icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Hyderabad: ముగ్గురితో ఎఫైర్.. భార్య ప్రైవేట్ వీడియోలు నెట్టింట వైరల్, తట్టుకోలేక హుస్సేన్ సాగర్‌లో దూకి టెకీ బలవన్మరణం!

Hyderabad, Telangana:

Wife's Private Videos with 3 Men Techie Suicide: అక్రమ సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా.. పిల్లలను కూడా అనాథలుగా మారుస్తున్నాయి. ఒకరి ప్రాణాలు తీయడం.. లేక వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితులకు దారితీస్తున్నాయి. హైదరాబాదులోని ఇలాంటి దారుణ ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. తన భార్య ఆగడాలను చూడలేక హుస్సేన్ సాగర్‌లోకి దూకి ఓ టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. ఏపీలోని మార్కాపురం చెందిన సీతారాం (36),నంద్యాలకు చెందిన రేణుకతో 2018లో వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం వీరికి ఏడు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు . సీతారాం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ నెలకు రూ.2 లక్షల జీతం కూడా సంపాదిస్తున్నారు. వీరి కుటుంబం హాయిగా ఆనందంగా బాచుపల్లిలో స్థిరపడిపోయింది. అయితే భార్య రేణుక మాత్రం అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ప్రైవేటు వీడియోలు కూడా తీసుకుంది. ఏడాదిన్నరలోనే ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే, రమణారెడ్డి అనే వ్యక్తి రేణుకతో ప్రైవేటుగా ఉన్న వీడియోలను తీశాడు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో సీతారాం కంటపడింది. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సోషల్ మీడియాలో తన భార్య వీడియో వైరల్ అయింది. దీంతో తన భార్య నిజస్వరూపం బయటపడింది. తన భార్య రేణుకతోపాటు మరో ఐదుగురు పేర్లు చెబుతూ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టాడు సీతారాం.

అయితే ఫిబ్రవరిలోనే ఈ ఘటన జరిగిందని బాచుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ వెల్లడించారు. అతని తండ్రి చూసి వెంటనే హుస్సేన్ సాగర్ కి పరిగెత్తి పోలీసులను కూడా సంప్రదించారు. ఇక మృతదేహాన్ని బయటికి తీశారు లేక్‌ పోలీసులు. వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశారు.  బాచుపల్లి పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. తీవ్రమనోవేధనతోనే తన కొడుకు సీతారాం సూసైడ్ చేసుకున్నాడని మృతుడి తండ్రి.. కోడలు, రమణారెడ్డి, కిషోర్, శ్రవణ్ అనే వ్యక్తుల పేర్లతో కేసు పెట్టాడు. రేణుక రమణారెడ్డి తో ఉన్న ప్రైవేటు వీడియోను నా కొడుకుకి పంపించింది. దీంతో మానసిక క్షోభతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపాడు. ఏప్రిల్‌ 21న బాచుపల్లి పోలీసులు రేణుక రమణ పై సెక్షన్ 108 ప్రకారం అరెస్టు చేశారు. ఇద్దరిని జ్యూడిషియల్ రిమాండ్ కూడా పంపారు. అయితే కేసు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 

 19 పేజీల సుదీర్ఘ సూసైడ్ రాసి మరి సీతారాం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతో ఆనందంగా చూసుకుంటున్న తన భార్యకు అసలు ఏం కావాలి? ఆమె ఏం కోరుకుంటుంది? అని తాను తట్టుకోలేకపోయాడు. అసలు రేణుకకు ఏం కావాలి? ప్రేమనా? లేక శృంగారమా? నా భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా కానీ ఆమె నాకు నమ్మకద్రోహం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక భార్య చేసిన మోసానికి భర్త ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు.

READ ALSO:  కర్నూల్‌ జిలాల్లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం, 15 మందికి తీవ్రగాయాలు..!

READ ALSO:  ప్రేమోన్మాది వేంకటేశ్‌పై పోలీసులు కాల్పులు.. ఇద్దరు కానిస్టేబుల్స్‌పై దాడిచేసి తప్పిచుకునే యత్నం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Education Year: విద్యా సంవత్సరానికి స్కూల్ డ్రెస్సులు, నోటు పుస్తకాలు సకాలంలో అందాలి: తెలంగాణ సీఎం

Hyderabad, Telangana:

Academic Year 2026-27: రాబోయే విద్యా సంవత్సరంపై తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్ష చేసి విద్యా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూల్‌ డ్రెస్సులు, నోటు పుస్తకాలు తదితర అన్నీ ఏర్పాట్లు స్కూళ్ల ప్రారంభానికి ముందే సిద్ధం కావాలని ఆదేశించారు. విద్యాశాఖలో అవ‌క‌త‌వ‌క‌ల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌హించేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

Also Read: Ambati Rambabu: వైఎస్సార్‌ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి విద్యా శాఖపై సమీక్ష చేశారు. విద్యా శాఖ‌తోపాటు బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ‌ల ప‌రిధిలోని విద్యా సంస్థ‌ల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల‌కు అంద‌జేసే సామ‌గ్రి సెంట్ర‌లైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి స‌మీక్షించారు. ఈ సందర్భంగా విద్యా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 'విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన విద్యా సామ‌గ్రి స‌కాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి. దుస్తులు, నోటు పుస్త‌కాలు, ఇత‌ర సామ‌గ్రి స‌కాలంలో అందిస్తే విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో శ్ర‌ద్ధ చూపుతారు' అని సీఎం పేర్కొన్నారు.

గ‌తంలో ఏ శాఖ‌కు ఆ శాఖ విడిగా ప్రొక్యూర్‌మెంట్, స‌ర‌ఫ‌రా చేయడంతో ఏక‌రూప‌త లోపించ‌డం, అనేక అక్ర‌మాలు చోటుచేసుకునేవి. వాటిని అరిక‌ట్టేందుకు కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని అమలులోకి తెచ్చాం. అవ‌క‌త‌వ‌క‌లు ఎట్టి ప‌రిస్థితుల్లో స‌హించేది లేదు. సెంట్ర‌లైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానంతో జ‌వాబుదారీత‌నం పెరుగుతుంది' అని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తోందని.. స‌ర‌ఫ‌రాదారుల ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకు కాదని స్పష్టం చేశారు.

'విద్యార్థుల‌కు అంద‌జేసే నోటు పుస్త‌కాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ సూట్లు, బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడీ కార్డులు, యూనిఫాంలు అన్నీ నాణ్య‌మైన‌వి ఉండాలి. నాణ్య‌త‌తో పాటు స‌కాలంలో అంద‌డంపైన ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వహించాలి' అని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. జూన్ 15 నాటికి విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి మొత్తం అందాల‌ని.. అలా అంద‌గానే స‌ర‌ఫ‌రాదారుల‌కు చెల్లింపులు పూర్తి చేయాలని సూచించారు.

'విద్యార్థుల‌కు అందించే వ‌స్తువుల‌కు సంబంధిత మండ‌ల స్థాయిలో ఒక నోడ‌ల్ అధికారిని నియ‌మించాలి. అక్కడి నుంచి క్షేత్ర స్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలి. పంపిణీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు తీయించాలి. ప్ర‌తి విద్యార్థికి వారికి అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అంతా అందిందా లేదా అనే దానిని తనిఖీ చేసుకోవాలి' అని ముఖ్యమంత్రి తెలిపారు. నోటు పుస్త‌కాలు, యూనిఫాం, ఇత‌ర సామ‌గ్రి నాణ్యత, వాటిని అందుకున్న త‌ర్వాత వారి భావాల‌ను తెలియ‌జేసేందుకు విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు సీఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యా శాఖల మ‌ధ్య సమన్వయానికి ఒక క‌మిటీని నియ‌మించాలని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Sanath Nagar TIMS: హైదరాబాద్‌లో మరో కొత్త నిమ్స్‌ తరహా ఆస్పత్రి.. ఎక్కడో తెలుసా?

Hyderabad, Telangana:

Tomorrow Sanathnagar TIMS Open: ప్రజల ఆరోగ్య జీవనాన్ని మెరుగుపర్చేందుకు.. నగర ప్రజల జీవన కాలం మరింత పెంచేందుకు హైదరాబాద్‌లో మరో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభం కానుంది. రేపటి నుంచే ఆస్పత్రిలో సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆస్పత్రిలో రేపటి నుంచి ఔట్‌ పేషెంట్‌ వైద్య సేవలు అందనున్నాయి. నగర ప్రజలు టిమ్స్‌ ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. ట్రయల్‌ రన్‌లో భాగంగా ఈ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

Also Read: Liver Transplant: గాంధీ దవాఖానాలో 18 నెలల బాలుడికి లివర్ మార్పిడి.. అన్నీ ఉచితంగా

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) నిర్మాణాలు పూర్తయి కొన్ని నెలలు అవుతున్నాయి. ఈ ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైనా కాంగ్రెస్‌ ప్రభుత్వం రిబ్బన్‌ కట్‌ చేయడం లేదు. అట్టహాసంగా ప్రారంభోత్సవం చేయకుండానే ఈ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆస్పత్రి ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో ఔట్‌ పేషెంట్‌ వైద్య సేవలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. 

సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆస్పత్రి‌లో వైద్య సేవల్లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి సుమారు నెల రోజుల పాటు ట్రయల్ రన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రయల్‌ రన్‌లో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ఔట్‌ పేషెంట్‌, డయాగ్నసిస్ సేవలు టిమ్స్‌ ఆస్పత్రిలో అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీతో పాటు మొత్తం 22 విభాగాల్లో ఈ ఆస్పత్రిలో ట్రయల్ రన్‌లో భాగంగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 22 విభాగాల వైద్య సేవలకు సంబంధించిన డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బందిని అధికారులు నియమించారు.

Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం

హైదరాబాద్‌ ప్రజలు ఖుషీ
అత్యంత ప్రతిష్టాత్మకంగా గత కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆస్పత్రి అందుబాటులోకి రానుండడంతో హైదరాబాద్‌ ప్రజలకు ఊరట లభించనుంది. ముందే అరకొరగా ఉన్న ప్రభుత్వ వైద్య సదుపాయాల నేపథ్యంలో టిమ్స్‌ ఆస్పత్రి ప్రారంభం కానుండడంతో హైదరాబాద్‌ ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి రానుంది. మల్టీ స్పెషాలిటీ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందనుండడంతో హైదరాబాద్‌ ప్రజలు ఈ ఆసత్ప్రిని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Liver Transplant: గాంధీ దవాఖానాలో 18 నెలల బాలుడికి లివర్ మార్పిడి.. అన్నీ ఉచితంగా

Hyderabad, Telangana:

Gandhi Hospital Liver Transplant: ప్రభుత్వ ఆస్పత్రి అంటే నిర్లక్ష్యం.. చిన్నచూపు ఉంటుంది. అలాంటి అపఖ్యాతిని ప్రభుత్వ ఆస్పత్రులు తుడిచేస్తున్నాయి. అత్యంత అరుదైన శస్త్రచికిత్సలను చేసి ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా సమాధానం ఇస్తున్నాయి. అలా ఏపీ, తెలంగాణలోనే అతిపెద్ద ఆస్పత్రి గాంధీ దవాఖానాలో 18 నెలల బాలుడికి అత్యంత అరుదైన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశారు. దాదాపు 14 గంటలు కష్టపడి ఆ చిన్నారికి మళ్లీ ఊపిరి పోశారు. ఈ అరుదైన శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం

ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో గ్లైకోజెన్ స్టోరేజ్ అనే అరుదైన డిసీజ్‌తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. కేవలం 10 కిలోల బరువు ఉన్న బాలునికి.. సుమారు 14 గంటల పాటు శ్రమించి 240 గ్రాముల లివర్ అమర్చారు. చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ మధుసూదన్ తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్, సాజియా దంపతుల 18 నెలల కుమారుడు అఫన్ కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.

Also Read: Ambati Rambabu: వైఎస్సార్‌ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం

తరచుగా ఆకలితో ఏడుస్తుండడం, మత్తుగా ఉండటం, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలతో చిన్నారి అఫన్‌ బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు బాలుడిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యులు చూపించగా.. అవసరమైన వైద్య పరీక్షలు చేయించారు. రక్తంలో షుగర్ లెవల్స్‌ చాలా తక్కువగా ఉండడం, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండటం, కాలేయం అసాధారణంగా విస్తరించి ఉండడాన్ని డాక్టర్లు గుర్తించారు. బాలుడి సమస్యపై మరింత లోతుగా అధ్యయనం చేసి గ్లైకోజెన్ స్టోరేజ్ (టైప్-III) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టుగా గాంధీ వైద్యులు నిర్ధారణ చేశారు.

వ్యాధి లక్షణాలు
గ్లైకోజెన్ స్టోరేజ్ (టైప్-III) వ్యాధితో శరీరంలో గ్లైకోజెన్‌ను గ్లూకోజ్‌గా మార్చే ఎంజైమ్ లోపంతో ఏర్పడుతుంది. దీని కారణంగా శరీరంలో నిల్వ ఉన్న శక్తిని వినియోగించుకోలేకపోవడం, తరచూ హైపోగ్లైసీమియా, కాలేయం పెద్దగా అవడం, కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో గుండె, మెదడు, కండరాలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది.

చిన్నారికి అప్పటికే వ్యాధి ముదిరి పరిస్థితి విషమంగా మారడంతో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. చిన్నారి తండ్రి నుంచి లివర్‌లోని కొంత భాగాన్ని సేకరించి బాలుడికి అమర్చారు. డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి చెందిన వైద్యుల బృందం సుమారు 14 గంటల పాటు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చవనుండగా.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ సహకారంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేశారు. అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన వైద్యులను ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్ రాకేశ్‌ సహాయ్ అభినందించారు.

మంత్రి అభినందన
10 కిలోల బరువున్న చిన్నారికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడిన ఉస్మానియా వైద్యులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. ఈ శస్త్రచికిత్సతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్ల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అందుతున్నాయని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Petrol And Diesel: ఏపీలో పెట్రోల్‌, డీజిల్ సరఫరాకు బ్రేక్‌ పడొద్దు: షర్మిల, మాధవ్‌

Nuzendla, Andhra Pradesh:

Petrol And Diesel Shortage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ వంటి అత్యవసర ఇంధనాలు ప్రతి వినియోగదారుడిఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం  అందుబాటులో ఉండాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు. పెట్రోల్ బంక్ యాజమాన్యాలు సమగ్ర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మొత్తం 4,312 పెట్రోల్ బంకులు ఉండగా.. వాటిలో సుమారు 1.29 శాతం (దాదాపు 56 బంకులు) కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మాధవ్‌ విజ్ఞప్తి చేశారు.

Also Read: AP Rains: మండే ఎండల వేళ ఆంధ్రప్రదేశ్‌కు చల్లటి కబురు.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాపై అనిశ్చితి నెలకొనే అవకాశాల దృష్ట్యా.. ముందస్తుగా తగిన నిల్వలు ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీవీఎన్‌ మాధవ్‌ డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభం వ్యవసాయం, రవాణా, అత్యవసర సేవల వంటి కీలక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంపొందించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు సహకరించాలని బంక్ నిర్వాహకులకు పీవీఎన్‌ మాధవ్‌ విజ్ఞప్తి చేశారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పీవీయన్ మాధవ్ సూచించారు.

Also Read: Census 2027: జనగణనతో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది: యార్లగడ్డ వెంకట్‌రావు

పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభంపై షర్మిల స్పందన
'డీజిల్ కోసం రైతులు.. పెట్రోల్ కోసం సాధారణ ప్రజలు గంటల కొద్ది క్యూలో పడిగాపులు. ఇలాంటి అత్యవసర స్థితిలో ప్రజా అవసరాల మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం బడా కాంట్రాక్టర్ల కోసం మాట్లాడటం ఏమిటి? వారి ప్రయోజనాలే ముఖ్యంగా పని చేయడం ఏంటి?' అని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిలదీశారు. 'బడా కాంట్రాక్టర్ల కోసమే ప్రత్యేకంగా డీజిల్ సరఫరా కోరడం ఏమిటి? ఇదేనా ఈ ప్రభుత్వ ధోరణి? రైతుకన్నా కాంట్రాక్టర్ ముఖ్యమా? ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులే ప్రాధాన్యమా?' అని ప్రశ్నించారు. 'ఇది పాలన కాదు పూర్తిగా ప్రాధాన్యతల వైఫల్యం. ముందుగా రైతులు, సాధారణ ప్రజలకు నిరంతర ఇంధన సరఫరా సాగేలా చూడాలి' అని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ప్రజలు ఎలా పోతే ఏంటి .. మాకు కాంట్రాక్టర్లే ముఖ్యం అనుకుంటే ప్రజల కష్టాలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని 'ఎక్స్‌' వేదికగా కూటమి ప్రభుత్వాన్ని వైఎస్‌ షర్మిల హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

AP Rains: మండే ఎండల వేళ ఆంధ్రప్రదేశ్‌కు చల్లటి కబురు.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Nuzendla, Andhra Pradesh:

AP Rain Alert: ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతోపాటు ఉక్కపోతకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వారికి వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని ప్రకటించారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత.. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించారు.

Also Read: Ambati Rambabu: వైఎస్సార్‌ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం

వర్షం ప్రభావం
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులు అకాల వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.

Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం

అత్యధిక ఉష్ణోగ్రత
నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలు రికార్డు అయ్యింది. పల్నాడు జిల్లాలో 28 మండలాలు,  వైఎస్సార్ కడపలో 26, తిరుపతిలో 25, నెల్లూరులో 25, ప్రకాశంలో 22, మార్కాపురంలో 15, నంద్యాలలో 14, చిత్తూరు 13, గుంటూరులో 11 మండలాలు మొత్తంగా 28 జిల్లాల్లో 20 జిల్లాల పరిధిలోని 216 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపింది. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రేపు వడగాల్పులు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలతోపాటు పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో (9) తీవ్ర వడగాల్పులు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 49 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Also Read: RS Praveen Kumar: కేటీఆర్‌, హరీశ్‌ రావు ఇంటి సీసీ కెమెరాలు హ్యాకింగ్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

ఈ జిల్లాల్లో..
వడగాలులు ఈ జిల్లాలో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం జిల్లా 10, మన్యం 6, పోలవరం 5, కాకినాడ 3, తూర్పుగోదావరి 3, ఏలూరు 3, ఎన్టీఆర్ 4, గుంటూరు 3, పల్నాడు 11, మార్కాపురం 1 మండలాల్లో మొత్తం 49 ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నాయి.

గురువారం ఉష్ణోగ్రతలు
వేసవికాలంలో గురువారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 డిగ్రీలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45,  తిరుపతి జిల్లా రాయలచెరువులో 44.3, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలో 43.6, బాపట్ల జిల్లా కారంచేడు, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43.5, నంద్యాల జిల్లా సంజామలలో 43.2, వైఎస్సార్ కడప జిల్లా కోడూరులో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Census 2027: జనగణనతో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది: యార్లగడ్డ వెంకట్‌రావు

Vijayawada, Andhra Pradesh:

Census 2027 Self-Registration: దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనగణనే బలమైన పునాది అవుతుందని.. ప్రతి ఇంటికీ వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు సూచించారు. ప్రజలందరూ జనగణనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనగణన 2027 స్వీయ నమోదు ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారులకు ప్రజలు ఎటువంటి భయం, సంకోచం లేకుండా సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు.

Also Read: Ambati Rambabu: వైఎస్సార్‌ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం

జనగణన 2027లో భాగంగా ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వినియోగించుకున్నారు. విజయవాడ ఎమ్మెల్యే కార్యాలయంలో తహసీల్దార్ శివయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తన కుటుంబ వివరాలను జనగణన పోర్టల్‌లో నమోదు చేశారు. దేశాభివృద్ధిలో కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని యార్లగడ్డ వెంకట్రావు కోరారు.

Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం

ఈ సందర్భంగా తహసీల్దార్ స్వీయ నమోదు ప్రక్రియలోని ప్రాముఖ్యతను, వివరాలను నమోదు చేసే విధానాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్‌రావు మాట్లాడుతూ.. జనగణన అనేది కేవలం జనాభా లెక్కల సేకరణ మాత్రమే కాదని.. రాబోయే కాలానికి దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి ఇది ఒక బలమైన పునాది అని తెలిపారు. మే 1వ తేదీ నుంచి ప్రారంభమై మే 31వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ అధికారులు, ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికీ వచ్చి వివరాలను సేకరిస్తారని వివరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారులకు ప్రజలు ఎటువంటి భయం, సంకోచం లేకుండా సరైన సమాచారాన్ని అందించాలని చెప్పారు. ఈ జాతీయ కార్యసాధనలో భాగస్వాములు కావాలని టీడీపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గన్నవరం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ చొరవ చూపాలని పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Ambati Rambabu: వైఎస్సార్‌ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం

Nandimandalam, Andhra Pradesh:

YSR Ghat: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు శపథం బూనారు. వైఎస్‌ జగన్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను పోరాటం చేస్తానని శపథం చేశారు. ఈ పోరాటంలో తనపై ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా తాను ధైర్యంగా ఎదుర్కుంటానని ప్రకటించారు. తాము వైఎస్సార్‌ వారసులం అని.. వైఎస్‌ జగన్‌ వెంట నడిచేవాళ్లమని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సమాధి వద్ద అంబటి రాంబాబు ప్రతిజ్ఞ చేశారు.

Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం

కడప జిల్లా వేంపల్లిలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘాట్‌ను అంబటి రాంబాబు సందర్శించారు. వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూలుస్తామని ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని అంబటి రాంబాబు ప్రతిజ్ఞ పూనారు. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని స్పష్టం చేశారు.

Also Read: RS Praveen Kumar: కేటీఆర్‌, హరీశ్‌ రావు ఇంటి సీసీ కెమెరాలు హ్యాకింగ్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

'వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో రామ మునిరెడ్డి అనే తెలుగుదేశం నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాపై కేసు పెట్టారు. ఒకే అంశంపై చట్టవిరుద్ధంగా 36 కేసులు నమోదు చేయడం దారుణం' అని అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ఆదేశాలతోనే పోలీసులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 'వైఎస్సార్ వారసులం. వైఎస్‌ జగన్ వెంట నడుస్తున్న వాళ్లం. అక్రమ కేసులకు ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. వచ్చేది జగన్ ప్రభుత్వమే.. అరాచక పాలనకు చరమగీతం పాడుతాం' మాజీ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.

'చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదు. నిబంధనలు అతిక్రమించే అధికారులను భవిష్యత్తులో చట్టం ముందు నిలబెడతాం. రాష్ట్రంలో సాగుతున్నది కక్షసాధింపు రాజకీయాలే తప్ప.. ప్రజాస్వామ్య పాలన కాదు. ప్రభుత్వ అరాచకాలపై న్యాయపోరాటం చేస్తాం' అని అంబటి రాంబాబు ప్రకటించారు. ఇటీవల గుంటూరులోని సత్తెనపల్లిలో జరిగిన పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అతడు అరెస్టయి జైలు జీవితం గడిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం

Amaravathi, Andhra Pradesh:

AP Cabinet Meeting Decisions: రాజధాని అమరావతి అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సమావేశమైన మంత్రిమండలి కూడా రాజధాని అంశంపై నిర్ణయాలు తీసుకుంది. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పెంపు తదితర అంశాలపై మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంటూ పలు అంశాలకు ఆమోదం తెలిపింది. పలు ప్రాజెక్టులకు భూకేటాయింపులు చేస్తూ మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది.

Also Read: RS Praveen Kumar: కేటీఆర్‌, హరీశ్‌ రావు ఇంటి సీసీ కెమెరాలు హ్యాకింగ్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

అమరావతిలోని సచివాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమై కొన్ని గంటల పాటు చర్చలు జరిపింది. మొత్తం 26 అంశాలపై చర్చించి, అభివృద్ధి, మౌలిక వసతులు, పరిపాలన సంబంధిత ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కృష్ణానది వరద నుంచి రక్షణ (ఫ్లడ్ ప్రొటెక్షన్) పనులకు రూ.443 కోట్ల ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయంలో గ్లాస్ క్లాడింగ్ సహా వివిధ పనులకు రూ.2540 కోట్ల నిధుల విడుదలకు మంత్రిమండలి ఆమోదించింది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరోగ్య పథకంపై బిగ్‌ అప్‌డేట్‌ ఇదే!

ఇక రాజధాని ప్రాంతంలోని అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రిమండలి సమావేశం అనుమతి ఇచ్చింది. అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్‌కు రూ.798 కోట్ల ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలకు, పోలవరం ప్రాజెక్ట్ బాధితుల గృహ యూనిట్ ఖర్చు పెంపుకు ఏపీ మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఉండవల్లి జోన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.580 కోట్ల ప్రణాళికకు ఆమోదం తెలిపింది.

అమరావతి ప్రాంతంలో డ్రెయిన్ సైఫన్ నిర్మాణ పనులకు రూ.76 కోట్లకు, హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌కు రూ.3099 కోట్ల సవరణ అంచనాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. హోంశాఖలో 385 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి, హైకోర్టు, జిల్లా న్యాయ వ్యవస్థలో 21 కొత్త పోస్టులను సృష్టికి, పంచాయతీ రాజ్ శాఖలో 20 పోస్టులు సృష్టించడంతోపాటు 9 పోస్టులను అవుట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడానికి మంత్రిమండలి పచ్చజెండా ఊపింది.

మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..!
==> న్యూఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124.5 కోట్లు కేటాయించాలని నిర్ణయం
==> మార్క్‌ఫెడ్‌కు రూ.1,800 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్‌కు ప్రభుత్వం హామీ
==> రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ ఖర్చుల మార్పులకు ఆమోదం
==> వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు
==> మున్సిపల్ ఆస్తుల లీజ్, రెంట్ ఫిక్సేషన్ నిబంధనల్లో మార్పులకు నిర్ణయం
==> మున్సిపల్ చట్టాల్లో సవరణల బిల్లును ప్రతిపాదన
==> తిరుపతి సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం భూముల కేటాయింపు
==> కడపలో 92 ఎకరాల డంపింగ్ యార్డ్ కోసం భూమి కేటాయింపు
==> ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్, చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూముల బదిలీ ప్రతిపాదనల పచ్చజెండా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

RS Praveen Kumar: కేటీఆర్‌, హరీశ్‌ రావు ఇంటి సీసీ కెమెరాలు హ్యాకింగ్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

Hyderabad, Telangana:

Telangana Phone Tapping Issue: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుండగా.. ఈ క్రమంలో మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు నివాసాల ముందు ఉన్న సీసీ కెమెరాలు కూడా హ్యాకింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.

'టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా దేశ భద్రత కోసం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ట్యాపింగ్ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది' అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. '350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. ప్రభాకర్ రావును 18 రోజులు జైల్లో కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్‌షీట్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు పెట్టాలని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు' అని మండిపడ్డారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సంధ్య శ్రీధర్ రావుపై 26 కేసులు ఉన్నాయి. అతనితో ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీనియర్ జర్నలిస్టును ఇరికించి అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ వేస్తే హరీష్ రావు పేరు చెప్తారా లేదా అని బెదిరిస్తున్నారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ తెలిపారు.

'కేసీఆర్ ఇంటి గోడలపై నోటీసులు అంటించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రహస్యంగా ఉంటుంది. బాధ్యత లేని హోంమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు శాఖ బలైంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తప్పులు చేస్తున్నారు. నంబీ నారాయణన్ అనే ఇస్రో సైన్టిస్ట్‌పై అక్రమ కేసు మోపినందుకు విచారణ చేసిన వాళ్ళను కోర్టు దోషులుగా ప్రకటించింది. క్రిషాంక్‌పై కేసు పెట్టి జైలుకు పంపారు' అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ తెలిపారు.

'కేటీఆర్, హరీష్ రావు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకువచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. దీనిపై సిట్ వేసి విచారణ చేయాలి' అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. 'ఐపీఎస్ అధికారులు సీఎం ఆదేశాలను పాటించవద్దు. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం. గతంలో నాకు యాపిల్ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్‌ను సెంట్రల్ క్రైం పోలీసులకు ఇచ్చా' అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Seethakka: రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ: సీతక్క

Hyderabad, Telangana:

Congress Seva Dal Meeting: 'రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోంది. ప్రజల ఐక్యతను దెబ్బతీసి బీజేపీ విద్వేష రాజకీయాలను చేస్తుంది. గాంధీ చూపిన శాంతియుత బాటలో మనం విద్వేష రాజకీయాలను గెలవాలి' అని సీతక్క పిలుపునిచ్చారు. ఈ దేశంలో గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించింది కాంగ్రెస్ పార్టీ. ఇది దేశ ఆత్మను కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది. ఆ దిశలో రక్షణ దళాలుగా సేవాదళ్ కార్యకర్తలు పని చేయాలి' అని సీతక్క సూచించారు.

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ సేవాదళ్ కార్యక్రమంలో సీతక్క పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 'సిద్ధాంత బలం ఉంటే ఎన్ని కష్టాలు అయినా ఎదుర్కోవచ్చు. పార్టీ త్యాగాలు, త్యాగాల చరిత్రను, పార్టీ గొప్పతనాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లాలి. ఆ దిశలో కాంగ్రెస్ సేవాదళ్ ముందుండి నడిపించాలి.  మీ శిక్షణ కార్యక్రమాలను జిల్లాలకు విస్తరిస్తే మన సైన్యం మరింత బలపడుతుంది' అని సీతక్క తెలిపారు. 'గాంధీ జ్ఞానం, నెహ్రు నిర్మించిన భారతదేశ విధి విధానాలు.. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ దేశానికి వెన్నెముక. కానీ రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోంది' అని మండిపడ్డారు.

'గాంధీ ఆలోచనలతో క్రమశిక్షణ కలిగిన సంఘంగా కాంగ్రెస్ సేవాదళ్ అవతరించింది. దేశానికి స్వతంత్రం సాధించటంలో.. దేశాన్ని నిర్మించడంలో కాంగ్రెస్ పాత్ర అమోఘం. దేశ స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ దేవ్ సేవాదళ్ పాత్ర మరువలేనిది. కాంగ్రెస్‌ది గాంధీ అహింస సిద్ధాంతం. అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ సేవా దళ్  కూడా అనుసరిస్తుంది. 'కాంగ్రెస్ సేవాదళ్ అంటే దేశభక్తుల సంఘం. జిల్లాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు సేవాదళ్ నిర్వహించాలి. సేవాదళ్ కాంగ్రెస్ సిద్ధాంతాలకు శ్రీరామరక్ష' అని సీతక్క వివరించారు. క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ సేవాదళ్ అని ప్రకటించారు. అంతకుముందు సీతక్క చరకా పట్టి నూలు వడికారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top