ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జెండా ఎగురావేసిన బండారి శేఖర్
Karimnagar, Telangana:కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ లో ఘనంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జెండాను కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నాడు స్వాతంత్రోద్యమాన్ని ఎంతోగాను ముందుకు తీసుకువెళ్లిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1939 వ సంవత్సరంలో ఆనాడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడం జరిగిందని తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
ఏపీలో పాలన గాలికెగిరిపోయింది.. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా స్కామ్లే: వైఎస్ జగన్
Tadepalli, Andhra Pradesh:YSR Congress Party: ఆంధ్రప్రదేశ్లో పాలన గాలికి ఎగిరిపోయిందని.. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. 'డీఎస్సీ కుంభకోణం, టీచర్లకు టెట్, ప్రశ్నిస్తే వేధింపులు. అక్రమ కేసులు, అరెస్టులు, సంక్షోభంలో వ్యవసాయం. కష్టాల్లో ఆక్వా రైతులు, సమస్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు. విపరీతంగా అప్పులు. రాష్ట్రం అప్పులకుప్ప' అని కూటమి పాలన వైఫల్యాలు మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వీటన్నింటినీ పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా వినిపించాలని ఎంపీలకు సూచించారు.
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈనెల 20వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో ఎంపీలతో కలిసి పార్టీ అధినేత వైఎస్ జగన్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అని.. వాటి కోసం గళం విప్పాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మద్దతు ఇచ్చామని.. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నట్లు తెలిపారు.
'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్సీ 2025 పోస్టుల భర్తీలో పెద్ద కుంభకోణం చోటుచేసుకుంది. పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? ఇంకా డీఎస్సీ పరీక్ష పేపర్ల లీక్పైనా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయి' అని చంద్రబాబు పాలనలో తప్పిదాలను సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు.
ఏపీలో అంతులేని అవినీతి పర్వం సాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రంలో ఇష్టాను సారంగా భూముల పందేరం జరుగుతోందని.. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోందని.. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవని.. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపణలు చేశారు.
'ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న.. ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరి మీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు' అని కూటమి పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టెట్ రూపంలో టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టెట్ రాకముందు నుంచి టీచర్లుగా పని చేస్తున్న వారికి ఇప్పుడు టెట్ తప్పనిసరి చేయడం సరికాదు' అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారని.. ప్రైవేటు పేరుతో ఎక్కడిక్కడ దోచిపెడుతున్నారని చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం అని మండిపడ్డారు. 'దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం అతి దారుణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏమిటి? రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1,500 కోట్లకు ఇవ్వడం కుంభకోణం కాదా?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు.
'ఇష్టానుసారంగా భూముల కేటాయింపులు చేస్తున్నారు. ఇసుక, మద్యం, గనులు దేన్నీ వదలకుండా దోపిడీ చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది' చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. అడ్డగోలుగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తోందని.. అప్పుల్లో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో ఏకంగా రూ.3.6 లక్షల కోట్ల మేర అప్పు చేశారని.. పరిమితి లేకుండా విపరీతంగా అప్పు చేస్తున్నారని వివరించారు.ఔ
ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తున్నా.. ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు చేసింది శూన్యం అని చంద్రబాబు పాలనను మాజీ సీఎం వైఎస్ జగన్ తీసి పడేశారు. సిండికేట్ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాలని.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు మేడా రఘునాథ్రెడ్డి, గొల్ల బాబూరావు, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, గురుమూర్తి, వైఎస్ అవినాష్రెడ్డి, గుమ్మా తనూజారాణి పాల్గొనగా.. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు.
తల్లికి వందనం నిధులు జూలై 22న విడుదల.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 13,000 జమ!
Hyderabad, Telangana:Thalliki Vandanam Release on July 22: తల్లికి వందనం పథకం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, పేరెంట్స్కు ప్రభుత్వం ఒక మంచి వార్త అందించింది. జులై 22వ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.13,000 చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే మరో రూ.2,000 పాఠశాల నిర్వహణ నిధి కోసం స్కూల్ ఖాతాలో జమ చేస్తారు. దీనివల్ల మొత్తం 67,47,190 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. తల్లికి వందనం పథకం ద్వారా మొత్తం 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో రూ. 1,0120.78 కోట్లు జమ చేయనున్నట్లు ప్రభుత్వం వివరించింది.
కాంగ్రెస్ పాలన అంతా స్కాముల మయంగా మారింది: హరీశ్ రావు
Hyderabad, Telangana:Congress Scams: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. 'బొగ్గు సరఫరాలో వైఫల్యం. నీటి నిల్వల నిర్వహణలో వైఫల్యం. విద్యుత్ కేంద్రాల నిర్వహణలో వైఫల్యం' అని విమర్శించారు. 'బొగ్గులో స్కాం. పవర్లో స్కాం. సాండ్లో స్కాం. ల్యాండ్లో స్కాం. కాంగ్రెస్ పాలన అంతా స్కాములమయంగా మారింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రం మీద అసలు సోయి ఉందా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ విద్యుత్ వ్యవస్థపై కీలక విషయాలు వెల్లడించారు. 'రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రం అంధకారమయ్యే పరిస్థితి వచ్చింది. అప్రకటిత కరెంట్ కోతలతో రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు' అని వివరించారు.
'కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ పోతే వార్త.. ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త అనే పరిస్థితి నెలకొంది. ఈరోజు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో సబ్స్టేషన్ల ముందు రైతులు ధర్నాలు చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేకపోవడం వల్లే కరెంట్ కోతలు వస్తున్నాయి. సింగరేణి విషయంలో పీపీటీలు పెట్టి థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవని ముందే చెప్పాం. 40 లక్షల టన్నుల బొగ్గు ఉందని ప్రభుత్వం చెప్పింది.. వాస్తవానికి లేదని మేం హెచ్చరించాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ నిద్ర లేపినా కూడా రేవంత్ రెడ్డి నిద్రలేవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కాంగ్రెస్ తీరుతోనే విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్లలో 6 నుంచి 7 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవు. యాదాద్రి ప్లాంట్లో యూనిట్-1, యూనిట్-4లో బొగ్గు లేక ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి ప్లాంట్లో నిర్వహణ వైఫల్యంతో ఉత్పత్తి ఆగిపోయింది' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వివరించారు. అసలు విద్యుత్ కోతలు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డిని కోరారు.
'రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గి సరఫరా తగ్గింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు పెడుతున్నారు. నీటిని లిఫ్ట్ చేయలేదు.. రిజర్వాయర్లలో నీళ్లు నింపలేదు.. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని కూడా అసాధ్యం చేశారు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ఆలోచనతో అయినా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సజావుగా జరిగేలా చూడలేదని చెప్పారు. సాగునీటి సరఫరాలో ఫెయిల్ అయ్యారు.. విద్యుత్ సరఫరాలో కూడా ఫెయిల్ అయ్యారని రేవంత్ రెడ్డి వైఫల్యాలను వివరించారు.
'తెలంగాణకు మొత్తంగా 23 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉంది. అయినా ప్రస్తుతం కేవలం 3,190 మెగావాట్లే ఉత్పత్తి అవుతోంది. దీనికి కారణమేంటో ప్రభుత్వం చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు. 'అడ్డగోలు ధరలకు 80 మిలియన్ యూనిట్ల విద్యుత్ను పవర్ ఎక్స్ఛేంజ్లో కొనుగోలు చేస్తున్నారు. ఆ భారం వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలని ప్రశ్నిస్తున్నాం' అని నిలదీశారు. సింగరేణి వెబ్సైట్ మూసివేసి ఉత్పత్తి, సరఫరా, బొగ్గు నాణ్యత వివరాలు బయటకు రాకుండా చేశారని విమర్శించారు.
'నాణ్యమైన సింగరేణి బొగ్గును తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు పంపుతున్నారు. తెలంగాణకు మాత్రం లో-క్వాలిటీ బొగ్గు పంపిస్తున్నారు. 70 రేకులు పంపితే 30 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి. అందుకే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరగడం లేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. రాష్ట్ర అవసరాలు, రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎందుకు పంపిస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని రేవంత్ రెడ్డిని కోరారు. 'బొగ్గు ఉండి కూడా అడ్డగోలు ధరలకు పవర్ ఎక్స్ఛేంజ్లో విద్యుత్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారో సమాధానం చెప్పాలి' అని నిలదీశారు. ఎందుకు కేవలం 44 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
'బీఆర్ఎస్ పార్టీ హయాంలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గుండెలపై చేయి వేసుకొని కంటి నిండా నిద్రపోయిన రైతులకు ఇప్పుడు కునుకు కరువైందని వివరించారు. లోవోల్టేజ్, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం వంటి సమస్యలతో రైతులు సతమతమవుతున్నారని వివరించారు.
తిరుమలలో మాజీ ఉప ముఖ్యమంత్రికి అవమానం.. టీటీడీపై నారాయణ స్వామి తీవ్ర ఆరోపణలు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Temple: తిరుమల శ్రీవారి దర్శన వ్యవస్థపై వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు తిరుమల ఆలయంలో అవమానం జరిగిందని తెలిపారు. తనకు ప్రోటోకాల్ దర్శనం ఇవ్వాల్సి ఉండగా.. సాధారణ దర్శనానికి పంపించారని వివరించారు. ఇది తనను అవమానించినట్లేనని చెప్పారు ఇలా వ్యవహారించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారిని గురువారం నారాయణ స్వామి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. 'దేవుడి దగ్గర అందరూ సమానమే. కానీ భక్తులతో మానవత్వం లేకుండా వ్యవహరించడం బాధాకరం' అని తెలిపారు. తనకు ప్రొటోకాల్ ఉన్నప్పటికీ సాధారణ దర్శనం ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఇది అవమానంగా భావిస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు.
ఈ సందర్భంగా టీటీడీ తీరుపై నారాయణ స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలిపారు. 'తిరుమలలో పూర్తిగా వీఐపీ దర్శనాలను తొలగించి సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు ఎవరినీ అవమానించే పరిస్థితులు ఉండవు' అని చెప్పారు.
ప్రముఖుల దర్శనం
తిరుమల శ్రీవారి ఆలయానికి పలువురు ప్రముఖులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, ఎంపీ కృష్ణ ప్రసాద్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కరీంనగర్ సివిల్ సప్లైస్లో భారీ స్కామ్.. రూ.182 కోట్ల కుంభకోణం..
Karimnagar, Telangana:Karimnagar Civil Supplies Scam: కరీంనగర్ జిల్లా సివిల్ సప్లైస్ శాఖలో ఊహించని రీతిలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. పేదల ఆకలి తీర్చాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కేటాయింపుల్లో వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఒక్కసారిగా అధికారులు షాక్ అయిపోతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారమే.. ఈ కుంభకోణం విలువ దాదాపు రూ.182 కోట్లుగా తేలడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి.. బాధ్యులపై ఉక్కుపాదం మోపుతోంది.
రైస్ మిల్లర్ల మాయాజాలం..
ప్రభుత్వం మిల్లింగ్ కోసం కేటాయించిన ధాన్యాన్ని సకాలంలో బియ్యంగా మార్చి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు అప్పగించడంలో కొందరు రైస్ మిల్లర్లు తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి.. కోట్లాది రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు విచారణలో తేలింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన అధికారులకు మిల్లుల్లో ఉండాల్సిన నిల్వలు కనిపించకపోవడంతో అధికారులు షాక్కు గురయ్యారు.
రంగంలోకి సర్కార్..
ఈ భారీ స్కామ్ బయటపడటంతో తెలంగాణ ప్రభుత్వం అత్యంత తీవ్రంగా స్పందించింది.. అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ కఠిన చర్యలు ప్రారంభించింది. నిబంధనలు ఉల్లంఘించి.. ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించిన 18 మంది రైస్ మిల్లర్లపై ఇప్పటికే అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్న ఒక ప్రధాన నిందితుడిపై ప్రభుత్వం అత్యంత కఠినమైన పీడీ యాక్ట్ (PD Act)ను ప్రయోగించింది. సకాలంలో బియ్యం అప్పగించకుండా మొండికేస్తున్న 38 రైస్ మిల్లులను అధికారులు డిఫాల్ట్ జాబితాలో చేర్చారు.
కొనసాగుతున్న విచారణ..
ప్రస్తుతం జరుగుతున్న చర్యలు కేవలం ఆరంభం మాత్రమేనని అధికారులు చెబుతూ వస్తున్నారు. ఈ భారీ కుంభకోణంలో నెట్వర్క్ చాలా పెద్దదని భావిస్తున్నారు. ప్రస్తుతం మరో 20 రైస్ మిల్లుల వ్యవహారంపై పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. వీటిలో కూడా భారీగా నిల్వలు మాయమైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే వీటికి సంబంధించిన పూర్తి నివేదిక రానుందని.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
రికవరీపై నజర్..
ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ఈ రూ.182 కోట్ల రికవరీపై సివిల్ సప్లైస్, రెవెన్యూ అధికారులు ముమ్మరంగా దృష్టి సారించారు. డిఫాల్ట్ అయిన మిల్లుల నుంచి రికవరీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైతే ఆస్తుల జప్తునకు కూడా వెనుకాడబోమని సమాచారం.. జిల్లా వ్యాప్తంగా అన్ని మిల్లుల్లోనూ అదనపు బృందాలతో తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. ఈ కుంభకోణం వెనుక అధికారుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ అంతర్గత విచారణ సాగుతోంది. ఈ స్కామ్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
బడ్జెట్ ధరలో ఫ్లాగ్షిప్ కిల్లర్.. దిమ్మతిరిగే ప్రాసెసర్తో Motorola Edge 70 Max వచ్చేసింది!
Hyderabad, Telangana:Motorola Edge 70 Max Launched: ప్రముఖ మోటోరోలా భారత మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ (Motorola Edge 70 Max)ను అధికారికంగా లాంచ్ చేసింది.. ఇది ఎంతో శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్తో పాటు భారీ బ్యాటరీ, అదిరిపోయే కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ప్రీమియం మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. జూలై 20 నుంచి ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్తో పాటు మోటోరోలా అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్కి సంబంధించిన విక్రయాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ధర, ఆఫర్ల వివరాలు..
భారత్లో మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ బేస్ వేరియంట్ (8GBర్యామ్, 256GB స్టోరేజ్) ధర రూ.54,999తో అందుబాటులో ఉండగా.. హై-ఎండ్ వేరియంట్ (12GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్) ధర రూ.59,999గా నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.. అయితే, లాంచ్ ఆఫర్ కింద బ్యాంక్ డిస్కౌంట్లు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ రూపంలో రూ.5,000 తక్షణ తగ్గింపు కూడా అందుబాటులో ఉండడం విశేషం. దీనివల్ల ఈ మొబైల్ ఎఫెక్టివ్ ప్రారంభ ధర రూ.49,999 నుంచే ప్రారంభమవుతుంది.. 18 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా లభిస్తోంది. ఇది పాంటోన్ ఆక్వా గ్రే, పాంటోన్ డార్క్ షాడోతో పాటు పాంటోన్ ఐస్ మెల్ట్ అనే మూడు అద్భుతమైన కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉంది..
స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 పవర్ఫుల్ ప్రాసెసర్..
ఈ మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్ స్మార్ట్ఫోన్ క్వాల్కామ్ సంబంధించిన అత్యంత శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 (Snapdragon 8 Gen 5) చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల సిపియు (CPU) పనితీరు 36 శాతం పెరగడమే కాకుండా.. గేమింగ్ ప్రియుల కోసం వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ను కూడా అందిస్తోంది.. దీనివల్ల భారీ గ్రాఫిక్స్ గేమ్లు ఆడినా ఫోన్ అస్సలు వేడెక్కదు.
7000 నిట్స్ బ్రైట్నెస్..
ఈ ఫోన్లో 6.8-ఇంచుల క్వాడ్ HD+ (2K) ఎక్స్ట్రీమ్ అమోలెడ్ (Extreme AMOLED) డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రీఫ్రెష్ రేట్కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్క్రీన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఏకంగా 7,000 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ను కలిగి ఉంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని ఉపయోగించారు.
50MP సూపర్ AI కెమెరా..
ఫోటోగ్రఫీ కోసం మోటోరోలా ఎడ్జ్ 70 మాక్స్లో అద్భుతమైన కెమెరా సెటప్ను కూడా అందిస్తోంది.. ఇందులో OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్తో కూడిన 50 మెగాపిక్సెల్ సోనీ లైటియా 710 (Sony LYTIA 710) ప్రధాన కెమెరాను కూడా అందించారు.. అంతేకాకుండా అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్తో పాటు మాక్రో లెన్స్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఇది 4K వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేస్తుంది. AI ఫోటో ఎన్హాన్స్మెంట్తో పాటు డైనమిక్ బోకె వంటి ఫీచర్లు ఫోటోలను ప్రొఫెషనల్గా మారుస్తాయని కంపెనీ తెలిపింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
భారీ 7,100mAh బ్యాటరీ..
మోటోరోలా చరిత్రలోనే అత్యంత భారీగా 7,100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని ఈ స్మార్ట్ఫోన్లో అందించడం విశేషం.. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 58 గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ హామి కూడా ఇస్తోంది.. దీనికి తోడు 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు ఈ విభాగంలోనే అత్యంత వేగవంతమైన 25W Qi2 మాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది.. అలాగే ఇందులో మోటోరోలా తన సరికొత్త క్రాస్-డివైస్ AI ప్లాట్ఫారమ్ Qiraను పరిచయం చేసింది. దీని ద్వారా యూజర్లు తమ స్మార్ట్ఫోన్ను లెనోవా పీసీలతో పాటు టాబ్లెట్లతో సులభంగా కనెక్ట్ చేసి మల్టీటాస్కింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
6500mAh బ్యాటరీతో Vivo T5 Lite 5G లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!
Hyderabad, Telangana:Vivo T5 Lite 5g Price In India: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Vivo వినియోగదారుల కోసం మరో అద్భుతమైన బడ్జెట్ 5G స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.. Vivo T5 Lite 44W 5G స్మార్ట్ఫోన్ పేరుతో విడుదలైంది. ఈ కొత్త మొబైల్, బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.. ముఖ్యంగా సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, ప్రీమియం పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లను టార్గెట్ చేస్తూ.. రూ.20 వేల లోపు బడ్జెట్లోనే అందుబాటులోకి తీసుకు వచ్చింది..
6500mAh మెగా బ్యాటరీ..
ఈ Vivo T5 Lite 44W 5G స్మార్ట్ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీగా భావించవచ్చు.. ఇందులో ఏకంగా 6500mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చింది.. సాధారణ వినియోగదారులకు ఇది రెండు రోజుల కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.. దీనికి తోడు, ఫోన్ను సులభంగా వేగంగా ఛార్జ్ చేయడానికి 44W ఫ్లాష్చార్జ్ (FlashCharge) సపోర్ట్ను కూడా అందించిన్నట్లు తెలుస్తోంది..
పవర్ఫుల్ ప్రాసెసర్..
విజువల్స్ పరంగా.. ఈ ఫోన్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ Vivo T5 Lite 5G స్మార్ట్ఫోన్లో 6.74-ఇంచుల HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్తో పాటు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తుంది. ఐ ప్రొటక్షన్ కోసం ఈ డిస్ప్లేకు TUV Rheinland సర్టిఫికేషన్ కూడా అందుబాటులో ఉంది.. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో అత్యంత పవర్ఫుల్ MediaTek Dimensity 6300 చిప్సెట్ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. ఇది మల్టీటాస్కింగ్, గేమింగ్కు ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6.0 ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తుంది. దీనిలో AI క్రియేషన్, AI క్యాప్షన్తో పాటు ప్రైవేట్ స్పేస్ వంటి చాలా ప్రత్యేకమైన AI ఫీచర్లు ఉన్నాయి.
50MP AI కెమెరా..
ఫోటోల విషయానికి వస్తే.. Vivo కెమెరా పరంగా ఎక్కడ వెనకడుగు వేయలేదని భావించవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాతో పాటు 0.8MP సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది.. ఇందులో చాలా ప్రత్యేమైన నైట్ మోడ్తో పాటు పోర్ట్రెయిట్ మోడ్ వంటి అడ్వాన్స్డ్ AI కెమెరా ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 5MP కెమెరాను అందించారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ..
ఈ ఫోన్ కేవలం ఫీచర్ల పరంగానే కాకుండా బలంగా కూడా ఉంటుందని కంపెనీ తెలిపింది.. దీనికి SGSతో పాటు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ను కంపెనీ అందించింది.. అలాగే ప్రొటక్షన్ కోసం IP65 రేటింగ్ అందించారు. ఈ ఫోన్లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ప్రింట్ స్కానర్తో పాటు బ్లూటూత్ 5.4, 3.5mm హెడ్ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది..
భారతదేశంలో Vivo T5 Lite 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది మొదటి స్టోరేజ్ 4GB ర్యామ్, 128GB వేరియంట్ ధర రూ. 19,999తో లభిస్తోంది. అంతేకాకుండా 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999తో అందుబాటులో ఉంది. ఇందులో మూడవ వేరియంట్ 6GB ర్యామ్ + 256GB స్టోరేజ్తో ధర రూ.25,999తో లభిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ లాంచ్ ఆఫర్స్లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.1,500 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
గృహజ్యోతి లబ్ధిదారులకు షాక్.. 4 లక్షల మందికి ఫ్రీ కరెంట్ కట్!
Hyderabad, Telangana:Telangana Gruha Jyothi Latest News: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే, NPDCL పరిధిలోని 18 జిల్లాల్లో గత జూన్ నెలలో ఎండల తీవ్రత లేదా ఇతర కారణాల వల్ల విద్యుత్ వినియోగం పెరిగిన్నట్లు తెలుస్తోంది.. 200 యూనిట్ల పరిమితి కంటే ఎక్కువ విద్యుత్ను వాడిన కారణంగా.. దాదాపు 4 లక్షల మంది వినియోగదారులు ఈ సారి గృహజ్యోతి పథకం లబ్ధిని కోల్పోయారు. వీరందరికీ జూన్ నెలలో సాధారణ బిల్లులు వచ్చాయని తెలుస్తోంది.
22.59 లక్షల మందికి జీరో బిల్లులు..
మరోవైపు.. నిబంధనల ప్రకారం, విద్యుత్ వినియోగించిన మెజారిటీ వినియోగదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే.. NPDCL పరిధిలో మొత్తం 26,54,851 మంది అర్హులైన లబ్ధిదారులు ఉండగా.. అందులో 22,59,602 మందికి జూన్ నెలలో 200 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగం నమోదైన్నట్లు తెలుస్తోంది. దీంతో వారందరికీ యథావిధిగా జీరో బిల్లులు వచ్చాయి. ఈ 22.59 లక్షల మంది వినియోగదారులకు సంబంధించి రూ.99.18 కోట్ల సబ్సిడీ భారాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించి.. డిస్కామ్లకు చెల్లించిన్నట్లు తెలుస్తోంది.
మూడు నెలల్లో రూ.2,354 కోట్ల సబ్సిడీ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ప్రజలకు లభించిన లబ్ధిపై అధికారులు గణాంకాలను విడుదల చేశారు. మార్చి నెల నుంచి జూన్ నెల వరకు గడిచిన కాలంలో NPDCL పరిధిలో మొత్తం 6,48,95,429 మందికి జీరో బిల్లులు అందాయి. ఈ మూడు, నాలుగు నెలల కాలంలో ప్రజలపై పైసా భారం పడకుండా ప్రభుత్వం ఏకంగా రూ.2354.77 కోట్ల భారీ సబ్సిడీని భరించింది.
ఇందులో భాగంగా వినియోగదారులు మొత్తం 5,384.04 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. ఇదిలా ఉంటే.. గృహజ్యోతి పథకం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ.. 200 యూనిట్ల పరిమితిని దాటకుండా జాగ్రత్తపడాలని.. అప్పుడే జీరో బిల్లుల ప్రయోజనం నిరంతరాయంగా అందుతుందని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ జీరో బిల్లుల కోల్పోయిన వారు మళ్లీ పొందుతారో? పొందరో? తెలంగాణ ప్రభుత్వమే వెల్లడించాల్సి ఉంటుంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
దిమ్మతిరిగే బ్యాటరీ.. Realme కొత్త 5G ఫోన్.. ఒక్క చార్జ్తో 3 రోజులు పక్కా!
Hyderabad, Telangana:Realme Narzo 100x 5g: ప్రముఖ చైనీ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme భారత మార్కెట్లోకి మరో సరికొత్త పవర్ఫుల్ మొబైల్ను విడుదల చేసింది. నార్జో సిరీస్లో భాగంగా అత్యంత భారీ బ్యాటరీతో కూడిన Realme Narzo 100x 5G స్మార్ట్ఫోన్ అధికారికంగా లాంచ్ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్లతో పాటు దిమ్మతిరిగే బ్యాటరీని కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలో లభించే ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అదిరిపోయే డిస్ప్లే..
ఈ స్మార్ట్ఫోన్ 6.6 అంగుళాల హెచ్డీ ప్లస్ (HD+) LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది.. ఇది 1570×720 పిక్సెల్స్ రెజల్యూషన్తో పాటు అత్యంత వేగవంతమైన 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది.. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ (MediaTek Dimensity 6300 5G) చిప్సెట్ను కలిగి ఉంటుంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్మి యూఐ 7.0 (Realme UI 7.0) ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది..
పవర్ఫుల్ బ్యాటరీ..
ఈ Realme Narzo 100x 5G ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీగా భావించవచ్చు. మార్కెట్లో మరే బడ్జెట్ ఫోన్లోనూ లేని విధంగా ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీని అందించారు. దీనికి తోడు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు నుంచి మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపునీ తెలిపింది..
అద్భుతమైన కెమెరా..
ఫొటోగ్రఫీ కోసం.. రియల్మి నార్జో 100ఎక్స్ 5జీ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. దీని ద్వారా అద్భుతమైన ఫొటోలు, వీడియోలు తీసుకునే అవకాశాన్ని అందిస్తోంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందిస్తోంది.. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లో ప్రొటక్షన్ కోసం IP65 రేటింగ్తో వస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ధరలు, వేరియంట్ల వివరాలు..
భారతదేశంలో ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 4GB రామ్తో పాటు 128GB స్టోరేజ్ ధర రూ.20,999లోపే లభిస్తోంది. ఇక రెండవది 6GB రామ్తో పాటు 128GB స్టోరేజ్తో ధర రూ.22,999, మూడవ వేరియంట్ 6GB రామ్తో పాటు 256GB స్టోరేజ్తో ధర రూ.24,999తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ఫ్లాష్ ఆరెంజ్ (Flash Orange), మిడ్నైట్ బ్లాక్ (Midnight Black) అనే రెండు రంగులలో అందుబాటులోకి వచ్చింది. జూలై 22 నుంచి రియల్మి అధికారిక వెబ్సైట్, ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon)లో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్స్లో భాగంగా కొనుగోలు చేస్తే..రూ.2,000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ.500 కూపన్ డిస్కౌంట్ లభించనున్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Redmi K100 సిరీస్.. ఫీచర్స్ లీక్!
Hyderabad, Telangana:Redmi K100 Series: స్మార్ట్ఫోన్ ప్రియులకు అదిరిపోయే వార్త.. ప్రముఖ చైనీస్ బ్రాండ్ Redmi మార్కెట్లోకి అద్బుతమైన ఫీచర్లతో కొత్త మొబైల్ సిరీస్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు కంపెనీ రెడ్మి K100 (Redmi K100) సిరీస్ను లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది. అంతేకాకుండా ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన లీక్స్ కూడా ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సిరీస్లోని హై-ఎండ్ మోడల్లో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీతో పాటు 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ వేబో (Weibo)లో టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ సిరీస్కు సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అద్భుతమైన డిస్ప్లే..
ఈ రెడ్మి K100 ప్రో లేదా K100 ప్రో మాక్స్ మోడల్లో డిస్ప్లే పరంగా భారీ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.. లీకైన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ ఫ్లాట్ డిస్ప్లేతో పాటు రౌండెడ్ కార్నర్స్ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. విజువల్స్ అత్యంత స్పష్టంగా.. స్మూత్గా ఉండటం కోసం దీనికి ఏకంగా 185 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ను అందిస్తున్నట్లు సమాచారం. గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఈ డిస్ప్లేలో అత్యాధునిక టెక్నాలజీని కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది..
200MP కెమెరా వివరాలు..
ఫోటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునేలా ఈ ఫోన్ వెనుక భాగంలో భారీ కెమెరా సెటప్ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (Periscope Telephoto Camera) కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. గత మోడల్ అయిన రెడ్మి K90 ప్రో మాక్స్లో కేవలం 50MP ప్రధాన కెమెరాతో పాటు 50MP కెమెరాలను అందించగా.. త్వరలో రాబోయే కొత్త మోడల్లో 200MP కెమెరాను అందుబాటులో ఉంచడం విశేషం..
సూపర్సోనిక్ ప్రాసెసర్..
ఇక ఈ స్మార్ట్ఫోన్ ప్రాసెసర్ విషయానికి వస్తే.. ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5)పై రన్ అవుతుంది.. గేమింగ్ సమయంలో అద్భుతమైన గ్రాఫిక్స్, అద్బుతమైన పర్ఫార్మెన్స్ అందించడానికి ప్రత్యేకంగా ఒక డిస్ప్లే చిప్ (Dedicated Display Chip)ను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
9,000mAh మెగా బ్యాటరీ..
ఈ స్మార్ట్ఫోన్ అద్భుతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 9,000mAh మెగా బ్యాటరీని కలిగి ఉంటుంది.. దీనివల్ల ఫోన్ ఛార్జింగ్ ఒక్కసారి పెడితే రోజుల తరబడి వినియోగించవచ్చు. ఇంత పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి ఎంతో శక్తివంతమైన 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది.. ఇక ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన విడుదల వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8000mAh భారీ బ్యాటరీతో OnePlus N6x లాంచ్.. బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్స్!
Hyderabad, Telangana:OnePlus N6x Price Cut: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వన్ప్లస్ (OnePlus) మొబైల్ ప్రియులకు మరో అదిరిపోయే గుడ్న్యూస్ను అందించింది. తక్కువ బడ్జెట్లో ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ను అంఅందించే లక్ష్యంతో సరికొత్త N సిరీస్ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. గత నెలలోనే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్ప్లస్ N6 విజయవంతం కాగా.. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి వన్ప్లస్ N6x (OnePlus N6x) అనే అద్భుతమైన మోడల్ను భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి కంపెనీ సర్వం సిద్ధం చేసింది. ఈ ఫోన్ కి సంబంధించిన మైక్రోసైట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ అమెజాన్ (Amazon)లో ఇప్పటికే లైవ్ అవుతుంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మూడు రోజుల పాటు నాన్స్టాప్ బ్యాటరీ లైఫ్..
ఈ సరికొత్త వన్ప్లస్ N6x స్మార్ట్ఫోన్ ప్రధానంగా ఎంతో శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో కంపెనీ ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు 5W రివర్స్ వైరల్ ఛార్జింగ్కు సపోర్ట్ ఫీచర్ను కూడా అందిస్తోంది.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా మూడు రోజుల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా అదనంగా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకమైన వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ను కూడా పొందుపరిచారు.
అద్భుతమైన ఫీచర్లు, డిస్ప్లే..
వన్ప్లస్ తన వినియోగదారులకు బడ్జెట్ ధరలోనే చాలా ప్రత్యేకమైన డిస్ప్లేను అందిస్తోంది. ఈ సిరీస్లో రాబోయే ఫోన్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 (OxygenOS 16)ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. ఇందులో 6.75-ఇంచుల HD+ LCD డిస్ప్లేను కంపెనీ అందిస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ తెలిపింది.. అలాగే, ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ (MediaTek Dimensity 6360 Apex) ప్రాసెసర్తో పాటు ARM Mali-G57 MC2 GPU గ్రాఫిక్స్ కార్డును వినియోగించిన్నట్లు తెలుస్తోంది..
కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)..
ఫోటోల ప్రియుల కోసం ఈ స్మార్ట్ఫోన్ వెనుక భాగంలో 10x డిజిటల్ జూమ్తో కూడిన 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా నేటి ట్రెండ్కు అనుగుణంగా ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కూడా అందుబాటులో ఉంచింది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ధర వివరాలు..
వన్ప్లస్ సంస్థ ఈ N సిరీస్ను తన పాపులర్ Nord సిరీస్ కంటే తక్కువ ధరలోనే.. అంటే అఫోర్డబుల్ బడ్జెట్ సెగ్మెంట్లోనే విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. దీనికంటే ముందు వచ్చిన వన్ప్లస్ N6 (4GB + 128GB) వేరియంట్ ధర రూ.22,999 కాగా ఉండగా.. (6GB + 128GB) వేరియంట్ ధర రూ.24,999గా ఉంది.. ఈ కొత్త వన్ప్లస్ N6x మోడల్ ధర కూడా ఇంచుమించు ఇదే బడ్జెట్లో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.. అంతేకాకుండా ఇందులో ఫ్రెష్ మింట్, మిడ్నైట్ బ్లాక్ రంగుల్లో లభించే అవకాశం ఉంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రెండో తరగతి విద్యార్థికి కల్మా హోంవర్క్.. స్కూల్ ముందు హైడ్రామా..
Hyderabad, Telangana:Kalma Homework Controversy: సైదాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఊహించని ఘనట వెలుగు చూసింది.. 2వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి హోమ్వర్క్ డైరీని పాఠశాల ముగిసిన తర్వాత తల్లిదండ్రులు గమనించారు. అందులో హోమ్వర్క్గా కల్మా, సూరహ్ ఫాతిహా రాయాలని.. అలాగే వాటిని చదవాలని ఉపాధ్యాయులు రాసి పంపినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ఇంత చిన్న వయసులోనే ఒక వర్గానికి సంబంధించిన మతపరమైన అంశాలను హోమ్వర్క్గా ఇవ్వడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు టీచర్స్ ఇలాంటి అంశాలను హోమ్వర్క్గా ఇవ్వడానికి కారణాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పాఠశాల ప్రాంగణంలో హైడ్రామా..
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసేందుకు స్కూల్కు వెళ్లారు. పాఠశాల నిర్వాహకులతో పాటు ప్రిన్సిపాల్ను ఈ హోమ్వర్క్పై వారు గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా పాఠశాల ప్రాంగణంలో తల్లిదండ్రులు, యాజమాన్యం మధ్య జరిగిన ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుడడం విశేషం.
కఠిన చర్యలకు డిమాండ్..
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలల్లో ఇలాంటి మతపరమైన అంశాలను రుద్దడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులతో పాటు పోలీసులు తక్షణమే స్పందించి పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల డైరీలో ఆ విధమైన హోమ్వర్క్ రాసిన సదరు ఉపాధ్యాయునిపై.. అందుకు బాధ్యులైన స్కూల్ మేనేజ్మెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
యాజమాన్యం స్పందన ఏంటి?
ఈ వివాదం స్థానికంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించినప్పటికీ.. పాఠశాల యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా వివరణ కానీ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఇది పొరపాటున జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగానే ఇచ్చారా? అనే కోణంలో స్పష్టత రావాల్సి ఉంది. స్కూల్ యాజమాన్యం స్పందిస్తేనే.. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటన సైదాబాద్ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
శ్రావణ మాసంలో అరుదైన గ్రహాల కదలిక.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు, డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Shravana Masam 2026 Effect On Zodiac: పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర శ్రావణ మాసం త్వరలోనే మొదలు కాబోతోంది.. ఈ ఏడాది జూలై 30 నుంచి ఆగస్టు 28 వరకు శ్రావణ మాసం కొనసాగుతుంది. అయితే, ఈ శ్రావణ మాసంలో జరగబోయే ఒక అరుదైన గ్రహాల కదలిక జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.
సంవత్సరం పొడవునా చాలా అరుదుగా కదలికలు జరిపే శని, గురు గ్రహాలు ఈ పవిత్ర మాసంలో కూడా ప్రత్యేక కదలికలను జరుపుతాడని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జూలై 27న శని దేవుడు వక్రగతిలోకి వెళ్లడంతో ఆ తర్వాత కొద్ది రోజులకే, అంటే ఆగస్టు 12న దేవగురువు బృహస్పతి గ్రహం కూడా అస్తమించబోతోంది. అంతేకాకుండా ఆగస్టు 19న గురు గ్రహం ఆశ్లేష నక్షత్రంలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయి.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ సమయంలో జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభించడమే కాకుండా.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సులభంగా తొలగిపోతాయి.. కార్యాలయంలో మీ నాయకత్వ నైపుణ్యాలకు (Leadership Skills) అద్భుతమైన ప్రశంసలు దక్కుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. దీనివల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి.
మేష రాశి (Aries)
శ్రావణ మాసంలో జరిగే గ్రహాల మార్పుల కారణంగా ఈ మేష రాశివారి జీవితంలో ఆర్థికంగా, వృత్తిపరంగా అత్యంత లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరి ఆదాయంలో భారీ మార్పులు కూడా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. ఇక చాలా కాలంగా నిలిపోయిన డబ్బులు కూడా ఆకస్మాత్తుగా చేతికి కూడా అందుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారికి భారీ మొత్తంలో డీల్స్ కూడా లభిస్తాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అద్భుతమైన అవకాశాలు కూడా కలుగుతాయి. వీరు ఆదాయం పొందడానికి కొత్త మార్గాలు సుగమమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తి కలిసిరావడం వల్ల అనుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి ఈ సమయంలో ఆర్థికంగా సువర్ణ కాలంగా భావించవచ్చు. భారీ మొత్తంలో డబ్బును కూడా సులభంగా పొందుతారు. అంతేకాకుండా వీరికి వైవాహిక, కుటుంబ జీవితంలో సంతోషకరమైన మార్పులు కూడా సులభంగా లభిస్తాయి. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం కూడా సులభంగా మెరుగుపడుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
జూలై 18 వరకు ఈ 4 రాశుల వారికి గండం.. రాహు-కేతువుల మధ్య అన్ని గ్రహాలు బందీ..
Hyderabad, Telangana:Rahu Ketu Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జూలై నెల మధ్యలో ఒక అత్యంత అరుదైన, ప్రమాదకరమైన గ్రహాల కూటమి ఏర్పడుతోంది. ప్రధాన గ్రహాలుగా పరిగణించే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడితో పాటు గురుడు, శుక్రుడు, శని.. ఇలా అన్ని శక్తివంతమైన గ్రహాలు రాహు-కేతువుల మధ్య చిక్కుకోబోతున్నాయి. జ్యోతిష్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. ఏర్పడిన ఈ గ్రహాల ప్రభావం వల్ల జూలై 18 వరకు కొన్ని రాశుల వారికి తీవ్రమైన నష్టాలతో పాటు ఊహించని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు.
రాహు-కేతువుల మాయాజాలం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు, కేతువు ఎల్లప్పుడూ ఒకరికొకరు 180 డిగ్రీల కోణంలో సంచారం చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం రాహువు కుంభ రాశిలో.. కేతువు సింహ రాశిలో సంచార దశలో కొనసాగుతున్నాయి. ఈ రెండు గ్రహాల మధ్యలో అన్ని గ్రహాలు ఒకే వైపున కేంద్రీకృతమవ్వడం వల్ల ఒక వింతైన బంధనం ఏర్పడిందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు. ప్రస్తుతం సూర్యుడు, బుధుడు మిథునంలో, చంద్రుడితో పాటు గురుడు కర్కాటకంలో, కుజుడు వృషభంలో.. శుక్రుడు సింహంతో పాటు శని మీన రాశిలో సంచార దశలో కొనసాగుతున్నాయి.
ఇలా అన్ని గ్రహాలు రాహు-కేతువుల మధ్య చిక్కుకోవడం వల్ల వాటి శుభ ప్రభావం తగ్గి.. ప్రతికూల శక్తులు బలపడే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ గ్రహాల అశుభప్రభావం జూలై 19న ముగుస్తుంది. జూలై 19న చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించిన వెంటనే.. ఈ రాహు-కేతువుల బంధం తెగిపోతుందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు.. కానీ ఆలోగా.. అంటే జూలై 18 వరకు కింది 4 రాశుల వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి..
సింహ రాశి (Leo)
ప్రస్తుతం కేతువు సింహ రాశిలోనే సంచరించబోతున్నాడు.. దీనితో పాటు శుక్రుడు కూడా ఇదే రాశిలో ఉండడం వల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినే ఛాన్స్లు ఉన్నాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. వివాహ జీవితంలో లేదా ప్రేమ వ్యవహారాల్లో తీవ్రమైన మనస్పర్థలు.. అవగాహనా లోపం ఏర్పడవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం ఎంతో మంచిది..
కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారు జూలై 19 వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశిలో సూర్యుడితో పాటు బృహస్పతి ఇద్దరూ కలిసి ఉన్నారు. అయితే, ప్రస్తుతం గురుడు తిరోగమనంలో ఉండడం వల్ల ఆయన ఇచ్చే శుభ ఫలితాలు బలహీనపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. మానసిక ఒత్తిడి తీవ్రమవుతుంది. భావోద్వేగాలకు లోనై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
మిథున రాశి (Gemini)
ఈ గ్రహాల కూటమి మిథున రాశి వారిపై కూడా గట్టి ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మీ మాటతీరు, కమ్యూనికేషన్, నిర్ణయాత్మక శక్తి దెబ్బతినే అవకాశం ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతారు. కార్యాలయంలో లేదా అత్యంత ఆప్తులతో అనవసరమైన గొడవలు.. అపార్థాలు ఏర్పడే ఛాన్స్ కూడా ఉంది.. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
జగన్నాథుడికి ఇష్టమైన రాశులు ఇవే.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు..
Hyderabad, Telangana:Lord Jagannath's Favorite Zodiac Signs Telugu: హిందూ సంప్రదాయంలో జగన్నాథ రథయాత్రకు అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఆషాఢ మాస శుక్ల పక్షమి విదియ తిథి రోజున దేశవ్యాప్తంగా రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది జూలై 16వ తేదీ గురువారం రోజున జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఒడిశాలోని పూరీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని పలు ప్రాంతాలలో ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జగన్నాథ మహాప్రభువు భక్తులందరికీ సమానంగా అనుగ్రహం అందించినప్పటికీ.. కొన్ని ప్రత్యేక రాశులపై ఎల్లప్పుడు ఆయన ఆనుగ్రహంతో ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాశుల వారు జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా మహాప్రభువు అనుగ్రహంతో వాటి నుంచి సులభంగా బయటపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఆయన ఆనుగ్రహంతో ఏయే రాశులవారికి ఎల్లప్పుడు మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి జగన్నాథుడి అనుగ్రహం..
సింహ రాశి (Leo)
జగన్నాథుడి అనుగ్రహం సింహ రాశివారికి ఎల్లప్పుడు ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఎల్లప్పుడు ఆత్మవిశ్వాసంతో, ధైర్యసాహసాలతో ఉంటారు.. జగన్నాథ మహాప్రభువు వీరికి నాయకత్వ లక్షణాలను మరింత బలోపేతం చేస్తారు. స్వామివారి ప్రత్యేక కృప వల్ల వీరు తమ కెరీర్లో సరికొత్త ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేయడానికి విజయం సాధిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సైతం వీరు అవకాశాలుగా మార్చుకుంటారు. ప్రతి పరిస్థితిని సానుకూల (Positive) దృక్పథంతో ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వీరి మానవ సంబంధాలపై కూడా జగన్నాథుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి కూడా జగన్నాథుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశి వారు చాలా కష్టపడే తత్వం కలిగి ఉండి.. నిజాయితీగా జీవించేందుకు ఇష్టపడతారు.. జగన్నాథుని అనుగ్రహం వల్ల వీరి కష్టానికి తగిన అద్భుతమైన ప్రతిఫలం లభిస్తుంది. వీరి ఆర్థిక స్థితి బలపడటంతో పాటు కుటుంబంలో శాంతితో పాటు సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. సమాజంలో, కుటుంబంలో వీరి సంబంధాలు ఎంతో మధురంగా, బలంగా మారుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృషభ రాశి వారికి దేవునిపై ఉన్న అచంచలమైన భక్తి, జీవితంలోని ప్రతి కష్టాన్ని అధిగమించే శక్తి లభిస్తుంది.. వీరు తమ ఓర్పు, పట్టుదలతో విజయాలు సాధిస్తారు.
కర్కాటక రాశి (Cancer)
జగన్నాథుడికి అత్యంత ప్రియమైన రాశులలో కర్కాటక రాశి ఒకటి.. ఈ రాశి వారు స్వభావరీత్యా చాలా సున్నితంగా.. భావోద్వేగాలతో నిండి ఉంటారు. జగన్నాథుని ప్రత్యేక అనుగ్రహం వల్ల వీరి మనస్సులోని గందరగోళం తొలగిపోయి.. మానసిక ప్రశాంతత లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మహాప్రభువు కృపతో వీరి జీవితంలో ఆర్థిక సమస్యలు సులభంగా తగ్గిపోతాయి.. కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. ఎలాంటి కష్టాలు వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. స్వామివారి ఆశీస్సులు వీరి మనోధైర్యాన్ని ఎంతగానో పెంచుతాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
