icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

రైలు సీట్లలో మేకలు, ప్లాట్‌ఫామ్‌పై గేదెలు.. వీడియో చూస్తే నవ్వుకుంటారు!

Hyderabad, Telangana:

 Bihar Railway Viral Video: భారత రైళ్లలో నిత్యం అనేక ఆసక్తికరమైన సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. అయితే, తాజాగా బీహార్‌లోని ఛాప్రా రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఒక ఉదంతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై గేదెలు స్వేచ్ఛగా తిరగడంతో పాటు మరోవైపు రైలు బోగీలోని సీట్లలో మేకలు అత్యంత రాజసంగా కూర్చోవడం ప్రయాణికులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజా వైరల్ అవుతున్న వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అసలేం జరిగింది?
ఛాప్రా జంక్షన్ పరిసరాల్లో తీసిన ఈ వీడియోలో.. ప్లాట్‌ఫామ్ పైభాగంలో ప్రయాణికులు నడిచే మార్గంలో పెద్ద సంఖ్యలో గేదెలు హల్‌చల్ చేస్తూ కనిపించాయి. రైలు కోసం ఎదురుచూసే బెంచీల సమీపంలో పశువులు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా చాలా మంది ఈ వింతను చూసి మొబైల్స్‌లో వీడియోలు కూడా రికార్డ్‌ చేశారు.

 
 
 
 
 

ఇక అసలు సిసలైన దృశ్యం రైలు బోగీ లోపల కనిపిస్తుంది.. ఒక ప్యాసింజర్ రైలులో ప్రయాణికుల కోసం కేటాయించిన సీట్లపై మనుషులకు బదులుగా మేకలు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాయి. సాధారణంగా ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడే రైలు బోగీల్లోకి ఈ మేకలు ఎలా వచ్చాయనేది అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.. తోటి ప్రయాణికులు కూడా వాటిని తోలే ప్రయత్నం చేయకుండా వింతగా చూస్తూ ఉండిపోయారు. కొందరు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఇది రైల్వే స్టేషన్ లా లేదు.. పశువుల సంతలా ఉంది!.. అని ఒకరు కామెంట్ చేయగా.. వీటికి కూడా కన్ఫర్మ్డ్ టికెట్లు లభించాయేమో.. అందుకే సీట్లలో అంత ప్రశాంతంగా కూర్చున్నాయని మరొకరు సెటైర్ వేశారు. భారతీయ రైల్వేల్లో అందరికీ సమ ప్రాధాన్యం ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం అంటూ.. మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ఈ ఘటన నవ్వు తెప్పించేలా ఉన్నప్పటికీ.. రైల్వే స్టేషన్లలో భద్రతతో పాటు పరిశుభ్రత తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం ఉండే రైల్వే భద్రతా బలగాలు (RPF) కన్నుగప్పి పశువులు ప్లాట్‌ఫామ్‌లు, రైలు బోగీల వరకు ఎలా రాగలిగాయనేది ప్రశ్నార్థకంగా మారింది. పశువుల వల్ల ప్రయాణికులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందనే ఆందోళన ఇక్కడ వ్యక్తమవుతోంది. రైల్వే పరిపాలన విభాగాలు తక్షణమే స్పందించి స్టేషన్లలో పశువుల సంచారాన్ని అరికట్టాలని.. ప్రయాణికులకు తగిన సదుపాయాలు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

Independence Day 2026: భారతదేశంలో ఈసారి నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవం 79వదా లేదా 80నా? చరిత్ర ఏం చెబుతుందంటే?

New Delhi, Delhi:

80th Independence Day 2026: 1947లో దేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన చారిత్రాత్మక రోజుకు గుర్తుగా, భారతదేశం 2026 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవించడానికి, ఒక స్వతంత్ర దేశంగా భారతదేశం సాధించిన ప్రయాణాన్ని వేడుకగా మార్చుకోవడానికి ఈ పవిత్ర దినాన్ని ప్రతి ఏటా జరుపుకొంటారు.

దేశవ్యాప్తంగా జరిగే ఈ వేడుకలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, భారతదేశ చరిత్ర, ఐక్యతను చాటిచెప్పే వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈ ముఖ్యమైన రోజున ప్రధానమంత్రి సాంప్రదాయకంగా న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.

2026 స్వాతంత్ర్య దినోత్సవం: 79వదా లేక 80వదా?
భారతదేశం మరో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో, ఒక ప్రశ్న చాలా మందిలో చర్చకు దారితీసింది. ఆగస్టు 15, 2026 భారతదేశపు 79వ స్వాతంత్ర్య దినోత్సవమా లేక 80వదా అనేది అందరిలో తొలుస్తున్న ప్రశ్న? ప్రజలు లెక్కించడానికి రెండు వేర్వేరు పద్ధతులను ఉపయోగించడం వల్ల ఈ చిన్నపాటి గందరగోళం తలెత్తుతోంది.

సంవత్సరాల లెక్కింపు: 2026 నుండి 1947ని తీసివేస్తే (2026 - 1947 = 79). దీని అర్థం ఆగస్టు 15, 2026 నాటికి భారతదేశం పూర్తి చేసుకున్న స్వాతంత్ర్య సంవత్సరాలు 79.

వేడుకల లెక్కింపు: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సంఖ్యను లెక్కించేటప్పుడు, ఆగస్టు 15, 1947న జరిగిన మొదటి వేడుకను కూడా కలుపుకోవాలి (2026 - 1947 + 1 = 80). 2026 ఆగస్టు 15 నాటికి భారతదేశం 79 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుని, 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది.

భారత స్వాతంత్ర్య ఉద్యమ చారిత్రక ఘట్టాలు
భారత స్వాతంత్ర్య దినోత్సవం దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ వలస పాలన ముగింపును సూచిస్తుంది. స్వయం పాలనను కోరుకున్న నాయకులు, విప్లవకారులు, సామాన్య పౌరుల నిరంతర కృషి ఫలితంగా దశాబ్దాల తరబడి ఈ స్వాతంత్ర్య పోరాటం సాగింది.

1857 తిరుగుబాటు: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన తొలి ప్రధాన తిరుగుబాటు.

1920: మహాత్మా గాంధీ నేతృత్వంలో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమం.

1930: ఉప్పు సత్యాగ్రహంతో ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం.

1942: బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లాలని డిమాండ్ చేస్తూ ప్రారంభించిన 'క్విట్ ఇండియా' ఉద్యమం.

1947 ఆగస్టు 15: భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత, మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన ప్రసిద్ధ "ట్రైస్ట్ విత్ డెస్టినీ" (భాగ్యంతో ఒప్పందం) ప్రసంగాన్ని చేశారు.

పాఠశాలలు, కార్యాలయాలలో వేడుకల ఆలోచనలు
పాఠశాలల్లో జెండా ఎగురవేత, దేశభక్తి గీతాలు, నృత్యాలు, వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

అలాగే కార్యాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, స్ఫూర్తిదాయక భారతీయుల ప్రయాణాలను గుర్తుచేసుకోవడం, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం వంటి చేయాలి..

చివరగా ఇళ్లలో దేశభక్తి చిత్రాలు లేదా డాక్యుమెంటరీలు చూడటం, పిల్లలకు స్వాతంత్ర్య పోరాట చరిత్రను వివరించడం వల్ల రాబోయే తరాలకు మన స్వాతంత్ర్యం విలువను తెలియజెప్పినట్లు ఉంటుంది.

స్వాతంత్ర్య దినోత్సవం కేవలం ఒక జాతీయ వేడుక మాత్రమే కాదు. ఇది మనకు స్వేచ్ఛ, ఐక్యత, బాధ్యతల విలువలను గుర్తుచేస్తుంది. 2026లో భారతదేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ఘనమైన మన గతాన్ని స్మరించుకుంటూ, మరింత బలమైన భవిష్యత్తు వైపు ముందడుగు వేద్దాం.

జై హింద్!

Also Read: నీట్ విద్యార్థులకు అలర్ట్..కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్

Also REad: ప్రధాని మోదీని బూతులు పట్టిన యువతి..ఇప్పుడు అమాయకంగా క్షమాపణలు చెబుతోంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

మహారాష్ట్రలో 79 శాతం పాలు కల్తీ.. రంగంలోకి దిగిన IAS అధికారి ముండే..

Hyderabad, Telangana:

Ias Tukaram Mundhe News: మహారాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన పాల శాంపిళ్లలో ఏకంగా 79 శాతం నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో విఫలమై.. కల్తీ అని తేలడంతో వీటిని వాడుతున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రజల ఆరోగ్యంతో సాగుతున్న ఈ ప్రాణాంతక వ్యాపారానికి చరమగీతం పాడేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి తుకారాం ముండే నేతృత్వంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అద్భుతమైన రీతిలో విరుచుకుపడింది. ప్రజలు తాగే ప్రతి గ్లాసు పాలు ఆరోగ్యానికి పుష్టిని ఇవ్వాలి కానీ రోగాలను కాదని చాటిచెబుతూ.. రాష్ట్రలో ఎక్కడ కల్తీ జరగకూడదని ఆయన శ్రీకారం చుట్టారు.

30 రోజుల రికార్డు..
ఐఏఎస్ తుకారాం ముండే నేతృత్వంలో ఎఫ్‌డీఏ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి కేవలం నెల రోజుల వ్యవధిలో నిర్వహించిన మెరుపు దాడులు కల్తీ రాయుళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. దాదాపు ఒక్కనెలలోనే 360 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన్నట్లు అధికారు వెళ్లడించారు. అంతేకాకుండా వివిధ కంపెనీలపై ఏకంగా 235 కేసులు నమోదు చేసిన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 350 మంది కల్తీ చేసి విక్రయిస్తున్నవారిని అరెస్ట్ చేసిన్నట్లు తెలిపారు. ప్రమాణాలు పాటించని 274 అక్రమ పాల కేంద్రాలు, డైరీల సీలింగ్‌లను సీజ్‌ చేసిన్నట్లు తెలుస్తోంది.

పెద్ద బ్రాండ్‌లకు సైతం మినహాయింపు ఇవ్వకుండా నిర్వహించిన ఈ దాడుల్లో, ముంబైలోని అత్యంత ప్రసిద్ధ కంపెనీలు కూడా నాణ్యతా లోపాలు, పరిశుభ్రతా పాటించలేని కారణాల వల్ల ఎఫ్‌డీఏ చర్యలను ఎదుర్కోవాల్సి రావడం గమనార్హంగా మారింది.. ఎంతటి వారైనా చట్టం ముందు సమానులేనని ఈ చర్య ద్వారా స్పష్టమైన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇలా కల్తీ చేయడంపై చాలా మంది స్పందిస్తున్నారు. పెద్ద కంపెనీలే ఇలా చేస్తే ఏ కంపెనీలకు సంబంధించిన పాలను విక్రయించాలని అని అంటున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

పదవి ఏదైనా, నియోజకవర్గం ఏదైనా ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేసే తుకారాం ముండే తన 21 ఏళ్ల ఐఏఎస్ కేరీర్‌లో ఇప్పటికే 25 సార్లు బదిలీ అయ్యారు. రాజకీయ ఒత్తిళ్లతో పాటు స్వార్థ ప్రయోజనాలు ఎంత ఎదురైనా ప్రజా ఆరోగ్యాన్ని ఏమాత్రం పణంగా పెట్టడానికి ఆయన సిద్ధపడలేదు.. నిజాయితీ, నిబద్ధతే ఆయుధంగా ముందుకు సాగుతున్న ఆయన శైలి పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

మీన్‌పూర్‌లో భారీ చిట్టీల మోసం.. రూ.2.5 కోట్లతో భార్యాభర్తలు జంప్!

Hyderabad, Telangana:

Sangareddy Chit Fund Scam News: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పక్కా ప్రణాళికతో స్థానికుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని.. చిట్టీల పేరుతో ఏకంగా రూ.2.5 కోట్లకు పైగా వసూలు చేసి.. ఓ భార్యాభర్తల జంట రాత్రికి రాత్రే జంప్ అయ్యారు. ఏళ్ల తరబడి కలిసి ఉన్నవారే ఇలా కష్టార్జితాన్ని పట్టుకుని పారిపోవడంతో బాధితులు రోడ్డున పడ్డారు..

పోలీసులతో పాటు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాంబశివరావు, శిరీష దంపతులు గత 20 సంవత్సరాలుగా అమీన్‌పూర్‌లోని బిఎస్ఆర్ కాలనీ (BSR Colony)లో నివాసముంటున్నారు. స్థానికులతో చాలా ఆప్యాయంగా ఉంటూ.. మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ నమ్మకంతోనే కాలనీవాసులు, చుట్టుపక్కల ప్రజలు తమ కష్టార్జితాన్ని ప్రతి నెలా వీరి వద్ద చిట్టీల రూపంలో జమ చేయడం ప్రారంభించారు.

గత కొన్నేళ్లుగా చిట్టీల వ్యవహారం సక్రమంగానే సాగడంతో, బాధితులు వీరిపై మరింత నమ్మకం పెంచుకున్నారు. అయితే, ఇటీవల అనేక మందికి చెందిన చిట్టీల గడువు అయిపోయింది. బాధితులు తమ డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరగా.. దంపతులు రకరకాల సాకులు చెబుతూ మాటలు మార్చేసే ప్రయత్నం చేశారు. దాదాపు 20 మందికి పైగా స్థానికులు వీరి దగ్గర చిట్టిలు వేయగా.. రూ.2.5 కోట్లకు పైగా జేబులు నింపుకుని పరార్‌ అయ్యారు.

రాత్రికి రాత్రే ఇల్లు అమ్మి పరార్..
బాధితుల అనుమానం నిజం చేస్తూ.. ఈ దంపతులు ఎవరికీ అనుమానం రాకుండా తమ సొంత ఇంటిని ముందే విక్రయించారు.. అనంతరం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని.. రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం బాధితులు వారి ఇంటికి వెళ్లి చూడగా ఇల్లు ఖాళీగా ఉండటంతో తాము తీవ్రంగా మోసపోయామని గ్రహించిన్నట్లు తెలుస్తోంది.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

తమ జీవితకాల సంపాదన అంతా ఆవిరి కావడంతో దాదాపు 20 మందికి పైగా బాధితులు అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని.. పరారీలో ఉన్న సాంబశివరావు, శిరీష దంపతుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని.. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report

వరి చేనులో దొరికిన భారీ మొసలిని.. భుజాన వేసుకుని పోలీస్ స్టేషన్‌కు నడిచిన రైతు! వీడియో..

Hyderabad, Telangana:

5-Foot Crocodile Video Viral: సాధారణంగా చిన్న పాము కనిపించినా.. సరే ఎంతో దూరం పరిగెడుతూ ఉంటాం.. ఇక ఐదు అడుగుల భారీ మొసలి ఎదురొస్తే ఎవరైనా ఏం చేస్తారు? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పరుగులు తీస్తారు.. కానీ, ఓ రైతు మాత్రం అందరికీ భిన్నంగా ఆలోచించాడు.. తన పంట పొలంలోకి వచ్చిన భారీ మొసలిని ఏమాత్రం భయం లేకుండా పట్టుకోవడమే కాకుండా.. దానిని ఏకంగా తన భుజాలపై వేసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లాడు. ఈ వింత దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ ఆసక్తికర ఘటన బిహార్‌లోని సుపౌల్ జిల్లాలో చోటుచేసుకుంది. అమిత్ కుమార్ అనే రైతు ఇతర కూలీలతో కలిసి తమ వరి చేనులో పనులు చేసుకుంటున్నారు. ఆ సమయంలో పంట పొలం మధ్యలో ఏదో కదులుతున్నట్లు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా సుమారు 5 అడుగుల పొడవున్న భారీ మొసలి కనిపించింది.. పంట పొలంలో అంత పెద్ద మొసలిని చూసి ఒక్కసారిగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 

అయితే, ఈ సమయంలో గ్రామస్తులు ఎవరూ తొందరపడలేదు.. మొసలికి ఎలాంటి హాని తలపెట్టకూడదని..అలాగే ఎవరికీ గాయాలు కాకుండా దానిని కంట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నారు. రైతు అమిత్ కుమార్ గ్రామస్తుల సహాయంతో చాలా జాగ్రత్తగా వ్యూహం రచించి మొసలిని బంధించారు.. అది ఎవరిపైనా దాడి చేయకుండా ముందుగా దాని నోటిని తాడుతో గట్టిగా కట్టేశారు.

మొసలిని పట్టుకున్న తర్వాత దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించాలని అనుకున్నారు. అయితే, ఆ సమయంలో గ్రామంలో ఎలాంటి వాహనం అందుబాటులో లేకపోవడంతో సమయం వృథా చేయడంగా అమిత్ కుమార్.. మొసలిని ఏకంగా తన భుజాన వేసుకుని నడక మొదలు పెట్టాడు.. 5 అడుగుల బరువైన మొసలిని భుజంపై మోస్తూ.. నేరుగా అటవీ శాఖ కార్యాలయానికి చేరుకున్నాడు. తీరా అక్కడికి వెళ్లేసరికి కార్యాలయం మూసివేసి ఉంది.

దీంతో అమిత్ కుమార్ ఆ మొసలితోనే దగ్గరలోని భీమ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు నడిచొచ్చాడు. భుజంపై మొసలితో పోలీస్ స్టేషన్‌లోకి అడుగుపెట్టిన రైతును చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అనంతరం పోలీసులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించగా.. వారు పోలీస్ స్టేషన్‌కు వచ్చి మొసలిని సురక్షితంగా వారి నుంచి తీసుకుని.. అడవిలో వదిలిపెట్టిన్నట్లు తెలుస్తోంది.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా..
భుజాన మొసలిని వేసుకుని రోడ్డుపై నడుస్తున్న అమిత్ కుమార్‌ను చూసి దారినపోయే వారంతా ఆశ్చర్యపోయారు. చాలామంది తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్తా గ్లోబల్ ట్రెండింగ్‌గా మారింది. రైతు చూపించిన గుండెధైర్యాన్ని, సకాలంలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరును నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

'ఈ ఏడాది సంతోషంగా రాలేదు.. క్రోధంతో వచ్చా..!' కుంభవృష్టి వర్షాలు: భవిష్యవాణిలో స్వర్ణలత

Hyderabad, Telangana:

Bhavishyavani Rangam 2026: ఆషాడమాస బోనాలు అంటే ఉజ్జయిని లష్కర్ బోనాలే. ఇందులో మొదటి రోజు ఆదివారం బోనాలు నిర్వహించిన మరుసటి రోజే రంగం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ రంగం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తుంటారు. అమ్మవారు ఏం పలుకుతారో తెలుసుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సికింద్రాబాద్ బోనాల మొదటి రోజు అంగరంగ వైభవంగా ముగిసిన తర్వాత, రెండో రోజు సోమవారం రంగం ద్వారా భవిష్యవాణి వినిపిస్తారు. అదే రోజున అంబారి ఊరేగింపు కూడా ఉంటుంది. ఈరోజు సికింద్రాబాద్ బోనాల రెండో రోజు సందర్భంగా, 2026కి సంబంధించిన రంగం భవిష్యవాణిని స్వర్ణలత వినిపించారు.

పచ్చి కుండపై నిలబడి ఆ ఏడాది ఎలా ఉండబోతుందో ఆమె భవిష్యవాణిని వినిపిస్తారు. ప్రభుత్వాలతో సహా కోట్లాది మంది భక్తులు అమ్మవారు ఏం పలుకుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రతిసారి రాష్ట్రంలోని వర్షాలు, జాతర లోటుపాట్లపై ఆమె వివరిస్తూ ఉంటారు. నిన్న ఆలయం బయట జరిగిన జోగిల ఆందోళనలు, భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఏడాది ఎలా ఉంటుందంటే?
ఈరోజు మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో ఈ ఏడాది కుంభవృష్టి కురుస్తుందని చెప్పారు. అలాగే అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున, ప్రాణనష్టం జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జనాలు వర్షాల ధాటికి కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. తాను సంతోషంగా కాకుండా క్రోధంతో వచ్చానని, విగ్రహ ప్రతిష్టను తాను చెప్పినట్లు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, లేదంటే ప్రాణనష్టం జరుగుతుందని ఆమె హెచ్చరించారు.   దీనిపై ఆలయ ప్రధాన పూజారి స్పందిస్తూ, ఆరు నెలల గడువు కాదని, ఏడాదిలోపు విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని హామీ ఇచ్చారు.

అంబారీ ఊరేగింపు..
భక్తుల విశ్వాసం మేరకు అమ్మవారి ఘట్టాన్ని అనంతరం ఏనుగు అంబారిపై ఊరేగిస్తారు. దీనితో లష్కర్ బోనాల ఉత్సవాలు ఘనంగా ముగుస్తాయి. ఈరోజు ఉదయం 8 గంటల వరకు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా రంగం భవిష్యవాణి నిర్వహించి అనంతరం ఉదయం 10:30 గంటల నుంచి అంబారీ ఊరేగింపు నిర్వహిస్తున్నారు.

Also Read: Secunderabad Bonalu: సికింద్రాబాద్‌ బోనాల్లో అపచారం.. రోడ్డుపై పడిపోయిన బోనాలు

Also Read: లష్కర్ బోనాలు ధూంధాం.. అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తిన సజ్జనర్, మల్లారెడ్డి ఫ్యామిలీ!

లష్కర్ అంబారి ఊరేగింపు..
లష్కర్‌లో బోనాల తర్వాత రంగం నిర్వహిస్తారు.. ఆ వెంటనే మరో ప్రధాన ఘట్టమైన అంబారి ఊరేగింపు ప్రారంభమవుతుంది. దీనినే 'గజ వాహన సేవ' అని కూడా పిలుస్తారు. మైసూర్ నుండి వచ్చిన ప్రత్యేకమైన ఏనుగును అందంగా అలంకరించి, అమ్మవారి భవ్య మూర్తికి ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయం నుండి పరిసర గ్రామ దేవతల ఆలయాల మీదుగా ఊరేగింపు సాగుతుంది. ఈ క్రమంలో భక్తులు అమ్మవారికి అడుగడుగునా హారతులు, పూలవర్షంతో నీరాజనాలు అర్పిస్తారు.

 

అంబారి ఊరేగింపు మార్గం:
ఈరోజు ఉదయం 10:30 గంటల నుండి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఊరేగింపు జరగనుంది. ఇది జనరల్ బజార్, ఎంజీ రోడ్డు, రాణిగంజ్, ఆర్పి రోడ్డు , ఓల్డ్ రాంగోపాల్‌పేట పిఎస్ మీదుగా సాగుతుంది. ఈ మార్గంలో ప్రయాణించేవారు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

మద్యం ప్రియులకు భారీ షాక్..రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ విస్కీ అమ్మకాలపై నిషేధం!

BBhoomi4h ago
Secunderabad, Telangana:

Royal Challenge Whisky: ఫ్లేవరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పలు మద్యం కంపెనీలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) చర్యలను ముమ్మరం చేసింది. యునైటెడ్ స్పిరిట్స్ (USL) ఇన్‌బ్రూ బెవరేజెస్ సహా పలు కంపెనీల యూనిట్లకు నోటీసులు జారీ చేసింది. కొంతమంది తయారీదారులు.. ఉత్పత్తి   సహజ రుచి,  సువాసనను పోలి ఉండేలా రమ్‌కు రమ్ ఫ్లేవరింగ్, విస్కీకి విస్కీ ఫ్లేవరింగ్ వంటి ఫ్లేవర్లను కలుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది నిబంధనలను నేరుగా ఉల్లంఘించడమేనని FSSAI పేర్కొంది. ఫ్లేవరింగ్ పదార్థాల వాడకంపై తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదని FSSAI ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. కొన్ని తయారీ సంస్థలు ప్రామాణిక ఆల్కహాల్ పానీయాలకు ఫ్లేవర్లను కలుపుతున్నందున ఈ చర్య తీసుకున్నట్లు నియంత్రణ సంస్థ తెలిపింది. ఉదాహరణకు, రమ్‌లో రమ్ ఫ్లేవర్లను, విస్కీలో విస్కీ ఫ్లేవర్లను వాడుతున్నారు, ఇది నిబంధనలకు అనుగుణంగా లేదని పేర్కొంది. 

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఆల్కహాలిక్ బెవరేజెస్) రెగ్యులేషన్స్, 2018ను ఉల్లంఘించారనే ఆరోపణలపై జూలై 10న పలు మద్యం తయారీ కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. ఆ సమయంలో, నియంత్రణ సంస్థ ఆ కంపెనీల పేర్లను, వాటి ప్లాంట్ల వివరాలను వెల్లడించలేదు. మధ్యప్రదేశ్ లో యునైటెడ్ స్పిరిట్స్ తయారు చేస్తున్న యాంటిక్విడీ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీతోపాటు ఇన్ బ్రూ బేవరేజేస్ ఉత్పత్తి చేస్తున్న బ్యాగ్ పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ ట్రిపుల్ ఎక్స్ రమ్ ల అమ్మకాలను నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కంపెనీలు విస్కీ, రమ్ తయారీలో ముడిసరుకులు, నిల్వ ప్రక్రియ ద్వారా సహజంగా రుచి, సువాసన వచ్చే విధంగా చేయడానికి బదులుగా బయటి నుంచి ఫ్లేవర్లను వాడుతున్నట్లు తమ తనిఖీల్లో తేలిందని వివరించింది. ఇది వినియోగదారులను ఉత్పత్తి నాణ్యత విషయంలో మోసగించినట్లేనని పేర్కొంది. 

అయితే ఈ నిషేధాన్ని సవాలు చేసిన రెండు తయారీ సంస్థలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ పాక్షిక ఉపశమనాన్ని కల్పించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్టాక్ అమ్ముకునేందుకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. అయితే బాటిళ్ల ముందు భాగంలో వినియోగదారులకు స్పష్టంగా తెలియజేసేలా సవరించిన లేబుల్స్ అతికించాలని స్పష్టం చేసింది. కాగా యునైటెడ్ స్పిరిట్స్ దేశంలోనే అతిపెద్ద మద్యం తయారీ సంస్థ.. ఇన్ బ్రూ బేవరేజెస్ కూడా అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా ఉంది. ఆహార, పానీయాల ప్రమాణాల విషయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తన పర్యవేక్షణ కఠినతరం చేస్తోందని ఈ తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. 

Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?

Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల

Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

ఆగస్టు 1న శుక్రుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి రాజయోగం, లక్ష్మీదేవి అనుగ్రహం!

PPINEWZ4h ago
Hyderabad, Telangana:

Venus Transit In Virgo Effect: జ్యోతిష్య శాస్త్రంలో సంపద, సౌందర్యం, ఆనందంతో పాటు విలాసాలకు కారకుడైన  శుక్ర గ్రహం తన స్థానాన్ని మార్చుకుంది.. ఆగస్టు 1న శుక్రుడు కన్యా రాశిలోకి సంచారం చేసింది.. రాబోయే 30 రోజుల పాటు శుక్రుడు ఇదే రాశిలో సంచార దశలో ఉంటాడు.. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ గ్రహ సంచారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.. శుక్రుడి రాశి సంచార ప్రభావం మొత్తం 12 రాశులపై పడినప్పటికీ.. ప్రత్యేకం‌గా 3 రాశుల వారికి మాత్రం ఈ సమయం అత్యంత అదృష్టదాయకంగా మారబోతోంది.

ఫ్యాషన్, మీడియాతో పాటు ఆర్ట్, బ్యాంకింగ్, బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి ఈ 30 రోజుల కాలం గోల్డెన్ పీరియడ్‌గా మారబోతోందని జ్యోతిష్యలు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి అద్భుతమైన ధన లాభాలు కలిగే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి అదృష్టం కలుగుతుందో? అదృష్టం పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆగస్టులో అదృష్టం పొందే రాశులవారు..
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి అధిపతి స్వయంగా శుక్రుడే కావడంతో ఈ సంచారం వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు సుగమమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమ జీవితంలో శుభవార్తలు తప్పకుండా వింటారు.

సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి రాబోయే కొన్ని వారాలు ఆర్థికంగా ఊహించని శుభవార్తలు కలుగుతాయి. వ్యాపారంలో భారీ లాభాలు లేదా అనుకోకుండా నిలిచిపోయిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి సంచారం వల్ల వ్యాపార, ఉద్యోగ రంగాలలో కొత్త శిఖరాలను తాకే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న డీల్స్ ఓకే అవుతాయి. పెద్ద కాంట్రాక్టులు లభించి భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు గణనీయంగా పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా విజయవంతమవుతాయి. ముఖ్యంగా అనుకుంటున్న పనుల్లో విజయాలు సాధిస్తారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement
Advertisement

MLA Virupakshi: ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్‌.. 'నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం' వైఎస్‌ జగన్‌

Tadepalli, Andhra Pradesh:

MLA Virupakshi Arrest: 'నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం! దాడి చేసినవారికి రక్షణ. బాధితులపై కేసులతో రాజకీయ కక్ష! రాష్ట్రంలో ఏం జరుగుతోంది చంద్రబాబు?' అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 'దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ.. దాడికి గురైనవారు వైఎస్సార్‌సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు. బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపై కేసులు! ప్రశ్నిస్తే అరెస్టులు ! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం?ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం?' అని చంద్రబాబును మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రశ్నలు సంధించారు.

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్‌ సందర్భంగా 'ఎక్స్‌' వేదికగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పందించారు. 'నేను సూటిగా అడుగుతున్నా. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?' అని ప్రశ్నించారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్‌ ఆఫ్‌ లా అనేది ఉందా? అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సందేహం వ్యక్తం చేశారు.

'చిప్పగిరి మండలం నేమకళ్లులో వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీవాళ్లు దాడి చేస్తే.. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి  కాల్‌ చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా?' అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయని.. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారని వివరించారు.

'నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు' అని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అని ప్రశ్నించారు.

'అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో.. కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో.. ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో... ప్రజలకు తెలియకూడదనే హార్డ్‌డిస్కులను తీసుకెళ్లారా? సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా చంద్రబాబు?' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశ్నలు సంధించారు.

'శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా?' అని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు ఈస్ట్‌ మాజీ ఎమ్మెల్యే షేక్‌ మొహ్మద్‌ ముస్తఫా, ఆయన కుమారుడిపైన ఇదే రాజకీయ కక్షసాధింపు అని పేర్కొన్నారు.

'రాష్ట్రంలోని జెన్‌జీ తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఎందుకు రాజీనామా చేయడం లేదు?' అని యువత ప్రశ్నిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. 'విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? అని అడిగితే నారా లోకేశ్‌ దగ్గర సమాధానం లేదు' అని వివరించారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని.. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని.. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

'అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. చంద్రబాబు గుర్తుపెట్టుకో' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. 'ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా.. ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా.. ఎన్ని పోలీసు బలగాలను దించినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెనక్కి తగ్గదు' అని స్పష్టం చేశారు. అన్యాయాన్ని నిలదీస్తామని.. అరాచక పాలనపై పోరాడుతామని ప్రకటించారు.

 

 

0
0
Report
Advertisement
Advertisement
Back to top