icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow23 Jun 2024, 09:12 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

KTR: కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడమే ప్రొఫెసర్‌ జయశంకర్‌కు నిజమైన నివాళి: కేటీఆర్‌

Hyderabad, Telangana:

Professor Jayashankar: 'తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీ చేతుల్లో బందీ అయ్యింది. యాచించి కాదు.. శాసించే నాయకత్వమే తెలంగాణకు అవసరం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణకు దిక్సూచి జయశంకర్.. యాచించి కాదు.. శాసించి తెలంగాణ జయశంకర్ బోధించారని గుర్తుచేశారు. తెలంగాణను మళ్లీ కేసీఆర్ చేతిలో పెట్టడమే ప్రొఫెసర్‌ జయశంకర్‌కు నిజమైన నివాళి అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. జయశంకర్ ఆశయాలే బీఆర్ఎస్‌ పార్టీకి మార్గదర్శకం అని తెలిపారు. కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమని జయశంకర్‌ గట్టిగా నమ్మారని గుర్తుచేశారు.

ఢిల్లీ చుట్టూ రేవంత్ రెడ్డి ప్రదక్షిణలతో తెలంగాణకు దక్కిందేమిటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ సామంతులు కాదు.. తెలంగాణ స్వతంత్రులు కావాలని పేర్కొన్నారు. 75 ఢిల్లీ టూర్లు.. తెలంగాణకు తెచ్చిందేమిటి? అని నిలదీశారు. ఢిల్లీకి సామంతుల్లా మారొద్దు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రజలకు గులాబీ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు.

'ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రతి 13 రోజులకు ఒకసారి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీకి సామంతులు కాకుండా స్వతంత్రులు కావాలి అని జయశంకర్ చెప్పేవారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఆయన ఎప్పుడూ చెప్పేవారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని, జీఆర్ఎంబీ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ఆధారాలతో వివరించారని వెల్లడించారు. ఢిల్లీ పార్టీల చేతుల్లో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతోందని, తెలంగాణ కోసం పుట్టిన నిఖార్సయిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చినా, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ స్పందించలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, అప్పులు, అభివృద్ధి అంశాల్లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్ చేశారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని బీపీఆర్ విఠల్ అధ్యయనాలు నిరూపించాయని నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వం వాటిని వినియోగించలేకపోతోందని వివరించారు. కాంగ్రెస్ తెలంగాణకు శాశ్వత శత్రువని జయశంకర్ చెప్పేవారని గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ప్రకటించారు.

జయశంకర్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి.. కేసీఆర్‌తోనే రాష్ట్ర సాధన సాధ్యమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల సాధనే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

0
0
Report

రేపే ఏపీలో కొత్త సంక్షేమ పథకం ప్రారంభం.. ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.25 వేలు

Chirala, Andhra Pradesh:

Nethanna Sevalo Scheme: మరో కొత్త సంక్షేమ పథకం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేయనుంది.  ఒక్కొక్క కుటుంబంలో రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించే పథకానికి రేపు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. చేనేతలకు అండగా నిలువాలనే ఉద్దేశంతో ప్రారంభిస్తున్న పథకం పేరు 'నేతన్న సేవలో’ పథకం. చేనేత కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందిస్తున్నారు. 

నేత వృత్తి చేసే చేనేత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తుండగా తాజాగా చేనేతల సంక్షేమానికి మరో పథకానికి శ్రీకారం చుట్టింది. నేతన్న సేవలో పేరుతో ప్రారంభిస్తున్న ఈ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

నేతన్న సేవలో పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి నేతన్న కుటుంబానికి రూ.25 వేల సాయం దక్కనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 కుటుంబాలకు ఈ పథకం వర్తింపచేయనుండగా.. రూ.179 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ పథకమే కాకుండా ఇప్పటికే కొన్ని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేనేత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయం తెలిసిందే.

==> ఉచిత విద్యుత్‌తో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం దక్కుతోంది. దీనికి ఏటా రూ.150 కోట్లు ఖర్చవుతోంది.
==> ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చుచేసి 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేతలకు రూ.4 వేల చొప్పున ఏపీ  ప్రభుత్వం చెల్లిస్తోంది.
==> 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్‌ ద్వారా రూ.79 కోట్లు అందించింది.
==> ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కుతో పాటు అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటు
==> విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు

రేపు నేతన్న సేవలో పథకం ప్రారంభోత్సవ షెడ్యూల్‌
రేపు నేతన్న సేవలో పథకం ఏపీ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. చీరాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి ఉదయం 10.50 గంటలకు చేరుకుంటారు. 11.05 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగం చేస్తారు. మధ్యాహ్నం 01.35 గంటలకు జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు.

0
0
Report

ఆగస్టు 17న శక్తివంతమైన వైధృతి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక ధనవర్షమే!

Hyderabad, Telangana:

Vaidhriti Yog 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల స్థితిగతులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల కలయిక వల్ల ఏర్పడే వివిధ యోగాలు మానవ జీవితంపై విశేషమైన ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలుసు. జ్యోతిష్య ప్రకారం.. ఆగస్టు 17న మధ్యాహ్నం 01:54 గంటలకు సూర్యుడితో పాటు చంద్రుల ప్రత్యేక మార్పుల కారణంగా అత్యంత ప్రభావవంతమైన వైధృతి యోగం (Vaidhriti Yog) ఏర్పడబోతోంది.

ఈ వైధృతి యోగం కారణంగా ముఖ్యంగా నాలుగు రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు వస్తాయి.. ఇన్నాళ్లూ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆటంకాలు తొలగిపోయి అదృష్టం తలుపు తట్టనుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు..
కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ కాలం అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇతరులకు ఇచ్చిన అప్పులు.. మొండి బాకీలు ఊహించని విధంగా తిరిగి చేతికి అందుతాయని నిపుణులు చెబుతున్నారు. పని ప్రదేశంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలంతో పాటు గుర్తింపు కూడా ఊహించని స్థాయిలో లభిస్తుంది. జీవితంలో ఉన్న ప్రతికూలతలు, ఆటంకాలు తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది.

మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ వైధృతి యోగం నూతన అవకాశాలను అందిస్తుంది. ఇన్నాళ్లుగా వెంటాడుతున్న ఆర్థిక సంక్షోభం నుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పురోగతి కూడా ఊహించని స్థాయిలో లభిస్తుంది.. నిలిచిపోయిన పనులన్నీ మళ్లీ వేగం పుంజుకుంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడమే కాకుండా.. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి చాలా కాలంగా అగిపోయిన పనులు తిరిగి తప్పకుండా పూర్తవుతాయి.. వైధృతి యోగం ప్రభావంతో ధనలాభం కలిగి.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత కూడా సులభంగా లభిస్తుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..

సింహ రాశి (Leo)
సింహ రాశి జాతకులకు ఆర్థిక పరంగా తిరుగులేని పురోగతి కూడా లభిస్తుంది.. రాబడి పెరిగేందుకు కొత్త మార్గాలు సుగమం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు జీతాల పెంపు లేదా ప్రమోషన్ పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత, కుటుంబ జీవితంలో ఉన్న వివాదాలు కూడా సులభంగా తొలగిపోతాయి.. అనవసర ఒత్తిడికి స్వస్తి చెప్పి సంతోషంగా ముందుకు సాగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

కుటుంబం కోసం.. నాగుపామును చంపి, ప్రాణాలు వదిలిన కుక్క!

Hyderabad, Telangana:

Venomous Cobra VS Dog Viral Video: మనుషుల్లో విశ్వాసం తగ్గుతున్న ఈ రోజుల్లో.. కుక్కలు మనుషుల కంటే ఎంత మంచివి అని నిరూపించే హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో వెలుగుచూసింది. తాము పెంచుకున్న పెంపుడు కుక్క.. యజమాని కుటుంబాన్ని కాపాడేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కుటుంబంపైకి ఒక భయంకరమైన విషనాగు దూసుకొస్తుండగా.. ప్రాణాలకు సైతం వెనుకాడకుండా పోరాడి ఆ పామును అంతమొందించింది. అయితే, దురదృష్టవశాత్తూ ఆ పోరాటంలో విషపూరితమైన పాము కాటుకు గురై ఆ కుక్క కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..

ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లా పరిధిలోని ఒక గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. యజమాని కుటుంబ సభ్యులు ఇంట్లో తమ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో.. ఒక భారీ అత్యంత విషపూరితమైన నాగుపాము ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. ఇంట్లోని వారిపై దాడి చేసేందుకు అది వేగంగా ముందుకు వస్తున్న సమయంలో ఇంటి ముందు కాపలాగా ఉన్న పెంపుడు కుక్క దానిని గమనించింది.

అపాయాన్ని ముందే పసిగట్టిన ఆ కుక్క.. కుటుంబ సభ్యులకు ఏమాత్రం హాని కలగకుండా పామును అడ్డుకుంది. ఎంతమాత్రం వెనకడుగు వేయకుండా నాగుపాముతో భీకర పోరాటానికి దిగింది.. పాము దానిపైకి దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ.. తన ప్రాణాలను లెక్కచేయకుండా పామును గట్టిగా పట్టుకుని కొరికి చంపేసింది.

ఈ భీకర పోరాటంలో పాము చనిపోయినప్పటికీ.. అంతకంటే ముందే అది పెంపుడు కుక్కను పలుమార్లు కాటేసింది.. పాము విషం ఒళ్లంతా వ్యాపించడంతో ఆ కుక్క తీవ్ర అనారోగ్య సమస్యకు గురైంది. పాముపై దాడి చేసిన చంపిన కొద్దిసేపటికే అది యజమాని కళ్లముందే కుప్పకూలి కన్నుమూసింది. తన శ్వాస విడిచే వరకు కుటుంబాన్ని రక్షించాలనే తపనతో పోరాడిన ఆ పెంపుడు కుక్క విశ్వాసాన్ని చూసి యజమాని కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కుక్క కంటే నమ్మకమైన మిత్రుడు ఈ లోకంలో మరొకరు ఉండరని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. తన ప్రాణాలను త్యాగం చేసి యజమాని కుటుంబాన్ని కాపాడిన ఆ మూగజీవి త్యాగానికి ప్రతి ఒక్కరూ జోహార్లు చెబుతున్నారు..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం.. చిన్న కుమారుడు అబాన్ మృతి!

Hyderabad, Telangana:

Atiq Ahmad Son Telugu News: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదంలో మాఫియా డాన్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ (21) ప్రాణాలు కోల్పోయారు. ఝాన్సీ-కాన్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అబాన్‌తో పాటు ఆయన స్నేహితుడు సోనూ కూడా ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కార్‌లో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్ నుంచి ఝాన్సీ వైపు హ్యుందాయ్ క్రెటా వాహనంలో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. ఝాన్సీ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న తన సోదరుడు అలీ అహ్మద్‌ను పరామర్శించడానికి అబాన్ అహ్మద్ తన మిత్రులతో కలిసి వెళ్తుండగా పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవేపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

అతివేగమే ప్రమాదానికి కారణం?
వాహనం రోడ్డుపై చాలా వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో.. అకస్మాత్తుగా ఒక జంతువు రహదారిపైకి వచ్చింది. దానిని తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. కారు అత్యంత వేగంతో వెళ్లి సెంట్రల్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పూంచ్ పోలీసులు క్షతగాత్రులను బయటకు తీసి.. చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్ర గాయాలైన అబాన్ అహ్మద్, సోనూ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గాయపడిన ఇతర ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

గతంలో అతీక్ అహ్మద్ మరొక కుమారుడు అసద్ అహ్మద్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. తాజాగా చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

విమానాశ్రయంలో 10 అడుగుల కొండచిలువ.. ఎలా పట్టుకున్నారో చూడండి..

Hyderabad, Telangana:

10-foot Python Viral Video Watch: మహారాష్ట్రలోని అమరావతి బేలోరా విమానాశ్రయ (Amravati Belora Airport) ప్రాంగణంలో రాత్రి ఓ పాము తీవ్ర కలకలం రేపింది. రాత్రి సమయంలో సుమారు 10 అడుగులు కలిగిన భారీ కొండచిలువ ఎయిర్‌పోర్ట్ కాంపౌండ్‌లో ప్రత్యక్షమవ్వడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఈ భారీ కొండచిలువ తిరుగుతున్నట్లు సమాచారం ఉంది. అయితే, రాత్రి సమయంలో కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే, దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మంగళవారం ఆలస్యంగా రాత్రి వేళ విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది ఎప్పటిలాగే కాంపౌండ్ దగ్గర గస్తీ కాస్తున్నారు. ఆ సమయంలో నేలపై నెమ్మదిగా పాకుతున్న భారీ కొండచిలువ వారి కంటపడింది. ఎంతో భద్రత కలిగిన ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో అంత పెద్ద పామును చూసిన సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక వైల్డ్‌లైఫ్ రెస్క్యూవర్లతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే నిపుణులైన స్నేక్‌ క్యాచర్స్‌ బృందం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ 10 అడుగుల కొండచిలువను పట్టుకుని సురక్షితంగా రెస్క్యూ చేశారు. ఈ ఆపరేషన్ చూసేందుకు ఎయిర్‌పోర్ట్ సిబ్బందితో పాటు స్థానికులు ఆసక్తితో పాటు ఫోన్లలో సెల్ఫీలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు. అయితే, రెస్క్యూ టీమ్ వెంటనే వారిని సురక్షిత దూరంలో ఉండాలని హెచ్చరించింది.

పట్టుబడిన కొండచిలువ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం, స్నేక్‌ క్యాచర్స్‌ దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. మానవ నివాసాలకు దూరంగా ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో దానిని క్షేమంగా విడిచిపెట్టనున్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, స్నేక్స్‌ క్యాచర్స్‌ పట్టుకుంటున్న సమయంలో తీసిన వీడియోలు కొంతమంది సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయడంతో.. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report
Advertisement

మహబూబాబాద్ Govt ఆస్పత్రిలో ఘోరం.. 4 ఏళ్ల చిన్నారికి ఎక్స్‌పైరీ మందులు!

Hyderabad, Telangana:

Mahabubabad Latest News: ప్రాణాలు నిలపాల్సిన ఆస్పత్రులే.. నిర్లక్ష్యానికి నిలయాలుగా మారుతున్నాయి. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన్నట్లుగా తయారైంది ప్రభుత్వ ఆస్పత్రుల తీరు.. చిన్నారి ప్రాణాలతో చెలగాటమాడుతూ.. గడువు ముగిసిన మందులను పంపిణీ చేసిన ఉదంతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర కలకలం రేపింది..

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీకి చెందిన మురళీ.. తన 4 సంవత్సరాల కుమారుడు రాజ్ తీవ్ర వాంతులు, విరోచనాలతో బాధపడుతుండటంతో చికిత్స నిమిత్తం స్థానిక మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. OP విభాగంలో బాబును పరీక్షించిన వైద్యులు రెండు రకాల సిరప్‌లను ప్రిస్క్రిప్షన్‌లో రాశారు. అందులో ఒక సిరప్‌ను ఆసుపత్రిలోని ఫార్మసీలోనే ఇచ్చి.. మరొకటి బయట మెడికల్ షాప్‌లో కొనుగోలు చేసుకోవాలని సూచించారు. రెండు టానిక్‌లు వాడితే ఉపశమనం లభిస్తుందని.. ఆస్పత్రిలో అడ్మిట్ కావాల్సిన అవసరం లేదని చెప్పి పంపించివేశారు.

వైద్యుల సూచన మేరకు మరో సిరప్‌ను బయట మెడికల్ షాప్‌లో కొనుగోలు చేసిన మురళీ ఇంటికి వెళ్లాడు. బాబుకు మందు పోసేందుకు సిద్ధమవుతున్న సమయంలో అనుమానం వచ్చి.. ఆస్పత్రిలో ఇచ్చిన సిరప్ బాటిల్‌ను పరిశీలించాడు. దాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.. ఆ మందు ఎక్స్‌పైరీ డేట్ గతేడాది జూన్ 2026 సంవత్సరానికే ముగిసిపోయింది. ఏమాత్రం గమనించకుండా ఆ మందును బాబుకు తాగించి.. ఉంటే పరిస్థితి అత్యంత విషమంగా మారేది.

విషయం తెలుసుకున్న వెంటనే మురళీ.. ఆయన బంధువులు ఆస్పత్రికి చేరుకుని సిబ్బంది నిర్లక్ష్యాన్ని నిలదీశారు. అయితే, మొదటిగా తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు యత్నించిన ఆస్పత్రి సిబ్బంది..  మేము ఈ మందు ఇవ్వలేదు అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితులకు, సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బాధితులు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లిపోయిన బాధితులను తిరిగి పిలిపించారు.. ఆస్పత్రి ఫార్మసీ సిబ్బంది పొరపాటున.. గమనించకుండా గడువు ముగిసిన సిరప్‌ను ఇచ్చారని అంగీకరిస్తూ.. అధికారికంగా క్షమాపణలు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో బాధితులు ప్రశాంతంగా ఇంటికి వెళ్లిపోయారు..

ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

8,580mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Redmi K100 సిరీస్ లాంచ్.. గేమింగ్ లవర్స్‌కి పండగే!

Hyderabad, Telangana:

Redmi K100 Series Launch: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమి సబ్-బ్రాండ్ రెడ్‌మి మార్కెట్లోకి మరో సరికొత్త సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెడ్‌మి K100 పేరుతో అందుబాటులోకి రాబోతున్న Redmi K100 Proతో పాటు Redmi K100 Pro Max అనే రెండు పవర్‌ఫుల్ మోడళ్లు విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. చైనా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబో (Weibo) ద్వారా కంపెనీ ఈ ఫోన్లకు సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా వెల్లడించింది. వీటిని ఆగస్టు 11న ఈ సిరీస్ చైనా మార్కెట్‌లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సిద్ధమైంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందరినీ ఆకట్టుకునే ప్రధాన ఫీచర్‌ దీని బ్యాటరీగా భావించవచ్చు. Redmi K100 Pro మోడల్‌లో ఏకంగా 8,580mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 26 శాతం సిలికాన్ మెటీరియల్ వాడటం వల్ల బ్యాటరీ సైజ్ పెరగకుండానే ఎక్కువ రోజూ పనిచేస్తుందని సమాచారం.. ఇక ఇది 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, 22.5W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించడం విశేషం..

గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్‌ను అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చిన్నట్లు తెలుస్తోంది.. ఇందులో కస్టమ్ ఆక్టా-కోర్  స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 V ప్రాసెసర్‌తో పాటు ప్రత్యేకమైన AI గేమింగ్ గ్రాఫిక్స్ చిప్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. AnTuTu బెంచ్‌మార్క్ పరీక్షలో ఈ ఫోన్ ఏకంగా 40,95,000 కంటే ఎక్కువ స్కోర్ సాధించి రికార్డు సృష్టించింది. ఫోన్ వేడెక్కకుండా 3D సర్క్యులేటింగ్ కోల్డ్ పంప్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందుబాటులో ఉండడం విశేషం..

ఇక దీనికి సంబంధించిన డిస్‌ప్లే వివరాల్లోకి వెళితే.. ఇది 6.59-అంగుళాల డిస్ల్పేను కలిగి ఉంటుంది. ఇది 185Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 4,800Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో లభిస్తోంది..  ఇది గరిష్టంగా 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ఫ్లాట్ ప్యానెల్, అద్భుతమైఊన కెమెరా మాడ్యూల్‌ను కూడా అందించారు. వెనకాలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ప్రత్యేకంగా అద్భుతమైన ఆడియో అనుభూతి కోసం కెమెరా ఐలాండ్‌పై Sound by Bose బ్రాండింగ్‌ను కూడా కలిగి ఉంటుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్పెషిఫికేషన్స్‌..
ఈ సిరీస్‌లోని టాప్ మోడల్ అయిన K100 Pro Max స్మార్ట్‌ఫోన్‌లో 6.9-అంగుళాల భారీ OLED డిస్‌ప్లేను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అలాగే 200MP కెమెరాతో పాటు మైండ్ బ్లోయింగ్ 9,000 mAh బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

మహిళపై కొండచిలువ దాడి.. పామును చంపి ఆస్పత్రికి తీసుకొచ్చిన బంధువులు!

Hyderabad, Telangana:

12ft Python Attacks: జనగామ జిల్లా కంచనపల్లి గ్రామంలో గురువారం ఓ ఊహించని ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో ఓ మహిళపై భారీ కొండచిలువ ఒక్కసారిగా దాడి చేయడంతో స్థానికులు, గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాల్లో చక్కెర్లు కొడుతున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కంచనపల్లి గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ గురువారం ఉదయం తమ మొక్కజొన్న, వరి పొలం పనులకు వెళ్లింది.. పైరు మధ్యలో పని చేసుకుంటుండగా.. అక్కడ ఉన్న సుమారు 12 అడుగుల భారీ కొండచిలువ ఒక్కసారిగా స్వప్నపై దాడి చేసింది. ఆమె కాళ్లను చుట్టుముట్టి ఆహారంగా మలుచుకునేందుకు ప్రయత్నించింది. ఈ ఊహించని పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన స్వప్న గట్టిగా కేకలు వేయడం ప్రారంభించింది..

ఆమె కేకలు విన్న సమీప రైతులతో పాటు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి పరుగులు తీసిన్నట్లు సమాచారం. స్వప్న ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తీవ్రంగా పోరాడి స్వప్నను కొండచిలువ పట్టు నుంచి విడిపించారు. అనంతరం ఆ భారీ కొండచిలువ ఎవరికైనా ప్రమాదం చేసే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో దానిని అక్కడే కొట్టి చంపిన్నట్లు సమాచారం.

తీవ్రంగా గాయపడిన స్వప్నను కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విచిత్రంగా, ఎంత పెద్ద పాము దాడి చేసిందో వైద్యులకు చూపించడానికి, ఘటన తీవ్రతను వివరించడానికి వారు చనిపోయిన 12 అడుగుల కొండచిలువను కూడా ఆటోలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఆ భారీ కొండచిలువను చూసిన రోగులతో పాటు, బంధువులు ఒక్కసారిగా భయాందోళనకు గురైన్నట్లు తెలుస్తోంది.

జనగామ ఏరియా ఆసుపత్రి వైద్యులు స్వప్నకి తక్షణమే అత్యవసర చికిత్స అందిచిన్నట్లు తెలుస్తోంది.. కొండచిలువ విషపూరితమైనది కాకపోయినప్పటికీ.. దాని దాడి వల్ల స్వప్నకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం బాధితురాలికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని.. ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

తులం బంగారంపై ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్.. నగల షాపుల ఆఫర్ల వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే..!!

BBhoomi8h ago
Secunderabad, Telangana:

Gold Rate: గత ఏడాది కాలంలో, బంగారం ధరలు దాదాపు 70శాతం పెరిగి రికార్డులను బద్దలు కొట్టాయి. చరిత్రలో బంగారం ధరలు ఇంత వేగంగా ఎన్నడూ పెరగలేదు. ప్రస్తుత బంగారం ధరలను చూస్తే, గత ఆరు నెలలుగా అవి పెరుగుతూ వస్తున్నాయి. జనవరి నుండి, 10 గ్రాముల 24-క్యారెట్ బంగారం ధర రూ.1.83 లక్షలను దాటడంతో, బంగారం ధరలు సర్వకాలిక రికార్డును నెలకొల్పాయి. అప్పటి నుండి, ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది.

ప్రస్తుత బంగారం ధరలను చూస్తే.. ధరలు  స్థిరంగా ఉన్నాయని మనం చూడవచ్చు. గత నెలలో, బంగారం ధరలు రూ. 1.40 లక్షల నుండి రూ.1.45 లక్షల మధ్య ట్రేడ్ అయ్యాయి. నేడు తులం 10 గ్రాముల బంగారం ధరరూ. 1,49,000 వద్ద ట్రేడ్ అవుతోంది.  అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గత వారం బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ముడి చమురు ధరలు తగ్గడమే అని చెప్పాలి. ముడి చమురు ధరలు తగ్గినప్పుడు, డాలర్‌కు డిమాండ్ కూడా తగ్గుతుంది. బంగారం ధరలు పెరుగుతాయి. భారతదేశంలో, గత ఏడాది బంగారం ధరలు విపరీతంగా పెరిగిన తర్వాత, బంగారు ఆభరణాలు కొనడానికి బంగారు ప్రియులు అంతగా ఆసక్తి చూపడం లేదని నగల దుకాణాల యజమానులు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకాకుండా, స్థానిక సుంకాలలో గణనీయమైన పెరుగుదల కూడా బంగారం ధరలలో హెచ్చుతగ్గులకు ఒక కారణంగా ఉంది. విదేశాల నుండి బంగారం దిగుమతులను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల దిగుమతి సుంకాలను గణనీయంగా పెంచింది. ఇది కూడా బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని చెప్పాలి. 

బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో, నగల దుకాణాలు బోసిపోయి కనిపిస్తున్నాయి. ధరలు భారీగా పెరగడంతో సామాన్య మధ్య తరగతి ప్రజలకు బంగారం కొనాలంటే భారంగా మారిందని చెప్పాలి. దీంతో బంగారు షాపు యజమానులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లను, కొత్త కొత్త స్కీములను ప్రవేశపెడుతున్నారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది బంగారంపై ఇచ్చే డిస్కౌంట్ పథకం. హైదరాబాద్‌లో ప్రస్తుతం తులం బంగారంపై రూ. 10,000 డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.

తులం బంగారంపై ఇచ్చే రూ. 10,000 డిస్కౌంట్‌లో నిజం ఎంత?
హైదరాబాద్ నగరంలో ఇటీవల ప్రారంభమైన కొన్ని నగల దుకాణాలలో ఇలాంటి ఆఫర్లు కనిపిస్తున్నాయి. అయితే, ఈ ఆఫర్ కేవలం 916 గ్రేడ్ బంగారానికి మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని సాధారణంగా 22 క్యారెట్ల బంగారం అని అంటారు. వాస్తవానికి, బంగారు ఆభరణాలను ఈ నాణ్యత గల బంగారంతోనే తయారు చేస్తారు. అయితే, ఒక నగల దుకాణంలో బంగారు ఆభరణాలపై దాదాపు 10వేల రూపాయల డిస్కౌంట్ లభించడం చాలా అరుదు. అయినప్పటికీ, గత ఏడాది కాలంగా, నగల దుకాణాలు వినియోగదారులను ఆకర్షించడానికి వివిధ ఆఫర్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం, తగ్గింపులు కేవలం బంగారంపై మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గతంలో, ఈ తగ్గింపులు కేవలం బంగారం విలువ తరుగుదల,  తయారీ ఛార్జీలపై మాత్రమే లభించేవి. దీని ఆధారంగా, పెరుగుతున్న బంగారం ధర వల్ల బంగారు ఆభరణాల మార్కెట్ ఎంతగా ప్రభావితమవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.

Also Read: ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో నో ఫ్యూయల్! కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..!!

Also Read: పీఆర్సీ పై టీచర్ల పోరు బాట.. సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఉపాధ్యాయుల మహా ధర్నా.. డిమాండ్లు ఇవే..!!

Also Read: టీచర్లకు డెడ్‌లైన్ ఫిక్స్.. టెట్ అర్హత తప్పనిసరి

Also Read: ఆ బడుల్లో ఒకే టీచర్.. దేశంలో ఇలాంటి పాఠశాలలు లక్ష

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

ఛార్జింగ్ కష్టాలకు గుడ్ బై.. 10,000mAh బ్యాటరీతో ఒప్పో F35 ప్రో ఎంట్రీ.. వివరాలివే!

Hyderabad, Telangana:

Oppo F35 Pro Launching Soon: చాలా మంది స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్‌ పెట్టుకోవడానికి ఎప్పుడూ ఛార్జింగ్ సాకెట్ల కోసం వెతుక్కోవడం.. ప్రయాణాలు చేసే సమయాల్లో పవర్ బ్యాంక్ బరువును మోయలేక నరకం చూస్తూ ఉంటారు.. స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ ఇదో నిత్య సమస్యగా మారింది.. కానీ ఇకపై ఆ బాధలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం ఒప్పో భారతీయ మొబైల్ ప్రేమికులను దృష్టిలో పెట్టుకుని.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను ఊపేసేందుకు ఒక అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

భారత్‌లో గత ఏప్రిల్‌లో అద్భుతం సృష్టించిన F33 సిరీస్ తర్వాత.. మరింత శక్తివంతమైన F35 సిరీస్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ నెలలోనే భారత్‌లో అధికారికంగా లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల చైనాలో ఘనంగా విడుదలైన ఒప్పో A7 ప్రొ మ్యాక్స్ (Oppo A7 Pro Max) మోడల్‌కు రీబ్రాండెడ్ వర్షన్‌గా ఈ F35 ప్రొను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది..

ఈ ఫోన్‌లో కంపెనీ అద్భుతమైన 10,000mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అందిస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఎన్నో రోజుల పాటు ఛార్జింగ్ అందించేలా దీని డిజైన్ చేసిన్నట్లు తెలుస్తోంది. అలాగే దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం.. కంటిరెప్ప మూసి తెరిచేంత వేగంతో ఫోన్ రీఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గేమర్లతో పాటు ఎప్పుడు ప్రయాణాలు చేసే ఉద్యోగులు, కంటెంట్ క్రియేటర్లకు ఇది నిజంగా ఒక అద్భుతమైన ఫోన్‌గా నిలుస్తుంది.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఇతర ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.78 అంగుళాల 1.5K LTPS OLED ఫ్లాట్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే స్నాప్‌డ్రాగన్ 4 Gen 5 చిప్‌సెట్‌తో మల్టీ టాస్కింగ్ అత్యంత స్మూత్‌గా పని చేస్తోంది.. వెనుక వైపు OIS సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండగా.. సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో ఆటోఫోకస్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ Samsung JN5 కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16 (ColorOS 16) పై పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. భారత మార్కెట్లో ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ ధర రూ.40,000 నుంచి రూ. 45,000 మధ్యలో ఉండే అవకాశముంది. ఈ రేంజ్‌లో రాబోతున్న వివో S2 మోడల్‌కు ఒప్పో F35 ప్రొలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా.. మిడ్-ప్రీమియం విభాగాన్ని పూర్తిగా ఏలేస్తుందని టెక్ విశ్లేషకులు తెలుపుతున్నారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Vivo S2 గ్రాండ్ ఎంట్రీ.. చీప్‌ ధరకే 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, Sony 50MP కెమెరా!

Hyderabad, Telangana:

Vivo S2 India Launch: స్మార్ట్‌ఫోన్ ప్రియుల అద్భుతమైన శుభవార్త.. టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అద్భుతమైన టైమ్‌ రానే వచ్చేసింది. ప్రముఖ దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) భారత మార్కెట్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. తన అత్యంత ప్రతిష్టాత్మక ఫోన్ Vivo S2ను ఆగస్టు 6న గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.. ఇది 6.83 అంగుళాల 3D కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌తో కంటికి చెప్పలేనంత ఇంపుగా కనిపిస్తుందని తెలుస్తోంది.. ఏకంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎంతో ఎండలో కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది. కళ్లకు ఏమాత్రం శ్రమ కలగకుండా SGSలో-బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి తీసుకు రావడం విశేషం..

ఈ డివైజ్‌లో MediaTek Dimensity 7360 Turbo శక్తివంతమైన ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఆంటోటూ (AnTuTu) బెంచ్‌మార్క్‌లో ఏకంగా 9.70 లక్షలకు పైగా స్కోర్ సాధించిన్నట్లు తెలుస్తోంది. ఇక గేమర్స్ కోసం ఏకంగా 7,050 mAh భారీ బ్యాటరీని ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ మందం కేవలం 7.99 mm మాత్రమే ఉండటం నిజంగా ఒక అద్భుతంగా భావించవచ్చు. 

ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడేవారికి వివో అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.. బ్యాక్ సెటప్‌ను 50 మెగాపిక్సెల్ Sony IMX852 ప్రధాన కెమెరాతో పాటు ఫ్రాంట్‌ భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. రెండు కెమెరాలూ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

అధునాతన OriginOS 6, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో పాటు డ్యూయల్ సిమిట్రికల్ స్పీకర్లతో రాబోతున్న ఈ ఫోన్ సిల్క్ వైట్, శాఫైర్ బ్లూతో పాటు రీగల్ బ్రాంజ్ కలర్స్‌లో అందుబాటులోకి రాబోతోంది.. 8GB+128GB వేరియంట్ ధర సుమారు రూ.51,999తో.. 8GB+256GB వేరియంట్ ధర రూ. 55,999తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది అమెజాన్‌తో పాటు వివో ఈ-స్టోర్లతో పాటు ప్రముఖ రిటైల్ షాపుల్లో ఇది అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. 2 రోజుల పోలీసుల కస్టడీ మంజూరు..!!

BBhoomi10h ago
Secunderabad, Telangana:

Uday Krishnareddy: హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డిపై ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇటీవల ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అప్పర్ పారిష్ కోర్టు అతనికి రెండు రోజుల పోలీస్ కస్టడీ మంజూరు చేసింది. అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టే వరకు అదుపులో ఉంచాలని పోలీసులు కోరారు. కోర్టు అందుకు అంగీకరించింది. పోలీసులు నేడు  ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించనున్నారు.

కొంతమంది అత్యుత్తమ ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఇటీవల ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగినట్లు తెలిసింది. అయితే, అదే అకాడమీలో ఐపీఎస్ శిక్షణ పొందుతున్న తోటి మహిళా ఐపీఎస్ ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి, అతను తనను లైంగికంగా వేధించి, దాడి చేశాడని ఆరోపిస్తూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు తన తీర్పులో జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. అతను ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. అయితే, ఉదయ కృష్ణారెడ్డికి పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైంది. అతను పలువురు మహిళలతో  సోషల్ మీడియాలో చాట్ చేశాడని, వారికి ప్రపోజ్ కూడా చేశాడని పోలీసులు తమ విచారణలో గుర్తించారు.  అయితే, ఉదయ కృష్ణారెడ్డి తన చర్యలను సమర్థించుకున్నట్లు విచారణలో తేలింది.

ఉదయ కృష్ణారెడ్డి ఇలా అన్నట్లు సమాచారం. "సివిల్ సర్వీసెస్ గెలిచిన తర్వాత, నా గురించి కథనాలు సోషల్ మీడియా, టీవీ ఛానెళ్లలో వచ్చాయి. వాటిని చూసి చాలా మంది మహిళలు నాకు ప్రపోజ్ చేశారు. వాళ్లు నా అభిమానులుగా మారిపోయారు. నేను వారి ప్రపోజల్స్‌కు సరే అన్నాను. అందులో తప్పేముంది?" ఇటీవల కోర్టు అతనికి రెండు రోజుల పోలీసు కస్టడీ మంజూరు చేయడంతో, ఉదయ కృష్ణారెడ్డికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.

Also Read: ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో నో ఫ్యూయల్! కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..!!

Also Read: పీఆర్సీ పై టీచర్ల పోరు బాట.. సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఉపాధ్యాయుల మహా ధర్నా.. డిమాండ్లు ఇవే..!!

Also Read: టీచర్లకు డెడ్‌లైన్ ఫిక్స్.. టెట్ అర్హత తప్పనిసరి

Also Read: ఆ బడుల్లో ఒకే టీచర్.. దేశంలో ఇలాంటి పాఠశాలలు లక్ష

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

కుజ-శని ప్రతికూల కలయిక.. ఆగస్టు 12 గ్రహణంతో మారబోతున్న ఈ రాశుల జాతకాలు!

Hyderabad, Telangana:

Solar Eclipse Aug 12 Telugu: ఆగస్టు 12న ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది.. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించకపోవడం వల్ల ఇక్కడ సూతక్ కాలం వర్తించనప్పటికీ.. జ్యోతిష్యులు మాత్రం ఈ సమయాన్ని అత్యంత కీలకమైనదిగా భావిస్తూ ఉంటారు. గ్రహణానికి ముందే గ్రహాల గమనంలో సంభవించిన మార్పులతో పాటు ముఖ్యంగా కుజుడితో పాటు శని దేవుని స్థానాలు ప్రపంచ పరిణామాలతో పాటు పలు రాశుల వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు..

ఆగస్టు 2వ తేదీ రాత్రి కుజుడు మిథున రాశిలోకి సంచారం చేశాడు.. దీనివల్ల కుజ, శని గ్రహాలు ఒకదానికొకటి కేంద్ర స్థానాల్లో ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ అరుదైన మార్పులు ప్రతికూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీలు, కెరీర్, ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సమయంలో కొంత ఉద్రిక్తతలు లేదా ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది..
తులా రాశి: 

వాహనాలు నడిపేటప్పుడు తులా రాశివారు తప్పకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇతరుల వాహనాలను నడపకపోవడమే శ్రేయస్కరమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇతరుల మాటలకు ప్రభావితమై కెరీర్, వ్యాపారాల్లో పెద్ద మార్పులు రాకుండా చేసుకోవడమే చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

వృషభ రాశి: 
రాబోయే రోజుల్లో ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇంట్లోని పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా కెరీర్‌లో పెద్ద రిస్క్‌లు తీసుకోవడం తాత్కాలికంగా వాయిదా వేయడం మంచిది.

మిథున రాశి: 
మిథున రాశి వారికి ఆరోగ్యం, ఉద్యోగ రంగాల్లో సమయమనం చాలా అవసరమని నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగం మారడంతో పాటు కొత్త వ్యాపారం ప్రారంభించడం లేదా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం వంటి నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీయవచ్చు.

ధనుస్సు రాశి: 
ఈ సమయం ధనుస్సు రాశి వారికి కొంత సవాలుతో కూడుకున్నదని భావించవచ్చు. మీతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే కంటే ప్రస్తుతం చేస్తున్న పనిపైనే దృష్టి పెట్టడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

కుజుడు-రాహువుల నవపంచమ యోగం.. సెప్టెంబర్ 18 వరకు ఈ 4 రాశులకి తిరుగులేని రాజయోగం!

Hyderabad, Telangana:

Navpancham Yoga 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల మార్పుల కారణంగా అనేక శుభ, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆగస్టు 2న అంగారకుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేశాడు.. ఈ గ్రహ సంచారం వల్ల కుజుడు, రాహువుల మధ్య అత్యంత శక్తివంతమైన నవపంచమ యోగం ఏర్పడింది.

జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ యోగం రాబోయే సెప్టెంబర్ 18 వరకు చురుకుగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ నవపంచమ యోగం ప్రభావం ద్వాదశ రాశులన్నింటిపైనా ఉన్నప్పటికీ.. ముఖ్యంగా 4 రాశుల వారికి మాత్రం ఆర్థిక పురోగతి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని విజయాన్ని, ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అదృష్టాన్ని పొందే రాశులు ఇవే
మిథున రాశి (Gemini)
కుజుడు ప్రస్తుతం మిథున రాశిలోనే సంచార దశలో ఉన్నాడు. ఈ రాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. నిలిచిపోయిన లేదా రావాల్సిన పాత బాకీలు చేతికి అందుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి లేదా ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది శుభసమయంగా భావించవ్చు.

మేష రాశి (Aries)
మేష రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల ఈ గ్రహ మార్పు అత్యంత అనుకూల ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సుదీర్ఘకాలంగా పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలు లేదా ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికల కారణంగా పనులు కూడా స్పీడ్‌గా పూర్తి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్లు, షేర్ మార్కెట్ రంగానికి చెందిన వారికి ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అద్భుతంగా ఉంటుంది. మీరు తీసుకునే సరైన నిర్ణయాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తాయి.. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇరుక్కుపోయిన డబ్బులు కూడా పూర్తిగా తిరిగి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు నెలకొంటాయి. శ్రమకు తగ్గట్టుగా లక్ష్యాలను సులువుగా చేరుకుంటారు.

తులా రాశి (Libra)
తులా రాశి వారికి ఈ యోగం వృత్తి, ఉద్యోగ రంగాల్లో గొప్ప అనుకూల మార్పులను తీసుకువస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఆఫీసులో కీలకమైన ప్రాజెక్టులు చేతికి రావడంతో పాటు ప్రమోషన్ లేదా హోదా పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఐటీ (IT), టెక్నాలజీ, కార్పొరేట్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార విస్తరణ విజయవంతమవుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement
Advertisement
Back to top