icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow23 Jun 2024, 09:12 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

KTR: జెన్ జీ యువతరంతో పెట్టుకోవద్దు.. ప్రధాని మోదీని హెచ్చరించిన కేటీఆర్‌

Hyderabad, Telangana:

NEET Paper Leak Row: 'మోదీ మీరు పెట్టుకోకూడని వారితో పెట్టుకున్నారు, యువతరంతో పెట్టుకున్నారు. జాగ్రత్త పడండి. స్వరం మారుతున్నది స్వరం మారుతున్నది రాజ్యం ఉలికి పడు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ గర్జించారు. స్వరం మారుతున్నది, నవతరం మారుతున్నది అని కేంద్రం తెలుసుకోవాలని హితవు పలికారు. 'శ్రీలంకలో ఈ యువతరం ఉరికించి ప్రభుత్వాలను పాతరేసింది. అలాంటి యువతరంతో పెట్టుకోవద్దు' అని మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ విద్యార్థి విభాగం ఇందిరా పార్కులో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన యువతను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 

'తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతరాన్ని తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తానీలు అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కేంద్రానికి బాధ్యత ఉంటే విద్యార్థుల వద్దకు వెళ్లి ఇప్పటికే అనేకసార్లు చర్చలు చేసి సమస్యలు పరిష్కరించాల్సి ఉండే. ఈ యువతరం సీబీఐ, ఈడీ, ఐటీలకు భయపడేది కాదు అని మోడీ తెలుసుకోవాలి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ యువతతో పాటు దేశం యువత ఆగ్రహంతో ఉన్నారని.. పొట్టు పొట్టు కోపంగా ఉన్నారని తెలిపారు. 'నిన్ను నీ ప్రభుత్వాన్ని మెట్టు మెట్టు ఎక్కి తొక్కుతారు. ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి' అని కేటీఆర్‌ సూచించారు.

'యువతరానికి ఏ రాజకీయ నాయకుడి అండ లేదు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వేలాదిమంది తరలి  వస్తున్నారు. యువతరం ఆందోళన ఆగ్రహం కేవలం పేపర్ లీక్ కి సంబంధించిందే కాదు. 12 ఏళ్లుగా కేంద్రం చేస్తున్న మోసాలు, ద్రోహాలపైన ఆగ్రహం. అసలు పని చేయకుండా కేవలం మతం పేరుతో తప్పించుకుంటున్న తీరుని యువతరం అర్థం చేసుకున్నది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ 24 కోట్ల ఉద్యోగాలు ఇయ్యలేనందుకే యువతరం ఈరోజు బయటకు వచ్చింది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.

'మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా బీజేపీ ఇచ్చింది. విద్యార్థులు యువతరం కేంద్రం నుంచి జవాబుదారితనాన్ని అడుగుతున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పైందా అని యువతరం అడుగుతున్నది, నిలదీస్తున్నది. ఈరోజు చేపట్టిన నిరసనలో ఎలాంటి రాజకీయాలు లేవు. విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని చూడలేకనే ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం చేసి తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీగా విద్యార్థుల ఉద్యమానికి అండగా ఉండాలనుకున్నామని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పార్టీల జెండాలు, ఎజెండాలతో వారి ఉద్యమానికి కలుషితం చేయవద్దని హితవు పలికారు. 'కానీ వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులు ఒక్కరే కాదు వారందరికీ మనమంతా అండగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాష్టికాన్ని అణచివేతను చూస్తే ఎవరి మనసైనా కరగాల్సిందే' అని పేర్కొన్నారు. 

'విద్యార్థులు అడిగిన దాంట్లో అన్యాయం ఏమున్నది? వాళ్లు అడిగింది కేవలం తమకు న్యాయం చేయమని తమ భవిష్యత్తును కాపాడమని. యువతరం ప్రధానమంత్రి కుర్చీ అడిగిందా? కేంద్రమంత్రి కుర్చీ అడిగిందా?' కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. నీట్ పరీక్షా పత్రం పేపర్ లీక్‌తో పాటు విద్యారంగంలో సంస్కరణ రావాలని సోనమ్ వాంగ్చుక్ నిరసనకు కూర్చున్నారని తెలిపారు. మీడియా మద్దతు లేకున్నా సోషల్ మీడియాతోనే జెన్ జీ యువతరం దేశం మొత్తాన్ని కదిలించిందని చెప్పారు.

'ఇదే తెలంగాణ గడ్డ నుంచి 50 ఏళ్ల కింద జీనా హై తో మర్నాసికో కదం కదం పర్ లడ్నాసికో అని ఒక యువకుడు పిలుపునిచ్చాడు. ఆ స్ఫూర్తితో తెలంగాణ యువత, దేశ యువత గట్టిగా కొట్లాడుతున్నది. దేశంలోని ఆడబిడ్డలను పోలీసులు తీవ్రంగా దాడి చేస్తున్నారు. కొట్టకూడని చోట కొడుతున్నారు' అని ఢిల్లీ పోలీసుల దాష్టీకంపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు యువతకు సంఘీభావంగా రాజకీయాలతో సంబంధం లేకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా చేపట్టిందని వివరించారు.

'విద్యార్థులు కోరుతున్నట్లుగా ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి. విద్యార్థులపై పెట్టిన పోలీసు కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులపై చేసిన దాష్టికానికి అక్రమ కేసుల నమోదుకు క్షమాపణ చెప్పాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. దేశంలో కేంద్ర మంత్రుల కొడుకులు రేపులు చేస్తే వెంటనే బెయిల్ వస్తున్నాయి కానీ పేపర్ లీకుల పైన ఎంత అడిగినా సమాధానం మాత్రం ఎందుకు రావడం లేదని పరోక్షంగా బండి భగీరథ్‌ కేసు అంశాన్ని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు.

'ఏ దేశం కోసం? ఏ ధర్మం కోసం? పేపర్ లీకులపైన సమాధానం చెప్పడం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. అడగవలసిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది' అని విద్యార్థి లోకానికి మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. చేసిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో రాజకీయాలకు చోటు లేదు, పార్టీల జెండాలు లేవు.. నాయకత్వాలు లేవు, రాజకీయ అజెండా లేదని ప్రకటించారు.

 

'కాక్రోచ్ ల మాదిరిగా భారతదేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి కాక్రోచ్‌లను అవమానిస్తే.. అవే కాక్చ్‌ లు ఢిల్లీ మీద దండయాత్ర చేస్తున్నాయి. వారికి రాజకీయం లేదు. వాళ్లు కోరుతున్నది ఒకటే ప్రధానమంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దేవుడి ముందు ప్రార్థన చేస్తున్న ప్రధానమంత్రి , పరీక్షా పే చర్చా కర్నేవాలే ప్రధానమంత్రి జీ, పరీక్షా పే చర్చ ఎందుకు చేయట్లేవు? పరీక్షా లీక్ మీద ఎందుకు మాట్లాడవు? పరీక్ష మీద చర్చ అంటావు, పరీక్షా పే చర్చ అంటావు, పరీక్షా లీక్ మీద ఎందుకు మాట్లాడవు?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.

0
0
Report

కేవలం రూ.1కే Jiohotstar ప్రీమియం సబ్‌స్క్రిప్షన్.. ఎలా పొందాలి?

Hyderabad, Telangana:

Jiohotstar Dhamaka Offer: టెలికాం, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎప్పటికప్పుడు మంచి ఆఫర్లతో ఆకట్టుకునే రిలయన్స్ జియో.. తాజాగా ఓటీటీ ప్రియుల కోసం ఒక అద్భుతమైన ప్రమోషనల్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. కేవలం రూ.1 చెల్లించి.. ఏకంగా 30 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ప్రీమియం (JioHotstar Premium) సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని ప్రకటించింది. ప్రస్తుతం డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ ధ‌ర‌లు రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో రూపాయికే ఇలాంటి ఆఫర్‌ను అందించడం యూజ‌ర్ల‌కు అద్భుతమైన సంతోషాన్ని కలిగిస్తున్నట్ల భావించవచ్చు.. అయితే, ఈ స్పెషల్ ఆఫర్‌ను ఎలా పొందాలో? దీనికి సంబంధించిన పూర్తి ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎవరికి ఈ ఆఫర్ వర్తిస్తుంది?
ఈ స్పెషల్ ఆఫర్ వినియోగదారులందరికీ అందుబాటులో లేదని కంపెనీ తెలిపింది.. దీనిని లిమిటెడ్ యూజర్లకు మాత్రమే ఆఫర్ రూపంలో అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీనిని ఎప్పుడు వినియోగించే చాలా మంది యూజర్స్‌కి అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నిబంధనలు తప్పనిసరి..
యూజర్ తప్పనిసరిగా జియో (Jio) మొబైల్ నంబర్‌తోనే హాట్‌స్టార్ యాప్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది..అలాగే జియో నంబర్‌పై ఇదివరకు ఎలాంటి యాక్టివ్ హాట్‌స్టార్ ప్లాన్‌తో పాటు సబ్‌స్క్రిప్షన్ ఉండకూడదనే కండీషన్‌ కూడా ఉంది.. ఒకవేళ మీ హాట్‌స్టార్ యాప్‌లోని బ్యానర్‌లో రూ.1 ఆఫర్ కనిపిస్తేనే మీరు దీనికి అర్హులని భావించవచ్చు.. లేనివారికి ఈ ఆఫర్‌ లేనట్లేని సమాచారం..

రెండు డివైజ్‌లలో ఒకేసారి స్ట్రీమింగ్ సదుపాయం..
సాధారణంగా బడ్జెట్ ఆఫర్లలో అనేక పరిమితులు ఉంటూ ఉంటాయి.. కానీ ఈ రూ.1 ప్రమోషనల్ ప్లాన్‌లో వినియోగదారులు ఒకేసారి రెండు డివైజ్‌లలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.. అంటే మొబైల్ ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్‌తో పాటు స్మార్ట్ టీవీ లేదా టాబ్లెట్‌లో ఒకే ఖాతా ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ మ్యాచ్‌లను ఎలాంటి అదనపు డబ్బులు చెల్లించ లేకుండా సులభంగా వీక్షించవచ్చు..

ఆటో-రిన్యూవల్ జాగ్రత్త..
ఈ ఆఫర్‌ను ఉపయోగించుకునే క్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రూ. 1 చెల్లించి సబ్‌స్క్రిప్షన్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆటో రిన్యూవల్ (Auto-Renewal) ఆప్షన్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. 30 రోజుల ఉచిత, ప్రమోషనల్ గడువు ముగిసిన తర్వాత, మీ ఖాతా నుంచి రెగ్యులర్ ప్రీమియం ప్లాన్ చార్జీలు ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతాయి.. దీంతో ఒక నెల తర్వాత ఈ సబ్‌స్క్రిప్షన్‌ను వద్దనుకుంటే.. ముందుగానే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటో-రిన్యూవల్‌ను క్యాన్సిల్ (Cancel Auto-Renewal) చేసుకోవాల్సి ఉంటుంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

తగ్గేదేలే అంటున్న కాక్రోచ్‌ పార్టీ.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు రేపు మధ్యాహ్నం డెడ్‌లైన్‌

New Delhi, Delhi:

Dharmendra Pradhan Resign: నీట్‌ పేపర్‌ లీక్‌ అంశం యావత్‌ భారతదేశాన్ని పాకింది. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్‌ చేయడంతో నీట్‌ ఉద్యమం తార స్థాయికి చేరింది. దీంతో కాక్రోచ్‌ పార్టీ ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదు. రేపటి మధ్యాహ్నం వరకు కాక్రోచ్‌ జనతా పార్టీ డెడ్‌లైన్‌ విధించింది. రాజీనామా చేయకపోతే ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంటుందని హెచ్చరించింది.

కొన్ని నెలలుగా సాగుతున్న నీట్‌ విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాక్రోచ్‌ పార్టీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసింది. కొన్ని నిమిషాల పాటు సాగిన చర్చలు ముగిశాయి. కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర, కాక్రోచ్‌ పార్టీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ పలు అంశాలపై గంటన్నరకు పైగా చర్చించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం డిమాండ్ చేసినట్లు కాక్రోచ్‌ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. ఆందోళనకారులపై కేసులు కొట్టేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. వీటిపై రేపు మధ్యాహ్నం వరకు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

చర్చల అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులతో రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు జేపీ నడ్డా తెలిపారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని.. రేపు మధ్యాహ్నం చర్చలు తిరిగి కొనసాగుతాయని చెప్పారు. విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని జేపీ నడ్డా ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం ముందు కాక్రోచ్‌ పార్టీ ప్రధాన డిమాండ్లు ఇవే

==> కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.

==> ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి.

==> విద్యార్థులపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరాం.

దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్రం
కాగా దేశవ్యాప్తంగా నీట్‌ విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని ప్రధాన నగరాలతోపాటు ఏపీతో సహా అన్ని రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాల్లో నీట్‌ విద్యార్థుల కోసం పోరాటం కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నీట్‌ విద్యార్థులకు మద్దతుగా విద్యా సంస్థల బంద్‌ విజయవంతంగా కొనసాగింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలన్నీ మూసివేశారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్‌లో ఉద్యమం మరింత ఉధృతమయ్యేలా పరిస్థితులు ఉన్నాయి.

0
0
Report
Advertisement

Paper Leak 10 Crore: పేపర్ లీక్ చేస్తే రూ.10 కోట్ల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష.. బిల్లుకు క్యాబినేట్ ఆమోదం?!

Hyderabad, Telangana:

Paper Leak Law 10 Crore: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ (Paper Leak) వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేపర్ లీకులకు పాల్పడే దోషులను అత్యంత కఠినంగా శిక్షించేందుకు చట్టంలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ భేటీలో దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు మంత్రుల బృందం ఆమోదం తెలిపినట్లు సమాచారం అందుతోంది. 

ప్రతిపాదిత కొత్త శిక్షలు, జరిమానాలు
2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టానికి సవరణలు చేస్తూ ఈ కొత్త బిల్లును రూపొందించారు. పాత చట్టంతో పోలిస్తే శిక్షలు, జరిమానాలు భారీగా పెరిగాయి. ఈ కేసులో పట్టుబడిన వ్యక్తులను కనీసం పదేళ్లు జైలు శిక్ష విధించేందుకు ముసాయిదా సిద్ధం చేసినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అలాగే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల జరిమానా విధించేలా చట్టంలో భారీ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

పాత చట్టం వర్సెస్ కొత్త సవరణలు..
గతంలో వ్యక్తిగత లీకేజీ కేసులకు 3-5 ఏళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించేవారు. వ్యవస్థీకృత నేరాలకు 5-10 ఏళ్ల జైలు, రూ.1 కోటి వరకు జరిమానా ఉండేది. ఇప్పుడు ఈ శిక్షల తీవ్రతను జరిమానా మొత్తాన్ని కేంద్రం గణనీయంగా పెంచింది.

3 నెలల్లో విచారణ పూర్తే లక్ష్యం.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో మొదటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ప్రారంభమవ్వగా, త్వరలోనే మరో నాలుగు కోర్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ కోర్టుల ద్వారా లీకేజీ కేసుల విచారణను మూడు నెలల వ్యవధిలోనే పూర్తి చేసి దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా ప్రతిపాదనలు చేశారు.

ప్రధాని మోదీ హామీ, తదుపరి చర్యలు
'నీట్' పేపర్ లీక్ ఘటనలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. లీకేజీలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ ప్రత్యేక వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఈ సవరణ బిల్లును వచ్చే వారమే లోక్‌సభ ముందుకు తీసుకువచ్చి, వీలైనంత త్వరగా ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

(గమనిక: క్యాబినెట్ ఆమోదం తెలిపిన ఈ బిల్లుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడాల్సి ఉంది.)

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

Also REad: 'ఓం భీమ్ బుష్' హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్..నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన ముంబై పోలీసులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

రూ.1.49 లక్షలకే 7 సీటర్ కారు.. రూ. 1.85 లక్షలకే SUV.. ఎక్కడో తెలుసా?

Hyderabad, Telangana:

Second-hand Cars In Delhi: సొంతంగా ఒక కారు కొనుగోలు చేసి.. కుటుంబంతో కలిసి హాయిగా ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ తప్పకుండా కలలుకంటారు. కానీ.. ప్రస్తుతం మార్కెట్‌లో కొత్త కార్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో చాలామంది తమ కల నెరవేర్చుకోవడానికి సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి వారికి ఒక అద్భుతమైన సువర్ణావకాశం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా అత్యంత చీప్‌ ధరకే మంచి కారు కొనుగోలు చేయాలనువారికి ఇది మంచి ఛాన్స్‌ భావించవచ్చు..

ఢిల్లీలోని రోహిణి (సెక్టర్ 16, G2-124)లో ఉన్న ప్రముఖ యూజ్డ్ కార్లకు సంబంధించిన షోరూమ్స్‌లో బడ్జెట్ ధరల్లోనే విభిన్న రకాల కార్లను అందుబాటులో ఉన్నాయి.. ఇక్కడ ప్రీమియం, మోడిఫైడ్, ఫ్యామిలీ ఎస్‌యూవీ కార్లు అత్యంత తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా మిని SUVలు చాలా చీప్‌ ధరల్లో అందుబాటులో ఉండడం విశేషం.. 

ఇక్కడ పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉండే 7-సీటర్ ఫ్యామిలీ కార్లు కేవలం రూ.1,49,000కే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవి ఆన్ పేపర్ సీఎన్‌జీ (CNG) సౌకర్యంతో లభిస్తున్నాయి. సాధారణంగా ఎస్‌యూవీ అంటే లక్షల రూపాయల ఖర్చుతో కూడుకుని ఉంటుంది.. కానీ, ఇక్కడ 2015 మోడల్ పెట్రోల్ రెనాల్ట్ డస్టర్ (SUV) కారును కేవలం రూ.1,85,000కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

18 ఇంచుల స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో అందుబాటులోకి వచ్చిన 2015 మోడల్ మోడిఫైడ్ కారు కేవలం రూ.1,25,000 లకే లభించడం విశేషం.. సీఎన్‌జీ సౌకర్యంతో ఉన్న 2019 కొత్త షేప్ ఈకోస్పోర్ట్ కారు రూ.4,25,000కే అందుబాటులో ఉండగా.. 2018 ఒరిజినల్ పెయింట్ డిజైన్ బ్లాక్ కలర్ మోడల్ రూ.4,00,000కే లభించడం విశేషం..

అదేవిధంగా 2022 BS6 అప్‌డేటెడ్ మోడల్ హ్యుందాయ్ వెన్యూ (Venue) కారు రూ.5,50,000 లకే అందుబాటులో ఉంది. సీఎన్‌జీతో కూడిన 2013 ఫస్ట్ ఓనర్ హ్యుందాయ్ వెర్నా (Verna) కారు రూ. 2,40,000కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు 2020 డీజిల్ టాప్ మోడల్ హ్యుందాయ్ i20 కారు కేవలం రూ. 3,50,000 కే అందుబాటులో ఉంది. ఇక 2035 వరకు వ్యాలిడిటీ ఉన్న 2020 BS6 సింగిల్ ఓనర్ రెనాల్ట్ క్విడ్ (Kwid) కారును కేవలం రూ.2,05,000కే విక్రయిస్తున్నారు.

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

0
0
Report

Anurag Kashyap Tejaswini: "ఆ డైరెక్టర్ నగ్నంగా నటించమని చెప్పాడు"..అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ హాట్ కామెంట్స్!

Hyderabad, Telangana:

Anurag Kashyap Tejawini Gulal: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 'గులాల్' సూపర్ హిట్‌గా నిలిచింది. 2009లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందగా.. కానీ, ఈ సినిమాలో నటించే అవకాశాన్ని ఓ నటి తిరస్కరించిందట. అయితే తాను నగ్నంగా నటించడం ఇష్టం లేకనే ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్లు సీనియర్ నటి తేజస్విని కొల్హాపురే వెల్లడించింది. చాలా ఏళ్లుగా తన కెరీర్‌లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటలను ఇప్పుడు గుర్తుచేసుకుంది.
 
ఇటీవల సిద్ధార్థ్ కన్నన్ పోడ్‌కాస్ట్‌లో కనిపించిన నటి తేజస్విని.. బాలీవుడ్ చిత్రం 'గులాల్'లో కథానాయిక పాత్ర కోసం అనురాగ్ కశ్యప్ తనను తీసుకోవాలనుకున్నారని చెప్పారు. అయితే, ఆ పాత్రలో తాను తెరపై నగ్నంగా కనిపించాల్సిన సన్నివేశం ఉండటంతో ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఆమె చెప్పుకొచ్చారు.

"అనురాగ్ కశ్యప్ నాకు చదవడానికి స్క్రిప్ట్ ఇచ్చారు. స్క్రిప్ట్ చదివిన తర్వాత, అందులోని మహిళా పాత్ర అంత ముఖ్యమైనది కాదని నాకు అనిపించింది. అంతేకాకుండా, ఆ పాత్రలో నేను నగ్నంగా కనిపించాల్సిన ఒక సన్నివేశం ఉందని నాకు తెలిసింది. దానికి నేను అంగీకరించలేదు. తెరపై నగ్నంగా నటించకూడదనేదే నా స్పష్టమైన వైఖరి" అని నటి తేజస్విని అన్నారు.

ఈ సందర్భంగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌తో జరిగిన సంబాషణను నటి తేజస్విని గుర్తుచేసుకుంది. తాను నగ్నంగా ఎలా నటించగలనని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్‌ను ప్రశ్నించిందట. ఇలాంటి సన్నివేశాల్లో తాను నటిస్తే ఇంట్లో నుంచి గెంటేస్తారని ఆమె డైరెక్టర్‌కు తెలియజేసినట్లు ఆమె సమాధానమిచ్చింది. 

నగ్నంగా నటించాల్సి ఉన్న కారణంగా ఆ సినిమాలో తాను నటించకూడదని నిర్ణయించుకున్నట్లు నటి తేజస్విని చెప్పింది. ఆ తర్వాత ఆ పాత్రలో మోడల్, నటి జెస్సీ రంధావా నటించింది. ఆ సన్నివేశాలలో జెస్సీ నిజానికి నగ్నంగా నటించలేదని, కేవలం ఒక ప్రత్యేకమైన 'బాడీసూట్' ధరించిందని సినిమా విడుదలైన తర్వాతే తనకు తెలిసిందని తేజస్విని చెప్పింది.

తేజస్విని ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సినిమాల్లో పాత్ర అవసరాలు, కళాత్మక వ్యక్తీకరణ, నటీనటుల వ్యక్తిగత పరిమితుల మధ్య సమతుల్యతపై మరోసారి చర్చ మొదలైంది. తన వ్యక్తిగత వైఖరికి కట్టుబడి ఉన్నందుకు చాలామంది తేజస్వినిని ప్రశంసిస్తుండగా, సినిమాలో ఉపయోగించిన సాంకేతిక అంశాల గురించి ఆమెకు ముందుగా తెలియజేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

2009లో విడుదలైన 'గులాల్' చిత్రం, రాజకీయాలు, అధికార పోరాటాలు, విద్యార్థి రాజకీయాల కథాంశంతో అందరి దృష్టిని ఆకర్షించింది. విడుదలైన సమయంలో ఇది పెద్దగా వాణిజ్య విజయం సాధించనప్పటికీ, ఆ తర్వాత ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. ఈ చిత్రం కథ, దర్శకత్వం, సంగీతం, నటన విస్తృతంగా ప్రశంసించబడ్డాయి.

ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత, తేజస్విని కొల్హాపురే తన కెరీర్‌లోని ఈ ముఖ్యమైన సంఘటనను పంచుకున్నారు. ఇది సినీ ప్రేమికులలో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, 'గులాల్' సినిమా ఎంపిక ప్రక్రియ, ఆనాటి హిందీ చిత్ర పరిశ్రమ పనితీరుపై కొత్త చర్చకు ఒక వేదికను కూడా అందించింది.

Also Read: Ramya Pasupuleti: తెలుగు హీరోయిన్ రమ్య పసుపులేటి బికినీ ఫొటోలు!

Also REad: బిగ్‌బాస్ హౌస్‌లోకి 'జబర్దస్త్' క్రేజీ బ్యూటీ..అసలు కారణం బయటపెట్టిన నటి సత్యశ్రీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

ఆగస్టు 7న నవపంచమ యోగం ఎఫెక్ట్‌.. ఈ 4 రాశుల జాతకం మారబోతోంది.. ఇక కోట్లలో ధన లాభం!

Hyderabad, Telangana:

Navpancham Drishti Yoga Effect: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంది. గ్రహాల దృష్టి మానవ జీవితంపై విశేష ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.. ఈ క్రమంలో రాబోయే ఆగస్టు 7న ఉదయం 8:11 గంటలకు సూర్యుడితో పాటు శని గ్రహాల కలయికతో అత్యంత శక్తివంతమైన నవపంచమ దృష్టి యోగం ఏర్పడబోతోంది. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 120 డిగ్రీల కోణంలో రాబోతున్నాయి..

సూర్య, శని గ్రహాల కలయిక ప్రతికూలంగా ప్రభావాన్ని చూపినప్పటికీ.. ఈ నవపంచమ యోగం మాత్రం నాలుగు నిర్దిష్ట రాశుల వారికి అత్యంత శుభఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా బోలెడు ధన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యోగం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా.. కొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆ అదృష్ట 4 రాశులు ఇవే..
తులా రాశి (Libra)
తులా రాశి వారికి లక్ష్మీదేవి విశేష అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని భారీ లాభాలు వస్తాయి. క్రియేటివ్‌ రంగాల్లో పనులు చేస్తున్నవారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రేమ జీవితంలో బోలెడు లాభాలు కలిగే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.

వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఈ నవపంచమ యోగం ప్రభావంతో అద్బుతమైన లాభాలు కలుగుతాయి.. ఈ సమయంలో తప్పకుండా శ్రమకు తగిన ప్రతిఫలం కూడా సులభంగా కలుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ వనరులు సమకూరి ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి.. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి.. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ సమయం ఆత్మవిశ్వాసాన్ని, విజయాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. పని ప్రదేశంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు ఇది అత్యంత అనుకూల సమయంగా భావించవచ్చు. భాగస్వామితో నమ్మకంతో పాటు బంధం మరింత మెరుగుపడుతుంది.. సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల క్లిష్ట పరిస్థితులను కూడా సులువుగా తొలగిపోతాయి..

మకర రాశి (Capricorn)
మకర రాశిలో జన్మించిన వారికి ఈ గ్రహ యోగం అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈ సమయంలో సులభంగగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో శాంతి విపరీతంగా లభిస్తుంది. జీవిత భాగస్వామి సపోర్ట్‌ కూడా పూర్తి స్థాయిలో లభిస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Shreyas Iyer Dhoni Record: ధోని రికార్డును బ్రేక్ చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్! టీ20 ఫార్మాట్‌లో ఒకే ఒక్కడు!

Hyderabad, Telangana:

Shreyas Iyer Dhoni Toss Record: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. ప్రస్తుతం జింబాబ్వేతో టీమ్ఇండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇటీవలే జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘనవిజయం సాధించింది. 7 వికెట్లు నష్టపోయి మరో 40 బంతులు మిగిలుండగానే గెలుపును సాధించింది.  

అయితే ఇదే టీమ్ ఇంతకు ముందు ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో 0-2, ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-4 తేడాతో వైట్ వాష్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వరుస ఓటముల తర్వాత భారత్‌కు ఈ విజయం ఓదార్పును ఇచ్చినట్లు అయ్యింది. అయితే జింబాబ్వేతో మరో రెండు టీ20 మ్యాచ్‌లు సిరీస్‌లో భాగంగా ఆడాల్సి ఉంది. అయితే రాబోయే మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటాలని టీమ్ఇండియా భావిస్తోంది. 

నిన్న (జూలై 23) జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులకే ఆలౌట్ అయింది. భారత జట్టు తరఫున ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. మాదేవెర్ 39 పరుగులు, మరుమణి 27 పరుగులు, ర్యాన్ పెర్ల్ 26 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్, అభిషేక్ శర్మ 1, సూర్యవంశీ 50, ఇషాన్ కిషన్ 35, శ్రేయస్ అయ్యర్ 28*, తిలక్ వర్మ 6* పరుగులతో 7 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: సూర్యవంశీ
ఆ విషయంలో వైభవ్ సూర్యవంశీ నిన్న 18 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. మిగిలిన తదుపరి రెండు మ్యాచ్‌లు రేపు (జూలై 25), ఎల్లుండి (జూలై 26) హరారే స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరుగుతాయి.

ధోనీ రికార్డు బ్రేక్..
భారత జట్టు విజయంతో పాటు, టీ20ఐ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక కొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాదు, భారత జట్టు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పరిగణించబడే ఎంఎస్ ధోనీని శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు అధిగమించాడు. దీని గురించి మరిన్ని వివరాలను మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.

కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన తొలి 8 టీ20ఐలలో టాస్ గెలిచాడు. అంతేకాకుండా, వరుసగా తన తొలి 8 టీ20ఐలలో టాస్ గెలిచిన తొలి కెప్టెన్‌గా కూడా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. బహమాస్‌కు చెందిన గ్రెగొరీ టేలర్ తన తొలి 7 మ్యాచ్‌లలో 7 సార్లు టాస్ గెలిచాడు. 

గతంలో, భారత మాజీ కెప్టెన్ ధోనీ కూడా మే 2010 నుండి ఫిబ్రవరి 2012 వరకు వరుసగా 7 టీ20ఐలలో టాస్ గెలిచాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ దీనిని కూడా అధిగమించాడు. శ్రేయస్ ఐర్లాండ్‌పై 2, ఇంగ్లాండ్‌పై 5, జింబాబ్వేపై ఒకటి సహా మొత్తం 8 టీ20ఐలలో టాస్ గెలిచాడు. భారత్, జింబాబ్వేల మధ్య మిగిలిన రెండు మ్యాచ్‌లు రేపు, ఎల్లుండి సాయంత్రం 4.30 గంటలకు (IST) ప్రారంభమవుతాయి. మీరు వాటిని యునైట్8 స్పోర్ట్స్ టీవీ, ఫ్యాన్‌కోడ్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

Also Read: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఫైనల్ షెడ్యూల్ ఖరారు..ఈ సారి ఫైనల్ ఎక్కడ జరుగుతుంది

ALso Read: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు జైలు శిక్ష?! ఆ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

రూ.17,999లకే 6500mAh భారీ బ్యాటరీ ఫోన్.. iQOO Z11 Lite 5G ఆఫర్లు, ఫీచర్లు ఇవే!

Hyderabad, Telangana:

Iqoo Z11 Lite Price In India: ప్రముఖ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) భారత మార్కెట్లోకి మరొ మోస్ట్ పవర్‌ఫుల్ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.. దీనిని కంపెనీ iQOO Z11 Lite 5G పేరుతో ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్‌ చేసింది. తక్కువ ధరలో అద్బుతమైన ఫీచర్లు కోరుకునే వినియోగదారులతో పాటు ముఖ్యంగా విద్యార్థులు, యువతను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఫోన్‌ను తయారు చేసిన్నట్లు తెలుస్తోంది.. 6,500mAh భారీ బ్యాటరీతో పాటు 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, ప్రీమియం ప్రాసెసర్‌తో ఈ ఫోన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడ మనం తెలుసుకుందాం..

ధర ఇతర వివరాలు..
భారత్‌లో iQOO Z11 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది ఆఫర్లతో కలిపి రూ.17,999లకే అందుబాటులో ఉంది. రూ.20,000 లోపు బడ్జెట్ విభాగంలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ (Amazon) నుంచి విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది సోలార్ ఫ్లేమ్ (Solar Flame)తో పాటు మిడ్‌నైట్ బ్లూ (Midnight Blue) అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చిన్నట్లు కంపెనీ వెల్లడించింది..

డిస్‌ప్లే, డిజైన్ వివరాలు..
ఈ iQOO Z11 Lite 5G ఫోన్ 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో లభిస్తుందని కంపెనీ తెలిపింది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. దీనివల్ల సూటిగా పడే ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ తెలిపింది.. అలాగే నోటిఫికేషన్ల కోసం ఇందులో డైనమిక్ లైట్ (Dynamic Light) రింగ్ ఫీచర్‌ను కూడా అందించారు.

ప్రాసెసర్, ఇతర వివరాలు..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టాకోర్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. యాంట్యూట్యూ (AnTuTu) బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై ఈ ఫోన్ 5,79,000 కంటే ఎక్కువ పాయింట్లను సాధించి తన శక్తివంతమైన మొబైల్‌గా అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది.. మల్టీటాస్కింగ్, గేమ్స్ ఆడటానికి, నిత్యం వినియోగించడానికి ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది..

కెమెరా క్వాలిటీ వివరాలు..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఇది స్పష్టమైన, వివరాలతో కూడిన ఫోటోలను అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం..  ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను అందించిన్నట్లు తెలుస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

6500mAh భారీ బ్యాటరీ, ఛార్జింగ్ సపోర్ట్..
ఈ ఫోన్‌లోని అతిపెద్ద ప్లస్ పాయింట్.. దీని శక్తివంతమైన 6,500mAh బ్యాటరీగా భావించవచ్చు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 20 గంటల సోషల్ మీడియా స్క్రోలింగ్ లేదా 80 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఇది 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో సుమారు 8 గంటల టాక్‌టైమ్ లేదా 7.2 గంటల వీడియో ప్లేబ్యాక్ సపోర్ట్‌ను కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

ఫ్లిప్‌కార్ట్‌లో ఊహించని ఆఫర్.. ఛీప్‌ ధరకే Samsung Galaxy S25 5G ఫోన్!

Hyderabad, Telangana:

Samsung Galaxy S25 5g Price Cut: ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవాలనుకునే టెక్ ప్రియులకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే శుభవార్తను అందించింది. సాంసంగ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన సాంసంగ్‌ గెలాక్సీ S25 5G (Samsung Galaxy S25 5G) స్మార్ట్‌ఫోన్‌పై ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్ మార్కెట్‌లో లాంచ్ అయినప్పటి.. నుంచి ఇప్పటివరకు ఇదే అత్యంత తక్కువ ధరకు లభించడం విశేషం.. అయితే, బ్యాంక్ ఆఫర్లతో పాటు ఎక్స్ఛేంజ్ బోనస్‌లను వినియోగిస్తే.. ఎప్పుడు పొందలేనంత చీప్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు..

ఆఫర్లు, డిస్కౌంట్ వివరాలు..
సాంసంగ్ గెలాక్సీ S25 సాధారణంగా రూ.74,999 ధరతో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ భారీ ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి చాలా చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు..

అలాగే దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్‌తో పాటు డెబిట్ కార్డ్‌ల (SBI, HDFC, Flipkart Axis కార్డ్‌లు) ద్వారా కొనుగోలు చేస్తే తక్షణమే వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.. అలాగే మీ వద్ద ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. ఇవే కాకుండా బడ్జెట్ పరంగా ఒకేసారి చెల్లించలేని వారి కోసం నెలకు తక్కువ వాయిదాలతో కొనుగోలు చేసేందుకు వీలుగా నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది..

గెలాక్సీ S25 ప్రధాన ఫీచర్లు..
ఇది 6.2 అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, అత్యధిక బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఫోన్ సైజ్ చేతిలో పట్టుకోవడానికి చాలా కాంపాక్ట్‌గా, అత్యంత ప్రీమియమ్‌గా ఉంటుంది. అత్యంత పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite for Galaxy) ప్రొసెసర్‌తో ఇది పనిచేస్తుంది. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ అనుభవం ఇందులో అద్భుతంగా ఉంటుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఈ ఫోన్ వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా (OIS)తో పాటు 12MP ఆల్ట్రా-వైడ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంటుంది.. సెల్ఫీల కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇందులో చాలా ప్రత్యేమైన లైవ్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టు సెర్చ్, లైవ్ నోట్స్‌తో పాటు AI ఫోటో ఎడిటింగ్ వంటి అనేక అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సాంసంగ్‌ ఈ ఫోన్‌కు ఏకంగా 7 సంవత్సరాల పాటు Android OSతో పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ల హామీ ఇస్తోంది. ఇది శక్తివంతమైన 4000mAh బ్యాటరీతో పాటు వేగవంతమైన ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ప్రొటక్షన్‌ను అందిస్తుంది.   

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

0
0
Report

ఈ రోజు నుంచి బుధ ఎఫెక్ట్‌.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం.. ధన లాభం ఖాయం!

Hyderabad, Telangana:

Mercury Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహరాజుగా బుధుడిని చెప్పుకుంటూ ఉంటారు. వాక్చాతుర్యం, వ్యాపారానికి అధిపతిగా భావించే బుధ గ్రహం తన సంచారంలో ఒక పెద్ద మార్పుకు సిద్ధమవుతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జూలై 24 బుధ గ్రహం వక్రగతి నుంచి నేరుగా సంచారం దశలోకి రాబోతోంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏదైనా కీలక గ్రహం వక్ర స్థితి నుంచి సక్రమార్గంలోకి వెళ్లినప్పుడు దాని ప్రభావం ద్వాదశ రాశుల జీవితాలపై నేరుగా పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

బుధ గ్రహం వక్రంలో ఉన్న సమయంలో చాలామంది కమ్యూనికేషన్ సమస్యలతో పాటు వ్యాపారంలో అడ్డంకులు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, మానసిక అయోమయానికి గురవుతూ ఉంటాడు.. అయితే, జూలై 24 నుంచి బుధ గ్రహం సక్రమ మార్గంలోకి.. రావడంతో గందరగోళ పరిస్థితులు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ముఖ్యంగా స్పష్టత, సరైన నిర్ణయాధికార శక్తి పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు సానుకూల ఫలితాలను కూడా అందిస్తాయి.

అదృష్ట రాశులు ఇవే..
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృత్తిపరంగా మీరు తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు, చేసే పెట్టుబడులు భారీ లాభాలను తెచ్చిపెడతాయి.. కొత్తగా చేసుకునే ఒప్పందాలు (Deals) వ్యాపారంలో విశేషమైన ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి.

మిథున రాశి (Gemini)
బుధుడి సక్రమ మార్గంలోకి వెళ్లడం వల్ల మిథున రాశి వారికి అత్యంత అనుకూల ఫలితాలను అందిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి అనూహ్యమైన అభివృద్ధి కనిపిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఆస్తి, భూమి లేదా సొంత వాహనం కొనుగోలు చేయడానికి ఇది సువర్ణ సమయంగా భావించవచ్చు. ఆర్థిక నిల్వలు గణనీయంగా పెరుగుతాయి..

కన్యా రాశి (Virgo)
కన్యా రాశి జాతకులకు సమాజంలో గౌరవ మర్యాదలు, ప్రశంసలు ఊహించని స్థాయిలో లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి (Promotion) లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆఫీసులో కీలక బాధ్యతలు చేపట్టడం వల్ల మీ గుర్తింపు మరింత ఊహించని స్థాయిలో పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ సమయం ఆత్మవిశ్వాసాన్ని ఊహించని స్థాయిలో అందిస్తుంది. మీ సంభాషణ శైలి అందరినీ ఆకట్టుకుంటుంది.. సమాజంలో మీ మాటలకు విలువ విపరీతంగా పెరుగుతుంది. అయితే, ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా.. కాస్త ఓర్పు వహించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

ఈ రోజే మృగశిరలోకి కుజుడు.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని రాజయోగం!

Hyderabad, Telangana:

Mars Transit In Mrigashira Nakshatra 2026: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని మనందరికీ తెలుసు. గ్రహాల సేనాపతిగా పరిగణించే కుజుడు ధైర్య సాహసాలు, శక్తి, ఆత్మవిశ్వాసాలకు సంకేతంగా పరిగణిస్తారు.. అందుకే కుజ గ్రహ సంచారంలో లేదా నక్షత్ర మార్పులో వచ్చే ఎలాంటి మార్పులైన.. దాని ప్రభావం ద్వాదశ రాశుల జీవితాలపై స్పష్టంగా కనిపిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. జులై 24న కుజ గ్రహం రోహిణి నక్షత్రం నుంచి తన సొంత నక్షత్రమైన మృగశిర నక్షత్రంలోకి సంచారం చేసింది.. ఈ నక్షత్ర సంచారం రాబోయే 20 రోజుల పాటు కొనసాగనుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మృగశిర నక్షత్ర విశిష్టత..
జ్యోతిష్య ప్రకారం.. 27 నక్షత్రాల్లో మృగశిర నక్షత్రం 5వ స్థానంలో ఉంటుంది.. మృగశిర నక్షత్రం కుజుడి శక్తికి, చంద్రుడి శాంత స్వభావానికి అద్భుతమైన ప్రభావాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. దీని కారణంగా కుజుడు తన సొంత నక్షత్రంలో ప్రవేశించడం వల్ల అత్యంత శుభయోగాలు ఏర్పడతాయి.. ఈ ప్రభావం వల్ల ముఖ్యంగా 3 రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.

అదృష్టం పొందే రాశులు ఇవే..
కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ సంచార సమయం ఎంతో శ్రేయస్స్కరంగా ఉంటుంది.. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఊహించని ధన లాభాలు కూడా కలుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు విస్తరించాలనుకునేవారికి ఈ సమయం ఎంతో చాలా శుభప్రదంగా ఉంటుంది. పాత అప్పులు తీరిపోయి.. మనశ్శాంతి లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మేష రాశి (Aries)
కుజుడి నక్షత్ర సంచారంతో మేష రాశి వారికి ఎన్నో అనుకూలమైన మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలతో పాటు ప్రమోషన్ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా కనిపిస్తుంది.. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన, శాంతియుత వాతావరణం నెలకొంటుంది.

వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు నుంచే బంగారు సమయం మొదలవుతుంది.. కుటుంబంలో ఉన్న సుదీర్ఘ వివాదాలు, గొడవలు పరిష్కారమవుతాయి. అంతేకాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా ఆఫీసులో బాస్ సపోర్ట్ కూడా లభించి ప్రమోషన్‌కు సిఫార్సు అయ్యే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. నిలిచిపోయిన బకాయిలు తిరిగి చేతికి అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

Sonam Wangchuk: ఆమరణ దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్..

Hyderabad, Telangana:

Sonam Wangchuk Latest News: ప్రముఖ సామాజిక వేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌లతో జరిగిన కీలక సమావేశం అనంతరం ఆయన తన దీక్షను విరమించారు. మంత్రులు స్వయంగా నిమ్మరసం అందించి వాంగ్‌చుక్‌తో దీక్షను విరమింపజేశారు.

అసలేం జరిగింది?
పరీక్షల లీకేజీల అంశంపై కేంద్ర ప్రభుత్వ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ.. సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. దీక్ష క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ప్రత్యేక చికిత్స నిమిత్తం గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్‌చుక్‌ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లు కలిసి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. వాంగ్‌చుక్ లేవనెత్తిన ప్రధాన సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని.. తగిన చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రులు స్పష్టమైన హామీ ఇచ్చిన్నట్లు తెలుస్తోంది.. దేశానికి మీ సేవలు ఇంకా చాలా అవసరమని.. యువత భవిష్యత్తు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రులు ఈ సందర్భంగా హామీ ఇచ్చిన్నట్లు సమాచారం..  

శాంతియుత చర్చలకు మార్గం సుగమం..
కేంద్ర మంత్రుల నుంచి సానుకూలమైన స్పందన లభించడంతో పాటు పలువురు పార్లమెంట్ సభ్యుల విజ్ఞప్తి మేరకు తాను దీక్ష విరమించాలని నిర్ణయించుకున్నట్లు సోనమ్ వాంగ్‌చుక్ తెలిపారు. విద్యార్థులు, యువత ఆందోళనలను విరమించి.. ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వంతో జరిగిన ఈ చర్చలు సానుకూల వాతావరణంలో ముగియడంతో దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంతో కలిసి శాంతియుత మార్గంలో పరిష్కరిస్తారని వాంగ్‌చుక్ తెలిపిన్నట్లు తెలుస్తోంది..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report

KTR Birthday: అనుకున్నది ఏదీ సాధించలే.. కానీ కేటీఆర్‌ పేరు తెలంగాణకు ఓ బ్రాండ్‌

Baddipadaga, Telangana:

KTR Birthday: అభివృద్ధికి దిక్సూచిగా.. చిరునామాగా.. పర్యాయపదంగా కేటీఆర్‌ నిలుస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ యువతరానికి కేటీఆర్‌ అనే పేరు ఒక బ్రాండ్‌గా మారింది. ముఖ్యంగా యువత కేటీఆర్‌ను అమితంగా అభిమానిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా కేటీఆర్‌ను తమ తరానికి ఒక ఐకాన్‌గా భావిస్తున్నారు. కల్వకుంట్ల తారక రామారావు కన్నా కేటీఆర్‌గా పేరు మార్మోగుతోంది. తండ్రికి తగ్గ వారసుడిగా.. విజయవంతమైన కేటీఆర్‌ తెలంగాణకు తర్వాత కాబోయే నాయకుడిగా యువత భావిస్తోంది.

గతంలో సంపన్న, మధ్యతరగతి ప్రజల ఆదరాభిమానం పొందిన కేటీఆర్‌ ఇప్పుడు మాస్‌ ప్రజల్లో కూడా గుర్తింపు పొందుతున్నారు. ఉద్యమంలో ఒక కేటీఆర్‌ను... మంత్రిగా ఒక కోణం.. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మరో కోణంలో ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్‌ నోట్లో నుంచి ఊడిపడినట్టు కేటీఆర్‌ వ్యవహార శైలి.. మాటతీరు ఉంటుంది. కేసీఆర్‌ మాదిరి ఇంగ్లీష్‌, ఉర్దూ, హిందీ, తెలుగు భాషల్లో అదరగొడతాడు. సామెతలు, కథలు, పంచ్‌లు, చలోక్తులు, జోకులు వేయడంలో కేసీఆర్‌ మాదిరి కేటీఆర్‌ ఉన్నాడు.

వాస్తవంగా కేటీఆర్‌కు రాజకీయాలు అనేవి అంతగా ఆసక్తి లేవు. కరీంనగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా తండ్రి కేసీఆర్‌కు తోడుగా ఉందామని తట్టాబుట్టా సర్దేసుకుని అమెరికా నుంచి తెలంగాణకు వచ్చాడు. ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలియదు. తర్వాత చెబితే కేసీఆర్‌ సర్లే అని వెంట తిరిగాడు. అయితే అంతకుముందు చదువు కూడా కేటీఆర్ ఇష్టపడి.. తాను చదవాలనుకున్నది చదవలేదు. అమ్మ డాక్టర్‌ కావాలని.. నాన్న ఐఏఎస్‌ కావాలని కలలు కంటే కేటీఆర్‌ మాత్రం విదేశాల్లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేశారు. ఇంటర్‌, డిగ్రీ, ఎంబీఏ ఇలా ఏ చదువు కూడా తాను అనుకున్నది కేటీఆర్‌ చదవలేదు.

కానీ కష్ట సమయంలో తండ్రి కేసీఆర్‌కు అండగా నిలవడమే కేటీఆర్‌ జీవితంలో అతి పెద్ద టర్నింగ్‌ పాయింట్‌. అప్పటి నుంచి నేటి వరకు రాజకీయాల్లో కేటీఆర్‌ కొనసాగుతున్నాడు. గతంలో తండ్రి వెనుకాల ఉండగా.. కొన్నాళ్లకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఓటమన్నేది లేకుండా దూసుకెళ్తున్నాడు. సిరిసిల్ల నుంచి వరుసగా ఓటమి లేకుండా గెలుస్తున్నాడు. మంత్రిగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడిగా విజయవంతంగా పార్టీని నడుపుతున్న కేటీఆర్‌ కుటుంబానికి మాత్రం సమయం ఇవ్వడం లేదు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వందకు ఒకటి తక్కువ సీటు అంటే 99 కార్పొరేటర్లు సీట్లు గెలిచిన తర్వాత కేటీఆర్‌కు యమ క్రేజ్‌ పెరిగింది. నాడు కేసీఆర్‌కు కొడుకు గిఫ్ట్‌ అని గుర్తింపు లభించింది. నాటి నుంచి ఎన్నికలకు వెళ్తున్నా ప్రతికూల ఫలితాలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు అసెంబ్లీ, పార్లమెంట్‌, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ఏవీ వచ్చినా ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో కేటీఆర్‌ నాయకత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కానీ వాటన్నిటిని తట్టుకుని నిలబడి రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కేటీఆర్‌ అడుగులు వేస్తున్నాడు. ఇక తెలంగాణలో మరోసారి తన తండ్రి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పంతో కేటీఆర్‌ పని చేస్తున్నాడు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top