ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జెండా ఎగురావేసిన బండారి శేఖర్
Karimnagar, Telangana:కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ లో ఘనంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జెండాను కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నాడు స్వాతంత్రోద్యమాన్ని ఎంతోగాను ముందుకు తీసుకువెళ్లిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1939 వ సంవత్సరంలో ఆనాడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడం జరిగిందని తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
హర్పిక్తో భర్త హత్య.. బంటితో కలిసి భార్య సంధ్య పన్నిన కుట్ర ఫోన్కాల్ లీక్
Nizamabad, Telangana:Harpic Murder Case Phone Call: వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న భార్య తాను ప్రేమించి పెళ్లాడిన భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. దుబాయ్ నుంచి వచ్చిన భర్తను మూడు రోజులకే భర్త దారుణ హత్యకు పాల్పడింది. పథకం ప్రకారం ప్రేమించి పెళ్లి చేసుకొని పదేళ్లు కాపురం చేసిన భర్తను ప్రియుడితోపాటు మరో యువకుడి సహాయంతో నాటకీయ పరిణామాల మధ్య ఆమె హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్రణాళిక రచించిన భార్య భర్తకు డాబాపైన పీకలదాకా మద్యం తాగించి అనంతరం భవనంపై నుంచి తోసేసింది. అప్పటికి భర్త చనిపోక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో సెలైన్లో హార్పిక్ ఎక్కించి హత్యకు పాల్పడడం యావత్ సమాజాన్ని విస్తుగొలిపింది. తెలంగాణలోని నిజామాబాద్లో జరిగిన ఈ సంఘటనలో భార్య ఆడియో కాల్ వైరల్గా మారింది.
ఫోన్ కాల్ ఆడియో
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో జరిగిన ప్రశాంత్ హత్య కేసులో ఫోన్ కాల్ ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. మృతుడి భార్య సంధ్యకు హత్యకు సహకరించి మద్యం తాగించిన వెంకట సాయి అలియాస్ బంటికి మధ్య జరిగిన సంభాషణ వైరలైంది. బంటి సంధ్య మధ్య సంభాషణ ఇలా జరిగింది.
సంధ్య: హలో.. అరేయ్ ఎట్ల ఒర్లుతుంది వాడేనా ఒర్లేది.
బంటి: కాదు.
సంధ్య: తాగి ఏది ఏమైనా కానీ తాగి డిచ్చ కావాలి
బంటి: కాదు.. వేరోడు. ఆయన నాతో మంచిగానే ఉన్నాడు.
సంధ్య: కాదు రా. అరేయ్ ఏం చేత్తవో నాకు తెల్వదు మొత్తానికి డిచ్చ తాగి పండాలి
సంధ్య: 'అరె బంటి ఎలాగైనా మందు తాగిస్తూనే ఉండురా. అరె వాడు కిందికి వస్తే నాకు బాధ రా. నమ్మినారా నిన్ను. నీదే రా బాధ్యత. మందు తాగించడం సగం వరకు రాగానే మళ్లీ తెప్పించి తాగించురా బంటి: సరే
సంధ్య: డిచ్చ తాగి పండాలి. కిందకు దిగొద్దు.
బంటి: ససరే.. నాకు తాగిపిత్తుండు
సంధ్య: వాడు కిందకు దిగొద్దు. వాడికే తాగిపియి.
బంటి: నీయమ్మ నేను కూడా పండాల్న ఏంది ఈడ్నే. వాడితో పాటు నేను పడుకోవాలా? నా చావుకు వచ్చింది సంధ్య
సంధ్య: ఏమైనా చేయి రా కిందకు రానివ్వకు. అన్నే పండనియ్యి. అబ్బా ప్లీజ్ రా. నీకు దండం పెడతా.. కాళ్లు మొక్కుతారా
జరిగింది ఇదే..
నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ దుబాయ్లో పనిచేసేవాడు. పదేళ్ల కింద సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. జూన్ 27వ తేదీన గల్ఫ్ నుంచి ప్రశాంత్ స్వగ్రామానికి వచ్చాడు. ఇంద్రాపూర్కు చెందిన అనిల్తో సంధ్యకు అక్రమ సంబంధం ఏర్పడింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతడి హత్యకు భార్య పథకం రచించింది. సంధ్య, అనిల్ కలిసి అదే గ్రామానికి చెందిన బంటి అనే యువకుడి సహకారంతో కుట్ర పన్నారు.
ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ త్రీ
పథకం ప్రకారం 29వ తేదీన బంటి ప్రశాంత్ ఇంటికి వెళ్లి డాబాపైన అతడితో మద్యం తాగాడు. స్థాయికి మించి ప్రశాంత్కు బంటి మద్యం తాగించాడు. తర్వాత అతడిని డాబాపై నుంచి అతడి భార్య సంధ్యతో కలిసి కిందకు నెట్టి వేశారు. కిందపడిన ప్రశాంత్ తీవ్ర గాయాలవడంతో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. భర్త తిరిగి బతికితే తమకు కష్టం.. తామే చంపేశామని చెబుతారని భయపడిన సంధ్య, బంటి, ప్రియుడు అనిల్ ముగ్గురు కలిసి సంధ్య మరో పథకం రచించింది. ముందుగా దాచిపెట్టుకున్న మత్తు ఇంజెక్షన్లు, మత్తు మాత్రలతో తయారుచేసిన ఇంజక్షన్, టాయిలెట్ క్లీనర్ (హార్పిక్)ను ప్రశాంత్ చేతికి ఎక్కించారు. ఆ తర్వాత మంచంపై నుంచి కిందకు తోసివేయడంతో అతడు మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుస్మిత విచారణ చేసి తమదైన శైలిలో విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
హైడ్రాకు ఓవైసీ కాలేజీలు కనిపించడం లేదా?: ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
Hyderabad, Telangana:Paidi Rakesh Reddy News: రాష్ట్రంలో చెరువుల పరిరక్షణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న హైడ్రా (HYDRAA), మజ్లిస్ నాయకులకు సంబంధించిన అక్రమ కట్టాల వైపు ఎందుకు వెళ్లడం లేదని ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ నాయకుల దగ్గరకు వచ్చేసరికి చట్టం ఎందుకు పని చేయడం లేదని ఆయన నిలదీశారు. BJP రాష్ట్ర కార్యాలయంలోని జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
ఇటీవల అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై MLA రాకేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒకటి కూల్చితే వంద కడతామంటూ అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని.. వంద కాకపోతే వెయ్యి కట్టుకో.. కానీ చెరువులను కబ్జా చేసి మాత్రం కట్టొద్దని ఆయన మీడియా ముఖంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. సల్కమ్ చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజీపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఓవైసీ కాలేజీని చెరువులోనే కట్టారా లేదా అనే విషయంపై ప్రభుత్వం తక్షణమే బహిరంగ ప్రకటన చేయాలన్నారు. భారత దేశ చట్టాలు ఓవైసీ సోదరులకు వర్తించవా అని ఆయన ప్రశ్నించారు.
పేదల కన్నీళ్లు కనబడటం లేదా?
ప్రభుత్వ బుల్డోజర్లు కేవలం పేద ప్రజల ఇళ్లను కూల్చడానికే పరిమితమయ్యాయని.. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మండిపడ్డారు. పేదలను చూస్తేనే ప్రభుత్వానికి బుల్డోజర్లు గుర్తుకొస్తున్నాయా.. అని ప్రశ్నిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హిట్లర్తో పోల్చారు. పేదల కన్నీళ్లు మీకు కనబడటం లేద హిట్లర్ రేవంత్ రెడ్డి? అని మీడియా ముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైసీ సోదరులపై చర్యలు తీసుకోవద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమైనా ఆదేశించారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
సర్ పై అపోహలు వద్దు..
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై లేనిపోని అబద్ధాలు, అపోహలు ప్రజల్లో సృష్టించవద్దని.. మజ్లీస్ నాయకులకు సర్ అంటే ఎందుకు అంత భయమని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే విదేశీ అక్రమ చొరబాటుదారుల ఓట్లను మజ్లిస్ పార్టీ స్వచ్ఛందంగా తొలగించాలని.. చొరబాటుదారులకు వత్తాసు పలకడం మానుకోవాలని ఈ సమయంలో హితవు పలికిన్నట్లు తెలుస్తోంది. చివరగా ఆయన ప్రభుత్వానికి.. హైడ్రాకు తీవ్రంగా హెచ్చరించారు.. ఓవైసీ కాలేజీల లాంటి పెద్దల అక్రమ కట్టడాలను కూల్చకుండా.. కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తే.. తాము ఊరుకునేది లేదని.. పెద్ద ఎత్తున హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆఫీస్ను ముట్టడిస్తామని పైడి రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు.. ఉచితంగా మొబైల్ ఇస్తున్న మోదీ సర్కార్.. !!
Secunderabad, Telangana:Fact Check: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆన్ లైన్ లో వార్తలు తెలుసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలో ఏ మూలన.. ఏం జరిగిన క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. అసలు విషయాలే కాదు ఫేక్ న్యూస్ కూడా ఎక్కువగా సర్క్యూలేట్ అవుతున్నాయి. ఆ వార్తలు నిజమా.. కాదా అని ఆలోచించకుండానే చాలా మంది వాటిని షేర్ చేస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో వీడియోలు.. ఆడియోలను ఎడిట్ చేసి.. వాస్తవానికి విరుద్ధంగా కథనాలను జోడించి వైరల్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ఫేక్ న్యూస్ లు మరింత ఎక్కువగా అయ్యాయి. అలా వైరల్ చేస్తున్న వార్తల్లో నిజం ఎంత.. తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సాక్ష్యాత్తూ భారత ప్రధాని మోదీ ఫ్రీ మొబైల్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు. ఇందులో వాస్తవం ఎంత తెలుసుకుందాం.
ఈ వైరల్ వార్త వెనకున్న అసలు నిజమేంటీ?
ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉన్నవారితోపాటు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు కూడా ఈ స్కీముకు అర్హులు అంటూ పేర్కొన్నారు. ఈ వార్త వెనకున్న అసలు నిజాన్ని PIB ఛేదించింది. వైరల్ అవుతున్న వీడియో అవాస్తవమని కొట్టిపారేసింది. ఈ విషయాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ వీడియోతోపాటు ఉన్న క్యాప్షన్ లో ఫ్రీ మొబైల్ ఫోన్లు ఇస్తామని చెప్పే వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిఐబీ తెలిపింది. ఈ వీడియోను గవ్ట్ ఎడ్జ్ అనే ఫేస్ బుక్ పేజీకి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను ఎడిట్ చేసి తప్పుడు వాదనతో సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు వెల్లడి అయ్యింది. సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియోగా తేలింది. ఈ వీడియోను ఎడిట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో సర్య్కూలేట్ చేస్తున్నట్లు పిఐబీ తేల్చింది. ఇలాంటి వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
फेसबुक पेज 'GovtEdge' द्वारा साझा किए प्रधानमंत्री नरेंद्र मोदी के AI जनित वीडियो में दावा किया जा रहा है कि 25 वर्ष से अधिक उम्र के आधार कार्ड धारकों को फ्री स्कूटी दी जा रही है। #PIBFactCheck
❌ यह दावा #फर्जी है। प्रधानमंत्री द्वारा ऐसी कोई घोषणा नहीं की गई है।
⚠️ कृपया… pic.twitter.com/AzqcttmY56
— PIB Fact Check (@PIBFactCheck) July 6, 2026
Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్లో భారత్కు చెందినవి కూడా..!!
Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో
Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
7000mAh బ్యాటరీతో మోటో సంచలనం.. బడ్జెట్ ధరలోనే Moto G77 Power ఫోన్ లాంచ్!
Hyderabad, Telangana:Moto G77 Power Launch: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) భారతీయ మొబైల్ ప్రియుల కోసం మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇది Moto G77 Power పేరుతో అందుబాటులోకి రాబోతోంది. ఈ అద్భుతమైన స్మార్ట్ఫోన్ ఈ వారంలోనే భారత మార్కెట్లోకి విడుదల కాబోతోంది.. లాంచ్కు ముందే కంపెనీ ఈ ఫోన్కు సంబంధించిన డిస్ప్లే, కెమెరాతో పాటు బ్యాటరీ వంటి కీలక వివరాలను అధికారికంగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది వినియోగదారులను ఆకట్టుకునేలా నాలుగు విభిన్న కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రాబోతోంది..
కళ్లు చెదిరే డిస్ప్లే..
ఈ Moto G77 Power స్మార్ట్ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ HD+ (2400 x 1080 పిక్సెల్స్) LCD డిస్ప్లేతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 120Hz టచ్ సాంప్లింగ్ రేట్ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలిపింది.. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,050 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్ను ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా.. స్క్రీన్ ప్రొటక్షన్ కోసం శక్తివంతమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i (Corning Gorilla Glass 7i)ను మొట్టమొదటిసారిగా ఈ బడ్జెట్ రేంజ్లో మోటోరోలా అందిస్తూ వస్తోంది.
సోనీ సెన్సార్తో అద్భుతమైన కెమెరా క్వాలిటీ..
ఫొటోగ్రఫీ లవర్స్ కోసం ఈ ఫోన్లో అదిరిపోయే కెమెరా సెటప్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని వెనుక భాగంలో డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ను కూడా తీసుకు వచ్చింది.. ఇందులో f/1.8 అపెర్చర్తో కూడిన 50 మెగాపిక్సెల్ Sony LYTIA 600 ప్రైమెరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ భాగంలో ఏకంగా 32 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను కూడా విడుదల చేసింది..
శక్తివంతమైన ప్రాసెసర్..
ఈ Moto G77 Power స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 (MediaTek Dimensity 6400) చిప్సెట్ ప్రాసెసర్ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. గ్రాఫిక్స్ కోసం.. Arm Mali-G57 MP2 GPUని కూడా విడుదల చేసింది.. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే.. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుందని కంపెనీ వెల్లడించింది.. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
7,000 mAh జంబో బ్యాటరీ..
ఈ స్మార్ట్ఫోన్ పేరులోనే పవర్ ఉన్నట్లుగా.. ఇందులో ఏకంగా 7,000 mAh భారీ బ్యాటరీని కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే.. రెండు రోజుల పాటు నిరంతరాయంగా బ్యాటరీ లైఫ్ కూడా లభిస్తుంది. దీనికి తోడు 30W టర్బోపవర్ (TurboPower) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు ఇతర డివైజ్లను ఛార్జ్ చేసుకునేందుకు 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉండడం విశేషం..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Flipkart GOAT సేల్ ధమాకా.. Samsung గెలాక్సీ A36 5G పై రూ.7,825 భారీ డిస్కౌంట్!
Hyderabad, Telangana:Samsung Galaxy A36 5g Price Cut: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో ఇప్పటికే గోట్ సేల్ (GOAT Sale) ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్మార్ట్ఫోన్ ప్రియులకు అద్భుతమైన ఆఫర్లను అందుబాటులోకి వచ్చాయి. ఎప్పటి నుంచో రూ.30,000 లోపు బడ్జెట్లో ప్రీమియం ఫీచర్లు కలిగిన సరికొత్త 5G స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకు సాంసంగ్ గెలాక్సీ A36 5G (Samsung Galaxy A36 5G) ఒక బెస్ట్ ఆప్షన్గా భావించవచ్చు.. ఈ సేల్లో సాంసంగ్ బ్రాండ్ ఈ పాపులర్ ఫోన్పై కంపెనీ ఏకంగా రూ.7,000 కంటే ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి రావడం విశేషం. అయితే, ఇప్పుడు ఈ సేల్లో దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బ్యాంక్ ఆఫర్స్ వివరాలు...
గతేడాది మార్చి నెలలో సాంసంగ్ గెలాక్సీ A36 5G స్మార్ట్ఫోన్ 8GB ర్యామ్తో పాటు 128 GB స్టోరేజ్ వేరియంట్ రూ.32 వేలతో విడుదలైంది. అయితే, ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ గోట్ సేల్లో భాగంగా ఈ ఫోన్ రూ.26,999కే అందుబాటులోకి రావడం విశేషం..
ఇవే కాకుండా అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా బ్యాంక్ ఆఫర్లను వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ మొత్తంలో డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ SBI క్రెడిట్ కార్డ్ను వినియోగించి పేమెంట్ చేసే వారికి అదనంగా రూ.1,825 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.. దీనితో ఈ స్మార్ట్ఫోన్ ఎఫెక్టివ్ ధరతో కేవలం రూ.25,174కే సొంతం చేసుకోవచ్చు. అంటే లాంచ్ ధరతో పోలిస్తే.. ఇప్పుడే కొనుగోలు చేసే కస్టమర్లకు ఏకంగా రూ.7,825ల వరకు భారీగా డిస్కౌంట్ లభిస్తుంది.
దీంతో పాటు పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయాలనుకునే వారి కోసం గరిష్టంగా రూ.23,700 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ అనేది మీ పాత ఫోన్ కండిషన్పై ఆధారపడి ఉంటుంది. ఇక ఈ బోనస్ను కొత్త స్మార్ట్ఫోన్ నుంచి తీసేస్తే దాదాపు రూ.3 వేలలోపే సొంతం చేసుకోవచ్చు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
అద్భుతమైన డిస్ప్లే, ప్రాసెసర్ వివరాలు..
ఈ సాంసంగ్ గెలాక్సీ A36 5G స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.7 అంగుళాల Full HD+ Super AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో పాటు 2340x1080 పిక్సెల్స్ రిజల్యూషన్తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ వేగంగా ఉండటం కోసం దీనిలో పవర్ఫుల్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 1380 (Exynos 1380) ప్రాసెసర్ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది.
50MP ట్రిపుల్ కెమెరా సెటప్..
ఈ స్మార్ట్ఫోన్ కెమెరా పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీని వెనుక భాగంలో f/1.8 అపెర్చర్తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ భాగంగాలో చాలా ప్రత్యేకమైన f/2.2 అపెర్చర్తో కూడిన 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
తిరుమలలో రానున్న రోజులన్నీ ఎన్నో విశిష్టతలు.. జూలై క్యాలెండర్ ఇదే!
Tirupati Urban, Andhra Pradesh:TTD July Calendar: వైకుంఠ శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రంలో ప్రతి రోజు ఒక విశిష్టత.. ప్రతి రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. జూలై నెల రావడంతో ఈ నెలలో తిరుమలలో ఎలాంటి ప్రత్యేక ఉత్సవాలు, పూజలు ఉన్నాయో తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సరం ఆషాఢ మాసంలో తిరుమలలో అనేక ప్రత్యేక ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూలై నెలకు సంబంధించిన క్యాలెండర్ వివరాలు ఇలా ఉన్నాయి.
జూలై నెల ప్రారంభమై వారం పూర్తయ్యింది. 5వ తేదీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ సుందరరాజస్వామి వారి 'అవతారోత్సవాలు' ప్రారంభమయ్యారు. 6వ తేదీన రాత్రి 10:41 గంటలకు 'పునర్వసు కార్తె' ప్రారంభమైంది.
7వ తేదీ: తిరుచానూరు శ్రీ సుందరరాజస్వామి వారి అవతారోత్సవాల ముగింపు
10వ తేదీ: స్మార్త సాంప్రదాయం పాటించేవారికి ఏకాదశి వ్రతం
11వ తేదీ: వైష్ణవ సాంప్రదాయం పాటించేవారికి శూన్య ఏకాదశి
12వ తేదీ: మాస శివరాత్రి
15వ తేదీ: చంద్రోదయం, రాత్రి 2:44 గంటలకు 'గురుమౌఢ్యము' (గురు మూఢమి) ప్రారంభం.
17వ తేదీ: తిరుమలలో అత్యంత ముఖ్యమైన రోజు ఇది. ఉదయం 11:53 గంటలకు 'కర్కాటక సంక్రమణం' జరుగుతుంది. దీంతో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'ఆణివార ఆస్థానం' జరుగుతుంది. అనంతరం సాయంత్రం 'పుష్పపల్లకి సేవ' నిర్వహిస్తారు. అదే రోజు శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి 'సాక్షాత్కార వైభవోత్సవాలు' ప్రారంభమవుతాయి.
18వ తేదీ: కులశేఖరాళ్వార్ తిరునక్షత్రం (జయంతి)
19వ తేదీ: శ్రీనివాసమంగాపురం స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాల ముగింపు
20వ తేదీ: రాత్రి 12:14 గంటలకు 'పుష్యమి కార్తె' ప్రారంభం
22వ తేదీ: తిరుపతి గోవిందరాజస్వామి వారు ఆళ్వార్ తీర్థానికి (కపిలతీర్థం) వేంచేసే ఉత్సవం
24వ తేదీ: తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలో 'జ్యేష్ఠాభిషేకం' ప్రారంభం
25వ తేదీ: హిందువులకు అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి. ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది.
తిరుపతి కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో 'పవిత్రోత్సవాలు' ప్రారంభం. తాళ్లపాకలో చెన్నకేశవస్వామి మరియు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
26వ తేదీ: తిరుమల నారాయణగిరి కొండపై 'ఛత్రస్థాపన' ఉత్సవం, తులసీ మహాత్మ్య పూజ
తిరుపతిలో శ్రీ విఖనసాచార్యుల వారి ఉత్సవాల ప్రారంభం
శ్రీ గోవిందరాజస్వామి వారి జ్యేష్ఠాభిషేకం ముగింపు
28వ తేదీ: తిరుపతి కపిలతీర్థంలో కపిలేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాల ముగింపు
29వ తేదీ: గురుపూర్ణిమ (వ్యాస పూర్ణిమ / ఆషాఢ పూర్ణిమ) పర్వదినం, మహోదయ్ వేడుకలు
30వ తేదీ: తిరుపతిలో విఖనసాచార్యుల వారి 'శాత్తుమొర' ఏకాంత సేవ, అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారికి సుగంధ భరితమైన 'పుష్పయాగం' సేవ
ప్రపంచ కప్ కల నెరవేరక.. కన్నీళ్లతో కెరీర్ ముగించిన 5గురు ఫుట్బాల్ దిగ్గజాలు వీరే..!
Secunderabad, Telangana:FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026లో బ్రెజిలియన్ స్టార్ నెయ్ మార్, పోర్చుగీస్ హీర్ క్రిస్టియానో రోనాల్డోల ప్రపంచ కప్ కలలు కన్నీళ్లతో ముగిసాయి. దీంతో ఫుట్ బాల్ హిస్టరీలో ఒక్క ట్రోఫీని కూడా గెలవని ఐదుగురు గొప్ప ఆటగాళ్ల ఎవరన్న చర్చి ఇప్పుడు మళ్లీ మొదలైంది. దగ్గరకు వచ్చి దాహాన్ని తీర్చుకోలేని ఆ ఐదుగురు దిగ్గజాలు ఎవరో చూద్దాం.
1. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)
ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏలిన ఇద్దరు వ్యక్తుల్లో క్రిస్టియానో రొనాల్డూ ఒకరు. ఐదు వేర్వేరు ప్రపంచ కప్లలో గోల్ చేసిన ఏకైక ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. యూరో కప్, పలు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలు.. ప్రతిష్టాత్మకమైన బాలన్ డి ఓర్ అవార్డును ఐదుసార్లు గెలుచుకున్నాడు. అయితే.. పోర్చుగల్ను ఒక్క ప్రపంచ కప్కు కూడా నడిపించలేకపోయాడన్న అపవాదును మూటగట్టుకున్నాడు. నాకౌట్ మ్యాచ్లో స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓడిపోయిన తర్వాత, రొనాల్డో కన్నీళ్లతో మైదానం వీడటం చూసి ప్రతి ఫుట్బాల్ అభిమాని గుండె పగిలిపోయింది. బహుశా ఇదే అతని చివరి ప్రపంచ కప్ కావడంతో.. రొనాల్డో ప్రపంచ కప్ కల శాశ్వతంగా చెదిరిపోయిందనే చెప్పాలి.
2. నెయ్మార్ జూనియర్ (బ్రెజిల్)
బ్రెజిల్ గర్వించదగిన అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాడు నెయ్మార్. బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఈయన పేరిట ఉంది. ప్రతి ప్రపంచ కప్లో బ్రెజిల్ను ఫేవరెట్గా నిలపడంలో నెయ్మార్ కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. కానీ గాయాల రూపంలో దురదృష్టం అతన్ని వెంటాడింది. ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. క్వార్టర్ ఫైనల్స్ , సెమీఫైనల్స్ దాటలేకపోయాడు. బ్రెజిల్ ట్రోఫీని గెలవలేకపోయింది. చివరికి నెయ్మార్ తన ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోక కన్నీళ్లతో వీడ్కోలు పలకాల్సి వచ్చింది.
3. జోహన్ క్రూయిఫ్ (నెదర్లాండ్స్)
జోహన్ క్రూయిఫ్ ఫుట్బాల్ చరిత్రను మార్చిన ఒక మేధావి అని చెప్పాలి. ఆధునిక ఫుట్బాల్లో ఉపయోగించే టోటల్ ఫుట్బాల్ పద్ధతికి ఆయనే పితామహుడు అని చెబుతుంటారు. మూడుసార్లు బ్యాలన్ డి ఓర్ విజేత అయిన ఈ డచ్ దిగ్గజం.. 1974 ప్రపంచ కప్లో నెదర్లాండ్స్ను ఒంటరిగా ఫైనల్కు నడిపించాడు. కానీ వారు ఫైనల్లో పశ్చిమ జర్మనీ చేతిలో ఓడిపోయారు. జోహన్ క్రూయిఫ్ ఎన్నడూ ప్రపంచ కప్ గెలవనప్పటికీ... ప్రపంచ కప్ గెలిచిన జట్ల కంటే ఫేమస్ అయ్యాడు.
4. ఫ్రాంక్ పుస్కాస్ (హంగేరీ)
1950లలో హంగేరీని ప్రపంచంలోనే అత్యంత బలమైన జట్టుగా తీర్చిదిద్దిన ఘనత ఫ్రాంక్ పుస్కాస్కు దక్కుతుందని చెప్పాలి. ఎందుకంటే.. అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక గోల్స్ చేసిన రికార్డు ఈయన పేరుమీదే నమోదు అయ్యింది. 1954 ప్రపంచ కప్లో హంగేరీని ఫైనల్కు నడిపించాడు. జర్మనీతో జరిగిన ఫైనల్లో ఆరంభంలోనే గోల్ చేసినప్పటికీ, హంగేరీ చివరికి ఓడిపోయింది. ఇలా ఒక గొప్ప తరం ఆటగాళ్లు ప్రపంచ కప్ను కోల్పోయారని చెప్పాలి.
5. పాలో మాల్డిని (ఇటలీ)
ఫుట్బాల్ చరిత్రలో అత్యుత్తమ డిఫెండర్ అని అందరూ పిలిచే పేరు ఒక్కటే పాలో మాల్డిని. ఇటాలియన్ జట్టు తరపున నాలుగు ప్రపంచ కప్లలో ఆడాడు. అద్భుతమైన రక్షణ అతన్ని ప్రత్యర్థి జట్లకు పీడకలగా మార్చింది. 1994 ప్రపంచ కప్ ఫైనల్కు ఇటలీని నడిపించినప్పటికీ, వారు పెనాల్టీ షూటౌట్లో బ్రెజిల్ చేతిలో ఓడిపోయారు. ఏసీ మిలాన్కు అన్నీ గెలిపించిన మాల్డిని, ఇటలీకి ప్రపంచ కప్ గెలిపించలేకపోయాననే విచారంతో తన కెరీర్ను ముగించాడు.
Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్లో భారత్కు చెందినవి కూడా..!!
Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో
Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Xiaomi 18 Pro Max: లీకైన షావోమి సరికొత్త ఫ్లాగ్షిప్ ఫీచర్స్.. కెమెరా మామూలుగా లేదుగా!
Hyderabad, Telangana:Xiaomi 18 Pro Max Leak: స్మార్ట్ఫోన్ చరిత్రలో సరికొత్త విప్లవానికి చైనా దిగ్గజం షావోమి (Xiaomi) శ్రీకారం చుట్టబోతోంది. గత ఏడాది మార్కెట్లోకి విడుదలైన షావోమి 17 సిరీస్ విజయవంతం కావడంతో.. ఇప్పుడు మార్కెట్లోకి షావోమి 18 సిరీస్ను తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తూ వస్తోంది.. ఈ సిరీస్లో అత్యంత ప్రీమియం మోడల్గా షావోమి 18 ప్రో మాక్స్ (Xiaomi 18 Pro Max) స్మార్ట్ఫోన్ ఉండబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన అనేక ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ లీక్స్ టెక్ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ట్విట్టర్లో లీకైన వివరాలు..
ప్రముఖ చైనా మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ వైబో (Weibo)లో ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ వివరాలను వెల్లడించారు. షావోమి 18 ప్రో మాక్స్ ఇంజనీరింగ్ ప్రొటోటైప్ (Engineering Prototype) ఆధారంగా ఈ ఫోన్ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. లీక్ అయిన వివరాలను బట్టి చూస్తే, ఇది ఎంతో అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
డ్యుయల్ 200 మెగాపిక్సెల్స్ కెమెరాలు..
ఈ స్మార్ట్ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని కెమెరా సెటప్.. లీకైన వివరాల ప్రకారం.. షావోమి 18 ప్రో మాక్స్ వెనుక భాగంలో డ్యుయల్ 200 మెగాపిక్సెల్ కెమెరాలను అందించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 200 MP ప్రధాన కెమెరాలో లేటరల్ ఓవర్ఫ్లో ఇంటిగ్రేషన్ కెపాసిటర్ (LOFIC) టెక్నాలజీని కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. ఇది తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన, అత్యంత స్పష్టమైన ఫోటోలను క్యాప్చర్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుందని కంపెనీ తెలిపింది..
టెలిఫోటో కెమెరా..
ఈ వెనక భాగం కెమెరాలోని రెండవది కూడా 200 MP టెలిఫోటో కెమెరా కావడం విశేషం.. ఇది మాక్రో ఫోటోగ్రఫీ (Macro Photography)కి కూడా సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల ఎక్కడో ఉన్న వస్తువులను కూడా వస్తువులను, ముఖ్యంగా అత్యంత సూక్ష్మమైన సబ్జెట్ను అత్యంత అద్భుతంగా ఫోటోలను తీస్తుంది.. దీంతో పాటు అద్భుతమైన కెమెరా బ్రాండ్ లైకా (Leica) భాగస్వామ్యంతో ఈ కెమెరాల ట్యూనింగ్ ఉండబోతోందని కంపెనీ వెల్లడించింది..
భారీ బ్యాటరీ.. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్..
సాధారణంగా ఫ్లాగ్షిప్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో కంపెనీ ఏకంగా 8,500 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద బ్యాటరీని వేగంగా చార్జ్ చేయడం కోసం 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్తో పాటు 50W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చారు.
డిస్ప్లేతో పాటు ప్రాసెసర్ వివరాలు..
షావోమి 18 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్ 6.9-అంగుళాల భారీ 2K OLED డిస్ప్లేతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది వినియోగదారులకు బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుంది.. అలాగే ఈ సిరీస్లోని ప్రో (Pro) మోడల్లో క్వాల్కామ్ అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 6 చిప్సెట్ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రో మాక్స్ వెర్షన్లో కూడా ఇదే రేంజ్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Saturn Transit 2026: అక్టోబర్ వరకు ఈ 3 రాశుల వారికి కష్టాల కాలం.. భారీ ఆర్థిక నష్టాలు!
Hyderabad, Telangana:Saturn Transit 2026 Effect On Zodiac: నవగ్రహాలలో శని గ్రహం అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహంగా భావిస్తారు . శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచార దశలో కొనసాగుతూ ఉంటాడు. అయితే, ఈ సమయంలో ఆయన అనేకసార్లు నక్షత్ర సంచారం చూస్తూ ఉంటాడు.. న్యాయదేవుడైన శని భగవానుడు జూలై 2న రేవతి నక్షత్రంలోని మొదటి పాదం నుండి రెండవ పాదంలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఆయన అక్టోబర్ 9 వరకు కొనసాగనున్నాడు.
రేవతి నక్షత్రానికి అధిపతి బుధ గ్రహం.. రేవతి నక్షత్రం రెండవ పాదంలో ఉన్న సమయంలోనే.. జూలై 27న శని రివర్స్ మూవ్మెంట్ చేయబోతోంది. ఆ తర్వాత ఆగస్టు 20న తిరిగి రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని గ్రహం రాశి లేదా నక్షత్రాన్ని సంచారం చేసినప్పుడల్లా.. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. అయితే, అక్టోబర్ వరకు శని దేవుని ఆగ్రహానికి గురై.. తీవ్ర నష్టాలను చవిచూడబోయే ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి శని నక్షత్ర సంచారం అత్యంత కష్టదాయకంగా ఉండబోతోంది. శని ప్రభావం వల్ల ఈ సమయంలో ధన సంబంధిత విషయాలలో తీవ్ర నిరాశ ఎదురవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇది మీ మానసికతో పాటు శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇంట్లో సుఖశాంతులు కూడా తగ్గిపోతోంది. ఏ పనిలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
మిథున రాశి (Gemini)
మిథున రాశిలో జన్మించిన వారిపై కూడా శని ప్రభావం పడుతుంది. ఈ కాలంలో తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పని భారం పెరగడం వల్ల శారీరకంగా.. మానసికంగా తీవ్ర అసంతృప్తి, అలసట పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల చేతిలో డబ్బు ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారు అక్టోబర్ వరకు ఆర్థిక విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.. అనవసరపు ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం కూడా ఉంది.. కుటుంబ సంబంధాలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం మంచిది.. లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల కూడా నిర్లక్ష్యం వహించవదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
బెంగళూరు, చెన్నైలను వెనక్కి నెట్టి.. హైదరాబాద్ సరికొత్త రికార్డు.. ఇళ్లపై భాగ్యనగర వాసుల క్రేజ్ చూశారా?
Secunderabad, Telangana:Hyderabad Luxury real estate: దక్షిణ భారతదేశంలోని మూడు ప్రధాన నగరాల్లో అత్యంత విలాసవంతమైన గృహాల మార్కెట్ కొత్త శిఖరాలను చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, హైదరాబాద్, బెంగళూరు , చెన్నై నగరాల్లో రూ. 10 కోట్లు అంతకంటే ఎక్కువ ధర కలిగిన 811 విలాసవంతమైన గృహాలు అమ్ముడయ్యాయి. వీటి మొత్తం అమ్మకాల విలువ రూ. 11,246 కోట్లు. ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియల్టీ, సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్తంగా విడుదల చేసిన సదరన్ ఇండియా హై-ఎండ్ లగ్జరీ హౌసింగ్ అనే నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
అమ్మకాల చార్టులలో హైదరాబాద్ స్పష్టంగా అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క హైదరాబాద్లోనే రూ. 8,562 కోట్ల విలువైన 625 విలాసవంతమైన గృహాలు అమ్ముడయ్యాయి. హైదరాబాద్ తర్వాత, 128 అమ్మకాలతో బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా, దీని ద్వారా రూ. 1,957 కోట్ల టర్నోవర్ లభించింది. ఆ తర్వాతి స్థానంలో 58 అమ్మకాలతో చెన్నై నిలవగా, దీని ద్వారా రూ. 727 కోట్ల టర్నోవర్ లభించింది.
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో తక్కువ ధరలకే ఎక్కువ స్థలం అందుబాటులో ఉండటమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఉదాహరణకు.. మీరు హైదరాబాద్లో రూ.10 కోట్లకు సుమారు 6,210 చదరపు అడుగుల ఇంటిని కొనగలిగితే, అదే మొత్తానికి చెన్నైలో 4,290 చదరపు అడుగుల ఇంటిని, బెంగళూరులో కేవలం 3,930 చదరపు అడుగుల ఇంటిని మాత్రమే పొందగలరు. హైదరాబాద్లోని కోకాపేట్.. బెంగళూరులోని రాజనుకుంటే అల్ట్రా-ప్రీమియం ప్రాజెక్టులకు హాట్స్పాట్లుగా ఆవిర్భవించాయి.
ఈ నివేదికపై వ్యాఖ్యానిస్తూ, ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియల్టీ సీఈఓ అశ్విన్ చద్దా ఇలా అన్నారు.. దక్షిణ భారతదేశంలోని విలాసవంతమైన గృహాల మార్కెట్ మూడు విభిన్న నగర లక్షణాలతో అభివృద్ధి చెందుతోంది. అమ్మకాల పరిమాణం పరంగా హైదరాబాద్ ముందుండగా, బెంగళూరు వేగవంతమైన వృద్ధికి అవకాశం చూపిస్తోంది. మరోవైపు, చెన్నై తన పాత, జనాదరణ పొందిన ప్రీమియం ప్రాంతాలపై ఆధారపడి స్థిరంగా ఉందని తెలిపారు.
సీఆర్ఈ మ్యాట్రిక్స్ సహ-వ్యవస్థాపకుడు.. సీఈఓ అభిషేక్ కిరణ్ గుప్తా, ఈ రంగం ఒక మలుపుకు చేరుకుందని నమ్ముతున్నారు. హైదరాబాద్ మార్కెట్కు బలమైన పునాదులు ఉన్నాయని.. ఇది బెంగళూరులోని సాంప్రదాయ ఉన్నత-మధ్యతరగతి ప్రాంతాలకు మించి విస్తరిస్తోందని ఆయన అన్నారు. ప్రతి మార్కెట్కు ఒక ప్రత్యేకమైన పెట్టుబడి వ్యూహం అవసరమని ఆయన సూచించారు. ఈ నగరాలు ఐటీ, వ్యాపార కేంద్రాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు.. సంపన్న కొనుగోలుదారులు పెద్ద, విలాసవంతమైన గృహాల వైపు మొగ్గు చూపుతున్నారని నివేదిక స్పష్టంగా చూపిస్తుంది.
Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్లో భారత్కు చెందినవి కూడా..!!
Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో
Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Guru Aditya Rajayogam 2026: జూలై 16 నుండి ఈ 5 రాశుల వారికి తిరుగుండదు.. కాసుల వర్షమే!
Hyderabad, Telangana:Guru Aditya Rajayogam 2026 Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని మనందరికీ తెలుసు.. నవగ్రహాలకు రాజుగా పిలిచే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు విశేష యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే 2026 జూలై నెలలో ఒక అద్భుతమైన శుభ యోగం ఏర్పడబోతోంది.. అదే గురు ఆదిత్య రాజయోగం.. ఈ యోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవర్ఫుల్గా భావిస్తారు. ఈ అరుదైన యోగం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అపారమైన ధనలాభంతో పాటు సమాజంలో గౌరవమర్యాదలు విపరీతంగా పెరగుతాయి. ఆశించిన ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ శక్తివంతమైన యోగం ప్రభావంతో ఏయే రాశులవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత కాలమానం ప్రకారం.. 2026 జూలై 16వ తేదీ ఉదయం 11:44 గంటలకు సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.. ఈ రాశిలో ఇప్పటికే జ్ఞానంతో పాటు సుఖం, అదృష్టానికి సూచికగా భావించే గురు గ్రహం సంచార దశలో కొనసాగుతూ ఉన్నాడు.. మిత్ర గ్రహాలుగా భావించే సూర్యుడితో పాటు బృహస్పతి కలయిక వల్ల ఈ సమయంలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడబోతోంది.. ఈ యోగం జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు దాదాపు నెల రోజుల పాటు క్రియాశీలకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని ప్రభావంతో ముఖ్యంగా ఐదు రాశుల వారికి అపారమైన అదృష్టం వరించబోతోంది..
విశేష లాభాలు పొందే ఆ 5 అదృష్ట రాశులు:
మేష రాశి (Aries)
గురు ఆదిత్య రాజయోగం వల్ల మేష రాశివారికి నాలగవ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల కెరీర్ పరంగా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనేక మార్పులు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో చేసే ప్రయాణాలు లాభసాటిగా కూడా మారుతాయి.. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ఆర్డర్లు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగం నుంచి విశేష ప్రయోజనాలు కూడా ఊహించని స్థాయిలో పొందుతారు. ఆర్థిక పరిస్థితి చాలా స్థిరంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి ఈ సంచారం వల్ల కెరీర్లో అత్యున్నత అవకాశాలు కూడా బోలెడు లభిస్తాయి. వ్యాపారాల్లో లేదా ఆఫీసులో కష్టపడి పనులు చేసేవారికి ఊహించని స్థాయిలో పదవులు లభించే అవకాశాలు కూడా లభిస్తున్నాయి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే.. వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయంగా మారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో ఒక విశేషమైన శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది.
కర్కాటక రాశి (Cancer)
సూర్యుడు కర్కాటక రాశిలోనే సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి లగ్న స్థానంలోనే ఈ రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి.. ఉద్యోగులు చేసేవారికి ప్రమోషన్లతో పాటు వేతన పెంపు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడం వల్ల అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి కాలం క్రమంగా అనుకూలంగా మారుతుంది.. కుటుంబంతో పాటు ఉద్యోగ రంగం రెండింటిలోనూ అదృష్టం తోడు ఉండబోతోంది.. ఉద్యోగ మార్పు లేదా బదిలీ కోసం చూస్తున్నవారికి ఈ
సమయం ఎంతో అనుకూలమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యాపారంలో అమ్మకాలతో పాటు లాభాలు పెరుగుతాయి. అయితే, కోపం, అహంకారాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
తులా రాశి (Libra)
సూర్య-బృహస్పతుల కలయిక కారణంగా తులా రాశి వారికి అద్భుతమైన సమయంగా భావించవచ్చు. వీరికి నాయకత్వ సామర్థ్యంతో పాటు ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది.. కార్యాలయంలో వీరి శ్రమకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది.. ముఖ్యంగా కొంతమంది ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవంతో పాటు హోదా గణనీయంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
26 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయిన ముడి చమురు ధరలు.. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 3 నుంచి రూ. 5 తగ్గే ఛాన్స్..!!
Secunderabad, Telangana:Petrol Diesel Price: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరతకు దారితీశాయి. ఈ సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం నుంచి భారత్ కూడా తప్పించుకోలేకపోయింది. దేశంలో పెట్రోల్, డీజీల్, వంటగ్యాస్ ధరలను భారీగా పెంచాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సామాన్యులు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. యుద్ధ వాతావరణ పరిస్థితులు ముగిసాయి. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందానికి వచ్చాయి. ప్రపంచ పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ముడి చమురు ధరలు కూడా భారీగా తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 72 డాలర్లుగా ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియా, ఆగస్టు నెలకు ఆసియా వినియోగదారుల కోసం ముడి చమురు ధరలను చారిత్రాత్మకంగా తగ్గించినట్లు ప్రకటించింది. గత 26 ఏళ్లలో ఇదే అతిపెద్ద తగ్గింపు అని చెప్పాలి. ముడి చమురు ధరలలో ఈ రికార్డు స్థాయి తగ్గుదల భారతదేశానికి ఒక ముఖ్యమైన వరమని చెప్పాలి. దీనితో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గుతాయనే ఆశలు పెరుగుతున్నాయి.
11 డాలర్లు తగ్గించిన అరబ్ లైట్:
ఇటీవలి బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు దిగ్గజం, సౌదీ అరామ్కో, ఆగస్టు నుండి ఆసియాకు తన ప్రధాన ఉత్పత్తి అయిన అరబ్ లైట్ క్రూడ్ ధరను బ్యారెల్కు భారీగా 11డాలర్లు తగ్గించాలని నిర్ణయించింది. గత 26 సంవత్సరాలలో సౌదీ అరేబియా ఆసియా దేశాలకు అందించిన అతిపెద్ద తగ్గింపు ఇదే అవడం గమనార్హం. ఈ గణనీయమైన తగ్గింపు తరువాత.. ప్రాంతీయ బెంచ్మార్క్ తో పోలిస్తే అరబ్ లైట్ క్రూడ్ ఇప్పుడు బ్యారెల్కు 1.50డాలర్ల ప్రత్యక్ష తగ్గింపుతో లభిస్తుంది. భారత్ తన మొత్తం చమురు అవసరాలలో భారీ మొత్తాన్నిసౌదీ అరేబియా నుండి కొనుగోలు చేస్తున్నందున.. ఇది భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఒక ముఖ్యమైన ఉపశమనమని చెప్పాలి. జూన్ మధ్య నుండి ప్రపంచ ముడి చమురు ధరలు నిలకడగా తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ధరలు ఇప్పుడు బ్యారెల్కు సుమారు 72డాలర్లకు పడిపోయాయి.
ధరలు ఎందుకు తగ్గాయి?
ముడి చమురు ధరలలో ఈ ఆకస్మిక తగ్గుదలకు అతిపెద్ద కారణం అమెరికా, ఇరాన్ల మధ్య జరిగిన కాల్పుల విరమణ అని చెప్పాలి. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం ముగిసిన తరువాత, సముద్ర వాణిజ్యానికి కీలకమైనదిగా భావించే హోర్ముజ్ జలసంధి, నౌకాయానానికి పూర్తిగా తిరిగి తెరుచుకుంది. యుద్ధ సమయంలో, ఈ మార్గం వాస్తవంగా మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో నౌకలు సుదీర్ఘ మార్గాలను అనుసరించవలసి వచ్చింది. హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో, సౌదీ అరామ్కో తన ప్రధాన రాస్ తానూరా ఓడరేవు నుండి ముడి చమురు రవాణాను వేగంగా పెంచింది. ఇది యుద్ధానికి ముందు స్థాయిలలో 90శాతానికి చేరుకుంది.
హోర్ముజ్ జలసంధి మూసివేసినప్పుడు కంపెనీ తన సరుకును ఎర్ర సముద్రంలోని యాన్బు ఓడరేవు ద్వారా మళ్లించవలసి వచ్చింది. దీనివల్ల రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు, చమురు సరఫరాలు సాధారణ స్థితికి రావడం.. మధ్యప్రాచ్యం నుండి చమురు ప్రవాహం పెరగడంతో, భారతదేశం వంటి ఆసియా రిఫైనరీలకు వివిధ రకాల సరసమైన చమురు ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి.
ఒపెక్+ దేశాలు ఉత్పత్తిని పెంచనున్నాయి:
సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలోని ప్రధాన చమురు ఉత్పాదక దేశాల సంస్థ అయిన ఒపెక్+, ఆగస్టు నెలకు చమురు ఉత్పత్తి కోటాలను గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో, ప్రధాన హోర్ముజ్ జలసంధి మూసివేసినప్పుడు.. సకాలంలో సరఫరా అంతరాయాల కారణంగా ఈ ఉత్పత్తి పెరుగుదల మార్కెట్పై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఇప్పుడు మార్గం స్పష్టంగా ఉండటంతో, సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి శక్తివంతమైన చమురు ఉత్పాదక దేశాలు తమ పెరిగిన కోటాలను పూర్తిగా వినియోగించుకుంటూ, ప్రపంచ మార్కెట్లోకి భారీగా చమురును విడుదల చేస్తున్నాయి. మార్కెట్లో ముడి చమురు ఈ విధంగా విరివిగా లభించడం ధరలు క్రమంగా తగ్గడానికి దారితీసింది. ఒకవేళ ముడి చమురు ధరలు దీర్ఘకాలం పాటు 72 డాలర్ల వద్ద లేదా అంతకంటే తక్కువగా ఉంటే, భారతీయ చమురు కంపెనీల లాభాలు గణనీయంగా పెరుగుతాయని.. ఆ తర్వాత వారు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను రూ. 3 నుండి రూ. 5 వరకు తగ్గించడం ద్వారా ఈ ప్రత్యక్ష ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించగలరని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్లో భారత్కు చెందినవి కూడా..!!
Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో
Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ప్రకటన.. 'అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాం!'
Hyderabad, Telangana:Kannepalli Pumphouse: 'కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాం. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ప్రకటన చేశారు. 'కన్నెపల్లి పంప్హౌస్లో మోటార్లు ప్రారంభం చేసి 150 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ కుట్ర, మోసాన్ని తెలంగాణ రైతులు గమనిస్తున్నారు' అని తెలిపారు. చేతగాకపోతే మాకు అప్పగించండి.. వారం రోజుల పాటు కేసీఆర్కు అప్పగిస్తే మొత్తం నీరు పారించి చూపుతాం' అని కాంగ్రెస్కు సవాల్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నట్లు ఏమైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని మరోసారి ప్రకటించారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ అడిగినా.. మంత్రివర్గం అడిగినా తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్ అండర్ టేకింగ్ ఇస్తారని తెలిపారు. 'చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆడుతున్న నాటకం మాత్రమే. ఎన్డీఎస్ఏకు ఏ మాత్రం సంబంధం లేదు' అని స్పష్టం చేశారు. 'ఎస్ఎల్బీసీ విషయంలో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ జైలుకు పోవాలి. ఏడాది నుంచి మోటార్లను కనీసం ప్రారంభం చేయలేదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు' అని విమర్శించారు.
'మంత్రులు తెలంగాణ ఆత్మను కోల్పోయారు. శ్రీధర్ బాబు లాంటి వాళ్లు కూడా పదవీ భయంతో రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు' అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భూములను కాపాడేందుకు కన్నేపల్లి సిద్ధంగా ఉందని కేటీఆర్ అందరికీ కళ్లకు కట్టినట్లు చూపారని గుర్తుచేశారు. 'నలుగురు మంత్రులు మళ్లీ సొల్లు పురాణం తప్ప తెలంగాణ సోయితో మాట్లాడలేదు. రూ.లక్ష కాదు పది రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయారు. ప్రభుత్వం వేసిన కమిషన్ ను కోర్టు చెత్త బుట్టలో పడేసింది' అని వివరించారు.
'ఎల్నినో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన ఉద్దేశం ఇదే. ఎటువంటి కరువు నచ్చినా ప్రజలను బతికించడానికి ప్రాణహిత ఉపయోగపడుతుంది' అని కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి వివరించారు. 'బ్యారేజీల నుంచి ఇసుక తవ్వి వేల కోట్లు దండుకుంటున్నారు. విద్యుత్ బిల్లులకు భయపడి రైతుల పంట కొనాల్సి వస్తుందని, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం పంపులు నడపడం లేదు' అని ఆరోపించారు. ప్రజలకు అన్ని విషయాలు అర్థం అవుతున్నాయని.. సమయం వచ్చినపుడు తగిన నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
ప్రశ్నించే గొంతు నొక్కే కుట్రను వైస్సార్సీపీ సహించదు.. న్యాయ పోరాటం చేస్తాం: అంబటి రాంబాబు
Guntur, Andhra Pradesh:Ambati Rambabu vs Chandrababu: 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేసే కుట్ర జరుగుతోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై చట్టవ్యతిరేకంగా దౌర్జన్యకాండ కొనసాగుతోంది' అని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై వరుసగా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. అన్యాయంగా, అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచి వైఎస్సార్సీపీ న్యాయపరమైన పోరాటం చేస్తుందని ప్రకటించారు.
గుంటూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తూ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్, తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్పై వరుసగా కేసులు పెట్టి అరెస్టులు చేయడం చట్టవిరుద్ధం అని స్పష్టం చేశారు. తప్పు చేస్తే కోర్టులో నిరూపించాలి తప్ప.. కేసుల మీద కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
ప్రశ్న రావణ్కు పలుమార్లు బెయిల్ వచ్చినా మళ్లీ మళ్లీ అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు. రిమాండ్ ఇవ్వని కోర్టులను దాటేందుకు ఉగ్రవాద నిరోధక చట్టమైన ఉపాను ఒక యూట్యూబర్పై ప్రయోగించడం న్యాయ వ్యవస్థకే సవాల్ అని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకపోయినా అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ తాము అండగా నిలుస్తామని ప్రకటించారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ వేధింపుల కోసం చట్టాలను దుర్వినియోగం చేయడం సరికాదని కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు.
బాధితులనే నిందితులుగా మార్చే ఈ ధోరణిని వైఎస్సార్సీపీ సహించదని.. అందుకే ఎవరికి అన్యాయం జరిగినా పార్టీలకు అతీతంగా వారి తరపున పోరాడతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. తన ఇంటిపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 29న డీజీపీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందిస్తానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రతి చర్యను ప్రజల తరపున వైయస్సార్సీపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని సీనియర్ నాయకులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
