బలహీనులను మర్చిపోలేని బడ్జెట్ టైగర్ ఆంజనేయులు గౌడ్
Karimnagar, Telangana:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది, ముఖ్యంగా బలహీన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహాయక నిర్ణయం తీసుకుంది మరియు జిల్లా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
AP Job Calender: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 'జాబ్ క్యాలెండర్-2026'పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
Vijayawada, Andhra Pradesh:AP Job Calender 2026: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 'జాబ్ కేలండర్-2026' రూపకల్పన, అమలుపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంత్రులు, అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
నాలుగు దశల్లో 10,060 ఉద్యోగాల భర్తీ
జాబ్ క్యాలెండర్-2026లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10,060 పోస్టులను నాలుగు విడతలుగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.
1) మొదటి దశలో భాగంగా మొత్తం 1,523 అధ్యాపక (ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను ఇప్పటికే విడుదల చేశారు.
2) రెండో దశలో 3,168 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, కొన్ని సాంకేతిక కారణాలు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నోటిఫికేషన్ తేదీలో మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
3) అదే విధంగా మూడో దశలో 2,388 పోస్టులు, నాలుగో దశలో 2,981 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
హోంశాఖలోనూ పోస్టుల భర్తీ
రాష్ట్రంలోని హోంశాఖలో ఖాళీగా ఉన్న 2,225 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పోలీస్, భద్రతా విభాగాలలో సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు.
గ్రూప్-1 పెంపు పరిశీలన
నిరుద్యోగ అభ్యర్థులకు మరిన్ని మెరుగైన అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టుల సంఖ్యను పెంచే అంశంపై మంత్రుల బృందం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాలు
ఉద్యోగాల భర్తీలో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులను మంత్రి లోకేష్ హెచ్చరించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని స్పష్టం చేశారు. అలాగే, జాబ్ క్యాలెండర్-2026కు సంబంధించిన పూర్తి స్థాయి ఖాళీల వివరాలను రాబోయే కేబినెట్ సమావేశంలో సమర్పించాలని ఆదేశించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read: ఉద్యోగులకు సూపర్ గుడ్న్యూస్..ఇకపై ప్రతినెలా 1వ తేదీన జీతాలు అకౌంట్లో జమ!
Also Read: పంతం నెగ్గించుకున్న రఘురామ కృష్ణరాజు..ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు ఓకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
DMart Shopping Offers: డీమార్ట్లో షాపింగ్ ఏ రోజు చేస్తే బెటర్..ఈ టైమ్లో షాపింగ్ చేస్తే డబ్బు, సమయం రెండూ ఆదా!
Hyderabad, Telangana:DMart Shopping Discount Offers: దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన డీమార్ట్ (DMart), కిరాణా సామాగ్రి నుంచి గృహోపకరణాలు, దుస్తులు, వంటగది వస్తువులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వరకు అన్నీ ఒకే చోట సరసమైన ధరలకు అందించే ప్రముఖ షాపింగ్ కేంద్రం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు భారీ తగ్గింపులతో షాపింగ్ చేయడానికి డీమార్ట్ను ఎంతగానో ఇష్టపడతాయి. అయితే, చాలా మందికి తక్కువ రద్దీ ఉండే సమయాలు, ఉత్తమమైన ఆఫర్లు లభించే రోజులు ఏవో తెలియక ఇబ్బంది పడుతుంటారు.
డీమార్ట్లో ప్రతి వస్తువు ధర రోజువారీగా ఒకేలా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి వివిధ ఉత్పత్తులపై ఇచ్చే డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొన్ని రోజుల్లో కిరాణా సరుకులపై భారీ తగ్గింపు ఉంటే, మరికొన్ని రోజుల్లో గృహోపకరణాలు లేదా బట్టలపై ప్రత్యేక డీల్స్ లభిస్తాయి. ఇక్కడ చాలా వస్తువులు గరిష్ట చిల్లర ధర (MRP) కంటే తక్కువకే లభించడంతో పాటు "ఒకటి కొంటే ఒకటి ఉచితం", కాంబో ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
రద్దీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది?
వారాంతాలు (వీకెండ్స్): శుక్రవారం నుండి ఆదివారం వరకు డీమార్ట్లో రద్దీ తారాస్థాయిలో ఉంటుంది. సెలవు దినం కావడంతో కుటుంబాలన్నీ షాపింగ్కు క్యూ కట్టడంతో బిల్లింగ్ కౌంటర్ల వద్ద గంటల తరబడి సమయం వృధా అవుతుంది. అయితే ఈ సమయంలోనే కొన్ని ప్రత్యేక కాంబో ఆఫర్లు లభించే అవకాశం ఉంది.
అతి తక్కువ రద్దీ ఉండే రోజులు, సమయాలు
మీ షాపింగ్ ప్రశాంతంగా, వేగంగా పూర్తి కావాలంటే క్రింది సమయాలను ఎంచుకోవడం ఉత్తమం. సోమవారం నుండి గురువారం మధ్య షాపింగ్ చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా నెలలో 10వ తేదీ నుండి 25వ తేదీ మధ్య స్టోర్ను సందర్శిస్తే రద్దీ చాలా వరకు తక్కువగా ఉంటుంది. జీతాలు వచ్చే నెల ప్రారంభం, చివరి రోజుల్లో స్టోర్కు జనం తాకిడి ఎక్కువగా ఉంటుంది.
ఉత్తమ సమయాలు..
స్టోర్ తెరిచిన వెంటనే ఉదయం వేళల్లో మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య సమయంలో బిల్లింగ్ కౌంటర్ల వద్ద పెద్దగా రద్దీ ఉండదు. వారాంతం తర్వాత మిగిలిపోయిన సరుకును త్వరగా క్లియర్ చేయడానికి కొన్ని డీమార్ట్ బ్రాంచ్లు సోమవారాల్లో ప్రత్యేక తగ్గింపులను అందిస్తుంటాయి. దీనినే అనధికారికంగా "క్లీన్-అప్ సేల్" అంటారు. ఈ సమయంలో కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులపై అదనపు డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది (అయితే ఇది అన్ని బ్రాంచ్లలో ఉండకపోవచ్చు).
డీమార్ట్ రెడీ యాప్తో అదనపు ఆదా
ఆన్లైన్ షాపింగ్ ప్రియుల కోసం డీమార్ట్ రెడీ యాప్ చక్కటి ప్రత్యామ్నాయంగా మారింది. ఇందులో ప్రత్యేక కూపన్లు, డిజిటల్ ఆఫర్లు, ఆన్లైన్కు మాత్రమే పరిమితమైన ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ను క్రమం తప్పకుండా పరిశీలించడం ద్వారా మీరు మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు.
మెరుగైన షాపింగ్ కోసం ముఖ్యమైన చిట్కాలు
1) వారాంతాలకు బదులుగా వారపు రోజులను (సోమవారం - గురువారం) ఎంచుకోండి.
2) స్టోర్కు వెళ్లే ముందే ఖచ్చితమైన షాపింగ్ జాబితా తయారు చేసుకోండి.
3) ప్రత్యేక ఆఫర్లను పరిశీలించిన తర్వాతే వస్తువులను ఎంపిక చేసుకోండి.
4) అవసరానికి మించి అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం మానుకోండి.
5) డిజిటల్ కూపన్లు, మెంబర్షిప్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి.
సరిైన రోజు, సరైన సమయాన్ని ఎంచుకోవడం ద్వారా డీమార్ట్లో షాపింగ్ చేయడం వల్ల మీ డబ్బుతో పాటు విలువైన సమయం కూడా ఆదా అవుతుంది. ప్రశాంత వాతావరణంలో ఇబ్బంది లేకుండా షాపింగ్ పూర్తి చేసుకోవడానికి పై చిట్కాలు ఎంతగానో సహాయపడతాయి!
(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే పొందుపరిచినది. దీన్ని వ్యాపార ప్రకటనగా పరిగణించవద్దు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: విజయ్ Vs ధనుష్..2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే కనుమరుగు?
Also Read: సర్జరీ తర్వాత తొలిసారి కనిపించిన రామ్చరణ్..భార్యతో పాటు అయ్యప్ప దర్శనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జూలై 31, ఆగస్టు 1న ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
Gudepuvalasa, Andhra Pradesh:AP School Holidays: ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 1న విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ చారిత్రక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టింది.
పర్యటన విశేషాలు.. ప్రముఖుల హాజరు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
విద్యాసంస్థలకు సెలవులు
భోగాపురం ఎయిర్పోర్టు వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభకు వివిధ జిల్లాల నుంచి జనాలను సమీకరిస్తున్నారు. ఇందులో భాగంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ జన సమీకరణ ప్రక్రియ కోసం జిల్లాలోని ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ బస్సులతో పాటు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను ఉపయోగిస్తున్నారు.
బస్సులను రవాణా కోసం కేటాయించడంతో, కోనసీమ జిల్లాలో ఈ నెల 31, ఆగస్టు 1 తేదీలలో రెండు రోజుల పాటు అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులు జారీ..
జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు తమ బస్సులను అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన సర్కులర్ జారీ చేశారు. దీంతో రవాణా అధికారులు బస్సుల ఏర్పాటులో నిమగ్నమయ్యారు.
ఇదిలా ఉండగా, ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read: ఉద్యోగులకు సూపర్ గుడ్న్యూస్..ఇకపై ప్రతినెలా 1వ తేదీన జీతాలు అకౌంట్లో జమ!
Also Read: పంతం నెగ్గించుకున్న రఘురామ కృష్ణరాజు..ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు ఓకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ICC Rankings: వన్డేల్లో రారాజుగా శుభ్మన్ గిల్..టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్ సూర్యవంశీ!
Hyderabad, Telangana:ICC Team India Rankings: జింబాబ్వేతో జరిగిన సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ కెరటం వైభవ్ సూర్యవంశీ.. తాజాగా రిలీజ్ చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో సత్తా చాటాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో వైభవ్ 230 స్థానాలు ఎగబాకి సరికొత్త రికార్డును సాధించాడు. మరోవైపు, టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ వన్డేల రారాజుగా అవతరించాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ డారిల్ మిచెల్ నుంచి నంబర్-1 స్థానాన్ని గిల్ కైవసం చేసుకున్నాడు. 801 పాయింట్లతో శుభ్మన్ గిల్ వన్డేలలో నంబర్-1 బ్యాట్స్మెన్గా నిలిచాడు. మిచెల్ ఒక స్థానం కోల్పోయి 794 పాయింట్లతో నంబర్-2 స్థానానికి పడిపోయాడు. విరాట్ కోహ్లీ నంబర్-3 స్థానంలో, రోహిత్ శర్మ నంబర్-4 స్థానంలో కొనసాగుతున్నారు.
ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మూడు మ్యాచ్లలో 196.10 స్ట్రైక్ రేట్తో 151 పరుగులు చేసి, అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్య వంశీ నిలిచాడు. అదేవిధంగా జింబాబ్వే పర్యటనలో వైభవ్ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ ప్రదర్శనకు ప్రతిఫలంగా, అతను ఇప్పుడు టీ20ఐ ర్యాంకింగ్స్లో 230 స్థానాలు ఎగబాకాడు.
వైభవ్ సూర్యవంశీ T20I ర్యాంక్ ఎంత?
తాజా ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో వైభవ్ సూర్యవంశీ 48వ స్థానానికి చేరుకున్నాడు. అతను ర్యాంకింగ్స్లో చాలా వెనుకబడి ఉన్నాడని మీరు వాదించవచ్చు, కానీ జింబాబ్వేతో సిరీస్కు ముందు అతను 278వ ర్యాంకులో ఉన్నాడనే విషయం గమనించాలి. ఇది వైభవ్ సూర్యవంశీకి ఒక ముఖ్యమైన ఘనత.
శుభ్మన్ గిల్ వన్డేలకు రాజు!
గత కొన్ని నెలలుగా అద్భుతమైన ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్, ఇప్పుడు వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. భారత కెప్టెన్ కొనసాగుతున్న శుభ్మన్ గిల్.. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ డారిల్ మిచెల్ నుండి ఈ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. టెస్ట్ ర్యాంకింగ్స్లో కూడా శుభ్మన్ 7వ స్థానంలో ఉన్నాడు. భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మూడు ఫార్మాట్లలోనూ నంబర్ 1 ఎవరు?
వన్డే - శుభ్మన్ గిల్ (801 పాయింట్లు)
టెస్ట్ - ట్రావిస్ హెడ్ (853 పాయింట్లు)
టీ20 - ఇషాన్ కిషన్ (910 పాయింట్లు)
వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ, రోహిత్ల స్థానం ఎంత?
టీమ్ ఇండియాకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. టెస్టు, టీ20 ఫార్మాట్కు ఇప్పటికే ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో వీరిద్దరూ ఆడారు. లార్డ్స్లో రోహిత్ శర్మ సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్లలో 144 పరుగులు చేశాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ 767 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 758 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
Also REad: హార్దిక్ పాండ్యాను వదులుకోనున్న ముంబై ఇండియన్స్..కొత్త ఆటగాళ్ల లిస్టు ఇదే!
Also Read: హీరోయిన్తో క్రికెటర్ అర్ష్దీప్ సింగ్ పెళ్లి..లగ్గం ఫిక్స్..ఆమె సంపాదన ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Uday Krishna Reddy Case: పోలీసుల అదుపులో ఉదయ్ కృష్ణారెడ్డి..ఆ రోజు వరకు రిమాండ్కు తరలింపు!
Hyderabad, Telangana:Trainee ips uday krishna reddy case: హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమిలో జరిగిన ట్రైనీ ఐపీఎస్ ల కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ ను పెంచారు. ఈ క్రమంలో నిన్న ఉదయ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రంత అత్తాపూర్ లో పీఎస్ లో ఉంచి స్టేట్ మెంట్ను రికార్డు చేశారు. అంతే కాకుండా మహిళ ఐపీఎస్ నుంచి కూడా స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆమె మెడను పట్టుకున్నట్లు, శరీరంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.AP Employees Salary: ఉద్యోగులకు సూపర్ గుడ్న్యూస్..ఇకపై ప్రతినెలా 1వ తేదీన జీతాలు అకౌంట్లో జమ!
Vijayawada, Andhra Pradesh:AP Employees Salary On 1st: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికశాఖ శుభవార్త అందజేసింది. ఇకపై ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఆర్థికశాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన మెమో జారీ చేసింది.
ఆర్థికశాఖ ముఖ్య ఆదేశాలు, మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు జీతాల బిల్లులను వెంటనే IFMS (Integrated Financial Management System) పోర్టల్లో అప్డేట్ చేయాలని ఆర్థిఖ శాఖ అధికారులు ఆదేశించారు.
జీతాల బిల్లులను సమయానికి అప్డేట్ చేయని పక్షంలో సంబంధిత డ్రాయింగ్ & డిస్బర్స్ మెంట్ ఆఫీసర్ (DDO)పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిల్లులు పెండింగ్లో ఉంటే ముందుగానే ఆర్థికశాఖకు తెలియజేయాలని సూచించారు.
జూలై 30 లోపు ఏ ఉద్యోగి జీతాల బిల్లు పంపకపోయినా, దానికి పూర్తి బాధ్యత సంబంధిత DDO దేనని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. దీంతో సాంకేతిక సమస్యలను పరిష్కరించుకునేందుకు పలువురు DDOలు సచివాలయానికి పరుగులు పెడుతున్నారు. అలాగే పొరుగుసేవలు (అవుట్సోర్సింగ్), కాంట్రాక్టు ఉద్యోగుల సేవా కాలాన్ని ఈ నెలకు కూడా పొడిగిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర నిధుల బాధ్యత
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పనిచేస్తున్న సుమారు లక్ష మంది ఉద్యోగుల జీతాలకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టుకునే బాధ్యత పూర్తిగా సంబంధిత శాఖాధిపతులదేనని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ కోసం ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి గౌరవ్ ఉప్పల్ను రాష్ట్ర నోడల్ అధికారిగా నియమించారు. అయితే, కేంద్ర నిధులు ఆలస్యమైనప్పుడు రాష్ట్ర ఆర్థికశాఖ తాత్కాలికంగా నిధులను సర్దుబాటు చేస్తుందా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఆధార్ అప్డేట్ సమస్యలు, పరిష్కార మార్గాలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,900 మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు IFMS పోర్టల్లో అప్డేట్ కాలేదు. వీరిలో సుమారు 1,900 మంది అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. గతంలో డిప్యుటేషన్లో పనిచేసి బదిలీపై కొత్త చోట చేరిన ఉద్యోగులకు కూడా ఆధార్ అప్డేట్కు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురువుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు నేరుగా సచివాలయానికి వచ్చి ఆర్థికశాఖ అధికారులను సంప్రదిస్తున్నారు.
రాష్ట్రంలో నెలవారీ ఆర్థిక అంచనా
ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెలా చెల్లించాల్సిన వేతనాలు, పింఛన్ల అంచనా వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు నెలకు సుమారు రూ.4,500 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. మాజీ ఉద్యోగులకు పింఛన్ల రూపంలో సుమారు రూ.2,500 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది.
ప్రభుత్వ తాజా ఆదేశాల నేపథ్యంలో, సాంకేతిక ఇబ్బందిలను అధిగమించి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రతినెలా మొదటి తేదీనే జీతం అందేలా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఈ శుభవార్త తెలుసుకున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పంతం నెగ్గించుకున్న రఘురామ కృష్ణరాజు..ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు ఓకే!
Also Read: ఏపీ విద్యార్థులకు పండుగే పండుగ.. స్కూళ్లకు ఏకంగా 10 రోజులు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nara Bhuvaneshwari: అసెంబ్లీలో నా శీలం గురించి మాట్లాడారు.. వైఎస్సార్సీపీ నేతలపై నారా భువనేశ్వరీ సెన్సెషనల్ కామెంట్స్..
Hyderabad, Telangana:Nara bhuvaneshwari emotional in kuppam meeting: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం కాక రేపుతున్నాయి. ఒకవైపు వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల్లో అబద్దపు హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి కూటమి గద్దెనెక్కిందని విమర్శలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యంగంను అమలు చేస్తున్నారని, శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం సైతం వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ లు ఇస్తుంది. ఇక తాజాగా.. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి కుప్పంలో పర్యటించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ద్రౌపది అమ్మవారి ఆలయంను సందర్శించారు.
తనపై, తన కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల గురించి నారా భువనేశ్వరి తొలిసారిగా ప్రజల మధ్య స్పందించారు.
"ఈ విషయం గురించి నేను ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత... స్త్రీ అంటే ఏమిటి, స్త్రీని పురుషులు ఎంత గౌరవించాలో… pic.twitter.com/8EY4DYX1so
— TeluguBulletin.com (@TeluguBulletin) July 29, 2026
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర భావొద్వేగంకు గురయ్యారు. ద్రౌపది అమ్మవారిని చూసిన తర్వాత తనకు గత ప్రభుత్వ హయంలో అసెంబ్లీలో ఎదురైన ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూర్వకాలంలో పాండవుల్ని ఎదుర్కొలేక కౌరవులు ద్రౌపదమ్మను నిండు సభలోకి లాక్కొచ్చి చీరను లాగి అవమానించిన ఘటనలను గుర్తు చేశారు. ఒక ఆడదిని అడ్డం పెట్టుకుని నీచంగా ప్రవర్తించాని అన్నారు.
అప్పుడు ద్రౌపదిని శ్రీకృష్ణ పరమాత్మ కాపాడాడని చెప్పారు. అదే విధంగా చంద్రబాబును సభలో ఎదుర్కొలేక గత పాలకులు సభలో ఆయనను హింసించాలని తన పేరును లాగి నాశీలం గురించి మాట్లాడారని చెబుతు భావొద్వేగంకు గురయ్యారు. మగాడు మగాడిలా మాట్లాడాలని అన్నారు. ఆ దేవుడే తమకు అండగా నిలిచాడని అందుకే ప్రజల రూపంలో తమను ఎన్నికల్లో గెలిచేలా చేసి మా కుటుంబంకు అండగా నిలిచాడని చెబుతూ నారా భువనేశ్వరీ తీవ్రంగా స్పందించారు.
ఈ విషయం గురించి నేను ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదని.. . కానీ ఈ రోజు ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత... స్త్రీ అంటే ఏమిటి, స్త్రీని పురుషులు ఎంత గౌరవించాలో గుర్తు చేయాలనిపించిందని చెప్పుకొచ్చారు. మా కుటుంబాన్ని ఎంతగా అవమానించినా... ప్రతిసారీ ప్రజల రూపంలో దేవుడే వచ్చి మాకు అండగా నిలిచారని నారా భువనేశ్వరీ స్పష్టం చేశారు. తిరుమలలో బాంబులు పెట్టిన ఘటనల్లో కూడా ఆ దేవుడు తమకు అండగా ఉంటున్నాడని అన్నారు.
రాజమండ్రిలో నిర్భందించిన కూడా ఆ దేవుడు ప్రజల రూపంలో తమకు అండగా నిలిచారన్నారు. ప్రతి ఒక్క స్త్రీని అందరు గౌరవించుకొవాలని నారా భుశనేశ్వరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం నారా భువనేశ్వరీ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. దీనిపై వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
Vijay Vs Dhanush: విజయ్ Vs ధనుష్..2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే కనుమరుగు?
Chennai, Tamil Nadu:Vijay Vs Dhanush Politics: 1967, 1977 అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచాయి. 2024 ఫిబ్రవరిలో ఆవిర్భవించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అనూహ్య విజయం సాధించి 2026 మేలో అధికార పీఠాన్ని అధిష్టించింది. 'విజయ్' అనే ఒకే ఒక బలమైన మంత్రం ఈ అద్భుత విజయానికి కారణమైంది.
ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ మొత్తం 108 స్థానాలను కైవసం చేసుకుంది. అర్ధ శతాబ్దానికి పైగా తమిళనాడును ఏలిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు వరుసగా రెండు, మూడు స్థానాలకు పరిమితమయ్యాయి. మిత్రపక్షాలను మినహాయించి, డీఎంకే 59 స్థానాలు, ఏఐఏడీఎంకే 47 స్థానాలు మాత్రమే సాధించగలిగాయి.
డీఎంకే ఎదుర్కొంటున్న సవాళ్లు
1967, 1971 ఎన్నికల తర్వాత డీఎంకే ఎన్నడూ వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. 2011లో ఓటమి చవిచూసిన తర్వాత సుమారు 10 సంవత్సరాలు వేచి చూసి, ఎట్టకేలకు 2021లో అధికారంలోకి వచ్చింది. 2026 ఎన్నికలలోనూ డీఎంకే కచ్చితంగా విజయం సాధిస్తుందని రాజకీయ పరిశీలకులు భావించినప్పటికీ, టీడీపీ ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది.
ఏఐఏడీఎంకే సంక్షోభం
డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా నిలవగా, ఏఐఏడీఎంకే మూడవ స్థానానికి పడిపోయి ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ఎన్నికల అనంతరం, ఏఐఏడీఎంకే 'రెండు ఆకుల' గుర్తుపై గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల బలం 41కి పడిపోయింది. మాజీ మంత్రులు ఎస్.పి.వేలుమణి, సి.వి.షణ్ముగం తదితరులు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
మాజీ మంత్రులు, జిల్లా కార్యదర్శులు, ముఖ్య నేతలు పెద్ద ఎత్తున టీడీపీ వైపు చూస్తుండటంతో, ఈ రెండు ప్రధాన పార్టీలకు టీడీపీని ఎదుర్కోవడం కష్టతరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, 2031 ఎన్నికలలో డీఎంకే, ఏఐఏడీఎంకేలు కలిసి విజయ్ను ఎలా ఎదుర్కొంటాయనే చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.
విజయ్ వర్సెస్ ధనుష్..2031 అంచనాలు
ఈ నేపథ్యంలో కొందరు రాజకీయ ప్రముఖులు 2031 అసెంబ్లీ ఎన్నికలపై ఒక సంచలన జోస్యం చెప్పారు. 2031 ఎన్నికలలో సీఎం విజయ్ టీవీకే పార్టీని ఎదుర్కొనేందుకు డీఎంకే, ఏఐఏడీఎంకే లు ఏకమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవేళ నటుడు ధనుష్ కనుక రాజకీయాల్లోకి వస్తే, ఆయన టీవీకే విజయ్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా మారుతారని, అంతేకాకుండా రాజకీయాల్లో నంబర్ వన్ స్థానానికి ఎదుగుతారని తమిళనాడు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ప్రాధాన్యత తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు.
ధనుష్ రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు
కొద్ది రోజుల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా తిరువళ్లూరులో జరిగిన రక్తదాన శిబిరంలో ధనుష్ పాల్గొని ప్రసంగించారు. ఆ వేదికపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశంతోనే ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తానికి, తమిళనాడు రాజకీయాలు భవిష్యత్తులో మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Also REad: బాలీవుడ్ హీరోయిన్ల బాడీ పార్ట్స్పై సీక్రెట్ టాటూలు..వాటిలో అర్థం అంత ఉందా?
Also Read: "బిగ్బాస్ 10లోకి నన్ను తీసుకోండి"..కింగ్ నాగార్జునకు హీరోయిన్ స్పెషల్ రిక్వెస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Honor X6e: 7500mAh భారీ బ్యాటరీతో Honor కొత్త ఫోన్ విడుదల.. ధర ఎంతంటే?
Hyderabad, Telangana:Honor X6e 4G Price: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ హోనర్ (Honor) బడ్జెట్ ధరలో మరో శక్తివంతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు వచ్చింది.. దీనిని కంపెనీ Honor X6e 4G పేరుతో మలేషియా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అత్యంత తక్కువ ధరలోనే మోస్ట్ పవర్ఫుల్ భారీ బ్యాటరీతో పాటు అద్భుతమైన డిజైన్, ప్రీమియం కెమెరా సెటప్తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భారీ 7500mAh బ్యాటరీ..
ఈ Honor X6e 4G స్మార్ట్ఫోన్ మోస్ట్ పవర్ఫుల్ 7500mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే.. దాదాపు రెండు నుంచి మూడు రోజుల పాటు సులభంగా వస్తుంది. అంతేకాకుండా ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 45W Honor SuperCharge ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా కంపెనీ అందిస్తుంది. ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది..
డిస్ప్లే, డిజైన్..
ఈ Honor X6e 4G స్మార్ట్ఫోన్ చాలా ప్రత్యేకమైన 6.61 అంగుళాల TFT LCD డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది.. ఇది 1604 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. కంటికి ఒత్తిడిని తగ్గించే ఐ కంఫర్ట్ (Eye Comfort), డైనమిక్ డిమ్మింగ్ ఫీచర్లతో పని చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.. స్క్రీన్ ప్రొటక్షన్ కోసం అల్యూమినోసిలికేట్ గ్లాస్ను కూడా వినియోగించారు.. అంతేకాకుండా దుమ్ము, నీటి చినుకుల నుంచి రక్షణగా IP64 రేటింగ్ అందించడం విశేషం.
ప్రొసెసర్, పెర్ఫార్మెన్స్..
ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో G81 ఆల్ట్రా (MediaTek Helio G81 Ultra) ప్రొసెసర్ను కూడా కలిగి ఉంటుంది.. అలాగే 4GB ర్యామ్తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.. ఇందులో మరో 4GB వర్చువల్ ర్యామ్ సపోర్ట్ వల్ల మొత్తం 8GB వరకు పెంచుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10.0 ఆపరేటింగ్ సిస్టమ్పై ఈ ఫోన్ రన్ అవుతుందని కంపెనీ వెల్లడించింది..
కెమెరా సెటప్ వివరాలు..
ఫొటోగ్రఫీ ప్రేమికులను దృష్టిలో పెట్టుకుని.. వెనుక వైపు అపెర్చర్తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా అందిస్తోంది.. ఇది 10X డిజిటల్ జూమ్ను సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ధర వివరాలు..
మలేషియాలో Honor X6e 4G (4GB + 128GB) వేరియంట్ ధర RM 699గా నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.16,000గా ఉంటుంది.. ఈ ఫోన్ సన్రైజ్ గోల్డ్తో పాటు మిడ్నైట్ బ్లాక్ అనే రెండు రంగుల్లో విడుదల విడుదల కావడం విశేషం.. తక్కువ బడ్జెట్లో రికార్డు స్థాయి బ్యాటరీ లైఫ్, స్టైలిష్ డిజైన్, నమ్మకమైన కెమెరా కోరుకునే వారికి Honor X6e 4G ఒక అద్భుతమైన ఎంపికగా భావించవచ్చు. అయితే, దీనికి కంపెనీ త్వరలో భారత్లో కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Add Zee News as a Preferred Source
Jogulamba Temple: జోగులాంబ ఆలయం హుండీ లెక్కింపు.. ఎంత ఆదాయం వచ్చిందంటే?
Alampur (P), Telangana:Jubilee Hills: తప్పిపోయిన బాలుడిని కాపాడిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
Hyderabad, Telangana:Jubilee Hills MLA Naveen Yadav Catches Missing Boy At Roadside ShaikpetTamil Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. మాజీ ముఖ్యమంత్రి రాజీనామా?
Nagalapuram, Tamil Nadu:Tamil Nadu Politics: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు మూడు నెలలైనా ఇంకా రాజకీయాలు హాట్హాట్గానే కొనసాగుతున్నాయి. అధికారం కోల్పోయిన డీఎంకే పార్టీకి మరో భారీ షాక్ తగలనుందని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేయబోతున్నారని.. ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోనున్నాడని సమాచారం. అనంతరం అధికార టీవీకే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని జోరుగా చర్చ జరుగుతోంది.
అన్నాడీఎంకే పార్టీ తరఫున మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్సెల్వం సేవలు అందించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం నుంచి పన్నీర్సెల్వం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తర్వాత ముఖ్యమంత్రి అయినా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఏఐడీఎంకేలో కొనసాగారు. ఇటీవల 2026 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకే పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా డీఎంకే పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో అతడి రాజకీయ భవిష్యత్తు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం పన్నీర్ సెల్వం రాజకీయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పన్నీర్సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తేని నియోజకవర్గం నుంచి డీఎంకే పార్టీ తరఫున పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైంది. ప్రతిపక్ష పార్టీ డీఎంకేలో మాజీ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వానికి ఎలాంటి గుర్తింపు లేదు. ఇప్పటివరకు డీఎంకేలో ఆయనకు ఎలాంటి కీలక పదవి దక్కలేదు. దీంతో
పదవీ దక్కకపోవడం.. డీఎంకేలో ఎలాంటి గుర్తింపు లేకపోవడం తదితర కారణాల వల్ల పన్నీర్ సెల్వం రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. డీఎంకే తరఫున గెలిచిన పన్నీర్సెల్వం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీలో చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో పన్నీర్సెల్వమ్కు మంచి పట్టు ఉంది. దీంతో అక్కడ టీవీకే పార్టీ బలోపేతం కావడానికి పన్నీర్ సెల్వం దోహదం చేస్తుందని.. అందుకే ఆయన చేరికకు విజయ్ కూడా అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తన కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాజకీయ భవిష్యత్ కోసం పన్నీర్సెల్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన భవిష్యత్ కన్నా తన కుమారుడి భవిష్యత్ కోసం పార్టీ మారక తప్పని పరిస్థితి అని పన్నీర్సెల్వం వర్గం వివరిస్తోంది. రాబోయే ఉపఎన్నికల్లో పన్నీర్సెల్వం ‘విజిల్’ గుర్తుపై పోటీ చేయబోతున్నారని చర్చ జరుగుతోంది. 2029 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ను టీవీకే పార్టీ తరఫున బరిలోకి దించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి.
Ram Charan Surgery: సర్జరీ తర్వాత తొలిసారి కనిపించిన రామ్చరణ్..భార్యతో పాటు అయ్యప్ప దర్శనం, ప్రత్యేక పూజలు!
Coimbatore, Tamil Nadu:Ram Charan Surgery News: టాలీవుడ్ నటుడు మెగా పవర్స్టార్ రామ్చరణ్కు ఇటీవలే మణికట్టు సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ఇప్పుడు సర్జరీ విజయవంతంగా పూర్తవ్వడం వల్ల భార్య ఉపాసనతో కలిసి రామ్చరణ్ అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లారు. కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి దర్శనం కోసం రామ్చరణ్, ఉపాసన కలిసి వెళ్లారు. తాజాగా వైద్యులు విశ్రాంతిని సూచించిన క్రమంలో తాజాగా కోయంబత్తూరులోని గంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ వెంటనే అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించిన అక్కడ మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ విజయవంతం కావడం వల్ల కుటుంబ సమేతంగా రామ్చరణ్ హైదరాబాద్ బయల్దేరారు. అయితే అంతకు ముందు స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలోని స్వామి వారిని దర్శనం చేసుకున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరో రామ్చరణ్ నలుపు రంగు దుస్తులలో, కుడి చేతికి కట్టుతో కనిపించారు. వారి సందర్శన సమయంలో దేవుడికి ప్రార్థనలు చేస్తుండగా, ఉపాసన ఆవుకు అరటిపండ్లు తినిపిస్తూ కనిపించారు.
ఇటీవలే మణికట్టు సర్జరీ కోసం మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కోయంబత్తూరు చేరుకున్న సంగతి తెలిసిందే. హీరో రామ్చరణ్ సర్జరీ కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తల్లి సురేఖ, భార్య ఉపాసన కూడా అతనితో పాటు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. సర్జరీ పూర్తయ్యే వరకు వీరంతా కోయంబత్తూరులోని ఆస్పత్రిలోనే ఉన్నారు.
కోయంబత్తూరు గంగా ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ ఎస్.రాజశేఖరన్ నేతృత్వంలో రామ్చరణ్ మణికట్టుకు శస్త్రచికిత్స జరిగింది. గాయం తీవ్రత దృష్ట్యా, మయామికి చెందిన ప్రఖ్యాత చేతి, మణికట్టు నిపుణుడు డాక్టర్ అలెజాండ్రో బాడియా శస్త్రచికిత్స బృందంలో చేరారు. డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్, వారి నిపుణుల బృందం ఈ ఆపరేషన్ను నిర్వహించారు.
వైద్య బృందం ప్రకారం.. శస్త్రచికిత్స విజయవంతమైంది, రామ్ చరణ్ బాగా కోలుకుంటున్నారు. తిరిగి పనిలోకి రావడానికి ముందు కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. దాదాపుగా ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారు. వైద్య అనుమతి లభించిన తర్వాతే ఆయన షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారని భావిస్తున్నారు.
నటుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే అయ్యప్ప స్వామి ఆలయ సందర్శన చేశారు. ఆయనను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
రామ్చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో మణికట్టుకు గాయమైంది. అప్పట్లో మైనర్ ఆపరేషన్ జరిగినా.. తరచూ ఆయనకు అసౌకర్యం కలగడం వల్ల మరో సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆయన తాజాగా మరో సర్జరీ చేయించుకున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ చివరిగా బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, జాన్వీ కపూర్తో కలిసి నటించిన 'పెద్ది' చిత్రంలో కనిపించారు. ఆయన కోలుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్తో సినిమా చేయనున్నారు.
Also Read: బాలీవుడ్ హీరోయిన్ల బాడీ పార్ట్స్పై సీక్రెట్ టాటూలు..వాటిలో అర్థం అంత ఉందా?
Also REad: హీరోయిన్తో క్రికెటర్ అర్ష్దీప్ సింగ్ పెళ్లి..లగ్గం ఫిక్స్..ఆమె సంపాదన ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PRTU TS కామారెడ్డి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశ ఆహ్వానము..!!
Secunderabad, Telangana:PRTUTS Kamareddy District General Body Meeting: ప్రోగ్రెసివ్ రికాగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (PRTUTS) కామారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఆగస్టు 9, 2026లో మార్పులు చేసింది. సవరించిన తేదీ ప్రకారం వచ్చే నెల ఆగస్టు 8, 2026 (రెండవ శనివారం) ఉదయం 10:00 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంఘ నాయకత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కామారెడ్డిలోని బృందావన్ గార్డెన్స్ ప్రాంగణంలో, జిల్లా అధ్యక్షుడు అల్లాపుర్ కుశాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక జిల్లా సమావేశానికి శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీ) పింగిలి శ్రీపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్ రెడ్డిలతో పాటు PRTUTS రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు పేరి వెంకట్ రెడ్డి, గుండు లక్ష్మణ్, కులకర్ణి మనోహర్ రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
కీలక ఎజెండా..
సమావేశంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన, అతిథుల సందేశాల అనంతరం 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక కార్యదర్శి నివేదికను సమర్పించనున్నారు. అనంతరం వార్షిక కార్యదర్శి నివేదికకు సంబంధించి.. సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించనున్నారు. ఈ చర్చ తర్వాత ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న జిల్లా కార్యవర్గాన్ని అధికారికంగా రద్దు చేసి, 2026-28 రెండేళ్ల కాలవ్యవధికి గాను నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. ఇక ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలైన.. నిలిచిపోయిన డిఏ (DA) బకాయిల విడుదల, సీపీఎస్ (CPS) రద్దు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ఈ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఉపాధ్యాయుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగే ఈ సర్వసభ్య సమావేశానికి జిల్లాలోని మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కాంప్లెక్స్ ఇన్ఛార్జీలు, విద్యాధికారులు.. ప్రాథమిక సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 2 శుభవార్తలు..నెరవేరబోతున్న చిరకాల కోరిక..!!
Also Read: హెల్త్ కార్డులు, పీఆర్సీ కోసం రోడ్డెక్కిన పెన్షనర్లు..!!
Also Read: బ్రిక్స్ వేదికపై మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mercury Transit 2026: ఆగస్టు 9 నుంచి ఈ 4 రాశుల జాతకం మారబోతోంది.. జాక్పాట్ కొట్టేది వీళ్లే!
Hyderabad, Telangana:Mercury Transit Effect 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడుగా పిలిచే బుధ గ్రహం కదలికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.. బుధుడి మార్పు కారణంగా ద్వాదశ రాశులపై శుభ, అశుభ ప్రభావాలు పడుతూ ఉంటాయి. ఇదిలా ఆగస్టు 9వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బుధుడు తన దిశను మార్చుకోబోతున్నాడు.. ఈ అరుదైన సంచారం వల్ల 4 రాశుల వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు, ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాట తీరు కూడా పూర్తిగా మారుతుంది.. వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల విశేష ప్రయోజనాలు పొందనున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారు అద్భుతమైన లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ జాక్ఫాట్:
మిథున రాశి (Gemini)
మిథున రాశి అధిపతి బుధుడే కావడం వల్ల వీరికి మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవితానికి, ఉద్యోగానికి మధ్య చక్కని సమతుల్యత లభిస్తుంది.. ఆఫీసులో పైఅధికారుల నుంచి ప్రశంసల లభించడమే కాకుండా అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలు సులువుగా పరిష్కారమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. కొత్త ఉత్సాహంతో పనిచేసేవారు ఈ సమయంలో తప్పకుండా ఆర్థికంగా బలంగా స్థిరపడే ఛాన్స్లు ఉన్నాయి..
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయంలో సరికొత్త మార్గాలు చూసే ఛాన్స్లు ఉన్నాయి.. ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురవుతున్న అవాంతరాలు తొలగిపోతాయి. ప్రత్యర్థులతో పాటు శత్రువుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.. ఆఫీస్ పాలిటిక్స్ నుంచి కూడా వీరికి తప్పకుండా విముక్తి కలుగుతుంది. ఊహించని విధంగా అకస్మాత్తుగా ధనలాభాలు కూడా కలుగుతాయి..
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి బుధుడి ప్రభావంతో అద్బుతమైన ప్రయోజనాలు కలిగే ఛాన్స్లు ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎంతటి పెద్ద సమస్యలనైనా ఈ సమయంలో తప్పకుండా పరిష్కరమయ్యే ఛాన్స్లు ఉన్నాయి.. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. వృత్తిపరంగా మీ పనితీరు మెరుగ్గా మారి ప్రమోషన్ లేదా జీతం విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ బుధుడి సంచారం ప్రభావంతో అత్యంత కీలకమైన అవకాశాలు కూడా లభిస్తాయి. సుదూర ప్రయాణాలు లాభదాయకంగా సాగే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొని.. మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది. వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సువర్ణ సమయంగా భావించవచ్చు. మీ మాట తీరు కూడా పూర్తిగా మారిపోతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
