icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Earbuds: రూ.14 వేలకే టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఇయర్‌బడ్స్.. మార్కెట్లోకి సౌండ్‌కోర్ లిబర్టీ 5 ప్రో సిరీస్!

Hyderabad, Telangana:

Soundcore Liberty 5 Pro Max Earbuds: ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ అంకర్ తన సౌండ్ కోర్ బ్రాండ్ కింద సరికొత్త ఫ్లాగ్‌షిప్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ సౌండ్‌కోర్ లిబర్టీ 5 ప్రో (Soundcore Liberty 5 Pro), లిబర్టీ 5 ప్రో మాక్స్ (Liberty 5 Pro Max) అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అధునాతన డిజైన్తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇందులో కేసు పైనే ప్రత్యేకమైన టచ్ స్క్రీన్ డిస్ప్లేను కూడా అందించారు. అలాగే ఇది అద్భుతమైన ప్రీమియం ఆడియోతో అందుబాటులోకి రావడం విశేషం. అయితే ఇయర్‌బడ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఇయర్‌బడ్స్‌లో కంపెనీ అద్భుతమైన Thus AI చిప్సెట్‌ను వినియోగించినట్లు తెలుస్తోంది. సాధారణ ఇయర్‌బడ్స్‌తో పోలిస్తే.. ఇది అత్యంత వేగవంతమైన డేటాను ప్రాక్సింగ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా రెండు మోడల్స్ లు ఎనిమిది మైక్రోఫోన్లతో పాటు రెండు బోన్ కండక్షన్ సెన్సార్లు అందుబాటులో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. ఇవి శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎంతగానో సహాయ పడతాయి. అంతేకాకుండా అత్యంత స్పష్టమైన వాయిస్ కాల్‌ను అందిస్తాయి. అలాగే ఈ ఇయర్‌బడ్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికేషన్ కూడా సొంతం చేసుకోవడం విశేషం..
 
ఈ ఇయర్‌బడ్స్‌లో అద్భుతమైన చార్జింగ్ కేస్ ను అందిస్తున్నారు. లిబర్టీ 5 ప్రో మోడల్‌లో 0.96 అంగుళాల చిన్న స్క్రీన్ ను అందుబాటులో ఉంచగా.. ప్రత్యేకమైన ప్రీమియం మోడల్ అయిన లిబర్టీ ఫైవ్ ప్రో మ్యాక్స్ లో ఏకంగా 1.78 అంగుళాల పూర్తి స్థాయి అమోలెడ్ (AMOLED) టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించినట్లు కంపెనీ వెల్లడించింది దీనివల్ల వినియోగదారులు తమ మొబైల్ ఫోన్ తీసే అవసరం లేకుండా కేస్ స్క్రీన్ ద్వారా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) తో పాటు ఈక్వలైజర్ సెట్టింగ్స్, బ్లూటూత్ పెయిరింగ్ వంటి పలు ఫీచర్లను ఎంతో సులభంగా నియంత్రించవచ్చు. ఇవే కాకుండా ఇందులో కంపెనీ ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ప్రోడక్టివిటీని పెంచేందుకు లిబర్టీ ఫైవ్ ప్రో మాక్స్ మోడల్‌లో AI నోట్ టేకర్ ఫీచర్‌ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ వెల్లడించింది ఆఫీస్ మీటింగ్ లేదా ముఖ్యమైన సంభాషణల సమయంలో చార్జ్ కేసును డబుల్ టాప్ చేయడం వల్ల వాయిస్ రికార్డును ఎంతో సులభంగా ఆన్ చేయవచ్చు. అంతేకాకుండా ఇందులో ఇంటర్నెట్ లేకపోయినా ఇది రికార్డు టెక్స్ట్‌గా మార్చడమే కాకుండా ఎవరు మాట్లాడుతున్నారు.. గుర్తించి సమ్మరీని అందించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

అలాగే రెండు మోడల్లలో రియల్ టైం ఏ వాయిస్ ట్రాన్స్లేషన్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల వివిధ భాషల్లో మాట్లాడుతున్న వారిని గుర్తించి మన భాషలోకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ 9.2mm డ్రైవర్లు, డాల్బీ అట్మోస్ స్పేషియల్ ఆడియోను సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఈ కేస్ ను దాదాపు 5 నిమిషాల పాటు చార్జింగ్ చేస్తే నాలుగు గంటల వరకు వాడుకోవచ్చు. ఇక దీని ధర వివరాల్లోకి వెళితే ఇది రూ.14 వేల నుంచి ప్రారంభమవుతుంది. హై ఎండ్ వేరియంట్ ధర రూ.19 వేల నుంచి అందుబాటులో ఉంది..

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Xiaomi 17t Series: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

Hyderabad, Telangana:

Xiaomi 17t Series Global Launch On May 28: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Xiaomi నుంచి విడుదల కాబోతున్న మోస్ట్ పవర్ఫుల్ షావోమి 17T, షావోమి 17T ప్రో (Xiaomi 17T Pro) స్మార్ట్‌ఫోన్‌ల గ్లోబల్ లాంచింగ్ తేదీ అధికారికంగా ఖరారు అయ్యింది.. ఈ సిరీస్‌ను కంపెనీ మే 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే, అధికారికంగా మార్కెట్లోకి రాకముందే ఈ  స్మార్ట్‌ఫోన్స్ ధరలతో పాటు ఫీచర్లు ఇంటర్నెట్లో లీకై హల్చల్ చేస్తున్నాయి. ఈ మొబైల్స్ రెండు అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది గత మోడల్స్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవలే లీకైన వివరాల ప్రకారం.. ఫిలిప్పీన్స్ మార్కెట్ ధరల ప్రకారం బేస్ వేరియంట్ అయిన షావోమి 17T స్మార్ట్ ఫోన్ 256gb స్టోరేజ్ వేరియంట్ దాదాపు రూ.51 వేల రూపాయలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మరో మోడల్ దాదాపు రూ.57 వేలు ఉండబోతోంది. అంతేకాకుండా అయ్యుండు మోడల్ వేరియంట్ షావోమి 17T ప్రో 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర రూ.72 వేల రూపాయలు ఉండబోతోంది. అంతేకాకుండా బేస్ వేరియంట్ మొబైల్ ధర దుబాయ్ మార్కెట్లో రూ.58 వేల నుంచి ప్రారంభమవుతుంది. ఇక గ్లోబల్ మార్కెట్లో ఈ సిరీస్ ధరలు రూ.58 వేల నుంచి ప్రారంభమై హై ఎండ్ వేరియంట్ రూ.91 వేలు  ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..స్టాండర్డ్ షావోమి 17T మోడల్ 6.59-ఇంచుల 120Hz OLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8500-అల్ట్రా ప్రాసెసర్‌తో విడుదల కాబోతోంది. ఇందులో కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ 6,500mAh భారీ బ్యాటరీని అందించడమే కాకుండా చాలా ప్రత్యేకమైన 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తున్నారు. ఇక ఈ మొబైల్ లోని కెమెరా వివరాల్లోకి వెళ్తే.. వెనక వైపు కెమెరా  50 మెగాపిక్సెల్ తో అందుబాటులోకి రాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన పవర్ఫుల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో విడుదల కాబోతోంది.

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

ఇక ఇదే సిరీస్‌లోని ప్రీమియం మోడల్ షావోమి 17T ప్రో స్మార్ట్‌ఫోన్ వివరాల్లోకి వెళ్తే.. ఇది 6.83-ఇంచుల 144Hz OLED డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో విడుదల కాబోతోంది. ఈ ప్రో మోడల్‌లో కంపెనీ ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందించడం విశేషం. దీనిలో ఎంతో శక్తివంతమైన త్రిపుల్ కెమెరా సెటప్ ను కంపెనీ అందిస్తోంది. ఇందులో 5x ఆప్టికల్ జూమ్ కలిగిన 50MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ కెమెరాలు లభిస్తున్నాయి. అయితే, ఈ మొబైల్‌ను కంపెనీ మే 28వ తేదీన జరిగే అధికారిక ఈవెంట్లో భాగంగా భారతదేశ దేశంతో పాటు వివిధ దేశాల్లో లాంచ్ చేయబోతోంది..

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Peddi Item Song:'పెద్ది' సినిమాలోని ఐటెంసాంగ్ వచ్చేసింది! జాన్వీ కపూర్, శ్రుతిహాసన్‌తో కలిపి మెగా పవర్‌స్టార్ కుమ్మేశాడు!

Hyderabad, Telangana:

Peddi Item Song Release: మెగాస్టార్ రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'పెద్ది' నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. నిన్న రాత్రి భోపాల్‌లో 'పెద్దికి ఆవాజ్' కార్యక్రమంలో హీరో రామ్‌చరణ్, జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఇందులో ఏఆర్ రెహమాన్ స్పెషల్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఐటెం సాంగ్ రిలీజ్ చేయాల్సి ఉండగా.. కానీ, అనుకోని కారణాల వల్ల ఆ సాంగ్ రిలీజ్‌ను చేయలేదు. ఈ క్రమంలో 'పెద్ది' మేకర్స్ నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. తాజాగా 'పెద్ది' ఐటెం సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 

ఈ సినిమాలోని స్పెషల్ ఐటెం సాంగ్ 'చీర..చొక్క.. చిక్కెడిపోవాలో..' లిరికల్ వీడియోను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ తన డ్యాన్స్‌తో స్టేజ్ షేక్ చేశారు. అలాగే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా ఈ పాటలో మెరిసి సందడి చేయడం విశేషం.

ముగ్గురు స్టార్ల గ్రేస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్పెషల్‌ సాంగ్‌ను లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ రచించగా.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌లో రక్షిత్ సురేష్ ఆలపించారు. 

ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ హై-వోల్టేజ్ ఎంటర్‌టైనర్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఇది. చరణ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ 'అచ్చమ్మ' అనే పాత్రలో నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'చికిరి చికిరి', 'రయ్ రయ్ రారా' సాంగ్ నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇప్పుడీ సినిమాలోని ఐటెంసాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. 

Also Read: రిలీజ్‌కు ముందు 'పెద్ది' నిర్మాతలకు షాక్..అడ్డం తిరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!

Also Read: "మరీ సిగ్గులేకుండా ఇంత ఖాళీగా ఉన్నారా?" సోషల్‌మీడియాలో యాంకర్ అనసూయ ఫైర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Summer Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్..మే 31తో వేసవి సెలవులు ముగింపు..జూన్ 1 నుంచి క్లాసులు!

Vijayawada, Andhra Pradesh:

Summer Holidays 2026: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్.. ఇటు తెలంగాణలోని విద్యాసంస్థలకు వేసవి సెలవులు తుదిదశకు చేరుకున్న ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను మే 31 నాటికి పూర్తి చేసి, జూన్ మొదటి వారం నుంచి కాలేజీలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల విద్యాశాఖలు ఉత్తర్వులతో పాటు కొత్త అకడమిక్ క్యాలెండర్లను విడుదల చేశాయి. 

జూన్ 1 నుంచే ఇంటర్ క్లాసులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు జూన్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24న ప్రారంభమైన ఇంటర్ వేసవి సెలవులు మే 31తో ముగియనున్నాయి. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ మొత్తంగా 232 రోజుల పాటు అకాడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యాశాఖ  విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంటర్‌లోని NCERT, CBSE సిలబస్‌ను అమలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏపీలో గత విద్యాసంవత్సరం (2025-26) నుంచే ఇంటర్‌లో NCERT సిలబస్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ దిశగానే ఈ ఏడాది అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు. అదే విధంగా తెలంగాణలో 2026-27 విద్యాసంవత్సరంలో 224 పనిదినాలతో మార్చి 30నే అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల పూర్తి చేశారు. 

స్కూళ్లు జూన్ 12 నుంచే..
ఇంటర్ విద్యార్థులకు జూన్ 1 నుంచే కాలేజీలు ప్రారంభం అవుతున్నప్పటికీ, పాఠశాల విద్యార్థులకు మాత్రం మరికొద్ది రోజులు సెలవులు కొనసాగనున్నాయి. స్కూల్ పిల్లలకు జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. కాబట్టి, సుదీర్ఘ సెలవుల అనంతరం విద్యార్థులు జూన్ 12 నుంచి తిరిగి బడిబాట పట్టనున్నారు. విద్యార్థులు ఈ షెడ్యూల్ ప్రకారం తరగతులకు హాజరుకావాలని అధికారులు సూచించారు.

Also Read: మందుబాబులకు మత్తు దిగిపోయే వార్త..భారీగా పెరగనున్న మద్యం ధరలు..ఎంత పెరుగుతుందంటే?

Also Read: వడదెబ్బతో రాష్ట్రంలో 34 మంది మృతి..ఒక్కొక్కరికి రూ.4 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

IPL Playoffs Scenario: ప్లేఆఫ్స్‌కు అడుగుదూరంలో పంజాబ్..రాజస్థాన్-కోల్‌కతా పరిస్థితి ఏంటి? అసలు కథ ఇది!

Hyderabad, Telangana:

IPL Playoffs Scenario 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఇప్పుడు తుదిదశకు చేరుకుంది. నేటితో లీగ్ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. అదే విధంగా ప్లేఆఫ్స్‌కు చేరనున్న నాలుగో జట్టు ఏదో తెలిసిపోతుంది. అయితే ప్లేఆఫ్స్ నాలుగో స్థానం కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ తన చివరి లీగ్ మ్యాచ్ గెలిచి ముందడుగు వేయగా.. నేడు జరగబోయే రెండు మ్యాచ్‌ల్లో నాలుగో స్థానం ఖరారు అవుతుంది. 

ప్లేఆఫ్స్ రేసులో రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు వరుసగా పాయింట్స్ టేబుల్‌లో నిలవగా.. అయితే ఇప్పుడు నాలుగో స్థానం కోసం పంజాబ్ కింగ్స్ జట్టు 15 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 పాయింట్లతో ఐదో స్థానంలో.. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 13 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.

ఐపీఎల్‌లో నేడు జరగనున్న తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తే.. ఎలాంటి సమీకరణాలు లేకుండా  16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడితే.. ఆ తర్వాత మ్యాచ్‌ ఫలితం బట్టి ఆధారపడి ఉంటుంది. 

నేడు జరగనున్న రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్స్ ‌నుంచి తప్పుకోగా.. కోల్‌కతా జట్టుకు చిన్న ఛాన్స్ ఉంది. అది కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుపును బట్టి ఆధారపడి ఉంటుంది. రాజస్థాన్ ఓడితే కేకేఆర్ విరోచితంగా పోరాడాల్సి ఉంటుంది. రాజస్థాన్ గెలిస్తే కోల్‌కతా ఎలిమినేట్ అయినట్లే లెక్క. 

ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడితే పంజాబ్, కేకేఆర్‌కు ఛాన్స్ ఉంటుంది. రాజస్థాన్ ఓడితే పాయింట్లు, నెట్ రన్‌రేట్ బట్టి ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు +0.309 నెట్ రన్‌రేట్‌నూ కేకేఆర్ అధిగమించాల్సిన అవసరం ఉంది. ఢిల్లీపై కేకేఆర్ గెలిస్తే 15 పాయింట్లతో +0.011 నెట్‌రన్‌రేట్‌తో నిలుస్తుంది. అయితే పంజాబ్‌కు కేకేఆర్‌తో పోలిస్తే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. 

ఒకవేళ పంజాబ్‌ను పక్కకి నెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్లేఆఫ్స్‌లో నాలుగో బెర్తు ఖరారు చేసుకోవాలంటే కేకేఆర్ ముందు కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేస్తే 200+ టార్గెట్ సెట్ చేసి 77 పరుగుల తేడాతో గెలుపొందాల్సి ఉంటుంది. అదే విధంగా ఒకవేళ తొలుత బౌలింగ్ చేస్తే.. 200+ టార్గెట్‌ను 12.1 ఓవర్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే పంజాబ్‌ను దాటుకొని కోల్‌కతా ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది. అయితే ఇదంతా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓడితేనే!

Also Read: శ్రేయస్ అయ్యర్ సెంచరీ..ఎట్టకేలకు విజయం సాధించిన పంజాబ్ కింగ్స్..ప్లేఆఫ్స్‌ ఉన్నట్టే!

Also Read: పంజాబ్ కింగ్స్‌కు లక్నోతో నేడు చావో రేవో మ్యాచ్..గెలిస్తే ప్లేఆఫ్స్, ఓడితే ఇంటికే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Budget Cars: సగం ధరకే లగ్జరీ కార్లు.. రూ.2.5 లక్షల డిస్కౌంట్‌తో క్రెటా, థార్, నెక్సాన్!

Hyderabad, Telangana:

Delhi Second-hand Car Market: కొత్త కార్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఒక్క నిమిషం ఆగండి.. లక్ష రూపాయల కష్టార్జితాన్ని షోరూమ్స్‌లలో పెట్టే ముందు ఇవి తెలుసుకోండి. దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన మార్కెట్ ఊహించని రీతిలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఢిల్లీలోని సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ ఉన్న కొన్ని ప్రదేశాల్లో కేవలం కొద్ది నెలలు మాత్రమే వినియోగించిన.. సరికొత్త కండిషన్‌లో ఉన్న లగ్జరీ కార్లతో పాటు బడ్జెట్ కార్లు ఏకంగా రూ.2.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వాటిపై అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి..

ప్రస్తుతం మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్న హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta), మహీంద్రా థార్ (Mahindra Thar), టాటా నెక్సాన్ (Tata Nexon) వంటి కార్లు ఇక్కడ షోరూం కండిషన్లో అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇతర లగ్జరీ బ్రాండ్లకు సంబంధించిన కార్లు అయితే చాలా చీప్ ధరలకే లభిస్తున్నాయి. కొన్ని కార్లు సగం ధరలకే అందుబాటులో ఉండడం విశేషం.. ముఖ్యంగా ఇక్కడ మహీంద్రా థార్ రాక్స్ (Thar Roxx) అత్యంత తక్కువ ధరలకే లభిస్తున్నాయి. కేవలం 1500 కిలోమీటర్లు తిరిగిన 2026 రిజిస్టర్ చేసిన ఈ కార్లు అత్యంత చీకు ధరలకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వాటిపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందిస్తూ వస్తున్నారు. 

అలాగే హ్యుందాయ్ క్రెటా (Creta) పెట్రోల్‌తో పాటు డీజిల్ మోడల్ 2024, 25 కు సంబంధించిన ఈ కార్లు దాదాపు నాలుగు లక్షల తగ్గింపుతో అందుబాటులో ఉండడం విశేషం. అయితే, మార్కెట్లో దీని ధర 15 లక్షలు.. అయితే దీనిని ఇప్పుడే ఈ ఢిల్లీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కొనుగోలు చేసే వారికి దాదాపు 13 లక్షల నుంచి 14 లక్షల లోపే లభిస్తున్నాయి. అంతేకాకుండా టాటా నెక్సన్ 2024 మోడల్ కార్లు ఇక్కడ మరింత చీపు ధరకే లభిస్తున్నాయి. కేవలం 12000 కిలోమీటర్లు తిరిగిన ఈ కార్లు 9 లక్షల బడ్జెట్ లోనే లభించడం విశేషం. 

Also Read:  బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు..మే 28న సరికొత్త డిజైన్‌తో టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ లాంచ్

మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ తో పాటు ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు టాటా టియాగో ఐ-సీఎన్‌జీ (Tata Tiago iCNG) ఆటోమేటిక్ మోడల్ వేరియంట్ అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో షో రూమ్ లోకి అందుబాటులో కారు దాదాపు 8 లక్షలు కాగా.. అయితే దీనిని ఇప్పుడే కొనుగోలు చేస్తే 6.5 లక్షలకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనిపై ఇతర డిస్కౌంట్ ఆన్సర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నాన్ యాక్సిడెంట్ కార్లు మాత్రమే విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే షోరూం ట్రాక్ కలిగిన కార్లను మాత్రమే కస్టమర్లకు అందిస్తున్నట్లు వారు చెబుతున్నారు.

Also Read:  బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు..మే 28న సరికొత్త డిజైన్‌తో టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ లాంచ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Jagtial: వైన్ షాప్ ముందు సన్న వడ్లు ఫ్లెక్సీ.. మందుబాబుల మైండ్ బ్లాక్ చేసిన రైస్ మిల్లర్స్ ఐడియా!

Hyderabad, Telangana:

Sanna Vadlu Paddy Cultivation: వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో సభలు పెట్టినప్పటికీ.. కరపత్రాలు పంచిన రాని స్పందన.. అక్కడ ఏర్పాటుచేసిన ఒకే ఒక ఫ్లెక్సీ తో వచ్చింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లో జరిగిన ఈ వినూత్న ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సన్నబట్ల సాగుపై అవగాహన కల్పించేందుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎంచుకున్న వేదిక, పద్ధతి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది..

గొల్లపల్లి మండలం నల్లగుట్ట సమీపంలోని వైన్స్ షాప్ ఎదుట.. ఈ ఖరీఫ్లో సన్నబడ్లు వేయండి.. అంటూ ఒక పెద్ద ఫ్లెక్సీ వెలిసింది. సాధారణంగా ప్రభుత్వ పథకాల ప్రచారాలతో పాటు రాజకీయ ఫ్లెక్సీలు వీధుల్లో మనం తరచుగా చూస్తూ ఉంటాం. కానీ నేరుగా వైన్ షాప్ ముందు రైతులను ఉద్దేశించి ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిత్యం వందలాది మందితో రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనక ఒక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది..

పల్లెల్లో వ్యవసాయం చేసే రైతుల్లో అత్యధికులు సాయంత్రం వేళల్లో సేద తీరడానికి వైన్ షాపుల వైపు వస్తూ ఉంటారని.. ఇక్కడ ఫ్లెక్సీ పెడితే సందేశం నేరుగా.. చాలా వేగంగా రైతు వర్గానికి చేరుతుందనే ఉద్దేశంతో రైస్ మిల్లర్స్ అసోసియేషన్.. ఈ వినూత్న ప్రయోగానికి తెరలేపినట్లు సమాచారం. ఈ ఫ్లెక్సీ ని చూసిన స్థానికులతో పాటు మందుబాబులు భిన్నంగా స్పందిస్తూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు..

Also ReadTelangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

రోజు అధికారులు వచ్చి చెప్పిన వినని వాళ్ళు కూడా.. ఇక్కడ ఫ్లెక్సీ చూడగానే అవును కదా. ఈసారి సన్నబడ్లు వేయాల్సిందే అని మాట్లాడుకుంటున్నారట. మందు కొట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్లి సన్నబడ్ల గురించే ఆలోచిస్తున్నారని సమాచారం. మార్కెట్లో సన్న రకం బియ్యానికి ఉండే డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని.. రాబోయే వానాకాలం సీజన్లో రైతులు ఎక్కువగా సన్నబడ్ల సాగు వైపు మొగ్గు చూపేలా చేయడమే ఈ ఫ్లెక్సీ ముఖ్య ఉద్దేశం.. సాధారణ ప్రచారాల కంటే ఈ తరహా షాక్ వాల్యూ ఉన్న ప్రచారాలు జనాలోకి బలంగా దూసుకెళ్తాయని.. అందుకే వైన్ షాప్స్ అడ్డాను ఎంచుకున్నామని మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలుపుతున్నారు..

Also ReadTelangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Jupiter Transit: జూన్ 2న గురు గ్రహ సంచారం.. ఈ 4 రాశుల వారికి ఆర్థిక కష్టాలు.. జాగ్రత్తగా ఉండాల్సిందే!

Hyderabad, Telangana:

Jupiter Transit On June 2 Effect On Zodiac: గురు గ్రహం జూన్ రెండవ తేదీ నుంచి తన రాశిని మార్చుకోబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు గ్రహ సంచారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే గురు గ్రహ సంచారం కర్కాటక రాశిలో జరగబోతోంది. ఈ సమయంలో గురు గ్రహం ఉచ్చస్థితిలో ఉండబోతోంది. ఇది జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా జ్ఞానంతో పాటు ధనం అదృష్టం పురోగతికి అధిపతిగా పరిగణించే గురుగ్రహం ఈ సమయంలో సంచారం చేయడం చాలా విశేషమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆయా రాశుల వారికి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మరికొన్ని రాశుల వారికి తీవ్ర నష్టాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా తీవ్రంగా ఆర్థికపరంగా నష్టపోయే అవకాశాలున్నాయి. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.

ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం..
మేషరాశి 
గురు గ్రహ సంచారం మేష రాశి వారికి నాలుగవ స్థానంలో జరగబోతోంది. దీని ఫలితంగా కుటుంబ జీవితంలో కాస్త అశాంతి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో గతంలో కంటే ఇప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఉండకపోవచ్చు. అలాగే మీ పనుల్లో కొన్ని ఆకస్మిక మార్పులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఉద్యోగులతో పాటు అధికారులతో విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఆవేశంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా నష్ట భయం పెట్టుబడులు ముందే ఆపేయడం మంచిది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునేవారు తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది..

మిథున రాశి 
ఈ గురుగ్రహ సంచారం మిధున రాశి వారికి రెండవ స్థానంలో జరగబోతోంది. దీని కారణంగా ఆర్థిక విషయాల్లో అదనపు జాగ్రత్తలు అవసరమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఖర్చులు ఊహించని స్థాయిలో పెరుగుతాయి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై అభిప్రాయ విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఎవరైనా ఎక్కువగా మీపై ఆధారపడితే వారు తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు పరిష్కారం లభించే ఛాన్స్ కూడా లేదు..

తులారాశి 
గురుగ్రహ సంచారంతో తులా రాశి వారికి ఈ సమయంలో కొన్ని రకాల నష్టాలు తప్పవని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వృత్తిలో కొన్ని ఆకస్మిక మార్పులు సంభవించడమే కాకుండా.. పనుల్లో కొత్త బాధ్యతలు రావచ్చు. అలాగే పని ఒత్తిడి కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా మీరు మీపై ఆధారపడడం మంచిదే అయినప్పటికీ.. ఈ సమయంలో తప్పకుండా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఎంతో మంచిది. దీంతోపాటు ఎంతో ఓపికగా ముందుకు సాగడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.

కుంభరాశి 
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆరవ స్థానంలో గురు గ్రహ సంచారం జరగబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆరోగ్యం, జీవితంపై ఊహించని ప్రభావం పడుతుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే నిర్లక్ష్యం చేయకపోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. లేకపోతే పాత శారీరక సమస్యలు మళ్లీ తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక రంగాల్లో కొన్ని అడ్డంకులు కూడా ఎదురవుతాయి. ఈ సమయంలో ఆదాయ వనరులు తగ్గి ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి అవసరమైనంత వరకు డబ్బును పొదుపు చేస్తూ ఉండటం చాలా మంచిది అని జ్యోతిష్యులు చెబుతున్నారు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Budha Gochar 2026: భద్రా రాజయోగం ఎఫెక్ట్‌.. జూన్ 22 వరకు ఈ 5 రాశుల వారికి తిరుగులేదు.. కోరిన కోరికలు నెరవేరుతాయి!

Hyderabad, Telangana:

Bhadra Rajayoga Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని గ్రహ సంచారాలకు అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆయారాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. బుధ గ్రహం త్వరలో సొంత రాశి అయినా మిధున రాశిలోకి ప్రవేశించబోతోంది. ముఖ్యంగా మే 29వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో  బుధుడికి సంబంధించిన ఎంతో శక్తివంతమైన భద్రా  రాజయోగం ఏర్పడబోతోంది. 5 మహాపురుష రాజయోగాల్లో భద్రా రాజయోగం ఒకటి. అయితే ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో జూన్ 22వ తేదీ వరకు ఈ శక్తివంతమైన ప్రభావం కొనసాగుతుంది. దీని కారణంగా ఆయా రాశుల వారికి వృత్తి, వ్యాపార పరంగా అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా సంపాదన కూడా విపరీతంగా పెరిగి ఈ సమయం చాలా లాభదాయకంగా మారుతుంది.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మిథున రాశి 
బుధ గ్రహ సంచారంతో మిథున రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతో శక్తివంతమైన ఈ భద్ర రాజయోగంతో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. సామాజిక ప్రభావం పెరిగి ప్రజలు కూడా వీరికి ఆకర్షితులవుతారు. అంతేకాకుండా మీరు భూమితో పాటు కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కనిపి. ఈ సమయం కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని అందిస్తుంది.

కన్యారాశి 
కన్యా రాశి వారికి బుధుడు పదవ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగాలతో పాటు వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో పదోన్నతులు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక హోదా పెరగడమే కాకుండా జీవితంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు బుధుడి అదృష్ట ప్రభావంతో చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. అంతేకాకుండా విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు కూడా ఈ సమయంలో తప్పకుండా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఈ సమయంలో ఘననీయమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ధనస్సు రాశి 
బుధుడి సంచార ప్రభావంతో ధనస్సు రాశి వారికి కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న వ్యక్తులకు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో వివాహేతులకు సంబంధాలు మెరుగుపడతాయి. దీంతోపాటు అనుకున్న పనుల్లో ఆకస్మికంగా విజయాల సాధిస్తారు.

కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు బుధుడి సంచార ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి విద్యాపరంగా అనుకున్న లాభాలు పొందగలుగుతారు. అలాగే మీ భాగస్వామితో అద్భుతమైన శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితం అనుకున్నది అనుకున్నట్లుగా అద్భుతమైన సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా జీవితంలో ప్రతి అంశంలో అభివృద్ధి కనిపిస్తుంది..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Thailand Travel Alert: భారతీయులకు బ్యాడ్‌న్యూస్‌.. థాయ్‌లాండ్ వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు, ఇకపై రూల్స్ మారాయి, అసలేం జరిగిందంటే?

Hyderabad, Telangana:

Thailand 60 Days Visa Rules Changed: థాయిలాండ్ అంటే చాలా మందికి ఇష్టం. ఇక్కడ బ్యాంకాక్, పట్టాయా, ఫుకెట్ వంటి అందమైన సముద్ర తీరాలను చూడాలని చాలా మంది అనుకుంటారు. దీంతో పాటు ఫ్లోటింగ్‌ మార్కెట్లు, బీచ్‌లు, కలపతో చేసిన నిర్మాణాలు, యునెస్కో ప్రపంచ గుర్తింపు పొందిన బ్యాంకాక్‌లోని అందమైన ప్రదేశాలు ఒక్కసారైనా చూడాలని అనుకుంటారు. భారతదేశం నుండి ఎక్కువ మంది యువత థాయిలాండ్ వెళ్తున్నారు. అయితే వారందరికీ థాయిలాండ్ ఒక పెద్ద షాక్ ఇచ్చింది. మొత్తం 90 దేశాలపై దీని ప్రభావం ఉంటుంది. 60 రోజుల ఉచిత వీసా పాలసీని రద్దు చేసింది. ముఖ్యంగా అక్కడి ప్రభుత్వం చాలా మంది ఈ టూరిస్ట్ వీసాను అదునుగా తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారని, దుర్వినియోగం చేస్తున్నారని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. 

థాయిలాండ్‌ వెళ్లాలంటే..
మీరు థాయిలాండ్ వెళ్లాలంటే ఇకపై ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు గడువు పెంచుకునేందుకు వీలు లేదు. వీసా నియమాలను మరింత కఠినతరం చేసింది థాయిలాండ్ ప్రభుత్వం. కోవిడ్ తర్వాత థాయిలాండ్ టూరిజంను పెంచడానికి అనేక మార్పులు చేసింది. ఆ సమయంలోనే ఉచితంగా 60 రోజుల వీసా ప్రవేశాన్ని కూడా కల్పించింది. చాలా మంది భారతీయ యాత్రికులకు ఇది ఉపయోగకరంగా ఉండేది. అయితే ఈ హఠాత్తుగా 60 రోజుల ఉచిత వీసా ఎంట్రీని రద్దు చేయడంతో ఇది యాత్రికులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను పునఃసమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది. భారత ప్రయాణికులు మరోసారి 30 రోజుల వీసా రహిత బసకు మాత్రమే పరిమితం కానున్నారు. అయితే అదనంగా మరో 30 రోజుల గడువు పెంపునకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ దానిని అక్కడి ప్రభుత్వం మంజూరు చేస్తేనే ఉపయోగించుకోగలరు.

90 దేశాలపై ప్రభావం..
60 రోజుల వీసా నిలిపివేత మొత్తం 90 దేశాలపై ప్రభావం చూపుతుంది. పాస్‌పోర్ట్ ఆధారంగా కూడా ఈ వీసా జారీ ఉంటుంది. భద్రతా తనిఖీ కఠినతరం చేయడంతో వీసా గడువు ముగిసిన తర్వాత ఆ దేశంతో ఉన్న సంబంధాల ఆధారంగా మరో నెల పెంచవచ్చు. థాయిలాండ్ ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయానికి ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లపై కూడా ప్రభావం పడుతుంది.

READ ALSO: వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ ఉండగానే కాల్పుల కలకలం.. 30 రౌండ్లు ఫైరింగ్, అసలేం జరిగిందంటే?

READ ALSO: China Coal Mines Blast: చైనా ఛాంగ్‌జీ బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. 82 మంది మృతి

భారతీయ యువతకు షాక్..
భారతీయ యువత ఎక్కువ మంది థాయిలాండ్ పర్యటనకు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు నెలల పాటు టూరు వేయడం, అక్కడి నుండి కూడా పనులు చేసుకునే అవకాశం ఉండేది. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా థాయిలాండ్ లో ఉన్న వారిపై లేదా టూరిస్ట్ వీసాలపై వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది థాయిలాండ్ ప్రభుత్వం. ఈ కారణంగానే ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను డిజిటల్ చేస్తోంది. ప్రతి ప్రయాణికుడి కదలికలపై నిఘా ఉంచుతుంది.

ప్రతి ప్రయాణికుడిపై నిఘా..
ప్రస్తుతం థాయిలాండ్ డిజిటల్ అరైవల్ కార్డు వ్యవస్థను అమలు చేస్తుంది. ప్రయాణికుల పూర్తి రికార్డులను ఆన్‌లైన్‌లో పెడుతుంది. దీనివల్ల పదే పదే థాయిలాండ్ కు వచ్చే సందర్శకులను కూడా గుర్తించవచ్చు. భద్రతను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిపుణుల ప్రకారం ఏడు నుంచి 15 రోజుల పాటు థాయిలాండ్ పర్యటనకు వెళ్లే భారతీయ టూరిస్టులపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు. థాయిలాండ్ ఆర్థిక వ్యవస్థ పర్యాటకం పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ కొత్త రూల్‌ చాలా మందికి ఆశ్చర్యం కలిగించిన విషయమే అంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Heat Wave Horror: తెలుగు రాష్ట్రాల్లో ఎండల ఉగ్రరూపం.. పిట్టల్లా రాలిపోతున్న జనం, నిన్న 56 మంది మృతి!

Hyderabad, Telangana:

Heat Wave Horror 56 Dead in AP and Telangana: వడదెబ్బల కారణంగా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా దాటిపోయాయి. దీని ప్రభావంతో తెలంగాణలో 40 మంది, ఆంధ్రప్రదేశ్లో 16 మంది వడదెబ్బకు గురై మరణించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 19 మంది, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. నిజామాబాద్లో ఒకరు వడదెబ్బకు గురై చనిపోయారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, పల్నాడు, విజయవాడ, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో కూడా ఈ వడదెబ్బ కారణంగా మరణాలు సంభవిస్తున్నాయి.

ఉదయం 8 గంటలకే...
ఎండల తీవ్రత ఉదయం 8 గంటలకే కనబడుతోంది. రోజంతా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం వేళల్లో ఇంటి నుంచి బయటకు రావడం అంటేనే ఒక భయంకరంగా మారిపోయింది. భీకరమైన వడగాలుల వల్ల ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురై పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 56 మంది వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. 

తెలంగాణలో మరణాల కల్లోలం..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 40 మంది వడదెబ్బకు గురై మరణించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కూలీలు, వృద్ధులు, చిన్నారులు ఈ ఎండల బారిన పడి పిట్టల్లా రాలిపోతున్నారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్రంగా ఉంది. అత్యధికంగా 19 మంది ప్రాణాలు ఈ జిల్లాలోనే కోల్పోయారు. ఇక ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఎండ తీవ్రతకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్లోనూ అదే పరిస్థితి...
వడదెబ్బ వల్ల ఆంధ్రప్రదేశ్‌లోనూ కూడా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. వడదెబ్బకు గురైన 16 మంది మరణించారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత, వేడి గాలులు తోడవడంతో రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇక పల్నాడు, విజయవాడ, అనకాపల్లి, ఏలూరు ప్రాంతాల్లో మరణాలు సంభవిస్తున్నాయి.

Also Read:  తెలుగు రాష్ట్రాల్లో ఎండల మారణహోమం.. వడదెబ్బకు 30 మంది బలి, మృతుల్లో యువకులు కూడా!

Also Read: AP Heat Waves: ఏపీలో మాడు పగిలే ఎండలు.. మరో 5 రోజులు భానుడి ఉగ్రరూపం..

నిపుణుల హెచ్చరిక...
ఇక వాతావరణ శాఖ, ప్రభుత్వం ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. రానున్న నాలుగు రోజులపాటు తీవ్రంగా ఎండలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రాకూడదని సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు డీహైడ్రేషన్‌కు గురి కాకుండా మజ్జిగ, కొబ్బరి బొండం, ఓఆర్ఎస్ వంటివి తీసుకుంటూ ఉండాలి. శరీరంలో నీటి శాతం కోల్పోకుండా జాగ్రత్త చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మంత్రి పొంగులేటి కీలక ప్రకటన...
వడదెబ్బకు గురై మృతి చెందిన కుటుంబాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటన జారీ చేశారు. వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. గతంలో 50,000 మాత్రమే ఉండేది, ప్రస్తుత ప్రభుత్వం దీన్ని నాలుగు లక్షలకు పెంచిందని ఆయన గుర్తు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Adluri Laxman Kumar: నాణ్యమైన వైద్య సేవలే ఆరోగ్య సమాజానికి పునాది: మంత్రి అడ్లూరి

Hyderabad, Telangana:

Zee Telugu News Doctors Awards: 'సమాజంలో దేవుడి తర్వాత అత్యంత గౌరవం, ప్రాధాన్యం పొందే వృత్తి వైద్య వృత్తి. ప్రాణాలను కాపాడే మహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్న వైద్యులు మానవత్వానికి ప్రతీకలు' అని వైద్యుల సేవలను మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ కీర్తించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం వచ్చే పేద ప్రజల పట్ల వైద్యులు మరింత సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు. వైద్యులు ఇచ్చే సరైన సలహా, భరోసా ఒక కుటుంబానికి కొత్త జీవితం ఇస్తుందని చెప్పారు.

హైదరాబాద్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జీ తెలుగు న్యూస్‌ ఉత్తమ వైద్యుల అవార్డు-2026 కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ హాజరై అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం జీ తెలుగు న్యూస్‌ చీఫ్‌ ఎడిటర్‌ సంగనభట్ల భరత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వైద్యులకు అవార్డులు అందించడాన్ని అభినందించారు. 'ఎప్పుడూ సూచనలు ఇస్తూ.. ప్రజల కోసం సలహాలు ఇచ్చే మా ధర్మపురి బిడ్డ జీ తెలుగు న్యూస్‌ చీఫ్‌ ఎడిటర్‌ భరత్‌కు అభినందనలు. వైద్యులకు అవార్డులు ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం' ప్రశంసించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర దైవ సమానం అని పేర్కొన్నారు. ఫిట్ తెలంగాణ - హెల్తీ తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్రాన్ని 'ఫిట్ తెలంగాణ - హెల్తీ తెలంగాణ'గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. ప్రతి పౌరుడు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకొని.. సమతుల్య ఆహారం, నిత్య వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచనలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు అనేక వినూత్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపారు. పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా మెరుగైన వైద్య సేవలు చేరేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఆరోగ్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులను సత్కరించడంతో.. వైద్యుల్లో మరింత సేవాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.

'దేవుడు వైద్యుడిగా గొప్ప అవకాశం ఇచ్చారు. సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు ఉత్తమ వైద్యం అందించాలి' అని మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌ కోరారు. వైద్య సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.

0
0
Report
Advertisement

LSG Vs PBKS Match: శ్రేయస్ అయ్యర్ సెంచరీ..ఎట్టకేలకు విజయం సాధించిన పంజాబ్ కింగ్స్..ప్లేఆఫ్స్‌కు వెళ్తుందా?

Ardonamau, Uttar Pradesh:

LSG Vs PBKS Match Today: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నేడు జరిగిన రసవత్తర పోరులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విధ్యంసకర బ్యాటింగ్‌తో సెంచరీ సాధించిన వేళ.. ఆ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి.. 18 ఓవర్లలోనే మ్యాచ్‌ను పూర్తి చేసింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌పై మరిన్ని కొత్త ఆశలు చిగురించేలా ఉంది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుందా లేదా అనేది ఐపీఎల్‌లో జరగబోయే తర్వాతి మ్యాచ్‌లు డిసైడ్ చేస్తాయి. 

Also Read: పంజాబ్ కింగ్స్‌కు లక్నోతో నేడు చావో రేవో మ్యాచ్..గెలిస్తే ప్లేఆఫ్స్, ఓడితే ఇంటికే!

Also Read: అనిరుధ్‌తో కావ్యా పాప పెళ్లి ఫిక్స్?! ఐపీఎల్ అవ్వగానే ముహూర్తం! నిజం బయటకొచ్చింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Liquor Price Hike: ముందుబాబులకు మత్తు దిగిపోయే వార్త..భారీగా పెరగనున్న మద్యం ధరలు..ఎంత పెరుగుతుందంటే?

Hyderabad, Telangana:

Liquor Price Hike In Telangana: తెలంగాణలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇవ్వబోతోంది. రాష్ట్రంలో మద్యం, బీర్ల ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన కొత్త ధరల కసరత్తు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ముడిసరుకుల వ్యయం పెరిగిపోవడంతో ధరలను పెంచాలంటూ మద్యం తయారీ కంపెనీలు (డిస్టిల్లరీలు, బ్రూవరీలు) కొంతకాలంగా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. దీనిపై అనేక తర్జనభర్జనల తర్వాత, ప్రభుత్వం ధరల పెంపునకే మొగ్గు చూపింది.

జూన్ 2 తర్వాతే..!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 తర్వాత మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ధరల నిర్ధారణ కమిటీ ఇప్పటికే మార్కెట్ పరిస్థితులపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది.

ధరలు పెరుగుదలకు కారణం?
మద్యం ధరలు పెరగడం వెనుక అంతర్జాతీయ కారణాలతో పాటు ముడిసరుకుల కొరత ప్రధానంగా ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల గాజు సీసాల తయారీకి అవసరమైన కమర్షియల్ ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ ధరలు రెట్టింపు కావడంతో మద్యం సీసాల (బాటిల్స్) తయారీ ఖర్చు 15 నుంచి 20 శాతం వరకు పెరిగింది. ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగినందున కనీసం 15 శాతం ధరలను పెంచాలని డిస్టిల్లరీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి.

ఎంత శాతం పెరిగెను..
మద్యం ధరల పెంపు, ఆదాయ వనరులపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. పొరుగు రాష్ట్రాల్లోని ధరలను విశ్లేషించిన ఈ కమిటీ, తెలంగాణలో 25 నుంచి 30 శాతం వరకు ధరలను పెంచవచ్చని ప్రభుత్వానికి సూచించింది. అయితే, ఒకేసారి అంత భారీగా పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మధ్యేమార్గంగా 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే ధరలను పెంచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

గమనిక: ఈ పెంపు వల్ల సాధారణ (ఆర్డినరీ), మీడియం బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్ల మద్యం, అన్ని రకాల బీర్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. జూన్ మొదటి వారంలోనే దీనిపై స్పష్టమైన క్లారిటీ రానుంది.

Also Read: వడదెబ్బతో రాష్ట్రంలో 34 మంది మృతి..ఒక్కొక్కరికి రూ.4 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం!

Also REad: ఐఫోన్ యూజర్లకు వార్నింగ్.. సైబర్ నేరగాళ్లకు ఈజీగా దొరికేస్తున్నారు..తస్మాత్ జాగ్రత్త

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Kishan Reddy: ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య రంగంగా భారత్‌ నిలుస్తుంది: కిషన్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Zee Telugu News Healthcare Excellence Awards 2026: ప్రపంచ స్థాయి వైద్య మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరలలో ఆరోగ్య సంరక్షణ, వ్యాక్సిన్ల తయారీ, డిజిటల్ హెల్త్ టెక్నాలజీలో వేగవంతమైన అభివృద్ధితో హైదరాబాద్ ఒక గ్లోబల్ హెల్త్‌కేర్, ఫార్మా హబ్‌గా ఆవిర్భవిస్తోంది' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతు గురించి వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఇతర ముఖ్యమైన కార్యక్రమాలతో పాటు, ఎయిమ్స్ బీబీనగర్ అభివృద్ధి, సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని సూపర్-స్పెషాలిటీ కేంద్రంగా తీర్చిదిద్దడం, అలాగే 6 వేలకు పైగా ఆయుష్మాన్ వెల్‌నెస్ కేంద్రాలు, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.

హైదరాబాద్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జీ తెలుగు న్యూస్‌ ఉత్తమ వైద్యుల అవార్డు-2026 కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి హాజరై పలువురు వైద్యులకు అవార్డులు ప్రదానం చేశారు. జీ తెలుగు న్యూస్‌ చీఫ్‌ ఎడిటర్‌ సంగనభట్ల భరత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వైద్యులకు అవార్డులు అందించడాన్ని అభినందించారు. 'కనిపించే ప్రత్యక్ష దేవుడు వైద్యులు. ప్రజలందరూ కూడా వైద్యులను గుర్తిస్తున్నారు. వైద్యం అనేది పవిత్రమైనది. పవిత్రమైన వృతిలో సేవలు అందించే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చారు' అని పేర్కొన్నారు.

'అతిక్లిష్టమైన వృత్తిలో వైద్యం ఒకటి. వైద్య వృత్తి అనేది బాధ్యాయుతమైనది. ప్రజలకు చెప్పేది ఒకటే ఫస్ట్‌ వైద్యుడు మీరే. తల్లి మొదటి డాక్టర్‌.. రెండో డాక్టర్‌ మీకు మీరే. మనకు మనమే డాక్టర్‌. కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి.. పరిశోధనలు, పరికరాలు వస్తున్నాయి. శరీరాన్ని ఏమాత్రం కష్టపడకుండా సమాజం బాధ్యత తీసుకుంటోంది. శరీరాన్ని శ్రమ పెట్టకుంటే శరీరం ఇబ్బంది పెడుతుంది' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు.

'యోగాకు ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చారు. యోగా అనేది యుగయుగాలుగా వస్తోంది. 200 దేశాలకు యోగాను విస్తరించాం. యోగాను విదేశాల్లో ప్రజలు చేస్తుంటే భారతదేశంలో చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారా? అని ఆస్పత్రులు ఆలోచించాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వైద్యులు తృప్తిగా ఉండాలి' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. 'ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటుచేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. కోవిడ్‌ సమయంలో కేంద్ర మంత్రిగా అన్ని రంగాలను సమన్వయం చేసుకుని వైద్యంపై ప్రత్యేక చొరవ చూపాం. ప్రజలందరిని సమన్వయంగా చేసుకుని కోవిడ్‌ను విజయవంతంగా ఎదుర్కొన్నాం. అందరి కన్నా ముందు కరోనా వ్యాక్సిన్‌ను మొదట వైద్యులు, వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం వేయించింది. కరోనా సేవలు అందించిన వైద్యులకు సైనికులతో పూలవర్షం కురిపించాం. వైద్యులు, వైద్య సిబ్బందిపై ఎయిర్‌ఫోర్స్‌ ద్వారా పూల వర్షం ప్రధాని మోదీ కురిపించారు' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గుర్తుచేశారు.

'కరోనా సమయంలో ధైర్యంగా ఆస్పత్రులను సందర్శించా. కరోనా సేవలో పారా మెడికల్‌, వైద్య సిబ్బంది అద్భుతంగా సేవలు అందించారు. 387 మెడికల్‌ కాలేజ్‌ ఉండగా.. 780 కాలేజ్‌లు కొత్తగా ఏర్పాటుచేశాం. వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. ఎంబీబీఎస్‌ 1.50 లక్షల సీట్లు పెంచాం. పీజీ సీట్లు 30 వేల నుంచి 73 వేలకు పీజీ సీట్లు పెంచాం' అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. 'భారత్‌ బయోటెక్‌ కంపెనీని ప్రధాని మోదీ సందర్శించి 6 గంటలు శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బందితో సమయం గడిపి వారికి ధైర్యం చెప్పారు. కరోనా వాక్సిన్‌ తయారీకి పూర్తి తోడుగా ఉన్నామని తెలిపారు. కోవిడ్‌కు 150 దేశాలకు కూడా వాక్సిన్‌ను ఎగుమతి చేసిన చరిత్ర భారతదేశానిది. మన వైద్యుల ఘనత. అతి తక్కువ సమయంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య రంగంగా భారతదేశం నిలుస్తుందని విశ్వసిస్తున్నాని తెలిపారు. అమెరికాలో.. ఇంగ్లాండ్‌, ఆఫ్రికా దేశాలు, యూరప్‌ దేశాలకు చెందిన వారు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని భారతదేశంలో పొందుతున్నారు' అని కిషన్‌ రెడ్డి వెల్లడించారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top