icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow23 Jun 2024, 09:12 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Uber Rapido Merger: ఉబర్-ర్యాపిడో విలీన చర్చలపై అర్ధాంతర బ్రేక్..మేనేజ్‌మెంట్ విభేదాలే కారణమా?

Hyderabad, Telangana:

Uber Rapido Deal: అమెరికాకు చెందిన ప్రముఖ రైడ్‌ హెయిలింగ్‌ సంస్థ ఉబర్‌, భారతీయ స్టార్టప్‌ రాపిడోతో కలిసి పనిచేసేందుకు జరిపిన చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దేశీయంగా తమ కార్యకలాపాలను విలీనం చేసుకునే దిశగా అడుగులు వేసినప్పటికీ, యాజమాన్య నియంత్రణ విషయంలో ఇరు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ డీల్‌కు బ్రేక్‌ పడింది.

చర్చల వెనుక అసలు కథ
ఉబర్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ దారా ఖోస్రోషాహి ఈ ఏడాది మే నెలలో ఐదు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. దేశంలో పెట్టుబడులు, వ్యాపార విస్తరణ ప్రణాళికలపై ఆయన వరుస సమీక్షలు జరిపారు. ఈ క్రమంలోనే రాపిడోతో విలీనం అంశం తెరపైకి వచ్చింది.

ఉబర్‌ ప్రతిపాదన ఏమిటంటే?
క్యాబ్‌, ఆటో, బైక్‌ ట్యాక్సీ సేవలందిస్తున్న ఇరు సంస్థలు కలిసి పనిచేయాలని ఉబర్‌ తొలుత ప్రతిపాదించింది. అంతేకాకుండా, దేశీయంగా తమ కార్యకలాపాలన్నింటినీ రాపిడో బృందమే నిర్వహించాలని సూచించింది.

అయితే, రాపిడో మాత్రం అందుకు భిన్నమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఉబర్‌ భారత వ్యాపారాన్ని పూర్తిగా తమకు క్యాష్‌-స్టాక్‌ లావాదేవీ రూపంలో విక్రయించాలని, రాపిడోలో ఉబర్‌ కేవలం మైనారిటీ వాటాదారుగా మాత్రమే ఉండాలని కోరింది.

డీల్‌కు ఎందుకు బ్రేక్‌ పడింది?
భారత్‌లో తమ వ్యాపారాన్ని పూర్తిగా వేరే సంస్థకు విక్రయించడం ఇష్టం లేని ఉబర్‌.. రాపిడో ప్రతిపాదనను తిరస్కరించింది. మేనేజ్‌మెంట్ కంట్రోల్ తమ చేతుల్లోనే ఉండాలని ఉబర్‌ భావించగా, రాపిడో పూర్తి స్థాయి యాజమాన్యాన్ని కోరడంతో ఈ చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి.

ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు ఎవరికి వారుగా స్వతంత్రంగానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. రాపిడోకు గట్టి పోటీనిచ్చేందుకు ఉబర్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తన బైక్‌ ట్యాక్సీ సేవలను కొత్తగా మరో 100 నగరాలకు విస్తరించగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 220 నగరాల్లో ఉబర్‌ బైక్‌ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Also Read: ఆగస్టు 15న వినియోగదారులకు స్పెషల్ ఆఫర్.. రూ.1 రీఛార్జ్ ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ వచ్చింది

Also Read: ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్..పీఎం ఈ-డ్రైవ్ పథకంతో రూ.5,000 డిస్కౌంట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Teacher Hair: విద్యార్థితో దర్జాగా జడ వేయించుకున్న ఇంగ్లీష్ టీచరమ్మ.. వీడియో వైరల్‌

Kesamudram, Telangana:

KGBV Teacher Hair Video: విద్యార్థినులకు  విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయులు తమ సొంత పనులు చేపించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ విద్యార్థులతో జుట్టు వేయించుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థిని తో జడలు వేయించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా మిగతా విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించారు. మరికొందరు విద్యార్థులతో గుంజీలు తీయించారు.   ఈ సంఘటన తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులో కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు అర్చన ఉన్నారు. ఆమె పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థినితో జడలు వేయించుకున్నారు. ఆ దృశ్యాలు ఎవరో ఫోన్‌లో చిత్రీకరించారు. అంతేకాకుండా మరో విద్యార్థి కూర్చుని ఉండగా ఏమైంది? అంటూ దురుసుగా ప్రవర్తించారు. 20 గుంజీలు తీయించారు అని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆమె మాత్రం విద్యార్థినితో దురుసుగా మాట్లాడారు. ఈ వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది.

టీచర్‌ చేసిన పనికి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన ఆమె ఇలా తన సొంత పనులు చేయించుకోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ఇది ఇల్లా లేక ఆ పిల్లలు పనిమనుషులా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమె వ్యవహార శైలి ఎప్పుడూ ఇలానే ఉంటుందని.. విద్యార్థులను వేధింపులకు గురి చేస్తోందని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఇంగ్లీష్‌ టీచర్‌ అర్చనను సస్పెండ్‌ చేయాలని కేజీబీవీలోని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

కాగా కేజీబీవీలో మరికొందరు పాఠశాల ఉపాధ్యాయులు, హాస్టల్‌ వార్డెన్‌ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సరైన ఆహారం పెట్టడం లేదని.. తమ గురుకులంలో మౌలిక వసతులు కరువయ్యాయని విద్యార్థులు వాపోతున్నారు. కేజీబీవీపై ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయ. వెంటనే కేజీబీవీ విద్యాలయాన్ని సందర్శించి ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

0
0
Report

Midnight Independence: భారతదేశానికి అర్ధరాత్రే స్వాతంత్ర్యం ఎందుకు వచ్చింది? ఆగస్టు 15 వెనుక దాగున్న జోతిష్య రహస్యం!

Hyderabad, Telangana:

Midnight Independence Astrology: 1947, జూన్ 4వ తేదీ ఉదయం.. కలకత్తాలోని ఓ ఇంట్లో రేడియో వింటున్న ప్రముఖ జ్యోతిష్కుడు స్వామి మదనానంద్ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బ్రిటీష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ఆల్ ఇండియా రేడియో వేదికగా ఒక సంచలన ప్రకటన చేశారు. 1948 జూన్ వరకు ఉన్న గడువును ముందుకు జరిపి, 1947 ఆగస్టు 15నే భారత్‌కు పూర్తి స్వాతంత్ర్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. దేశమంతా పండగలా భావించే ఈ వార్త మదనానంద్‌ను అపారమైన భయాందోళనలోకి నెట్టింది.

వెంటనే ఆయన తన జ్యోతిష్య పటాలను, గ్రహాల చక్రాలను పరిశీలించగా.. ఆయన గుండె ఆగిపోయినంత పనైంది. "గ్రహాల స్థితి దారుణంగా ఉంది.. ఆ రోజు భారత్‌ జన్మించకూడదని" ఆయన అంతరాత్మ ఘోషించింది.

జ్యోతిష్కుల హెచ్చరికలు - అశుభ ముహూర్తం
మదనానంద్ ఒక్కరే కాదు.. కలకత్తా, బెనారస్, దక్షిణ భారతదేశంలోని దిగ్గజ జ్యోతిష్కులందరూ ఖగోళ చక్రాలను పరిశీలించగా అందరి లెక్కింపుల ముగింపు ఒక్కటే అయింది. భారత్‌ స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి నిర్ణయించిన 'ఆగస్టు 15' అత్యంత అశుభకరమైన రోజు!

ఆ రోజు శుక్రవారం కావడం, మకర లగ్నంలో శని, రాహువుల ప్రభావం ఉండటం, గురు, శుక్ర గ్రహాలు అత్యంత అపశకున స్థానాల్లో కొలువై ఉండటం దేశానికి పెను ముప్పు తెస్తుందని వారు నమ్మారు. ఈ తేదీని మార్చకపోతే వరదలు, కరువులు, దారుణమైన మారణకాండలు ముంచెత్తుతాయని హెచ్చరిస్తూ మదనానంద్ స్వయంగా మౌంట్‌బాటన్‌కు లేఖ రాశారు. "భగవంతుడి మీదొట్టు.. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వకండి" అని వేడుకున్నారు. మరోవైపు ప్రముఖ జ్యోతిష్కులు జవహర్‌లాల్ నెహ్రూతో సహా ప్రధాన నాయకులను కలసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

మౌంట్‌బాటన్ పట్టుదల వెనుక కారణం
బ్రిటీష్ వారు వేలాది ఏళ్లుగా వస్తున్న జ్యోతిష్య సాంప్రదాయాన్ని, ఖగోళ నమ్మకాలను అస్సలు పరిగణనలోకి తీసుకోకుండా ఈ తేదీని ప్రకటించారు. నిజానికి దీని వెనుక మౌంట్‌బాటన్ వ్యక్తిగత ఉద్దేశం ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైన్యం మిత్రరాజ్యాలకు లొంగిపోయి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతున్న సందర్భం ఆగస్టు 15. తన అధికారానికి, విజయానికి గుర్తుగా ఆయన హఠాత్తుగా ఈ రోజును ఎంచుకున్నారు.

రాజకీయ వేగం పుంజుకున్న ఆ సమయంలో బ్రిటీష్ వారు ప్రకటించిన తేదీని మార్చడం అసాధ్యంగా మారింది. అలాగని కోట్ల మంది నమ్మకాలను, జ్యోతిష్కుల హెచ్చరికలను తోసిపుచ్చడం నాయకులకు ఇష్టం లేదు. దేశ విభజన, రాజకీయ ఉద్రిక్తతలతో రగిలిపోతున్న వేళ.. కొత్త దేశానికి అశుభ ముహూర్తం ఉందనే భయం ప్రజల్లో ఉండకూడదని భావించారు.

నెహ్రూ చతురత - అర్ధరాత్రి పరిష్కారం
సరిగ్గా ఇక్కడే జవహర్‌లాల్ నెహ్రూ ఒక అద్భుతమైన, వినూత్నమైన పరిష్కారాన్ని ఆలోచించారు. పాశ్చాత్య కాలమానం ప్రకారం రాత్రి 12 గంటలు దాటగానే కొత్త రోజు (ఆగస్టు 15) ప్రారంభమవుతుంది. కానీ, హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయంతోనే కొత్త రోజు మొదలవుతుంది. అంటే అర్ధరాత్రి 12 గంటల సమయం ఇంకా పాత రోజు (ఆగస్టు 14) కిందకే వస్తుంది.

జ్యోతిష్య బలం.. 
వైదిక జ్యోతిష్యం ప్రకారం పగలు, రాత్రి కలిసే సంధ్యా సమయం లేదా అభిజిత్ ముహూర్తం, రాజ్య స్థాపనకు అత్యంత అనుకూలమైన 'పుష్య నక్షత్రం' ప్రభావం ఆ అర్ధరాత్రి వేళ అందుబాటులో ఉన్నట్లు ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త కేఎన్ రావు పేర్కొన్నారు.

ఈ చిక్కుముడిని విప్పడానికి నెహ్రూ ఒక మధ్యేమార్గాన్ని ఎంచుకున్నారు. ఆగస్టు 14వ తేదీ మధ్యాహ్నామే రాజ్యాంగ పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, దానిని రాత్రి వరకు కొనసాగించారు. సరిగ్గా రాత్రి 12 గంటలు కొట్టే సమయానికి స్వాతంత్ర్య ప్రకటన చేశారు.

దీనివల్ల పాశ్చాత్యుల లెక్కల ప్రకారం ఆగస్టు 15 ప్రారంభమైనట్లూ అయింది, భారతీయ జ్యోతిష్య లెక్కింపుల ప్రకారం అశుభకరమైన ఆగస్టు 15 సూర్యోదయానికి ముందే అనుకూలమైన ముహూర్తంలో దేశం పురుడు పోసుకున్నట్లూ అయింది. ఈ తెలివైన పరిష్కారానికి మౌంట్‌బాటన్ కూడా అంగీకరించారు.

అలా జ్యోతిష్కుల హెచ్చరికలు, లార్డ్ మౌంట్‌బాటన్ పట్టుదల, నెహ్రూ చతురతల కలనేతగా భారత్ 'అర్ధరాత్రి' వేళ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. "ప్రపంచమంతా నిద్రిస్తున్న వేళ, భారత్ సజీవంగా, స్వతంత్రంగా మేల్కొంటుంది" అంటూ నెహ్రూ ఇచ్చిన చారిత్రాత్మక పిలుపు వెనుక ఉన్న అసలు రహస్యం ఈ ఖగోళ, ముహూర్తాల విచిత్ర సంగ్రామమే!

Also Read: స్వాతంత్ర్య దినోత్సవం 2026 వేడుకల తర్వాత జాతీయ జెండాతో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Also Read: ఆగస్టు 15న వినియోగదారులకు స్పెషల్ ఆఫర్.. రూ.1 రీఛార్జ్ ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ వచ్చింది

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Independence Day 2026: స్వాతంత్ర్య దినోత్సవాల వేళ 1,057 మందికి సర్వీస్ మెడల్స్..ముగ్గురికి మరణాంతరం ప్రకటన!

PPINEWZ3h ago
Hyderabad, Telangana:

Independence Day Medals 2026: 2026 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోమ్ గార్డ్, పౌర రక్షణ, కరెక్షనల్ సర్వీసెస్ (జైలు శాఖ) విభాగాలకు చెందిన మొత్తం 1,057 మంది సిబ్బందికి శౌర్య, సేవా పతకాలు దక్కినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ జాబితాలో ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు పోలీసు సిబ్బందికి మరణానంతరం శౌర్య పతకాలు లభించడం విశేషం.

మరణానంతరం శౌర్య పతకాలు పొందిన వారు
దివంగత నితేష్ ఎక్కా (కానిస్టేబుల్, ఛత్తీస్‌గఢ్ పోలీస్)

దివంగత రమేష్ కోరేటి (కానిస్టేబుల్, ఛత్తీస్‌గఢ్ పోలీస్)

దివంగత సునీల్ కుమార్ (ఇన్‌స్పెక్టర్, ఉత్తరప్రదేశ్ పోలీస్)

పతకాల వివరాలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం 1,057 పురస్కారాలను ప్రకటించగా.. ఏ పురస్కారానికి ఎంతమంది ఎంపికయ్యారనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.

శౌర్య పతకాలు (గ్యాలెంటరీ ఆఫ్ మెడల్ అవార్డ్స్) కోసం 301 మందిని ఎంపిక చేశారు. విశిష్ట సేవలకు రాష్ట్రపతి పతకాలకు (ప్రెసిడెంట్ మెడల్స్) దాదాపుగా 92 మందిని ఎంపిక చేయగా.. ప్రశంసనీయ సేవలకు పతకాలు (మెడల్ ఆఫ్ మెరిటోరియస్ సర్వీస్) విభాగంలో 664 మందికి పురస్కారాలను బహుకరించనున్నారు.

శౌర్య పతకాల కేటాయింపు విశేషాలు
ప్రకటించిన 301 శౌర్య పతకాలలో వివిధ ప్రాంతాల వారీగా ప్రాధాన్యత లభించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నుంచి 197 మందిని.. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి 51 మంది.. ఈశాన్య రాష్ట్రాల నుంచి 12 మందితో పాటు ఇతర ప్రాంతాల నుంచి 41 మందిని ఎంపిక చేశారు.

ఈ శౌర్య పతకాలను పొందిన వారిలో 272 మంది పోలీసు సిబ్బంది, 29 మంది అగ్నిమాపక శాఖ సిబ్బంది ఉన్నారు. ప్రాణాలు, ఆస్తుల రక్షణలో, నేరాల నివారణలో లేదా నేరస్తుల అరెస్టులో అత్యంత సాహసోపేతమైన చర్యలు చేపట్టిన సిబ్బందికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు.

సేవా పతకాల విభజన
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాల కోసం 92 మందిని ఎంపిక చేయగా.. అందులో పోలీసు శాఖ (83), అగ్నిమాపక శాఖ (4), పౌర రక్షణ, హోమ్ గార్డ్ (3), కరెక్షనల్ సర్వీస్/జైలు శాఖ (2)లో వారు ఉన్నారు. మెరిటోరియస్ సేవా పతకాల కోసం 664 మందికి ప్రదానం చేయనుండగా.. వారిలో పోలీసు శాఖ నుంచి 606 మంది.. అగ్నిమాపక శాఖలో 28 మంది, పౌర రక్షణ- హోమ్ గార్డ్ నుంచి 18 మంది, కరెక్షనల్ సర్వీస్ 12 మంది ఉన్నారు.

సేవలో అత్యుత్తమ విశిష్టతను కనబరిచిన వారికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాన్ని, అంకితభావంతో విలువైన సేవలు అందించిన వారికి మెరిటోరియస్ సేవా పతకాన్ని ప్రదానం చేస్తారు.

Also Read: స్వాతంత్ర్య దినోత్సవం 2026 వేడుకల తర్వాత జాతీయ జెండాతో ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Also Read: యూపీఐ లావాదేవీలపై భారీగా ఛార్జీలు?! అదనపు ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

AP SIR Electoral Roll: 'సర్' సర్వేలో ఓటు పోయిందా? అయితే ఆగస్టు 30లోపు ఈ పని చేస్తేనే మీకు ఓటు ఉంటుంది!

Vijayawada, Andhra Pradesh:

AP SIR Electoral Roll News: ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం (AP SIR)లో భాగంగా ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. అనంతరం అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాలను విడుదల చేశారు. అయితే ఈ జాబితాల్లో పలువురి పేర్లు కనిపించకపోవడంతో ఓటర్లలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా గతంలో ఉన్న ఓట్లకు, ప్రస్తుత ఓట్లకు మ్యాపింగ్ జరగని కారణంగా కొందరి పేర్లు ముసాయిదా జాబితాలో నమోదు కాలేదు. దీంతో తమ ఓటు హక్కు కోల్పోతామేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముసాయిదా జాబితాలో పేరు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మూడు రకాల మార్గాలను, ప్రత్యేక పోర్టళ్లను అందుబాటులో ఉంచింది. వివరాల నమోదు లేదా సవరణల కోసం వివిధ దరఖాస్తు ఫారాలను ఉపయోగించవచ్చు.

1) కొత్త ఓటరు నమోదు కోసం ఫామ్-6.

2) విదేశీ నివాసితుల కోసం ఫామ్-6A.

3) సవరణలు, తొలగింపులు లేదా అభ్యంతరాల కోసం ఫామ్-7.

4) చిరునామా మార్పుల కోసం ఫామ్-8.

ఈ దరఖాస్తులను అధికారిక Voters' Service Portal ద్వారా లేదా ECI Net మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల అనంతరం సంబంధిత బూత్ స్థాయి అధికారులు (BLO), ఈఆర్వో లేదా ఏఈఆర్వోల ద్వారా పరిశీలన ప్రక్రియ పూర్తి చేయబడుతుంది.

నిర్దేశిత గడువులోపు ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లు తగిన ఫారాలను సమర్పించి తమ ఓటు హక్కును పునరుద్ధరించుకోవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరింత సమాచారం, అధికారిక మార్గదర్శకాలను తెలుసుకోవడానికి Chief Electoral Officer Andhra Pradesh పోర్టల్‌ను సందర్శించవచ్చు.

Also Read: కర్నూలు పర్యటనలో వైఎస్ జగన్‌కు తీవ్ర అవమానం?! జైలులో మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం!

Also Read: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..జనసేనలోకి ఎమ్మెల్యే రాజాసింగ్..అసలు ట్విస్ట్ ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

YS Jagan Kurnool Tour: కర్నూలు పర్యటనలో వైఎస్ జగన్‌కు తీవ్ర అవమానం?! జైలులో మాజీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం!

Pattikonda, Andhra Pradesh:

YS Jagan Kurnool Jail Visit: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా జైలులో చోటుచేసుకున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు ఆయన ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి భారీ ప్రదర్శనగా పంచలింగాలలోని జిల్లా జైలుకు చేరుకున్నారు. ఈ ములాఖత్ అనంతరం జైలు అధికారుల తీరుపై జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

జగన్ చేసిన ఆరోపణలు
జైలులో తనను అవమానించేలా అధికారులు వ్యవహరించారని జగన్ ఆరోపించారు. సాధారణంగా ములాఖత్‌కు వచ్చేవారిని లోపల కూర్చోబెట్టి ఫొటో తీస్తారని, కానీ తన విషయంలో మాత్రం నిబంధనలు మార్చారని తెలిపారు. తనను గ్రిల్ వెలుపల నిలబెట్టి ఫొటో తీశారని చెప్పారు. దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా.. అందరినీ కూర్చోబెడతామని, కానీ మీరు కాబట్టి నిలబెట్టి ఈ విధంగా చేయాలని తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని సమాధానం ఇచ్చినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి.

జైలు సూపరింటెండెంట్ వివరణ
జగన్ చేసిన ఆరోపణలపై కర్నూలు జిల్లా జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టతనిచ్చారు. జైలు నిబంధనల ప్రకారమే అన్ని చర్యలు తీసుకున్నామని, మాజీ సీఎం హోదాకు గానీ, ఆయన గౌరవానికి గానీ ఎక్కడా భంగం కలిగించలేదని ఆయన స్పష్టం చేశారు. ములాఖత్‌కు వచ్చే ప్రతి ఒక్కరి ఫొటో తీసుకోవడం తప్పనిసరి అని తెలిపారు.

'ఇ-ప్రిజన్స్' సాఫ్ట్‌వేర్ నిబంధనల ప్రకారం.. ఎంతమంది ముద్దాయిలను కలవాలనుకుంటే అన్నిసార్లు తప్పనిసరిగా ఫొటో తీయాలని ఆయన వివరించారు. ఈ నిబంధన మేరకే జగన్ ఫొటోను రెండుసార్లు తీశామని వెల్లడించారు. జైలులో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన తమ్ముడు శ్రీరాములను కలిసేందుకు జగన్ వచ్చారని, ఆ సమయంలో ఏ అధికారికీ, సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించలేదని వేణుగోపాల్ రెడ్డి తేల్చిచెప్పారు. పూర్తి నిబంధనల ప్రకారమే ములాఖత్ నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేశారు.

Also REad: అసెంబ్లీకి రాకపోతే జీతం కట్..వైఎస్ జగన్‌పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు!

Also Read: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం..జనసేనలోకి ఎమ్మెల్యే రాజాసింగ్..అసలు ట్విస్ట్ ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

80th Independence Day Speech: 80వ స్వాతంత్ర దినోత్సవ స్పెషల్ స్పీచ్.. బహుమతి గెలవడం ఖాయం!

Hyderabad, Telangana:

80th Independence Day Speech In Telugu: ఈరోజు మనమంతా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.. ఈ స్వేచ్ఛ వాయువులను పీల్చుకోవడానికి వెనక ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎంతోమంది నాయకుల కష్టాలున్నాయి. వారి త్యాగాలను కష్టాలను స్మరించుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి.. ముఖ్యంగా అన్ని స్కూళ్లలో రెండు రోజుల ముందు నుంచే ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన స్పీచ్ పోటీలు కూడా ఉంటాయి. ఇందులో భాగంగా దేశభక్తిని పెంపొందించే ప్రసంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలామంది స్టేజ్ పైన దేశ స్వాతంత్రానికి సంబంధించిన స్పీచ్ లు కూడా ఇస్తారు. మీరు కూడా బహుమతి గెలుచుకోవడానికి మంచి స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇది మీకోసమే..

నా ప్రియతమైన విద్యార్థులకు, ముఖ్యంగా యువతి యువకులకు.. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ. మనం ఈరోజు 8వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే దానికి ఏకైక కారణం మన స్వాసంత్ర సమరయోధుల నిస్వార్ధమైన త్యాగ ఫలితాలే.. ఆ రోజుల్లో వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి సాధించిన ఈ స్వేచ్ఛను.. సుసంపన్నమైన దేశ అభివృద్ధికి పునాదిగా మార్చాల్సిన బాధ్యత నేటి యువత భుజాలపైనే వంద శాతం ఉంది.. దేశానికి అసలైన సంపద ఇప్పటి యువతే.. మీరు ఈ దేశానికి వెన్నుముక లాంటి వారు.. మీ ఆలోచనలతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలు, మీ ఆశయాలే రేపటి నవ భారత దేశ రూపురేఖలను నిర్ణయిస్తూ ఉంటాయి..

ఈ ఆధునిక డిజిటల్ యుగంలో సాంకేతికతను ఆయుధంగా మల్చుకోండి.. అయితే, అది కేవలం వ్యక్తిగత ఎదుగుదలకే కాకుండా సమాజ శ్రేయస్సుకు, ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడేలా చూడాల్సిన అవసరం ఎంతగానో ఉంది.. దేశం ముందున్న అసమానతలతో పాటు నిరుద్యోగం, వాతావరణం లో వస్తున్న ఊహించని మార్పుల వంటి సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి మీ నైపుణ్యాలకు పదును పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఉపాధి కోసం ఎదురుచూసేవారుగా కాకుండా.. పదిమందికి ఉపాధి కల్పించే కొత్త కొత్త ఆవిష్కర్తలుగా.. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలుగా మీరు తప్పకుండా ఎదగాల్సిన అవసరం మున్ముందు ఉంది.. కులమత ప్రాంతీయ భేదాలను పక్కనపెట్టి.. నువ్వు నేను భారతీయులం అనే ఏకతాటిపైకి వచ్చి గర్వంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది..

Also Read: 80th Independence Day Speech: రోమాలు నిక్కబొడుచుకునే 80వ స్వాతంత్ర దినోత్సవ స్పీచ్..

గత ఎనిమిది దశాబ్దాల్లో మనం సాధించిన విజయాలను చూసి గర్వపడుతూనే.. ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించే దిశగా వేగంగా ప్రతి ఒక్క యువత అడుగులు వేయాలి.. పర్యావరణ పరిరక్షణతో పాటు మహిళలకు సంబంధించిన సాధికారత, అంతరిక్ష పరిశోధనలు వంటి ప్రతి రంగంలో మన యువత అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. 80 ఏళ్ల స్వాతంత్ర భారత దేశ ప్రయాణంలో యువత వంతు చెరగని ముద్ర వేయడానికి ఇది సరైన సమయం.. మీ అద్భుతమైన శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచితే చాలు.. మీ కలలను సులభంగా సహకారం చేసుకోవచ్చు.. దేశ అభివృద్ధిలో భాగం కూడా కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్క యువత ఎంతో కష్టపడి దేశ అభివృద్ధిలో భాగం కావాలని కోరుకుంటూ సెలవు.. జైహింద్ జై భారత్..

Also Read: 80th Independence Day Speech: రోమాలు నిక్కబొడుచుకునే 80వ స్వాతంత్ర దినోత్సవ స్పీచ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Best Independence Day Speech: స్టేజ్ దద్దరిల్లేలా 80వ స్వాతంత్ర దినోత్సవ స్పీచ్‌..

Hyderabad, Telangana:

80th Independence Day Speech In Telugu: భారతదేశ వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి.. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసుకుంటున్న భారతదేశం.. భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో కష్టాలు వచ్చినా ముందుకు సాగుతూనే ఉంది.. అద్భుతమైన నాయకత్వంతో దేశ యువత మంచి మంచి లక్ష్యాలతో ఉన్నత స్థానాల్లోకి ఎదుగుతున్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ ఎన్నో విజయాలు సాధించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని.. ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. ప్రతి ఒక్క యువతకు గుండెల్లో దేశభక్తి నిండేలా అద్భుతమైన ప్రసంగాన్ని జీ తెలుగు న్యూస్ మీ ముందుకు తీసుకువచ్చింది..

దేశభక్తి ప్రసంగం ప్రారంభం..
నా ప్రియమైన ప్రజలారా.. ముఖ్యంగా దేశ యువతి యువకులారా.. అందరికీ 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. స్వాతంత్రం వచ్చి 8 దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా.. మన దేశం సాధించిన ప్రగతిని చూసి మనం ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు వనరుల సమస్యలతో ఇబ్బంది పడి.. ఎన్నో కష్టాలను అనుభవించిన మన దేశం.. ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనల్లో.. ఐటీ రంగాల్లో ప్రపంచ దేశాలకు దీటుగా నిలిచింది. సాంకేతిక విప్లవంతో పాటు డిజిటల్ ఇండియా, మౌలిక సదుపాయాల కల్పనలో మనం అభివృద్ధి చెందిన దేశాలకు సవాల్ విసురుతూ వెళ్తున్నాం..

అయితే.. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా మన ప్రయాణం ఇంకా పూర్తి కాలేదని భావించవచ్చు.. మనం అధిరోహించాల్సిన శిఖరాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆర్థిక అసమానతలతో పాటు నిరుద్యోగం, పేదరికం లాంటి సవాళ్లను మనమంతా సమిష్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని సభాముఖంగా చెబుతున్నాను. దేశంలో గొంతుకలేని ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యంతో పాటు విద్య అందినప్పుడే మన స్వాతంత్రానికి సార్థకత చేకూరుతుంది. 

ప్రపంచంలో మరే దేశానికి లేని అతిపెద్ద బలం ఇప్పుడున్న మన యువత. ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేస్తూ.. ఆవిష్కరణలతో ముందుకొస్తే రాబోయే కొన్నేళ్లలోనే మన భారతదేశం 100% అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోగలుగుతాం.. కుల మత వర్గ ప్రాంతీయ విభేదాలను తొలగించి.. జాతీయ సమైక్యతను చాటితేనే దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ స్వయం సమృద్ధి భారత్ కలను నిజం చేస్తే తప్పకుండా భారత్ అభివృద్ధి చెందుతుంది.. అంతేకాకుండా మనమంతా కలిసికట్టుగా అడుగులు వేస్తే అసాధ్యం అన్నది ఏది ఉండదు.. జై హింద్, జై భారత్..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

IND Vs SL 1st Test: శ్రీలంకతో తొలి టెస్టులో టీమ్ఇండియా ప్లేయింగ్ 11 ఇదే! బెంచ్‌ మీద నలుగురు ఆటగాళ్లు!

Galle, Southern Province:

IND Vs SL 1st Test 2026: శ్రీలంకతో గాలే వేదికగా శనివారం (ఆగష్టు 15) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు కోసం భారత జట్టు తుది కూర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్లేయింగ్ 11పై కీలక హింట్లు ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు ఎడమచేతి వాటం స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు ఆయన మాటలను బట్టి స్పష్టమవుతోంది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్‌లను ఒకే మ్యాచ్‌లో ఆడించడం జట్టుకు ఎలాంటి సమస్య కాదని మోర్కెల్ స్పష్టం చేశారు.

స్పిన్ త్రయంపై మోర్కెల్ వ్యూహం
గాలే పిచ్ స్వభావాన్ని బట్టి మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లకు విపరీతమైన సహకారం లభించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ద్వారా లంక బ్యాటర్లపై మరింత ఒత్తిడి తెవచ్చని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

కుల్దీప్ యాదవ్ అటాకింగ్ బౌలర్ కాగా, రవీంద్ర జడేజా కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో కట్టడి చేయగలరు. ఇక మానవ్ సుతార్ బంతిని ఎక్కువగా టర్న్ చేయగలగడం జట్టుకు అదనపు బలం. వీరు ముగ్గురి బౌలింగ్ శైలి వేర్వేరుగా ఉండటం వల్ల ప్రత్యర్థికి సవాల్‌గా మారుతుందని మోర్కెల్ తెలిపారు. విభిన్న స్పిన్ ఆప్షన్లు అందుబాటులో ఉండటం వల్ల లంక బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టి 20 వికెట్లు పడగొట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు.

పేస్ దళంపై అంచనాలు
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో మహ్మద్ సిరాజ్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నారు. కొత్త బంతిని పంచుకునే రెండో పేసర్‌ స్థానం కోసం ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ మధ్య పోటీ నెలకొంది. లంకలో ఉండే తీవ్రమైన వేడి, అధిక తేమతో కూడిన వాతావరణంలో కూకాబుర్రా బంతితో పేసర్లు ఎలా రాణిస్తారనేది కీలకమని మోర్కెల్ అభిప్రాయపడ్డారు.

అంచనా వేస్తున్న తుది జట్టు (Playing 11)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.

బెంచ్‌కే పరిమితం కానున్న నలుగురు..
ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణతో పాటు యువ ఆటగాళ్లు ఆకిబ్ నబీ, సారాంశ్ జైన్‌లు బెంచ్‌కే పరిమితం కానున్నారు. దీంతో వీరిద్దరి అంతర్జాతీయ అరంగేట్రం మరోసారి వాయిదా పడినట్లయింది.

Also Read: టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? బీసీసీఐలో కీలక పదవికి హైదరాబాదీ సై!

Also REad: ఆర్‌సీబీ ఆటగాడిపై కన్నేసిన కావ్యా పాప..ఐపీఎల్ ట్రేడ్ డీల్‌లో అతడే కావాలని పట్టు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

VVS Laxman BCCI: టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్? బీసీసీఐలో కీలక పదవికి హైదరాబాదీ సై! నిజమిదే?

Mumbai, Maharashtra:

VVS Laxman BCCI Role: భారత క్రికెట్ జట్టు మాజీ దిగ్గజం, హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో అత్యంత కీలకమైన పదవి దక్కనుంది. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (నేషనల్ క్రికెట్ అకాడమీ) అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు, బోర్డు మరింత పెద్ద బాధ్యతను అప్పగించేందుకు సిద్ధమవుతోంది.

రానున్న ప్రక్షాళన - కొత్త బాధ్యతలు
వచ్చే నెలలో బీసీసీఐ అంతర్గత ప్రక్షాళనకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉన్నట్లు ఇండియా టుడే వార్తా సంస్థ నివేదించింది. 

ఈ కొత్త పదవి ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ బాధ్యతకు అదనంగా కొనసాగేలా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ పదవి కనుక దక్కితే, లక్ష్మణ్ భారత క్రికెట్ కార్యకలామాలకు కేంద్ర బిందువుగా మారనున్నారు. సీనియర్ జట్టు, సెలెక్టర్లు, కోచ్‌లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగాల మధ్య సమన్వయం చేసే పూర్తి బాధ్యత ఆయనే పర్యవేక్షించనున్నారు.

లక్ష్మణ్ నిర్వహించనున్న విధులు..
డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమితులైతే లక్ష్మణ్ ప్రధానంగా క్రింది బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.

1) దేశవ్యాప్తంగా యువ ప్రతిభను గుర్తించడం.

2) ఆటగాళ్ల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించడం.

3) భారత క్రికెట్‌ను భవిష్యత్తు దిశగా నడిపించడంలో అత్యుత్తమ వ్యూహాలను అమలు చేయడం.

గతంలో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని లక్ష్మణ్ ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు. తాజాగా జింబాబ్వే పర్యటనకు తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించి జట్టును విజయపథంలో నడిపించడంతో, ఆయన సేవలను మరింత విస్తృతంగా ఉపయోగించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

మరోవైపు, ప్రస్తుత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని 2027 జూన్ వరకు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మార్పులకు సంబంధించి బీసీసీఐ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Also REad: ఆర్‌సీబీ ఆటగాడిపై కన్నేసిన కావ్యా పాప..ఐపీఎల్ ట్రేడ్ డీల్‌లో అతడే కావాలని పట్టు!

Also REad: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా మాజీ కెప్టెన్..అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

80th Independence Day Speech: స్వాతంత్ర దినోత్సవ 2026 బెస్ట్ స్పీచ్.. మీకే మొదటి బహుమతి పక్కా!

Hyderabad, Telangana:

80th Independence Day Speech In Telugu: భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా అద్భుతమైన పండగ లాంటి వాతావరణం నెలకొంది.. ముఖ్యంగా పాఠశాలల్లో ఒకరోజు ముందు నుంచే స్వాతంత్ర వేడుకలు ప్రారంభమవుతాయి.. ఈ సమయంలో పాటల ప్రోగ్రామ్స్ తో పాటు ప్రత్యేకమైన స్పీచ్‌ల ప్రోగ్రాం కూడా ఉంటుంది. చాలామంది విద్యార్థులు వారి మాటలతో ఎంతోమందిని ఆకట్టుకుని మొదటి బహుమతి సొంతం చేసుకుంటారు.. అయితే మీరు కూడా మీ స్పీచ్ ద్వారా గిఫ్ట్‌లను సొంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఈ అద్భుతమైన స్పీచ్ మీకోసమే...

మన స్వాతంత్ర సమరయోధులకు.. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నమస్సుమాంజలులు.. ఈరోజు మనం ఎంతో గర్వంగా జరుపుకుంటున్న ఈ 80 స్వాతంత్ర దినోత్సవం కేవలం క్యాలెండర్ పై ఒక తేదీ మాత్రమే కాదు.. అది ఆనాడు చిందించిన నెత్తుటి చుక్కలతో పాటు వారు చేసిన త్యాగాలకు ఒక సజీవ సాక్ష్యంగా భావించవచ్చు..

ఆ సమయంలో తామ్రాజ్యవాద బ్రిటిష్ పాలకుల తుపాకులకు గుండెలు ఎదురొడ్డి.. నిలబడి ఉండలేకపోతే.. కఠినమైన లాఠీ దెబ్బలను పూల దండలుగా స్వీకరించకపోతే.. మనం ఈరోజు ఇలా స్వేచ్ఛ వాయువులను పీల్చుకునే వాళ్ళం అస్సలు కాదు.. వందేమాతరం ఆల్టో వారు చేసిన సింహ గర్జనలే మనకు ఈరోజు ఈ స్వేచ్ఛ భారతాన్ని బహుమతిగా అందించాయి.. చీకటి జైలు గోడల మధ్య వారు గడిపిన ఆ కష్టతరమైన రోజులే.. ఈరోజు మన జీవితాల్లో ప్రగతి వెలుగును నింపాయి.. ఉరికొయ్యలను సైతం చిరునవ్వుతో ముద్దు పెట్టుకున్న వారి ధైర్యం.. భావితరాలకు ఎప్పటికీ మరువలేని ఆదర్శంగా నిలిచింది. 

కుల మతంతో పాటు ప్రాంతం అనే ఎలాంటి విభేదాలు లేకుండా భిన్నత్వాలున్న మన దేశాన్ని భారతీయులం అనే ఒకే తాటిపైకి తెచ్చిన మీ స్ఫూర్తి ఎప్పటికీ మరువలేనిదే.. ఈరోజు భారతదేశ అంతరిక్ష పరిశోధనల నుంచి అట్టడుగు వర్గాల ఉన్నతి వరకు.. టెక్నాలజీ నుంచి ఆర్థిక రంగం వరకు ప్రపంచానికి ఆదర్శంగా ఎదుగుతోంది అంటే.. దానికి బలమైన పునాదులు ఆనాడు స్వాతంత్ర సమరయోధులు వేసిన స్వేచ్ఛ బీజాలే...

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

ప్రతి ఒక్కరి త్యాగాలను స్మరించుకుంటూ.. వారు కలలు కన్నా ఆదర్శ నవ భారత దేశ నిర్మాణానికి నిరంతరం శ్రమిస్తామని మనమంతా ఈరోజు ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఈ పవిత్రమైన స్వేచ్ఛను మన బాధ్యతగా భావించి కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని యావత్ భారత జాతి తరఫున మనమంతా మాటిద్దాం.. అంతేకాకుండా ఎలాంటి కులమత వేదం లేకుండా అందరం ఒకటేనని ప్రపంచానికి చాటి చెప్పేలా నిలుద్దాం.. జైహింద్, జై భారత్..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

80th Independence Day Speech: రోమాలు నిక్కబొడుచుకునే 80వ స్వాతంత్ర దినోత్సవ స్పీచ్..

Hyderabad, Telangana:

80th Independence Day Speech 2026 In Telugu: ఈ సంవత్సరం మనమంతా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.. ఈ రోజున ప్రతి గల్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఎంతో ఘనంగా స్వాతంత్ర వేడుకలను జరుపుకుంటారు. ఇక పాఠశాలల్లోనైతే చెప్పనక్కర్లేదు.. పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఈరోజు చాలామంది విద్యార్థులు బహుమతులు పొందేందుకు వేడుకల్లో ప్రత్యేకమైన స్పీచ్ లు కూడా ఇస్తారు. మీరు కూడా దేశభక్తిని పెంపొందించడానికి మంచి స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ స్పీచ్ మీకోసమే..

అందరికీ గుడ్ మార్నింగ్.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్రం.. మరి ఎందరు వీరులు రక్తాన్ని ధారపోసి సాధించిన ఈ స్వాతంత్రమే ఈరోజు మనమంతా అనుభవిస్తున్నాము.. బ్రిటిష్ పాలకుల సంఖ్యల నుంచి దేశానికి విముక్తి కల్పించడం కోసం చాలామంది ఉరికోయ్యాలను నవ్వుతూ ముద్దాడారు.. ముఖ్యంగా భగత్ సింగ్ తో పాటు రాజ్‌గురు, సుఖ దేవ్ లాంటి ఎంతోమంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా స్వాతంత్రం కోసం పోరాడారు.. 80 వ స్వాతంత్ర పర్వదినాన యావత్ దేశం వారికి ఘన నివాళ్లను అర్పిస్తోంది. ఎగురుతున్న మువ్వన్నెల జెండా సాక్షిగా వారి త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకుంటున్నారు..

80 ఏళ్ల ప్రగతి ప్రస్థానం...
గడిచిన 8 శతాబ్దాల్లో మన దేశం అనేక రంగాల్లో ఊహించని స్థాయిలో ప్రగతిని సాధిస్తూ అగ్రదేశాల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తోంది. ఒకప్పుడు విదేశీ ఆహారం కోసం ఎదురుచూసిన పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి మన రైతాంగం ఎదిగింది.. అంతరిక్షంలో చంద్రయాన్ లాంటి అద్భుతమైన ప్రయోగాలతో అగ్రరాజ్యాలకు సైతం దీటుగా మన శాస్త్రవేత్తలు సత్తా చాటుతో ముందుకెళ్తున్నారు.. అలాగే ఐటీ రంగంతో పాటు సాంకేతిక వైద్య ఆర్థిక రంగాల్లో భారతదేశం విశ్వ గురువుగా ఎదుగుతూ వస్తోంది..

ఇవే మనం చేరుకోవాల్సిన శిఖరాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.. కేవలం ఆగస్టు 15న మాత్రమే జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటుకోవడం కాదు.. పేదరికంతో పాటు నిరుద్యోగం, అవినీతి లేని నవ సమాజాన్ని నిర్మించుకోవడానికి నేటి యువత తప్పకుండా నడుంబిగించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. చట్టాలను గౌరవించడంతోపాటు తోటి వారికి సహాయం చేయడం, ముఖ్యంగా పర్యావరణాన్ని రక్షించడం కూడా నిజమైన దేశభక్తికి నిదర్శనం అని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఎంతగానో కనిపిస్తుంది..

భిన్నత్వంలో ఏకత్వమే భారత దేశపు అతిపెద్ద బలంగా భావించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.. కుల మతాలతో పాటు వర్గ ప్రాంతీయ వేదాలను పక్కనపెట్టి మనమంతా భారతీయులం అనే భావనతో దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం యువతకు ఎంతగానో ఉంది.. ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వీర జవాన్లకు.. దేశానికి వెన్నుముకగా నిలుస్తున్న ప్రతి ఒక్క రైతుకు ఈ సందర్భంగా సెల్యూట్ చేద్దాం.. రేపటి పౌరులుగా.. బాధ్యతాయుతమైన భారతీయులుగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం.

భారతీయులందరికీ.. ముఖ్యంగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.. జైహింద్, జై భారత్..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report
Advertisement

నెట్ లేకపోయినా పర్లేదు.. ఈ ఒక్క నంబర్‌కు SMS, మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ మీ ముందే!

Hyderabad, Telangana:

PF Balance Check 2026: ఈపీఎఫ్ స్కీమ్ ద్వారా ఉద్యోగుల జీతం నుండి ప్రతి నెల కొంత పొదుపు చేయబడుతుంది. యాజమాన్యం కూడా కొంత మొత్తాన్ని జమ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్‌లాగే ఈపీఎఫ్ అకౌంట్‌లో కూడా నగదు జమ అవుతుంది మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగులు తమ నెలవారీ జమ అయిన మొత్తాన్ని సులభంగా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ద్వారా పాస్‌బుక్, క్లెయిమ్ స్టేటస్ వంటి సేవలను ఇంట్లోనే సులభంగా పొందవచ్చు. ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ ఆన్‌లైన్ సర్వీస్, మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా పొందవచ్చు.

ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునే విధానం..
ముందుగా ఈపీఎఫ్ఓ పాస్‌బుక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్‌తో సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు మీ పాస్‌బుక్‌ను చూడవచ్చు. అక్కడ డిపాజిట్ చేసిన పిఎఫ్ మొత్తం ఇతర బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి.

పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్..
మీరు పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు విత్‌డ్రాయల్ లేదా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే, అది అడ్వాన్స్‌గా లేదా ట్రాన్స్‌ఫర్‌గా పూర్తయిందో లేదో ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు. ఇది ఈపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌లోని 'Know Your Claim Status' విభాగంలో అందుబాటులో ఉంటుంది. అక్కడ క్లెయిమ్ స్టేటస్ ఆప్షన్ సులభంగా కనిపిస్తుంది.

ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకునే విధానం..
ఈపీఎఫ్ సేవలను ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ఉమాంగ్ యాప్‌లో మీ అకౌంట్ వివరాలు ఇస్తే, అధికారిక వెబ్‌సైట్‌లో ఉండే వివరాలన్నీ అక్కడ కనిపిస్తాయి. ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి 'EPF' సర్వీస్‌పై క్లిక్ చేస్తే, ఎంప్లాయీ సర్వీస్ సెక్షన్‌లో పాస్‌బుక్ వివరాలు కనిపిస్తాయి.

పీఎఫ్ మిస్డ్ కాల్..
మీకు ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా, ఒక మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం 9966044425 అనే నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ యూఏఎన్ వివరాలను పొందవచ్చు. అయితే, మీ ఈపీఎఫ్ఓ వివరాలు అప్‌డేట్‌గా ఉండాలి. కేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. అప్పుడు మీరు ఆటోమేటిక్‌గా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు.

పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్ఎంఎస్..
మీరు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను పొందవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 'EPFOHO UAN HIN' అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు పంపాలి. మీకు హిందీలో వివరాలు కావాలంటే 'HIN' అని టైప్ చేయాలి, లేదంటే మీ భాషా అవసరాలకు అనుగుణంగా వివరాలు వస్తాయి.

Also Read: పాన్ కార్డు కోసం ఏజెంట్లకు డబ్బులు ఇవ్వక్కర్లేదు!

Also Read:  రైల్వే ప్లాట్‌ఫామ్‌పై షాప్ పెట్టాలనుకుంటున్నారా?

ఈపీఎఫ్ వెబ్‌సైట్ ద్వారా పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసే విధానం అందుబాటులో ఉంది. అయితే, మీ యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్, ఓటీపీ, ఆధార్, బ్యాంక్ వివరాలను ఎవరికీ తెలియజేయకండి. ఈపీఎఫ్ఓ పాస్‌బుక్‌ను కేవలం అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే చెక్ చేసుకోవాలి. ఎటువంటి పేమెంట్ ప్రక్రియలు చేయమని ఎవరైనా అడిగితే, ఎవరికీ మీ వివరాలు ఇవ్వకండి. ఈపీఎఫ్ఓ పీఎఫ్ బ్యాలెన్స్ స్టేటస్ ప్రక్రియ ఇప్పుడు మరింత సులభతరమైంది. దీనిని పోర్టల్, మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top