ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జెండా ఎగురావేసిన బండారి శేఖర్
Karimnagar, Telangana:కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ లో ఘనంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జెండాను కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నాడు స్వాతంత్రోద్యమాన్ని ఎంతోగాను ముందుకు తీసుకువెళ్లిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1939 వ సంవత్సరంలో ఆనాడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడం జరిగిందని తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
ప్రాణ భయంతో విలవిలలాడిన ఈతగాడు.. ఆక్టోపస్ ఏం చేసిందో చూడండి.. వీడియో!
Hyderabad, Telangana:Octopus Attacks Video Watch Here: సముద్రం.. అనంతమైన అందాలకు నిలయం మాత్రమే కాదు.. అంచనా వేయలేని ఎన్నో ప్రమాదకరమైన జీవులకు నిలయం కూడా.. నీలిరంగు అలల వెనుక దాగి ఉన్న అజ్ఞాత ప్రపంచంలో ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించడం చాలా కష్టం.. సరిగ్గా అలాంటి ఒక వెన్నులో వణుకు పుట్టించే భయంకరమైన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సముద్రంలో హాయిగా ఈత కొడుతూ ఆస్వాదిస్తున్న ఒక వ్యక్తికి ఊహించని విధంగా ఒక జీవి కాలయముడిలాగా మారింది. నీటిలో ఈత కొడుతున్న ఆ వ్యక్తిపై ఒక ఆక్టోపస్ (Giant Octopus) ఒక్కసారిగా విరుచుకుపడింది. ఏమాత్రం సమయం ఇవ్వకుండా.. ఆ జీవి తన అత్యంత బలమైన చేతులతో (Tentacles) అతడి వీపు భాగాన్ని గట్టిగా చుట్టేసింది. సాధారణంగా ఇవి నీటిలో చాలా బలాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని విడిపించుకోవడం చాలా కష్టం..
ఆ ఆక్టోపస్ పట్టు ఎంత దారుణంగా ఉందంటే.. దాని ఒత్తిడికి ఆ వ్యక్తి ఊపిరి ఆడటమే కష్టంగా మారింది. ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో ఆ వ్యక్తి విలవిలలాడిపోయాడు. మృత్యువు తన రాక్షస పంజాతో బిగించి.. పట్టుకున్న సమయంలో ఆ వ్యక్తి ప్రాణ భయంతో ధైర్యంగా ఉండి.. దానిని విడిపించుకోవడానికి ప్రయత్నించడం మీరు చూడొచ్చు. తన శక్తినంతా వినియోగించి.. ఆక్టోపస్ పట్టు నుంచి విడిపించుకోవడానికి ఒడ్డు బయట ఎంతగానో ప్రయత్నించడం మీరు కూడా క్లియర్గా చూడొచ్చు.
Moment an octopus got clipped to a man’s back while swimming https://t.co/KuxlwqsmoO
— Instablog9ja (@instablog9ja) July 31, 2026
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
చివరకు అద్భుత రీతిలో ఆ రాక్షస జీవి పట్టు నుంచి బయటపడి.. ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.. అయితే, నీటి పైకి వచ్చాక అతడి వీపుపై పడిన భయంకరమైన ఎర్రటి గుండ్రటి గాయాలు చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిన్నట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డు రికార్డ్ చేసి.. సోషల్ మీడియాల్లో అప్లోడ్ చేయగానే.. క్షణాల్లో వైరల్గా మారాయి. మిలియన్ల మంది నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. సముద్రం ఎంత అందమైనదో.. అంతకంటే వెయ్యి రెట్లు ప్రమాదకరమైనది అనడానికి ఈ వీడియో ఒక నిదర్శనం.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Pawan Kalyan Speech Bhogapuram: ప్రధాని మోదీపై బూతులు.. విమానాశ్రయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ ఎమోషనల్!
Gudepuvalasa, Andhra Pradesh:Pawan Kalyan Speech At Bhogapuram Airport Inauguration: అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదికపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, దేశం కోసం ఆయన పడుతున్న శ్రమను కొనియాడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
ఒకప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టే దుస్థితిలో ఉన్న దేశాన్ని, ప్రధాని మోదీ తనదైన పాలనతో ప్రపంచంలోనే గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టారని పవన్ ప్రశంసించారు. 144 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా మోదీ అంకితభావంతో పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు.
భోగాపురం ఎయిర్పోర్ట్కు వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని, ఆయన ఆశయాలను ఇది భావితరాలకు చాటుతుందని అన్నారు. ఉత్తరాంధ్రకే చెందిన జీఎమ్మార్ సంస్థ ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.
భావోద్వేగ వ్యాఖ్యలు..
దేశం కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రధానిని జంతర్మంతర్ వద్ద కొందరు విమర్శించడం చూసి తనకు కన్నీళ్లొచ్చాయని పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. "పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు" తగులుతాయని, దేశ రక్షణ కోసం శ్రమిస్తున్న మోదీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రధానిని ఎదుర్కొనే నాయకుడు లేడని, ఆయన విశాల హృదయానికి అందరూ నమస్కరించాల్సిందేనని అన్నారు.
భోగాపురం విమానాశ్రయం రాష్ట్రాభివృద్ధికి, మౌలిక వసతుల విస్తరణకు బలమైన పునాదిగా మారుతుందని, దీనిద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: టీడీపీ Vs వైసీపీ..భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వేళ క్రెడిట్ రాజకీయాలు..ఎవరు చేశారు
Also Read: భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభం..పూర్తి షెడ్యూల్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఆర్థిక వ్యవస్థ దూకుడు.. ఏకంగా 14 నెలల రికార్డును తిరగరాసిన GST వసూళ్లు..!!
Lakshmapur, Telangana:GST Collection July 2026: దేశ ఆర్థిక రంగంలో కొన్ని చాలా సానుకూల వార్తలు ఉన్నాయి. జూలై 2026లో భారతదేశ స్థూల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 15.4 శాతం పెరిగి, రూ. 2.11 లక్షల కోట్ల చారిత్రాత్మక సంఖ్యను బ్రేక్ చేశాయి. శనివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. దేశీయ లావాదేవీలలో గణనీయమైన పెరుగుదల.. దిగుమతులపై అధిక పన్ను వసూళ్ల కారణంగా జీఎస్టీ రాబడిలో ఈ గణనీయమైన పెరుగుదల నమోదైంది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది రెండోసారి. పెరిగిన దేశీయ వినియోగం, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడమే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని ప్రభుత్వం పేర్కొంది. గత ఏడాది జూలైలో రూ.1.83 లక్షల కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ వసూళ్లు, ఈ ఏడాది రూ.2.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
దేశీయ జీఎస్టీ రాబడులు కూడా 10.1 శాతం పెరిగాయి. గత ఏడాది జూలైలో రూ.1.31 లక్షల కోట్లుగా ఉన్న ఈ వసూళ్లు, ఈ ఏడాది రూ.1.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు మరింత వేగంగా పెరిగాయి. 28.8 శాతం వృద్ధితో ఇది రూ.1.45 లక్షల కోట్లకు (₹66,511 కోట్లు) చేరుకుంది. అదనంగా, మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లలో దిగుమతుల వాటా గణనీయంగా పెరిగింది.
జూలైలో జీఎస్టీ రీఫండ్లు కూడా 13.1 శాతం పెరిగి రూ.29,968 కోట్లకు చేరాయి. రీఫండ్లను తీసివేసిన తర్వాత, నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లుగా (రూ.1.81 లక్షల కోట్లు) ఉన్నాయి, ఇది గత ఏడాదితో పోలిస్తే 15.8 శాతం పెరుగుదల. దేశీయ నికర వసూళ్లు 10.5 శాతం పెరిగి రూ.1.27 లక్షల కోట్లకు చేరగా, కస్టమ్స్ జీఎస్టీ నుంచి నికర వసూళ్లు 30.3 శాతం పెరిగి రూ.54,223 కోట్లకు (రూ.54,223 కోట్లు) చేరాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.8.43 లక్షల కోట్లకు (రూ.8.43 లక్షల కోట్లు) చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి, ఇది రూ.7.66 లక్షల కోట్లుగా (రూ.7.66 లక్షల కోట్లు) ఉంది. ఇది 10.1 శాతం వృద్ధి. ఎస్బిఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం, జిఎస్టితో పాటు ప్రాథమిక ఎక్సైజ్ సుంకంలో రాష్ట్రాల వాటాను పరిగణనలోకి తీసుకుంటే, గత సంవత్సరంతో పోలిస్తే 2026-27లో రాష్ట్రాలు అదనంగా రూ. 1.43 లక్షల కోట్లు ఆర్జించే అవకాశం ఉంది.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు.. థర్మాకోల్ షీట్పై హాయిగా శికారు.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Man Rides Thermocol Sheet Video Watch: దేశవ్యాప్తంగా వర్షాకాలం జోరుగా కొనసాగుతోంది.. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా అనేక నగరాలతో పాటు పట్టణాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులతో పాటు వీధులు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పాటు ఇళ్లలోకి నీరు చేరడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొందరు తమ వెరైటీ స్కిల్స్, అద్భుతమైన ఆలోచనలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
తీవ్ర వర్షపాతం కారణంగా ఒక వీధిలో మోకాలు లోతు కంటే ఎక్కువగానే నీరు నిలిచిపోయింది.. వాహనాల రాకపోకలు నిలిచిపోయి.. జనాలు ఇళ్లకే పరిమితమైన ఆ సమయంలో ఒక వ్యక్తి చేసిన విన్యాసం అందరి దృష్టినీ ఆకర్షించింది. రోడ్డుపై నిలిచిన నీటిని చూసి విసుక్కోకుండా.. అతడు ఒక వినూత్న ఆలోచన చేశాడు. ఇంట్లో ఉన్న థర్మాకోల్ షీట్ను బయటకు తీసి.. దాన్నే ఒక బోట్ మార్చుకున్నాడు.
ఆ ఫోమ్ షీట్పై హాయిగా కూర్చొని.. వర్షపు నీటిలో తేలుతూ.. తన చేతులతో నీటిని వెనక్కి నెట్టుకుంటూ హాయిగా పడవ ప్రయాణం చేశాడు. ఆ వీధిల్లో అతను అలా నవ్వుతూ తేలిపోతుంటే.. చుట్టుపక్కల ఉన్నవారు తమ ఫోన్లలో ఆ ఘటన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
నెట్టింట కామెంట్ల వర్షం..
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించడమే కాకుండా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. భారతీయుల టెక్నిక్కు ప్రపంచంలో ఎవరూ సాటి రారు.. అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. మున్సిపల్ అధికారులు వాటర్ పార్క్ సౌకర్యం ఉచితంగా కల్పించారని, బోటింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని.. మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
మనుషులకే కాదు.. గేదెలకీ మేకప్.. హర్యానాలో బఫెలో బ్యూటీ పార్లర్.. వీడియో!
Hyderabad, Telangana:Buffalo Beauty Parlour Video Watch: మనుషుల అందచందాల కోసం వాడకొక బ్యూటీ పార్లర్, హెయిర్ సెలూన్ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ, మనకు పాలనిస్తూ.. నిత్యం సేవలందించే మూగజీవాలైన గేదెలకు, ఎద్దులకు కూడా ఒక బ్యూటీ పార్లర్ ఉందంటే నమ్మగలరా? వినడానికి కాస్త వింతగా, ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది అక్షరాలా నిజం.. హర్యానాలోని కైథల్ జిల్లాకు చెందిన సందీప్ జాఖోలీ అనే పశుప్రేమికుడు ప్రారంభించిన ఈ వినూత్న గేదెల బ్యూటీ పార్లర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగానూ చర్చనీయాశమైంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా నగరాల్లో పెంచుకునే కుక్కలు, పిల్లల ఆరోగ్యం, అందం కోసం పెంపుడు జంతువుల యజమానులు ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు జీవనాధారమైన పాడి పశువుల శారీరక శుభ్రతను అంతగా పట్టించుకోరు.. ఈ ఆలోచనే సందీప్ మనసును కదిలించింది.. పశువులకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, శుభ్రత, అందం అవసరమని నమ్మిన సందీప్.. పశువుల కోసం ప్రత్యేకంగా ఈ గ్రూమింగ్ సెంటర్ను ప్రారంభించారు. ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు తమ పశువులను ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి తీసుకొచ్చి వాటిని ముస్తాబు చేయిస్తున్నారు.
కొమ్ముల పాలిష్ నుంచి హెయిర్ కటింగ్ వరకు..
ఈ పార్లర్లో లభించే ఫీచర్స్ చూస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. పశువుల కొమ్ములను ప్రత్యేక పరికరాలతో శుభ్రం చేసి, బాగా మెరిసేలా పాలిష్ చేస్తారు. అవసరాన్ని బట్టి కొమ్ములకు ఆకర్షణీయమైన ఆకారాన్ని ఇస్తూ ఉంటారు.. అలాగే పశువులకు శారీరక వేడి తగ్గేలా.. క్రిమి కీటకాలు చేరకుండా ఉండేందుకు వీలుగా అందమైన హెయిర్ కటింగ్ చేస్తారు. ముఖ్యంగా పశువుల అందాల పోటీలకు తీసుకెళ్లేముందు రైతులు తమ జీవాలకు ఇక్కడ ప్రత్యేకమైన మేకోవర్ చేయిస్తున్నారని షాప్ యాజమాని తెలుపుతున్నారు.
నకిలీ కొమ్ములు కూడా..
ఈ పార్లర్ కేవలం పై అందానికే పరిమితం కాకుండా.. పశువుల ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తుంది. సిబ్బంది పశువుల కాళ్లను శుభ్రం చేసి ట్రిమ్ చేస్తారు. దీనివల్ల పశువులు నడవడానికి ఇబ్బంది పడకుండా ఉండటమే కాక ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాయి. ప్రమాదవశాత్తు ఏదైనా పశువు కొమ్ము విరిగిపోతే.. ఆ స్థానంలో నిజమైన కొమ్ములా కనిపించే ఆర్టిఫిషియల్ హార్న్ కూడా పెడుతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సందీప్ చేస్తున్న ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. ఇన్స్టాగ్రామ్లో @official_sandeep_jaakholi అనే ఖాతా నుంచి ఆయన షేర్ చేసే గేదెల మేకోవర్, సింగ్ పాలిషింగ్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మూగజీవుల పట్ల సందీప్ చూపుతున్న అద్భుతమైన ప్రేమ, ఆయన ఆలోచనా విధానంపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న కవచ్ సిస్టమ్..!!
Lakshmapur, Telangana:Kavach system, Kavach 4.0: రైలు ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కావాక్ (ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్)ను అమలు చేయడంలో భారతీయ రైల్వే.. జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచింది. ఎదురెదురుగా ఢీకొనే ప్రమాదాన్ని పూర్తిగా తొలగించి, మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించే ఈ స్మార్ట్ టెక్నాలజీని తెలంగాణ వ్యాప్తంగా వేగంగా అమలు చేస్తున్నారు. దక్షిణ కరోలినా రైల్వే (SCR)లో ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకువస్తూ.. తెలంగాణలోని 63 రైల్వే స్టేషన్లలో.. 627 రూట్ కిలోమీటర్ల మేర కావాక్ వ్యవస్థను ఇప్పటివరకు విజయవంతంగా అమలు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో, జోన్ వ్యాప్తంగా 486 రూట్ కిలోమీటర్ల మేర అధునాతన కావాక్ 4.0 వెర్షన్ను విజయవంతంగా అమలు చేసి, రైలు ట్రయల్స్ను వేగవంతం చేశారు. కీలక స్టేషన్లలో భద్రతను పెంచడానికి, 21 కొత్త డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేశారు. 479 రూట్ కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టి, రైలు సామర్థ్యాన్ని పెంచారు.
ఈ అధునాతన డిజిటల్ వ్యవస్థ లోకో పైలట్లకు డిజిటల్ భద్రతా వలయంగా పనిచేస్తూ, రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా చేస్తుంది. ఒకవేళ లోకో పైలట్ పొరపాటున రెడ్ సిగ్నల్ను గమనించకపోయినా లేదా నిర్దేశించిన వేగ పరిమితిని మించి ప్రయాణించినా, ఈ వ్యవస్థ దానిని వెంటనే గుర్తించి, స్వయంచాలకంగా బ్రేకులు వేసి రైలును ఆపుతుంది. భారీ పొగమంచు ప్రతికూల వాతావరణంలో కూడా, లోకో పైలట్ క్యాబిన్ లోపల ఉన్న డిస్ప్లే స్క్రీన్పై వస్తున్న సిగ్నల్స్ను స్పష్టంగా చూడగలరు. స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించి, ఇది ఒకే ట్రాక్పై ఒక నిర్దిష్ట దూరంలో ఒకదానికొకటి సమీపిస్తున్న రెండు రైళ్లను గుర్తించి, ఆటోమెటిగ్గా బ్రేకులు వేస్తుంది. లెవెల్ క్రాసింగ్ గేట్ను సమీపిస్తున్నప్పుడు, లోకో పైలట్ ఎటువంటి జోక్యం లేకుండా విజిల్/హార్న్ మోగించడానికి కూడా కవచ్ వీలు కల్పిస్తుంది.
ఆధునిక సాంకేతిక పురోగతులతో రూపొందించిన అధునాతన 'కవచ్ 4.0' వెర్షన్ను వేగంగా అమలు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. సికింద్రాబాద్-ముంబై, సికింద్రాబాద్-ధర్మవరం, కాజీపేట-బల్లార్షా వంటి అధిక రద్దీ గల మార్గాలలో కవచ్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (OFC), ట్రాక్-సైడ్ RFID (OFID) ట్యాగ్లను ఏర్పాటు చేసే పనులు వేగంగా పురోగమిస్తున్నాయి. ఇప్పటికే 100కు పైగా లోకోమోటివ్లకు (రైలు ఇంజన్లకు) కవచ్ పరికరాలను విజయవంతంగా అమర్చారు. వికారాబాద్-బీదర్ , వాడి-వికారాబాద్-సనత్నగర్ మార్గాలలో ఈ వ్యవస్థను విస్తృతంగా పరీక్షించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే మూలధన బడ్జెట్ను రికార్డు స్థాయిలో రూ.2.77 లక్షల కోట్లకు పెంచడంతో, భద్రతా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పూర్తిగా పూర్తయింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన నెట్వర్క్ మొత్తాన్ని క్రమంగా 100శాతం కవచ్ కవరేజీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. వికారాబాద్-బీదర్, వాడి-వికారాబాద్-సనత్నగర్ వంటి మార్గాలలో కూడా పనులు వేగంగా పూర్తికావస్తున్నాయి. ఈ అధునాతన డిజిటల్ భద్రతా వ్యవస్థ అమలుతో తెలంగాణలో రైలు ప్రయాణం మరింత వేగవంతంగా, సురక్షితంగా మారుతుంది.
కొన్ని సిగ్నలింగ్ మార్గాలలో కవచ్ కేవలం ప్రాథమిక-స్థాయి రక్షణ వ్యవస్థగా మాత్రమే అందుబాటులో ఉండగా, అత్యంత అధునాతన ప్రమాణాలతో రూపొందించబడిన కవచ్ 4.0, దేశవ్యాప్తంగా విభిన్న వాతావరణాలలో మరియు సంక్లిష్టమైన సిగ్నలింగ్ వ్యవస్థలలో కూడా 100శాతం పూర్తి రక్షణను అందిస్తుంది. మునుపటి వెర్షన్తో పోలిస్తే, కవచ్ 4.0 ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (OFC) అధునాతన రేడియో టవర్లను అనుసంధానిస్తుంది. ఇది మిల్లీసెకన్లలో నిజ-సమయ సమాచార మార్పిడిని సాధ్యం చేస్తుంది. తద్వారా ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ తక్షణమే స్పందించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, కవచ్ 4.0 అధిక సాంద్రత గల నెట్వర్క్ మార్గాలలో భారీ రైలు రద్దీ ఉన్న కూడళ్లలో మరింత కచ్చితత్వంతో పనిచేస్తుంది. ఈ అధునాతన ఇన్-క్యాబిన్ సిగ్నలింగ్ వ్యవస్థ, దట్టమైన పొగమంచులో కూడా లోకో పైలట్ డిస్ప్లే స్క్రీన్పై సిగ్నల్ వివరాలను స్పష్టంగా ప్రదర్శిస్తుంది. చిన్నపాటి పొరపాట్లు జరిగినా కూడా సెకన్ల వ్యవధిలో ఆటోమేటిక్ బ్రేకులను యాక్టివేట్ చేస్తుంది.
సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్...
రైల్వే శాఖ, సికింద్రాబాద్లోని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (IRISET)లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా కవచ్ను అమలు చేయడానికి అవసరమైన లోకో పైలట్లు, సిగ్నలింగ్ ఇంజనీర్లు.. సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు, ఐఐటి హైదరాబాద్ వంటి ప్రఖ్యాత సంస్థల సహకారంతో ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన తాజా నవీకరణల కోసం ప్రమాణాల పరిశోధన, అభివృద్ధిని కూడా ఇది నిర్వహిస్తుంది.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
LPG Cylinder Price: సామాన్యులకు గుడ్న్యూస్..భారీగా పడిపోయిన సిలిండర్ ధరలు!
Hyderabad, Telangana:LPG Cylinder Price Cut: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలో భారీగా తగ్గింపును ప్రకటించాయి. పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సంగర్షణల నేపథ్యంలో సిలిండర్ ధరలు వ్యాపార రంగనికి గణనీయమైన ఉపశమనాన్ని కలిగించాయి.ఉగ్రరూపంలో గోదావరి.. 55 అడుగులకు చేరిన నీటిమట్టం.. 3వ ప్రమాద హెచ్చరిక జారీ!
Hyderabad, Telangana:Godavari Floods Latest News: భారీ వర్షం కారణంగా గోదావరి భయంకర ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉప్పెనలా వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ప్రళయ జలాలతో పోటెత్తుతోంది. శాంతమూర్తిలా ప్రశాంతంగా సాగే గోదారమ్మ.. నేడు మృత్యుదేవతలా పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతుంటే.. కళ్లెదుటే తమ ఇళ్లు, చేన్లు నీట మునిగిపోతుండటాన్ని చూసి భద్రాద్రి జిల్లా ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.
అర్థరాత్రి వేళ.. పెరిగిన భయం..
శనివారం ఉదయం ప్రాంతంలో భద్రాచలం వద్ద నీటిమట్టం ఒక్కసారిగా 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు తక్షణమే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద విపరీతంగా పెరగడం ముందే ఊహించిన యంత్రాంగం.. ప్రజలను హెచ్చరించడంతో పరివాహక గ్రామాల్లో భయాందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
ప్రస్తుతం నీటిమట్టం ఏకంగా 55.10 అడుగుల వద్ద ప్రమాదకరంగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది తీర ప్రాంతాలను ముంచెత్తుతూ వస్తున్న ఈ దండయాత్రతో వేలాది కుటుంబాలు చెట్టుకొకరు, పుట్టకొకరుగా మారే పరిస్థితి ఏర్పడింది.. తరతరాలుగా నమ్ముకున్న నదే ఈ రోజు ఇంతలా ప్రవహించడంతో బాధితులు రోదిస్తున్న తీరు గుండెలను పిండేస్తోంది.
స్తంభించిన రవాణా వ్యవస్థ..
ఉగ్ర గోదావరి ధాటికి భద్రాచలం–వాజేడు మధ్య ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరుకోవడంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి.. జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తుండటంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అధికారుల హైఅలర్ట్..
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. ముంపు ప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్ల సహాయంతో సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితులకు ఉచిత భోజన వసతితో పాటు తాగునీరు, వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఎగువన కురుస్తున్న వర్షాల దృష్ట్యా గోదావరి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని.. తీర ప్రాంతాల ప్రజలు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని.. అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ జల ప్రళయం నుంచి భద్రగిరి రామయ్యే తమను గట్టెక్కించాలని స్థానికులు ఆ స్వామివారిని వేడుకుంటున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Anti PM Modi Remarks: ప్రధాని మోదీని బూతులు పట్టిన యువతి..ఇప్పుడు అమాయకంగా క్షమాపణలు చెబుతోంది!
New Delhi, Delhi:Anti PM Modi Remarks Apology Video: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జూలై నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా తీవ్రమైన ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దూషిస్తూ చేసిన నినాదాలు చేసినట్లు కొందరు యువత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఓ అమ్మాయి మాత్రం ప్రధాని మోదీని దారుణంగా బూతులతో తిడుతూ రెచ్చిపోయిన వీడియో గతంలో వైరల్ అయ్యింది. తాజాగా ఆమెపై కేసు నమోదవ్వడం వల్ల ఆమె ఇప్పుడు తాను 15 ఏళ్ల బాలికను అంటూ క్షమాపణలు చెబుతూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేసింది.
ఏం జరిగిందంటే?
జూలై 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దూషణాత్మక భాషను ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీజేపీ నిరసనకారిణి, ఆన్లైన్లో వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో క్షమాపణ చెప్పింది. తన వయసు 15 ఏళ్లని ఇప్పుడు ఆమె పేర్కొంది. ఢిల్లీలోని కానాట్ ప్లేస్ సందర్శించిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి తాను నిరసనలకు వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. తన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావానికి లోనయ్యి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు చేసినట్లు ఆమె చెబుతోంది.
తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆమె చేతులు జోడించి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. "నేను ఆ వ్యక్తుల ప్రభావానికి లోనయ్యాను" అని ఆమె వీడియోలో చెబుతోంది. "నా వయసు కేవలం 15 ఏళ్లు. నేను చేసింది క్షమించదగినది కాదు. నేను చాలా చెడ్డ మాటలు మాట్లాడాను". దీనిని తన "మొదటి, చివరి తప్పు"గా పేర్కొంటూ, ఆమె మరో మాట మాట్లాడింది. "నేను యావత్ దేశానికి క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. నన్ను నేను కూడా చూసుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి" అని ఆ యువతి చెప్పుకొచ్చింది.
Ruchika Singh who abused PM Modi is now crying. She said
"I am apologizing to the entire country. I am so ashamed that I cannot even lift my eyes. I am asking for forgiveness from everyone, please forgive me, please.
This is my first and last mistake. After this, I will never… pic.twitter.com/ikcPJR7Q0t
— Chota Don (@choga_don) July 31, 2026
క్షమాపణలు అంగీకరించిన మోదీ!
నిరసన సందర్భంగా తనను దూషించిన విద్యార్థులను తాను క్షమించినట్లు, వారికి శిక్ష విధించడం కాకుండా మార్గనిర్దేశం చేయాలని సమాజాన్ని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.
"నాపైనా, నా దివంగత తల్లిపైనా ఉపయోగించిన దూషణాత్మక నినాదాలు తీవ్ర ఆవేదన కలిగించాయి" అని మోదీ అన్నారు. "కానీ యువత తమ తప్పుల నుండి నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి" అని ప్రధాని మోదీ వీడియోలో చెప్పుకొచ్చారు.
Also Read: సామాన్యులకు పిడుగు లాంటి వార్త..ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న ధరలు!
Also Read: IMD Weather Alert: ఏపీ, తెలంగాణకు భారీ తుఫాను ముప్పు..బంగాళాఖాతంలో తీవ్ర అలజడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
హైదరాబాద్ సైబర్ క్రైమ్ DCP అరవింద్ బాబుపై వేటు!
Hyderabad, Telangana:Hyderabad Cyber Crime DCP: హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) అరవింద్ బాబుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను ప్రస్తుతం ఉన్న సైబర్ క్రైమ్ DCP బాధ్యతల నుంచి తప్పిస్తూ.. తెలంగాణ రాష్ట్ర DGP కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తుండటంతో అరవింద్ బాబు DGP కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.
అసలేం జరిగింది?
ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖుల ఫోటోలతో పాటు వీడియోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అభ్యంతరకర రీతిలో పోస్ట్ చేస్తున్నారంటూ తెలంగాణ BJP నేతలు, ఇతరులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ నష్యాయ సంహిత (BNS)తో పాటు సమాచార సాంకేతిక చట్టం (IT Act) కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితే, పోస్టులు పెట్టిన ఖాతాదారులతో పాటు ఆయా ప్లాట్ఫామ్ల నిర్వహణ సంస్థ అయిన మెటా ఇండియా (Meta India) హెడ్ను కూడా ఈ కేసుల్లో నిందితుడిగా చేర్చడం పెద్ద వివాదానికి దారితీసింది.
జాతీయ స్థాయిలో దుమారం ..
సోషల్ మీడియా వేదికలలో వేర్వేరు వినియోగదారులు చేసిన వ్యక్తిగత పోస్టులకు వేదికను అందించే మెటా యాజమాన్యాన్ని లేదా దాని ఇండియా హెడ్ను ప్రత్యక్షంగా ఎలా బాధ్యులను చేస్తారనే అంశంపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ నడిచింది.. IT నిబంధనలతో సాటే ప్లాట్ఫామ్ బాధ్యతలపై స్పష్టత లేకుండా కేసు నమోదు చేయడంపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
వివాదం ముదిరిపోవడంతో సమగ్ర పరిశీలన జరిపిన రాష్ట్ర ప్రభుత్వం.. సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై వేటు వేస్తూ డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసింది.. కాగా.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల్లోని సాంకేతిక వివరాలు, వినతుల ఆధారంగానే నిందితుల పేర్లను చేర్చామని పోలీస్ వర్గాలు ప్రాథమిక వివరణ ఇచ్చాయి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
శని-చంద్రుల కలయికతో విష యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే!
Hyderabad, Telangana:Visha Yoga Astrology News: జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గ్రహాల గమనం, వాటి కలయిక మానవ జీవితంపై విశేష ప్రభావాన్ని చూపుతూ ఉంటాయని మనందరికీ తెలుసు. ఆగస్టు నెలలో జ్యోతిష్యపరంగా అనేక కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. మనస్సు, భావోద్వేగాలకు కారకుడైన చంద్రుని సంచారం వల్ల ఈ నెల ప్రారంభంలోనే కొన్ని ప్రతికూల యోగాలు.. ముఖ్యంగా విష యోగంతో పాటు చంద్రగ్రహణ ప్రభావం పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. చంద్రుడు, శని గ్రహాల కలయిక లేదా పరస్పర దృష్టి ఏర్పడినప్పుడు విష యోగం సంభవిస్తూ ఉంటుంది.. ఇది మానసిక ఆందోళన, అనారోగ్యం, చేపట్టిన పనుల్లో అడ్డంకులను కలిగిస్తూ ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనికి తోడు రాహు-కేతువుల ప్రభావంతో ఏర్పడే గ్రహణాలు కొన్ని రాశులవారిని అనేక రకాలుగా దెబ్బతీసే ఛాన్స్లు కూడా ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఈ గ్రహాల స్థితి వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక నష్టాలు, నిరాశ, తీవ్ర మానసిక ఒత్తిడి ఎదురయ్యే ముప్పు ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశివారికి ప్రతీ నిర్ణయంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. విష యోగం, గ్రహణ ప్రభావం కారణంగా అకస్మాత్తుగా ఊహించని ఖర్చులు పెరిగి.. అనేక సమస్యలు వస్తూ ఉంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో మనస్పర్థలు, గొడవలు జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. కోర్టు లేదా న్యాయపరమైన విషయాల్లో నిర్ణయాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో ఓపిక పట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వాహనాలు నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మీన రాశి (Pisces)
మీన రాశి వారికి కూడా ఈ సమయంలో అనేక సవాళ్లతో జీవితాన్ని ముందుకు సాగించాల్సి ఉంటుంది.. పనుల్లో వరుస ఆటంకాలు ఎదురై తీవ్ర ఒత్తిడికి గురిచేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సమాజంలో మీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించే రహస్య శత్రువుల పట్ల అత్యంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు.. ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది..
మిథున రాశి (Gemini)
ఆగస్టు మొదటి వారం మిథున రాశి వారికి తీవ్ర మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. చంద్రుని ప్రతికూల పరిస్థితుల వల్ల కోపం, సహనం కోల్పోవడం వంటివి పెరుగుతాయి. ఉద్యోగస్తులు తమ సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించడం అత్యంత ముఖ్యం. వ్యాపారంలో ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టకూడదు.. రిస్క్ తీసుకుంటే భారీగా ధన నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఆరోగ్యపరంగా కడుపు నొప్పి, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
August New Rules: సామాన్యులకు పిడుగు లాంటి వార్త..ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న ధరలు!
Hyderabad, Telangana:August New Rules 2026: ఆగస్టు నెల ప్రారంభంతో సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం మరింత పెరగనుంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా ఛార్జీల భారం, రూపాయి విలువ పతనం వంటి కారణాల వల్ల వివిధ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు నిర్ణయించాయి. ఈ ఏడాది వివిధ వినియోగ వస్తువుల ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం విశేషం.
ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి?
ఆగస్టు నుంచి ప్యాక్ చేసిన టీ, హెయిర్ ఆయిల్ (తల నూనె), రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లు (టీవీలు), రెడీమేడ్ దుస్తులు, ప్రయాగ వాహనాల ధరలు సుమారు 4 శాతం నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. పండుగ సీజన్ ప్రారంభానికి ముందు ఇదే చివరి ధరల పెంపు కావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆటోమొబైల్ రంగంపై ప్రభావం..
దేశీయ కార్ల మార్కెట్పై ధరల పెంపు ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. మారుతి సుజుకి కార్లపై ఆగస్టు నుంచి కార్ల ధరలను రూ.15,000 నుంచి రూ.30,000 వరకు పెంచనుంది. అలాగే హోండా ఇండియా కార్లపై ఆగస్టు 1 నుంచి ధరలు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీ కార్ల ధరలను పెంచగా.. మెర్సిడెస్-బెంజ్ ఇండియా కంపెనీ వచ్చే త్రైమాసికంలో ధరల పెంపు ఉండబోతుందని అంచనా వేస్తుంది.
ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసిజి ఉత్పత్తులు..
మెమరీ చిప్ల ధరల పెరుగుదల, సరఫరా సమస్యలు, దిగుమతి వ్యయాల కారణంగా టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఇతర గృహోపకరణాల ధరలను ఎలక్ట్రానిక్స్ కంపెనీలు 4% నుంచి 6% మేర పెంచనున్నాయి. మరోవైపు, పెట్రోలియం ఆధారిత ప్యాకేజింగ్ మెటీరియల్స్, వంట నూనెలు, ముడి పదార్థాల భారం కారణంగా ఎఫ్ఎంసిజి (FMCG) కంపెనీలు కూడా ఉత్పత్తి వ్యయాల పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి.
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు..
పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసు దెబ్బతినడం వల్ల సముద్ర రవాణా ఛార్జీలు, ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. రూపాయి మారకం విలువ పడిపోవడంతో దిగుమతులు మరింత ప్రియంగా మారాయి. పెరిగిన ఉత్పాదక వ్యయాల భారాన్ని కంపెనీలు చివరికి చిల్లర ధరల రూపంలో వినియోగదారులపై మోపుతున్నాయి.
పండుగ సీజన్పై అంచనాలు..
ఆగస్టు తర్వాత ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉండదని కంపెనీలు భావిస్తున్నాయి. ఓనంతో ప్రారంభమయ్యే రాబోయే పండుగ సీజన్లో వినియోగదారుల నుంచి డిమాండ్ బలంగా ఉంటుందని, మార్కెట్పై దీని ప్రభావం పరిమితంగానే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also REad: ఆగస్టులో విద్యార్థులకు పండగే పండగ..ఏకంగా వారం రోజులకు పైగా సెలవులు!
Also Read: E20 పెట్రోల్తో మైలేజ్ తగ్గుతుందా? రాజ్యసభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
శ్రావణ మాసంలో ఈ రాశులవారికి శని ఎఫెక్ట్.. వీరికి రాజయోగం.. కోరుకున్న కోరికలు నెరవేరే కాలం!
Hyderabad, Telangana:Shravana Masam Shani Effect: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం మొదలైంది.. ఈ మాసంలో కర్మఫలదాత అయిన శని దేవుడు మీన రాశిలో వక్ర మార్గంలో సంచారం కొనసాగిస్తున్నాడు.. శనిభగవానుడి ఈ వక్ర స్థితి 2026 డిసెంబర్ వరకు కొనసాగనుంది. శ్రావణ మాసంలో శనిదేవుని ఈ ప్రత్యేక కదలికలు మొత్తం 12 రాశుల వారి కెరీర్, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడబోతోంది. ముఖ్యంగా కొందరికి ఇది సువర్ణ అవకాశాలను తెచ్చిపెడితే.. మరికొందరికి సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే శని అనుగ్రహం వల్ల జీవితంలో అనుకున్న పనులు సులభంగా చేస్తారు. ముఖ్యంగా 12 రాశుల వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే, లాభాలు:
మేష రాశి:
శ్రావణ మాసం మేష రాశి వారికి అత్యంత శుభప్రదమైనదిగా భావించవచ్చు.. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి మంచి అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు సులభంగా పూర్తవుతాయి. నాయకత్వలో ఉన్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.
వృషభ రాశి:
ఆర్థికంగా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది.. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రయాణాలు చేయాలనుకుంటున్నవారికి దిమ్మతిరిగే ధన లాభాలు కూడా కలుగుతాయి. అయితే, అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది..
సింహ రాశి:
శని దేవుని అనుగ్రహంతో సింహ రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆఫీసులో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
మకర రాశి:
వ్యాపారంలో కొత్త, లాభదాయకమైన ఒప్పందాలు ఖరారవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్లో పురోగతి లభించడమే కాకుండా అనుకున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. కుటుంబ సంబంధాలు మరింత బలపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
కర్కాటక రాశి:
ఈ సమయంలో కర్కాటక రాశివారికి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ.. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మేలు..
మిథున రాశి:
మిథున రాశివారికి ఈ సమయం ఎంతో లాభదాయంగా ఉంటుంది. విజయం సాధించడానికి సాధారణం కంటే ఎక్కువ శ్రమించాల్సి ఉన్నప్పటికీ జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకుంటారు.. తొందరపాటు నిర్ణయాల వల్ల చిక్కులు రావచ్చు.. ఓర్పు వహించడం చాలా ముఖ్యం.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Bhogapuram Airport Credit: టీడీపీ Vs వైసీపీ.. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వేళ క్రెడిట్ రాజకీయాలు..ఎవరు ఎంత చేశారంటే?
Gudepuvalasa, Andhra Pradesh:Bhogapuram Airport Credit War: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం వేళ క్రెడిట్ ఎవరిదనే చర్చపై రాజకీయ వర్గాలలో, సోషల్ మీడియాలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత దశాబ్ద కాలంగా ప్రాజెక్ట్ వెనుక జరిగిన పరిణామాలు, రికార్డుల్లో ఉన్న వాస్తవాలు పరిశీలిస్తే పరిస్థితి స్పష్టమవుతుంది.
ప్రాజెక్ట్ ప్రయాణం - వాస్తవాల రూపంలో...
భూసేకరణ వివాదాలు: అవసరానికి మించి దాదాపు 5,000 ఎకరాలకు పైగా భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేయడం, స్థానిక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, ఆందోళనలకు అప్పట్లో ప్రతిపక్షం (వైసీపీ) మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ప్రజాపోరాటాల ఫలితంగా భూమి పరిమితిని సుమారు 3,000 ఎకరాలకు కుదించారు.
మొదటి వేలం, మార్పులు
ఎయిర్పోర్టు నిర్మాణానికి తొలుత వేలం నిర్వహించగా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) బిడ్డు గెలుచుకుంది. అయితే అప్పట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతి రాజు హయాంలో ఆ వేలాన్ని రద్దు చేసి, నిబంధనలను సవరించి తిరిగి వేలం నిర్వహించి GMR సంస్థకు అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇందులో నిజమెంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికే తెలియాలి.
ప్రభుత్వాల మారడంతో జాప్యం
ఆ తర్వాత కాలంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు కొంతకాలం ఆగిపోవడం, కాకినాడ SEZలో GMR వాటాలు అరబిందోకు బదిలీ కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2014లో భూసేకరణ ప్రారంభమైన అనేక అవాంతరాల తర్వాత ఓ కొలిక్కి వచ్చింది. అయితే 2019-2024 మధ్య విమానాశ్రయ పనులు మందకొడిగా సాగాయి.
పునఃప్రారంభం వేగం
ఆ తర్వాత 2024లో పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులను వేగవంతం చేశారు. ఉత్తరాంధ్రలో కలికితురాయిగా ఉండాలని.. రాష్ట్ర ప్రభుత్వం కనెక్టింగ్ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించింది.
చివరిగా.. భోగాపురం ప్రాజెక్ట్ అనేది ఒక రోజూ, ఒక ప్రభుత్వ హయాంలో పూర్తయింది కాదు. అనేక రాజకీయ పరిణామాలు, ప్రభుత్వాల మార్పులు, న్యాయపరమైన, ఆర్థిక ఒప్పందాల నేపథ్యంలో దశాబ్ద కాలంగా సాగిన ప్రక్రియ ఇది. ప్రాజెక్ట్ నిర్మాణంలో వాస్తవ పనులు దక్కించుకుని పూర్తి చేసిన ఘనత మాత్రం పూర్తిగా GMR (జీఎంఆర్) సంస్థకే దక్కుతుంది.
Also Read: భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభం..పూర్తి షెడ్యూల్ ఇదే!
Also Read: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సానికి ఏర్పాట్లు పూర్తి..ప్రధాని మోదీ షెడ్యూల్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కమర్షియల్ ఎల్పీజీ యూజర్లకు గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన సిలిండర్ ధరలు!
Lakshmapur, Telangana:LPG Cylinder Price Cut: దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపార వర్గానికి, హోటళ్లకు, రెస్టారెంట్లకు, క్యాటరింగ్ ఆపరేటర్లకు ఉపశమనం కల్పిస్తూ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పీజీ సిలిండర్ ధరల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి. నెలవారీ సవరణలలో భాగంగా, ఆగస్టు 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చేలా వాణిజ్య (19 కేజీల) ఎల్పీజీ సిలిండర్ల ధరలో గణనీయమైన తగ్గింపును ప్రకటించాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సంఘర్షణల నేపథ్యంలో, గతంలో పెరుగుతూ వచ్చిన సిలిండర్ ధరలు ఇప్పుడు వ్యాపార రంగానికి గణనీయమైన ఉపశమనాన్ని కలిగించాయి.
వివిధ నగరాల్లో సిలిండర్ ధరలలో భారీ తగ్గింపు:
తాజా సవరణ ప్రకారం, జాతీయ రాజధాని ఢిల్లీ నుండి కోల్కతా వరకు వాణిజ్య సిలిండర్ ధరలు మారాయి. ఢిల్లీలో, 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర సుమారుగా రూ.192 తగ్గి రూ.202కు చేరింది. అదేవిధంగా, కోల్కతాలో ధర రూ.209మేర తగ్గడం విశేషమని చెప్పాలి. ఈ తాజా తగ్గింపుతో, కోల్కతాలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ 2,872.50కు తగ్గింది. నిజానికి, జూలై 1వ తేదీన వాణిజ్య సిలిండర్ల ధరను కూడా రూ.183.50 తగ్గించారు. ఈ తగ్గింపు వరుసగా రెండో నెల కూడా కొనసాగుతూ, వ్యాపారులకు గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తోంది. రెండు నెలల్లోనే ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ల ధర మొత్తం రూ.375.50 తగ్గింది.
గృహ వినియోగదారులకు ఉపశమనం లేదు
వాణిజ్య సిలిండర్ల ధరలు గణనీయంగా తగ్గి వ్యాపార వర్గానికి ప్రయోజనం చేకూర్చగా, సాధారణ గృహ వినియోగదారులకు ఎలాంటి ఉపశమనం లభించలేదు. మన ఇళ్లలో వంటకు ఉపయోగించే 14.2 కేజీల గృహ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. గృహ సిలిండర్ల ధరలు పాత ధరల వద్దే స్థిరంగా ఉన్నందున, ఈ ధరల తగ్గింపు వర్తిస్తే తమకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని మధ్యతరగతి కుటుంబాలు ఆశిస్తున్నాయి.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
