బలహీనులను మర్చిపోలేని బడ్జెట్ టైగర్ ఆంజనేయులు గౌడ్
Karimnagar, Telangana:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది, ముఖ్యంగా బలహీన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహాయక నిర్ణయం తీసుకుంది మరియు జిల్లా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Cobra Shed Video: వామ్మె.. నాగుపాము కుబుసాన్ని చేతులతో వలిచేసిన యువకుడు.. వీడియో..
Hyderabad, Telangana:Cobra Shed Video Watch Here: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక వింత వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తూనే వస్తోంది. ముఖ్యంగా వన్యప్రాణులు, విషసర్పాలకు సంబంధించిన వీడియోలకైతే నెట్టింట ఊహించని స్థాయిలో క్రేజ్ లభిస్తూ వస్తోంది. తాజాగా ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా పాముల పేర్లు చెబితేనే అడుగు వెనక్కి వేసే జనాలు ఉన్న ఈ రోజుల్లో.. ఒక యువకుడు ఏకంగా అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా కుబుసాన్ని చేతులతో వలిచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన పాములు తమ చర్మాన్ని మార్చుకునే క్రమంలో పాత చర్మాన్ని వీడుతుంటాయి. ఈ సమయంలో అవి తీవ్రమైన ఒత్తిడితో పాటు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాయి. అందుకే ఆ సమయంలో వాటికి దూరంగా ఉండడం మంచిదని వన్యప్రాణి నిపుణులు చెబుతుంటారు. కానీ, వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్లో ఉందని భావించవచ్చు.. ఒక భారీ నాగుపాము యువకుడు పట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు..
అతను ఏమాత్రం భయం లేకుండా.. అత్యంత ప్రమాదకరంగా ఉన్న ఆ నాగుపాము తల భాగం నుంచి కుబుసాన్ని తన చేతులతో మెల్లగా తొలగించడం ప్రారంభించాడు. పాము కళ్లపై ఉన్న తెల్లటి పొరను సైతం అతను చాలా సున్నితంగా విడదీశాడు.. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఆ యువకుడు అంత సాహసం చేస్తున్నా.. ఆ విషసర్పం అతడిపై దాడి చేయడానికి అస్సలు ప్రయత్నించడంలేదు.. ఎదురు తిరగకుండా..తల దించుకుని అతను చేస్తున్న పనికి సహకరించినట్లుగా ప్రశాంతంగా ఉండిపోవడం మీరు చూడొచ్చు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ దృశ్యాలు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో అప్లోడ్ అయిన కొద్దిసేపట్లోనే లక్షలాది వ్యూస్, వేలాది షేర్లతో దూసుకుపోతున్నాయి. అంతేకాకుండా దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు కూడా రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. అయితే, చాలా మంది ఆ యువకుడి ధైర్యానికి హ్యాట్సాఫ్.. పాముకు ఎంతటి ఉపశమనాన్ని అందించాడో! అని కామెంట్లు పెడుతుంటే.. మరికొంతమంది ఇది చాలా ప్రమాదకరమైన స్టంట్. కాస్త తేడా వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Real Estate: మే 28 నుంచి తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు... దీనివల్ల కలిగే లాభమేంటి రియల్ ఎస్టేట్ కు బూస్ట్ వస్తుందా..?
Lakshmapur, Telangana:Hyderabad Real Estate: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో భూముల మార్కెట్ విలువ పెంపును అమలు చేయనుంది. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్ల ప్రభుత్వ మార్కెట్ విలువలను భారీగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ మార్కెట్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ పెంపుదల కార్యక్రమం చేపట్టిందని రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ పెంపుదల వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఒక రకంగా బూస్ట్ అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ పెంపుదల కనీసం ఐదు శాతం నుంచి గరిష్టంగా 100శాతం వరకు ఉండేలా సీలింగ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
భూములు ధరలు ఎక్కడెక్కడ ఎంత పెరుగుతున్నాయి..:
హైదరాబాద్ పరిధిని 350 ప్రాంతాలుగా విభజించి, ఆయా ప్రాంతాల మార్కెట్ ట్రెండ్ మరియు డిమాండ్ను బట్టి ప్రత్యేక రేట్లను ఖరారు చేశారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే ఎకరా కనిష్ట విలువ 1.75 లక్షల నుంచి 2.75 లక్షలకు పెరగనుంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా కనిష్ట విలువ 15 లక్షలకు, ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో 10 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల సగానికి పైగా ప్రాంతాల్లో ప్లాట్ల విలువను రెట్టింపు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా అపార్ట్మెంట్ల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం 3500 నుంచి 4 వేల వరకు ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్ విలువను 6000 రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రీమియం ఏరియాల్లో పెరిగే రేట్లు ఇవే..:
ఇక ప్రీమియం స్థలాలుగా పిలవబడే కోకాపేట్, రాయదుర్గం, నార్సింగి వంటి ప్రాంతాల్లో ఎకరా ధర ప్రభుత్వ విలువ ప్రస్తుతం రూ. 2 కోట్లు ఉండగా, దాన్ని 4 కోట్ల వరకు పెంచాలని ఆలోచిస్తున్నారు. జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో చదరపు గజం విలువ రూ. 80,000 - రూ. 90,000కు చేరుకోనుంది. ఈ కొత్త రేట్లు అమల్లోకి వస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు ఏటా అదనంగా రూ. 1,000 నుండి రూ. 1500 కోట్ల ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Also Read: ప్రగతినగర్,నిజాంపేట్లో అమ్ముడుపోని ప్లాట్లు
భూముల పెంపుదల వల్ల లాభాలు ఇవే..:
నిజానికి బహిరంగ మార్కెట్లో భూముల ధరలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. కానీ అదే సమయంలో ప్రభుత్వ ధర్మం మాత్రం అలాగే ఉన్నాయి దీని వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా తగ్గింది. అందుకే బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ మార్కెట్ ధరలకు మధ్య ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భూమి బేస్ రేట్లు పెరిగినట్లు అయితే ఆస్తి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు చెల్లించే రిజిస్ట్రేషన్ ఫీజు అలాగే స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతుంది. ప్రభుత్వం పెంచిన విలువను గైడ్ లైన్ వాల్యూ అని పిలుస్తారు లేదా సర్కిల్ రేట్ అని కూడా పిలుస్తారు. అంటే ఒక ప్రాంతంలో భూములను ఆస్తులను నిర్ణయించే మినిమం ధరగా చెప్పవచ్చు.
Also Read: హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఉద్యోగులకు భారీ పెన్షన్ పొందేందుకు లైన్ క్లియర్..!!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial: రికార్డుల్లేవు.. తిరగని బండ్లకు డీజిల్ బిల్లులు.. జగిత్యాల మున్సిపాలిటీలో విస్తుపోయే అక్రమాలు!
Hyderabad, Telangana:Jagtial Municipality Scam Latest News: జగిత్యాల (JGTL) మున్సిపాలిటీలో గత కొన్ని ఏళ్లుగా సాగుతున్న అక్రమాలతో పాటు నిధుల దుర్వినియోగం బట్టబయలవుతున్నాయి. బల్దియాలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై ఏసీబీతో పాటు జిలెన్స్ అధికారులు సంయుక్తంగా ప్రత్యేకమైన విచారణ ఇప్పుడు స్థానికంగా అధికారుల్లో చర్చనీయాశానికి దారి తీస్తోంది. లక్షల రూపాయాల ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పలువురు అధికారుల గుట్టు రట్టవుతుండటంతో మున్సిపల్ వర్గాల్లో వణుకు మొదలైన్నట్లు తెలుస్తోంది.
ఐదేళ్లలో ఐదుగురు కమిషనర్లు.. ఏకంగా కొంతమంది జైలుకు..
జగిత్యాల మున్సిపాలిటీలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో.. చెప్పడానికి ఇక్కడి అధికారుల బదిలీలతో పాటు అరెస్టులే నిదర్శనంగా నిలుస్తూ వస్తున్నాయి. గత 5 సంవత్సరాల కాలంలో పలువురు కమిషనర్లు ఇక్కడికి రావడంతో పాటు అవినీతి ఆరోపణలతో బదిలీపై వెళ్లడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.. ఇదిలా ఉంటే మరికొందరు అధికారులు ఏకంగా ఏసీబీకి చిక్కి ఏకంగా జైలు ఊచలు లెక్కపెట్టడం బల్దియాలోని అవినీతి తీవ్రతకు అద్దం పడుతోంది. పాలకుల అండదండలు చూసుకుని.. అధికారుల చేతివాటం తోడై మున్సిపాలిటీని అవినీతి కూపంగా మార్చేశారనే విమర్శలు వ్యక్తమవుతూ వస్తున్నాయి.
రూ. 15 కోట్ల పనులకు రికార్డులే లేవు..
విజిలెన్స్ విభాగంలో జరిపిన ప్రత్యేకమైన విచారణలో ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టణంలోని గత కోన్ని సంవత్సరాలు చేపట్టిన సుమారు రూ.15 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన ఎలాంటి రికార్డులతో పాటు ఆధారాలు మున్సిపల్ కార్యాలయంలో రికార్డ్లో లేవని సంచారం.. పనులు చేయకుండానే కాగితాల్లో చూపించి బిల్లులు డ్రా చేస్తున్నారా? లేక నిధులను పూర్తిగా పక్కదారి పట్టించారా? అనే కోణంలో అధికారులు లోతుగా ప్రత్యేకమైన దర్యాప్తును కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
మున్సిపాలిటీని ముంచేసిన కుంభకోణాలు..
ఈ కుంభకోణంలో భాగంగా మున్సిపల్ వాహనాలకు కేటాయించే డీజిల్ వినియోగంలో భారీగా అవకతవకలు జరిగిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తిరగని వాహనాలకు కూడా తిరిగినట్లు చూపిస్తూ లక్షల రూపాయల డీజిల్ బిల్లులు స్వాహా చేసిన్నట్లు సమాచారం.. కొంతమంది అధికారులు పట్టణంలో శానిటేషన్, మెయింటెనెన్స్ పేరుతో తప్పుడు బిల్లులు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా పనుల్లో ఇలాంటి మోసాలు జరిగిన్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీకి చెందిన కొన్ని పాత వాహనాలతో పాటు విలువైన ప్రభుత్వ స్థలాల రికార్డులు, రిజిస్టర్లు కార్యాలయం నుంచి మాయమవ్వడం వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Sun Transit 2026: సూర్య గ్రహ సంచారంతో బంపర్ లాభాలు.. మే 26 నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
Hyderabad, Telangana:Sun Transit In Rohini Nakshatra 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని ఎంతో శక్తివంతమైన గ్రహంగా కూడా చెప్పుకుంటారు. అన్ని నెలల పాటు సంచారం చేసే గ్రహాల్లో ఇది ఒకటి.. అయితే, ఈ గ్రహ సంచారం కారణంగా ప్రతి రాశి చాలా వరకు ప్రభావితం అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఆయా రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా సూర్యుడి ప్రభావంతో కొన్ని రాశులవారు భారీ లాభాలు పొందుతారు. ఇదిలా ఉంటే మే 25వ తేదిన సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేశాడు. ఈ నక్షత్రాన్ని ఆనందం, ఆకర్షణ, సంపదతో పాటు శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. అయితే, ఈ గ్రహ సంచారం కారణంగా కొన్ని రాశులవారు చాలా వరకు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అయితే, ఈ సమయంలో అదృష్టం పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి:
సూర్యుని అనుగ్రహంతో ఈ రోజు నుంచి వృషభ రాశివారికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే సమాజంలో ఊహించని స్థాయిలో గౌరవం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కీర్తి, ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో కొత్త కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు భవిష్యత్తులో కొత్త పరిచయాలు కూడా పొందుతారు.
సింహ రాశి:
సింహ రాశివారికి సూర్యుడి నక్షత్ర సంచారంతో అద్భుతమైన శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వృత్తిపరంగా కొత్త అవకాశాలు కూడా పొందుతారు. అలాగే యువత చదువుల్లో కూడా చాలా వరకు రాణిస్తారు. పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా మారవచ్చు. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా బలంగా మారుతాయి. వీరికి ఈ సమయంలో తప్పకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు భారీ మొత్తంలో ధనం పెట్టుబడి పెడతారు.
ధనుస్సు రాశి:
సూర్య సంచారం ప్రభావంతో ధనుస్సు రాశివారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు భూమి, ఇల్లు, ప్లాట్ లేదా కారు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిసిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా నిలిపోయిన డబ్బులు కూడా వీరు తిరిగిపొందుతారు. అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. వృత్తి జీవితంలో మంచి పురోగతి కూడా లభిస్తుంది. కుటుంబ జీవితంలో ఆనందంతో పాటు శాంతిని కూడా సొంతం చేసుకుంటారు. అలాగే వీరు శాంతిని కూడా పొందుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shani Dev: శని దేవుడి బంపర్ ఆఫర్.. ఆ రాశుల వారికి అపార ధనలాభం, కోరిన కోరికలు నెరవేరే సమయం!
Hyderabad, Telangana:Shani Dev Blessing On Zodiac: శని దేవుడిని వ్యక్తుల కర్మ గ్రహంగా చెప్పుకుంటారు. అంతేకాకుండా ఈ గ్రహాన్ని సూర్యుడి కుమారుడిగా కూడా పిలుస్తారు. శని వక్తుల మంచి, చెడు కర్మలకు అనుగుణంగా ఫలితాలను అందిస్తాడు. అలాగే దీనిని అత్యంత క్రూరమైన గ్రహంగా కూడా చెప్పకుంటారు. ఈ శని ప్రభావం వల్ల దేవతలు సైతం తప్పించుకోలేకుండా ఉంటారు. కాబట్టి అన్ని గ్రహాల ప్రభావంతో పోలిస్తే.. ఈ గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. మే 17న శని గ్రహం రేవతి నక్షత్రంలోకి సంచారం చేసిన సంగతి తెలిసిందే.. అక్టోబర్ 9 వరకు ఈ గ్రహం ఇక్కడే ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కొన్ని రాశులవారికి శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మిథున రాశి
శని గ్రహం ప్రభావంతో మిథున రాశివారికి అక్టోబర్ 9 వరకు అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా కాలంగా ఉద్యోగాలు లేనివారు ఈ సమయంలో తప్పకుండా ఉద్యోగాలు కూడా పొందుతారు. అలాగే ఇప్పటి ఉద్యోగాలు చేస్తున్నవారు మీ బాస్ల నుంచి అద్భుతమైన ప్రశంసలు కూడా పొందుతారు. వీరు సీనియర్ల నుంచి కూడా అద్భుతమైన స్కిల్స్ నేర్చుకుంటారు.
తులారాశి
శని దేవుని ఆశీస్సులతో తులారాశి వారికి కూడా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. అంతేకాకుండా కొత్త ఆస్తి లేదా కారు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శుక్రుడి ప్రభావంతో నాలుగు నెలల పాటు అదృష్టం ఊహించని స్థాయిలో పొందుతారు. అంతేకాకుండా నిలిపోయిన పనులు కూడా తిరిగి ఊపందుకుంటాయి. కొత్త ఆస్తి లేదా కారు కొనుగోలు చేయడానికి ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో పెళ్లికాని వారి జీవితంలోకి ఒక కొత్త భాగస్వామి పొందుతారు.
వృషభ రాశి
శని ప్రభావంతో వృషభ రాశివారికి ఈ సమయం ఒక వరంలా మారుతుంది. అంతేకాకుండా చాలా కాలంగా ఆగిపోయిన మార్కెట్లో డబ్బులు ఈ సమయంలో తప్పకుండా అకస్మాత్తుగా తిరిగి పొందుతారు. ఆర్థిక పునాదులు కూడా మరింత బలోపేతమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగాల్లో కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇష్టమైన పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రమోషన్స్తో పాటు వ్యాపారాలు చేసేవారు అద్భుతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
ధనుస్సు రాశి
రాబోయే నాలుగు నెలల పాటు ధనుస్సు రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. డబ్బుల విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ వనరులు కూడా అనుకున్నంత స్థాయిలో పొందుతారు. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ మొత్తంలో ధన లాభాలు పొంది.. విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరు కొత్త కొత్త ప్రాజెక్ట్ల నుంచి సంపాదన కూడా పొందుతారు. అలాగే ఈ సమయంలో ధనం పొదుపు చేయడం వల్ల కెరీర్ పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Taiwan stock market: వణుకుతున్న చైనా.. స్టాక్ మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తోన్న Taiwan.. కారణాలు ఇవే..!!
Lakshmapur, Telangana:Taiwan stock market: గ్లోబల్ స్టాక్ మార్కెట్ ఒక పెద్ద మార్పుకు సాక్ష్యమిస్తోంది. ఆర్టిఫికషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అపూర్వమైన విజ్రుంభణ, ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ మేకర్ అయిన తైవాన్ సెమీ కండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ భారీ వృద్ధి కారణంగా మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా తైవాన్ భారత్ ను అధిగమించింది. తాజాగా బ్లూమ్ బర్గ్ విడుదల చేసిన డేటా ప్రకారం తైవాన్ స్టాక్ మార్కెట్ విలువ 4.95 ట్రిలియన్ల డాలర్లకు చేరుకుంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 415 లక్షల కోట్లు. భారత మార్కెట్ విలువ 4.92 ట్రిలియన్లకు పడిపోయింది. ఈ చారిత్రాత్మక విజ్రుంభణతో అమెరికా, చైనా, జపాన్, హాంగ్ కాంగ్ ల తర్వాత చైనా ఇప్పుడు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా అవతరించింది. అమెరికా మార్కెట్ క్యాపిటలైజేషన్ 77.53 ట్రిలియన్లు కాగా.. దాని తర్వాత చైనా 15.61 ట్రిలియన్లు, జపాన్ 8.70 ట్రిలియన్లు, హాంగ్ కాంగ్ 7. 25 ట్రిలియన్లతో ఉన్నాయి.
అయితే తైవాన్ సాధించిన ఈ విజయం వెనక TSMC వన్ మ్యాన్ షోగా నిలిచిందని చెప్పాలి. ఈ ఒకే ఒక కంపెనీ ఎందుకంటే తైవాన్ ప్రధాన సూచీ అయిన బెంచ్ మార్క్ ఇండెక్స్ లో ఒక టీఎస్ఎంసీ కంపెనీకే 42శాతం మేర భారీ వాటా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఏఐ విప్లవంలో ఉపయోగించే అధునాతన సెమీకండక్టర్ల రంగంలో కూడా ఈ కంపెనీదే పూర్తి ఆధిపత్యం కొనసాగుతోంది. ఫలితంగా ఈ ఏడాదిలో ఈ కంపెనీ షేర్లు ఏకంగా 49శాతం మేర పెరిగాయి. ఏఐ రంగంలోని ఈ అపారమైన ఉత్సాహంతోపాటు ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలుగా ఉన్న తైవాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు భారీ ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ప్రపంచ ఏఐ పెట్టుబడి చక్రానికి కేంద్రంగా నిలుస్తూన్న టెక్ హార్డ్ వేర్ రంగంలో తైవాన్ ఆధిపత్యం చెలాయించడంతోపాటు దాని పెరుగుతున్న మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ప్రధాన కారణమని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫండ్ మేనేజర్ యి పింగ్ లియానో అన్నారు. టెక్ హార్డ్ వేర్ లేని మార్కెట్లు ఇప్పుడు తైవాన్, కొరియా వంటి దేశాల కంటే వెనకబడి ఉన్నాయని వెల్లడించారు. దీనికితోడుగా తైవాన్ ఆర్థిక నియంత్రణ సంస్థలు ఈమధ్య దేశీయ ఫండ్స్ ఒకే కంపెనీలో ఇన్వెస్ట్ చేసే లిమిట్ ను పెంచాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఫండ్స్ ఇప్పుడు టీఎస్ఎంసీ వంటి లార్జ్ క్యాప్ కంపెనీలో తమ మొత్తం ఆస్తుల్లో 25శాతం వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది గతంలో 10శాతంగా మాత్రమే ఉండేది. ఈ నిబంధన మార్చిన తర్వాత తైవాన్ మార్కెట్లోకి 6 బిలయన్ డాలర్లకు పైగా విదేశీ పెట్టుబడులను తీసుకురాగలదని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది.
Also Read: ఈ ప్రభుత్వ పథకంలో చేరితే రూ.1 కోటి మీ సొంతం.. Post Office సూపర్ హిట్ Scheme ఇదే..!!
చైనా మార్కెట్లో అనిశ్చితి.. ఇరాన్ ఉద్రిక్తతల వల్ల చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాల మార్కెట్లు ఒత్తిడికి గువుతుంటే.. గ్లోబల్ ఇన్వెస్టర్లకు తైవాన్ ఒక సురక్షితమైన టెక్ హబ్ మాదిరి కనిపించేలా చేసింది.
Also Read: ఒకే పాలసీ.. భార్యాభర్తలిద్దరికీ కోట్లలో కవరేజ్.. ఎల్ఐసీ కొత్త స్కీమ్ డీటెయిల్స్ ఇవే!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Crorepati Govt Scheme: ఈ ప్రభుత్వ పథకంలో చేరితే రూ.1 కోటి మీ సొంతం.. Post Office సూపర్ హిట్ Scheme ఇదే..!!
Lakshmapur, Telangana:Crorepati Govt Scheme: మన దేశంలో పోస్టాఫీస్ అంటే కేవలం సమాచారం చేరవేసే సంస్థ మాత్రమే కాకుండా ప్రజలకు పొదుపు అలవాటు చేసే ఒక వ్యవస్థగా కూడా మారింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి విషయాలపై ఎక్కువగా దృష్టి సారించింది. ఊరిలో ఉంటుందనే భరోసా, కళ్ల ముందే కనిపించే ఉద్యోగులు, ఎప్పుడైనా వెళ్లే వెసులుబాటు ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలుకూడా పోస్టాఫీస్ సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న భారతీయ పోస్టాఫీస్ ప్రజలకు ఎన్నో ఉపయోగకరమైన సులభమైన పొదుపు పథకాలను తీసుకువస్తోంది. ఇప్పుడు చెప్పుకోబోయే పథకం కూడా అలాంటిదే.
పోస్టాఫీసు స్కీములు సురక్షితమైన పెట్టుబడి, అద్భుతమైన రాబడుల కారణంగా బాగా ప్రాచుర్యం పొందాయి. అలాంటి స్కీముల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒకటి. ఇది పెట్టుబడిదారులను కోటీశ్వరులను చేసే స్కీమ్. ఇందులో పెట్టుబడి పన్ను మినహాయింపులు, క్రమం తప్పని పెట్టుబడుల తర్వాత మెచ్యూరిటీ రాబడిపై పన్ను లేకపోవడం వంటి అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తుంది. నెలకు రూ. 12,500 పొదుపుతో రూ. 1కోటీకిపైగా నిధిని కూడబెట్టుకోవచ్చు. అంటే ఈ ప్రభుత్వ స్కీమ్ మిమ్మల్ని కోటీశ్వరుడిని చేస్తుంది.
సురక్షితమైన పెట్టబడి సాధనాల విషయానికి వస్తే పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాలు ముందు వరుసలో ఉంటాయి. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి పెట్టుబడి భద్రతకు ప్రభుత్వమే హామీ ఇస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ విషయానికి వస్తే.. ఈ స్కీమ్ ప్రభుత్వ రక్షణను అందించడమే కాదు.. పన్ను రహితమైన భారీ మెచ్యూరిటీ కార్పస్ కూడా అందిస్తుంది. ఈ స్కీమ్ కు ఉన్న అనేక ప్రయోజనాల వల్ల ఈ పథకం బాగా ప్రాచుర్యం పొందింది.
Also Read: ఒకే పాలసీ.. భార్యాభర్తలిద్దరికీ కోట్లలో కవరేజ్.. ఎల్ఐసీ కొత్త స్కీమ్ డీటెయిల్స్ ఇవే!
పీపీఎఫ్ వడ్డీ రేట్లను చూస్తే.. పోస్టాఫీస్ ద్వారా నిర్వహించే ఈ ప్రభుత్వ స్కీమ్ రూ. 7.1శాతం వడ్డీ రేటును అందిస్తుంది. పీపీఎఫ్ ఖాతా నిబంధనల ప్రకారం డిపాజిట్లపై వడ్డీని ప్రతినెలా 5వ తేదీ నుంచి చివరి తేదీ వరకు లెక్కిస్తారు. అందువల్ల మీరు ఏ నెలలోనైనా 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య మీ పీపీఎఫ్ అకౌంట్లో డబ్బు జమ చేస్తే మీకు ఆ నెల వడ్డీ అందుతుంది. పీపీఎఫ్ అకౌంట్లో డబ్బు జమ చేసిన తర్వాత మెచ్యూరిటీ 15ఏళ్లు ఉంటుంది. అయితే ఈ స్కీమ్ కింద దీనిని 5-5 సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా పెట్టుబడిదారులు పెద్ద నిధిని స్రుష్టించుకోవచ్చు. ఈ ప్రభుత్వ స్కీములో పెట్టుబడి మొత్తం పరిమితి.. ఏడాదికి గరిష్టంగా రూ. 1.50లక్షలు అంటే మీరు ప్రతినెలా రూ. 12,500 పెట్టుబడి పెట్టవచ్చు.
మీరు రూ. 1.5లక్షల 15ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత మరో 5ఏళ్లు పొడిగించినట్లయితే మీకు వడ్డీ 36.58లక్షలు వస్తుంది. అసలు 66.58లక్షలు లభిస్తాయి. 25ఏళ్ల తర్వాత మరో 5ఏళ్లు పొడిగిస్తే ఈ మొత్తంపై మీకు వడ్డీగా రూ. 68.58లక్షల లభిస్తాయి. అదే సమయంలో మొత్తం అసలు కలిపి రూ. 1.03కోట్లు ఉంటుంది. అంటే మీరు పెట్టుబడి పెట్టింది కేవలం రూ. 37.50లక్షలు మాత్రమే. వడ్డీ రూపంలోనే 68.58లక్షల వరకు అందుకుంటారు.
Also Read: నెలకు రూ. 2వేల పొదుపు.. 30ఏళ్లలోనే కోటీశ్వరులు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Rate Today: రూ. 20,000 తక్కువ ధరకు పసిడి.. మే 26వ తేదీ మంగళవారం బంగారం ధరలివే..!!
Lakshmapur, Telangana:Gold Rate Today: బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు మే 26వ తేదీ మంగళవారం ధరలు చూస్తే 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,63,300 పలుకుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,46,550 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 2,77,621 వద్ద ట్రేడ్ అవుతోంది. జనవరి 23వ తేదీన బంగారం ధర రూ. 1.83లక్షల వద్ద ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. అక్కడి నుంచి తగ్గుతూ వచ్చి మళ్లీ పెరిగింది. అయినప్పటికీ ఆల్ టైం గరిష్ట స్థాయి నుంచి ఇప్పటికీ తులంపైూ 20000వేలు తక్కువగానే ఉందని చెప్పాలి.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు కారణంగా బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవుతుంది. నేడు మే 26వ తేదీ మంగళవారం మార్కెట్ ప్రారంభం కావడానికి ముందే, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,63,300 కు పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 24 క్యారెట్ల బంగారం ఫ్యూచర్స్ ధర 0.04శాతం అంటే రూ. 56 తగ్గి 10 గ్రాములకు రూ. 1,59,025 కు చేరింది. గత ట్రేడింగ్ రోజున ఇది 10 గ్రాములకు రూ. 1,59,081 వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి 29న ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,80,779 వద్ద అత్యధిక స్థాయికి చేరుకోవడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో, స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $4,570.07 కు పెరుగుతోంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, మంగళవారం ఉదయం నాటికి ఇది 10 గ్రాములకు రూ. 1,58,857 కు చేరుకుంది. గుడ్రిటర్న్స్ ప్రకారం, 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ. 1,59,530గా ఉంది.
జాతీయ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్లో, డాలర్ బలహీనపడటం, అమెరికా-ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే ఆశల కారణంగా.. సోమవారం బంగారం ధర రూ.300 పెరిగి, 10 గ్రాములకు రూ.1.65 లక్షల స్థాయికి చేరుకుంది. స్థానిక మార్కెట్ నిపుణుల ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.300 పెరిగింది. శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.1,64,900 ఉండగా అది 10 గ్రాములకు రూ.1,65,200కు పెరిగింది.
అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే ఆశల నేపథ్యంలో.. సోమవారం ఫ్యూచర్స్ ట్రేడ్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 426 పెరిగి రూ. 1,59,105కు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో జూన్ డెలివరీ కాంట్రాక్ట్ ధర రూ. 426, అంటే 0.27 శాతం పెరిగి, 10 గ్రాములకు రూ. 1,59,105కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో, న్యూయార్క్లోని కామెక్స్ జూన్ కాంట్రాక్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర దాదాపు ఒక శాతం పెరిగి, ఔన్సుకు $4,590.62కు చేరింది.
Also Read: దేశమంతా ఎక్కువగా కొంటున్న స్కూటీలు ఇవే.. !!
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, బాండ్ల రాబడులు తగ్గడం, డాలర్ బలహీనపడటం వల్లే బంగారం ధరలు పెరిగాయని నిపుణులు తెలిపారు. అయితే, రూపాయి బలపడటం దేశీయ మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలను పరిమితం చేసింది. బంగారం స్వల్ప సానుకూల ధోరణితో ట్రేడ్ అయిందని నిపుణులు చెబుతున్నారు. అయితే, రూపాయి బలంగా బలపడటం దేశీయ ధరల పెరుగుదలను పరిమితం చేసింది. బంగారం కొత్త వారాన్ని సానుకూల ధోరణితో ప్రారంభించిందని చెబుతున్నారు.
అమెరికా, ఇరాన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశంపై పెరుగుతున్న ఆశలు, అధిక ఇంధన ధరలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఉన్న ఆందోళనలను తగ్గించడంతో, బంగారం ధరలు గత వారం తగ్గుదల నుండి కొంత కోలుకున్నాయి. కొనసాగుతున్న దౌత్యపరమైన పురోగతి, ఇంధన మార్కెట్లకు సంబంధించిన ద్రవ్యోల్బణ ఆందోళనలను తగ్గించడం ద్వారా బంగారం, వెండికి మద్దతు ఇవ్వగలదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, చర్చలలో ఏదైనా అంతరాయం లేదా పునరుద్ధరించిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మార్కెట్ అస్థిరతను పెంచి, పెట్టుబడిదారుల సెంటిమెంట్పై భారం మోపగలవని చెబుతున్నారు.
Also Read: సామాన్యుడి శాలరీకి సరిపోయే TOP-3 బడ్జెట్ కార్లు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan: నన్ను రెచ్చగొట్టవద్దు.. మేం ఎదురుదాడి చేస్తాం: పవన్ కల్యాణ్
Rajamahendravaram, Andhra Pradesh:Prof Nageshwar Row: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో చర్చించిన అంశాలపై మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. 'అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి? వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని అడిగితే నాకు క్లాస్ తీసుకున్నారట. ఒకరు జైలుకి వెళ్తే పవన్ కల్యాణ్ ఎదుగుతారా.? జనసేన ఎదుగుతుందా..?' అని పవన్ కల్యాణ్ ఎదురు ప్రశ్నించారు. ఇలాంటి వారు లేనప్పుడే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
Also Read: Harish Rao: పెట్రోల్, డీజిల్పై రేవంత్ రెడ్డి వ్యాట్ తగ్గించాలి.. హరీశ్ రావు లేఖ
రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. 'అన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చా. ఇలా నన్ను విమర్శించేవాళ్లు రాగలరా? మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నా' అని పవన్ కల్యాణ్ సవాల్ చేశారు. ఛాయిస్ మీకే ఇస్తున్నా అంతేగానీ తనను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు.
'వైసీపీ నాయకుడు (వైఎస్ జగన్) జైలుకు వెళితే పవన్ రాజకీయాల్లోకి ప్రవేశంపై వారి పిచ్చి లాజిక్ అర్థం కావడం లేదు' అని పవన కల్యాణ్ తెలిపారు. 'చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఇదే సరైన సమయం నేను ముఖ్యమంత్రి కావొచ్చని నేను అనుకోవచ్చు కదా? అలా అనుకుంటే అయిపోతామా అలా జరిగిపోతుందా?' అని ప్రశ్నించారు. తన విలువల సిద్ధాంతం అది కాదనేది గ్రహించాలని చెప్పారు. జైలుకు వెళ్తే తాను ఎదగనని.. శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతానని స్పష్టం చేశారు. 'సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. మేము కూడా ఎదురుదాడి చేస్తామని గుర్తుంచుకోవాలి' అని కొన్ని సోషల్ మీడియా, కొందరు ప్రముఖులకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
Also Read: YS Sharmila: పెట్రోల్ ధరల పెంపుపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ప్రధాని మోదీ లూటీదారుడు
టీడీపీతో జనసేన పార్టీకి ఏర్పడిన విబేధాలపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఒక కుటుంబం నడవాలంటే సర్దుకుంటూ వెళ్లాలని.. కూటమి మధ్య విభేదాలను చూసీచూడకుండా వెళ్లాలని జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ కావాలని.. అలా అయితే కూటమిలో బలం రాదని గుర్తించాలని నాయకులకు సూచించారు. పార్టీ శ్రేణులపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. 'నాయకులకు పదవులు ఇస్తే ఉత్సాహంగా పనిచేస్తారనుకుంటే మాట్లాడడం మానేశరు. పదవులు ఇవ్వగానే అందరూ పెద్ద మనుషులు అయ్యారు. పదవుల కోసమే అయితే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు' అని పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. కూటమి కోసం కొన్నిసార్లు తాను సర్దుకుంటామని.. ఇది ఐదు కోట్ల ప్రజల గురించి కొన్నిసార్లు భరిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
సమావేశానికి ముందు పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటించారు. గోదావరి నది పరిశుభ్రత, పరిరక్షణపై సమీక్ష చేశారు. గోదావరి పుష్కరఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. పుష్కరఘాట్ వద్ద ఏర్పాట్లు, ఫొటో ప్రదర్శన చూసి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్కరఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటులో ప్రయాణం చేశారు. గోదావరి నదిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు ఆదేశించారు. నల్లకాలువ వద్ద చెత్తశుద్ది ప్లాంటును బాగు చేయాలని చెప్పారు.
Harish Rao: పెట్రోల్, డీజిల్పై రేవంత్ రెడ్డి వ్యాట్ తగ్గించాలి.. హరీశ్ రావు లేఖ
Baddipadaga, Telangana:Harish Rao Letter: కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంటే రేవంత్ రెడ్డి వ్యాట్ను తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మాటలు దంచుడు కాదు రేవంత్ దమ్ముంటే ధరలు దించు అని సవాల్ చేశారు. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర పన్నుల భారం వెంటనే తగ్గించాలని కోరారు. పెరిగిన ఏడున్నర రూపాయల్లో రెండున్నర స్టేట్ వ్యాట్ ఉందని దానిని తగ్గించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్లో కూల్ కూల్ వెదర్.. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం
'రూ.115 పెట్రోల్ ధరలో 35 శాతం స్టేట్ వ్యాట్, రూ.103 డీజిల్ ధరలో 27శాతం స్టేట్ వ్యాట్ ఉంది. ప్రజలపై నెలకు రూ. 162 కోట్లు, ఏటా రెండు వేల కోట్ల పన్నుల భారం పడుతోంది. మీది ప్రజా పాలన కాదు, పన్నుల దండుకునే ప్రజా పీడన పాలన. ఎన్నికల ముందు అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇప్పుడు స్టేట్ వ్యాట్ తగ్గించి ప్రజలకు మేలు చేయి' అని మాజీ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు లేఖ రాశారు.
Also Read: YS Sharmila: పెట్రోల్ ధరల పెంపుపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ప్రధాని మోదీ లూటీదారుడు
కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంటే చోద్యం చూడటం ఆపి వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి.. ప్రజలకు ఉపశమనం కలిగించాలని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో రాష్ట్ర పన్నులు తగ్గించాలని గతంలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని లేదని నిలదీశారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు, దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు దించాలని డిమాండ్ చేశారు.
మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు
వారంలో నాలుగు సార్లు ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోపితే.. రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజల నడ్డి విరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన సాగు ఖర్చులు భరించలేక రైతులు సతమతమవుతుంటే.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు రైతుల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా రంగం తీవ్ర సంక్షోభానికి లోను కావడంతో ద్రవ్యోల్బణం పెరిగి అన్ని వర్గాల ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
'పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, పన్నుల భారంతో పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు పొలం దున్నాలన్నా డీజిల్ భారం… సామాన్యుడు బైక్ తీయాలన్నా పెట్రోల్ భారం…ఆటో సోదరుడి బతుకు బండి నడవాలన్నా ఇంధన భారం.. పెరిగిన ధరలు ప్రజానీకానికి పెను శాపంగా మారింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు' అని తెలిపారు.
పైశాచిక ఆనందం
'పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ రేవంతు ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఖజానా నింపుకుంటూ సంబుర పడుతుంది. పైశాచిక ఆనందం పొందుతుంది. పెరిగిన ధరలతో ప్రతి నెలా రూ.162 కోట్లు, ఏడాదికి దాదాపు 2,000 కోట్ల అదనపు వ్యాట్ ఆదాయం వస్తుంట ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విడిచి పెట్టి ప్రచారాలకే పెద్ద పీట వేస్తున్నది' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు వ్యాట్పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, రెండున్నరేళ్లుగా కేనీసం 0.1 శాతం వ్యాట్ కూడా తగ్గించకపోవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. వెంటనే పెట్రోల్, డీజిల్పై కనీసం 10 శాతం వ్యాట్ తగ్గించి.. పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ పెంపుపై మొసలి కన్నీరు కార్చే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ వ్యాట్ దోపిడీపై స్పందించాలని కోరారు.
CM Revanth Reddy: ఆస్తి కోసం సొంత చెల్లెళ్లను బయటకు గెంటేస్తున్నారు: తెలంగాణ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:CM Revanth Reddy On KTR And YS Jagan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై పరోక్ష విమర్శలు చేశారు. ఆస్తి కోసం సొంత చెల్లెళ్లను ఇంటి నుంచి బయటకు గెంటేశారని పేర్లను ప్రస్తావించకుండా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యల చేశారు.
తన రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల్లోని ఆస్తి వివాదాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని రాజకీయ పరిణామాలు కుటుంబాలు, ఆస్తి పంపకాల చుట్టూనే తిరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
"సొంత చెల్లి కూడా భారమైందనుకుని, ఆస్తిలో వాటా అడుగుతుందనే భయంతో ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. ఆస్తి కోసం సొంత సోదరిని పంపించేస్తే.. ఆ తర్వాత అన్నపై ఆమె శాపనార్థాలు పెట్టే పరిస్థితులు నేటి రాజకీయాల్లో కనిపిస్తున్నాయి" అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పేరు చెప్పకపోయినా గురి ఎవరికో?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా నేరుగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు కానీ ప్రస్తావించలేదు. అయినప్పటికీ, గత కొంతకాలంగా వైఎస్ జగన్-షర్మిల మధ్య, అలాగే కేటీఆర్-కవితల మధ్య (ఆస్తి వివాదాలపై వస్తున్న వార్తల నేపథ్యంలో) నడుస్తున్న అంతర్గత పరిణామాలను దృష్టిలో ఉంచుకునే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత, కుటుంబ బలహీనతలను టార్గెట్ చేస్తూ రేవంత్ వేసిన ఈ పొలిటికల్ పంచ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
రేవంత్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో వేదికపై ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు, మంత్రుల హావభావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబులు సీఎం పక్కనే ఉన్నారు. రేవంత్ రెడ్డి నేరుగా ఆస్తి వివాదాలు, చెల్లెళ్ల ప్రస్తావన తీసుకురావడంతో.. పక్కనే ఉన్న మంత్రులు ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో అని అక్కడున్న వారు ఎంతో ఆసక్తిగా చూశారు.
Also Read: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్..రేషన్ కార్డులను రద్దు చేస్తున్న ప్రభుత్వం..ఎందుకంటే?
Also Read: ఏపీ ప్రజలకు పిడుగులాంటి వార్త.. రాబోయే 3 గంటల్లో పిడుగులతో అల్లకల్లోలంగా వాతావరణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dharmendra Award: హేమమాలిని చేతికి ధర్మేంద్ర 'పద్మవిభూషణ్' అవార్డు..ప్రముఖుల ముందు వెక్కివెక్కి ఏడ్చిన కుటుంబం!
Hyderabad, Telangana:Dharmendra Padma Vibhushan: భారత చలనచిత్ర పరిశ్రమలో 'హీ-మ్యాన్' గా గుర్తింపు పొందిన దివంగత నటుడు ధర్మేంద్రకు దక్కిన అత్యున్నత పౌర పురస్కారం 'పద్మవిభూషణ్' వారి కుటుంబంలో తీవ్ర భావోద్వేగాలను నింపింది. ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డ్స్ 2026 ప్రధానోత్సవ వేడుకల్లో, ధర్మేంద్ర తరపున ఆయన భార్య, నటి హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం హేమమాలిని తన చిన్న కుమార్తె అహానా డియోల్తో కలిసి లేత గులాబీ రంగు డిజైనర్ చీరలో హాజరయ్యారు. వేదికపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును స్వీకరించడానికి హేమమాలిని పేరు ప్రకటించగానే సభ అంతా చప్పట్లతో మారుమోగింది. ఆ సమయంలో ఆమె చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తూ, కళ్లల్లో నీళ్లతో వేదికపైకి నడిచారు. తండ్రిని గుర్తుచేసుకుంటూ కూతురు అహానా కూడా సదస్సులో కన్నీటి పర్యంతమైంది.
ఈ అవార్డు ప్రదానోత్సవానికి ముందు హేమమాలిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ధర్మేంద్ర మరణానంతరం లభించిన ఈ గౌరవం తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. "ఇది నాకు మాటల్లో చెప్పలేనంత భావోద్వేగ క్షణం. నా వెంట అహానా వచ్చింది. ఈషా కూడా రావాలనుకుంది కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. ఈ గౌరవం పట్ల సన్నీ, బాబీలతో పాటు మా కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది మా అందరికీ ఒక గొప్ప మరియు గర్వించదగ్గ క్షణం" అని ఆమె తెలిపారు.
పుట్టినరోజుకు కొన్ని వారాల ముందు..
భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ధర్మేంద్ర, తన 90వ పుట్టినరోజుకు కొన్ని వారాల ముందు, నవంబర్ 2025లో తన 89వ ఏట కన్నుమూశారు. దశాబ్దాల పాటు విభిన్న పాత్రలతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ఆయన మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు మిగిల్చింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తరతరాలపై ఆయన చూపిన సాంస్కృతిక ముద్రను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ అవార్డును అందించింది.
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'గా పరిగణిస్తారు. ఆ తర్వాత రెండో అత్యున్నత అవార్డుగా 'పద్మవిభూషణ్' నిలిచింది. ఈ పురస్కారాన్ని కళ, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సినిమా, ప్రజాసేవ వంటి రంగాల్లో విశిష్ట సేవలకు గానూ ఎంపిక చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 26కి ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు గ్రహీతల ఎంపికలను విడుదల చేస్తుంది.
ఈ ఏడాది వినోద రంగం నుండి ప్రకటించిన అవార్డులలో ధర్మేంద్రకు దక్కిన పద్మవిభూషణ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది ఆయన నటనకు మాత్రమే కాకుండా, భారతీయ సినిమాకు ఆయన అందించిన శాశ్వత వారసత్వానికి దక్కిన అసలైన గౌరవం అని బాలీవుడ్ అభిమానులు అంటున్నారు.
Also Read: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్..రేషన్ కార్డులను రద్దు చేస్తున్న ప్రభుత్వం..ఎందుకంటే?
Also Read: హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం.."నా ప్రపంచం ఇక శూన్యం" అంటూ ఎమోషనల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Rains: హైదరాబాద్లో చల్లబడిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం
Baddipadaga, Telangana:Sudden Rain In Hyderabad: వేసవికాలం కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండడంతో హైదరాబాద్ ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఎండి వేడిమితోపాటు ఉక్కపోతతో అలాడుతున్న హైదరాబాద్వాసులకు సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఊరట చెందారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఉదయం నుంచి ఎండలు మండుతూ ఉక్కపోతగా ఉండగా.. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వాతావరణం మారిపోయింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, నాగోల్, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, పెద్ద అంబర్పేట్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ భారీ వర్షంతో హైదరాబాద్ నగర ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
Also Read: YS Sharmila: పెట్రోల్ ధరల పెంపుపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ప్రధాని మోదీ లూటీదారుడు
మహబూబ్నగర్ జిల్లాలో..
భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం మహబూబ్నగర్ జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఈ వర్షంతో రైతులకు అపార నష్టం కలిగించింది. వర్షం ధాటికి ఎక్కడికక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, మిడ్జిల్ మండలాలలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీస్తూ భారీ వర్షం కురవడంతో అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షం కారణంగా జడ్చర్ల పట్టణంలో పలు కాలనీలు జలమయంగా మారి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన బలమైన గాలులు వీయడంతో జడ్చర్ల మార్కెట్ యార్డులో మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం ధాటికి భారీ వృక్షాలు రోడ్లపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ వర్షం ధాటికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై ఏర్పాటుచేసిన లక్షల రూపాయల విలువైన సోలార్ ప్యానల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిడ్జిల్ మండలంలోని చేతికి వచ్చిన పంట పొలాల గాలి బీభత్సానికి నేలకొరిగాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరిపోయాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో అపార నష్టాన్ని మిగిల్చింది.
Also Read: KKR vs DC: ఆఖరి మ్యాచ్లో కలకత్తాపై ఢిల్లీ విజయం.. ముగిసిన ఐపీఎల్ 2026 లీగ్ దశ
తడిసిన ధాన్యం
కామారెడ్డి జిల్లాలో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు తడిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లో ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షానికి వరి ధాన్యం రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం తాటికి ధాన్యంపై కప్పిన కవర్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది.
Rambha Father Death: హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం.."నా ప్రపంచం ఇక శూన్యం" అంటూ ఎమోషనల్!
Hyderabad, Telangana:Rambha Father Passed Away: తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన నటి రంభ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు హఠాత్తుగా కన్నుమూశారు. ఈ దుర్వార్తను రంభ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
"నాన్నా.. నా హృదయంలో నీ స్థానాన్ని ఇంకెవరూ భర్తీ చేయలేరు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నీ ముఖంపై చిరునవ్వును ఎప్పుడూ చెరిగిపోనివ్వలేదు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లిపోవడంతో నా ప్రపంచం మొత్తం శూన్యమైపోయింది" అంటూ రంభ తన సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రంభ కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు.
రంభ సినీ ప్రస్థానం
రంభ పక్కా తెలుగమ్మాయి. విజయవాడలో జన్మించిన ఆమె అసలు పేరు యూది విజయలక్ష్మి. తెలుగమ్మాయే అయినప్పటికీ, ఈమె హీరోయిన్గా మొదటి అవకాశం మాత్రం మలయాళ పరిశ్రమలో అందుకున్నారు. 1992లో వచ్చిన 'సర్గామ్' ఆమె తొలి చిత్రం.
తెలుగులో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాతో రంభ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టి, అందం, అభినయంతో కుర్రకారు మనసులు దోచుకున్నారు. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకున్నారు.
రంభ కెరీర్లోని కొన్ని సూపర్ హిట్ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి. వాటిలో హిట్లర్, బావగారూ బాగున్నారా (చిరంజీవి), అల్లుడా మజకా (చిరంజీవి), అల్లరి ప్రేమికుడు (జగపతిబాబు), బొంబాయి ప్రియుడు (జెడి చక్రవర్తి), గణేష్ (వెంకటేష్), అరుణాచలం (రజనీకాంత్) వంటి సినిమాలతో రంభ అలరించింది.
హీరోయిన్గానే కాకుండా 'హలో బ్రదర్', 'దేశముదురు', 'యమదొంగ' వంటి భారీ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, భోజ్పురి భాషల్లో నటించి మెప్పించింది హీరోయిన్ రంభ.
కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే రంభ 2010లో కెనడాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి కెనడాలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సినిమాలకు దూరమైనప్పటికీ, రంభ బుల్లితెరపై పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు టచ్లోనే ఉంటున్నారు. త్వరలోనే వెండితెరపైకి కూడా రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో ఆమె ఇంట్లో ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.
Also Read; Riddhi Kumar: పొట్టిపొట్టి బట్టల్లో ప్రభాస్ హీరోయిన్ అల్లాడిస్తుంది..కెవ్వుకేక అంతే!
Also REad: ఇంత అందంగా ఉన్నా.. వరుసగా 13 సినిమాల్లో నుంచి హీరోయిన్గా రిజెక్ట్ చేశారంట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Sharmila: పెట్రోల్ ధరల పెంపుపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ప్రధాని మోదీ లూటీదారుడు
Nuzendla, Andhra Pradesh:Petrol And Diesel Price Hike: 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లూటీదారు. దేశ ప్రజలను దోచడంలో మోడీని మించినోళ్లు లేరు. పెట్రోల్, డీజిల్ పేరుతో కేంద్ర ప్రభుత్వ దోపిడీ వాయిదాల పద్దతి. 10 రోజుల్లో వరుసగా నాలుగుసార్లు ఇంధనం ధరలు పెంచడం అత్యంత దారుణం' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రోజుకు రూ.వెయ్యి కోట్లు అదనపు భారం మోపుతున్నా మోడీ ఆకలి తీరలేదని ఇది సామాన్యుల సంపాదనను కాజేసి, పేదవారిని రోడ్డున పడేసి, దేశ ప్రజలకు బతుకు భారం చేసే కుట్ర' అని మండిపడ్డారు. ఇంధన సంక్షోభంపై సుంకాలు తగ్గించాల్సింది పోయి.. అదనంగా వడ్డించడం ప్రపంచ చరిత్రలో మోదీకే చెల్లిందని ఎద్దేవా చేశారు.
ఇంధనం ధరల భారం దృష్ట్యా ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ నిర్ణయాలు ప్రపంచానికి పాఠాలు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ప్రజలపై మొత్తం భారం వద్దని.. పెరిగిన భారాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భారాన్ని ప్రభుత్వం, రెండో భారం ఆయిల్ కంపెనీలు, మూడో భారాన్ని ప్రజలపై అతి తక్కువగా వేశారు' అని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. 'నేడు నష్టాల పేరు చెప్పి పూర్తి భారాన్ని ప్రజలపై రుద్దడం మోడీ దుర్మార్గపు పాలనకు నిదర్శనం. చమురు ధరలు తగ్గినప్పుడు లాభం పొంది.. ధరలు పెరిగాయని జనాలను దోచుకోవడం కేంద్ర ప్రభుత్వ నీచపు చర్యలకు అద్దం పడుతోంది' అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
'నాలుగోసారి పెరిగిన ధరలతో ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.19, డీజిల్ లీటర్ ధర రూ.104.88 పైసలకు చేరుకుంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు అధికం. రాష్ట్ర ప్రజలపై మోదీ సర్కార్ భరించలేని భారం మోపుతుంటే చంద్రబాబు మౌనం వహించడం సిగ్గుచేటు' అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వ్యాట్ భారాన్ని తగ్గించాలని కోరుతున్నా పట్టింపు లేకపోవడం బాధాకరమని తెలిపారు. రాష్ట్రంలో అధికంగా వసూలు చేస్తున్న రూ.4 వ్యాట్, ఒక్క రూపాయి రోడ్డు సెస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంధనం ధరలపై కొంత ఉపశమనం కల్పించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టగా.. ఏపీలో కూడా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. స్వయంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమంలో షర్మిల పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ప్రొఫెసర్ నాగేశ్వర్పై స్పందన
మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్పై జనసేన పార్టీ నాయకులు చేస్తున్న దాడి.. కేసులపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. 'ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసులు పెట్టి వేధించడం దారుణం. ఇది కూటమి ప్రభుత్వానికి తగదు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాక కూడా కేసులు బనాయించడం సరికాదు. ఇది కక్ష్య పూరిత ధోరణికి నిదర్శనం' అని తెలిపారు. తక్షణం నాగేశ్వర్ గారిపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
