి సహాయం చేయాలనుకుంటే నేరుగా కాకుండా దూరంగా నీటిని ఉంచడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

 - https://apple.co/3loQYe ఆపిల్ లింక్..

0
0
Report
Advertisement

Ebola Surge: కాంగోలో ఎబోలా కల్లోలం.. 65 మంది బలి, సరిహద్దులు దాటుతున్న మహమ్మారి! అసలు లక్షణాలివే..

Hyderabad, Telangana:

Symptoms of Ebola Virus: కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ వ్యాప్తి వల్ల దాదాపు 65 మంది చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఇంకా 246 మందికి సోకినట్లు అంచనా వేస్తున్నారు. కాంగోలో ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పొరుగు దేశాల మధ్య నిఘా సహకారాన్ని కూడా బలోపేతం చేయనున్నారు. దీంతోపాటు ఇన్ఫెక్షన్ నియంత్రణ కోసం ప్రజల్లో అవగాహన పెంచడం, లాబొరేటరీ సేవలను మెరుగుపరచడం, వ్యాధి నిర్ధారణను కూడా వేగవంతం చేస్తున్నారు. మరణించిన వారికి సురక్షితమైన రీతిలో అంత్యక్రియలు చేస్తున్నారు. ఈ వ్యాధిని నిరోధించడానికి కావలసిన నిధులు, వైద్య పరికరాలను కూడా సమకూరుస్తున్నారు.

కాంగో ఇన్స్టిట్యూట్ నేషనల్ డి రీచార్చే బయో మెడికల్ ప్రకారం 20 మందిలో రక్త నమూనాలను సేకరించగా, 13 మందికి ఎబోలా వైరస్ సోకినట్లు ప్రకటించింది. ఎబోలా వైరస్ తీవ్రత మోంగ్వాలు, ర్వాంపారా ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. బునియా ప్రాంతంలో కూడా ఎబోలా సోకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఎబోలా వైరస్ కారణాలు..
ఎబోలా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ముఖ్య కారణం.. ఇది పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందడమే. ఇక్కడ ఎక్కువ జనాభా ఉంటారు. అందుకే ఇది త్వరగా వ్యాప్తి చెందుతుంది. మైనింగ్ వంటి పనుల కోసం ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో మోంగ్వాలు ప్రజలకు ఎక్కువగా వ్యాప్తి చెందింది.

వైరస్ రకం..
ఎబోలా వైరస్ బారిన పడిన వారి రక్త నమూనాల్లో సాధారణంగా కనిపించే రకానికి చెందిన 'జైర్‌ ' వైరస్ కాదని తేలింది. ఈ కొత్త రకం వైరస్ లక్షణాలు కచ్చితంగా తెలుసుకోవడానికి ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోందని చెబుతున్నారు.

Also Read: కడుపులో గడబిడ.. గ్యాస్‌.. ఉబ్బరానికి కారణమయ్యే 4 రోజువారీ ఆహారాలు, మీరు అస్సలు ఊహించరు!

Also Read: కనిపించని మృత్యువు హంటావైరస్.. సాధారణ జ్వరంలా వచ్చి కిడ్నీలను ఎలా పనిచేయకుండా చేస్తుందో తెలుసా?

వ్యాధి ఎలా సోకుతుంది అంటే:
ఎబోలా వైరస్ అనేది చాలా ప్రమాదకరమైనది.. అంతేకాదు ప్రాణాంతకం కూడా. ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి రక్తం, లాలాజలం ద్వారా సోకుతుంది. వారు ఉపయోగించిన దుస్తులు ముట్టుకున్నా, మరణించిన వ్యక్తి మృతదేహాన్ని తాకడం ద్వారా కూడా ఇది సోకుతుంది. వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించడం వల్ల సురక్షితంగా ఉండవచ్చు.

ఎబోలా వైరస్ లక్షణాలు:
ఎబోలా వైరస్ బారిన పడిన వారికి జ్వరం, గొంతు నొప్పి, కండరాల నొప్పి, తలనొప్పులు, వికారం, వాంతులు కలుగుతాయి. కొన్ని సందర్భాల్లో కాలేయ పనితీరు కూడా మందగిస్తుంది. వ్యాధి లక్షణాలు కనిపించగానే సాధారణ జ్వరం మాదిరి కాకుండా త్వరగా నిర్ధారించుకోవాలి. పరిస్థితి దాటిపోతే ప్రాణాంతకంగా మారుతుంది. జంతువులకు కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన వైద్య సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report

Cobra On Scooter Video: యాక్టివాపై నాగుపాము హల్‌చల్.. ప్రాణాలకు తెగించి పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వీడియో..

Hyderabad, Telangana:

Cobra On Scooter Video Watch Here: నేటి కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని వింత వింత ఆశ్చర్యం కలిగించే ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టక మానదు.. నడిరోడ్డుపై ఆగి ఉన్న ఒక యాక్టివా స్కూటీపై భారీ నాగుపాము పడగవిప్పి హల్చల్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ఆ స్కూటీ పైకి పాము ఎలా వచ్చిందనేది అసలు ఎవ్వరికీ తెలీదు. కానీ స్కూటీపై పడక విప్పి నిలబడి నానా హంగామా సృష్టించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..

సాధారణంగా పాములు పొదల్లోనూ.. పచ్చిక మైదానంలోనో.. అడవుల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఘటనలు ఒక వ్యక్తి తన యాక్టివ్ స్కూటీని రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు.  కొద్దిసేపటి తర్వాత తిరిగివచ్చి చూసేసరికి కూటి వెనక భాగంలో ఒక భారీ నాగుపాము బయటికి వచ్చి పడక విప్పి నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. ఈ పాము పరిమాణం.. దాని ఆవేశం చూసి అక్కడున్న వారంతా భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది..

స్కూటీపై పడగ విప్పి నాగుపాము..
రోడ్డుపై వెళ్లే వాహనదారులు స్కూటీపై పడగ విప్పి ఉన్న పామును చూసి ఆశ్చర్యపోయారు. క్షణాల్లో ఈ వార్త స్థానికంగా వ్యాపించడంతో స్థానికులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పాము ఎక్కడ వారిపై దాడి చేస్తుందోనని అందరూ భయాందోళనకు గురై.. ఆ స్కూటీకి దూరంగా నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. అయితే, స్థానికులు వెంటనే స్థానికంగా ఉన్న స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు.. రంగంలోకి దిగిన వారు అత్యంత చాకచక్యంగా ఆపరేషన్‌ను ప్రారంభించారు..

బుసలు కొడుతూ పాము హల్‌చల్‌..
ఆ పాము అత్యంత ప్రమాదకరమైన రీతిలో బుసలు కొడుతూ ఉండడం మీరు చూడొచ్చు. అయితే స్నేక్ క్యాచర్స్ ఎలాగోలా ఆ పామును పట్టుకొని ఒక సంచిలో బంధించి సురక్షితమైన పరిసరాల్లో వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ పామును పట్టుకోవడానికి స్నేక్ క్యాచర్స్ కొన్ని గంటలపాటు శ్రమించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను స్నేక్ క్యాచర్స్ బృందంలోని ఒకరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ తో పాటు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ వస్తోంది. 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

వైరల్ వీడియో..
వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో పాములు బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. వాహనాలు పార్కు చేసేటప్పుడు తిరిగి స్టార్ట్ చేసే సమయంలో వాటిని తప్పకుండా ఒకటికి రెండుసార్లు పరిశీలించడం చాలా మంచిదని వారంటున్నారు. లేకపోతే అత్యంత ప్రమాదకరమైన వన్యప్రాణులు వాహనాల్లో దూరి మనుషులపై దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్లోని సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలామంది ఈ వీడియో చూసి వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

 - https://apple.co/3loQYe ఆపిల్ లింక్..

0
0
Report
Advertisement

Used Cars In Delhi: కేవలం రూ.99 వేలకే మారుతి, టాటా కార్లు.. ఎక్కడో తెలుసుకోండి!

Hyderabad, Telangana:

Best Second Hand Car Market Deals 2026: మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కువ సెకండ్ హ్యాండ్ కార్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా అత్యంత తక్కువ ధరల్లో లభించే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు కలిగిన కార్లు అత్యధికంగా కొనుగోలు చేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా చాలామంది ఢిల్లీలోని సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీనిని దృష్టిలో పెట్టుకొని అక్కడ నిర్వాహకులు కొన్ని కార్లపై ఎప్పటికప్పుడు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తూ వస్తున్నారు. 

ఢిల్లీలో సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్..

ముఖ్యంగా ఢిల్లీలోని డిడిఎ మార్కెట్, సెక్టార్-16, రోహిణి, బై ఎన్.ఎస్, ఏ-బ్లాక్‌లో అందుబాటులో ఉన్న కొన్ని సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్ మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని అత్యంత తక్కువ ధరలలోనే మంచి మంచి కార్లను విక్రయిస్తూ వస్తున్నాయి. ఇక్కడ కొన్ని బ్రాండ్లకు సంబంధించిన కార్లు సగం ధరలకే లభించడం విశేషం..అంతేకాకుండా ఇక్కడి సెకండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన షోరూమ్స్ లో సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కేవలం రూ.99 వేల నుంచి కార్లు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ మారుతి వ్యాగన్ఆర్ నుంచి లగ్జరీ అన్ని రకాల ఎస్యూవీల వరకు అన్నీ అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా పండగల సందర్భంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉండడం విశేషం..

సెవెన్ సీటర‌్స్..

ఇక్కడ సెవెన్ సీటర్ గో ప్లస్ మోడల్ 2017 CNG కారు కేవలం 1,79,000 నుంచే ప్రారంభమవుతుంది. అంతేకాకుండా 2018 మోడల్‌కి సంబంధించిన రెనాల్ట్ ట్రైబర్ వంటి సెవెన్ సీటర్లు కేవలం రూ. 2.29 లక్షలకే విక్రయిస్తున్నారు. అలాగే ఇవే కాకుండా ఇక్కడ కొన్ని సెవెన్ సీటర్ కార్లు కేవలం మూడు లక్షల లోపే అందుబాటులో ఉన్నాయి..అదేవిధంగా హ్యాచ్‌బ్యాక్ కార్ల వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని.. మధ్యతరగతి వారి ఫేవరెట్ వ్యాగన్ఆర్ 2017 మోడల్ కార్లు కేవలం ఇక్కడ రెండు లక్షల 50 వేల లోపే విక్రయిస్తున్నారు. అంతేకాకుండా 2019 మోడల్ కు సంబంధించిన స్విఫ్ట్ డిజైర్ కార్ కేవలం నాలుగు లక్షల లోపే విక్రయిస్తూ రావడం విశేషం..

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

రూ.99 వేలకే కారు..

అదేవిధంగా మారుతి ఆల్టో 2021 మోడల్ కార్లు ఇక్కడ కేవలం నాలుగు లక్షల 29 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా 2018 మోడల్ టాటా టియాగో కేవలం రెండు లక్షల లోపే అందుబాటులో ఉండడం విశేషం. అలాగే కారు నచ్చి బడ్జెట్ లేని వారి కోసం ఇక్కడ నిర్వాహకులు పెట్రోల్ కారును కేవలం రూ.99 వేలు కట్టిన వారికి విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కార్లు అయితే ఇక్కడ చాలా చీప్ ధరలకే లభిస్తున్నాయి.

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Vemulawada: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..

Vemulawada, Telangana:

Vemulawada Farmers Struggle: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల కష్టాలు తీరుతాయని ఆశించిన అన్నదాతకు నిరాశే ఎదురవుతూ వస్తోంది. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారడంతో రైతులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలంలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ అసమర్థతకు అడ్డం పడుతున్నాయి. అంతేకాకుండా దాన్యం లోడుతో వచ్చిన ట్రాక్టర్లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

చందుర్తి మండలంలోని ఓ రైస్ మిల్లు వద్ద ధాన్యం లోడ్లతో వచ్చిన ట్రాక్టర్లు కొన్ని మీటర్ల మీరా నిలిచిపోయాయి. ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతులు రాత్రింబవళ్లు వాహనాల వద్ద ఉండి పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లు యజమానులు లోడు దింపుకోవడంలో జాప్యం చేస్తుండడంతో.. రోడ్డుపై ట్రాక్టర్లను ఉంచడం వల్ల ఆటుగుండా వెళుతున్న వాహనాలు కూడా స్తంభించిపోతున్నాయి. 

ఎంతో కష్టపడి పంట పండించడం ఒక ఎత్తు అయితే.. పండిన పంటను అమ్ముకోవడం ఇప్పుడు మాకు మరో యుద్ధంలా మారిందని.. స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెబుతున్నప్పటికీ.. ఇప్పటికీ కొన్నిచోట్ల ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల గోస వినే నాధుడే కరువయ్యాడని వేములవాడ, చందుర్తి పరిసర ప్రాంతాల్లోని రైతులు వాపోతున్నారు. మిల్లుల వద్ద ఫేమశాతం పేరుతో కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..

అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతులు లేవని.. వాన వస్తే ధాన్యం తడిసిపోతుందనే భయం వెంటాడుతోందని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రణాళిక బద్ధమైన కొనుగోలు జరగడంలేదని.. అధికారుల మధ్య సమన్వయం లోపించిందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.. ఓట్లు వేయించుకునేటప్పుడు ఉన్న శ్రద్ధ.. మా పంటలు కొనేటప్పుడు ఎందుకు లేదు అని రైతులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి.. రైస్ మిల్లుల వద్ద నిలిచిపోయిన వాహనాల రోడ్లను తక్షణమే దింపుకోవాలని.. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు త్వరితగతిన చెల్లింపు జరపాలని డిమాండ్ చేస్తున్నారు..

Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Delhi Cars: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

Hyderabad, Telangana:

Second Hand Cars Delhi Telugu News: కొత్త కారు కొనాలని కలలు కంటున్నారా? కానీ బడ్జెట్ భయమేస్తోందా? అయితే మీకోసం ఒక అదిరిపోయే అవకాశం ఉంది. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ సమీపంలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్‌లో మల్టీ నేషనల్ బ్రాండ్లకు తో పాటు భారతదేశానికి బ్రాండ్లకు సంబంధించిన కార్లపై కళ్లు చెదిరే ఆఫర్స్ అందిస్తూ వస్తున్నారు. కేవలం కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగిన అన్‌రిజిస్టర్డ్ (Unregistered) డెమో కార్లను, సెకండ్ హ్యాండ్ వాహనాల ధరలకే విక్రయిస్తున్నట్లు అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కార్లు కొనుగోలు చేసే వారికి RCపై నేరుగా ఫస్ట్ ఓనర్ అయ్యే అవకాశం ఉండడం విశేషం. అయితే ఈ మార్కెట్లో ఏ కార్లు అత్యంత చీకు ధరలకు అందుబాటులో ఉన్నాయో? వాడికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

సాధారణంగా షోరూం నుంచి కారును రోడ్డుపైకి తీసుకురావాలంటే భారీగా పన్నులతో పాటు ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ లభించే అన్ రిజిస్టర్ డెమో కార్లపై వినియోగదారులు రూ.2 లక్షల నుంచి ఏకంగా 5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ లభించే కార్లకు కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని వినియోగిస్తే అత్యంత తక్కువ ధరల్లోనే ఈ అన్ రిజిస్టర్ కార్లు కొనుగోలు చేయొచ్చు..

ఇప్పుడు మార్కెట్‌లో మహీంద్రా XUV 9 (EV) కార్లకు మంచి డిమాండ్ ఉంది.. అయితే, మార్కెట్‌లో సుమారు ఈ కారు ధర రూ.33 లక్షల వరకు పలుకుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ల్లో బాగా  సేల్ అవుతున్న కార్లలో ఇది ఒకటి. కానీ ఇక్కడ మార్కెట్లో కేవలం 480 కిలోమీటర్లు తిరిగిన ఈ కారు కేవలం రూ.27 లక్షల్లోపే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్ అన్నీ పోను దాదాపు రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు సేవ్ అవుతుంది.. టాటా పంచుతోపాటు ఆల్ట్రోజ్ (CNG) మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కార్లు కేవలం ఇక్కడ  12000 కిలోమీటర్లు తిరిగినవి రూ.8 లక్షల లోపే అందుబాటులో ఉన్నాయి. 

Also Read: నాకు ముగ్గురు పిల్లలున్నారు.. వదిలేయండి.. ఢిల్లీ గ్యాంగ్ రే**ప్ బాధితురాలు కన్నీరు..

అలాగే మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న మహీంద్రా థార్ 4x4, 4x2 మోడల్స్ కేవలం రూ.11 లక్షల నుంచే ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా కొన్ని లగ్జరీ కార్లు అయితే అత్యంత చీప్ ధరలకే అందుబాటులో ఉండడం విశేషం. ఇక 2017 మోడల్ హోండా సిటీ రూ.5 లక్షలకే లభిస్తోంది. అంతేకాకుండా బెలినో ఆల్ఫా కేవలం నాలుగు లక్షలకి అందుబాటులో ఉన్నాయి. ఇక ఎంజి ఆస్టర్ ఎలక్ట్రిక్ కార్ పై దాదాపు మూడు లక్షల వరకు భారీ తగ్గింపు అందిస్తున్నారు. ఇక్కడ కేవలం సర్వేస్ రికార్డులో ఉన్న కార్లను మాత్రమే విక్రయిస్తున్నట్లు అక్కడి సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ యజమానులు చెబుతున్నారు. అంతేకాకుండా డబ్బులు లేనివారికి ప్రత్యేకమైన ఫైనాన్స్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు.

Also Read: నాకు ముగ్గురు పిల్లలున్నారు.. వదిలేయండి.. ఢిల్లీ గ్యాంగ్ రే**ప్ బాధితురాలు కన్నీరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Puttaparthi AMCA: రూ.15,803 కోట్లతో పుట్టపర్తిలో డిఫెన్స్ పెట్టుబడి..ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శంఖుస్థాపన!

Puttaparthi, Andhra Pradesh:

Puttaparthi AMCA Laying Foundation: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కలిసి అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం రాయలసీమ ముఖచిత్రాన్ని, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా భవిష్యత్తును మార్చే దిశగా అడుగులు వేసింది.

రక్షణ శక్తి కేంద్రంగా పుట్టపర్తి
భారతదేశ రక్షణ రంగంలో కొత్త శక్తి కేంద్రంగా పుట్టపర్తి అవతరించబోతోంది. రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ AMCA ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), DRDO భాగస్వామ్యంతో నిర్మించారు. దీని ద్వారా సుమారు 7,500 మంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కేవలం ఫైటర్ జెట్లే కాకుండా, డ్రోన్ సిటీలోని నిషేధ రక్షణ ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్షిపణులు, హ్యాండ్ గ్రెనెడ్లు, ఆధునిక తుపాకులు, యుద్ధ విమానాల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

బుల్లెట్ స్పీడ్‌తో అభివృద్ధి: సీఎం చంద్రబాబు
శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధిని 'బుల్లెట్ స్పీడ్'తో పరుగులు తీయిస్తున్నామని ప్రకటించారు. "అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, వాటిని అందిపుచ్చుకుని ఎదగాల్సిన బాధ్యత యువతది" అని ఆయన అన్నారు. కరువు సీమలో గతంలో తాను తెచ్చిన కియా పరిశ్రమ నేడు 18 లక్షల కార్లను తయారు చేస్తూ, 80 దేశాలకు ఎగుమతి చేస్తోందని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని మారుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

"ఫ్యాక్షన్ Vs ఫైటర్ జెట్": నారా లోకేష్
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు గుప్పించారు. "నాడు కియా కార్లు తెచ్చినా, నేడు ఫైటర్ జెట్లు తెచ్చినా అది చంద్రబాబు వల్లే సాధ్యమైంది. వైసీపీది ఫ్యాక్షన్, క్రిమినల్ బ్యాగ్రౌండ్ అయితే, మనది ఫైటర్ జెట్, కియా బ్యాగ్రౌండ్" అని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 23 నెలల్లోనే 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అంటే ఏమిటో ప్రపంచానికి చూపామని లోకేష్ పేర్కొన్నారు.

పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, ఇప్పుడు పారిశ్రామిక, రక్షణ రంగ హబ్‌గా మారుతోంది. సత్యసాయి బాబా దర్శనికతతో నిర్మించిన ఎయిర్‌పోర్టు నేడు పారిశ్రామిక అవసరాలకు ఎంతో ఉపయోగపడుతోంది. మొత్తానికి.. AMCA ప్రాజెక్టు రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలవడం ఖాయమని ప్రభుత్వ వర్గాలకు ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, బీజేపీ రాష్ట్ర నేతలు ఉన్నారు.

Also REad: ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు..నో వెహికల్ డే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

Also Read: నీట్ అభ్యర్ధులకు శుభవార్త..ఫీజు తిరిగి చెల్లింపుతో పాటు 15 నిమిషాలు నిడివి పెంపు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Erragadda TIMS: హైదరాబాద్‌ ప్రజలకు కేసీఆర్‌ ప్రపంచ స్థాయి వైద్యం అందించారు: కేటీఆర్‌

Hyderabad, Telangana:

KTR At TIMS Hospital: 'హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే నేడు కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లో ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించేలా టిమ్స్‌ను ఆలోచించి రూపకల్పన చేశాం' మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వివరించారు.

Also Read: Bandi Bhageerath: 'మా కూతురిపై కుట్ర చేస్తున్నారు'.. పోక్సో బాధితురాలి తల్లి ఆవేదన

హైదరాబాద్‌లోని సనత్‌నగర్ (ఎర్రగడ్డ) టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సనత్‌నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించాం. అత్యాధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రిని నిర్మించాం. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్‌ను తీసుకువచ్చింది. హైదరాబాద్‌లో సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్ ప్రాంతాల్లో టిమ్స్ ఆస్పత్రులను నిర్మించాం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

Also Read: PBKS vs MI Highlights: పంజాబ్‌ను దెబ్బతీసిన ముంబై.. తిలక్‌వర్మ తుఫాన్‌ ఇన్నింగ్స్‌

'వరంగల్‌లో 2000 పడకలతో  ప్రభుత్వ ఆసుపత్రిని, నిమ్స్ ఆసుపత్రిని కూడా భారీ స్థాయిలో విస్తరించాం. సనత్‌నగర్ టిమ్స్‌లో మొత్తం మూడు బ్లాకులు నిర్మించాం. 300 ఐసీయూ బెడ్స్‌తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశాం. రూ.1,200 కోట్ల వ్యయంతో టిమ్స్ నిర్మాణం చేపట్టాం. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Also Read: Bandi Bhageerath: కొడుకును అప్పగించకుండా బండి సంజయ్‌ ఎవరిని బెదిరిస్తున్నాడు?

'16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశాం. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సహా అన్ని డయాగ్నస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక వీఐపీ సూట్స్ కూడా ఏర్పాటు చేశాం. కిడ్నీ సంబంధిత వ్యాధులపై ప్రత్యేక పరిశోధనలు జరిగేలా సదుపాయాలు కల్పిస్తున్నాం. దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

'ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకాడెమిక్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాం. భారీ ఆడిటోరియం నిర్మాణం కూడా చేపట్టాం. ఒకేసారి వెయ్యి కార్లు పార్క్ చేసేలా ఆధునిక పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం. టిమ్స్ హాస్పిటల్ డిజైన్ దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ వైద్య నిర్మాణాల్లో ఒకటి' అని కేటీఆర్ ప్రకటించారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ ర్యాంప్ నిర్మించామని తెలిపారు. లిఫ్టుల పనితీరును వెంటనే మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో వైద్యం అందించామని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. మిగిలిన నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ఎర్రగడ్డ టిమ్స్‌ ఆస్పత్రిని ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top