ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జెండా ఎగురావేసిన బండారి శేఖర్
Karimnagar, Telangana:కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ లో ఘనంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జెండాను కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నాడు స్వాతంత్రోద్యమాన్ని ఎంతోగాను ముందుకు తీసుకువెళ్లిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1939 వ సంవత్సరంలో ఆనాడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడం జరిగిందని తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Renu Desai Health: "ఆ టైమ్లో నేను చావు అంచులదాకా వెళ్లాను" పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
Hyderabad, Telangana:Renu Desai Health Condition: టాలీవుడ్ నటి రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో అతి తక్కువ చిత్రాల్లో నటించినా.. ఆమెను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెళ్లాడిన తర్వాత లక్షలాది మంది ఫాలోవర్స్ను దక్కించుకున్నారు. ఆ తర్వాత పవన్తో విడాకులైనా ఆమెకు అంతే గుర్తింపు ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇటీవల చిత్ర పరిశ్రమలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్.. ప్రస్తుతం తన నటనకు పూర్తి అవకాశం ఇచ్చే పాత్రలను ఎంచుకుంటున్నారు. సినిమాలతో పాటు సమాజంలో జరిగే కొన్ని అంశాలపై రేణూ దేశాయ్ తన గళాన్ని వినిపిస్తారు.
సోషల్ మీడియా వేదికగా ఎన్నో సామాజిక సంఘటనలపై రేణూ దేశాయ్ స్పందిస్తూ.. అవసరమైనప్పుడు తన అసంతృప్తిగా గట్టిగా వినిపిస్తుంది. అంతేకాకుండా, తన గురించి లేదా తన కుటుంబం గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారికి తనదైన ప్రత్యేక శైలిలో ఘాటైన సమాధానాలు ఇవ్వడంలో రేణు దేశాయ్ ముందుంటారు.ఇటీవల, రేణు దేశాయ్ ఒక ప్రైవేట్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
తన వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడం రోజురోజుకీ మరింత కష్టంగా మారిందని నటి రేణూ దేశాయ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నటి రేణు దేశాయ్ తన ఆరోగ్య సమస్యల గురించి కూడా నిష్కపటంగా మాట్లాడారు. ఇటీవల తాను బరువు పెరగడానికి గల కారణాలను వివరించి అందర్ని ఆశ్చర్యపరిచారు. గుండె సంబంధిత వ్యాధికి చికిత్స నిమిత్తం తాను బీటా-బ్లాకర్స్ అనే మందులు వాడాల్సి వచ్చిందని రేణు దేశాయ్ వెల్లడించారు. ఈ మందుల వల్ల బరువు పెరగడంతో పాటు శరీర జీవక్రియ కూడా మందగిస్తుందని నటి రేణు దేశాయ్ వివరించారు. ఒక వైద్య అత్యవసర పరిస్థితిలో ఈ మందులు తీసుకోవడం తప్ప తనకు మరో మార్గం లేదని, ఆ సమయంలో తనకు వేరే ప్రత్యామ్నాయం లేదని నటి రేణు దేశాయ్ స్పష్టం చేశారు.
బీటా-బ్లాకర్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావం కారణంగా తాను గణనీయంగా బరువు పెరిగానని నటి రేణూ దేశాయ్ చెప్పారు. ఆ సమయంలో ఆమె ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలలో, నటి రేణు దేశాయ్ బరువు పెరగడం స్పష్టంగా కనిపించింది. తాను తొలుత సహజ వైద్య విధానాలను ఎంచుకున్నట్లు చెప్పగా.. కానీ ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నానని నటి రేణు దేశాయ్ వివరించారు. ఈ విధానాలు తన ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపినప్పటికీ, తాను ఇప్పుడు కోలుకుంటున్నందున మందులను కొనసాగించాల్సి వచ్చిందని ఆమె అన్నారు.
నటి రేణు దేశాయ్ అపెండెక్టమీ గురించి మాట్లాడుతూ.. తాను కూడా అపెండిక్స్ సమస్యతో బాధపడ్డానని ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. అపెండిక్స్ తొలగించడానికి చేసిన అత్యవసర శస్త్రచికిత్స సమయంలో తాను పడిన బాధ గురించి కూడా నటి రేణుకా దేశాయ్ వెల్లడించారు. వైద్యులు కొన్ని గంటలు ఆలస్యం చేసి ఉంటే, నటి రేణు దేశాయ్ ప్రాణాలు కోల్పోయి ఉండేవారని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో తనకు తీవ్రమైన శారీరక నొప్పి మొదలైందని, అకస్మాత్తుగా కుప్పకూలిపోయానని నటి రేణు దేశాయ్ గుర్తుచేసుకున్నారు.
నటి రేణు దేశాయ్ హీరో, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య కూడా. ఈమె సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. నటి రేణు దేశాయ్ తరచుగా తన జీవితం గురించి అప్డేట్లను ఇస్తుంటారు. గతంలో వెండితెరపై మెరిసిన నటి రేణు దేశాయ్, ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' వెండితెరపై కనిపించారు.
Also Read: IPL Slapgate Ad: చెంపదెబ్బ వీడియోతో రూ.కోటి సంపాదన..హర్బజన్పై శ్రీశాంత్ ఆరోపణ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Thai Funeral Dance: శవం ముందు పాపలతో అశ్లీల డ్యాన్స్లు..ఏడుపు ఆపి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీ..
Nong Chaeng Sub-district, Phetchabun:Thailand Funeral Dance: ఎక్కడైనా చావు ఇంట్లో విషాధ ఛాయలు, ఏడుపులు, పరామర్శలు ఉండడం సహజం. కానీ, ఇప్పుడు తాజాగా ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరణం తర్వాత తన మృతదేహం ముందే ఐటెం సాంగ్స్తో అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేసింది అతని కుటుంబం. ముగ్గురు అమ్మాయిలు అశ్లీలంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడం వల్ల ఇప్పుడా ఘటన గురించి బయటకొచ్చింది.
అయితే ఈ సంఘటన జరిగింది భారతదేశంలో కాదు. థాయ్లాండ్లోని ఒక బౌద్ధ ఆలయంలో అంత్యక్రియల సందర్భంగా 'కోయోట్ డాన్సర్స్' నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కుటుంబం శోకసంద్రంలో ఉంటుందని ఊహించి అక్కడికి వెళ్లిన వారికి నిర్ఘాంతపోయే ఘటన ఎదురైంది. కుటుంబ సభ్యులు దుఃఖించకుండా ఎందుకు సంబరాలు చేసుకుందో తొలుత అర్థం కాలేదు. ఆ తర్వాత నిజం తెలుసుకోని ఆశ్చర్యానికి లోనవ్వడం వారి వంతు అయ్యింది.
మరణం అనే మాట వినగానే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, గుండెల్లో దుఃఖం నిండిపోతుంది. కానీ, వైరల్గా మారిన ఈ అశ్లీల డ్యాన్స్ వీడియో చూడగానే అందర్ని షాక్లోకి నెట్టివేస్తుంది. థాయ్లాండ్కు చెందిన ఒక కుటుంబం తమ కుటుంబ సభ్యుడు మరణం తర్వాత
ప్రియమైన వారికి కన్నీళ్లతో కాకుండా, 'కొయెట్ డాన్సర్స్' డ్యాన్స్లతో అతనికి అంత్యక్రియలు జరిపారు. ఒక ఆలయంలో శవపేటిక ముందు ప్రదర్శించిన ఈ నృత్యం, ఆన్లైన్లో చర్చనీయాంశంగా మారింది.
థాయ్లాండ్లోని నఖోన్ సి థమ్మరత్ ప్రావిన్స్లో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రోన్ ఫిబున్ జిల్లాలో ఉన్న వాట్ తెప్పనోమ్ చుయట్ అనే బౌద్ధ ఆలయంలో మంగళవారం ఈ వింత జరిగింది. 59 ఏళ్ల వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా, అతని కుటుంబం ముగ్గురు "కొయెట్ డాన్సర్లను" (పొట్టి దుస్తులు ధరించే నృత్యకారులు) నియమించుకుంది. ఈ నృత్యకారులు మృతుని శవపేటికకు సరిగ్గా ఎదురుగా ప్రదర్శన ఇచ్చారు.
అతని చివరి కోరిక ఏమిటంటే?
సోషల్ మీడియాలో ఆ వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో, మృతుడి బంధువులు అసలు కారణాన్ని వెల్లడించారు. కుటుంబ సభ్యుల ప్రకారం.. మరణించిన వ్యక్తి చాలా ఉల్లాసంగా, సంతోషంగా ఉండేవాడు. తన మరణానికి ముందు, తన అంత్యక్రియలప్పుడు ఎవరూ ఏడవకూడదని అతను కోరుకున్నాడు. ప్రజలు దుఃఖించడం కంటే తన జీవితాన్ని వేడుకగా జరుపుకోవాలని అతను ఆకాంక్షించాడు. ఈ కోరికను నెరవేర్చడానికి, కుటుంబ సభ్యులు ఆ విషాద సమయంలో ఒక నృత్య కార్యక్రమాన్ని నిర్వహించారట.
బ్యాంకాక్ పోస్ట్లోని నివేదికల ప్రకారం.. బౌద్ధ సన్యాసులు తమ చివరి ప్రార్థనలు, మంత్రాలు పూర్తి చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. సన్యాసులు వెళ్ళిపోయిన వెంటనే, ముగ్గురు మహిళా నృత్యకారులు శవపేటిక ముందు తాము ముందుగా సిద్ధం చేసుకున్న నృత్యాన్ని ప్రారంభించారు. అన్ని వయసుల వారు ఆ ప్రదేశంలో గుమిగూడి, జరుగుతున్న ఈ దృశ్యాన్ని వీక్షించారు. అంతేకాకుండా, ఈ మొత్తం కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
మరణించిన వ్యక్తి ఏప్రిల్ 15న కన్నుమూశారు. చివరి సందేశంలో తన మరణం జీవితంలో అనివార్యమైన భాగమని, దానిని హుందాగా స్వీకరించాలని ఆయన రాసుకొచ్చాడు. ఈ తత్వాన్ని అనుసరించి, ఆయన కుటుంబం దుఃఖాన్ని ఆనందంగా మార్చుకోవడానికి ప్రయత్నించింది. అయితే, దేవాలయం వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి ప్రదర్శన థాయ్ సంస్కృతి, మత విశ్వాసాలలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: IPL Slapgate Ad: చెంపదెబ్బ వీడియోతో రూ.కోటి సంపాదన..హర్బజన్పై శ్రీశాంత్ ఆరోపణ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IPL Slapgate Ad: చెంపదెబ్బ వీడియోతో రూ.కోటి సంపాదన..హర్బజన్పై శ్రీశాంత్ ఆరోపణ..
Hyderabad, Telangana:IPL Slapgate Harbhajan Singh Sreesanth: ఇప్పుడు ఎక్కడ చూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హవా నడుస్తోంది. ఒకవైపు అదిరిపోయే థ్రిల్లింగ్ టీ20 మ్యాచ్లు జరుగుతుండగా.. ఇప్పుడు గత ఐపీఎల్ అనుభవాలను పోడ్కాస్ట్లలో పంచుకుంటూ మాజీ క్రికెటర్లు వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే ఐపీఎల్ వ్యవవస్థాపకుడు లలిత్ మోడీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోగా.. ఆ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో చెరిగిపోని సంఘటనగా హర్భజన్, శ్రీశాంత్ మధ్య జరిగిన ఘటన తాలూకా వీడియోను తాజాగా బయటపెట్టారు. ఇప్పుడు అదే విషయంపై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కూడా స్పందించాడు. ఐపీఎల్ స్లాప్గేట్ (చెంపదెబ్బ సంఘటన) ద్వారా హర్భజన్ సింగ్ దాదాపు రూ.1 కోటి సంపాదించారని శ్రీశాంత్ ఆరోపించారు.
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో ఈ చెంపదెబ్బ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో తెగ వైరల్ అయిన ఈ టాపిక్ మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఐపీఎల్లో ఓ మ్యాచ్ తర్వాత కరచాలనం చేసుకుంటున్న క్రమంలో అప్పట్లో ముంబై ఇండియన్స్ (MI) తరఫున ప్రాతినిధ్యం వహించిన హర్భజన్, శ్రీశాంత్ను (కింగ్స్ XI పంజాబ్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్) చెంపదెబ్బ కొట్టాడు. దీంతో శ్రీశాంత్ మైదానంలోనే వెక్కివెక్కి ఏడవగా, హర్భజన్ ఆ తర్వాత బీసీసీఐ నుంచి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నాడు. 'టర్బనేటర్' అని పిలవబడే అతనిపై ఆ సీజన్లోని మిగిలిన మ్యాచ్లన్నింటికీ నిషేధం విధించారు. అతని పూర్తి మ్యాచ్ ఫీజును కూడా తగ్గించారు.
ఇప్పుడు మలయాళ వార్తా సంస్థ అయిన మాతృభూమికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీశాంత్ మరోసారి ఈ విషయంపై స్పందించారు. "నేను ఏ ఇంటర్వ్యూలోనూ భజ్జీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇదే మొదటిసారి" అని శ్రీశాంత్ అన్నారు.
"ఆ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేవు, కానీ ఇదే సంఘటనపై అతను మరోసారి ఒక యాడ్ చేశాడు. దాని ద్వారా అతను సుమారు రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు సంపాదించాడు. ఆ తర్వాత అతను నాకు ఫోన్ చేసి, దీనిపై ఒక కథనం రాయమని అడిగాడు. నేను అతనితో.. "నేను క్షమిస్తాను కానీ ఎప్పటికీ మర్చిపోను" అని చెప్పాను. ఎవరైనా మీకు అన్యాయం చేస్తే, మీరు వారిని క్షమించాలి కానీ ఎప్పటికీ మర్చిపోకూడదు. మీరు మర్చిపోతే, వారు మళ్లీ అదే పని చేస్తారు. దానికి అతనే అతిపెద్ద ఉదాహరణ. దానిలో ఎలాంటి సందేహం లేదు" అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.
అయితే ఇప్పటికీ హర్భజన్ సింగ్తో ఇప్పటి వరకు ఎలాంటి సంబంధం లేదని..ఇన్స్టాగ్రామ్లో కూడా తాను భజ్జీని బ్లాక్ చేసినట్లు శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. విచిత్రంగా వీరిద్దరూ కలిసి టీమ్ఇండియా తరఫున రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్లలో (2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్) సభ్యులుగా ఉండడం విశేషం.
క్షమించాలి కానీ మర్చిపోకూడదని తన తల్లిదండ్రులు నేర్పినట్లు మాజీ క్రికెటర్ శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. హర్భజన్పై తనకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు లేదని.. అలాగే అతనితో తనకు ఎలాంటి అవసరం లేదని శ్రీశాంత్ చెప్పాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ తన కుమార్తె గురించి మంచిగా మాట్లాడాడు అని శ్రీశాంత్ అన్నాడు. అయితే కేవలం ఓ నటన మాత్రమే అని చెప్పాడు. అదంతా యాక్టింగ్లో భాగమని మాజీ క్రికెటర్ కుండ బద్ధలు కొట్టాడు.
ఐపీఎల్ ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పుడు 'ఐపీఎల్ స్లాప్గేట్'గా ఈ చెంపదెబ్బ సంఘటనను అభివర్ణించారు. అయితే గతేడాది ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ, హర్భజన్ శ్రీశాంత్ను నేలపై చెంపదెబ్బ కొడుతున్న అన్సీన్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ఆ మాజీ క్రికెటర్లు ఇద్దరూ బహిరంగంగా ముందుకు వచ్చి లలిత్ మోడీపై విమర్శలు గుప్పించారు. కానీ తమ మధ్య అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Snake Video: నాగస్వరం ఊదుతుండగా మెరుపు వేగంతో దాడి చేసిన నాగుపాము!
Hyderabad, Telangana:Snake Catcher Bitten Viral Video Watch: సాధారణంగా పాములు పట్టే వారు ఎంతో అప్రమత్తంగా ఉంటూ ఉంటారు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వారికి తెలుసే.. కానీ కొన్ని సందర్భాల్లో వాటి కాటు బారిన పడాల్సి వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అత్యంత ప్రమాదకరమైన నాకు పాముకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కేవలం కొద్ది సెకండ్ల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నేషనల్ షేక్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక వ్యక్తి పామును పట్టుకోవడానికి.. దానిని తన వసంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడొచ్చు. అతను ఒక చెట్టు సమీపంలో నిలబడి నాదస్వరం ఊదుతూ పాముని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ చెట్టు కొమ్మల మధ్య ఉన్న భారీ నాగుపాము ఆ సౌండ్కి అటు ఇటు ఆడటం మీరు గమనించవచ్చు. అయితే ఈ సమయంలో అతను ట్యూన్ మార్చడంతో శబ్దానికి కోపం వచ్చి అతనిపై మెరుపు వేగంతో దాడి చేసింది..
ఆ వ్యక్తి చెట్టుకు చాలా దగ్గరగా ఉండటంతో.. పాము నేరుగా వచ్చి అతని చేతిపై కాటు వేసింది. ఈ ఊహించని దాడితో సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్కు గురైనట్లు తెలుస్తోంది. పాము కాటు వేయడంతోనే తీవ్రభయాందోళనకు గురై.. ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న నాగస్వరాన్ని పక్కనే ఉంచి అక్కడి నుంచి పరుగులు పెట్టడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఆ పాము ఎంత విషపూరితమైనదో చూస్తేనే అర్థమయిపోతుంది కదా..
ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. వన్యప్రాణులతో ఇలాంటి ప్రయోగాలు ప్రాణాల మీదికి తెస్తాయని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. మరి కొంతమంది పాములు పట్టేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాల్సిందని.. కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత కూడా రాలేదు. వీడియో మాత్రం అన్ని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్ తాగించిన తోటి కోడలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shani Dev: శనివారం ఆవనూనె ఇలా చేస్తే.. మీ కష్టాలన్నీ పటాపంచలు!
Hyderabad, Telangana:Shani Dev Saturday Remedies: నవగ్రహాల్లో శని గ్రహా నికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా శని దేవుడిని న్యాయాధిపతిగా పిలుస్తారు. అంటే మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడిగా భావిస్తారు. సాధారణంగా శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందుల పట్ల ప్రజల్లో భయం ఉంటుంది. అయితే శని దేవుని ప్రసన్నం చేసుకోవడం అంత కష్టమేమీ కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా శనివారం రోజు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించడం వల్ల అష్టైశ్వర్యాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏలినాటి శని ప్రభావం కూడా చాలా వరకు తగ్గే ఛాన్సులు కూడా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం సాయంత్రం ఒక పని చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుందట.. ఎలాంటి పని చేయడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
శని దేవుడికి అత్యంత ప్రీతికరమైనది ఆవనూనె.. శని సాయంత్రం వేళలో ఆవనూనెతో దీపం వెలిగించడం వల్ల జాతకంలోని శని దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శనివారం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించడం వల్ల అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఏలినాటి శని సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి తప్పకుండా ఈ పని చేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సాధ్యమైతే నల్లటి వత్తులను ఉపయోగించడం మంచిదని.. దీనివల్ల త్వరగా శని అనుగ్రహం లభిస్తుందని సమాచారం..
ఒక గిన్నెలో ఆవనూనెను తీసుకొని.. అందులో మీ ప్రతిబింబాన్ని చూసుకున్న తర్వాత ఆవను నేను దానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు పూర్తిగా నయం అవుతాయట.. అయితే శనివారం సాయంత్రం వేళలో కేవలం దీపాలు వెలిగించడమే కాకుండా కొన్ని రకాల పనులు చేయడం వల్ల కూడా అదృష్టం పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయి.. ముఖ్యంగా సాయంత్రం వేళలో దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా కొన్ని రకాల పనులు చేయడం మర్చిపోవద్దని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శని దేవుడు పేదల పక్షపాతి . కాబట్టి శనివారం రోజు సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా నల్లటి వస్త్రాలతో పాటు గొడుగు, ఆహారాలను దానం చేయడం వల్ల పుణ్యఫలం ఎంతగానో లభిస్తుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
శని దోషాల తీవ్రత తగ్గాలంటే తప్పకుండా హనుమంతుడిని పూజించడం చాలా మంచిది. శనివారం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి హనుమాన్ చాలీసాను పాటించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందని జ్యోతిష్యుడు చెబుతున్నారు. శనివారం రోజు కొత్త ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనికి బదులుగా మీరు గతంలో కొన్న ఇనుప వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం.. శని దేవుడిని ఆరాధించేటప్పుడు భయంతో కాకుండా భక్తితో సేవించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈరోజు మద్యంతో పాటు మాంసాహారం వంటి ఆహారాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. క్రమశిక్షణతో కూడిన జీవితం, సత్యాలు పలకడం ద్వారా శని దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RCB vs GT: బెంగళూరు దూకుడుకు తేలిపోయిన సాయి సుదర్శన్ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ మరో ఓటమి
Bengaluru, Karnataka:Royal Challengers Bengaluru vs Gujarat Titans: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్లోనూ అదరగొడుతూ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సాయి సుదర్శన్ సెంచరీతో విజృంభించినా కూడా గుజరాత్ టైటాన్స్కు నిరాశే ఎదురైంది. విరాట్ కోహ్లీ, పడిక్కల్ వేగంగా చేసిన అర్ధ సెంచరీలతో మిగతా బ్యాటర్లు దూకుడుగా ఆడడంతో బెంగళూరు ఐదో విజయాన్ని సొంతం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Kavitha Party: హైదరాబాద్లో భారీ ఏర్పాట్లు.. రేపే కవిత రాజకీయ పార్టీ ఆవిర్భావం
Munirabad, Telangana:Kavitha Political Party: తెలంగాణలో దాదాపు రెండు దశాబ్దాల పాటు సొంత కుటుంబంతో కలిసి రాజకీయం చేసిన మాజీ ఎమ్మెల్సీ కవిత రేపటి నుంచి సరికొత్త రాజకీయం చేయనున్నారు. సొంత తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్తోపాటు కల్వకుంట్ల కుటుంబంతో తీవ్ర విభేదాలు ఏర్పడి.. అనంతరం బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయిన కవిత సొంత దారి చూసుకున్నారు. ఈ క్రమంలో రేపు కొత్త రాజకీయ పార్టీని ఆమె స్థాపించనున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి హైదరాబాద్లోని ఓ అత్యంత ఖరీదైన కన్వెన్షన్ సెంటర్లో భారీ ఏర్పాట్లు జరిగాయి. కవిత పార్టీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పార్టీ ప్రకటన సభకు హైదరాబాద్లో అట్టహాసంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ప్రకటన సభకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణంగా నామకరణం చేయగా.. సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు జరిగాయి. 33 జిల్లాల నుంచి దాదాపు 50 వేల మంది తరలివస్తారని తెలుస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో కవిత పార్టీ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. రెండు దశాబ్దాల కిందట తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక విప్లవానికి అండగా తెలంగాణ జాగృతి ఏర్పడింది. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడు సరికొత్త రాజకీయ జీవితం ప్రారంభిస్తున్నారు.
కవిత షెడ్యూల్..
శనివారం ఉదయం 7.30 గంటలకు కవిత బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి ర్యాలీగా అమరవీరుల స్తూపానికి పయనం
ఉదయం 8.15 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళి
ఉదయం 8.25 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నుంచి సభకు పయనం
ఉదయం 9.30 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ హాల్ మెయిన్ గేట్ వద్దకు రాక
ఉదయం 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ
ఉదయం 10.05 గంటల ప్రసంగం ప్రారంభం
సభ ప్రాంగణం పేరు : ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం
ప్రధాన ద్వారం : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ద్వారం
ఇతర ద్వారాల పేర్లు :రాణి రుద్రమ దేవి ద్వారం
మారోజు వీరన్న ద్వారం
చాకలి ఐలమ్మ ద్వారం
పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటుచేసిన భోజనశాలల పేర్లు:
సురవరం ప్రతాపరెడ్డి భోజనశాల
సమ్మక్క సారలమ్ భోజనశాల
షోయబుల్లా ఖాన్ (మీడియా) భోజనశాల
34 వంటకాలతో తెలంగాణ రుచులు
కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటుచేశారు. మధ్యాహ్న భోజనం కోసం 34 రకాల వంటకాలను సిద్ధం చేశారు
నాన్ వెజ్
తలకాయ కూర, బోటీ ఫ్రై, తెలంగాణ మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, బొమ్మిడాయల పులుసు, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, మిర్చి కా సాలాన్, ఎగ్ ఇగురు
శాకాహారం,
బగరా బైంగన్ మసాలా కర్రీ, కందగడ్డ ఫ్రై, పాలకూర, మామిడి పప్పు, ఆలూ టామాటా, చామగడ్డ పులుసు, కట్ చారు
తెలంగాణ ప్రత్యేక వంటకాలు: మక్క గారెలు, జొన్న రొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలు
బగరా రైస్, వైట్ రైస్, సాంబర్, రోటి పచ్చడి, దోస, ఆవకాయ, మిర్చి బజ్జి, పచ్చి పులుసు, పాపడ్, పెరుగు, రైతా
వేసవి సందర్భంగా మజ్జిగ, రాగి అంబలి
మిఠాయిలు: బటర్స్కాచ్ ఐస్క్రీమ్, షాహి తుక్డా, జిలేబీ
MLC Anantha Babu Arrest: ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు..ఆ వెంటనే రిమాండ్?!
Rajamahendravaram, Andhra Pradesh:MLC Anantha Babu Arrest News: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో బెయిల్ విచారణ నిమిత్తం రాజమండ్రి కోర్టుకు రాగా కోర్టు ఆవరణలో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.Telangana RTC Strike: చర్చల అనంతరం ఆర్టీసీ సమ్మెపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన
Hyderabad, Telangana:Telangana RTC Strike: అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం.. మోసం చేయడంతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో సమ్మె చేపట్టారు. సమ్మె ఉధృతంగా సాగుతుండగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా రేవంత్ రెడ్డి చలించకపోవడంతో మనస్తాపం చెందిన కార్మికులు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. శంకర్ గౌడ్ మరణంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. మంత్రివర్గ సమావేశం అనంతరం శుక్రవారం ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Telangana RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం.. రేపు ప్రభుత్వంతో ఆర్టీసీ సంఘాల చర్చ
రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులతో జరిగిన చర్చల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. 'శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరం. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రాణం అనేది అత్యంత విలువైనది. శంకర్ గౌడ్ మరణంతో ఆ కుటుంబం మొత్తం తలకిందులైంది. ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున మేం, కార్మిక సంఘాల నాయకులుగా కార్మికులకు పిలుపునిద్దాం' అని ఆర్టీసీ జేఏసీ నాయకులతో డిప్యూటీ సీఎం తెలిపారు.
సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని డిప్యూటీ సీఎం ప్రకటించారు. సమస్య ఎంత క్లిష్టమైనదైనా సరే కూర్చుని మాట్లాడుకుంటే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. 'ఇది ప్రజా ప్రభుత్వం. తెలంగాణలో ఎవరినీ శత్రువులుగా చూసే స్వభావం మాకు లేదు. ఆర్టీసీ అనేది రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇతర రాష్ట్రాల్లో సంస్థల పరిస్థితి వేరుగా ఉన్నా.. ఆర్టీసీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది' అని గుర్తుచేశారు.
'బడ్జెట్ సమావేశాలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా బిల్లు, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, నేను, ఇతర మంత్రులు బిజీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా సమ్మె నిర్ణయం తీసుకోవడంతో ఒక కార్మికుడిని కోల్పోవాల్సి వచ్చింది. ఇది అత్యంత బాధాకరం, ఆ కుటుంబానికి ఇది తీరని లోటు' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టీసీ అందరి సంస్థ అని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. 'పేదలు, మహిళలకు రవాణా పరంగా ఉన్న ఏకైక మార్గం ఆర్టీసీ. వారందరినీ దృష్టిలో పెట్టుకుని సంస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చి నిలబెట్టుకోవాల్సిన సామాజిక బాధ్యత ఉంది. ఆర్టీసీకి సంబంధించిన పాలనాపరమైన, విధానపరమైన నిర్ణయాలపై ఖచ్చితంగా చర్చిద్దాం. కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుందాం' అని ఆర్టీసీ జేఏసీ నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
MLC Anantha Babu Arrest: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు..ఎట్టకేలకు వెంటాడి పట్టుకున్న పోలీసులు..డ్రైవర్ హత్య కేసులో తదుపరి రిమాండ్!
Hyderabad, Telangana:MLC Anantha Babu Arrest News: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పుడు సంచలన ఘటన జరిగింది. తొలి నుంచి ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మరికొద్ది గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోర్టులో బెయిల్ విచారణ కోసం ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ వచ్చారు. కోర్టు నుంచి బయటకు రాగానే అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వెంటనే అతడ్ని కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇప్పుడు వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఏం జరిగిందంటే?
2022 మే 19న ఏపీలోని వైయస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మృతి తర్వాత అర్ధరాత్రి సమయంలో డ్రైవర్ మృతదేహాన్ని ఎమ్మెల్సీ అనంత బాబు స్వయంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం అప్పట్లోపెను దుమారం రేపింది. తొలుత ఆ మృతిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, తీవ్ర నిరసనల మధ్య విచారణ జరిపి అనంతబాబును ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడ్ని రిమాండ్కు తరలించారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గతేడాది (2025) జూలైలో ప్రభుత్వం ఈ కేసుపై తదుపరి విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. రిమాండ్ నుంచి బెయిల్పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు అతని గన్మెన్లు, అనుచరులను సిట్ విచారించింది. అయితే ఇటీవలే ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్య ప్రమేయాన్ని నిర్ధారిస్తూ చార్జిషీట్ దాఖలు చేయడం కేసులో కీలక మలుపుగా మారింది. అనంతబాబుతో పాటు అతని భార్యపై క్రిమినల్ నేరారోపణలు ఉన్న నేపథ్యంలో వారిద్దరూ బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. అయితే కోర్టులో విచారణ జరిగే అన్ని రోజుల పాటు ఎమ్మెల్సీ అనంతబాబు పరారీలో ఉన్నారు.
ఈ హత్య కేసులో అనంతబాబు భార్యను రెండవ నిందితురాలిగా (A-2) సిట్ పేర్కొనడంతో అప్పుడు అస్సలు కథ మొదలైంది. సుబ్రహ్మణ్యం హత్యలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా, ఆధారాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారని సిట్ అధికారులు కోర్టుకు వివరించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాల విశ్లేషణ తర్వాతే ఆమెపై ఈ అభియోగాలు మోపినట్లు సిట్ వెల్లడించింది. దీంతో భార్యభర్తలిద్దరూ పరారీలో ఉండగా.. తాజాగా రాజమండ్రి కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు రావడం వల్ల వారిద్దరూ కోర్టుకు హాజరైనట్లు తెలుస్తోంది. కోర్టు నుంచి బయటకు రాగానే ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచిచూడక తప్పదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RTC JAC Talks: ఆర్టీసీ ఉద్యోగులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు..డిమాండ్లు నెరవేర్చే దిశగా అడుగులు!
Hyderabad, Telangana:Telangana RTC JAC Talks: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు లేవనెత్తిన అంశాలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.Education Mafia: ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాల ధరల నియంత్రణకు NHRC సంచలన నిర్ణయం..
Hyderabad, Telangana:Human Rights Commission Latest News: ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి ఏటా పెరుగుతున్న పుస్తకాల ధరల భారంతో సామాన్య తల్లిదండ్రులు విలవిలలాడుతున్న సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ధరలను పెంచి.. ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దడాన్ని కమిషన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది రాజ్యాంగం కల్పించిన ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. అంతేకాకుండా వివిధ అంశాలపై కూడా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన కమిషన్.. కేంద్ర విద్యా శాఖ కార్యదర్శి.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాల మాఫియాను అరికట్టడానికి తీసుకున్న చర్యలు ఏమిటో నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది..
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రూపొందించిన పుస్తకాల ధరలు చాలా తక్కువ పాటు అందుబాటులో ఉన్నాయని.. అయితే ప్రైవేటు పాఠశాలలు వీటిని కాదని భారీ ధరలు ఉండే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను ఎందుకు సిఫారసు చేస్తున్నాయని NHRC ప్రశ్నించింది.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్సీఈఆర్టీ పుస్తకాలు తక్కువ ధరలకే లభిస్తుంటే.. ప్రైవేటు పుస్తకాల చెట్ల ధరలు దాదాపు మూడు వేల నుంచి పదివేల వరకు ఉండడం గమనార్హం.. ఇది విద్యార్థుల తల్లిదండ్రులపై పెను ఆర్థిక భారంగా మారుతోందని కమిషన్ వ్యాఖ్యానించింది..
Read more: Karimnagar: పన్ను ఎగవేతే లక్ష్యం.. చీకటి వ్యాపారానికి కరీంనగర్ అడ్డా..
కమిషన్ కొన్ని అంశాలపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. ప్రైవేటు పబ్లిషర్లతో స్కూల్ యాజమాన్యాలు లోపాయి గారి ఒప్పందాలు కుదుర్చుకొని.. భారీ కమిషన్ల కోసం తల్లిదండ్రులను పీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరలు ఆకాశాన్ని ఆకాశాన్నంటుతున్నా.. ఆ పుస్తకాల్లోని పాఠ్యాంశాల నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండడం లేదని.. కొన్ని పాఠశాలలు నిర్విత దుకాణాల్లోనే పుస్తకాలు కొనాలని నిబంధనలు పెట్టడం కూడా కట్ట విరుద్ధమని కమిషన్ పేర్కొంది. విద్యాసంస్థలు లాభాపేక్ష లేకుండా సేవ చేయాల్సిన చోట.. వ్యాపార సంస్థలుగా మారి దోపిడీకి పాల్పడుతున్నాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎన్ హెచ్ ఆర్ సి జోక్యంతోనైనా ప్రైవేట్ స్కూల్లో ఫీజులతో పాటు పుస్తకాల ధరలపై ఒక స్పష్టమైన నియంత్రణ వస్తుందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
Read more: Karimnagar: పన్ను ఎగవేతే లక్ష్యం.. చీకటి వ్యాపారానికి కరీంనగర్ అడ్డా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Jagtial News: ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టం: మాజీ మంత్రి జీవన్ రెడ్డి..
Karimnagar, Telangana:Jeevan Reddy News: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట పట్టడం దురదృష్టకరమని.. ఈ పరిస్థితికి ప్రభుత్వం మొండివైఖరి, నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరై.. తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డు ఎక్కడ ప్రభుత్వ వైఫల్యమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసిన.. కార్మికుల గోడును ప్రభుత్వం పట్టించుకోలేదని.. చర్చల ద్వారా పరిష్కరించాల్సిన సమస్యలపై ఎలాంటి సమీక్ష లేకుండా.. కార్మికులను మానసిక శోభకు గురిచేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ కూడా చేశారు..
సమ్మె సమయంలో మృతి చెందిన కార్మికుడు శంకర్ గౌడ్ మరణం పట్ల జీవన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది సహజ మరణం కాదని.. ప్రభుత్వ హత్యనని ఆయన ఆరోపించారు. శంకర్ గౌడ్ మృతి బాధాకరం.. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. మృతుని కుటుంబానికి దాదాపు కోటి రూపాయల ఎగ్జిగ్రేషియా ప్రకటించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు..
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం పక్కన పెడితే.. ఉన్న సంస్థను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన బాధ్యతలు ప్రభుత్వంపై ఉందని.. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని కోరారు. ప్రైవేటీకరణ ఆలోచనలను విరమించుకోకపోతే.. రాబోయే రోజుల్లో ప్రజా ఆగ్రహాన్ని చూడక తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
నిరంతరాయంగా ప్రజలకు సేవలు అందించే ఆర్టీసీ కార్మికుల కష్టాలు వర్ణనాతీతమని.. వారి పోరాటానికి BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కార్మికులు అసలు అధైర్య పడవద్దని.. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘాల నేతలతో పాటు స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు..
Read more: Actress Pragathi: ఆ పనిచేస్తూ నరకం చూపించాడు..!. నటి ప్రగతి ఆంటీ షాకింగ్ కామెంట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mumbai Indians Downfall: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ పతనం మొదలు..5 సార్లు విజేత ప్రదర్శన ఇదా? అంబానీ ఫ్యామిలీ చేసిన తప్పు అదే!
Hyderabad, Telangana:Mumbai Indians Downfall: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో 5 సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు పతనం మొదలైందా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ అభిమానులు. రోహిత్ శర్మ నాయకత్వంలో ఈ జట్టు 5 ట్రోఫీలతో తిరుగులేని సామ్రాజ్యంగా ఎదిగింది. కానీ, గతంలో జరిగిన ఒకే ఒక్క ఐపీఎల్ ట్రేడ్ ఇప్పుడు ఆ టీమ్ను గద్దె నుంచి దించే ప్రయత్నం చేస్తోంది. అయితే ముంబై ఇండియన్స్ పతనం వెనుక ఉన్న అసలైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
భారత క్రికెట్ను దాని మూలాల వరకు కుదిపేసిన ఒక బోర్డు రూమ్ నిర్ణయంతో ఇదంతా మొదలైంది. ఐపీఎల్ 2024కు ముందు గుజరాత్ టైటాన్స్ నుండి హార్దిక్ పాండ్యాను తిరిగి ట్రేడ్ చేయాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించుకుంది. అదే సమయంలో పదేళ్లకు పైగా తన అసాధారమైన కెప్టెన్సీతో జట్టును పలుమార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించింది. అప్పటి నుండి జరిగిన అన్ని పరిణామాలకు ఆ ఒక్క క్షణమే బీజం వేసింది.
రోహిత్ శర్మ కేవలం ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా మాత్రమే వ్యవహరించలేదు. 2013, 2015, 2017, 2019, 2024లోని ఐపీఎల్ సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టును విజేతగా నిలిపి తిరుగులేని సామ్రజ్యం నిర్మించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ను నిలబెట్టాడు. అంతటి ప్రతిభ ఉన్న వ్యక్తిని కాదని హార్దిక్ పాండ్యాను జట్టులోకి ట్రేడ్ చేసుకుంటూనే రోహిత్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించింది.
హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా తిరిగి తీసుకురావడానికి ముంబై ఇండియన్స్ ఎక్కువ డబ్బును వెచ్చించడమే కాకుండా.. కెప్టెన్సీలో రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యా తమ కెప్టెన్ అంటూ ప్రకటించింది. హార్దిక్ రాక జట్టును కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అంచనా వేశారు. కానీ దానికి బదులుగా, ఈ ట్రేడ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత నిరాశాజనకమైన ఫలితాలలో ఒకటిగా నిలిచింది. జట్టుకు అత్యంత అవసరమైనప్పుడు హార్దిక్ బ్యాట్తో గానీ, బంతితో గానీ రాణించడంలో నిలకడగా విఫలమయ్యాడు. మొదటి సంవత్సరంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు టైటిల్ గెలిచి.. ఆ తర్వాతి ఏడాది రన్నరప్గా నిలపడంలో హార్దిక్ పాండ్యా ఎంతో శ్రమించాడని చెప్పడంలో సంశయం లేదు.
కానీ, హార్దిక్ పాండ్యా ప్రస్తుత గణాంకాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గతంలో మ్యాచ్ ఫలితాన్నే మార్చే ప్రదర్శన చేసిన పాండ్యా.. ఇప్పుడు ఫామ్ను కోల్పోయాడు. ప్రస్తుత ఐపీఎల్ 2026లో 6 మ్యాచ్లలో కేవలం 97 పరుగులు మాత్రమే చేసి, 10-19 శాతం మధ్య సగటును నమోదు చేశాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడనే నమ్మకంతో జట్టులోకి తీసుకుని, కెప్టెన్సీ చేసిన ఆటగాడికి, ఈ గణాంకాలు ఒక ఘోరమైన వైఫల్యాన్ని సూచిస్తున్నాయి. దీనివల్ల ముంబై జట్టు పదేపదే లక్ష్యాలను ఛేదించే క్రమంలో ముందుగానే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది.
ఏ క్రికెట్ జట్టుకైనా హార్దిక్ పాండ్యా బ్యాటర్గా, పేస్ బౌలింగ్ చేసే ఆల్ రౌండర్గా అతనికున్న రెండు రకాల సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ 2026లో అతని బౌలింగ్ కూడా అంతే నిరాశపరిచింది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. మిడిల్ ఓవర్లలో పరుగులు విచ్చలవిడిగా ఇచ్చేశాడు. దీంతో అతని భారీ ధర ట్యాగ్కు, కెప్టెన్సీకి తగిన న్యాయం చేయలేకపోతున్నాడనే వాదన వినిపిస్తుంది.
హార్దిక్ సమస్యతో పాటు.. ఐపీఎల్ 2026 అంతటా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ ఆందోళనకరంగా బలహీనంగా కనిపించింది. టాప్ ఆర్డర్ ఒత్తిడికి కుప్పకూలుతోంది. మిడిల్ ఆర్డర్ ఇన్నింగ్స్ను నిలబెట్టడంలో విఫలమవుతోంది. లోయర్ ఆర్డర్ చెప్పుకోదగ్గ సహకారం అందించడం లేదు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో క్వింటన్ డి కాక్, డానిష్ మాలేవార్, నమన్ ధీర్ అనే టాప్ త్రీ బ్యాట్స్మెన్లు కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పెవిలియన్కు తిరిగి వచ్చారు. ఆ మ్యాచ్లో మొత్తం స్కోరు 100 పరుగులు కూడా దాటలేదు. కేవలం సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మాత్రమే రెండంకెల స్కోరును చేరుకున్నారు.
ఇప్పటికే ఉన్న అన్ని సమస్యలకు తోడు, రోహిత్ శర్మను వెంటాడుతున్న నిరంతర ఫిట్నెస్ సంక్షోభం కూడా ఒక సమస్యగా మారింది. కండరాల గాయం (హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరీ) తగ్గకపోవడంతో, ఈ మాజీ కెప్టెన్ ఐపీఎల్ 2026 టోర్నమెంట్ అంతటా జట్టులో స్థానం కోల్పోతూ, తిరిగి అప్పుడప్పుడూ ఆడుతూ కనిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు ఓపెనర్గా అతని ఉనికి జట్టుకు బ్యాటింగ్ స్థిరత్వాన్ని, అనుభవాన్ని, అలాగే కుప్పకూలుతున్న ఛేజ్ను ఒంటరిగా గెలిపించగల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లను అందించేది. కానీ దానికి బదులుగా, తన అభిమాన ఫ్రాంచైజీ మరింత సంక్షోభంలోకి జారుకుంటుండగా, అతను తీవ్ర ఆవేదనతో డ్రెస్సింగ్ రూమ్ నుండి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.
ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్కు అభేద్యమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో ఆ జట్టుపై విజయం సాధించిన సందర్భాలు వేళ్లపై లెక్కించవచ్చు. కానీ, ఈ సీజన్లో ఏకంగా మూడు సార్లు ఓటమిని చవిచూసింది ముంబై జట్టు. గురువారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల భారీ ఓటమి, ఆ ఫ్రాంచైజీ చరిత్రలోనే సొంతగడ్డపై అత్యంత అవమానకరమైన పరాజయాన్ని చవిచూసింది. ఒకప్పుడు ఆత్మవిశ్వాసంతో హోరెత్తిన ఆ మైదానం ఇప్పుడు నిశ్శబ్దంతో, అపనమ్మకంతో ప్రతిధ్వనిస్తోంది.
ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 పట్టికలో 7 మ్యాచ్లలో 2 విజయాలు, 5 ఓటములతో కేవలం 4 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఓటమి తర్వాత వారి నెట్ రన్ రేట్ మైనస్ -0.736కు పడిపోయింది, ఇది మొత్తం టోర్నమెంట్లోనే అత్యంత చెత్త గణాంకాలలో ఒకటిగా నిలిచింది. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ కంటే దిగువన లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ టోర్నమెంట్ను ఐదుసార్లు గెలిచిన ఫ్రాంచైజీకి, ఈ గణాంకాలు వారి ఘనమైన చరిత్రలో మునుపెన్నడూ లేని అవమానాన్ని సూచిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chandrababu Award: చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు.. రేపు ముంబైకి పయనం
Nuzendla, Andhra Pradesh:Economic Times Business Reformer Award: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పాలనా సంస్కర్తగా గుర్తింపునిస్తూ అవార్డు లభించింది. ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ప్రకటించింది. గతంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, జై శంకర్, బిహార్ సీఎం నితీష్ కుమార్ అవార్డు అందుకోగా 2025 సంవత్సరానికి చంద్రబాబు ఎంపికయ్యారు. ఈ అవార్డును రేపు ముంబైలో ప్రదానం చేయనున్నారు.
Also Read: Telangana Cabinet Meeting: పీసీ ఘోష్ కమిషన్పై సంచలన నిర్ణయం.. తెలంగాణ మంత్రివర్గం నిర్ణయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లాంటి విప్లవాత్మక విధానాలు అమలు చేసినందుకు గాను ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డును చంద్రబాబుకు అందిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పన, పారిశ్రామిక విధానాల్లో విప్లవాత్మక మార్పులు-పారిశ్రామిక అనుకూల పాలసీల రూపకల్పనలో చంద్రబాబు కృషిని ఎకనమిక్ టైమ్స్ జ్యూరీ కొనియాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏపీకి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చారని.. పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తూ అమలు చేస్తున్న సంస్కరణలను జ్యూరీ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. టెక్నాలజీ , ఇన్నోవేషన్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో చంద్రబాబు చేస్తున్న కృషికి ఈ అవార్డు లభించింది.
Also Read: Telangana RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం.. రేపు ప్రభుత్వంతో ఆర్టీసీ సంఘాల చర్చ
చంద్రబాబు రేపటి షెడ్యూల్
ముంబైలో శనివారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు అమరావతి నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు క్యాంప్ ఆఫీసు నుంచి బయలుదేరి వెళ్తారు. 2.40 గంటలకు ముంబై విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5.25 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కు వెళ్తారు. రాత్రి 9.30 వరకు ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9.50 గంటలకు ముంబై నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
ఎక్కడ అందుకుంటారు?
వేదిక: ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్
సమయం: రేపు సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు
అతిథులు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా దిగ్గజ పారిశ్రామికవేత్తలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
