ఐద్వా రాష్ట్ర శిక్షణ తరగతులు: మల్లు లక్ష్మి పిలుపు
Karimnagar, Telangana:ఐద్వా తెలంగాణ రాష్ట్ర శిక్షణ తరగతులు జులై 26-29 తేదీల్లో కరీంనగర్లో జరుగుతాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మహిళల సమస్యలపై పోరాడుతున్న ఐద్వా వరకట్న వేధింపులు, అత్యాచారాలు, హత్యలపై కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, సమాన వేతనం, చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం పోరాడుతోందని ఆమె పేర్కొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Priest Video: పడవ ప్రయాణంలో బరితెగించిన పూజారి.. చెప్పులతో బుద్ధి చెప్పిన మహిళా భక్తులు.. వీడియో!
Hyderabad, Telangana:Priest Harassment Video Watch Now: భక్తులకు ఆధ్యాత్మిక మార్గం చూపించాల్సిన ఒక పూజారి కామంతో కళ్ళు మూసుకుపోయినట్లు ప్రవర్తించారు. పవిత్రమైన వృత్తిలో ఉండి.. తోటి ప్రయాణికులు అని కూడా చూడకుండా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి.. అడ్డంగా బుక్కయ్యాడు. పడవ ప్రయాణంలో మహిళను లైంగికంగా వేధించిన పూజారికి.. అక్కడే ఉన్న మహిళలు సినీ ఫక్కీలో దేహశుద్ధి చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియక పోయినప్పటికీ.. మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక ప్రాంతంలో నదిని దాటడానికి భక్తులతో పాటు.. కొంతమంది స్థానికులు కూడా పడవని ఎక్కారు. అదే పడవలో ఒక ఆలయ పూజారి కూడా ఉన్నాడు. ప్రయాణం సాగుతుండగా.. చివరికి ఒడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత సదరు పూజారి తన పక్కనే ఉన్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఆమెను లైంగికంగా వేధించడం ప్రారంభించాడు.
పూజారి వికృత చేష్టలతో విసిగిపోయిన సదరు మహిళ గట్టిగా నిలదీయడంతో.. పడవలోని ఇతర మహిళలు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. పూజారి అని కూడా చూడకుండా అతడిని వారంతా నిలదీశారు. అయితే, తప్పు ఒప్పుకోవాల్సింది పోయి.. ఆ పూజారి ఎదురుదాడికి దిగాడు.. మహిళలపై విచక్షణ రహితంగా చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో జరిగిన చిన్న పెనుగులాటలు మహిళల దుస్తులు కూడా చిరిగిపోయాయి. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న మహిళలు ఒక్కసారిగా పూజారిపై విరుచుకుపడి దాడి చేశారు. కొంతమంది చేతులతో పాటు చెప్పులతో గట్టిగా పూజారికి బుద్ధి చెప్పారు.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
మహిళల ఆగ్రహం ముందు అతను నిలువలేనని గ్రహించి.. ఆ పూజారి పడవ బొడ్డుకు చేరుకోకముందే ప్రాణభయంతో నీటిలోకి దూకేశాడు. గజ ఈత గాడిలా నీటిలోని ఈదుకుంటూ అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ.. ఇతర పడవలో ఉన్న ప్రయాణికులు మొబైల్లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. పూజారివేషంలో ఉన్న కామాంధుడు అంటూ.. సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలు వ్యక్తం చేయడమే కాకుండా ఆగ్రహంతో కామెంట్లు పెడుతున్నారు..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
World Health Day 2026: యోగా ఇంత పనిచేస్తుందా? రోజు 30 నిమిషాలు చాలు..ఎంత ఒత్తిడి అయినా క్షణంలో మాయం!
Le Grand-Saconnex, Genève:World Health Day 2026 News: ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో "ఆరోగ్యం కోసం విజ్ఞానంతో కలిసి నిలబడదాం" అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు. యోగా, మనం ప్రతిరోజూ చేసే ఇతర పనులు ఆరోగ్యంగా ఉండటానికి ఎలా సహాయపడతాయో ఇది వివరించే ప్రయత్నం చేస్తుంది.
ఆరోగ్య, వెల్నెస్ నిపుణుల సలహా ప్రకారం.. "చాలా మందికి సరిగ్గా నిద్ర పట్టదు. వారికి జీవనశైలి సమస్యలు కూడా ఉంటాయి. యోగా నిద్ర, హార్మోన్లు, మానసిక ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది. యోగా, నిద్ర ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. మన శరీరం సరిగ్గా పనిచేయడానికి నిద్ర అవసరం. చాలా మంది ఒత్తిడికి గురై, ఎల్లప్పుడూ తమ మొబైల్స్, టీవీని చూస్తూ ఉండటం వల్ల సరిగ్గా నిద్రపట్టదు. అందుకు యోగా ఎంతో సహకరిస్తుంది. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం సహా విశ్రాంతిని కలుగుజేస్తుంది.
"మనం యోగా చేసేటప్పుడు లోతుగా శ్వాస తీసుకుంటాం. ధ్యానం చేస్తాం. ఇది మన శరీరంలో ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. మనం బాగా నిద్ర పోయే క్రమంలో రోగనిరోధక శక్తి అనారోగ్యంతో పోరాడగలదు. అంతేకాకుండా మనసు ఆహ్లాదంగా ఉంటుంది. రోజూ మనం పడుకునే ముందు యోగా చేస్తే, నిద్ర బాగా పట్టే అవకాశం ఉంది. మనకు నిద్రపట్టడంలో ఇబ్బంది ఉండదు. అర్ధరాత్రి మనకు మెలకువ రాదు" అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మానసిక ఆరోగ్యానికి కూడా యోగా చాలా ముఖ్యం. సాధారణంగా చాలా మంది ఆందోళన, కుంగుబాటుతో బాధపడుతుంటారు. యోగా దీనికి సహాయపడుతుంది. ఇది మనకు మంచి అనుభూతిని కలిగించి, ఒత్తిడిని తగ్గిస్తుంది. మనం యోగా చేసేటప్పుడు ఏకాగ్రతతో ఉంటాము. లోతుగా శ్వాసిస్తాము. ఇది మనకు ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడుతుంది. నగరాల్లో ప్రజలు ఎప్పుడూ ఒత్తిడికి, అలసటకు గురవుతారు. వారు ఎక్కువగా పని చేస్తారు. ఎల్లప్పుడూ తెరలనే చూస్తూ ఉంటారు. యోగా దీనికి సహాయపడుతుంది.
మన శరీరంలో హార్మోన్లు సందేశవాహకాలుగా పనిచేస్తాయి. అవి మనకు సంతోషాన్ని, నిద్రను కలిగిస్తాయి. మనం ఒత్తిడికి గురైనప్పుడు, మన హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. యోగా దీనికి సహాయపడుతుంది. ఇది హార్మోన్లను సమతుల్యం చేసి, మన శరీరం సరిగ్గా పనిచేయడానికి సాయపడుతుంది. మనం బాగా నిద్రపోయినప్పుడు, మన హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. మనం బాగున్నట్లు భావిస్తాము.
యోగా రోగనిరోధక వ్యవస్థను కాపాడుతుంది. ఈ రక్షణ కవచాన్ని బలోపేతం చేయడానికి యోగా సహాయపడుతుంది. మనం యోగా చేసినప్పుడు, మనకు నిద్ర బాగా పడుతుంది. మనం అంతగా ఒత్తిడికి గురికాము. ఇది మన శరీరం అనారోగ్యాలతో పోరాడటానికి సహాయపడుతుంది. యోగా మన రక్త ప్రసరణకు సహాయపడుతుంది. మన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ లభిస్తుంది.
"యోగ అనే పదం 'యుజ్' అనే సంస్కృత పదం నుండి వచ్చింది, దీని అర్థం శరీరం, మనస్సు, శ్వాసను ఏకం చేయడం లేదా కలపడం. ఇది వేల ఏళ్ల నాటి భారతీయ జ్ఞానం, శారీరక ఆసనాలు, శ్వాస నియంత్రణ (ప్రాణాయామం), ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఆధ్యాత్మిక సమతుల్యతను సాధించే ఒక జీవన విధానం. ఇది శాస్త్రం ద్వారా కూడా సమర్థించబడిన ఒక జీవన విధానం. మనం ప్రతిరోజూ యోగా చేస్తే, మనకు మంచి నిద్ర పడుతుంది, ఒత్తిడి తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాము. మనం దీనిని ఎక్కువ కాలం చేయవలసిన అవసరం లేదు. రోజుకు 20-30 నిమిషాలు కూడా పెద్ద మార్పును తీసుకురాగలవు," అని డాక్టర్ మిశ్రా వివరిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 నాడు.. ఆరోగ్యంగా ఉండటం అంటే కేవలం అనారోగ్యం లేకపోవడం మాత్రమే కాదని మనకు గుర్తు చేస్తుంది. అది మన శరీరాలను జాగ్రత్తగా చూసుకోవడం, అనారోగ్యాన్ని నివారించడం గురించి కూడా ఆలోచింపజేస్తుంది. దీన్ని చేయడానికి యోగా ఒక మార్గం. ఇది మనం బాగా నిద్రపోవడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఒక నిమిషం పాటు ధ్యానం చేయడం ద్వారా మీ యోగా సాధనను ప్రారంభించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
DC Vs MI Match Preview: ఢిల్లీ క్యాపిటల్స్ Vs ముంబై ఇండియన్స్..ఈ మ్యాచ్లో గెలిచేది వీళ్లే! ప్లేయింగ్ 11లో ఎవరున్నారో తెలుసా?
New Delhi, Delhi:DC Vs MI Match Preview 2026: ఐపీఎల్ 2026లో నేడు అనగా ఏప్రిల్ 4వ తేదీన డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఈ లీగ్లో ఇప్పటి వరకు ఢిల్లీ, ముంబై జట్లు ఆడిన ఒక మ్యాచ్లోనూ విజయం సాధించారు. అయితే పాయింట్ల పట్టికలో రన్రేట్ వ్యత్యాసంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 4వ స్థానంలో ఉండగా.. ముంబై ఇండియన్స్ జట్టు 5వ స్థానంలో ఉంది.
ఈ వారం ప్రారంభంలో జరిగిన తమ ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. లక్నో సూపర్ జెయింట్స్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించగా.. గత వారం కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించిన ముంబై ఇండినయన్స్ జట్టు ఈ సీజన్ను గెలుపుతో ప్రారంభించింది. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో ముంబై 6 వికెట్ల తేడాతో గెలుపొందినా.. నేడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్ మరింత సవాళ్లను కూడుకున్నది. ఇటీవలే లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బలంగా కనిపిస్తోంది. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ వంటి అద్భుతమైన బౌలర్లు ఢిల్లీ వైపు ఉన్నారు.
మరోవైపు ఇటీవలే కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 5 బంతులు మిగిలుండగానే 221 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ముంబై జట్టు కూడా ఢిల్లీ క్యాపిటల్స్కు మంచి పోటీ ఇస్తుంది. అయితే జట్టులో వారి వారి బలాబలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీతో మ్యాచ్కు మిచెల్ శాంట్నర్ అందుబాటులోకి రావడంతో ముంబై మరింత బలంగా కనిపిస్తోంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ మ్యాచ్లో అందుబాటులో లేడు.
ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు గతంలో తలపడిన మ్యాచ్ల ఫలితాల ఆధారంగా ముంబై ఇండియన్స్దే పైచేయి కనిపిస్తుంది. వారిద్దరూ కలిసి ఆడిన 6 మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 5 సార్లు ఓడారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఇదో పెద్ద అడ్డంకిగా మారనుంది.
అంతేకాకుండా మ్యాచ్ జరుగుతున్న అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్ బ్యాటింగ్కు అనువుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి ముంబై ఇండియన్స్ జట్టులో బ్యాటర్లు ప్రణాళికలు రచిస్తున్నారు. ఐపీఎల్ 2025లో అరుణ్ జైట్లీ స్టేడియంలో మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 203 పరుగులుగా ఉంది. ఐపీఎల్ 2025లో కోల్కతా నైట్ రైడర్స్పై సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యధికంగా 278/3 స్కోరు రాబట్టిన పిచ్ నంబరు 6పై ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడనున్నారు.
కేఎల్ రాహుల్, నితీష్ రాణా, పతుమ్ నిస్సంక, సమీర్ రిజ్వీ, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ వంటి పటిష్టమైన ఆటగాళ్లు ఢిల్లీ పిచ్పై మంచి స్కోరు చేసే అవకాశం ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ జట్టులో రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, మిచెల్ శాంట్నర్ కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. ఒకవేళ ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేస్తే.. భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగే సత్తా ఆ జట్టు బ్యాటర్లలో ఉంది.
బౌలింగ్ విషయంలో ఇరు జట్లూ సమానంగా ఉన్నాయి. ఢిల్లీ టీమ్కు చెందిన విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, ముఖేష్ కుమార్, టి నటరాజన్ ముంబైని ఇబ్బంది పెట్టగలరు. అదే విధంగా ముంబై జట్టులో కూడా మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే, ట్రెంట్ బౌల్ట్ వంటి అగ్రశ్రేణి బౌలర్లు ఉన్నారు. కానీ, బ్యాటింగ్ బలంగా ఉంటేనే ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిచేందుకు ముంబైకి ఇది మంచి అవకాశంగా కనిపిస్తుంది.
DC vs MI తుది జట్లు అంచనా..
ముంబై ఇండియన్స్ జట్టు: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, షెర్ఫానే రూథర్ఫోర్డ్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే, ట్రెంట్ బౌల్ట్.
ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు: కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ/అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, లుంగీ ఎన్గిడి, ముఖేష్ కుమార్, టి నటరాజన్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Robbery CCTV Video: పెప్పర్ స్ప్రే కొట్టి ఉంగరాలతో పరార్.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో!
Hyderabad, Telangana:Robbery In Jewelry CCTV Video Watch Now: నిత్యం రద్దీగా ఉండే నగరాల్లో దొంగలు కొత్త కొత్త మార్గాలతో విరుచుకుపడుతూ ఉంటారు. ఇప్పటివరకు షాపు తాళాలు పగలగొట్టడం.. కత్తులతో బెదిరించడం వంటివి చూశాం.. కానీ ఒక దొంగ ఏకంగా యజమాని కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టి అత్యంత సాహసోపేతంగా దొంగతనానికి పాల్పడ్డ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జువెలరీ షాపులో జరిగిన ఈ వింత దొంగతనం దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వగా..ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ను ఊపేస్తోంది.. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక వ్యక్తి సాధారణ కష్టమార్ లాగా.. జువెలరీ షాపులోకి ప్రవేశించడం మీరు చూడొచ్చు. షాపులో యజమాని బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వచ్చాడు అనుకోని ఎంతో సాదరంగా ఆహ్వానించడం కూడా మీరు చూడొచ్చు. అయితే ఆ యజమాని అతను అడిగిన ఉంగరాలను చూపించడం ప్రారంభించడం మీరు వీడియోలో గమనించవచ్చు. ఆ వ్యక్తి కొన్ని ఉంగరాలని ఎంపిక చేసుకొని.. వాటిని తూకం వేయమని యజమానిని కోరాడు.. ఆ యజమాని ఆ ఉంగరాలను తీసుకొని తూక యంత్రంలో వేసే సమయంలోనే.. ఇదే సరైన సమయంగా భావించి ఆ దొంగ తన జేబులో ఉన్న పెప్పర్ స్ప్రే బయటికి తీశాడు. యజమాని పేరుకునే లోపే నేరుగా అతని కళ్ళల్లోకి స్ప్రే చేసేసాడు..
కళ్ళు విపరీతంగా మండడంతో యజమాని విలవిలలాడుతుండగా.. ఆ దొంగ యజమాని చేతిలో ఉన్న బంగారు ఉంగరాలను లాక్కొని రెప్పపాటు కాలంలో షాపు బయటకు పరుగులు తీయడం కూడా మీరు ఈ వీడియోలో ఎంతో క్లియర్ గా చూడొచ్చు.. ఈ దొంగతనానికి సంబంధించిన విజువల్స్ షాప్ లోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దొంగ ముఖంతో పాటు అతను స్ప్రే కొట్టిన తీరు.. యజమాని నిస్సహాయత అన్ని కెమెరాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు దొంగ తెగింపును చూసి ఆశ్చర్యపోతున్నారు. చాలా సింపుల్ గా పనిచేసి ముగించేశాడు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు..
మరి కొంతమంది అయితే జువెలరీ షాప్ ఉన్న ప్రతి యజమాని ఇకనుంచి తప్పకుండా కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తుందేమోనని అంటూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు వ్యాపారస్తులను అప్రమత్తం చేస్తున్నారు. షాపుల్లోకి వచ్చే అపరిచిత వ్యక్తుల కదలికలపై తప్పకుండా నిఘా ఉంచాలని సూచిస్తున్నారు. ఖరీదైన వస్తువులను చూపించేటప్పుడు కౌంటర్ వద్ద తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న సమయాల్లో అప్రమత్తత చాలా అవసరమని వారు సూచిస్తూ వస్తున్నారు.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Gas Cylinder Theft Video: రూటు మార్చిన దొంగలు.. బంగారం కాదు.. గ్యాస్ సిలిండర్ల పైనే కన్ను! వీడియో
Hyderabad, Telangana:Gas Cylinder Theft Video Watch Here: సాధారణంగా దొంగలు బంగారం లేదా ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లడం చూస్తూ ఉంటాం.. కానీ హర్యానాలోని యమునానగర్లో దొంగలు ఇప్పుడు తమ రూటు మార్చారు. సామాన్యుడి వంటింట్లో మండుతున్న గ్యాస్ సిలిండర్ పై కన్నేశారు.. అత్యంత సాహసోపేతంగా.. కదులుతున్న వాహనం నుంచే సిలిండర్ లను మాయం చేస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. ఈ సినీ పక్కిలో జరిగిన దొంగతనం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
యమునానగర్ వీధుల్లో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే ఒక ఆటో రిక్షా వేగంగా రోడ్డుపై వెళ్తోంది.. అయితే, ఈ వాహనం అందరూ ఉన్న రద్దీ రోడ్డుపైనే వెళ్తుండగా.. ఒక యువకుడు అత్యంత చాకచక్యంగా ఆ కదులుతున్న వాహనం వెనుక భాగంలో ఎక్కాడు.. క్షణాల్లోనే ఒక నిండు గ్యాస్ సిలిండర్ను బయటకు లాగి రోడ్డుపై పడేసాడు.. ఆ తర్వాత వాహనం ముందుకు వెళ్లగానే.. ఏమి ఎరగనట్టుగా.. ఆ వాహనం నుంచి కిందికి దిగి గ్యాస్ సిలిండర్తో పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని ఉన్న ఒక దుకాణం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి..
ఈ ఘటనపై గ్యాస్ సరఫరా వాహన డ్రైవర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తన కెరీర్లో ఇలాంటి దొంగతనాన్ని ఎప్పుడూ చూడలేదని తెలిపాడు. తను ఆ ఆటోను నడుపుతున్నప్పుడు.. ఎక్కడ ఇక్కడ గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలని.. ముందుగానే గమ్యస్థానాలను ఎంచుకొని వాహనంతో ముందుకెళ్తారని..ఈ ఆందోళనలో భాగంగానే ఆటో వెనుక భాగంలో ఏం జరుగుతుందో దృష్టి పెట్టలేకపోయాడని తెలిపాడు. సీసీటీవీ ఫుటేజీ చూశాక నా కళ్లు బైర్లు కమ్మాయని.. గతంలో ఇలా ఎప్పుడు జరగలేదని అతను వాపోయాడు..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
ప్రస్తుతం మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరగడం వల్ల.. పంపిణీలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో దొంగలు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పట్టపగలే.. అందరూ చూస్తుండగానే ఎంత సాహసోపేతంగా దొంగతనం జరగడం స్థానికులను భయాందోళనకు కూడా గురిచేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.. గ్యాస్ సిరప్రా చేసే ఏజెంట్లు తమ వాహనాలకు రక్షణగా ఇనుప గ్రిల్స్ తో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
CSK vs PBKS: చెన్నై వరుసగా రెండో ఓటమి.. అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ రెండో విజయం
Chennai, Tamil Nadu:PBKS Beat CSK By 5 Wickets: ఆటగాళ్లు మారారు.. వ్యూహం మారింది.. ఇక సత్తా చాటుతుందనుకుంటే మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదే పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. సొంత గడ్డపైనే మరో పరాజయాన్ని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. విజయం కోసం పోరాడినా కూడా పరాజయం నుంచి చెన్నై తప్పించుకోలేకపోయింది. 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయాన్ని ఖాతాలో వేసుకుని ఈ సీజన్లో ముందడుగు వేసింది.
Also Read: Sunrisers Hyderabad: సన్ రైజర్స్కు సొంత గడ్డపై భారీ షాక్.. ఆఫీస్ ముందు తెలంగాణ క్రికెటర్ల ధర్నా
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ 7 పరుగులతో మళ్లీ నిరాశపర్చగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 28 పరుగులతో పర్వాలేదనిపించాడు. యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రే బ్యాట్తో దుమ్మురేపాడు. 43 బంతుల్లో 73 పరుగులు చేసి సంచలన ప్రదర్శన కనబర్చాడు. 6 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. శివమ్ దూబే 27 బంతుల్లో 45 పరుగులు (నాటౌట్) చేసి కొద్దిలో అర్ధ సెంచరీ కోల్పోయాడు. కార్తీక్ శర్మ ఒక పరుగే చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ 32 పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లు పరుగులను నియంత్రిస్తూనే వికెట్లు తీశారు. విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు తీయగా.. బార్ట్లెట్, మార్కో జేన్సన్, యుజువేంద్ర చాహల్ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.
Also Read: Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఇదే జరిగితే పర్స్ ఫుల్
చెన్నై విధించిన లక్ష్యాన్ని 18.4 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేయగా.. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రియాన్ష్ ఆర్య 11 బంతుల్లో 39 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 43 పరుగులు చేసి దూకుడుగా ఉన్న సమయంలో ప్రభుసిమ్రాన్ సింగ్ రనౌటయ్యాడు. తొటి బ్యాటర్తో సమన్వయం లేక రనౌట్గా వెనుదిరిగాడు. గత మ్యాచ్లో అదరగొట్టిన కూపర్ కన్నోల్లీ 36 పరుగులతో రాణించగా.. నేహాల్ వదేరా 10 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ 14 పరుగులు నమోదు చేయగా.. మార్కస్ స్టోయినీస్ 9 పరుగులు చేసి విజయంతో ముగించాడు. గెలుపు కోసం చెన్నై బౌలర్లు ఏమాత్రం శ్రమించలేకపోయారు. తొలి ఓవర్ నుంచి బ్యాటర్లను నిలువరించలేకపోయారు. మ్యాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ రెండేసి వికెట్లు తీయగా మిగతా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
Also Read: Pakistan Petrol Price: పాకిస్థాన్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంతో తెలుసా?
టాప్కు.. డౌన్కు
ఈ మ్యాచ్ ఫలితం ఐపీఎల్ పాయింట్లలో భారీ మార్పులు వచ్చాయి. రెండో విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి దూసుకెళ్లగా.. రెండో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానానికి పడిపోయింది. పంజాబ్ కింగ్స్ విజయంపై కాకుండా చెన్నై ఓటమిపై మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పటి గొప్ప జట్టు గత సీజన్తోపాటు తాజా సీజన్లో ఇంతటి పేలవ ప్రదర్శన చేయడం చెన్నై అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. అయితే ధోనీ నాయకత్వం లేకపోవడంతో చెన్నై వరుసగా ఓటమిపాలవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Delhi NCR Earthquake: రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం..ఉత్తర భారతంలో గజగజ వణికిన ఐదు రాష్ట్రాలు..పారిపోయిన జనం!
Gurugram, Haryana:Delhi NCR Earthquake News: శుక్రవారం రాత్రి (ఏప్రిల్ 3) ఢిల్లీ-ఎన్సిఆర్లో భూకంపం సంభవించింది. ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్తో సహా అనేక రాష్ట్రాల్లో భూమి కంపించింది. పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్లలో కూడా భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
అయితే ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ పర్వతాలలో ఉంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలో సుమారు 10 నుండి 15 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు తెలిసింది. అయితే భూకంపం కారణంగా భయపడిన ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పారిపోయినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ అనే నాలుగు దేశాల్లో భూకంప ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్, భారత్ రాజధాని న్యూఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం రాత్రి సమయంలో ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రకంపనలు జమ్మూ కాశ్మీర్తో సహా ఉత్తర భారతంతో అనేక ప్రాంతాల్లో సంభవించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KKR vs SRH: కేకేఆర్కు రెండో ఓటమి.. 46 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం
Kolkata, West Bengal:KKR vs SRH Highlights: ఆల్ రౌండ్ ప్రదర్శనతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలర్లు బంతులతో చెలరేగి కలకత్తా నైట్రైడర్స్ జట్టును చిత్తు చేశారు. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన సన్రైజర్స్ రెండో మ్యాచ్కు గొప్పగా పుంజుకుని ఆడి మ్యాచ్ను సొంతం చేసుకుంది. కలకత్తాపై 65 పరుగుల భారీ తేడాతో సన్రైజర్స్ విజయం సాధించింది. అన్నింటిలో విఫలమైన కలకత్తా రెండో ఓటమిని చవిచూసింది.
Also Read: Harsha Veena: బ్రేకింగ్.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన పార్టీ దాడి
ఐపీఎల్ 2026 సీజన్లో ఆరో మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగ్గా.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కలకత్తా జట్టు 16 ఓవర్లలోనే 161కి కుప్పకూలిపోయింది. సన్రైజర్స్ బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా ఆడడంతో కలకత్తాను సునాయాసంగా ఓడించారు. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక ఓటమి.. విజయంతో సన్రైజర్స్ ఉండగా.. కలకత్తా జట్టు మాత్రం ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమిని చవిచూసింది.
Also Read: Chandrababu: అమరావతి అన్స్టాపబుల్.. ఇక రాజధానిపై ఎవరూ ఏం చేయలేరు: సీఎం చంద్రబాబు
తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ అద్భుతంగా ఆడి 226 పరుగులు సాధించింది. తొలి ఓవర్ నుంచి ఓపెనర్లు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో పవర్ ప్లే ముగిసేసరికి స్కోర్ 80 పరుగులు దాటింది. పదో ఓవర్ వచ్చేసరికి సన్రైజర్స్కు కష్టాలు మొదలయ్యాయి. ఒక్క బ్యాటర్ కూడా భారీ హిట్టింగ్ చేయలేకపోయారు. అందరూ ఔటవుతున్న వేళ క్లాసెన్ అద్భుతంగా ఆడి జట్టుకు భారీ పరుగులు అందించాడు. 35 బంతుల్లో 52 పరుగులు చేయగా... వాటిలో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అంతకుముందు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ భారీ హిట్టింగ్లతో శుభారంభం చేశారు. హెడ్ 21 బంతుల్లో 46 చేసి 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదితే.. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 చేసి కొద్దిలో అర్ధ శతకాన్ని కోల్పోయాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 14 పరుగులు మాత్రమే చేయగా. అనికేత్ వర్మ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. అనంతరం నితీశ్ కుమార్ 39 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. హర్ష్ దూబే (9), శివాంగ్ కుమార్ (4) కొన్ని పరుగులు జోడించారు. కలకత్తా బౌలర్లు పవర్ప్లేతోపాటు కొన్ని ఓవర్లు బ్యాటర్లకు అనుకూలంగా వేయగా.. తర్వాత తేరుకుని బ్యాటర్లను బంతికి దొరకబుచ్చుకుని మైదానం నుంచి పంపించారు. బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్లతో దుమ్మురేపగా.. వైభవ్ అరోరా రెండు, కార్తీక్ త్యాగి, అనుకూల్ రాయ్ తలా ఒక్కో వికెట్ తీశారు.
భారీ లక్ష్యాన్ని ఛేదనకు దిగిన కలకత్తా నైట్రైడర్స్ బ్యాటర్లు టపాటపా వికెట్లు కోల్పోయి 161 పరుగులకు మ్యాచ్ను 16 ఓవర్లలోనే ముగించారు. అంగ్క్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టు విజయానికి మార్గం చూపించాడు. కెప్టెన్ అజింక్యా రహనే 8 పరుగులకే ఔటవగా.. ఫిన్ అలెన్ 28 పరుగులతో రాణించాడు. గ్రీన్ రెండు పరుగులకే ఔటయిన పరిస్థితుల్లో మిగతా బ్యాటర్లు కూడా అదే మార్గంలో నడించారు. రింకూ సింగ్ 35 పరుగులతో రాణించగా.. అనుకూల్ రాయ్ డకౌట్ అయ్యాడు. బ్యాటర్లు చేసిన భారీ స్కోర్ను ప్రత్యర్థి బ్యాటర్లు చేయలేక సన్రైజర్స్ బౌలర్లు పటిష్టంగా బంతులు వేశారు. ఈసారి బౌలర్లకు మంచి అవకాశాలు లభించడంతో వారు రెచ్చిపోతున్నారు. ఈ విజయంతో సన్రైజర్స్ పైకి దూసుకెళ్లగా.. కలకత్తా రెండో ఓటమితో తీవ్ర దిగాలుగా పట్టికలో ఆఖరు స్థానంలో నిలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఇదే జరిగితే పర్స్ ఫుల్
Wadgaon, Maharashtra:Salary Likely Hike 34 Percent: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెరగాలని ఆశిస్తున్నారు. ఆదాయం పెరగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగ వర్గాలు 8వ వేతన సంఘం కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. వేతనాలు, పింఛన్లు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్న వారికి కొంత ఊరట లభించే విషయం తెలిసిందే. 8వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై వార్తలు వెలువడుతున్నాయి. ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం భారీగా జీతాల పెంపు ఉంటుందని తెలుస్తోంది.
Also Read: Pakistan Petrol Price: పాకిస్థాన్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంతో తెలుసా?
8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకంగా ఉంది. ఆ ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో జీతం భారీగా పెరుగుతుందని చర్చ జరుగుతోంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉంటే దానికి అనుగుణంగా జీతాల పెంపు 34 శాతం పెరుగుతాయని తెలుస్తోంది. ఆ మేరకు వేతన సంఘం సిఫార్సు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే 2026 జనవరి 1 నుంచి 49 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు సుమారు 34 శాతం పెరగవచ్చు.
Also Read: Traffic Alert: వాహనదారులకు అలర్ట్.. ఎల్లుండి జూబ్లీహిల్స్ ప్రధాన రోడ్డు క్లోజ్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల కోసం 7వ వేతన సంఘం స్థానంలో 8వ వేతన సంఘం అమలులోకి వస్తుంది. రాబోయే 8వ వేతన సంఘం దాదాపు 49 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68 లక్షల పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది. కొత్త వేతన సంఘం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను పరిగణనలోకి తీసుకుంటోంది. దీంతో జీతాలు, పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉండవచ్చని ఆశిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనాన్ని సవరించడానికి ఉపయోగించే కీలక గుణకం ఫిట్మెంట్ ఫ్యాక్టర్. దీనికి ఆమోదం లభిస్తే మొత్తం జీతం, అలవెన్సులలో సగటున సుమారు 34 శాతం పెరుగుదల ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇది ఉద్యోగులతోపాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read: KKR vs SRH: కేకేఆర్కు రెండో ఓటమి.. 46 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం
జీతం పెరుగుదల ఎంత?
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఇప్పటికే ఉన్న బేసిక్ పేనును నేరుగా గుణిస్తుంది
ప్రస్తుత మూల వేతనం రూ.18,000 ఉందని అనుకుంటే 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో కొత్త మూల వేతనం = రూ.18,000 × 2.57 = రూ.46,260 అవుతుంది. దీని అర్థం మూల వేతనంలో గణనీయమైన పెరుగుదల జరుగుతుంది. డీఏ, హెచ్ఆర్ఏ వంటి అలవెన్సులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Nithin Kamath: మార్కెట్ మునిగిపోకముందే మేల్కోండి.. యుద్ధం వస్తే ఇన్వెస్టర్ల గతి ఏంటి? ఇన్వెస్టర్లకు జెరోధా బాస్ వార్నింగ్..!!
Lakshmapur, Telangana:How to Protect Portfolio during War: ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లు యుద్ధ మేఘాల నీడలో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఆకాశాన్నంటుతున్న ముడి చమురు ధరలు ఇన్వెస్టర్లకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే నిఫ్టీ 10 శాతం మేర పతనమై.. అనేక మంది పోర్ట్ఫోలియోలు ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో నితిన్ కామత్ తన ఎక్స్ వేదికగా ఇన్వెస్టర్లకు ఒక ముఖ్యమైన హెచ్చరికతో కూడిన సలహాను ఇచ్చారు.
99 శాతం మంది చేసే పొరపాటు ఇదే:
చాలా మంది ఇన్వెస్టర్లు ఏదో ఒక రంగం ఉదాహరణకు ఐటీ లేదా ఫార్మా బాగా లాభాలను ఇస్తుందని భావించి, తమ వద్ద ఉన్న డబ్బునంతా అందులోనే పెట్టుబడి పెడతారు. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు ఇది బాగానే ఉన్నా.. పరిస్థితులు మారినప్పుడు ఆ ఒక్క సెక్టార్ పడిపోతే మొత్తం పెట్టుబడి ఆవిరైపోతుంది. 99 శాతం మంది పెట్టుబడిదారులు ఏ ఆస్తి ఏ సమయంలో బాగా పనిచేస్తుందో ఖచ్చితంగా ఊహించలేరు అని నితిన్ కామత్ స్పష్టం చేశారు. అందుకే ఒకే గుర్రం మీద పందెం కాయడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
నిజమైన వైవిధ్యీకరణ అంటే ఏమిటి?
చాలా మంది ఐదు వేర్వేరు కంపెనీల షేర్లు కొంటే డైవర్సిఫికేషన్ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నితిన్ కామత్ ప్రకారం, నిజమైన వైవిధ్యం అంటే మీ పెట్టుబడులను కేవలం స్టాక్ మార్కెట్కే పరిమితం చేయకుండా వివిధ ఆస్తుల మధ్య పంపిణీ చేయడం.
బంగారం : యుద్ధం లేదా ఆర్థిక మాంద్యం వంటి సమయాల్లో షేర్లు పడిపోయినా, బంగారం ధరలు పెరిగి మీ నష్టాన్ని భర్తీ చేస్తాయి.
బాండ్లు : ప్రభుత్వ బాండ్లు స్థిరమైన రాబడినిస్తూ మీ పోర్ట్ఫోలియోకు రక్షణగా నిలుస్తాయి.
విభిన్న రంగాలు: షేర్లలో కూడా కేవలం ఒక్క రంగంపైనే కాకుండా బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి.
ఇన్వెస్టర్లు నేర్చుకోవాల్సిన పాఠం:
నితిన్ కామత్ తన సహోద్యోగి పోర్ట్ఫోలియోను ఉదాహరణగా చూపుతూ.. ఎవరైతే తమ పెట్టుబడులను సమతుల్యంగా పంచుకుంటారో, వారే దీర్ఘకాలంలో మార్కెట్ ఇండెక్స్ కంటే ఎక్కువ లాభాలను ఆర్జిస్తారని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ అనిశ్చితిగా ఉన్న సమయంలో కొత్త ఇన్వెస్టర్లు తొందరపడి ఒక్క థీమ్ వెంట పడకూడదు.
యుద్ధం వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు మార్కెట్ ఏ దిశగా వెళ్తుందో ఎవరూ ఊహించలేరు. కానీ.. మీ ఆర్థిక పునాది కదలకుండా ఉండాలంటే వైవిధ్యీకరణే ఏకైక మార్గం. అన్నీ ఒకే చోట పెట్టకుండా, తెలివిగా పంపిణీ చేస్తేనే ఈ యుద్ధ భూమిలో ఇన్వెస్టర్లు విజేతలుగా నిలుస్తారని చెబుతున్నారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
CBSE New Curriculum: సీబీఎస్ఈ విద్యా వ్యవస్థలో పెను మార్పులు.. ఇకపై 3 భాషలు చదవాల్సిందే..విద్యార్థులపై పెరగనున్న ఒత్తిడి?
Lakshmapur, Telangana:CBSE New Curriculum 2026-27: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 2026-27 విద్య సంవత్సరం నుంచి బోర్డు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. విద్యార్థులపై చదువుల భారాన్ని తగ్గించి.. వారిని గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్ ఈ కొత్త ప్రణాళికలను వెల్లడించారు. కేవలం అకడమిక్ మార్కులే కాకుండా.. విద్యార్థి ప్రవర్తన, ఆసక్తులు, ఇతర కళలను కూడా ఈ కొత్త విధానం గుర్తిస్తుంది.
1. మూడు భాషల ఫార్ములా:
ఇప్పటివరకు 9, 10 తరగతుల్లో విద్యార్థులు కేవలం రెండు భాషలను మాత్రమే చదువుతున్నారు. కానీ ఇకపై మూడు భాషలు తప్పనిసరి చేసింది. ఇందులో మరో కీలకమైన విషయం ఏంటంటే.. ఆ మూడింటిలో కనీసం రెండు భాషలు ఖచ్చితంగా భారతీయ భాషలై ఉండాలి. మన దేశంలోని భాషా వైవిధ్యాన్ని గౌరవించడంతో పాటు, విద్యార్థులు తమ సాంస్కృతిక మూలాలను మర్చిపోకుండా ఉండాలనేది బోర్డు ఉద్దేశమని పేర్కొంది.
2. సైన్స్లోనూ 'బేసిక్ - స్టాండర్డ్' ఆప్షన్:
గణితం అంటే భయపడే విద్యార్థుల కోసం ఇప్పటికే మ్యాథ్స్లో రెండు స్థాయిల విధానం ఉంది. ఇప్పుడు అదే ఫార్ములాను సైన్స్కు కూడా వర్తింపజేయనున్నారు. భవిష్యత్తులో డాక్టర్లు లేదా ఇంజనీర్లు కావాలనుకోని వారు.. సైన్స్ను ఒక భారంగా కాకుండా సులభతరమైన స్థాయిలో చదువుకోవచ్చు. దీనివల్ల అనవసరమైన మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
3. 'అడ్వాన్స్డ్' లెవల్:
ఒక సబ్జెక్టుపై ప్రత్యేక ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ లెవల్ ను ప్రవేశపెడుతున్నారు. ఉదాహరణకు.. ఒక విద్యార్థికి మ్యాథ్స్ అంటే ఇష్టమైతే, వారు సాధారణ సిలబస్తో పాటు అడ్వాన్స్డ్ లెవల్ను ఎంచుకోవచ్చు. వీరు వార్షిక పరీక్షలతో పాటు 25 మార్కులకు ప్రత్యేక పరీక్ష రాస్తారు. ఇందులో పాస్ అయితే మార్క్ షీట్లో ప్రత్యేకంగా ఆ ప్రతిభను పొందుపరుస్తారు. ఒకవేళ ఫెయిల్ అయినా సరే.. దాని ప్రభావం మెయిన్ మార్కులపై పడదు. ఇది విద్యార్థులు కొత్త సవాళ్లను స్వీకరించేలా ప్రోత్సహిస్తుంది.
4. క్రెడిట్ సిస్టమ్:
ఉన్నత విద్యలో ఉండే క్రెడిట్ సిస్టమ్ ఇక పాఠశాల స్థాయి నుంచే మొదలవుతుంది. విద్యార్థి ఏడాదిలో ఎన్ని గంటలు చదువుకు వెచ్చించారనే దానిపై ఈ క్రెడిట్లు ఇస్తారు.నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ (NCrF) ప్రకారం, ఏడాదికి 1200 గంటల అభ్యాస సమయం వెచ్చిస్తే 40 క్రెడిట్లు లభిస్తాయి. ఇందులో కేవలం క్లాస్ రూమ్ చదువులే కాకుండా యోగా, స్పోర్ట్స్, సంగీతం, సామాజిక సేవ వంటివి కూడా భాగమవుతాయి. అంటే చదువుతో పాటు ఆటపాటల్లో రాణించినా మీకు క్రెడిట్లు వస్తాయి.
5. 10 సబ్జెక్టులు.. తగ్గిన భారం:
కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు మొత్తం 10 సబ్జెక్టులు (7 కోర్ సబ్జెక్టులు + 3 భాషలు) చదవాల్సి ఉంటుంది. సబ్జెక్టుల సంఖ్య పెరిగినప్పటికీ, సిలబస్ను తగ్గించి అనుభవపూర్వక అభ్యాసం (Experiential Learning) ద్వారా పాఠాలు అర్థమయ్యేలా చేస్తామని బోర్డు హామీ ఇచ్చింది.
మరిన్ని కీలక మార్పులు:
రెండుసార్లు బోర్డు పరీక్షలు: విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి వీలుగా ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించే ఆలోచనలో బోర్డు ఉంది.
సిలబస్ మార్పు: ప్రయోగాత్మక విద్యకు పెద్దపీట వేస్తూ పాఠ్యప్రణాళికను రూపొందిస్తున్నారు.
సీబీఎస్ఈ తీసుకువస్తున్న ఈ మార్పులు విద్యార్థులను కేవలం పరీక్షల యంత్రాలుగా కాకుండా, అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతాయని విద్యావేత్తలు భావిస్తున్నారు. వచ్చే ఏడాది 9వ తరగతిలోకి అడుగుపెట్టే విద్యార్థులు ఈ సరికొత్త విద్యా ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Traffic Alert: వాహనదారులకు అలర్ట్.. ఎల్లుండి జూబ్లీహిల్స్ ప్రధాన రోడ్డు క్లోజ్
Hyderabad, Telangana:Jubilee Hills Traffic Diversion: హైదరాబాద్లో వాహనదారులకు భారీ అలర్ట్. ప్రధాన ప్రాంతం జూబ్లీహిల్స్లో కీలకమైన రహదారిని మూసివేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. స్టీల్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఒకవైపు రోడ్డు మూసివేసి.. వనే వేలోనే రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. కేబీఆర్ పార్క్ మార్గంలో పలు మార్గాల్లో రోడ్డు మళ్లింపు ఉంటుందని.. మూడు గంటల పాటు రోడ్డు మూసివేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Also Read: KKR vs SRH: కేకేఆర్కు రెండో ఓటమి.. 46 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం
హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు చుట్టూ జరుగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ డ్రైవరషన్ ట్రయల్ రన్ చేస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయెల్ డెవిస్ ప్రకటించారు. 'కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఒకరోజు వన్ వే వే ఏర్పాటు. వచ్చే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూడు గంటల పాటు వన్ వే ట్రయల్ రన్ నిర్వహించనున్నాం' అని వెల్లించారు.
ఈ నెల 5వ తేదీన నిర్వహించబోతున్న ట్రాఫిక్ ట్రయల్ డైవర్షన్ రన్ ప్రజలందరూ గమనించాలని సూచించారు. రానున్న రోజుల్లో ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న ట్రయల్ రన్ రూట్లోనే వాహన రాకపోకలను కొనసాగిస్తామని హైదరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయెల్ డెవిస్ తెలిపారు. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు మాదాపూర్కు వెళ్లేందుకు రోడ్డు నంబర్ 2లో డైవర్షన్ తీసుకొని ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, రోడ్ నంబర్ 10 మీదుగా మాదాపూర్ రోడ్డు నంబర్ 45కి వెళ్లేందుకు వన్ వేను ఏర్పాటు చేస్తున్నాం' అని వెల్లడించారు.
Also Read: Harsha Veena: బ్రేకింగ్.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన పార్టీ దాడి
==> రోడ్డు నెంబర్ 45 నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ ముందు నుంచి వన్ వేలో భాగంగా రోడ్ నెంబర్ 2 వైపు వాహనాలు మళ్లిస్తారు.
==> రోడ్డు నెంబర్ 10, 12 నుంచి వచ్చే వాహనాలన్నీ అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ నుంచి జర్నలిస్ట్ కాలనీ బాలకృష్ణ ఇంటి ముందు నుంచి జూబ్లీ చెక్పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్కు చేరుకునేలా దారి మళ్లింపు
హైదరాబాద్ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయెల్ డెవిస్ విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉందని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Strait Of Hormuz: హార్మోజ్ జలసంధి నుంచి గుజరాత్ పోర్టులకు ఎంత దూరం? ఎన్ని కిలో.మీ?
Hyderabad, Telangana:Strait Of Hormuz Distance Telugu News: మధ్య ప్రాచుర్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంటూ వస్తున్నాయి. అమెరికాతో యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జల సంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం ప్రపంచ దేశాలతో పాటు భారతదేశన్ని కూడా తీవ్రంగా కలవర పెడుతోంది. భారత్ తన చమురు అవసరాల కోసం అత్యధికంగా ఈ మార్గం పైనే ఆధారపడుతోంది. అంతేకాకుండా వివిధ వస్తువులకు సంబంధించిన ఎగుమతి దిగుమతి నౌకలు కూడా దీనిగుండానే ఇతర దేశాలకు రవాణా అవుతుంటాయి. అయితే హార్మోజ్ జల సంధి నుంచి భారత్ పశ్చిమ తీరానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసా? కనీసం ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో తెలుసా? వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణ పరిస్థితుల్లో ఇరాన్ తీరంలోని హర్మోజ్ జల సంధి నుంచి భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి షిప్పులు లేదా ఆయిల్ ట్యాంకర్లు పెద్దగా సమయం పట్టదు.. లోడుతో పాటు వాతావరణ పరిస్థితులను బట్టి సాధారణంగా రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో నౌకలు భారత తీరానికి చేరుకుంటాయి. అందుకే భారతదేశము ఏవైనా వస్తువులను మధ్య ప్రాచుర్య దేశాలకు పంపడానికి ఈ జల సంధిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటుంది.
హార్మోజ్ నుంచి గుజరాత్ లోని కాండ్లా పోర్టు దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేవలం 36 నుంచి 40 గంటల్లో షిప్పులు అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి చేరుకోగలుగుతాయి.. ముంబై తీరానికి చేరుకోవడానికి సుమారు 50 నుంచి 55 గంటల సమయం పడుతుంది. ముడిచమురును మోసుకెళ్ళే భారీ ట్యాంకర్లు సగటున గంటకు 13 నుంచి 20 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. ఇంత తక్కువ సమయంలో చమురు భారత్ చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం కనిపిస్తోంది.
Read more: INS Taragiri: భారత నౌకాదళంలోకి తారాగిరి.. శత్రువుల గుండెల్లో వణుకే!
ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో దాదాపు 20 శాతం హార్మోజ్ జల సంధి గుండానే వెళ్తుంది. భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురులో మూడింటి రెండువంతులు ఈ మార్గం నుండే వస్తుంది. సరఫరా నిలిచిపోతే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి భారత్ వద్ద కొన్ని రోజులకు సరిపడా అత్యవసర చమురు నిల్వలు ఉన్నప్పటికీ.. ఇరాన్తో సంప్రదింపులు జరపడం వల్ల హార్మోజ్ జల సంధిలో మన నౌకలకు అనుమతులు లభించుతున్నాయి. దీనివల్ల ముడి చెమురుపై ప్రభావం పడే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Read more: INS Taragiri: భారత నౌకాదళంలోకి తారాగిరి.. శత్రువుల గుండెల్లో వణుకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jonathan: వయసు 193 ఏళ్లు.. పవర్ ఇంకా తగ్గలేదు.. జోనాథన్ తాబేలు ప్రస్తుత పరిస్థితి ఇది!
Hyderabad, Telangana:Oldest Jonathan Tortoise Latest News: ప్రపంచంలో అత్యంత వృద్ధ తాబేలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన జోనాథన్ మరణించినట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు విపరీతంగా వస్తున్నాయి. అయితే వీటికి తెరపడుతూ అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని..జోనాథన్ ఆరోగ్యంగా, ఎంతో ఉత్సాహంగా ఉందని బ్రిటీష్ సెయింట్ హెలెనా ద్వీప అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ తాబేలు చూడడానికి చాలా వింతగా కనిపించేసరికి చాలామంది.. ఇది చనిపోయిందంటూ వార్తలు ప్రచురించడం ప్రారంభించారు..
గత వారం రోజులగా ఇంటర్నెట్లో జోనాథన్ చనిపోయిందంటూ.. కొన్ని ఫోటోలతో పాటు పోస్టర్లు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువు ప్రేమికులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు జోనాథన్ ప్రస్తుతం సెయింట్ హెలెనాలోని గవర్నర్ నివాసం (ప్లాంటేషన్ హౌస్)లోని తోటలో హాయిగా అటు ఇటు తిరుగుతోందని తెలిపారు. 193 ఏళ్ల వయస్సు వచ్చినప్పటికీ.. అది తగినంత ఆహారం తీసుకుంటూ యాక్టివ్ గా ఉందని వారు వెల్లడించారు..
కేవలం ప్రకటన తోనే సరిపెట్టకుండా..జోనాథన్ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అధికారులు ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో తాబేలు తనకి ఇష్టమైన పండ్లతో పాటు కూరగాయలను తింటూ ఎంతో ఉల్లాసంగా అటు ఇటు తిరుగుతూ కనిపిస్తోంది. జోనాథన్ చనిపోయిందన్న వార్తలు ఏమాత్రం నిజం లేదు.. అది ఇప్పటికే తన రోజువారి కార్యకలాపాలను ఎంతో చురుగ్గా నిర్వహిస్తుందని.. ప్లాంటేషన్ హౌస్ ప్రతినిధులు పేర్కొనడం విశేషం..
Read more: INS Taragiri: భారత నౌకాదళంలోకి తారాగిరి.. శత్రువుల గుండెల్లో వణుకే!
సెయిషెల్స్ జెయింట్ టోర్టాయిస్ జాతికి చెందిన జోనాథన్.. 1832లో జన్మించినట్లు సమాచారం... 1882లో సెయింట్ హెలెనాకు తీసుకువచ్చినప్పటి నుంచి అది అక్కడే ఏళ్ల నుంచి నివసిస్తుందట.. అంతేకాకుండా భూమిపై జీవించిన అత్యంత వృద్ధ జంతువుగా ఇది వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది. అంతేకాకుండా బ్రిటన్ పాలించిన ఎనిమిది మంది రాజులు, రాణులు, అమెరికాకు చెందిన 40 మంది అధ్యక్షులను ఈ తాబేలు తన జీవితకాలంలో చూసింది. వృద్ధాప్యం కారణంగా ఈ తాబేలు చూపు మందగించిన.. వాసన పసిగట్టే శక్తి తగ్గినప్పటికీ.. వినికిడి శక్తి మాత్రం అద్భుతంగా ఉందని వైద్యులు చెబు. ప్రస్తుతానికి అది సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని తెలియడంతో సోషల్ మీడియా వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Read more: INS Taragiri: భారత నౌకాదళంలోకి తారాగిరి.. శత్రువుల గుండెల్లో వణుకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
INS Taragiri: భారత నౌకాదళంలోకి తారాగిరి.. శత్రువుల గుండెల్లో వణుకే!
Hyderabad, Telangana:INS Taragiri Commissioned Latest News: భారత నవకాదళం మరింత మరింత శక్తివంతంగా తయారయ్యింది. సముద్ర సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా అత్యాధునిక యుద్ధనౌక INS Taragiri అధికారికంగా ఇండియన్ నేవీలో చేరింది. శుక్రవారం విశాఖ నేవీ యార్డులో జరిగిన అత్యంత ముఖ్యమైన కార్యక్రమంలో భాగంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ యుద్ధనౌకను జాతికి అంకితం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ నౌక రాకతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత ఆధిపత్యం మరింత పెరగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ యుద్ధ నౌకలో వినియోగించిన టెక్నాలజీ ఏంటో? దీని ఫీచర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మేక్ ఇన్ ఇండియా నినాదానికి నిలువెత్తు నిదర్శనం గా నిలుస్తున్న ఈ యుద్ధ నౌకను దాదాపు 75% స్వదేశీ టెక్నాలజీతో నిర్మించడం విశేషం.. ప్రాజెక్ట్ 17aలో భాగంగా నిర్మితమైన ఈ యుద్ధనౌక అత్యాధునిక స్ట్రెంత్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అంటే శత్రుద్దేశాల రాడార్లకు చిక్కకుండా ఇది సముద్రంలో దూసుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతోపాటు గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం..
తారాగిరి కేవలం నౌక మాత్రమే కాదు.. సముద్రంపై కదిలే ఒక భారీ ఆయుధగారం.. ఇందులో ఉన్న టీచర్స్ వివరాల్లోకి వెళితే.. గాలిలోని లక్ష్యాలతో పాటు ఇతర నౌకలను క్షణాల్లో ధ్వంసం చేసేందుకు సూపర్ సోనిక్ మిస్సైల్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా సముద్ర గర్భంలో దాగివున్న శత్రువు జలంథర్ గాములను పసిగట్టి అడ్డుకునే యాంటీ సబ్మెరైన్ సిస్టం కూడా ఇందులో అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముప్పును ముందే పసిగట్టి హెచ్చరించే అధునాతన రాడార్ సిస్టం కూడా ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ యుద్ద తంత్రాలను తిప్పికొట్టేలా ప్రత్యేకమైన యాంటీ వార్ఫేర్ సిస్టమ్ కూడా ఉంటుంది.
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
తారాగిరితో పాటు మరో కీలక పరిణామం నేవీలో చోటుచేసుకుంది.. దేశీయంగా నిర్మించిన రెండో అరిహంత్ క్లాస్ అను అంతర్గామి INS Aridhaman కూడా కమిషన్ అయినట్లు సమాచారం అందుతుంది. ఇది లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైడ్లను ప్రయోగించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా భారత్ భూమి ఆకాశం మరింత బలోపేతం కాబోతోంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్ ఇకపై రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడకుండా.. ప్రపంచానికి ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తారాగిరి చేరికతో బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు భారత భద్రతా మరింత పెరిగిందన్నారు..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
