Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Karimnagar505001

బలహీనులను మర్చిపోలేని బడ్జెట్ టైగర్ ఆంజనేయులు గౌడ్

Jul 26, 2024 10:51:52
Karimnagar, Telangana

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది, ముఖ్యంగా బలహీన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహాయక నిర్ణయం తీసుకుంది మరియు జిల్లా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 31, 2026 14:44:02
Guntur, Andhra Pradesh:

YS Jagan Phone Call: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై తెలుగుదేశం పార్టీ గూండాల దాడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపుతుండగా.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించారు. తమ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ధైర్యం చెప్పారు. ఏపీలో చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ మూకలు, గూండాలు రెచ్చిపోయి విధ్వంసం సృష్టించారు. అంబటి నివాసంపై దాడిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా అంబటి రాంబాబుకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పందించి ఫోన్‌ చేశారు. టీడీపీ గూండాల హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబుని ఫోన్‌లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని.. పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.

ఈ సందర్భంగా చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జంగిల్‌రాజ్‌గా మారిపోయింది. చంద్రబాబు ఆటవిక రాజ్యాన్ని నడుపుతున్నారు. చంద్రబాబు దుర్మార్గాలు రోజురోజుకూ పెరిగిపోయాయి' అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఉద్దేశపూక్వకంగానే అంబటి రాంబాబుపై హత్యాయత్నం, దాడులకు దిగారని తెలిపారు. ఇవన్నీ ప్రజలు మొత్తం చూస్తున్నారని.. ఈ అరాచక పాలనను ప్రజలు సహించబోరని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకుల్లా వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంబటి రాంబాబుకు వైఎస్సార్‌సీపీ మొత్తం అండగా ఉంటుందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులకు వైఎస్‌ జగన్‌ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ నాయకులు అంబటి రాంబాబుకు అండగా నిలబడాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇక అంబటి రాంబాబు నివాసానికి భద్రత కల్పించాలని.. అంబటికి ప్రాణహానీ పొంచి ఉందని వైఎస్సార్‌సీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా డీజీపీకి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మెయిల్‌ చేశారు. అంబటి రాంబాబుకు తక్షణమే కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ గూండాల నుంచి అంబటి రాంబాబుకు ప్రాణహాని పొంచి ఉందని మెయిల్‌లో తెలిపారు. కాగా ఫోన్‌కాల్‌లో ప్రయత్నించగా స్పందన లేదని బొత్స సత్యనారాయణ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 14:24:46
Domakonda, Telangana:

In Laws House: తన సంసారం సాఫీగా జరగడానికి బంగారం, ఆస్తి కావాలని కోరుకున్న కోడలు తన అత్త ఇంటిలో దొంగతనానికి ప్లాన్‌ వేసింది. అత్తగారింట్లో దొంగతనం చేయడానికి ప్లాన్‌ వేసి కొందరిని మాట్లాడించి పంపించింది. అయితే దొంగతనానికి వెళ్లిన సమయంలో ఆ దొంగలు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో కోడలి గుట్టు బయటపడింది. అత్తారింట్లో గౌరవంగా బతకాల్సిన కోడలు ఇప్పుడు జైలుపాలైంది. వైరల్‌గా మారిన ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

కామారెడ్డి జిల్లా దోమకొండలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీన రాత్రి దోమకొండలోని బీసు రుకుంబాయి-కిష్టయ్య ఇంట్లోకి చొరబడ్డారు. దొంగతనం చేస్తున్న క్రమంలో వారి అలజడికి ఆ ఇంట్లోని కుటుంబసభ్యులు నిద్రలేచారు. దొంగలను చూసి ఆ కుటుంబసభ్యులు కేకలు, అరుపులు వేయడంతో వెంటనే స్థానికులు అక్కడకు చేరుకున్నారు. అప్రమత్తమై కేకలు వేయడంతో దోపిడీకి వచ్చిన ఇద్దరు పారిపోయారు. స్థానికులు వెంబడించి ఒకరిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు.

దొరికిపోయిన వ్యక్తి రామారెడ్డి మండలం అన్నారం వాసి గోనే రజినీకాంత్‌గా పోలీసులు గుర్తించారు. రజనీకాంత్‌ను విచారించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయని సీఐ సంపత్‌ కుమార్‌ తెలిపారు. రజినీకాంత్‌ను  ఈ నెల 28వ తేదీన అరెస్టు చేయగా.. దొంగతనానికి వచ్చిన ఇద్దరు అన్నారం గ్రామస్తులు కేసరి తిర్మల్, కేసరి రాజేశ్ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కోడలి బండారం బయటపడింది.

దొంగతనం జరిగిన రుకుంబాయి చిన్న కుమారుడు నవీన్‌ భార్య మమత. చిన్న కోడలు మమత కాపురంలో కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. గతేడాది మమత మెడలోని బంగారు పుస్తెల తాడు పోవడంతో ఆమె భర్త నవీన్ ఆమెపైనే అనుమానపడ్డాడు. దీంతో వారి సంసారంలో గొడవలు జరిగి ప్రస్తుతం మమత తన పిల్లలతో పుట్టింటిలో ఉంటోంది. ఇటీవల కాపురానికి రావడానికి ప్రయత్నాలు చేయగా.. ఏదైనా ఆస్తి తీసుకురావాలని భర్త, అత్తమామలు తెగేసి చెప్పారు. డబ్బులు తీసుకురాలేక ఈ విషయంలో మమత తన అత్త ఇంట్లోనే దోపిడీ చేయాలని తనకు పరిచయం ఉన్న ముగ్గురు వ్యక్తులకు డబ్బుల ఎర చూపించి ఉసిగొల్పింది. పథకం ప్రకారం వారు దోపిడీకి పాల్పడ్డారని. ఈ కేసులో మమతతో పాటు ఇద్దరు పరిచయస్థులు తిర్మల్, రాజేష్ లను అరెస్టు చేసినట్లు సీఐ, ఎస్సై పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 13:20:36
Karimnagar, Telangana:

Karimnagar Municipal Corporation Elections: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రకటించారు. కరీంనగర్‌ మేయర్‌తోపాటు 3 చైర్మన్‌ స్థానాలు తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గెలిచే చోట కార్యకర్తలకే సీట్లు ఇస్తున్నామని.. గెలిచే అవకాశం లేనిచోట మాత్రమే ప్రత్యామ్నాయ నాయకులకు టికెట్లు ఇస్తున్నట్లు వివరించారు. టికెట్ రాని వారికి నామినేటెడ్, పార్టీ పదవులతో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తొందరపడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని.. తప్పుడు ప్రచారాలు నమ్మకండి అని సూచించారు. 

కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ ఇన్‌ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌ సమావేశమై బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంతోపాటు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీజేపీ విజయ అవకాశాలు ఉన్నాయని సర్వేల్లో తేలిందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీని నమ్ముకుని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే టికెట్ల విషయంలో అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. 

కరీంనగర్ కార్పొరేషన్‌లో 80 శాతంపైగా పార్టీకి కష్టపడిన వారికే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు బండి సంజయ్‌ తెలిపారు. గెలిచే అవకాశం లేని మిగిలిన స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆయా చోట్ల టికెట్లు రాని బీజేపీ కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదని.. నామినేటెడ్ పోస్టులతోపాటు పార్టీ పదవులిచ్చి వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తొందరపడి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు.

'కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతో. ఈ అభివృద్ధి ఆగకూడదంటే బీజేపీకి ఓటేసి ఆశీర్వదించాలని కోరుతూ ఇంటింటికీ ప్రచారం చేయాలి' అని పార్టీ శ్రేణులకు బండి సంజయ్‌ సూచించారు. మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్‌పై కాషాయ జెండాను ఎగరేసే బాధ్యత కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. టికెకెట్ ఆశించి భంగపడిన కార్యకర్తలను సముదాయించి డివిజన్‌లో గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేసేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతామూర్తి,  పార్టీ సీనియర్ నేతలు సాయిని మల్లేశం, గుజ్జ శ్రీను, ఇనుగొండ నాగేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 12:46:53
Dhamsalapuram, Telangana:

CPI vs Congress Party: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగులుతోంది. మిత్రపక్షం సీపీఐ బంధాన్ని తెంచేసుకుంది. కొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు కుదుర్చుకోగా.. మరికొన్ని చోట్ల ఒంటరిగా బరిలోకి దిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి సహకరిస్తున్నా కనీస గౌరవం ఇవ్వడం లేదని సీపీఐ కినుక వహించింది. దీనికితోడు క్షేత్రస్థాయిలో సీపీఐని గుర్తించకపోవడంతో మున్సిపల్‌ ఎన్నికల్లో భారీ షాక్‌ ఇచ్చింది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్కకు సీపీఐ ఝలక్‌ ఇచ్చింది.

మునిసిపల్ ఎన్నికల్లో సీపీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా.. వారి తీరుపై మండిపడుతూ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. కొన్ని మున్సిపాలిటీల్లో అన్నీ స్థానాల్లో పోటీ చేస్తూ నామినేషన్లు వేసింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, సీపీఐకి  పొత్తు కుదరలేదు. కొత్తగూడెంలో సీపీఐ డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించలేదు. కొత్తగూడెం మున్సిపాలిటీలో మొత్తం 60 డివిజన్లు ఉండగా అన్నింటిలో సీపీఐ పోటీ చేస్తోంది. ఈ సందర్భంగా అన్నీ డివిజన్‌లలో సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

కొత్తగూడెం మున్సిపాలిటీలో సీపీఐ చెరి సగం డిమాండ్‌ చేయగా.. కాంగ్రెస్‌ 20 మాత్రమే ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో సీపీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో శుక్రవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో మొత్తం 60 డివిజన్లలోనూ సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఇల్లందులో కూడా కాంగ్రెస్, సీపీఐ మధ్య దోస్తీ కుదరకపోవడంతో 6 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు వేశారు. ఇదే జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మునిసిపాలిటీలో సీపీఐ ఒంటరిగా పోటీ చేస్తోంది.

ఏదులాపురం మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులుండగా 15 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు వేసింది. అయితే కాంగ్రెస్‌ సీపీఐ వేసిన డివిజన్లతోపాటు మొత్తం 32 వార్డుల్లో నామినేషన్లు వేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, సీపీఐ వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉండగా పొత్తు కుదరకపోవడంతో సీపీఐ ఐదు చోట్ల నామినేషన్ వేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఆ స్థానాలతోపాటు మొత్తం అన్ని చోట్ల నామినేషన్లు వేసింది. ఇన్నాళ్లు కలిసి ఉన్న సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలు మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా చెరో దారి చూసుకోవడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. కాగా చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో సీపీఐ అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో పోటీలో దిగింది. అక్కడ గులాబీ, ఎర్రజెండాలు కలవడం చర్చనీయాంశంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 11:40:26
Hyderabad, Telangana:

K Chandrashekar Rao: రాజకీయ కక్ష్యతోనే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కి నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఎలక్షన్ అఫిడవిట్‌లో హరీష్ రావు అడ్రస్ సిద్దిపేటలో ఉంటే హైదరాబాద్ ఇంటి అడ్రస్‌లో నోటీస్ ఇచ్చారని తెలిపారు. ప్రతీకార వాంఛతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని.. కేసీఆర్‌కి మాత్రం హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇంటి అడ్రస్ కొడంగల్  అయితే గతంలో అధికారులు హైదరాబాద్‌లో నోటీస్ ఇచ్చారు. కేసీఆర్ మాత్రం అలా చేయక వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు శిక్ష వేయడం ఖాయమని హెచ్చరించారు.

Also Read: BRS Party Protest: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ విచారణ.. రేపు బీఆర్‌ఎస్‌ పార్టీ నిరసనలు

సిద్దిపేటలోని రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.'టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్‌పై వేధింపులు, సీరియల్ తరహాలో రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే అలీబాబా 40 దొంగలు తరహాలో కాంగ్రెస్ నాయకులు అనేక కుంభకోణాలు చేస్తున్నారు' అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికి చెప్పరని తెలిపారు. 'ప్రతిపక్ష నాయకులను వేధించడం కోసం సిట్ వేశారు. విచారణ జరుగుతున్న క్రమంలో వ్యక్తిగత హసనం చేసేలా మీడియాకి లీకులు ఇస్తున్నారు' అని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

'కాంగ్రెస్ ప్రభుత్వం రజాకార్ల పాలన కొనసాగిస్తోంది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కేవలం కక్షపూరిత రాజకీయాలతో కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ–కార్ వంటి అంశాలతో రెండున్నరేళ్లుగా ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని తెలిపారు. తెలంగాణ కోసం శ్రమించి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని.. నోటీసులతో భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు.

'సమ్మక్క–సారక్క అమ్మవార్ల జాతర ఆహ్వానాన్ని మంత్రులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఇచ్చారు. విచారణకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు రావాలని సూచించినప్పటికీ కక్షపూరితంగా నందినగర్ నివాసంలోనే విచారణ చేస్తామని చెప్పడం అన్యాయం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికి సిట్ నోటీసులు గోడకు అతికించడం అవమానకరమని చెప్పారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎంత ఒత్తిడి తెచ్చినా టీఆర్ఎస్ నాయకులు భయపడరని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 31, 2026 11:34:47
Hyderabad, Telangana:

Snakes Temple Video Watch: సాధారణంగా పాములు కనిపిస్తేనే చాలు.. చాలామంది ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు. కానీ ఒక గుడిలో మాత్రం మొత్తం పాములే ఉంటాయి. ఎటు చూసినా పాములు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చే భక్తులు.. ఏ మాత్రం భయపడకుండా పారిపోకుండా వాటికి నమస్కరిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ గుడి ప్రాంగణం తో పాటు గర్వాలయంలో లోపల కూడా పాములే దర్శిస్తూ ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ గుడికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే.. ప్రతిరోజు ఉదయాన్నే నాగుపాములు స్వయంగా గుడి లోపలికి వస్తాయట.. అంతేకాకుండా అక్కడి పూజారి ఆ పాములను భయపెట్టకుండా.. ఎంతో భక్తితో వాటికి కుంకుమ బొట్టు పెట్టి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారని అక్కడి భక్తులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ పాములన్ని పూజా సమయంలో చాలా ప్రశాంతంగా కూడా ఉంటాయని వారు అంటున్నారు. ఈ సమయంలో వచ్చే భక్తులకు కూడా ఆ ప్రమాదకరమైన పాములు ఎలాంటి హాని కలిగించమని వారు చెబుతున్నారు. 

అలాగే ఈ పాములన్ని గుడికి వచ్చే భక్తుల చుట్టూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయట.. అవి ఎవరిని ఏమీ చేయవని అక్కడి భక్తులు చెబుతూ ఉంటారు. పాములంటే భయం ఉన్నవారు ఈ గుడిలో కొంత జాగ్రత్తగా ఉండాలని అక్కడి స్థానికులు చెబుతారు. అలాగే ఈ గుడికి వచ్చిన కొంత మంది భక్తులు స్వయంగా పాములకు కుంకుమ తిలకం దిద్దుతారట. మరికొంతమంది అయితే, మరి కొంతమంది అయితే, వాటికి పాలు కూడా పోస్తారని సమాచారం. ఇలా ఆ పాములు ఎంతమంది భక్తులు వచ్చినా గుడిలో మాత్రం ప్రశాంతంగా ఉంటాయని అక్కడి భక్తులు చెబుతున్నారు. 

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

ఆ గుడిలోకి వచ్చే భక్తులు ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటారని.. అందువల్ల ఆ పాములు ఏమీ చేయమని సమాచారం. అలాగే అక్కడ పూజలు చేసే పూజలు కూడా వాటికి ప్రత్యేకంగా ప్రసాదాలు తయారుచేసి అందిస్తారని తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ని ఓ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికీ కొన్ని లక్షలమంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను చూసి లైక్ కూడా చేశారు.

Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 11:16:06
Hyderabad, Telangana:

Ex CM KCR Probe: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాజకీయ వేధింపులు తీవ్రమవుతుండడంతో ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్‌ విచారణ సందర్భంగా రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు. రేపు శాంతియుతంగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని కేటీఆర్‌ పార్టీ నాయకత్వానికి సూచించారు.

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు వివేకానంద్‌, కృష్ణారావు, సీనియర్‌ నాయకులు బాలమల్లు, కర్నె ప్రభాకర్ తదితరులు కీలక ప్రకటన విడుదల చేశారు.

ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ని వేధిస్తోందని.. రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయనను అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తోందని బీఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకత్వం  మండిపడింది. టెలిఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి.. ఇప్పుడు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గమైన, నీచమైన వైఖరి అని అభివర్ణించింది. రేపటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం సూచించింది. ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్‌ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని గులాబీ పార్టీ నాయకత్వం ఆదేశించింది. 

పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ తమ సొంత జిల్లాల్లోనే ఉండి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. నిరసనలు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఉండాలని పోలీసులతో ఘర్షణలకు తావివ్వకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని సూచించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 11:00:16
Hyderabad, Telangana:

Hyderabad: 'విద్యార్థి సంఘ్ రాజకీయాలు లేకుండా విద్యార్థి ఎన్నికలు లేకున్న నేను ఈరోజు ఇక్కడ మాట్లాడేది కాదు. విద్యార్థి రాజకీయాల్లో 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నా. విద్యార్థి సంఘ్ ఎన్నికలు ఉండాలి. 1988లో విద్యార్థి సంఘ ఎన్నికలు రద్దయ్యాయి. చట్టసభలపై అవగాహన.. చర్చలు జరుగుతున్న విధానం, ప్రజా సమస్యలపై అవగాహన చేసుకుని ఎలా పరిష్కారం చేయాలని ఈ యూత్ పార్లమెంట్‌తో అవగాహన కలుగుతుంది' అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

హైదరాబాద్‌లోని బాబు జాగ్జీవన్ రామ్‌ భవన్‌లో ఐ విజన్ యూత్ పార్లమెంట్ గ్రాండ్ ఫైనల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, పొన్నం ప్రభాకర్ కీలక ప్రసంగం చేశారు. 'విద్యార్థుల యూత్ పార్లమెంట్‌ భవిష్యత్‌లో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఢిల్లీలాంటి రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదంలో పడింది. ఆ పరిస్థితుల నుంచి మనం ఎలా రక్షించుకోవాలి? యువత ఆలోచించాలి. నీటి వనరుల వినియోగం, విద్యా వ్యవస్థలో సర్టిఫికెట్‌లకు పరిమితం కాకుండా స్కిల్ డెవలప్‌మెంట్ పెంపొందించుకునేలా ఉండాలి. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఎన్నో పోటీ పరీక్షలు రాసి వచ్చినవారు.. హైక్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటది' అని పొన్నం ప్రభాకర్‌ వివరించారు.

'పోటీలో ఉన్నామంటే పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సమాజంపై అవగాహన , ఎక్స్‌ట్రా కరికులం యాక్టివిటీస్ కూడా ప్రాధాన్యం కల్పించాలి. భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు ఎదిగేలా మీరంతా కష్టపడాలి.. దేశ భవిషత్ మీ చేతిలో ఉంది' అని పొన్నం ప్రభాకర్‌ చెప్పారు.'భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం.  ప్రజాస్వామ్యాన్ని బలంగా నిలబెట్టేది పార్లమెంట్. ఇక్కడ జరిగే చర్చలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయి' అని వివరించారు. అలాంటి పార్లమెంట్ పనితీరును యువత విద్యార్థులు ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరమని తెలిపారు.

'యూత్ పార్లమెంట్‌తో చట్టాల రూపకల్పన ఎలా జరుగుతుందో.. ప్రజా సమస్యలు ఎలా చర్చకు వస్తాయో, భిన్న అభిప్రాయాలను ఎలా గౌరవించాలో, ఆరోగ్యకరమైన విమర్శలు ఎలా చేయాలో నేర్చుకుంటారు' అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 'దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం, విద్యా ప్రమాణాలు, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి వాటిపై  విమర్శలు కాకుండా స్పష్టమైన పరిష్కారాలను సూచించే బాధ్యత మన అందరిపై ఉంది' అని చెప్పారు.

'యూత్ పార్లమెంట్ ఆ బాధ్యతాయుత ఆలోచనలకు వేదిక అవుతోంది. యూత్ పార్లమెంట్‌లో పాల్గొన్న విద్యార్థులు దేశ పార్లమెంట్‌లో నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరాలి. ప్రతి ఒక్కరూ మంచి పౌరులుగా, బాధ్యతాయుత నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నా' అని పొన్నం ప్రభాకర్‌ అభిలషించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, డీఈవో రోహిణి, ఐ విజన్ గ్రూప్ ప్రతినిధి అంజలి తదితరులు పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 31, 2026 10:58:04
Hyderabad, Telangana:

Moto G77 And Moto G67: మోటరోలా కంపెనీ మార్కెట్‌లోకి తమ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. ఇవి అద్భుతమైన డిజైన్‌తో చాలా ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి.. దీనిని కంపెనీ మోటో G77, మోటో G67 పేర్లతో లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ప్రత్యేకమైన కలర్స్‌తో పాటు అద్భుతమైన ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇవి చూడడానికి చాలా అద్భుతమైన లుక్కుని కలిగి ఉన్నాయి. అయితే, ఈ రెండు మొబైల్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

మోటో G67 కంపెనీ చాలా ప్రత్యేకమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఇక మోటో G77 మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ ప్రాసెసర్ తో లాంచ్ అయింది. ఇవి రెండు అద్భుతమైన  ఆండ్రాయిడ్ 16 పై నడుస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా AMOLED డిస్‌ప్లేలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Moto G77, Moto G67 స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ రూ.25,400 లోపు అందుబాటులోకి తీసుకువచ్చాయి. అంతేకాకుండా వేరియంట్స్‌ను బట్టి ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను కంపెనీ రెండు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా g77 స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రూ.31 వేల ధరతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ను కంపెనీ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా ఈ రెండింటి స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్నెస్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ రెండు మొబైల్స్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతాయి. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

మోటరోలాలోని G67 మోడల్ 4GB ర్యామ్, 128gb ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక g77 మోడల్ 8gb ర్యామ్, 128gb ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్స్‌లోని మొబైల్ స్టోరేజ్ పెంచుకునేందుకు ప్రత్యేకమైన SD కార్డు సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లోని మొదటి వేరియంట్ వెనక భాగంలో అద్భుతమైన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో లభిస్తుంది. అలాగే G77 మోడల్ ఎంతో శక్తివంతమైన 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా తో అందుబాటులో ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన 5,200mAh బ్యాటరీను కలిగి ఉంటుంది. అయితే, ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ అతి త్వరలోనే భారత్ లో కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 10:31:40
Kyathampally, Telangana:

CPI Supports To BRS Party: మున్సిపల్‌ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ఇచ్చేలా పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ కాంగ్రెస్‌తో కాకుండా మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ, సీపీఐ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ పరిణామంతో వివేక్ వెంకటస్వామికి భారీ షాక్‌ తగిలింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీను వీడి బీఆర్ఎస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకుంది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు కుదరలేదు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, సీపీఐ మధ్య  సయోధ్య కుదరకపోవడంతో గందరగోళం ఏర్పడింది. మిత్రపక్షం సీపీఐకి తక్కువ స్థానాలు ఇచ్చి అవమానించడంతో కాంగ్రెస్‌ను వదిలేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించింది.

ఈ సందర్భంగా చెన్నూరులో బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి సీపీఐ రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, కలవేన శంకర్ కీలక ప్రకటన చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. స్థానిక నాయకుల మాటలు నమ్మి వివేక్ వెంకటస్వామి సీపీఐని చిన్నచూపు చూస్తున్నాడని మండిపడ్డారు. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో గెలిచి వివేక్ వెంకటస్వామికి సీపీఐ సత్తా ఏంటో చూపిస్తామని ప్రకటించారు. వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా గెలవడానికి సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని గుర్తుచేశారు. కానీ అది వివేక్‌ గ్రహించకుండా తమను ఇబ్బందికి గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఎన్నికల్లో వివేక్ వెంకటస్వామికి పూర్తి మద్దతు తెలిపిన సీపీఐ ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించడం సంచలనంగా మారింది. వివేక్ వెంకటస్వామి వైఖరిపై ఇప్పటికే ఎర్రజెండా పార్టీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌తో సీపీఐ కలిసి నడిచేందుకు వెనుకంజ వేసింది. అయితే ఈ పొత్తు ఒక్క క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ఉంటుందా? లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడుతుందా? అనేది ఉత్కంఠ నెలకొంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 10:15:45
Hyderabad, Telangana:

China Manjha: సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఆనందోత్సాహాలతో జరగ్గా.. ఒక హైదరాబాద్‌లో మాత్రం విషాదంగా మారింది. పండుగ సందర్భంగా ఎగురవేసిన గాలిపటాల మాంజా తగిలి పలువురు తీవ్రంగా గాయపడగా.. రెండు ప్రాణాలు పోయాయి. ఈ విషాద సంఘటనల అనంతరం హైదరాబాద్‌ పోలీసులు ఆలస్యంగా మేల్కొన్నారు. ఆరుబయట.. బహిరంగ ప్రదేశాల్లో చిక్కుకున్న చైనా మాంజాను తొలగించే పని చేపట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రజలకు గాయాలు, ప్రాణనష్టం జరగకుండా నివారించే ముందస్తు లక్ష్యంతో వీధులు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, భవనాలపై కోసిన, తెగి పడిపోయి ఉన్న మాంజాను గుర్తించి తొలగించేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఈ డ్రైవ్‌లో ప్రజలు, వాకర్స్ స్వచ్చందంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ డ్రైవ్‌లో భాగంగా గచ్చిబౌలి, అమీన్‌పూర్, పటాన్‌చెరు, కొల్లూరు, ఐడీ‌ఏ బొల్లారం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో విస్తృతంగా చేపట్టారు. ఈ క్రమంలో గచ్చిబౌలి పోలీసులు మూడు బృందాలుగా మారి కొండాపూర్, మజీద్ బండ ప్రాంతాల్లో ప్రజల సహకారంతో  చెట్లు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు, భవనాలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ప్రమాదకర మాంజాను వినియోగించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. 

అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇలాపూర్ మైదానం, తులసీవనం కాలనీలో 150 వాకర్లతో కలిసి దారాలను తొలగించారు. చైనా మాంజా వాడకం చట్ట విరుద్ధమని, కొన్నా.. వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలకు అవగాహన కల్పించారు. పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మైత్రిగ్రౌండ్, సాకి చెరువు, ప్రభుత్వ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో స్థానికులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ రేడియల్ రోడ్డు, ఓజోన్ హైట్స్ గ్రౌండ్ తదితర ప్రాంతాల్లో ప్రజలకు చైనా మాంజా వినియోగంపై అవగాహన కల్పించారు. ఐడీఏ బొల్లారం  పోలీస్ స్టేషన్ల పరిధిలోని రోడ్లపై ఉన్న గాజు నూలును తొలగించారు.  

ప్రాణాంతక పతంగి నూలు తయారీ, విక్రయించినా, నిల్వ ఉంచినా లేదా వినియోగించినా చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఎక్కడైనా చైనా మాంజా అమ్మకాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100కి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని  పోలీసులు  ప్రజలను కోరారు. ఎక్కడైనా మాంజా వేలాడుతూ కనిపిస్తే జాగ్రత్తగా దాన్ని తొలగించి పడేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 10:04:03
Hyderabad, Telangana:

Phone Tapping Notice: 'డైవర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తూ.. ఏదో ఒక్క అసత్య ప్రచారం చేస్తూ  డైవర్షన్ చేస్తున్నారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వకుండా గోడకు అంటించి వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేసీఆర్‌ ఉంటున్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఇవ్వకుండా అవమానించారని మండిపడ్డారు. కేసీఆర్‌ను దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి అవమానిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో కర్నె ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడారు. 'కేసీఆర్ గజ్వేల్ నియోజవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎర్రవెల్లి కూడా దాని పరిధిలోకి వస్తుంది. ఎర్రవెల్లిలో తనకు నోటీసులు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. రెండు, మూడు కార్యక్రమాలు విషయాలు మంత్రులు వెళ్లి స్వాగతం పలికారు. మేడారం జాతరకు రావాలని సీతక్క, కొండా సురేఖ ఆహ్వానించారు. ఎర్రవెల్లి తెలియని ప్రదేశం కాదు కదా? మీరు అంటున్న అధికారిక నివాసం నందినగర్ అయితే. మరి హరీష్ రావు గారి అధికారిక నివాసం సిద్దిపేట అయితే మీరు హైదరాబాద్ లో ఎందుకు ఇచ్చారు?' అని ప్రశ్నించారు.

'మీ అవసరం మేరకు మీ సదుపాయం కోసం నోటీసులు ఇస్తున్నారు. మీ గురువు రేవంత్‌ రెడ్డి చెప్పినట్టు ఆయన ఆలోచనకు అనుగుణంగా రేవంత్‌ రెడ్డి పని చేస్తున్నాడు. మీ గురువు దేశానికి ప్రధానమంత్రి కావాలని నువ్వు కోరుకోవచ్చు, అనవచ్చు తప్పులేదు. మీ అవినీతి ఆరోపణలు బయట పెడుతుండడంతోనే కేటీఆర్‌, హరీశ్‌ రావు.. ఇప్పుడు కేసీఆర్‌ నోటీసులు ఇస్తున్నావు' అని రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు కర్నె ప్రభాకర్‌ మండిపడ్డారు.

'ఫార్ములా ఈ కార్ కేసు అసలు కేసే కాదు. ఫోన్ టాపింగ్ అనేది అన్ని రాష్ట్రాలు జరుగుతోంది. ఫోన్ టాపింగ్ అనే అసత్య ప్రచారం చేస్తూ అవమానించే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ పరిహాసం కావడంతో అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లావు' అని కర్నె ప్రభాకర్‌ తెలిపారు. ఎకనామిక్ సర్వే రిపోర్ట్‌ని కేంద్ర ప్రభుత్వమే బయటిపెట్టి కాళేశ్వరం, మిషన్ కాకతీయతో వ్యవసాయ స్థిరీకరణ జరిగింది అని చెప్పిందని గుర్తుచేశారు. కాళేశ్వరంపై అబద్ధపు ప్రచారం అని ఎకనమిక్‌ సర్వేతో తేలిందని కర్నె ప్రభాకర్‌ చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 31, 2026 09:20:17
Hyderabad, Telangana:

Australia Squad For T20 World Cup: ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ తుది 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అయితే, ఈ జట్టులో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మునుపటి ప్రొవిజనల్ స్క్వాడ్‌లో ఉన్న పలువురు కీలక ఆటగాళ్లను తప్పించి, ఆస్ట్రేలియా బోర్డు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది.

ప్యాట్ కమిన్స్‌కు వెన్నెముక గాయం
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. వెన్నెముక గాయంతో బాధపడుతున్న అతనికి విశ్రాంతినివ్వాలని బోర్డు నిర్ణయించింది. కమిన్స్ స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.

స్టీవ్ స్మిత్, మ్యాట్ షార్ట్ అవుట్
అనుభవజ్ఞుడైన స్టీవ్ స్మిత్‌ను ఈసారి సెలెక్టర్లు పక్కన పెట్టడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే స్మిత్‌ను ఎంపిక చేయలేదని తెలుస్తోంది. అలాగే, ప్రొవిజనల్ జట్టులో ఉన్న మ్యాట్ షార్ట్‌ను తప్పించి, అతని స్థానంలో మ్యాట్ రేన్‌షాను జట్టులోకి చేర్చారు.

మార్ష్ సారథ్యంలో ఆసీస్
ఈసారి వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా జట్టును మిచెల్ మార్ష్ ముందుండి నడిపించనున్నాడు. జట్టులో గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్ వంటి సీనియర్ ఆల్‌రౌండర్లతో పాటు ట్రావిస్ హెడ్ వంటి పవర్ హిట్టర్లు ఉండటం జట్టుకు కలిసివచ్చే అంశం.

ఆస్ట్రేలియా తుది జట్టు..
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, క్యామరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జాంపా, నాథన్ ఎల్లిస్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానొల్లి, బెన్ డ్వార్షుయిస్, మ్యాట్ రేన్‌షా, మ్యాట్ కూనెమన్

భారత్, శ్రీలంక స్పిన్ పిచ్‌లపై ఆడమ్ జాంపా, మ్యాట్ కూనెమన్ వంటి స్పిన్నర్లు కీలకం కానున్నారు. ప్యాట్ కమిన్స్ లేని లోటును ఈ యువ బౌలర్లు భర్తీ చేస్తారో లేదో చూడాలి.

Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు తీపికబురు..63 శాతానికి పెరిగిన డీఏ (DA)..ఎప్పడు అకౌంట్లో జమ చేస్తారంటే?

Also Read: Kevin Warsh Gold News: బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడానికి కారణం ఇతడే..మార్కెట్లను వణికించిన ట్రంప్ మావ దూత!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 31, 2026 08:36:02
Hyderabad, Telangana:

Ambulance Scam Medaram Telugu Latest News: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరలో కొంతమంది వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బరితెగించారు.. ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రికి చేర్చాల్సిన అంబులెన్స్లను ప్రైవేటు రవాణా వ్యాపారానికి వాడుకుంటూ అక్రమ దందాకు తెరలేపారు. ములుగు నుంచి మేడారం వరకు భక్తులను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. వీటిని చూసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు దుమ్మెత్తి పోస్తున్నారు. 

మేడారానికి తరలివస్తున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని అధికారులు జాతర సమయంలో ట్రాఫిక్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మేడారంలోని కొన్ని ప్రాంతాలకు సాధారణ వాహనాలకు అనుమతి లేదు. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది అక్రమార్కులు 'ఎసెన్షియల్ సప్లైస్ వెహికల్' పాసులను అడ్డం పెట్టుకొని అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా అంబులెన్స్‌లకు ఉండే ప్రత్యేకమైన వెసులుబాటును వాడుకుంటూ.. సైరన్ వేసుకుంటూ మరి అత్యవసర సర్వీసు అని అక్కడున్న భక్తులను నమ్మిస్తూ డబ్బులు ఇచ్చిన మరికొంతమంది భక్తులను గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. అలాగే కొన్ని చెక్ పాయింట్స్ వద్ద పోలీసులు సైతం అంబులెన్స్‌లని వదిలేస్తుండడంతో.. ఈ అక్రమానికి పాల్పడుతున్న సిబ్బందికి ఏ అడ్డు అదుపు లేకుండా పోయింది..

అంతేకాకుండా ఈ అక్రమ రవాణా అను కేవలం సామాన్య భక్తులకే కాకుండా.. వైద్య ఆరోగ్యశాఖలో పని చేసే ఉన్నత అధికారుల కుటుంబాలతో పాటు వారికి సంబంధించిన బంధువులను నేరుగా మేడారం అమ్మవార్లకు సంబంధించిన మహాద్వారం వరకు ఈ అంబులెన్స్‌లోనే తరలిస్తూ వస్తున్నారని సమాచారం.. ములుగు డీఎంహెచ్వో (DM, HO) కార్యాలయాల్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. సామాన్యులు కిలోమీటర్ల కొద్ది నడిచి అమ్మవార్ల దగ్గరికి చేరుకుంటే.. వీరు మాత్రం ప్రభుత్వ వాహనాలల్లో రాజభోగాలను అనుభవిస్తున్నారని అక్కడి భక్తులు మండిపడుతున్నారు.

Also Read: Medaram Traffic 2026: మేడారంలో ట్రాఫిక్ నరకం.. గంటల తరబడి వాహనాల నిలిపివేత.. చేతులెత్తేసిన అధికారులు..

వైద్య సేవల కోసం కేటాయించిన ఈ అంబులెన్సులు ఇలా పక్కదారి పడుతుంటే ఉన్నత అధికారులు మాత్రం ఏం చేస్తున్నారని అక్కడి భక్తులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అంతేకాకుండా ఏదైనా అత్యవసర సమయంలో ఎవరికైనా ప్రాణాపాయం ఉంటే.. అంబులెన్సులు సరిగ్గా అందుబాటులో లేకపోతే బాధ్యులు ఎవరవుతారని ప్రజలు అధికారులపై మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఇలా చేయడం చాలా తప్పని కొంతమంది భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.

Also Read: Medaram Traffic 2026: మేడారంలో ట్రాఫిక్ నరకం.. గంటల తరబడి వాహనాల నిలిపివేత.. చేతులెత్తేసిన అధికారులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 31, 2026 08:32:00
Hyderabad, Telangana:

8th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు అందనుంది. 2025 డిసెంబర్ నెలకు సంబంధించిన AICPI-IW (అఖిల భారత వినియోగదారుల ధరల సూచిక) గణాంకాలు వెలువడటంతో, వచ్చే ఏడాది జనవరి నుండి వర్తించేలా కరువు భత్యం (DA) పెరగడం ఖాయమైంది. ద్రవ్యోల్బణం నుండి ఉద్యోగుల జీతాలను రక్షించే క్రమంలో, కేంద్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యాన్ని సవరిస్తుంది. తాజా గణాంకాల ప్రకారం 2026 జనవరి నుండి ఈ పెంపు వర్తిస్తుంది.

5% పెరగనున్న డీఏ
డిసెంబర్ 2025 నాటికి AICPI-IW సూచిక 148.2 వద్ద స్థిరంగా ఉండటంతో, కరువు భత్యం 5 శాతం పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత డీఏ: 58%

ప్రతిపాదిత పెంపు: 5%

మొత్తం డీఏ: 63%

రవాణా భత్యం కూడా పెంపు
డీఏ పెరిగినప్పుడల్లా దానికి అనుగుణంగా రవాణా భత్యం కూడా పెరుగుతుంది. నగరం (X, Y, Z కేటగిరీలు), పే లెవల్ ఆధారంగా ఇది మారుతుంది.

ఉదాహరణ: Y-కేటగిరీ నగరంలో పని చేస్తూ, రూ.1,800 ప్రాథమిక రవాణా భత్యం పొందే ఉద్యోగికి, 63% డీఏ కలిపితే మొత్తం రవాణా భత్యం రూ.2,934 కి చేరుకుంటుంది.

ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది?
సాధారణంగా ప్రభుత్వం ఈ పెంపును మార్చి లేదా ఏప్రిల్ 2026లో అధికారికంగా ప్రకటించవచ్చు. అయితే, ఈ పెంపు జనవరి 2026 నుండి అమలులోకి వస్తుంది కాబట్టి, ఉద్యోగులకు మూడు నెలల బకాయిలు ఏప్రిల్ జీతంతో పాటు అందుతాయి.

ఉద్యోగ సంఘాల డిమాండ్లు
ప్రస్తుతం ఉన్న డీఏను మూల వేతనంలో విలీనం చేయాలని ఆల్ ఇండియా ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. 8వ వేతన కమిషన్‌పై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. అయితే, ప్రస్తుతానికి డీఏ విలీనం చేసే ప్రతిపాదన లేదని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా 5% డీఏ పెంపు అనేది లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు గొప్ప ఊరటనిస్తుంది. ఇది ఏప్రిల్ 2026 జీతాల్లో ప్రతిఫలించనుంది.

Also Read: Union Budget 2026: రేపే పార్లమెంట్‌లో బడ్జెట్‌! అందరి చూపు వాటిపైనే..మంత్రి స్పీచ్‌లో ఏవేవి ఉండొచ్చంటే?

Also Read: Kevin Warsh Gold News: బంగారం, వెండి ధరలు భారీగా పడిపోవడానికి కారణం ఇతడే..మార్కెట్లను వణికించిన ట్రంప్ మావ దూత!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top