బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్ కుమార్ నిర్వహించారు
Karimnagar, Telangana:వల్లంఫాడ్ హరిహర కల్యాణ మండపంలో కరీంనగర్ రూరల్ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా భాజపా జిల్లా ఉపాధ్యక్షులు కళ్లం వాసు దేవారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు హామీలు ఇచ్చి ఆరు నెలలు కావస్తున్నా ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Jagitial: తెలంగాణ పోరాట చరిత్రలో జగిత్యాలది చెరగని ముద్ర!
Hyderabad, Telangana:Telangana Formation Day In Telugu: తెలంగాణ గడ్డపై సాగిన విరోచిత పోరాటాల చరిత్రను తిరగేస్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల ప్రాంతం పోషించిన పాత్ర అద్వితీయం.. అమోఘం.. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ.. ఈ గడ్డ చవిచూచిన పోరాటాలతో పాటు చేసిన త్యాగాలను ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.. 1969 నాటి తొలిదశ ఉద్యమం నుంచి నిన్న మొన్నటి మలిదశ రాష్ట్ర సాధన పోరాటం వరకు జగిత్యాల ఎల్లప్పుడు ఉద్యమాలకు ఒక దిక్సూచిగా నిలిచింది..
దొరల గడీల అణిచివేతకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటాలైన.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష అయినా.. జగిత్యాల ప్రజలు ఎల్లప్పుడూ వెనకడుగు వేయలేదు.. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం సాగిన తొలిదశ ఉద్యమంలో ఇక్కడి విద్యార్థులతో పాటు యువత ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చారు.. అలాగే ఆంధ్ర పాలకుల వివక్ష పై తిరుగుబావుటా ఎగురవేసి.. ఈ ప్రాంత అస్తిత్వాన్ని చాటిచెప్పారు.. అంతేకాకుండా యువతులు సైతం స్వరాష్ట్ర సాధన కోసం ఎంతగానో కృషిచేసిన చరిత్ర జగిత్యాలది..
మలిదశ ఉద్యమంలో...
మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు.. ప్రొఫెసర్ జయశంకర్ వంటి నేతల పిలుపుతో సాగిన మలిదశ ఉద్యమంలో జగిత్యాల ఒక అగ్నిపర్వతంలా రగిలింది.. ఢిల్లీ పాలకుల మెడలు వంచేందుకు ఈ గడ్డకు చెందిన ఎంతోమంది యువకులతో పాటు విద్యార్థులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఉద్యమ జ్యోతిని వెలిగించారు.. లాయర్లతోపాటు డాక్టర్లు, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు, చిరు వ్యాపారులు సైతం రోడ్లపైకి వచ్చి సకలజనుల సమ్మె.. వంటావార్పు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
తెలంగాణ నినాదంతో జగిత్యాల పరిసర పల్లెలు మారుమోగిపోయాయి.. పోలీసుల లాటి దెబ్బలకు భయపడకుండా.. జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడి పోరాటాన్ని ఉదృతం చేశారు.. దశాబ్దాల సుదీర్ఘ పోరాటం.. వందలాదిమంది అమరవీరుల త్యాగం ఫలితంగానే 2014 జూన్ రెండవ తేదీన భారతదేశ పటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. ఆనాడు జగిత్యాల ప్రజలు సాగించిన ఉద్యమ స్ఫూర్తి వల్లే నీడు స్వరాష్ట్రంలో మనం స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ గడ్డపై ప్రాణాలర్పించిన అమరవీరులకు, పోరాడిన యోధులకు ప్రాంతీయ సమాజం ఘన నివాళులర్పిస్తోంది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Karimnagar: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. కరీంనగర్ గ్రానైట్ మాఫియాపై సీఐడీ ఉక్కుపాదం!
Hyderabad, Telangana:Karimnagar Mining Scams: తెలంగాణలో గత పది ఏళ్ల BRS పాలనలో జరిగిన మైనింగ్ అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపెందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో రాష్ట్రానికి సంబంధించిన సిఐడి రంగంలోకి దిగింది. 2014 నుంచి కరీంనగర్ జిల్లాలో సాగిన గ్రానైట్ అక్రమాల తవ్వకాలతో పాటు రవాణాపై సిఐడి అధికారులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. మైనింగ్ శాఖ సమర్పించిన రహస్య నివేదిక ఆధారంగా జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ గ్రానైట్ వ్యాపారులతో పాటు కీలక రాజకీయ నేతలపై ప్రత్యేకమైన ఎఫ్ఐఆర్లు (FIRs) నమోదు చేసేందుకు సిఐడి సర్వం సిద్ధం చేసినట్లు విశ్వసినీయ సమాచారం..
వందల కోట్ల దోపిడి..
కరీంనగర్ జిల్లా శంకరపట్నంతో పాటు మానకొండూర్, కరీంనగర్ రూరల్ మండలాల్లో క్వారీల్లో అనుమతులకు మించి భారీ తవ్వకాలు జరిపినట్లు మైనింగ్ శాఖ తన నివేదికలో పేర్కొంది. నకిలీ రవాణా పత్రాలు సృష్టించడమే కాకుండా ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా వేలాది క్యూబిక్ మీటర్ల గ్రానైట్ కాంబినేషన్ కేంద్రాలకు, ఓడరేవుల ద్వారా విదేశాలకు తరలించినట్లు తేలింది.. పర్యావరణ నిబంధనలను తుంగలోకి తొక్కేసి.. ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల రూపాయల మేర గండి కొట్టినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది..
ఇప్పటికే కరీంనగర్ కు చెందిన టాప్ 5 గ్రానైట్ ఏజెన్సీల జాబితాను సిఐడి సిద్ధం చేసింది. గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఒక కీలక నేత ప్రధాన అనుచరులే.. ఈ అక్రమాల్లో సూత్రధారులని ప్రచారం జరుగుతోంది. మైనింగ్ అధికారుల అండదండలతోనే.. ఈ ఖజానా దోపిడీ సాగిందనే కోణంలో ఆ శాఖకు చెందిన కొందరు అధికారుల పాత్రలపై సిఐడి విచారణ జరపబోతోంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా కేసులు నమోదు కాబోతున్నాయి. దీంతో జిల్లాలోని గ్రానైట్ వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిఐడి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లాలోని ఎక్కువగా గ్రానైట్ వ్యాపారులంతా గత ప్రభుత్వానికి సంబంధించిన వారు కావడంతో.. తప్పకుండా వారిపై కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఇందులో మాజీ MLAలతో పాటు ఇతర బడానేతలే ఉండడం విశేషం.. అయితే, సిఐడికి సంబంధించిన దర్యాప్తు ఎంతవరకు పారదర్శకంగా జరుగుతుందనేది చూడాల్సిందే..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Telangana: పండించిన పాపానికి కన్నీరే మిగిలిందా? ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం!
Hyderabad, Telangana:Telangana Latest News: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల చుట్టూ సాగుతున్న రాజకీయ రగడ సామాన్య రైతుల పాలిట శాపంగా మారింది.. అన్నం పెట్టే అన్నదాతను ఆదుకోవాల్సింది పోయి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకోవడానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు.. ఈ రాజకీయ చదరంగంలో ధాన్యం అమ్ముకోలేక.. అమ్ముకున్న డబ్బులు రాక రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. కొన్నిచోట్లనైతే రైతులు వారాల తరబడి మిల్లర్ల కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు వర్షాలు కురుస్తుంటే.. మరోవైపు వడ్లు కొనుగోలు చేయలేకపోవడంతో రైతులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వస్తున్నారు..
అగమ్యగోచరంగా ఐకెపి కేంద్రాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఐకెపి కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలు తిప్పలుగా పేరుకు పోతున్నాయి.. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి వారాల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.. సరిపడ గన్ని బ్యాగులు లేకపోవడంతో పాటు లారీల కోరత ఏర్పడడం, మిల్లుల తరలింపులో జాప్యం వంటి కారణాలతో కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఈలోగా అకాల వర్షాలు కురుస్తుండడంతో.. ఎంతో శ్రమించి పండించిన పంట కళ్ళముందే తడిసి ముద్దవుతోంది.. ధాన్యం మొలకెత్తడంతో రైతులు కన్నీరు అవుతున్నారు..
ఈ సంక్షోభంపై అధికారిక కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బిజెపి మధ్య మాటల యుద్ధం ముదిరింది. రైతుల వద్ద ప్రతీ గింజ కొంటామని.. అయితే, తాము సేకరించిన ధాన్యాన్ని కేంద్రం వెంటనే ఎగుమతి చేసుకునేలా సహకరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది.. కేంద్రం కావాలనే రాష్ట్రంపై వివక్ష చూపుతోందని ఆరోపిస్తోంది.. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం పొరపాటుగా మారిందని.. బిజెపి మండిపడుతోంది.. మిల్లుల కేటాయింపులో.. రవాణాలు ప్రభుత్వం విఫలమైందని.. రైతులను నట్టేట ముంచి.. రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని విమర్శిస్తోంది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ఐకెపి కేంద్రాల్లోనే.. తూకం వేయడంలో జాప్యం జరుగుతుండడంతో అదనపు తరుగు పేరుతో మిల్లర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు.. క్వింటాల్కు ఐదు నుంచి పది కిలోల వరకు తరుగు తీస్తుండడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది.. మరోవైపు వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనేందుకు అధికారులు నిరాకరిస్తుండడంతో అన్నదాతకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది.. పంట పండించే వరకు ఒక యుద్ధం.. పండించిన పంటను అమ్ముకోవడానికి మరో యుద్ధం చేయాల్సి వస్తోంది.. సర్కారుల గొడవలు రైతుల బతుకులు చిత్రమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Venus Transit 2026: శుక్రుడి అద్భుత సంచారం.. జూన్ 11 వరకు ఈ 6 రాశుల వారికి కనకవర్షం.. మీ రాశి ఉందా?
Hyderabad, Telangana:Venus Transit in Punarvasu Nakshatra Effect On Zodiac: జేష్ఠ పౌర్ణమి రోజు శుక్రుడు పునర్వాసు నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఆరు రాశుల వారికి 12 రోజుల పాటు అదృష్టం ఊహించని స్థాయిలో పెరిగింది. మే 31వ తేదీన జ్యేష్ఠ పౌర్ణమి రోజు శుక్రుడు పునర్వాసు నక్షత్రంలోకి సంచారం చేశాడు. ప్రస్తుతం శుక్రుడు మిథున రాశిలో సంచార దశలో ఉన్నాడు. అయితే, నక్షత్ర సంచారం కూడా చేయడం కారణంగా జూన్ 11వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. పునర్వాసము నక్షత్రానికి అధిపతి దేవగురువు గురుడు కాగా.. ఈ రాశికి అధిపతి బుధుడు.. దీని కారణంగా సుమారు 12 రోజుల పాటు మకర రాశి తో పాటు మరికొన్ని రాశుల వారికి శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి జీవితంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
ఈ రాశులకు బంపర్ జాక్పాట్..
మేషరాశి
శుక్ర గ్రహ సంచారం కారణంగా జూన్ 11వ తేదీ వరకు మేష రాశి వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలు సులభంగా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. ఇళ్లతో పాటు కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకునే వారి కోరికలు నెరవేరవచ్చు. ఉద్యోగంలో పురోగతి లభించడమే కాకుండా ఆదాయానికి కొత్త అవకాశాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా స్నేహితులతో పాటు ప్రియమైన వారితో కలిసి చేసే మతపరమైన యాత్రలు చాలా వరకు సక్సెస్ అవుతాయి పలుకుబడి ఉన్న వ్యక్తులతో సంభాషణలు కూడా ఏర్పడతాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ సమయంలో సామాజిక హోదా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వివాహాలు లేదా గృహప్రవేశాలు వంటి చాలాకాలంగా పెండింగ్లో ఉన్న శుభకార్యాలు కూడా త్వరగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు చేకూరడమే కాకుండా నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో శత్రువులు కూడా మిత్రులుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడి సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఒకరికొకరు ఎంతో ప్రేమగా పలకరించుకుంటారు. ముఖ్యంగా కుటుంబంలో ఒక్కరికైనా ప్రభుత్వ ఉద్యోగం లభించవచ్చు. ప్రేమ సంబంధాలలో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. పిల్లల చదువుతోపాటు వృత్తిలో విజయాలు సాధించే అవకాశాలున్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారు తప్పకుండా విజయాలు సాధిస్తారు.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అంచలంచెలుగా పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి జీవితంలో వివిధ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన శుభవార్తలు కూడా లభిస్తాయి.. నిలిచిపోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో అశాంతి తగ్గి బంధువులతో మంచి సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలు ఈ సమయంలో పరిష్కారం దిశగా ముందుకు సాగుతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి శుక్రుడు సంచారం ఆర్థికంగా అద్భుతమైన మెరుగుదలను సూచిస్తుంది. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు మెరుగుపడడమే కాకుండా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. అలాగే మీ పిల్లలకు సంబంధించిన అంశాల్లో కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటారు. చట్టపరమైన చిక్కులు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులు ఈ సమయంలో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ప్రత్యేకమైన తన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న పనులన్నీ ఎంతో సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక సమస్యల నుంచి ఆస్తి సంబంధిత చిక్కుల వరకు అన్ని పరిష్కారం అవుతాయి. ఆదాయ మార్గాల్లో ఉన్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ పనుల్లో సహ ఉద్యోగుల కంటే ముందుండే అవకాశాలు లభిస్తున్నాయి. వృత్తిపరమైన విజయాలు కూడా ఈ సమయంలో దక్కుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hamsa Mahapurusha Rajayoga: ఈ రోజు నుంచే ఈ 4 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.. లక్ష్మీ దేవి అనుగ్రహం!
Hyderabad, Telangana:Hamsa Mahapurusha Rajayoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు గ్రహాన్ని ఆనందంతో పాటు శ్రేయస్సు, జ్ఞానం, వివాహం అదృష్టానికి సూచికగా భావిస్తారు.. జూన్ నెల ప్రారంభంలో జ్యోతిష్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన శుభ సంఘటన జరగబోతోంది. జూన్ రెండవ తేదీన గురుగ్రహం తన ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురుగ్రహం ఉచ్చరాశిలోకి ప్రవేశించినప్పుడు ఎంతో శక్తివంతమైన ప్రభావం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మోస్ట్ పవర్ఫుల్ హంస మహా పురుష రాజయోగం ఏర్పడుతుంది. అయితే, అత్యంత శుభప్రదమైన యోగాల్లో హంస మహా పురుష రాజయోగం ఒకటి. దీనివల్ల కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా అకస్మాత్తుగా ఉరోగతి లభించడమే కాకుండా నిలిచిపోయిన ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి అవుతూ ఉంటాయి.. అలాగే భారీ ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ యోగ ప్రభావంతో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..
హంస మహా పురుష రాజయోగంతో ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మిథున రాశి
మిధున రాశి వారికి హంస మహా పురుష రాజయోగ ప్రభావంతో వ్యాపారాలతో పాటు కొత్త భాగస్వాములకు మంచి లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా పెద్ద వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించడమే.. కాకుండా ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తూ ఉంటాయి. దీంతోపాటు ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత బలోపేతం అవుతాయి. కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరే అవకాశాలు ఉండడం విశేషం..
కన్యా రాశి
కన్య రాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా పిల్లలనుంచి కొత్త శుభవార్తలు వింటారు. అలాగే అనుకున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా అదృష్టం సహకరించి బ్యాంకు బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే అనుకున్న పనుల్లో అద్భుతమైన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ శక్తివంతమైన హంస మహా పురుష రాజయోగ ప్రభావంతో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు అందరికీ దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. అలాగే జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వారికి జూన్ నెల ప్రారంభంలో కోరుకున్న కోరికలు కూడా నెరవేరవచ్చు. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మీన రాశి
గురు గ్రహ సంచారంతో మీన రాశి వారికి కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉండబోతోంది. భూములతో పాటు కొత్త ఇల్లు, వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా సంపాదించి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా పాత వివాదాల నుంచి పరిష్కారం లభించబోతోంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు జరిగి అద్భుతమైన ఆనందాన్ని పొందగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Janhvi Kapoor: తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం.. అమ్మ శ్రీదేవి ఇదే చెప్పేది: హీరోయిన్ జాన్వీ కపూర్
Vijayawada, Andhra Pradesh:Peddi Movie Pre Release Event: రామ్ చరణ్తో కలిసి పెద్ది సినిమాతో తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో కలిసేందుకు వస్తున్న నటి జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉందని.. ఈ ప్రేమే తాము రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలాన్ని ఇస్తుందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం అని తన తల్లి శ్రీదేవి చెప్పిన మాటలను జాన్వీ కపూర్ పునరుద్ఘాటించారు.
Also Read: Ram Charan: అభిమానుల కోసం రక్తం చిందించి పనిచేస్తా.. రామ్ చరణ్ భావోద్వేగం
విజయవాడలో సోమవారం జరిగిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సినీ నటుడు రామ్ చరణ్తో కలిసి పాల్గొన్న జాన్వీ కపూర్ కొన్ని విషయాలపై మాట్లాడారు. 'పెద్ది సినిమాలో ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే.. మీ ఐడెంటిటీని, మీ జీవితానికి ఉన్న అర్థాన్ని కనుక్కోవడం. తన ఐడెంటిటీ ఈ భూమితో, ఇక్కడి ప్రేక్షకులతో ఎంతో లోతుగా కనెక్ట్ అయి ఉంది' అని తెలిపారు. 'సినిమా విడుదల కాకముందే నాకు చాలా విషయాలను ఇచ్చింది. రామ్ చరణ్తో కలిసి పనిచేసే అద్భుతమైన అవకాశం లభించింది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అద్భుతమైన నటుడు' అని రామ్ చరణ్పై జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు.
'దర్శకుడు బుచ్చిబాబు నాకు తెలిసిన అత్యంత ప్యాషనేట్ డైరెక్టర్. డీఓపీ రాండీ, సంగీత లెజెండ్ ఏఆర్ రెహమాన్, ప్రొడ్యూసర్ సతీష్, ప్రవీణ్తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం' అని జాన్వీ కపూర్ తెలిపారు. 'తెలుగు ప్రేక్షకులు, సినిమా గురించి అమ్మ (శ్రీదేవి) ఎప్పుడూ ఒక మాట చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం అని అమ్మ ఎప్పుడూ చెప్పేవారు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రేమే నాకు సర్వస్వం' అని జాన్వీ పేర్కొన్నారు.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రసంగం అనంతరం యాంకర్ సుమ హీరోయిన్ జాన్వీని కొన్ని ప్రశ్నలు అడిగారు. దర్శకుడు బుచ్చిబాబును 'రౌడీ డైరెక్టర్' అని ఎందుకు అన్నారని ప్రశ్నించగా.. 'ఆయన (బుచ్చిబాబు) ప్రతి టేక్ అయిపోయాక అదిరిపోయింది అమ్మా.. అదిరిపోయింది. కానీ మళ్లీ ఒకసారి టేక్' అని జాన్వీ కపూర్ వివరించారు. ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చి వెంటనే ఇంకో టేక్ అడిగేవారని సరదాగా ఆయనను ఇమిటేట్ చేసి జాన్వీ చూపించారు. చిరంజీవి, శ్రీదేవి నటించిన ఐకానిక్ సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'లోని డైలాగ్ను జాన్వీ కపూర్ చెప్పారు. 'ఓ మానవా.. ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా' అని చెప్పడంతో ప్రేక్షకులు కేకలు వేశారు.
ఈ వేడుకకు హాజరైన నటుడు జగపతి బాబు ప్రసంగిస్తూ.. '1962లో విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న సరోజిని దేవి హాస్పిటల్లోనే నేను పుట్టా. గవర్నర్పేటలో ముంతకింద పప్పు తింటూ, సెలవులన్నీ ఇక్కడే గడిపా' అని గుర్తుచేసుకున్నారు. పెద్ది సినిమా పరిశ్రమకు.. డిస్ట్రిబ్యూటర్స్కు, ఎగ్జిబిటర్స్కు ఒక పెద్ద దిక్కు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అరవింద సమేత తర్వాత దాదాపు ఎనిమిదేళ్లకు తనకు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ దొరికిందని.. ఇందులో తాను 'అప్పలసూరి' పాత్ర చేస్తున్నా. ఇది నా కెరీర్లోనే ఉత్తమ పాత్ర అవుతుంది' అని తెలిపారు. 'రామ్ చరణ్ ఈ సినిమాలో తన మెగా పవర్ ఏమిటో చూపిస్తాడు. సినిమాలో ప్రతి షాట్ సిక్సర్లా ఉంటుంది.
Also Read: IPL Final Highlights: గుజరాత్ టైటాన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 చాంపియన్ బెంగళూరు
Ram Charan: అభిమానుల కోసం రక్తం చిందించి పనిచేస్తా.. రామ్ చరణ్ భావోద్వేగం
Vijayawada, Andhra Pradesh:Peddi Movie Release Event: 'ఒక నటుడిగా ఎన్నో కథలు వింటూ ఉంటాం.. కొన్ని నచ్చుతాయి.. కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ 'పెద్ది' కథ విన్నప్పుడు మాత్రం అది గుండెకు హత్తుకుంది' అని సినీ నటుడు రామ్ చరణ్ తెలిపారు. 'మా నాన్న (చిరంజీవి) చెప్పినట్టు ఇలాంటి కథ పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. అలాంటి కథ నా వద్దకు వచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబు గురువు సుకుమార్, బుచ్చిబాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది నా జీవితకాల సినిమా లైబ్రరీలో టాప్ ఫిలిమ్స్లో ఒకటిగా నిలిచిపోతుంది' అని రామ్ చరణ్ తెలిపారు.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుండగా.. ప్రీ రిలీజ్ వేడుక విజయవాడలో జరిగింది. ఈ సభలో అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ కీలక ప్రసంగం చేశారు. 'విజయవాడలో వాతావరణం చూస్తుంటే ఇది ప్రీ-రిలీజ్ ఫంక్షన్లా లేదు.. అప్పుడే సక్సెస్ మీట్ చేస్తున్నట్లుగా ఉంది. విజయవాడ అనేది మా కుటుంబానికి ఎంతో లక్కీ సిటీ. గతంలో 'ఇంద్ర', 'ఖైదీ నెంబర్ 150' వేడుకలు కూడా ఇక్కడే జరిగాయి. ఆ లక్ కోసమే మళ్లీ ఇక్కడికి వచ్చాం' అని రామ్ చరణ్ గుర్తుచేశారు.
'ఇది ఒక సినిమా స్టోరీ కాదు, కింద పడిపోయిన ఒక మనిషి మళ్లీ లేచి ఎలా నిలబడ్డాడనే ఒక వ్యక్తి అద్భుతమైన ప్రయాణం. గతంలో నాకు'మగధీర', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు చేస్తున్నప్పుడు ఎలాంటి అద్భుతమైన ఫీలింగ్, అనుభవం కలిగిందో.. మళ్లీ అంతటి భావం ఈ పెద్ది సినిమా చేస్తున్నప్పుడు కలిగింది' అని రామ్ చరణ్ తెలిపారు. బుచ్చిబాబు ఈ కథను రాసుకున్న విధానం చూసి ఆశ్చర్యపోయానని.. భవిష్యత్లో ఇండియాలోనే టాప్ 3 లేదా 4 డైరెక్టర్ల జాబితాలో బుచ్చిబాబు పేరు కచ్చితంగా ఉంటుందని జోష్యం చెప్పారు.
Also Read: IPL Final Highlights: గుజరాత్ టైటాన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 చాంపియన్ బెంగళూరు
తాను అభిమానుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని రామ్ చరణ్ ప్రకటించారు. తాను ఇటువంటి సినిమాలు ఒప్పుకోవడానికి కారణం అభిమానులే.. వారి ఇచ్చే ఉత్సాహం.. ప్రోత్సాహంతోనే సినిమాలు చేస్తున్నట్లు చెప్పారు. అభిమానుల కోసం చేతులు ఇరగ్గొట్టుకోవడమే కాదు రక్తం చిందించి అయినా పని చేస్తానని భావోద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి కొడుకుగా పుట్టి, పవన్ కల్యాణ్ నీడలో పెరిగిన తనకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదని తెలిపారు. తాను చనిపోయే వరకు ప్రేక్షకులను అలరిస్తూ.. వారికి వినోదం అందిస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. 'ఈ చిత్రానికి కెమెరామెన్గా పనిచేసిన రత్నవేలుతో నాకు నాలుగో సినిమా. జాన్వీ కపూర్ శ్రీదేవి కంటే గొప్ప నటి కావాలి' అని రామ్ చరణ్ ఆకాంక్షించారు. జూన్ 4వ తేదీన అందరూ థియేటర్లో తప్పకుండా చూడాలని రామ్ చరణ్ కోరారు.
Zee Media: ఫిఫా ప్రపంచకప్ -2026 ప్రసార హక్కులు దక్కించుకున్న 'జీ' మీడియా
Barcelona, Catalunya:Zee Media Enterprises: అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా సంబరం ఫుట్బాల్ ప్రపంచకప్ ఈనెలలో జరగనుంది. ఫిఫా ప్రపంచ కప్ 2026కు మూడు దేశాలు ఆతిథ్యం ఇస్తుండగా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు జీ మీడియాలో ప్రసారం కానున్నాయి. ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్ల ప్రసారానికి సంబంధించిన హక్కులు జీ మీడియా దక్కించుకుంది. జీ మీడియా ఎంటర్ప్రైజెస్ ఫీఫా ప్రపంచ కప్ 2026 హక్కులను జీ మీడియా దక్కించుకోగా.. ఈనెల నుంచి ప్రసారం కానున్నాయి. ప్రపంచ కప్ మ్యాచ్లు జూన్ 11వ తేదీన అమెరికా, మెక్సికో, కెనడాలో జరగనున్నాయి.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
జీ మీడియా ఎంటర్ప్రైజెస్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ప్రసార హక్కులను పొందింది. ఈ టోర్నమెంట్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కొత్త స్పోర్ట్స్ ఛానల్ 'యునైట్8 స్పోర్ట్స్'లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ ప్రపంచ కప్ మ్యాచ్లు 'జీ5' ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ప్రత్యక్షంగా ప్రసారం కానుండడం విశేషం. ఐపీఎల్ సంబరం ముగిసిన అనంతరం జరుగుతున్న ప్రపంచ క్రీడా సంబరం ఫుట్బాల్ ప్రపంచకప్కు సమయం ముంచుకొస్తోంది.
ప్రపంచ కప్ మ్యాచ్లు జూన్ 11వ తేదీన అమెరికా, మెక్సికో, కెనడాలలో జరగనున్నాయి. ప్రపంచ కప్ ఫుట్బాల్కు అత్యున్నత పాలకమండలి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్, ఫీఫాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. జీ మీడియా ఇప్పుడు 2034 వరకు ప్రధాన ఫీఫా టోర్నమెంట్లు, సంబంధిత డాక్యుమెంటరీల ప్రసార హక్కులను పొందాయి. వీటిలో 2026 ఫిఫా ప్రపంచకప్ మాత్రమే కాకుండా 2026, 2030 పురుషుల ప్రపంచ కప్లు, 2027 మహిళల ప్రపంచ కప్ కూడా ఉండడం విశేషం. దీనికి అదనంగా అండర్-17, అండర్-20 పురుషుల, మహిళల ప్రపంచ కప్లు, ఫుట్బాల్ ప్రపంచ కప్లు, ఇంటర్కాంటినెంటల్ కప్లు కూడా జీ మీడియాలో అందుబాటులో ఉంటాయి.
Also Read: IPL Final Highlights: గుజరాత్ టైటాన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 చాంపియన్ బెంగళూరు
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఉత్తర అమెరికాలో జరగబోయే వేసవి ఫుట్బాల్ ఈవెంట్తో ప్రారంభించి 2026 నుంచి 2034 వరకు ఎనిమిదేళ్ల కాలానికి మొత్తం 39 ప్రపంచ ఫుట్బాల్ మ్యాచ్ల ప్రత్యేక మీడియా హక్కులను పొందింది. ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకదాన్ని భారతీయ ప్రేక్షకులకు అందించడానికి తాము సంతోషిస్తున్నామని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సీఈఓ పునీత్ గోయెంకా తెలిపారు. జీ కొత్త స్పోర్ట్స్ ఛానల్ యునైట్8 స్పోర్ట్స్ నాలుగు చానల్స్ ఏర్పాటు కాగా (Unite8 Sports 1), (Unite8 Sports 1 HD), (Unite8 Sports 2), (Unite8 Sports 2 HD) ఆ చానల్స్లో ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతాయి.
జీ మీడియా ప్రత్యక్ష ప్రసారాలు ఇవే..!
2027 మహిళల ప్రపంచ కప్
2030 పురుషుల ప్రపంచ కప్లు
2034 వరకు ప్రధాన ఫీఫా టోర్నమెంట్లు
అండర్-17, అండర్-20 పురుషుల, మహిళల ప్రపంచ కప్లు, ఇంటర్కాంటినెంటల్ కప్లు
‘Z’ partners with FIFA to bring 39 global football events including FIFA World Cup 2026™, FIFA World Cup 2030™ & FIFA Women’s World Cup™ 2027 for Indian fans!
Click here to read more: https://t.co/ikr5nUF1Ck#FIFAWorldCup #WorldCup2026 #FIFAonZ pic.twitter.com/jQodlVJh7T
— ZEE (@ZEECorporate) June 1, 2026
Telangana Janasena Sabha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తెలంగాణ ప్రభుత్వం ఝలక్..భారీ బహిరంగ సభకు అనుమతి నిరాకరణ!
Hyderabad, Telangana:Janasena Sabha In Telangana: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించేందుకు తలపెట్టిన భారీ బహిరంగ సభకు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ వేసింది. రేపు గచ్చిబౌలి వేదికగా జరగాల్సిన 'తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ'కు అనుమతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో జనసేన పార్టీ తదుపరి కార్యచరణ ఏమిటంటూ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలను పోలీసులు, అధికార యంత్రాంగం పేర్కొంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారిక ఉత్సవాలు జరుగుతుండటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సభకు అనుమతి నిరాకరించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
హైకోర్టుకు జనసేన?
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యాయి. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరించడంతో జనసేన ముఖ్య నేతలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రేపు ఉదయమే హైకోర్టును ఆశ్రయించాలని జనసేన లీగల్ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ సభపై రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది. ఈ సభను వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రులు, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ తెలంగాణ పర్యటన వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయంటూ అధికార పక్షం ఆరోపిస్తుండగా, సభను అడ్డుకోవడానికే ప్రభుత్వం కావాలని అనుమతి నిరాకరించిందని జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఇప్పుడు 'తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ' భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read: ఏపీలో కొత్త పెన్షన్ల పండగ షురూ..దరఖాస్తు అప్పుడే..ఈ పత్రాలు రెడీ చేసుకోండి!
Also Read: రెండు విడతల్లో జమిలి ఎన్నికలు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Pension Scheme 2026: ఏపీలో కొత్త పెన్షన్ల పండగ షురూ..దరఖాస్తు అప్పుడే..ఈ పత్రాలు రెడీ చేసుకోండి!
Vijayawada, Andhra Pradesh:AP Pension Scheme 2026 Update: ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు వీలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించబోతోంది. ఈ మేరకు అర్హతలు, సమర్పించాల్సిన పత్రాల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. సచివాలయంలో దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, అర్హులకు పెన్షన్లను ఖరారు చేస్తారు.
పెన్షన్కి కావాల్సిన పత్రాలు..
ఈ విడతలో ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళా, వికలాంగుల పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అన్ని రకాల పెన్షన్లకు కావలసిన 5 రకాల ప్రాథమిక పత్రాలతో పాటు, ఆయా కేటగిరీలను బట్టి క్రింది అదనపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
వృద్ధాప్య పెన్షన్కు దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా 60 ఏళ్లు పైబడి వయసు ఉండాలి. అలాగే వితంతువు పెన్షన్ కోసం భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. వీరితో పాటు ఒంటరి మహిళల పెన్షన్ పొందే వారు తప్పనిసరిగా కోర్టు ద్వారా భర్త నుంచి విడాకులు పొందిన సర్టిఫికేట్ ఉండాల్సిందే. మరోవైపు వికలాంగుల పెన్షన్ దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్లు వైద్యుల జారీ చేసిన ఆధీకృత సదరం (SADAREM) సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
ఈ 5 పత్రాలు తప్పనిసరి!
ఏ పెన్షన్కు దరఖాస్తు చేయాలన్నా అభ్యర్థులు క్రింది 5 రకాల డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. ఆధార్ కార్డు, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. అర్హత కలిగిన వారు ఈ నెల 12వ తేదీన అవసరమైన అన్ని పత్రాలతో మీ సమీప సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: రెండు విడతల్లో జమిలి ఎన్నికలు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడంటే?
Also Read: Monsoon Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం..2-3 రోజుల్లో వానలే వానలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Monsoon Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం..2-3 రోజుల్లో వానలే వానలు..
Hyderabad, Telangana:Monsoon Rain Alert Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారిపోతుంది. నిన్న, మొన్నటి వరకు తీవ్రమైన ఎండలు, వడగాలులతో సతమతమవ్వగా.. ఇప్పుడు వడగళ్లు, అకాల వర్షాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ తీపికబురు అందించింది. రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళం రాష్ట్రాన్ని తాకబోతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వానలు పడే అవకాశం కనిపిస్తోంది.
అటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలంగాణలో రాబోయే మూడు రోజుల వాతావరణ మార్పులకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ గారు కీలక అప్డేట్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇవి అరబిక్ మహాసముద్రం, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి.
ఛత్తీస్గఢ్ను ఆనుకుని తూర్పు విదర్భపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు గుండా దక్షిణ కేరళ వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది.
రాబోయే 3 రోజుల్లో వాతావరణం..
నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయిలోనే (స్థిరంగా) కొనసాగుతాయి. అయితే, రేపటి నుండి తదుపరి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఉక్కపోత, ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.
Also REad: 'తల్లికి వందనం' డబ్బు అకౌంట్లో జమ కావాలంటే..ఈసారి అధికారులు ఇవి చెక్ చేస్తారు!
Also Read: రాత పరీక్ష లేకుండానే నెలకు రూ.1,80,000 జీతం..కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని రోజులే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijay Thalapathy BJP: రాజకీయాల్లోకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాజీ భార్య..బీజేపీలో చేరనున్న సంగీత!
Nagalapuram, Tamil Nadu:Thalapathy Vijay Wife Joined BJP: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు తన ఇంటి నుంచే రాజకీయ ప్రత్యర్థి రాబోతున్నారనే వార్తలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన మాజీ భార్య సంగీత స్వర్ణలింగం త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని సమాచారం అందుతోంది. అదే జరిగితే సీఎం విజయ్కు రాజకీయంగా పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తమిళ నటుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కు గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయన మాజీ భార్య సంగీత త్వరలోనే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. సీఎం విజయ్ మాజీ భార్య సంగీత త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన ఆహ్వానం బీజేపీ నుంచి సంగీతకు అందిందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై సంగీత నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఈ ఊహాగానాలు ఇప్పుడు తమిళనాట మరో కొత్త చర్చకు దారితీశాయి.
మరోసారి వార్తల్లో సంగీత!
గత కొన్నేళ్లుగా విజయ్, సంగీత మధ్య విభేదాలు ఉన్నాయన్న పుకార్లు తరచుగా మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో వారిద్దరూ విడిపోయారన్న వార్తలతో పాటు కుటుంబ సమస్యలకు సంబంధించిన కథనాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. విజయ్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బహిరంగ కార్యక్రమాలకు మాజీ భార్య సంగీతతో పాటు వారి పిల్లలు హాజరుకాకపోవడం కూడా, వారి బంధంపై జరుగుతున్న చర్చలకు మరింత ఆజ్యం పోసింది.
ఇది బీజేపీ వ్యూహమా?
'గ్రేట్ ఆంధ్ర' నివేదిక ప్రకారం.. సంగీతను తమ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలను బీజేపీ నాయకులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నాయకురాలిగా ఉన్న ఒక ప్రముఖ నటి, తెర వెనుక ఉండి సంగీతను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆ నివేదిక పేర్కొంది. విజయ్కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఏదైనా ప్రత్యర్థి రాజకీయ పార్టీలో చేరితే.. అది సహజంగానే తమిళనాడు రాజకీయాల్లో ఒక బలమైన చర్చకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంగీత స్వర్ణలింగం ఎవరు?
సీఎం విజయ్ మాజీ భార్య సంగీత స్వర్ణలింగం..శ్రీలంకకు చెందిన ఓ వ్యాపార కుటుంబానికి చెందినది. ఆ తర్వాత వారి కుటుంబం లండన్లో స్థిరపడింది. ఆమె మొదట ఒక అభిమానిగా విజయ్ను కలిశారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఈ జంట 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి జేసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రస్తుతానికి సంగీత బీజేపీలో చేరడం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఊహాగానాలను కొందరు రాజకీయ పరిశీలకులు, విజయ్ రాజకీయ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఆయనపై ఒత్తిడి పెంచే ప్రయత్నంగానే చూస్తున్నారని సమాచారం.
Also Read: "నా బిడ్డ చావుకు సీఎం విజయ్ కారణం" తమిళ స్టార్ నటి సంచలన ఆరోపణలు..ఏం జరిగింది?
Also Read: రాత పరీక్ష లేకుండానే నెలకు రూ.1,80,000 జీతం..కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని రోజులే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chandrababu: రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తూ సుపరిపాలన యజ్ఞం చేస్తున్నాం: చంద్రబాబు
Nuzendla, Andhra Pradesh:Chandrababu Speech: 'రాష్ట్రాన్ని బాగు చేసేందుకు రాత్రింబవళ్లు మేం (ఎన్డీయే కూటమి) పని చేస్తున్నాం. గత పాలకులు మాత్రం విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. సుపరిపాలనను వెనక్కు లాగేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు కుతంత్రాలు పన్నుతోంది. అందుకే ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటున్నాం' అని వైఎస్సార్సీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. 'బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని హత్యచేసి గుండెపోటు అన్నారు. పోస్టుమార్టం తర్వాత తెలిసింది గొడ్డలితో నరికి చంపారని. మానాన్న చనిపోయారు ఇప్పుడు చిన్నాన్న కూడా చంపేశారని ఎక్కడికక్కడ డ్రామాలు ఆడారు. ఒక్కఛాన్స్ అన్నారు మోసం చేశారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు కూడా ఆడారు' అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు.
కాకినాడ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ చేస్తోన్న కుట్రలు, కుతంత్రాలపై తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ఐదు సంఘటనలను ప్రజలకు వివరించి వైఎస్సార్సీపీ కుట్రలను సీఎం చంద్రబాబు ఎండగట్టారు. 'ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కూడా ప్రజలు తెలుసుకోవాలి. సుపరిపాలన వైకుంఠపాళీ కాకూడదన్నదే మా విజ్ఞప్తి. గత పాలకులు ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక 241 కేసులు వేసినా వాటిని పరిష్కరించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. గత పాలకులు జాబ్ క్యాలెండర్ అని దానిని ఎగ్గొట్టారు. మళ్లీ మా ప్రభుత్వం వచ్చాకే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం' అని సీఎం చంద్రబాబు వివరించారు.
ఉద్యోగాల భర్తీ
'అత్యంత పటిష్టంగా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాం. కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టాం. 40 వేల ప్రశ్నలు, 25 రకాల ప్రశ్నా పత్రాలు ఎక్కడా అక్రమాలు కాకుండా చూశాం. కానీ ఫ్రస్టేషన్లో ఉన్న వైఎస్సార్సీపీ వివాదం చేసి రాజకీయ లబ్ది పొందాలని ఆలోచన చేస్తోంది. దీనిని వివాదం చేసి సమాజంలో అశాంతిని రేపేందుకు ప్రయత్నాలు చేసింది. జాగ్రత్తగా ఉండబట్టే దీనికి గట్టిగా సమాధానం ఇవ్వగలిగాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
మాది గొడ్డలి పార్టీనే, కత్తులు, కటార్లు తెస్తామని అంటున్నారు. ఇక్కడ ఉన్నది CBN. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క మోడీ గారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని గొడ్డలి పార్టీని హెచ్చరిస్తున్నా..
రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తూనే సుపరిపాలన యజ్ఞాన్ని కొనసాగిస్తున్నాం.… pic.twitter.com/hobkseTI1c
— Telugu Desam Party (@JaiTDP) June 1, 2026
'ప్రతిపక్షంలో పరామర్శలకు వెళ్తూ సొంత కార్యకర్త సింగయ్యను కారు కింద తొక్కి చంపేసి పొదల్లోకి విసిరేసి పోయారు. కడపకు చెందిన ఓ పాస్టర్ను పంపి హత్యాయత్నం డ్రామాలు ఆడారు. దానిని మాపై నెట్టేందుకు ప్రయత్నించారు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదంలో చనిపోతే దానిని కూడా మాపై నెట్టడానికి ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. సీసీ కెమెరాల సాయంతో ఈ కుట్రను బట్టబయలు చేశామని చెప్పారు.
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
'పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర సాక్షి మీడియా మద్యం బాటిళ్లు తీసుకెళ్లి వేసి అపవిత్రం చేసేందుకు ప్రయత్నం చేశారు. భగవంతుడిని అప్రతిష్ట పాల్జేసేందుకు ప్రయత్నం చేసిన వారిని ఏమనాలి. వారిది వేరే మతం కావొచ్చు దానికి మేం తప్పు పట్టడం లేదు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. కానీ కుట్రలతో హిందూ దేవాలయాలపై దాడులు అపవిత్రం చేయటం సరికాదని హెచ్చరించారు. 'ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి వారిని పట్టుకుని ప్రజల ముందు నిలబెడతాం. కడపలో పెద్ద దస్తగిరిని వైఎస్సార్సీపీ వారే ఆస్తుల వివాదంలో హత్యచేసి టీడీపీ వారిపై నెట్టేందుకు ప్రయత్నం చేశారు
నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే. అయినా మేం 20 నిముషాల్లో నిందితుడిని పట్టుకున్నాం' అని సీఎం చంద్రబాబు వివరించారు. రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తూనే సుపరిపాలన యజ్ఞం చేస్తున్నామని ప్రకటించారు.
'కాకినాడలోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దళితుడైన డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశారు. కానీ ఆ ఎమ్మెల్సీకి సన్మానాలు చేసింది. ఇంత కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతున్న వారి ఆటలు సాగనీయం' అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయ పార్టీగా ఈ తంతును సరిచేసుకోవాల్సింది పోయి ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. 'రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యం. హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయకుండా వెనక తిప్పుకుంటున్నారు' అని సీఎం చంద్రబాబు వివరించారు.
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు..రూ.820 తగ్గిన బంగారం ధర..మార్కెట్లో ఎలా ఉన్నాయంటే?
Hyderabad, Telangana:Gold Rate Today News: పశ్చిమాసియా ఇంకా యుద్ధ మేఘాలు వీడని వేళ నిన్న మొన్నటి వరకు బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. తాజాగా జూన్ 1వ తేదీన బంగారం ధర తగ్గింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిపై సుంకాన్ని పెంచినా.. బంగారం, వెండి కొనుగోలు తగ్గకపోవడం గమనార్హం. అయితే నేడు భారత్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Baddipadaga, Telangana:Govt Employees Transfers: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. ఉద్యోగులకు సంబంధించి మరో షాకింగ్ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఉద్యోగులు మరో బదిలీలపై కీలక నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 1, 2026 నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు బదిలీలకు ఇచ్చిన వెసులుబాటు ముగియడంతో జూన్ 1, 2026 నుంచి బదిలీలపై తిరిగి నిషేధం అమలులోకి వచ్చింది. జూన్ 1 నుంచి రాబోయే ఆరు నెలల వరకు బదిలీల విషయంలో ఎటువంటి మినహాయింపు ప్రతిపాదనలను అంగీకరించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఆరు నెలల తర్వాత బదిలీల నిషేధాన్ని సడలించాల్సి వస్తే.. తప్పనిసరిగా ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత మంత్రుల ద్వారా సీఎం ఆమోదం పొందాల్సి ఉంటుంది.
మినహాయింపులు
బదిలీలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. నిషేధం అమలులో ఉన్న సమయంలో కొన్ని సందర్భాల్లో బదిలీలు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బదిలీలకు లేదా పోస్టింగ్లకు అనుమతి ఇచ్చింది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చిన సమయంలో ఖాళీగా ఉన్న స్థానాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వవచ్చు. దీనికోసం పని చేస్తున్న ఇతర ఉద్యోగులను మార్చకూడదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
క్రమశిక్షణా చర్యలు
బదిలీలపై విధించిన నిషేధపు ఆజ్ఞల్లో పోస్టుల రద్దు, రివర్షన్లు, డెప్యుటేషన్లు (ఫారిన్ సర్వీస్ మాత్రమే), క్రమశిక్షణా చర్యల కారణంగా జరిగే పోస్టింగ్లను ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయవచ్చు. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం సెలవులో ఉండి తిరిగి వచ్చే వారికి ఖాళీగా ఉన్న చోట పోస్టింగ్ ఇవ్వవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అత్యవసర పాలనా అవసరాల దృష్ట్యా బదిలీలు చేయాల్సి వస్తే, ప్రస్తుత స్థానంలో కనీసం ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేసిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
బదిలీలపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా బదిలీలు చేస్తే వారి జీతాల బిల్లులను నిలిపివేయాలని ఆర్థిక శాఖ అధికారులు, పే అండ్ అకౌంట్స్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది
