icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow23 Jun 2024, 09:12 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌కు ఏడాది.. ఉదయం 1.05 గంటకు ఏం జరిగిందో తెలుసా?

Wadgaon, Maharashtra:

 Operation Sindoor Anniversary: భారత సైనికులను బలిగొన్న ప్రత్యర్థి పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడానికి అర్ధరాత్రి భారత సైన్యం భారీ వ్యూహం రచించింది. ప్రపంచం మొత్తం నిద్రపోతున్న వేళ భారత సైనిక దళాలు ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాయి. 7 మే 2025న ఆ రాత్రి శత్రు దేశానికి కాళరాత్రి.. మన దేశానికి శివరాత్రిగా మారింది. దేశ భద్రతకు సవాలు ఎదురైన సమయంలో సైన్యం సరిహద్దులో దాడులు చేసింది. ప్రత్యర్థి దేశానికి బుద్ధి చెప్పేందుకు విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ ఒక పదం కాదు పాకిస్తాన్‌కు ఊపిరి ఆడకుండా చేసిన ఒక దెబ్బ.

Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. 3,220 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన

ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం
ఏడాది కిందట భారత సైన్యం చేపట్టిన సైనిక చర్యకు ఆపరేషన్‌ సింధూర్‌ అని నామకరణం చేశారు. సరిహద్దుకు అవతలి వైపున ఉన్న ఉగ్రవాదులనే కాకుండా.. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న  పాకిస్తానీ వ్యవస్థను కూడా కుదిపేసింది. అత్యంత కచ్చితమైన, పరిమితమైన సైనిక చర్య ద్వారా భారతదేశం పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ఉగ్రవాద స్థావరాలను కూల్చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ దెబ్బ ఎలా ఉందంటే పాకిస్థాన్‌ ఇప్పటివరకు కోలుకోలేకపోయింది. జాతీయ భద్రతకు భంగం కలిగితే సరిహద్దుకు అవతలి వైపు నుంచి కూడా దెబ్బతీయవచ్చని భారత సైన్యం ప్రపంచానికి చాటి చెప్పింది.

ఆపరేషన్ సింధూర్ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఉగ్రవాద నెట్‌వర్క్‌ను, దానికి మద్దతు పలుకుతున్న వారి స్థావరాలను కూడా ప్రపంచం ముందు బహిర్గతం చేసింది. భారత సైన్యం చేపట్టిన ఈ వ్యూహాత్మక చర్యతో ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ. ఇది ఒక సైనిక చర్య మాత్రమే కాదు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం నూతన విధానానికి, మారిన వైఖరికి స్పష్టమైన సమాధానం.

Also Read: SRH Vs PBKS Highlights: పంజాబ్‌ హ్యాట్రిక్‌ ఓటమి.. అద్భుత విజయంతో టాప్‌లోకి సన్‌రైజర్స్

మే 7వ తేదీ రాత్రి ఉదయం.. 1.05 గంటలకు
భారతదేశ సరిహద్దు వెంబడి మే 7వ తేదీ రాత్రి 1:05 గంటలకు అకస్మాత్తుగా ఆందోళన మొదలైంది. తెల్లవారేసరికి శత్రు దేశంలో అలజడి మొదలైంది. అంతటా నిశ్శబ్దం ఆవరించిన సమయంలో శత్రు స్థావరాలలో భారతదేశ సైన్యం ప్రకంపనలు సృష్టించింది. ఆ రాత్రి ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో భద్రతా దళాలు, సైన్యం మాత్రం శత్రు దేశానికి బుద్ధి చెప్పే పనిలో నిమగ్నమైంది. తెల్లవారుజామున 1:05 గంటలకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది.

సరిహద్దు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు ప్రతిధ్వనించాయి. శత్రువుకు అప్రమత్తమై ప్రతి దాడి చేసే సమయంలో కూడా భారత సైన్యం ఇవ్వలేదు. లక్ష్య నిర్ధారణ ఎంత కచ్చితంగా అంటే నిమిషాల వ్యవధిలోనే ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఆఖరి క్షణం వరకు ఎవరికీ తెలియకుండా ఈ మొత్తం ఆపరేషన్‌ను అత్యంత రహస్యంగా జరిగింది. ఆ రాత్రి క్షిపణులు, ఆయుధాలు పూర్తి స్థాయిలో విజయవంతంగా పనిచేశాయి. శత్రు దేశం ప్రతిస్పందించేలోపు మొత్తం శత్రుమూకల స్థావరాలు నేలమట్టమయ్యాయి.

శత్రు దేశానికి కాళరాత్రి
మే 7వ తేదీ రాత్రి ఒక తేదీ మాత్రమే కాదు దేశ భద్రతకు సవాలు ఎదురైతే ఎలా బదులిస్తామో స్పష్టంగా ప్రపంచానికి చాటిచెప్పింది. శత్రు దేశాలకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన దాడి పాకిస్తాన్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. యుద్ధం చేయకుండానే శత్రు దేశానికి తనదైన శైలిలో భారతదేశం బుద్ధి చెప్పింది. పహల్గామ్ దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది.

88 గంటల పాటు బీభత్సం
నిశీధిలో భారత క్షిపణులు పాకిస్తాన్ ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్లి ఉగ్రవాదుల స్థావరాలను విధ్వంసం చేశాయి. ఈ దాడులతో ఉగ్రవాదానికి శాశ్వత సమాధి భారత సైన్యం చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌తో భారతదేశ శౌర్యగాథ స్వర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఆపరేషన్ సింధూర్ 88 గంటల పాటు కొనసాగింది. ఇజ్రాయెల్, రష్యా దేశాలు నెలల తరబడి యుద్ధాలు చేసినా కూడా కలిగించలేని నష్టాన్ని భారతదేశం పాకిస్థాన్‌కు 88 గంటల్లో చేసి చూపించిది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 కీలకమైన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తైబా ప్రధాన స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. పాకిస్థాన్‌లో కీలకమైన నూర్ ఖాన్, భోలారి వైమానిక స్థావరాలతో సహా 11 వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.

కూలిన పాకిస్తానీ యుద్ధ విమానాలు
భారత దాడిలో కమాండ్ కంట్రోల్ సెంటర్లతో పాటు ఒక సీ30 హెర్క్యులస్ రవాణా విమానం, ఒక అత్యంత విలువైన అవాక్స్ (AWACS) విమానం ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ గొప్పగా చెప్పుకునే షాహీన్, బాబర్ క్షిపణులను తన సుదర్శన్ చక్రతో కూల్చేసింది. ఒకవైపు ఉగ్రవాద స్థావరాలు తగలబడిపోతే.. మరోవైపు పాకిస్తాన్ సైనిక వైమానిక స్థావరాలు నేలమట్టమయ్యాయి. మౌలానా మసూద్ అజార్ మదర్సాలో నాలుగు పేలుళ్లు జరిగాయి. 

మే 7న భారత్ పాకిస్థాన్‌లోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు

==> జైష్ ప్రధాన కార్యాలయం బహవల్పూర్‌లో ఉంది. లష్కర్ ప్రధాన కార్యాలయం మురిద్కేలో ఉంది.

==> సర్జల్‌లో జైష్ ప్రయోగ వేదిక

==> మెహమూనా జోయా, హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణా కేంద్రం

==> భిబర్‌లో లష్కర్ శిక్షణా శిబిరం

==> కోట్లిలోని జైష్ కేంద్రం

==> కోట్లిలోని హిజ్బుల్ శిక్షణా కేంద్రం

==> ముజఫరాబాద్‌లో లష్కరే శిబిరం, మర్కజ్‌

ఈ 7 ఉగ్రవాద స్థావరాల నుంచే భారతదేశంపై ఉగ్ర దాడులకు ప్రణాళికలు రచించారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆ స్థావరాల నుంచే ఉగ్రవాదులు భారతదేశంపై దాడి చేయడానికి వచ్చారని భారత సైన్యం గుర్తించింది. ఆపరేషన్ సింధూర్‌తో వాటిపై యుద్ధం చేసింది. పహల్గామ్ దాడికి ఇది ప్రతీకార చర్య. ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో మసూద్ స్థావరం కూలిపోయింది. ఉగ్రవాదులు ఎక్కడ పుట్టారో అక్కడే మరణించారు. ఆపరేషన్ సింధూర్ మసూద్ కుటుంబాన్నే తుదముట్టించింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే కాకుండా.. ఉగ్రవాద నెట్‌వర్క్‌ను కూల్చేసింది.

భారత సైన్యం శౌర్య గాథ
ఆపరేషన్ సింధూర్‌లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల ఊరేగింపులు జరిగినప్పుడు పాకిస్తాన్ సైన్యం స్వయంగా పాల్గొని పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం కల్పిస్తుందో.. మద్దతు నిలుస్తుందో స్పష్టమైంది. ఆపరేషన్ సింధూర్ జరిగి ఏడాది పూర్తయినా దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ పాకిస్థాన్‌పై ఉంది. భారత దెబ్బకు పాకిస్తాన్ సైన్యం ఇప్పటికీ తన వైమానిక స్థావరాలను బాగు చేసుకోలేకపోతున్నది. ఇది భారత సైన్యం శౌర్యగాథ. ఆపరేషన్‌ సింధూర్‌ గురించి ఎప్పుడు చెప్పుకున్నా భారత సైన్యం సాహసాలకు ప్రతీకగా నిలుస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Bengal Assembly Dissolved: మమతా బెనర్జీకి గవర్నర్ బిగ్ షాక్..సీఎంగా రాజీనామా చేయలేదని ప్రభుత్వాన్ని రద్దు చేశారు!

Chhotobainan, West Bengal:

West Bengal Assembly Dissolved: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా నిరాకరించిన మమత బెనర్జీకి గవర్నర్ ఆర్.ఎన్.రవి గట్టి షాక్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన తన విచక్షణాధికారాలను ఉపయోగించి, ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేశారు.

మే 7 (నేడు) అర్ధరాత్రితో బెంగాల్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ, మమతా బెనర్జీ రాజీనామాకు సమ్మతించలేదు. దీంతో గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తూ.. మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో బెంగాల్‌పై దీదీకి ఉన్న 15 ఏళ్ల పట్టు సడలింది.

ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం
ఇటీవలే బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ 207 స్థానాల్లో ఘనవిజయం సాధించి స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకుంది. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేవలం 80 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాకు పడిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు.

మరోవైపు ఓటమిని అంగీకరించని మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర బలగాలు, ఎన్నికల సంఘం అండతో బీజేపీ అక్రమంగా గెలిచిందని, సుమారు 100 స్థానాల్లో తారుమారు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ గెలుపు అనైతికమని వాదిస్తూ, పదవి నుంచి వైదొలగడానికి ఆమె నిరాకరించారు.

అయితే గవర్నర్ ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మే 8న బీజేపీ తన శాసనసభా పక్ష నేతను (ముఖ్యమంత్రి అభ్యర్థిని) ఎన్నుకోనుంది. మే 9న పశ్చిమ బెంగాల్ చరిత్రలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం అధికారికంగా కొలువుదీరనుంది. గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కొత్త ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించే గవర్నర్ తీసుకున్న ఈ చర్య రాజ్యాంగపరంగా అత్యంత కీలకంగా మారింది.

ALso Read: వాహనదారులకు గట్టిదెబ్బ..పెండింగ్ చలాన్లు 45 రోజుల్లో చెల్లించకపోతే లైసెన్స్ రద్దు!

Also Read: భారత క్రికెట్‌లో విషాదం..విరాట్ కోహ్లీ టీమ్‌మేట్ అమన్‌ప్రీత్ గిల్ మృతి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Pending Challan News: వాహనదారులకు గట్టిదెబ్బ..పెండింగ్ చలాన్లు 45 రోజుల్లో చెల్లించకపోతే లైసెన్స్ రద్దు!

New Delhi, Delhi:

Delhi Pending Challan News: ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రేఖా గుప్తా ప్రభుత్వం అత్యంత కఠినమైన, పారదర్శకమైన డిజిటల్ చలాన్ వ్యవస్థను అమలులోకి తెచ్చింది. వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడం, రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఏర్పాటు ఈ మార్పులను తీసుకొచ్చారు.

ఈ కొత్త నిబంధనల పూర్తి వివరాలు ఇవే..
చలాన్ జారీ అయినప్పటి నుండి వాహనదారులకు 45 రోజుల సమయం ఉంటుంది. ఈ లోపు వారు జరిమానా చెల్లించాలి. లేదా చలాన్‌ను సవాలు చేస్తూ డిజిటల్ పోర్టల్‌లో అభ్యర్థన పెట్టుకోవాలి. ఒకవేళ 45 రోజుల్లో ఎలాంటి స్పందన లేకపోతే, సదరు వ్యక్తి నేరాన్ని అంగీకరించినట్లుగా భావించి తదుపరి చర్యలు తీసుకుంటారు.

మరోవైపు గతంలో లాగా నేరుగా కోర్టును ఆశ్రయించడం ఇక కుదరదు. ముందుగా ఆన్‌లైన్ ఫిర్యాదుల పోర్టల్‌లో సమస్యను విన్నవించుకోవాలి. ఒకవేళ కోర్టులో చలాన్‌ను సవాలు చేయాలనుకుంటే, మొత్తంలో 50% ముందుగానే డిపాజిట్ చేయాలి. దీనివల్ల అనవసరమైన కేసులు తగ్గి, విచారణ వేగవంతమవుతుంది.

నిబంధనలు అతిక్రమిస్తే 'బ్లాక్ లిస్ట్'
నిర్ణీత గడువులో చెల్లుబాటు కాకుండా వారిపై కఠినమైన ఆంక్షలు విధించనున్నారు. వాహన నియామకం, ట్యాక్స్ పేమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ వంటి సేవలను నిలిపివేస్తారు. బకాయిలు ఎక్కువగా ఉంటే వాహనాన్ని అమ్మకాన్ని నిలిపేసే విధంగా.. ఫ్లాగ్‌ రైజ్ చేయడంతో పాటు, అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.

పదేపదే తప్పు చేస్తే లైసెన్స్ రద్దు
ఏడాదిలో 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, వారిని తీవ్రమైన నేరస్థులుగా పరిగణిస్తారు. అలాంటి వారికి డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేసే అధికారం ఉంటుంది. ఇకపై అంతా ఆటోమేటెడ్ వ్యవస్థే. కెమెరాల ద్వారా రికార్డైన ఉల్లంఘనలకు 3 రోజుల్లో ఈ-చలాన్, 15 రోజుల్లో ఫిజికల్‌గా నోటీసులు అందుతాయి. మిస్ కాకుండా ఉండాలంటే మొబైల్ నంబర్ నోటీసు, అడ్రస్ అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Also Read: గుడ్‌న్యూస్ చెప్పిన సూర్యకుమార్ యాదవ్..టీమ్ఇండియా కెప్టెన్‌కు తండ్రిగా ప్రమోషన్!

Also Read: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..పవన్ కోసం నాని సినిమా పక్కనపెట్టిన సుదీప్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Suryakumar Yadav Baby: గుడ్‌న్యూస్ చెప్పిన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్..టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌కు తండ్రిగా ప్రమోషన్!

Hyderabad, Telangana:

Suryakumar Yadav Baby Girl: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దంపతులు శుభవార్త చెప్పారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌కు చెందిన ఈ స్టార్ బ్యాటర్ తుదిజట్టు నుంచి పక్కకి తప్పుకోవడం పట్ల పెద్ద చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆయన భార్య దేవిషా శెట్టిలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి ముంబై ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తన కుటుంబ అవసరాల కోసం సూర్యకుమార్ రాబోయే మ్యాచ్ నుంచి వైదొలగినట్లు తెలియడంతో ఫ్యాన్స్‌కు క్లారిటీ వచ్చింది. 

సూర్యకుమార్ కెరీర్ పరంగా చెప్పాలంటే 2026 ఎంతో గొప్పగా సాగింది. ఆయన కెప్టెన్సీలో టీమ్ఇండియా జట్టు టీ20 ప్రపంచకప్ లో విజేతగా నిలవగా.. ఇప్పుడు ఆయన భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ ఆనందం రెట్టింపు అయ్యింది. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సూర్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసులో అతికష్టం మీద సాగుతోంది. 10 మ్యాచ్‌ల తర్వాత కేవలం ఆరు పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ముంబై ఇండియన్స్‌ నిలిచింది. ఈ టీమ్ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే ఆడే ఇకపై లీగ్‌లో ఆడాల్సిన ప్రతి మ్యాచ్ తప్పక గెలవడంతో పాటు నెట్ రన్‌రేట్ కూడా మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది.

అతని వ్యక్తిగత ఫామ్ ఏమాత్రం సంతృప్తికరంగా లేనప్పటికీ.. ఈ ఆటగాడికి 2026 ఏడాది అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే, దాదాపు రెండు నెలల క్రితం మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి, అతను కెప్టెన్‌గా వ్యవహరించి భారత్‌కు 2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను అందించాడు.

ఐపీఎల్ 2026లో తిరిగి ఫామ్‌లోకి రావాలని సూర్యకుమార్ ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన 10 మ్యాచ్‌లలో అతను 19.50 సగటుతో, 145.52 స్ట్రైక్ రేట్‌తో కేవలం 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆరోగ్య సమస్యల కారణంగా రెండు మ్యాచ్‌లకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమవ్వగా.. ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ కూడా ఆర్సీబీతో మ్యాచ్‌లో తప్పుకోవడంతో జట్టుకు జస్‌ప్రీత్ బుమ్రా లేదా రోహిత్ శర్మ కెప్టెన్సీ వ్యవహరించే అవకాశం ఉంది.

Also Read: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఝలక్..ఆర్సీబీతో మ్యాచ్‌కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!

Also Read: భారత క్రికెట్‌లో విషాదం..విరాట్ కోహ్లీ టీమ్‌మేట్ అమన్‌ప్రీత్ గిల్ మృతి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

SVSN Varma Resign: ఇన్‌చార్జ్‌ పదవి తొలగింపు.. టీడీపీకి పిఠాపురం వర్మ రాజీనామా?

Pithapuram, Andhra Pradesh:

Pithapuram Politics: ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా పిఠాపురం నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు గుర్తింపు దక్కడం లేదు. వరుస అవమానాలు జరుగుతున్న నేపథ్యంలో అతడు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. తాజాగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవి నుంచి తొలగించడంతో వర్మ దిగ్భ్రాంతికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న నిర్ణయంతో అతడు భావోద్వేగానికి లోనయి.. కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ అవమానిస్తుండడంతో అతడు తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. 

Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. 3,220 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన

పిఠాపురం బాధ్యతల నుంచి తొలగింపు
2024లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన పొత్తు కుదరడంతో పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్‌కల్యాణ్‌కు దక్కింది. ఎన్నో ఏళ్లుగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్మను ఏమాత్రం సంప్రదించకుండా జనసేనకు టికెట్‌ ఇవ్వడంతో తీవ్ర వివాదం రాజుకుంది. ఎన్నికలు ముగిశాక.. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వర్మకు పిఠాపురంలో ప్రాధాన్యం లేకుండాపోయింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా వర్మకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు.

Also Read: SRH Vs PBKS Highlights: పంజాబ్‌ హ్యాట్రిక్‌ ఓటమి.. అద్భుత విజయంతో టాప్‌లోకి సన్‌రైజర

పవన్‌ కల్యాణ్‌ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మకు గౌరవం.. పెద్ద పదవి ఇవ్వాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. సొంత ప్రభుత్వంలో ప్రమోషన్‌ రావాల్సి ఉండగా.. ఉన్న పదవినే పీకేశారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవి నుంచి టీడీపీ తొలగించడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నియోజకవర్గంపై నూతన కమిటీ ఏర్పాటు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడంపై వర్మ కలత చెందారు. తనను పదవి నుంచి తొలగించడంతో వర్మ భావోద్వేగానికి లోనయి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ప్రకటించారు. కానీ లోలోపల మాత్రం వర్మ తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో టీడీపీని వీడే అవకాశం కూడా లేకపోలేదని చర్చ జరుగుతోంది.

పదవి నుంచి తొలగించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉన్నా. రకరకాల సమీకరణాలతో మార్పులు జరుగుతుంటాయి. ఫైనల్‌గా పార్టీ బాగుండాలనేదే చూడాలి. నారా లోకేష్ నాతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నాయకులే ఇక్కడ నిర్వహణ చేస్తారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను పూర్తిగా సహకరిస్తా' అని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు.

వరుస అవమానాలు
కూటమి ప్రభుత్వం వచ్చాక వర్మకు ఇంటా బయట ఘోర అవమానాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా వర్మకు గుర్తింపు లభించకపోగా.. మిత్రపక్షం జనసేన పార్టీ పవన్‌ కల్యాణ్‌ను పట్టించుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో.. ప్రభుత్వ కార్యక్రమాల్లో వర్మకు ప్రాధాన్యం లభించడం లేదు. జనసేన పార్టీ నాయకులు పిఠాపురంలో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే వర్మ పలుమార్లు తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. కొన్నిసార్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి పూర్తిగా వదిలేసింది. ఈ నేపథ్యంలోనే వర్మకు నియోజకవర్గంలో పట్టించుకోవడం లేదు. వరుస వివాదాల నేపథ్యంలో వర్మను పక్కనపెట్టారు. ఈ క్రమంలో పదవి నుంచి తొలగించగా.. మనస్తాపానికి లోనయిన వర్మ టీడీపీకి రాజీనామా చేస్తారని చర్చ జరుగుతోంది. తన ఉనికి ప్రశ్నార్థకమైన సమయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

OG Part 2 Shooting: పవర్‌స్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్..పవన్ కోసం నాని సినిమా పక్కపెట్టిన సుదీప్..షూటింగ్ ఎప్పుడంటే?

Hyderabad, Telangana:

OG Part 2 Shooting Update: నేచురల్ స్టార్ నాని అభిమానులకు ఇప్పుడు 'ఓజీ' డైరెక్టర్ సుదీప్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హీరో నాని - సుజీత్ కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'బ్లడీ రోమియో' షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.

వాయిదాకు కారణం ఏంటి?
ప్రస్తుతం హీరో నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో "ది పారడైజ్" అనే భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. 'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మొదట 2026 వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2026 ఆగస్టు 21కి వాయిదా పడింది. నాని తన పూర్తి కాల్‌షీట్లను "ది పారడైజ్" సినిమాకే కేటాయించాల్సి రావడంతో, సుజీత్ సినిమా ఆలస్యమైంది.

'OG 2'పై ఫోకస్
'బ్లడీ రోమియో' షూటింగ్ ప్రారంభానికి 2026 ఆఖరు లేదా 2027 ప్రథమార్థం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీనితో దర్శకుడు సుజీత్ ఖాళీగా ఉండకుండా తన తదుపరి భారీ ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ ఫిలిం 'OG' సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను సుజీత్ వేగవంతం చేశారని తెలుస్తోంది. 'OG' సినిమాపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, సీక్వెల్‌ను మరింత పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తూనే, నాని డేట్స్ దగ్గరకి వచ్చినప్పుడు 'బ్లడీ రోమియో'ను పట్టాలెక్కించేలా సుజీత్ ప్లాన్ చేసుకున్నాడు. మొత్తానికి నాని లైనప్‌లో మార్పులు జరగడం వల్ల 'బ్లడీ రోమియో' కోసం ఫ్యాన్స్ మరికొన్నాళ్లు నిరీక్షించక తప్పదు. అయితే, 'ది పారడైజ్' నుంచి వస్తున్న అప్‌డేట్స్ నాని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నాని కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలవబోతోంది.

Also Read: భారత క్రికెట్‌లో విషాదం..విరాట్ కోహ్లీ టీమ్‌మేట్ అమన్‌ప్రీత్ గిల్ మృతి..

Also REad: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఝలక్..ఆర్సీబీతో మ్యాచ్‌కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

AP Govt Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. ఏపీలో 3,220 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన!

Nuzendla, Andhra Pradesh:

AP Govt Job Notification: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులకు భారీ శుభవార్త. భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనుంది. రాష్ట్రంలో 3,220 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పే అధ్యాపక పోస్టులను ప్రభుత్వం భారీగా భర్తీ చేయనుంది. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలతోపాటు ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఏయే యూనివర్సిటీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? అర్హులు ఎవరు? జీతం ఎంత అనే వివరాలు తెలుసుకుందాం.

రాష్ట్రవ్యాప్తంగా విశ్వ విద్యాలయాలు, సాంకేతిక ఉన్నత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వర్సిటీల వారీ ఖాళీల వివరాలను వెల్లడిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నోటిఫికేషన్లలోని న్యాయపరమైన చిక్కులు, సాంకేతిక లోపాలను సవరించి, త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

అత్యధికంగా ఆర్‌జీయూకేటీలో 660 పోస్టుల భర్తీ చేయనుండగా.. అతి తక్కువగా 63 పోస్టులు ద్రవిడయన్‌ విశ్వవిద్యాలయంలో భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ప్రకటన త్వరలోనే రానున్నాయి. అర్హులు ఎవరు? జీతం ఎంత? తదితర వివరాలు ఆయా విశ్వవిద్యాలయాలతోపాటు ఉన్నత విద్యా శాఖ ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ? ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు
ఆర్‌జీయూకేటీ - 660
ఆంధ్ర విశ్వవిద్యాలయం- 523
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం - 265
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం- 219
జేఎన్టీయూ -ఎ - 203
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం- 175
వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ - 138
జేఎన్టీయూ (గురజాడ-విజయనగరం) 138
యోగి వేమన విశ్వవిద్యాలయం - 118
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం -106
రాయలసీమ విశ్వవిద్యాలయం- 103
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం - 103
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం- 99
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ - 99
జేఎన్టీయూ(కె) - 98
కృష్ణా వర్సిటీ - 86
డాక్టర్ అబ్దుల్ హక్ - 63
ద్రవిడ - 24
మొత్తం ఖాళీలు 3,220

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Amanpreet Singh Gill: భారత క్రికెట్‌లో విషాదం..విరాట్ కోహ్లీ టీమ్‌మేట్ అమన్‌ప్రీత్ గిల్ మృతి..

Hyderabad, Telangana:

Amanpreet Singh Gill Death: భారత క్రికెట్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. భారత అండర్ 19 జట్టు మాజీ ఆటగాడు, మీడియం పేసర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం చండీగఢ్‌లో కన్నుమూశారు. ఇంత చిన్న వయసులో ఆయన మరణించడం క్రీడలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

కోహ్లీ, యువరాజ్‌లకు సహచరుడు 
అమన్ ప్రీత్ సింగ్ గిల్ తన కెరీర్ ఆరంభంలో భారత స్టార్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకున్నారు. 2007లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అండర్-19లో సభ్యుడిగా ఉండేవాడు. రవీంద్ర జడేజా, మనీష్ పాండే వంటి వారితో కలిసి ఆయన ఆడారు. దేశవాళి క్రికెట్లో పంజాబ్ జట్టు తరుపున ఆడుతున్న సమయంలో దిగ్గజా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ ను అమన్ ప్రీత్ సింగ్ పంచుకున్నారు. అమన్ ప్రీత్ సింగ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకోకపోయినా, దేశవాళీ క్రికెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

అమన్ ప్రీత్ సింగ్ చేసేవాళ్ల క్రికెట్లో పంజాబ్ జట్టు తరఫున 2006 నుంచి 2008 మధ్యలో ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 11 వికెట్లను పడగొట్టారు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో అప్పటి కింగ్స్ 11 పంజాబ్.. ప్రస్తుత పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ లో సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా సేవలందించారు. 

అమన్ ప్రీత్ సింగ్ గిల్ మరణం వార్త తెలియగానే విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించారు. "పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) అమన్ ప్రీత్ మరణాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ఒక లేక విడుదల చేసింది. పంజాబ్ క్రికెట్ ఆటగాడిగా, సెలక్టర్‌గా అమన్ ప్రీత్ సింగ్ చేసిన సేవలు మరువలేనివి. ఆయన అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం" అని పేర్కొంది.

Also Read: RCB Vs MI 2026: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఝలక్..ఆర్సీబీతో మ్యాచ్‌కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!

Also Read: CM Vijay Salary: రూ.600 కోట్ల ఆస్తి.. సీఎంగా టీవీకే విజయ్ నెలజీతం ఎంతో తెలుసా? ఎంత నష్టమో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Cobra Video: ప్రకృతి వింత.. ఆవు పాలు తాగుతున్న కింగ్ కోబ్రా.. షాక్ అవుతున్న నెటిజన్లు!

Hyderabad, Telangana:

  Cobra Drinking Cow Milk Viral Video: ప్రకృతిలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు మన కళ్ళను మనమే నమ్మలేకపోతూ ఉంటాం.. సాధారణంగా పాము కనిపిస్తే మనుషులైన.. జంతువులైన భయంతో ఆ మెడ దూరం పరిగెడతాయి. ఇక క్రూరమైన విష సర్పం ఎదురైతే ప్రాణభయంతో వణికిపోవడం సర్వసాధారణమే.. కానీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం ఎందుకు భిన్నంగా కనిపిస్తూ ఉంది. ఒక ప్రమాదకరమైన కింగ్ కోబ్రా.. పచ్చిక మైదానంలో మేతమేస్తున్న ఆవు వద్దకు చేరి నేరుగా పొదుగు నుంచే పాలు తాగిన అరుదైన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి..

ఒక మైదానంలో ఆవు ప్రశాంతంగా మేస్తోంది.. అదే సమయంలో అక్కడికి ఒక భారీ నాగుపాము వచ్చింది.. సాధారణంగా పామును చూసినప్పుడు పశువులు భయపడి అరుస్తూ ఉంటాయి.. లేదంటే అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆవు మాత్రం భయపడకుండా తన పని తాను చేసుకుంటుండగా.. ఆ నాకు పాము మెల్లగా ఆవు వెనక కాళ్ల మధ్యలోకి వెళ్లి పొదుగు పట్టుకొని పాలు తాగడం మొదలుపెట్టింది.. 

ఈ దృశ్యంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పాము ఆవును ఏమాత్రం కాటు వేయడానికి ప్రయత్నించలేదు.. అటు ఆవు కూడా పాము తన పాలు తాగుతున్నప్పటికీ ఎంతో సాధారణంగా నిలబడి మేతమేయడం మీరు చూడొచ్చు. సాధారణంగా నాగుపాము కాటు వేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతూ ఉంటాయి.. కానీ ఇక్కడ ఆ రెండు మూగజీవుల మధ్య ఒక వింతైన అనుబంధం కనిపిస్తుంది. ఈ ఆరుదైన దృశ్యాన్ని అక్కడే ఉన్న కొంతమంది తమ స్మార్ట్ ఫోన్స్ ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటినుంచి వైరల్ అవ్వడం ప్రారంభమైంది..

 
 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్ తో పాటు వేళలో కామెంట్ లతో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. సాధారణంగా రెండు మూగ జీవుల మధ్య ఉన్న ప్రేమ అంతో ఇంతో కాదని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. మరి కొంతమంది ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. పురాణాల్లో పాములకు పాలు పోసే ఆచారాల గురించి విన్నాం కానీ ఇలా ప్రత్యక్షంగా ఆవు పాలు తాగడం చూడడం ఇదే మొదటిసారి అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

  

0
0
Report

OnePlus 16 ప్రభంజనం.. 200MP కెమెరా, 9000mAh బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త రికార్డు!

Hyderabad, Telangana:

OnePlus 16 Leaks: ప్రస్తుతం సోషల్ మీడియాలో వన్ ప్లస్ స్మార్‌ఫోన్‌కు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి.. ముఖ్యంగా త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోయే OnePlus 16 సిరీస్ మోడల్స్‌కు సంబంధించిన వివిధ స్మార్‌ఫోన్స్‌ ఫీచర్స్ లీక్ అవుతూనే వస్తున్నాయి. తాజాగా కూడా ఈ సిరీస్‌కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ లీకయ్యాయి. ముఖ్యంగా ఈ అత్యంత శక్తివంతమైన సిరీస్ అక్టోబర్‌లోని విడుదల కాబోతోంది. ఈ స్మార్‌ఫోన్స్‌లో గతంలో ఉన్న మోడల్స్ ఫీచర్స్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా డిజైన్ పరంగా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని లీకైన వివరాలు చెబుతున్నాయి. అయితే వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ OnePlus 16 స్మార్‌ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. దానికి కెమెరా సెట్ అప్.  అవును వన్‌ప్లస్ 16లో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ కెమెరాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫోటోగ్రఫీని ఊహించని స్థాయికి తీసుకెళ్లేందుకు ఇందులో ఎన్నో రకాల ప్రత్యేకమైన కెమెరా సెన్సార్లు ఉన్నట్లు తెలుస్తోంది. దూరంగా ఉన్న వస్తువులను సైతం స్పష్టంగా నాణ్యంగా చిత్రీకరించేందుకు ఇందులో ఎన్నో రకాల కెమెరా సెన్సార్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా ప్రధాన కెమెరా తో పాటు అదనంగా 50MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ లెన్స్ ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 

ఇక ఈ OnePlus 16 స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. వన్ ప్లస్ కంపెనీ గతంలో ఫ్లాగ్ షిప్ మొబైల్స్‌లో కేవలం 5000mAh బ్యాటరీ ని మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, త్వరలో విడుదల కాబోయే ఈ  స్మార్‌ఫోన్‌ సిరీస్ ఎంతో శక్తివంతమైన 9000mAh భారీ బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలా ప్రత్యేకమైన 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.. ఈ వన్ ప్లస్ 16 సిరీస్‌లో కంపెనీ ఎంతో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో (Snapdragon 8 Elite Gen 6 Pro) ప్రాసెసర్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

ఈ శక్తివంతమైన ఫీచర్ గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్ అత్యంత అద్భుతమైన పనితీరును అందిస్తుంది. అంతేకాకుండా ఈ OnePlus 16 మొబైల్ డిస్ప్లే అన్ని స్మార్‌ఫోన్స్‌ కంటే చాలా భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన 1.5K రిజల్యూషన్ OLED డిస్‌ప్లేతో విడుదల చేసే అవకాశాలున్నాయి. అలాగే ఇది 240Hz రిఫ్రెష్ రేట్ ఉండటం మొబైల్ ప్రియులను ఎంతగానో ఆకర్షించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఈ స్మార్‌ఫోన్‌ డిజైన్ చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని కంపెనీ 24 జీబీ ర్యామ్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. దీంతోపాటు ఈ స్మార్‌ఫోన్‌ను అక్టోబర్‌లో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది. ఈ సమయంలోనే కంపెనీకి సంబంధించిన వివిధ రకాల ఫీచర్స్, ధర వివరాలను కూడా వెల్లడించబోతున్నట్లు సమాచారం..

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Karimnagar: BRS వర్సెస్ BJP.. కరీంనగర్‌లో భారీగా పోలీసుల మోహరింపు!

Karimnagar, Telangana:

Karimnagar Political Clash Telugu News: కరీంనగర్ జిల్లా కేంద్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. రెండు పార్టీల మధ్య చెలరేగిన రాజకీయ సెగలు చివరికి గాలి వానలా మారి.. నగరాన్ని రణరంగాన్ని తలపించేలా చేశాయి.. భారత రాష్ట్ర సమితితో పాటు భారతీయ జనతా పార్టీ శ్రేణుల మధ్య తలెత్తిన తీవ్ర గర్షణతో కరీంనగర్‌లో అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనకు దిగడంతో శాంతిభద్రతల పరిరక్షణ పోలీసులకు సవాలుగా మారింది. దీని కారణంగా లాఠీ చార్జ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది..

స్థానిక రాజకీయ అంశాలతో పాటు పరస్పర విమర్శల నేపథ్యంలో.. రెండు పార్టీల కార్యకర్తలు వీధుల్లోకి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మీరు వర్గాలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో పరిణామాలు సాధారణ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేతో పాటు క్యాంప్ ఆఫీస్, ఇతర కార్యాలయాలు లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగే అవకాశం ఉందన్న నిగావర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు..

ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో భారీ బందోబస్తులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఎంపీ కార్యాలయాల వద్ద వందలాదిమంది పోలీసు బలగాలను మొహరించారు. అంతేకాకుండా కార్యాలయాలకు వెళ్లే దారులన్నీ బారికేడ్లతో మూసివేశారు. కార్యాలయాల పరిసరాల్లోకి అపరిచిత వ్యక్తులు గాని.. కార్యకర్తలు గాని రాకుండా 144 సెక్షన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి అదనపు బలగాలను రప్పించి నగరంలోని ప్రధాన కూడళ్లలో ఇప్పటికే మొహరింపజేసినట్లు తెలుస్తోంది.

Also Read: Army Canteen Prices: ఆర్మీ క్యాంటిన్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయో తెలుసా? ఈ సీక్రెట్ చదివితే వావ్ అంటారు..!!

ఉద్రిక్తతలు మరింత ముదురకుండా ఉండేందుకు పోలీసు ఉన్నత అధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. అంతేకాకుండా ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నగరంలోని ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకమైన నిఘవ్యవస్థను కూడా ఉంచిన సమాచారం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ.. అంతర్గతంగా రాజకీయ సెగలు ఇంకా చల్లారలేదు.. మీరు పార్టీల ముఖ్య నేతలు తమ కార్యకర్తలను శాంతింప చేయాలని పోలీసులు కూడా కోరుతున్నారు. గంట గంటకు మారుతున్న పరిణామాలతో కరీంనగర్ వాసులు ఉత్కంఠగా గమనిస్తున్నారు..

Also Read: Army Canteen Prices: ఆర్మీ క్యాంటిన్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయో తెలుసా? ఈ సీక్రెట్ చదివితే వావ్ అంటారు..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

RCB Vs MI 2026: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఝలక్..ఆర్సీబీతో మ్యాచ్‌కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!

Hyderabad, Telangana:

RCB Vs MI 2026 Ruled Out: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరగబోయే తదుపరి మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే గత మ్యాచ్‌కు కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరంగా ఉండగా.. ఇప్పుడు ఆర్సీబీతో మ్యాచ్‌కు మరో స్టార్ ఆటగాడు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరు, ముంబై మధ్య ఈ ఆదివారం మ్యాచ్ జరగనుంది. 

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు.. సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ కీలక మ్యాచ్‌కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముంబై రెగ్యులర్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, మే 4న లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన గత మ్యాచ్‌కు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా పాండ్యా ఆ మ్యాచ్ ఆడలేకపోయాడు. అదే కారణంతో హార్దిక్ ఆర్సీబీ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.

ముంబై ఆడిన గత మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గైర్హాజరీ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల సూర్య కుమార్ యాదవ్ రాబోయే ఆర్సీబీ మ్యాచ్‌కు దూరం కానున్నడని సమాచారం. అయితే దీనిపై ఆ జట్టు యాజమాన్యం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఘన విజయం సాధించింది. మొన్నటి వరకు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నట్లు పరిస్థితి కనిపించినా.. లక్నోపై విజయంతో మరోసారి రేసులో ఉన్నామని ప్రత్యర్థులకు తెలియజేసింది.

హార్దిక్ లేదా సూర్య మాత్రమే కాకుండా, కొంతమంది విదేశీ ఆటగాళ్లు, ఇద్దరు ప్రముఖ భారత ఆటగాళ్లు కూడా ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నారని సమాచారం. అయితే ఈ క్రమంలో ఆర్సీబీతో మ్యాచ్‌లో కెప్టెన్‌గా ఎవరుంటారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.  హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లేని సమయంలో.. జట్టుకు తాత్కాలిక కెప్టెన్ ఎవరు అవుతారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. రోహిత్ శర్మతో పాటు స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టు పగ్గాలను దక్కించుకునే అవకాశం ఉంది. 

Also Read: CM Vijay Salary: రూ.600 కోట్ల ఆస్తి.. సీఎంగా టీవీకే విజయ్ నెలజీతం ఎంతో తెలుసా? ఎంత నష్టమో తెలుసా?

Also REad: TVK Vijay Oath: ఎట్టకేలకు సీఎంగా విజయ్ ప్రమాణం..కానీ, ఆ షరతు పెట్టిన తమిళనాడు గవర్నర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

CM Vijay Salary: రూ.600 కోట్ల ఆస్తి.. సీఎంగా టీవీకే విజయ్ నెలజీతం ఎంతో తెలుసా? ఎంత నష్టమో తెలుసా?

Nagalapuram, Tamil Nadu:

TVK Vijay CM Salary: దశబ్ద కాలంగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే, అన్నా డీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు దీటుగా తన మొదటి ఎన్నికల్లోనే విజయ్ ప్రభంజనం సృష్టించారు. ముఖ్యమంత్రి పీఠం దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఆయన ఆస్తులు వివరాలు అఫిడవిట్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. 

విజయ్ నికర సంపద వివరాలు..
టీవీకే విజయ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విజయ్ మొత్తం నికర ఆస్తుల విలువ సుమారు రూ.630.20 కోట్లు. ఇందులో చరాస్తులు రూ.404.58 కోట్లు ఉండగా అందులో రూ.213 కోట్లకు పైగా బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే స్థిరాస్తులు రూ.198.62 కోట్ల చెన్నైలో విలువైన ఖరీదైన భవనాలు, కొడైకెనాల్‌లో భూములు ఇతర వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు తెలుస్తుంది. వీటితోపాటు టీవీకే విజయ్ వద్ద బీఎండబ్ల్యూ, లక్సస్, టయోటా వెల్ఫేర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. 

టీవీకే విజయ్ హీరోగా పనిచేసిన రోజుల్లో ఏడాదికి సుమారు రూ.180 కోట్లు వరకు సంపాదించేవారు. అయితే ఇప్పుడు రాజకీయాల్లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయనకు ఓ ఎమ్మెల్యేకు వచ్చే జీతభత్యాలు పొందుతారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా కొన్ని అలెవెన్స్‌లు కూడా పొందుతారు. ఈ విధంగా వార్షిక ఆదాయం రూ.34 లక్షల వరకు ఉంటుంది. అంటే ఎమ్మెల్యేగా టీవీకే విజయ్ నెలకు సుమారు రూ.2.85 లక్షల జీతం రానుంది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ఆదాయం భారీగా తగ్గినప్పటికీ.. ఆయన బాధ్యతలు, హోదా మాత్రం అమాంతం పెరిగాయి. తనకున్న అశేష ప్రజలను కేవలం బాక్సాఫీస్ రికార్డులకే పరిమితం చేయకుండా, ప్రజల కష్టాలను తీర్చే 'జన నాయకుడి'గా నిరూపించుకోవడమే తన లక్ష్యమని ఆయన చెప్పకనే చెబుతున్నారు. వ్యక్తిగత సంపదను పక్కనపెట్టి రాజకీయాల్లోకి రావడం ఆయన అంకితభావానికి నిదర్శనం అని విశ్లేషకులు అతని అభిమానులు భావిస్తున్నారు. 

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని జాతీయ కథనాల ఆధారంగా పొందుపరిచింది. దీనిపై స్పష్టమైన సమాచారం కోసం జాతీయ ఎన్నికల కమిషన్ అధికార వెబ్‌సైట్‌ను సందర్శించగలరు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.)

Also Read: TVK Vijay Oath: ఎట్టకేలకు సీఎంగా విజయ్ ప్రమాణం..కానీ, ఆ షరతు పెట్టిన తమిళనాడు గవర్నర్!

Also Read: Prashant Kishor Kavitha: కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు కవిత సరికొత్త ప్లాన్..రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top