2లక్షల రుణమాఫీకీ కోర్రిలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంఆందోళనలో రైతులు
Karimnagar, Telangana:2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రూరల్ బీజేపీ అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కరీంనగర్ రూరల్ ఎంఎంఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోంది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Jogini Shyamala: ఛీ ఛీ ఇంత ఘోరమా.. బోరున విలపించిన జోగిన శ్యామల
Secunderabad, Telangana:Jogini Shyamala Get Tears Over Secunderabad Ujjaini Bonalu Arrangements Watch Emotional VideoBonalu 2026: బోనాలు కిందపడేసిన జోగినీలు మహంకాళి బోనాలలో కలకలం
Secunderabad, Telangana:Jogini Shyamala Emotional Comments At Secunderabad Ujjaini Mahankali Bonalu 2026 Watch VideoMLA Virupakshi: ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్.. 'నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం' వైఎస్ జగన్
Tadepalli, Andhra Pradesh:MLA Virupakshi Arrest: 'నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం! దాడి చేసినవారికి రక్షణ. బాధితులపై కేసులతో రాజకీయ కక్ష! రాష్ట్రంలో ఏం జరుగుతోంది చంద్రబాబు?' అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. 'దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ.. దాడికి గురైనవారు వైఎస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు. బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపై కేసులు! ప్రశ్నిస్తే అరెస్టులు ! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం?ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం?' అని చంద్రబాబును మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు.
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ సందర్భంగా 'ఎక్స్' వేదికగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. 'నేను సూటిగా అడుగుతున్నా. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?' అని ప్రశ్నించారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్ ఆఫ్ లా అనేది ఉందా? అని మాజీ సీఎం వైఎస్ జగన్ సందేహం వ్యక్తం చేశారు.
'చిప్పగిరి మండలం నేమకళ్లులో వైఎస్సార్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీవాళ్లు దాడి చేస్తే.. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి కాల్ చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా?' అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయని.. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారని వివరించారు.
నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం!
దాడి చేసినవారికి రక్షణ… బాధితులపై కేసులతో రాజకీయ కక్ష!@ncbn గారూ.. రాష్ట్రంలో ఇవాళ ఏం జరుగుతోంది? దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ! దాడికి గురైనవారు వైయస్సార్సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు ! బాధితులకు అండగా నిలబడితే…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 2, 2026
'నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు' అని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అని ప్రశ్నించారు.
'అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో.. కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో.. ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో... ప్రజలకు తెలియకూడదనే హార్డ్డిస్కులను తీసుకెళ్లారా? సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా చంద్రబాబు?' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు.
'శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. చింతాడ రవికుమార్పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా?' అని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే షేక్ మొహ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడిపైన ఇదే రాజకీయ కక్షసాధింపు అని పేర్కొన్నారు.
'రాష్ట్రంలోని జెన్జీ తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదు?' అని యువత ప్రశ్నిస్తోందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుర్తుచేశారు. 'విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? అని అడిగితే నారా లోకేశ్ దగ్గర సమాధానం లేదు' అని వివరించారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని.. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని.. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు.
'అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. చంద్రబాబు గుర్తుపెట్టుకో' అని మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. 'ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా.. ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా.. ఎన్ని పోలీసు బలగాలను దించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదు' అని స్పష్టం చేశారు. అన్యాయాన్ని నిలదీస్తామని.. అరాచక పాలనపై పోరాడుతామని ప్రకటించారు.
YSRCP: భోగాపురం ఎయిర్పోర్టు అబద్దాల్లో చంద్రబాబుకు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవ్వాలి
Visakhapatnam, Andhra Pradesh:Gudivada Amarnath Fire On Chandrababu A Head Bhogapuram AirportTirumala: శ్రీవారి సుప్రభాత సేవలో హార్దిక్ పాండ్యా.. గుండులో దర్శనం
Dharmavaram, Andhra Pradesh:Star Cricketer Hardik Pandya Tonsured And Visits To Tirumala TempleKTR: దేశ తలరాతను నిర్ణయించేది జెన్ జీ ఓటర్లే.. అప్రమత్తం కావాలి: కేటీఆర్
Hyderabad, Telangana:KT Rama Rao Says Gen Z Voters Will Decides India Countrys Destiny In 2029Secunderabad Bonalu: సికింద్రాబాద్ బోనాల్లో అపచారం.. రోడ్డుపై పడిపోయిన బోనాలు
Secunderabad, Telangana:Secunderabad Bonalu: ఆషాఢ మాసంలో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లోని సికింద్రాబాద్లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో భక్తులతోపాటు జోగినిలు, శివసత్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీవ్ర తోపులాటతో భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఇక బోనాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే శివసత్తులు, జోగినిలు క్యూలైన్లలో నిలబడలేక నీరసించిపోయి కిందపడిపోయారు. తోపులాట కారణంగా వారు ఎంతో భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చిన బోనాలు రోడ్డుపై పడ్డాయి.
అధికారులు, ప్రభుత్వ తీరుతో జోగినిలు, శివసత్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం వద్ద జోగిని శ్యామలతోపాటు ఇతర జోగినిలు, శివసత్తులు అందోళన చేశారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల భక్తులకు, ముఖ్యంగా బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకు తగిన సౌకర్యాలు కల్పించలేదని జోగిని శ్యామల అవేదన వ్యక్తం చేశారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలయం ముఖద్వారం ఎదుట జోగినిలు బైఠాయించి ఆందోళన చేశారు. తోపులాటలో సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోయిన జోగినిలు, శివసత్తులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జోగిని శ్యామల కన్నీటిపర్యంతమయ్యారు. తమకు అన్యాయం చేయడం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం అని జోగినిలు శాపనార్థాలు పెట్టారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో హైదరాబాద్ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. భక్తుల భద్రతతో పాటు నేరస్థులు, సంఘ విద్రోహ శక్తులను గుర్తించే ఏర్పాట్లు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేసి.. దర్శనానికి వచ్చే భక్తుల ముఖచిత్రాలను ఏఐ ద్వారా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే నేరచరిత్ర కలిగిన వ్యక్తులు లేదా సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారిని వెంటనే గుర్తించేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది. 15 మంది సిబ్బంది 20 సీసీ కెమెరాల ద్వారా నిరంతరం 48 గంటల పాటు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి కదలికపై నిఘా ఉంచుతూ అనుమానాస్పద వ్యక్తులు గుర్తించిన వెంటనే సంబంధిత పోలీసు బృందాలకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశారు.
సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: పాలమూరు ఎంపీ డీకే అరుణ డిమాండ్
Mahbubnagar, Telangana:Revanth Reddy Apology: ‘రేవంత్ రెడ్డి హోదా మరచి మాట్లాడుతున్నారు. పేద విద్యార్థుల, తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని, కూలీ పనులు చేస్తూ కష్టాలు పడి పిల్లలను చదివిస్తున్నారు. తమ పిల్లలు ఉన్నత విద్యవంతులు కావాలని కాలేజీలకు పంపిస్తే.. క్రిమినల్ వెస్ట్ అనడం సమంజసం కాదు‘ అని ఎంపీ డీకే అరుణ ప్రకటించారు. ‘విద్య శాఖ ఎవరి చేతుల్లో ఉంది.? విద్య శాఖ మంత్రి ఎవరు..? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వడం లేదు..? మూడు ఏళ్లలో విద్య రంగానికి మీరు చేసింది ఏంటి..?‘ అని డీకే అరుణ ప్రశ్నించారు. విద్యార్థులను అగౌరవపరిచేలా మాట్లాడం సమంజసం కాదని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశ్నిస్తే.. లాఠీ ఛార్జ్ చేయిస్తూ.. కేసులు పెట్టడం బాధాకరమని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చేయలేక అడ్డమైన మాటలతో, అగౌరవపరిచేలా మాట్లాడటం ఏంటి.? అని రేవంత్ రెడ్డిని ఎంపీ డీకే అరుణ నిలదీశారు.
విద్యార్థులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు కోరాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. విద్యా శాఖ మంత్రిగా ఆ కుర్చీలో కూర్చునే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. విద్యార్థులను గౌరవించలేనే వారు విద్య శాఖ మంత్రి, రాష్ట్ర సీఎం అంటే విద్య వ్యవస్థ ఎటు వెళ్తుంది. విద్య శాఖ దగ్గర పెట్టుకొని, విద్య రంగం బలోపేతం చేయలేకపోవడంతో అసమర్థులని నిరూపించుకున్నారు. బాధ్యత వహించి విద్య శాఖ కు రాజీనామా చేయాలి‘ బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.
‘విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసే పోలీసులు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వినయం ప్రకటించుకోకండి. గత ప్రభుత్వం ఏం అయ్యిందో తెలుసు. విద్యార్థులు శాంతియుత నిరసన వ్యక్తం చేస్తే లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది‘ అని ప్రశ్నించారు. విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ ను ఈ సందర్భంగా డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ‘విద్యార్థుల పై ఎటువంటి కేసులు నమోదు చేయవద్దు. హార్వర్డ్ యూనివర్సిటీలో వీకెండ్ క్లాసులకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి, రెండు మాటలు నేర్చుకొని విద్యార్థులను అవమానించాల్సిన అవసరం లేదు. విద్యార్థులందరికీ హార్వర్డ్ వెళ్లే అవకాశం రాదు. చేతనైతే విద్యార్థులకు అటువంటి అవకాశాలు కల్పించాలి‘ అని రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హితవు పలికారు.
YSRCP: అబద్దాల్లో చంద్రబాబుకు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవ్వాలి: గుడివాడ అమర్నాథ్
Visakhapatnam, Andhra Pradesh:Boghapuram Airport: ‘అబద్దాల విషయంలో చంద్రబాబుకు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవ్వాలి. కొబ్బరికాయ కొట్టింది.. గుమ్మడికాయ కొట్టింది నేనే అనే చంద్రబాబు మాటలు నిజమే‘ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ‘ప్రధానమంత్రి పాల్గొన్న వేదికపై జగన్ మోహన్ రెడ్డి విమర్శకు మాత్రమే కూటమి నేతలు దృష్టి పెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ కట్టింది జగన్ మోహన్ రెడ్డి అన్నది ప్రజలు గుర్తించారు‘ అని గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.
‘ఎయిర్పోర్ట్కు అవసరమైన భూమి లేకుండానే 2014లో చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఎన్నికల ముందు ఎన్నో శిలాఫలకాలు చంద్రబాబు వేశారు. మే 19 2020లో భోగాపురం జిఎంఆర్ సర్టిఫికెట్ ఇన్కార్పొరేషన్ జరిగింది. నాలుగు గ్రామాలతో పాటు 2500 ఎకరాల భూ సేకరణ చేసి వెయ్యి కోట్లు పరిహారం జగన్ ప్రభుత్వం ముందు చేసింది. 2023 మే నెలలోనే అన్ని క్లియరెన్స్ తీసుకువచ్చి జగన్ మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులకు శంకుస్థాపన చేశారు.2026 కల్లా పూర్తి చేస్తామని అప్పుడే సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుడివాడ అమర్ నాథ్ వివరించారు.
‘భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం స్వాగతిస్తున్నాం. సంతోషం. జీఎంఆర్ అధినేత మల్లికార్జునరావుకు ధన్యవాదాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేదికపై ఎందుకు జీఎంఆర్తో మాట్లాడించలేదు?' అని అమర్ నాథ్ ప్రశ్నించారు. వాస్తవాలు చెబుతారనే జీఎంఆర్తో మాట్లాడించలేదని చెప్పారు. ‘రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే వైసీపీ ముఖ్యం. భోగాపురంలో యువతి మాటలను జగన్ మాటలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నిన్న జరిగిన ప్రారంభోత్సవం కేవలం కూటమి ఈవెంట్ మేనేజ్ మెంట్ మాత్రమే' అని గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. కుప్పం ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందో చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. 2019 లో వేసిన కుప్పం శిలాఫలకం ఎక్కడ ఉందో చెప్పగలరా అని ప్రశ్నించారు.
‘మళ్లీ 2029లో శిలాఫలకాలు వేసే పనులు చంద్రబాబు నాయుడు మొదలు పెడతారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారో బాబు చెప్పాలి. ఉత్తరాంధ్రను ఓటు బ్యాంక్ గా ఉత్తరాంధ్రను వాడుతున్నారు‘ అని కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్ నాథ్ విమర్శలు చేశారు. 13 వేల మంది గిరిజనులతో థింసా డాన్స్ రికార్డు మినహా బాబు ప్రభుత్వం ఏం చెయ్యలేదని స్పష్టం చేశారు.
ప్రైవేటు ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్...కష్ట సమయాల్లో పీఎఫ్ డబ్బులు ఇకపై UPI ద్వారా విత్ డ్రా చేసుకునే ఛాన్స్..!!
Lakshmapur, Telangana:EPFO New Updates: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పీఎఫ్ క్లెయిమ్ పనితీరును వేగంగా మార్చేందుకు, అనేక మార్పులు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రక్రియ వల్ల ఉద్యోగులకు ఎంతగానో లబ్ధి చేకూరాలని ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు పిఎఫ్ డబ్బులను బయటకు తీసేందుకు ఈపీఎఫ్ఓ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. . తద్వారా అత్యవసర సమయాల్లో మీరు డబ్బులను విత్ డ్రా చేసుకోవడం చాలా సులభతరం అవుతుంది.
గతంలో పిఎఫ్ డబ్బులను బయటకు తీయాలి అంటే కనీసం 7 నుంచి 10 రోజుల వరకు సమయం పట్టేది కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది వీటి ద్వారా మీకు కేవలం 24 గంటల నుంచి 48 గంటల్లోగా డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానం ద్వారా త్వరగా సెటిల్మెంట్లు పూర్తవుతున్నాయి తద్వారా ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో ఆ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో EPFO సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) రమేష్ కృష్ణమూర్తి పలు కీలకమైన విషయాలను ప్రకటించారు. ఇందులో అత్యంత కీలకమైనది ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను మీ ఖాతా నుంచి బయటకు తీయడం ఎలాగో ఆయన పూర్తిస్థాయిలో వివరించారు. ప్రస్తుతం ఈపీఎఫ్వో ద్వారా ఉద్యోగులు తాము చేసే విత్ డ్రా క్లైములు అన్ని కూడా ఆటోమేటిక్ ప్రాసెస్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ ఆటో సెటిల్మెంట్ విధానం ద్వారా ఎలాంటి మానవ జోక్యం తగ్గింది. ఫలితంగా క్లెయిములను ఆమోదించడామికి వేగం పెరుగుతోంది. తద్వారా ఉద్యోగులు త్వరగా తమ డబ్బులు తీసుకునేందుకు వీలు కలుగుతోంది.
త్వరలో EPFO UPI ఆధారిత చెల్లింపు వ్యవస్థ ప్రారంభం:
ఇకపై క్లెయిమ్ ను మరింత వేగంగా చేసేందుకు కూడా ఈపీఎఫ్ఓ కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. తద్వారా మీరు పీఎఫ్ క్లెయింలను అత్యంత వేగంగా పరిష్కారం అయ్యేందుకు యూపీఐ లింక్ ఉన్న బ్యాంకు ఖాతా ద్వారా పూర్తి చేసేందకు ఈపీఎఫ్ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మీ పీఎఫ్ క్లెయిమ్ ఆమోదం పొందిన అనంతరం కొద్ది సమయంలోనే UPI లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా మీ పీఎఫ్ డబ్బులు జమ అవుతాయి.
అయితే ఈ యూపీఐ సేవలు మరికొన్ని నెలల్లో అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే దీనిని దశలవారీగా అమలు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఇది కనుక అమల్లోకి వచ్చినట్లయితే ఉద్యోగులు అత్యంత సులభంగా డబ్బులను బయటకు తీసుకొని తమ అత్యవసర ఖర్చులకోసం వినియోగించుకోవచ్చు. ఇది ఒక రకంగా ఉద్యోగులకు ఎంతో సులువైన ప్రక్రియగా చెప్పవచ్చు.
ఇక ఈపీఎఫ్ ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైనది ఆటో సెటిల్మెంట్ దీని పరిమితిని ఒక లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన సమావేశంలో EPFO సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) రమేష్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీని ద్వారా అనారోగ్యంతో పాటు పెళ్లి ఇల్లు నిర్మాణం విద్యావంటి అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బులు సులభంగా పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.EPFO 3.0లో భాగంగా డాక్యుమెంటేషన్ ప్రక్రియ సైతం చాలా సులభంగా ఉండేలా చేశారు. అంతే కాదు రిజెక్షన్ అయ్యే అవకాశాలను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?
Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల
Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
అమెరికా వీసాలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయం..!!
Lakshmapur, Telangana:US Visa Bond: అమెరికా వెళ్లాలనుకునేవారికి ట్రంప్ సర్కార్ భారీ విజిటింగ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. బిజినెస్, టూరిస్టు వీసాల కోసం దరఖాస్తు చేసుకునే కొందరు విదేశీ పౌరులు సుమారు 20,000 డాలర్లు అంటే రూ. 16.5లక్షల వరకు సెక్యూరిటీ బాండ్ లేదా డిపాజిట్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠినమైన వలస విధానం ఆగస్టు 3వ తేదీ నుంచి శాశ్వతంగా అమల్లోకి రానుంది.
ఆగస్టు 3వ తేదీ నుండి అమలులోకి వస్తుంది: ఫెడరల్ రిజిస్టర్లోని ఒక నోటిఫికేషన్ ప్రకారం, వీసా అధికారులు అవసరమైతే, అర్హులైన దరఖాస్తుదారుల నుండి 20,000డాలర్ల వరకు బాండ్ను కోరవచ్చు.
కారణం: వీసాల గడువు ముగిసిన తర్వాత యూఎస్లో అధిక కాలం ఉండిపోయే ధోరణిని అరికట్టడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
పైలట్ దశ పూర్తయింది: కొత్త నిబంధన ప్రకారం, వీసాలు మంజూరు చేయడానికి కాన్సులర్ అధికారులు ఇప్పుడు భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేయనున్నారు. వీసా షరతులలో భాగంగా, దరఖాస్తుదారులను $20,000 వరకు భారీ బాండ్ను సమర్పించమని అడిగే అవకాశం ఉంటుంది. గతంలో $5,000 ఎంపిక కూడా అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు దానిని పూర్తిగా తొలగించారు. పైలట్ ప్రోగ్రామ్లో, అధికారులు $10,000 లేదా $15,000 వరకు బాండ్లను కూడా కోరుతున్నారు.
భారతీయులకు ప్రయోజనాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?
ప్రస్తుత స్థితి: ఈ నియమం ప్రస్తుతం 50 దేశాల పౌరులకు వర్తిస్తుంది (ప్రధానంగా ఆఫ్రికా దేశాలు, అలాగే బంగ్లాదేశ్, నేపాల్ భూటాన్). భారతదేశం ఇంకా ఈ జాబితాలో లేదు. కాబట్టి భారతీయ ప్రయాణికులు ప్రస్తుతం ఈ బాండ్ను సమర్పించాల్సిన అవసరం లేదు.
భవిష్యత్ హెచ్చరిక: అయితే, భవిష్యత్తులో పరిస్థితిని బట్టి ఈ జాబితాలో ఇతర దేశాలను కూడా చేర్చే హక్కు తమకు ఉందని అమెరికా స్పష్టం చేసినందున, భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికాకు చట్టబద్ధమైన ప్రయాణాలపై ఈ నిర్ణయం గణనీయమైన, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వాదిస్తూ, చాలా మంది హక్కుల కార్యకర్తలు అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ధమైన వలసలను కష్టతరం చేసిందని విమర్శకులు మండిపడుతున్నారు.. అయితే, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి ఇది అత్యవసరం అని ట్రంప్ వాదిస్తున్నారు.
Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?
Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల
Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
వారందరికీ పింఛన్లు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!
Lakshmapur, Telangana:Telangana Govt Schemes: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించడానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. పొదుపు చర్యలు చేపడుతోంది. మితిమీరిన వ్యయం, రుణ వడ్డీ భారం దృష్ట్యా, పథకాలలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా, రాష్ట్రంలోని పింఛను లబ్ధిదారుల జాబితాను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి తనిఖీల సందర్భంగా సుమారు 1.28 లక్షల మంది పింఛను లబ్ధిదారులు అనర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అధికారులు సంకలనం చేసిన నివేదికలలో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన వ్యక్తుల పేర్లతో పింఛన్లు పంపిణీ చేయడం, నకిలీ ధృవపత్రాలతో ఇతర రాష్ట్రాల వారికి ప్రయోజనాలు అందించడం, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి కూడా పింఛన్లు అందుకోవడం వంటివి వాటిలో ఉన్నాయి. అదనంగా, సుమారు 1,248 మంది లబ్ధిదారులు తమకు పింఛన్లు అవసరం లేదని పేర్కొన్నప్పటికీ, వారి పేర్లు జాబితాలోనే ఉన్నాయి. ఈ అనర్హులైన లబ్ధిదారుల జిల్లా వారీ నివేదికను త్వరలో ముఖ్యమంత్రి పరిశీలన కోసం సమర్పించనున్నారు.
కొత్త పింఛన్ల మంజూరు – బ్యాలెన్స్ ప్లాన్:
ప్రస్తుతం రాష్ట్రంలో 42 లక్షల మందికి పైగా ప్రజలు పింఛన్లు పొందుతుండగా, ఆగస్టు 15వ తేదీలోగా అదనంగా మరో 2 లక్షల మంది అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా కొత్త పింఛను నిధుల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. గతంలో ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో కూడా ఇలాంటి చర్యనే తీసుకుని, ఆ తర్వాత కొత్త కార్డులను జారీ చేసింది.అయితే, ఈ తొలగింపు ప్రక్రియ వల్ల నిజంగా అర్హులైన వ్యక్తులకు అన్యాయం జరగకుండా అధికారులు చాలా జాగ్రత్త వహించాలి. ఒకవేళ అర్హులైనప్పటికీ, సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల పింఛన్లు నిలిపివేస్తే, బాధితులు స్థానిక మండల పరిషత్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి, తమ సమస్యకు పరిష్కారం పొందవచ్చని అధికారులు తెలిపారు.
Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?
Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల
Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Komatireddy: గెలిపిస్తామంటేనే ఎన్నికల్లో పోటీ చేస్తా.. లేదంటే లేదు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Nalgonda, Telangana:Nalgonda Politics: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాలోనే కాదు.. తెలంగాణలోనే ఉండదని ప్రకటించి సంచలనం రేపిన మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి.. మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోసారి తనను గెలిపిస్తానని హామీ ఇస్తేనే పోటీ చేస్తానని.. లేకుంటే పోటీ చేయనని సంచలన ప్రకటన చేశారు. ఎన్ని జన్మలెత్తినా నల్లగొండ నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యమని చెప్పారు.
నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ సాయి నగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్తో కలిసి కల్యాణలక్ష్,మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం. pic.twitter.com/aiSTEqdKOd
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 2, 2026
'ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం. ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం ద్వారా రెండు పంటలకు నీళ్లు ఇచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తా. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం' అని కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. నల్లగొండ నియోజకవర్గం ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదని తెలిపారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చింది నియోజకవర్గ ప్రజలే అని.. కంచనపల్లి గ్రామాన్ని మోడల్గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రూ.3 కోట్లతో సబ్ స్టేషన్ను మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. తాను నియోజకవర్గానికి ప్రచారానికి రాకపోయినా.. చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేసి గెలిపించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. కంచనపల్లిని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ప్రకటించారు.
అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూ, సంక్షేమ పాలన అందిస్తున్నాం. రాబోయే 15 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం. pic.twitter.com/Rl82j3CAfC
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 2, 2026
దోమలపల్లి గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుచేసి ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మూడు సంవత్సరాలు నల్గొండ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. వారానికి రెండు రోజులు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. నల్లగొండ నియోజకవర్గంలో ఏ పేదవాడికి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
pic.twitter.com/QghajztleJ✅ ఎస్ఎల్బీసీ సొరంగం, బ్రాహ్మణ…
✅ దోమలపల్లిలో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య.
✅ రూ.3 కోట్లతో కంచనపల్లికి సబ్ స్టేషన్ మంజూరు.
కంచనపల్లిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతాం.నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 2, 2026
శతాబ్దపు సుదీర్ఘ సూర్యగ్రహణం.. పగటిపూటే చీకటి! 6 నిమిషాలు చీకట్లోనే ప్రపంచం, ఎందుకు ప్రత్యేకమంటే?
Hyderabad, Telangana:Longest total solar eclipse: 2027 ఆగస్టు 2వ తేదీన సంభవించే ఈ సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం ఒక ఖగోళ అద్భుతం అని చెప్పవచ్చు. 21వ శతాబ్దంలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం కానుంది. ఈ సమయంలో ప్రపంచమంలోని పలు ప్రాంతాలు 6 నిమిషాలకు పైగా చీకటిగా మారుతుందని నాసా ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకోవడం వల్ల ప్రపంచమంతా చీకటిగా మారుతుంది, అందుకే దీనిని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలో కూడా భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ సూర్యుడి ప్రకాశవంతమైన వెలుతురు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మొత్తం 6 నిమిషాల 23 సెకన్ల పాటు కొనసాగుతుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అట్లాంటిక్ మహా సముద్రం ప్రాంతాల్లో కనిపిస్తుంది. అంటే అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యెమెన్, సోమాలియా, మక్కా వంటి ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది.
భారతదేశంలో కనిపిస్తుందా?
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ప్రపంచం 6 నిమిషాల పాటు చీకటిగా మారినప్పటికీ, భారతదేశంలో మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణం కాకుండా కేవలం పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే కనిపిస్తుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో చంద్రుడు సూర్యుడిని కొంత భాగం మాత్రమే అడ్డుకోవడం వల్ల ఇది జరుగుతుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా, సూర్యుడికి సాపేక్షంగా దూరంగా ఉండటం వల్ల ఈ ప్రత్యేకమైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
అయితే, ఈ గ్రహణాన్ని నేరుగా చూడవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్ ద్వారా మాత్రమే చూడాలి. సాధారణ సన్ గ్లాసెస్ కూడా సురక్షితం కావు. ఇది చాలా అరుదైన గ్రహణం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 2009 తర్వాత భూమి నుండి సులభంగా చూడగలిగే సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే కావడం విశేషం. ఈ గ్రహణం సమయంలో ప్రపంచం చీకటిగా మారడం వల్ల పట్టపగలే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. దీని గరిష్ట వ్యవధి 6 నిమిషాల 23 సెకన్లు ఉంటుంది. ఈ గ్రహణం ఈజిప్టులోని లక్సర్ ప్రాంతానికి దగ్గరగా నమోదు అవుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని ఖగోళ శాస్త్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా పరిగణిస్తున్నారు. ఈ సమయంలో భారత్లో కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు. సూర్యగ్రహణం సమయంలో మంత్రాలు పటించడం వంటివి చేస్తారు. ఈ సమయంలో బయటకు రాకుండా కొన్ని రాశుల వారు జాగ్రత్తలు తీసుకుంటారు.
Also Read: ఇకపై క్షణాల్లో తత్కాల్ టికెట్ బుకింగ్.. ఐఆర్సీటీసీ తెచ్చిన ఆ 5 కొత్త ఫీచర్లు ఇవే!
Also Read: హైడ్రోజన్ రైలు అంటే ఏమిటి? మెట్రో కంటే తక్కువ ఛార్జీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Elnino Effect: ఏపీ, తెలంగాణ ఎల్నినో బారి నుంచి బయటపడినట్టేనా? రైతులు తప్పకుండా తెలుసుకోవాలి!
Vijayawada, Andhra Pradesh:Elnino Effect In Andhra Pradesh Telangana: ప్రస్తుత రుతుపవనాల సీజన్లో ఎల్ నినో ప్రభావం కారణంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడం, రుతుపవనాలు సైతం తీవ్రంగా నిరాశపరచడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నెలలో కూడా వర్షాలు పడటం కష్టమేనని అందరూ భావించారు.
అయితే, వాతావరణంలో ఊహించని మార్పులు సంభవించి, గతకొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.
వాతావరణ శాఖ తాజా సూచనలు, హెచ్చరికలు
వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం.. రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ శాఖ అధికారుల వివరాల మేరకు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. పోలవరం, ధవళేశ్వరం ప్రాజెక్టుల వద్ద లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. మరోవైపు తెలంగాణలోనూ వాతావరణ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక కీలక అప్డేట్ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు ఉన్న వర్షపాత లోటు గణనీయంగా తగ్గినట్లు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 5 శాతం మాత్రమే లోటు వర్షపాతం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
రైతుల్లో మళ్లీ చిగురిస్తున్న ఆశలు
మొదట్లో ఎల్ నినో ప్రభావం, రుతుపవనాల మందగమనం వల్ల పంటల సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీరు అన్నదాతలకు ఎంతో ఊరటనిస్తున్నాయి.
ఈ వర్షాల జోరు ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు కూడా మెరుగై తాగు, సాగు నీటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి, వాతావరణంలో వచ్చిన ఈ సానుకూల మార్పులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద ఊరటనిచ్చాయి.
Also Read: నీట్ విద్యార్థులకు అలర్ట్..కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్
ALso Read: ప్రధాని మోదీని బూతులు పట్టిన యువతి..ఇప్పుడు అమాయకంగా క్షమాపణలు చెబుతోంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
