icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow23 Jun 2024, 09:12 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Medico Priyanka: మెడికో ప్రియాంక కుటుంబానికి అండగా సీఎం చంద్రబాబు.. రూ.20 లక్షల సహాయం

Nuzendla, Andhra Pradesh:

Chandrababu Naidu: సినిమా థియేటర్‌కు వెళ్లి చిన్న వివాదంలో కారుతో ఢీకొట్టడంతో రాజమండ్రలిలో మెడికో ప్రియాంక బ్రెయిన్‌ డెడ్‌కు గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం తీవ్ర సంచలనం రేపుతోంది. బాధితురాలిని కాపాడుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏమాత్రం ముందుకురాకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందగా సీఎం చంద్రబాబు స్పందించారు.

రాజమండ్రిలో ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీ కొట్టిన ఘటనలో మెడికో ప్రియాంక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ ఘటనలో గాయపడిన ప్రియాంక మృతి చెందిందనే వార్త తీవ్రంగా కలిచివేసిందని సంతాప ప్రకటన చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జిల్లా అధికారులతో గతంలోనే ఓసారి జిల్లా అధికారులతో సమీక్షించిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

ప్రియాంక ఘటనపై ఆదివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించి మరోసారి సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్నారని సీఎం చంద్రబాబుకు ఎస్పీ వివరించారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం తీసిన వారిపై కఠిన సెక్షన్లతో శిక్షలు పడేలా చూడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రియాంకకు ప్రమాదం జరిగిన అనంతరం రాజమండ్రిలో చికిత్స అందించడం, తరువాత కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించిన విషయాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందడంపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ఇతరత్రా అన్ని విధాలుగా మద్దతుగా ఉంటామని సీఎం అండగా నిలిచారు.

రేపు రాజమండ్రిలో బంద్‌
మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్‌ స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రియాంకను ప్రమాదానికి గురి చేసిన తర్వాత 3 రోజుల పాటు నిందితులపై కేసు పెట్టకుండా పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారు. ప్రియాంక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, మంత్రి అనిత ఎవరూ కూడా కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదు. వైద్య చికిత్స ఖర్చులకు కనీసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేయలేదు. నిందితులను కాపాడేందుకు ఎన్ని సూట్‌కేసులు తీసుకున్నారు? పోలీసుల వెనక ఉండి ఇదంతా నడిపించింది ఎవరు? ప్రియాంకకు న్యాయం జరగాలి' అని డిమాండ్‌ చేశారు. ప్రియాంక మృతికి నిరసనగా రేపు రాజమండ్రిలోని అన్ని విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొనాలి మాజీ ఎంపీ మార్గాని భరత్ పిలుపునిచ్చారు.

0
0
Report

Medico Priyanka: మృత్యువుతో పోరాడి రాజమండ్రి హిట్‌ అండ్‌ రన్‌ మెడికో ప్రియాంక మృతి..

Hyderabad, Telangana:

Medico Priyanka Dies: సినిమా థియేటర్‌ వద్ద చెలరేగిన చిన్న వివాదం ఓ మెడికో విద్యార్థి ప్రాణానికి తీసుకుంది. ఏపీలోని రాజమండ్రిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో తెలంగాణకు చెందిన విద్యార్థి ప్రాణాలతో పోరాడి కన్నుమూశారు. కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చివరికి ఆమె ప్రాణం కోల్పోయారు. ఈ నెల 3వ తేదీన రాజమండ్రి ప్రసాదిత్యా మాల్‌ వద్ద ప్రియాంకపై కారు ఎక్కించి యువకులు దుష్యంత్, ఆండ్రూ దారుణానికి పాల్పడ్డారు.

రాజమండ్రిలో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రియాంకను చేర్పించారు. ప్రాణాలతో పోరాడి ఆదివారం మధ్యాహ్నం 3:40 గంటలకు ఆమె కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. కారు నడిపిన తాగుబోతుల దాష్టీకానికి ప్రియాంక ప్రాణం గాల్లో కలిసిపోయింది. కార్‌ టైర్‌ మెడపై నుంచి వెళ్లడంతో బ్రెయిన్‌ డెడ్‌ అయ్యి ఆమె మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. రాజమండ్రిలో ప్రమాదానికి గురయిన తర్వాత మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగానే ఉండడంతో రాజమండ్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. ఆమెను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. అప్నియా టెస్ట్ కు ప్రియాంక శరీరం సహకరించపోవడంతో సోడియం లెవల్స్‌ 16 కన్నా తక్కువగా ఉండడంతో ఆమె మరణించారు.

మృతురాలి తండ్రి కన్నీరు మున్నీరు
యువకుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరణించిన ప్రియాంక తండ్రి వెంకటేశ్‌ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిమ్స్‌ ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ మీకు ఆడపిల్లలు లేరా! అని ప్రశ్నించారు. ప్రతి నెలా హైదరాబాద్ వస్తారు కదా... మా బిడ్డ పరిస్థితి తెలుసుకోరా? అని నిలదీశారు. తన కుమార్తె గురించి ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడం దారుణం అని మండిపడ్డారు. 'ఏడ్చి ఏడ్చి నా కంట్లో నీళ్లు ఆవిరి అయిపోయాయి. సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా కారుతో రెండుసార్లు గుద్ది మూడోసారి తొక్కించి స్పందించకుండా వెళ్లిపోయినట్లు కనిపిస్తున్నా నిందితుల మీద కేసు పెట్టకుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేశారు? ప్రియాంకది హిట్ అండ్ రన్ కాదు.. హత్యాయత్నం' అని ప్రియాంక తండ్రి వెంకటేశ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

తన కుమార్తెపై నమోదైన కేసులో సెక్షన్లు తక్కువ శిక్షకు సంబంధించనివి ఉన్నాయని.. శిక్షలు పడేలా విచారణ జరుగుతుందా అనే దానిపై మృతురాలి తండ్రి వెంకటేశ్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే అని ప్రకటించారు. తప్పతాగి ఇలాంటి ప్రమాదాలు చేసేవారిని వదిలిపెట్టకూడదని ప్రియాంక తండ్రి వెంకటేశ్‌ తెలిపారు. 'కనీసం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నా బిడ్డ పరిస్థితి గురించి, ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర హోం మంత్రి, జిల్లా అధికారులు గానీ ఇప్పటివరకు ఈ ఘటన గురించి మాట్లాడలేదు' అని ప్రియాంక తండ్రి వెంకటేశ్‌ తెలిపారు.

రాజమండ్రి పోలీసుల స్పందన
ఆమెకు జరిగింది ప్రమాదం కాదని, ఓ మాల్‌లో నిందితులతో ప్రియాంక వాగ్వాదానికి దిగిందని, ఆ కోపంతో ప్రియాంకను చంపేందుకు ప్రయత్నించారని పోలీసుల ప్రకటించారు. ప్రియాంకను ప్రమాదానికి గురిచేసిన దశ్వంత్‌, ఆండ్రూ జోసెఫ్‌ ఎడ్వర్డ్స్‌పై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిశోర్ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా నిందితులు ప్రియాంకను ఢీకొట్టారని తెలిస్తే హత్యాయత్నం కేసును హత్యకేసుగా మారుస్తామని వివరణ ఇచ్చారు.

0
0
Report
Advertisement
Advertisement

Chhattisgarh: వామ్మో.. ఏకంగా హైకోర్టు జడ్జీ మీదనే చాతబడి.. అసలు మ్యాటర్ తెలిస్తే షాక్.!.

Hyderabad, Telangana:

Man black magic rituals with chief justice photo in Chhattisgarh:  ప్రస్తుతం మనం ఏఐ జనరేషన్ లో ఉన్నాం. రోజు  రోజుకు ఏఐతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాం. అందరు దీన్ని ఉపయోగించుకొవాలని, అడాప్ట్ చేసుకొవాలని నిపుణులు చెబుతున్నారు . ఇప్పటికి కూడా అనేక చోట్ల  మూఢనమ్మకాలు, చాతబడి, బాణామతి, మంత్రాలు,బాబాలను నమ్ముతూ చాలా మంది తమ డబ్బుల్ని పొగొట్టుకుంటున్నారు. దీనిలో ఎక్కువగా చదువుకున్న వారు కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో  ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

కత్తిపోటు కేసులో నిందితులకు బెయిల్ వచ్చేలా చేయాలని ప్రధాన న్యాయమూర్తి రమేష్ సిన్హా ఫోటో పెట్టుకుని కొంత మంది రాత్రి శ్మశానవాటికలోచేతబడి చేశారు. ఈ  ఘటన స్థానికంగా తీవ్ర రచ్చగా మారింది. ఛత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మర్డర్ కేసులో బెయిల్ కోసం నలుగురు వ్యక్తులు అర్దరాత్రి.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫోటోతో తాంత్రిక పూజల్ని నిర్వహించారు.

శనివారం మధ్యరాత్రి ఈ వింత సంఘటన జరిగిందని ఒక అధికారి తెలిపారు. అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు అనుమానాస్పద కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని  గ్రామస్తులు గమనించారు. ఆతర్వాత అక్కడకు వెళ్లి చూశారు. అక్కడి ఫోటోల్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  దీంతో వారిలో ముగ్గురు పారిపోగా, రిషికేష్ కుమార్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించిరు.  ఘటనా స్థలం నుంచి చేప, నిమ్మకాయలు, కుంకుమతో పాటు ప్రధాన న్యాయమూర్తి రమేష్ సిన్హా, మరో ఇద్దరి ఫోటోలతో సహా క్షుద్రపూజలకు సంబంధించిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read more: Video Viral: అసలు నువ్వు తల్లివేనా..?.. బ్రిడ్జ్ అంచున పసికందు.. రీల్స్ మోజులో మహిళ.. వీడియోపై దుమారం..
 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Prakasam Barrage: కృష్ణా డెల్టాలో గోదావరి నది వరద చూసి సంబరపడ్డ సీఎం చంద్రబాబు

Amaravathi, Andhra Pradesh:

Prakasam Barrage Water Levels: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక వెలవెలబోతున్న కృష్ణా నదిలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతుండడంతో సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్‌లో కలిసిన గోదారమ్మ నీటి పరవళ్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మకు వస్తున్న గోదావరి నీటి లెక్కల వివరాలు ఆరా తీశారు. తన పర్యటనలో ఆకస్మికంగా ప్రకాశం బ్యారేజ్‌ వద్ద సీఎం చంద్రబాబు నిలవడం ఆసక్తికరంగా మారింది.

విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి ఉండవల్లిలోని నివాసానికి వెళుతున్న సమయంలో బ్యారేజ్‌పై సీఎం చంద్రబాబు కొద్దిసేపు తన వాహన కాన్వాయ్‌ను ఆపివేయించారు. గోదావరి నీటితో నిండుకుండలా ఉన్న ప్రకాశం బ్యారేజ్‌ను పరిశీలించారు. గోదావరి నీటితో బ్యారేజ్ నిండుగా ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. పట్టిసీమ ద్వారా ఈ సీజన్‌లో ఇప్పటివరకు 17.52 టీఎంసిల నీటిని కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు సీఎం చంద్రబాబు వివరించారు.

ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటివరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సమృద్దిగా గోదావరి జలాలు వస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజి దిగువన వివిధ కాలువల ద్వారా డెల్టాలోని పంటలకు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3,115 క్యూసెక్కులు, గుంటూరు చానల్ నుంచి 115 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

డెల్టాకు నీటి సరఫరా కోసం మొత్తం కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఎల్ నినో కారణంగా తీవ్ర వర్షాబావ పరిస్థితుల్లో పట్టిసీమ నీరు పంటలకు జీవం పోస్తోందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సమర్థ నీటి నిర్వహణ ద్వారా ఎల్ నినో పరిస్థితుల్లో సాగునీటి ఇబ్బందుల్ని అధిగమించేందుకు అన్ని విధాలా పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

0
0
Report
Advertisement

Varuna Yagam: రేపు తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం.. సాగర్‌ ఒడ్డున భారీ ఏర్పాట్లు

Nandikonda, Telangana:

Tomorrow Varuna Yagam: వర్షాభావం ప్రభావంతో వర్షాలు లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. వర్షాలు భారీగా కురిసి పాడి పంటలు పండాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం వరుణ యాగం నిర్వహించనుంది. నాగార్జునసాగర్‌లోని విజయవిహార్‌లో రేపు నిర్వహించనున్న వరుణ యాగం కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు, ప్రాజెక్టులు నిండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో వరుణ యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవిహార్‌లో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి.. సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలు నిండాలని.. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ వరుణ దేవుడికి ప్రత్యేక పూజలు, యాగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

యాగం కోసం విజయవిహార్‌లో ప్రత్యేకంగా యాగశాలను ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు, అర్చకులు పూర్తి చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విజయవిహార్ పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వాహనాల రాకపోకలకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. వరుణ యాగం జరిగే ప్రాంతంలో భద్రతా పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రాజెక్టులు, జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో రేపు జరగనున్న వరుణ యాగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

0
0
Report

Lal Darwaza Bonalu: అంగరంగ వైభవంగా లాల్‌దర్వాజ బోనాలు.. పోటెత్తిన భక్తులు

Hyderabad, Telangana:

Lal Darwaza Temple: ఆషాఢమాసంలో హైదరాబాద్‌లో జగన్మాత స్మరణలో మునిగింది. గల్లీ గల్లీ.. వాడా వాడ అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతున్నాయి. ప్రధాన ఆలయం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఇక హైదరాబాద్‌ మొత్తం కోలాహలంగా మారింది. బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, అమ్మవారి ఘటాలు, భక్తుల సందడి కనిపిస్తోంది. లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ. తెలంగాణవాసుల ఆచార వ్యవహారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలతో ప్రారంభమై బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కల్యాణం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు సహా హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి' అని వివరించారు.

'వందల సంవత్సరాలుగా హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి..గతంలో  నిజాం రాజు హయాంలో కూడా వేడుకలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా' అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు బాగా పండాలని, రైతులు, ప్రజలు ఆనందంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజల జీవితాల్లో సంతోషం, సంపద వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

'బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, మన సంస్కృతి వైభవానికి ప్రతీక. హైదరాబాద్ మహానగరంలో జరిగే ఈ బోనాల ఉత్సవాలను భక్తులు కుటుంబ సమేతంగా ఆనందంగా చేసుకోవాలని కోరుతున్నా' మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఆలయాల వద్ద భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.

0
0
Report

డెంగీ బారినపడి ఐసీయూకి దగ్గరగా బాలీవుడ్ భామ.. వర్షాకాలంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న 5 లక్షణాలు ఇవే!

Hyderabad, Telangana:

Dengue Symptoms: వర్షాకాలం ప్రారంభం కావడంతో వ్యాధులు కూడా విపరీతంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా దోమల వల్ల మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఇటీవల నటి స్వర భాస్కర్ కూడా డెంగీ బారిన పడి ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. వర్షాకాలంలో దోమల ప్రభావం పెరగడం వల్ల డెంగ్యూ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఈ క్రింది ఐదు లక్షణాలు కనిపిస్తే మీరు కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి. గత ఐదేళ్లలో 968 కేసులు నమోదైనప్పటికీ, 2023లో రికార్డు స్థాయిలో 2,89,235 కేసులు నమోదై 485 మంది మరణించారు.

డెంగీ లక్షణాలు ప్రధానంగా జ్వరంతో మొదలవుతాయి. ఆ తర్వాత కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్ళ నొప్పి, వాంతులు వంటివి కనిపిస్తాయి. దీనితో పాటు ముక్కు లేదా చిగుళ్ల నుండి రక్తం రావడం, కడుపు నొప్పి, ప్రతి 24 గంటల్లో మూడు కంటే ఎక్కువసార్లు వాంతులు అవ్వడం, మలంలో రక్తం పడటం లేదా రక్త వాంతులు కావడం కూడా ముఖ్యమైన లక్షణాలే.

డెంగీ నివారణ మార్గాలు..
డెంగీ వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే నివారించుకోవడం మంచిది. ఇది నిల్వ ఉన్న నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి.

ప్రతి వారం చేయాల్సిన జాగ్రత్తలు..
ఇంటి బాల్కనీలలోని మొక్కల పాత్రలలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు వాటిని మార్చాలి. ఎయిర్ కూలర్ ట్యాంకులు, బకెట్లు, డ్రమ్ములలోని నీటిని ప్రతి వారం మార్చాలి. అలాగే వాటర్ బాటిల్స్, రెఫ్రిజిరేటర్ ట్రేలు, పాత టైర్లు, ఖాళీ బాటిల్స్, కొబ్బరి చిప్పలు, రూఫ్ గట్టర్లు, బాల్కనీ డ్రైనేజీలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీటి డ్రమ్ములు, ట్యాంకులు, వాటర్ బాటిళ్లకు మూతలు గట్టిగా ఉండేలా చూసుకోండి. బకెట్లలో కూడా నీరు నిల్వ ఉండనివ్వకండి. డ్యామేజ్ అయిన మూతలు వెంటనే రిపేర్ చేయండి. 

Also Read:   బయట ఫుడ్ తిని కడుపు ఉబ్బరంగా ఉందా? ఈ 5 వంటింటి చిట్కాలతో నిమిషాల్లో ఉపశమనం!

Also Read:  మహిళకు తరచూ వచ్చే నడుమునొప్పి.. అడ్వాన్స్‌డ్ క్యాన్సర్‌కు సంకేతమా? హెల్త్ నిపుణుల హెచ్చరిక!

దోమలు రాకుండా ఉండటానికి ఇంటికి సరైన జాగ్రత్తలు తీసుకోండి. దోమల నుండి రక్షణ కోసం మస్కిటో రిపెల్లెంట్‌లు వాడండి. శరీరం అంతా కవర్ అయ్యేలా ఉండేలా చూసుకోండి. సాక్సులు, ఫుట్‌వేర్ వంటివి ఉపయోగించండి. కిటికీలకు మెష్ ఇన్‌స్టాల్ చేసుకోవడం, తలుపులకు గ్యాప్స్ లేకుండా చూడటం మంచిది. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లలో ఉదయం సమయంలో నిద్రపోయే వారు తప్పనిసరిగా దోమతెరలు ఉపయోగించడం ద్వారా జాగ్రత్త వహించాలి.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Bonalu: 3,400 ఆలయాలు ఉంటే బోనాలలకు రూ.20 కోట్లు విదిలిస్తారా?: బండి సంజయ్

Hyderabad, Telangana:

Bonalu Festival: 'బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు సరే నిధులేవి? హైదరాబాద్‌లో 3,400 ఆలయాలు ఉంటే బోనాల ఉత్సవాలకు రూ.20 కోట్లు విదిలిస్తారా? రంజాన్ పండుగకు మాత్రం రూ.33 కోట్లు విడుదల చేస్తారా? బోనాల ఉత్సవాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు ప్రస్తావిస్తే మతం పేరుతో చిచ్చు పెట్టాలని మాట్లాడతారా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పలు ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఇస్తే...80 శాతం మంది హిందువుల పండుగకు ఇంకెన్ని కోట్లు ఇవ్వాలి. విదేశాలు నిషేధించిన తస్లీమా జమాతే సంస్థ సభకు కూడా కాంగ్రెస్ రూ.2.40 కోట్లు విడుదల చేస్తారా? నేను హిందువుల కోసం బరాబర్ ప్రశ్నిస్తా' అని బండి సంజయ్‌ ప్రకటించారు. గోమాతను వధిస్తే ప్రశ్నించాలా? వద్దా? అని నిలదీశారు. హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తే ప్రశ్నించాలా? వద్దా? అని ప్రశ్నించారు. 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపుతానంటే ప్రశ్నించవద్దా? తాను బరాబర్ సనాతన ధర్మం కోసం పని చేస్తానని బండి సంజయ్‌ కీలక ప్రకటన చేశారు.

'హిందువులంతా జాగృతం కావాలి. హిందువులారా జెన్‌జీలను స్పూర్తిగా తీసుకోండి. ఆకాశంలో రాకెట్లను పంపడమే కాదు హిందూ సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నారు. జెన్‌జీల తీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. 'ఎన్నికలకు బోనాలకు సంబంధమే లేదు. బీజేపీ స్వచ్ఛంద సంస్థ కాదు రాజకీయ పార్టీ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందని.. హైడ్రా 150 పోస్టులకు ఫిజికల్ టెస్ట్ పెడితే సరూర్ నగర్ స్టేడియం నిండిపోవడమే నిదర్శనమని పేర్కొన్నారు.

హిందూ సమాజమంటేనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు భయం అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రకటించారు. మైనారిటీ సంతూష్టీకరణ విధానాలనే ఆ పార్టీలు అవలంభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మైనారిటీ సంతూష్టీకరణ విధానాలకు పూర్తి వ్యతిరేకం అని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుల చరిత్రను ఎందుకు పాఠ్యాంశాల్లో చేర్చలేదని ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ దీపావళి నాడు ఆలయంలో వెయ్యి మంది మహిళలను, పిల్లలను కాల్చి చంపిన నీచుడు అని చెప్పారు. అట్లాంటి దుర్మార్గుడిని హీరో చిత్రీకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆయన విగ్రహాలు పెట్టడం కరెక్టేనా? అని నిలదీశారు. అయోధ్య రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు వ్యతిరేకించారని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

'ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తానన్న హామీ ఏమైంది? ఉద్యోగాలను భర్తీ చేసేదాకా నిరుద్యోగులకు రూ.4 వేల భృతి ఇస్తానన్న హామీ ఏమైంది? రోజ్ గార్ మేళాతో 12 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత మోదీదే. ఫీజు రీయింబర్స్ మెంట్ అందక పేద విద్యార్థులు అల్లాడుతున్నారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు' అని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. 'సమాజాన్ని కాంగ్రెస్ తప్పుదోవ పట్టించింది. ఇచ్చిన హామీలను కూడా అమలు చేయని మోసపూరిత చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మహాలక్ష్మీ పథకం కింద నెలనెలా ఎంత మంది మహిళలకు రూ.2,500 ఇచ్చారు. వృద్దాప్య పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని మోసం చేయలేదా?' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు.

0
0
Report

ICC ODI World Cup Teams: క్రికెట్ ప్రపంచకప్ 2027 రేసు నుంచి ఆ రెండు టీమ్స్ ఔట్?! టీమ్ఇండియా పరిస్థితి ఏంటంటే?

Dubai, Dubai:

ICC ODI World Cup 2027 Teams: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 మెగా టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ టోర్నీ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఈసారి టోర్నీలో జట్ల సంఖ్యను 10 నుంచి 14 జట్లకు పెంచడంతో అర్హత పోరు మరింత రసవత్తరంగా మారింది.

టోర్నీ అర్హత నిబంధనలు ఇవే..
ఆతిథ్య హోదా కింద ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. అయితే మరో కో-హోస్ట్ అయిన నమీబియా మాత్రం ఈ ఆతిథ్య కోటాను దక్కించుకోలేకపోయింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం కటాఫ్ తేదీ నాటికి టాప్-8లో నిలిచే జట్లే ఎలాంటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడకుండా నేరుగా ప్రపంచకప్ టోర్నీ ఆడేందుకు అర్హత సాధిస్తాయి. 

క్రికెట్ వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం ఆతిథ్య దేశాలు రెండింటితో పాటు ర్యాంకింగ్స్ ద్వారా అర్హత సాధించిన 8 జట్లు పోను.. మిగిలిన 4 స్థానాల కోసం ప్రత్యేకంగా గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నీ నిర్వహిస్తారు.

టీమిండియా పరిస్థితి ఏంటంటే?
ఐసీసీ వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్రస్తుతం 116 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. భారత జట్టు పాయింట్ల పరంగా ఎంతో పటిష్టంగా ఉండటంతో పాటు భారీ ఆధిక్యంలో ఉంది. దీంతో టీమిండియా ఎలాంటి ఆందోళన లేకుండా నేరుగా 2027 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడం లాంఛనమే కానుంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా సురక్షితమైన స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఇతర ప్రధాన జట్ల పరిస్థితి ఎలా ఉందంటే?
ర్యాంకింగ్స్ రేసులో పాకిస్తాన్ (100 పాయింట్లు) 5వ స్థానంలో, శ్రీలంక (96 పాయింట్లు) 6వ స్థానంలో, ఇంగ్లాండ్ (93 పాయింట్లు) 7వ స్థానంలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్ - శ్రీలంక మధ్య జరిగే వన్డే సిరీస్ ఈ రెండు జట్ల ర్యాంకింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక అఫ్గానిస్తాన్ 90 పాయింట్లతో 8వ స్థానంలో ఉంటూ క్వాలిఫికేషన్ అంచున నిలిచింది. రాబోయే సిరీస్‌లలో ప్రతీ మ్యాచ్ ప్రతీ జట్టుకూ అత్యంత కీలకం కానుంది.

Also Read: యశస్వి జైస్వాల్‌తో స్టార్ హీరోయిన్ డేటింగ్ రూమర్స్..స్పందించిన మృణాల్ ఠాకూర్!

Also Read: "నా సొంత ఊర్లో ఇంటి స్థలం ఇప్పించండి సీఎం గారూ"..క్రికెటర్ రిషబ్ పంత్ ఆవేదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top