ఐద్వా రాష్ట్ర శిక్షణ తరగతులు: మల్లు లక్ష్మి పిలుపు
Karimnagar, Telangana:ఐద్వా తెలంగాణ రాష్ట్ర శిక్షణ తరగతులు జులై 26-29 తేదీల్లో కరీంనగర్లో జరుగుతాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మహిళల సమస్యలపై పోరాడుతున్న ఐద్వా వరకట్న వేధింపులు, అత్యాచారాలు, హత్యలపై కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, సమాన వేతనం, చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం పోరాడుతోందని ఆమె పేర్కొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
YS Jagan Press Meet: అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్ల స్కామ్..'మావిగన్'పై కోపం ఎందుకు: వైఎస్ జగన్ ఫైర్!
Vijayawada, Andhra Pradesh:YS Jagan Press Meet Today: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అత్యంత ఘోరమైన పాలన నడుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ రాష్ట్రాన్ని 'జంగిల్ రాజ్'గా మార్చేశారని తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన ఈ విధంగా స్పందించారు.
"చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి రెండేళ్లు గడుస్తున్నా, ప్రజలకు పలానా మంచి చేశానని చెప్పుకునే పరిస్థితి ఏ కోశానా లేదు. ఆయన రెండేళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ అత్యంత ఘోరంగా ఉంది. ఇచ్చిన హామీలన్నింటికీ వెన్నుపోటు పొడిచి, దారుణమైన అవినీతిని, దోపిడీని కొనసాగిస్తున్నారు. "బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ" అన్న విషయాన్ని చంద్రబాబు ప్రతిరోజూ రుజువు చేస్తూనే ఉన్నారు" అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రజలు తమ బతుకు బండిని నడపడానికే తీవ్ర కష్టాలు పడుతుంటే.. వారిని గమనించకుండా చేయడానికి చంద్రబాబు తన ఎల్లో గ్యాంగ్తో కలిసి వైఎస్సార్ సీపీని ఒక భూతంలా చూపే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు.
చంద్రబాబు అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పేవన్నీ దొంగ మాటలేనని వైఎస్ జగన్ కొట్టిపారేశారు. లక్ష ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీ, నీళ్లు, కరెంటు లాంటి ప్రాథమిక వసతులు ఇవ్వడానికే చంద్రబాబు లెక్కల ప్రకారమే అక్షరాల రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతాయని.. శూన్యం నుంచి అక్కడ నగరాన్ని నిర్మించాలనుకోవడం అసాధ్యమని వైఎస్ జగన్ అన్నారు.
అమరావతి కోసం ఇప్పటికే తెచ్చిన, కమిట్ అయిన అప్పులు రూ.47,387 కోట్లకు చేరాయని వైఎస్ జగన్ అన్నారు. దీనికి తోడు రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేస్తున్నారని.. సొంత స్కాముల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారని ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోందని జగన్ అన్నారు.
'మావిగన్' (MAVIGAN) గురించి ప్రస్తావన..
రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తున్న చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా 'మావిగన్' (మచిలీపట్నం, విజయవాడ, గన్నవరం) ప్రాంతాన్ని రాజధాని కారిడార్గా మార్చాలని తాము ప్రతిపాదించినట్లు జగన్ స్పష్టం చేశారు.
మావిగన్ అనుకూలతల గురించి జగన్ మాటల్లో..
ఈ ప్రాంతంలో ఇప్పటికే 35 నుంచి 40 లక్షల మంది జనాభా ఉన్నారు. మచిలీపట్నం పోర్టు, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అందుబాటులో ఉన్నాయి. 3 రైల్వే స్టేషన్లు, 4 నేషనల్ హైవేల కనెక్టివిటీ ఉండడం సహా 9 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు, మరెన్నో విద్యాసంస్థలు ఇప్పటికే నడుస్తున్నాయి.
రాష్ట్ర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తాము ప్రతిపాదించిన ఈ 'మావిగన్' కారిడార్కు ప్రజల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తోంది. మావిగన్ పేరు వింటేనే చంద్రబాబుకు గుండె ఆగినంత పనవుతోందని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఆక్రోశంతో తన మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Byreddy Siddharth Reddy: రాయలసీమలో వైసీపీకి షాక్..బెరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై క్రిమినల్ కేసు!
Also Read: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..జనసేన, టీడీపీ లిస్టు కూడా రెడీ..రేపే నోటిఫికేషన్?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Solar Eclipse: 2026లో చివరి సూర్యగ్రహణం ఆరోజే! గ్రహణం సమయం, తేదీ అప్పుడే! భారత్లో కనిపిస్తుందా?
Hyderabad, Telangana:Solar Eclipse 2026: జ్యోతిష్య శాస్త్రజ్ఞులు, ఖగోళ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఏడాది చివరి సూర్యగ్రహణం గురించి ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది. ఈ ఏడాది (2026)లో మొత్తం రెండు సూర్యగ్రహణాలు సంభవించనుండగా.. ఇప్పటికే ఒక సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న పూర్తయ్యింది. ఇప్పుడు ఆగస్టులో మరో సూర్య గ్రహణం సంభవించనుంది.
2026లో రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12న అనగా శ్రావణ మాస అమావాస్య నాడు సంభవించనుంది. జ్యోతిష్య గణనల ప్రకారం.. ఈ గ్రహణం ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో సంభవిస్తుంది. భారతకాలమానం ప్రకారం ఈ సూర్య గ్రహణం ఆగస్టు 12 రాత్రి 9.04 గంటల నుంచి ఆగస్టు 13 తెల్లవారుజామున 4.25 గంటల వరకు అనగా మొత్తంగా 7 గంటల 21 నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగనుంది.
ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం.. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదని తెలుస్తోంది. వలయాకార సూర్యగ్రహణంగా విశ్లేషకులు దీన్ని అంచనా వేస్తున్నారు. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యునికి, భూమికి మధ్య సంచరిస్తుంది. అయితే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కనిపించకుండా చేయలేడు. దీనివల్ల చంద్రుని చుట్టూ సూర్యుని కాంతి ఒక ప్రకాశవంతమైన ఉంగరం (వలయం) లాగా కనిపిస్తుంది. దీనినే 'రింగ్ ఆఫ్ ఫైర్' అని కూడా పిలుస్తారు.
ఈ గ్రహణం ప్రపంచంలోని పలు దేశాలలో స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. కెనడా, ఐస్లాండ్, గ్రీన్ల్యాండ్, స్పెయిన్, రష్యా ఈశాన్య ప్రాంతాలు, వాయువ్య ఆఫ్రికాలోని కొన్ని భాగాల్లో ఇది కనిపించనుంది. అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతం, ఫ్రాన్స్, ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ (UK)తో కూడిన యూరప్ దేశాల్లోనూ ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రివేళ సంభవించనుండడం వల్ల భారతదేశంలో కనిపించదు.
'సూతక కాలం' ఉంటుందా?
హిందూ సంప్రదాయాల ప్రకారం.. సూర్యగ్రహణానికి కొన్ని గంటల ముందు 'సూతక కాలం' (అశుభ సమయం) ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పూజలు, వంట చేయడం, శుభకార్యాలు నిషిద్ధంగా పరిగణిస్తారు. అయితే, ఆగస్టు 12 నాటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోవడం వల్ల ఇక్కడ 'సూతక కాలం' నియమాలు వర్తించవని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శాస్త్రాల ప్రకారం గ్రహణం ఎక్కడైతే కనిపిస్తుందో, అక్కడ మాత్రమే సూతక నియమాలు పాటించాలి. కాబట్టి ఆ రోజున భారతదేశంలోని దేవాలయాలన్నీ తెరిచే ఉంటాయి. నిత్య పూజలు, శుభకార్యాలు యథావిధిగా నిర్వహించుకోవచ్చు.
భారతదేశం నుండి ఈ అద్భుత ఖగోళ దృశ్యాన్ని నేరుగా చూసే అవకాశం లేనప్పటికీ, డిజిటల్ మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA తో పాటు కొన్ని ప్రముఖ ఖగోళ వెబ్సైట్లు తమ అధికారిక యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్సైట్లలో ఈ గ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
Also Read: బ్యాంకు కస్టమర్లకు విజ్ఞప్తి..వరుసగా 4 రోజులు ఆ బ్యాంకు బంద్..ఈ పనులు పూర్తి చేయండి!
Also REad; జూన్ 30 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు..పండగ చేసుకుంటున్న విద్యార్థులు..ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Essel Group 100: వందేళ్లలో ఎస్సైల్ గ్రూపు అపూర్వ క్షణాలు.. గర్వించదగ్గ అవార్డులు
Wadgaon, Maharashtra:Essel Group Honors And Awards: ఎస్సెల్ గ్రూప్ 100 సంవత్సరాల ప్రయాణం ధైర్యం, సాహసం, ఒడిదుడుకులతో కూడి ఉంది. ఈ కాలంలో గ్రూప్ ఐదు కష్టకాలాలను చూసింది. కానీ మూడు మూల సూత్రాల బలంతో ప్రతిసారీ ధైర్యంగా నిలబడి మరింతగా రాణించింది. డాక్టర్ సుభాష్ చంద్ర తాత జగన్నాథ్ గోయెంకా అందించిన ఈ మూడు సూత్రాలు: 1. భయపడకు 2. నీ సంకల్పం నుంచి ఎప్పుడూ వెనక్కి తగ్గకు 3. సత్యం నుంచి ఎప్పుడూ తప్పుకోకు. ఈ మూడు సూత్రాలే ఎస్సెల్ గ్రూప్నకు ఆదర్శంగా నిలిచాయి. అందుకే ఈ వందేళ్ల అపూర్వ ప్రయాణంలో ఎస్సెల్ గ్రూప్ సాధించిన విజయాలను వ్యాపార ప్రపంచం, సమాజం ఎంతో కొనియాడింది. వ్యాపారంతో పాటు గ్రూప్ చేసిన మానవీయ, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయి.
అవార్డులు, గౌరవాలు
==> Essel Propack నార్త్ అమెరికా యూనిట్ ట్యూబ్ కౌన్సిల్ 'ట్యూబ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్' (2013)లో మూడు అవార్డులు సొంతం.
==> డాక్టర్ సుభాష్ చంద్రకు 2011లో న్యూయార్క్ సిటీలో International Emmy Directorate Award లభించింది.
==> ఎస్సెల్ గ్రూప్, ZEEL ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్రకు 2014లో International Writers Awardతో సత్కారం
==> భారతదేశ అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ EsselWorld, IAAPI (ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్, ఇండస్ట్రీస్) 10వ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ -2011లో మూడు కేటగిరీలలో అవార్డులు కైవసం
==> Essel Infra Ahmedabad Godhra Toll Road Project Pvt Ltd ను IIFCL (ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ) వరల్డ్ బ్యాంక్/ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో కలిసి "ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ" (పర్యావరణ స్థిరత్వం) కోసం సత్కారం
==> DishTV ట్రస్ట్ రీసెర్చ్ అడ్వైజరీ (TRA) 2014 బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్లో "మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్" (అత్యంత విశ్వసనీయ బ్రాండ్)గా ఎంపిక.
==> ఇంటర్బ్రాండ్-2015 నాటి "30 బెస్ట్ ఇండియన్ బ్రాండ్స్" జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మీడియా బ్రాండ్ ZEE.
==> Zee Institute of Creative Art (ZICA) 2013లో వరల్డ్ కన్సల్టింగ్, రీసెర్చ్ కార్పొరేషన్ (WCRC) ద్వారా "బెస్ట్ గ్రాఫిక్ అండ్ యానిమేషన్ డిజైన్" ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కేటగిరీలో "ఆసియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అవార్డు".
==> ఎస్సెల్ గ్రూప్, ZEE ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్రకు 22 ఏప్రిల్ 2016న కెనడా ఇండియా ఫౌండేషన్ (CIF) ప్రతిష్టాత్మక “Chanchlani Global Indian Award” సొంతం. ఈ గౌరవాన్ని గతంలో రతన్ టాటా, నారాయణ మూర్తి వంటి ప్రముఖులు పొందారు.
సమాజ సేవలో ఎస్సెల్ గ్రూపు
ప్రజల నుంచి లభించిన దానిని తిరిగి సమాజానికి ఇవ్వాలని ఎస్సెల్ కుటుంబం నమ్ముతుంది. ఈ ఆలోచనతోనే ఎస్సెల్ గ్రూప్ సామాజిక పనులు, ప్రజల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది.. చేపడుతోంది.
ఏకల్ ఉద్యమం: ఎస్సెల్ గ్రూపు భారతదేశంలోని 50,000 కంటే ఎక్కువ గ్రామాల్లో పేద ప్రజలకు విద్య, సాధికారత అందించే బృహత్తర కార్యక్రమం చేస్తోంది.
గ్లోబల్ విపస్సన ఫౌండేషన్: ఈ సంస్థ ప్రజలను మానసిక ఒత్తిడి నుంచి బయటపడేయడానికి సహాయ పడుతుంది. ఇది గౌతమ బుద్ధుడు బోధించిన విపస్సన ధ్యానంపై ఆధారపడి ఉంటుంది.
తాలీమ్ రీసెర్చ్ ఫౌండేషన్: ఈ సంస్థ ప్రజలకు ఉన్నత స్థాయి విద్య, పరిశోధన అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా ఉపాధి, ఆదాయాన్ని పెంచడానికి సహాయ పడుతుంది.
డీఎస్ఈ ఫౌండేషన్: ఈ సంస్థ సమాజ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
Guntur Fire Accident: గుంటూరులో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో కాలిబూడిదైన భూగర్భ డ్రైనేజీ పైపులు!
Guntur, Andhra Pradesh:Guntur Fire Accident Today: గుంటూరు నగర శివారు ఇన్నర్ రింగ్ రోడ్డు సమీపంలోని టీచర్స్ కాలనీలో గురువారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. ఆ ప్రాంతంలోని ఓ ఖాళీ ప్రదేశంలో నిల్వ ఉంచిన భూగర్భ డ్రైనేజీ పైపుల్లో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో పాటు, ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన నల్లటి పొగతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రమాదానికి గల కారణాలు..
గుంటూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం గతంలో ఈ పైపులను తీసుకొచ్చారు. అయితే, కోర్టు కేసుల కారణంతో పాటు పదేళ్లుగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. పనులు ఆగిపోవడంతో నిర్మాణ సంస్థ గత పదేళ్ల నుంచి ఆ పైపులను అక్కడే వదిలేసింది. వాటి నిర్వహణను పూర్తిగా పట్టించుకోకపోవడంతో, కాలక్రమేణా ఆ పైపుల చుట్టూ భారీగా చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు పేరుకుపోయాయి. గురువారం ఉదయం ఆ చెత్తలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అవి కాస్తా ప్లాస్టిక్/ఫైబర్ పైపులకు వేగంగా వ్యాపించడంతో ప్రమాదం తీవ్ర రూపం దాల్చింది.
రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Also Read: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..జనసేన, టీడీపీ లిస్టు కూడా రెడీ..రేపే నోటిఫికేషన్?!
Also Read: బ్యాంకు కస్టమర్లకు విజ్ఞప్తి..వరుసగా 4 రోజులు ఆ బ్యాంకు బంద్..ఈ పనులు పూర్తి చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Essel Group 100: ఊరికే ఎవరూ నంబర్ 1 కాలేరు.. మార్కెట్లో ఎస్సెల్ గ్రూపు సంచలనం
Wadgaon, Maharashtra:Essel Group 100: సరిగ్గా 100 సంవత్సరాల క్రితం నాటిన విత్తనం నేడు ఒక భారీ వటవృక్షంగా మారింది. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ న్యూస్ ఛానల్ను తీసుకురావడమే కాకుండా, పలు రంగాలలో లీడర్గా ఎదిగిన ఒక సమూహం యొక్క కథ ఇది. ఇది ఎస్సెల్ సమూహం యొక్క 100 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం. 1926 సంవత్సరంలో జగన్నాథ్ గోయెంకా హర్యానాలో తమ మొదటి అడుగు వేశారు. ఆ తర్వాత ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మార్గంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా.. వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేకపోయాయి. హిసార్ నుంచి ఢిల్లీకి చేరుకుని ఈ సమూహం నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 2026లో జరుపుకుంటున్న శతాబ్ది ఉత్సవాల వేళ, ఎస్సెల్ గ్రూప్ ఏయే రంగాలలో అగ్రగామిగా ఉందో తెలుసుకుందాం:
==> భారత సైన్యానికి (Indian Army) ప్రాసెస్డ్ ధాన్యాన్ని సరఫరా చేసిన భారతదేశపు మొట్టమొదటి కంపెనీ.
==> ప్రాసెస్డ్ ధాన్యాల నిల్వ కోసం ఉపయోగించే HDPE (హై డెన్సిటీ పాలిథిలిన్) ను తయారు చేసిన భారతదేశపు మొట్టమొదటి కంపెనీ.
==> ప్రపంచంలోనే అతిపెద్ద లామినేటెడ్ ట్యూబ్స్ తయారీ సంస్థ.
==> భారతదేశపు అతిపెద్ద అమ్యూజ్మెంట్ పార్క్, ఆసియాలోనే అతిపెద్ద థీమ్ వాటర్ పార్క్.
==> భారతదేశపు మొట్టమొదటి, అతిపెద్ద ప్రైవేట్ శాటిలైట్ టెలివిజన్ కంపెనీ- 1992లో భారతదేశపు మొదటి హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానల్గా Zee TV ప్రారంభమైంది.
==> భారతదేశపు అతిపెద్ద మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ కంపెనీ.
==> 1995 సంవత్సరంలో భారతదేశపు మొట్టమొదటి 24 గంటల ప్రైవేట్ న్యూస్ ఛానల్ (Zee News) లాంచ్ అయింది.
==> భారతదేశపు మొదటి లాటరీ వ్యాపారం- 2001లో ప్లేవిన్ లాటరీ భారతదేశంలో మొదటిసారిగా ఆన్లైన్ టికెట్ అమ్మకాలను ప్రారంభించింది.
భారతదేశపు మొట్టమొదటి విలువైన లోహాల రిఫైనరీ- 2001లో శిర్పూర్ రిఫైనరీ రూపంలో భారతదేశపు మొట్టమొదటి, ఆసియాలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ ప్రారంభమైంది.
==> భారతదేశపు అతిపెద్ద ప్రీ-స్కూల్ నెట్వర్క్ 'Kidzee' 2003లో ప్రారంభం.
==> భారతదేశపు మొట్టమొదటి, అతిపెద్ద DTH కంపెనీ 'డిష్ టీవీ' 2004లో ప్రారంభమైంది.
==> భారతదేశపు టాప్-10 ఇన్ఫ్రా (ఇన్ఫ్రాస్ట్రక్చర్) కంపెనీలలో ఒకటి.
Essel Group 100 Years: ఎస్సెల్ గ్రూపు వందేళ్ల ప్రస్థానం.. ఒక్కో ఏడాది ఒక్కో గెలుపు
Wadgaon, Maharashtra:Essel Group 100: దేశ వ్యాపార, మీడియా సామ్రాజ్యంలో ఎస్సెల్ గ్రూప్ అనేది చెరగనిది. ఈ గ్రూపు ఏర్పడి వందేళ్లు పూర్తయ్యింది. టైప్ రైటర్ల నుంచి టెలిప్రాంప్టర్ల వరకు సంవత్సరాలుగా ఈ బహుళ వ్యాపార సముదాయంలో ఎస్సెల్ గ్రూపు వేల కోట్ల టర్నోవర్తో కొనసాగుతోంది. భారతదేశపు ప్రముఖ బహుళ-మిలియన్ డాలర్ల వ్యాపార సముదాయమైన ఎస్సెల్ గ్రూప్, ఆవిష్కరణ, నాయకత్వం, వృద్ధి, ప్రపంచాన్ని మార్చడంలో ఎస్సై గ్రూపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.
సరిగ్గా వందేళ్ల కిందట 1926లో దేశ వ్యవసాయ అభివృద్ధి ఊపందుకుంది. అప్పుడే ఎస్సెల్ గ్రూప్ ఆహార ధాన్యాల వ్యాపారంలోకి ప్రవేశించింది. 10 దశాబ్దాలుగా ఎస్సెల్ గ్రూప్ మీడియా, వినోదం, ప్యాకేజింగ్, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, విద్య, ఫైనాన్స్, విలువైన లోహాలు, టెక్నాలజీ రంగాలలో విభిన్న వ్యాపార ఉనికిని కలిగి ఉన్న బహుళ-బిలియన్ డాలర్ల వ్యాపార సముదాయంగా ఎదిగింది.
ఎస్సెల్ తన అన్ని వ్యాపారాలలో 10 దశాబ్దాలుగా విలువ సృష్టిలో ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. ఎస్సెల్ గ్రూప్ కంపెనీలు తమ వినియోగదారులందరికీ అత్యుత్తమమైన వాటిని అందించాలనే లక్ష్యంతో, సరికొత్త ఆవిష్కరణలను, అత్యుత్తమ విలువ కలిగిన ఉత్పత్తులను తీసుకురావడానికి కృషి చేస్తుంది. ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు, 40,000 మందికి పైగా ఉద్యోగులతో ఎస్సెల్ గ్రూప్ రోజురోజుకు విస్తరిస్తోంది.
పది దశాబ్దాలుగా ఎస్సెల్ గ్రూప్ ప్రస్థానం
1941: జగన్నాథ్ గోయెంకా తన వ్యాపారాన్ని అడంపూర్ నుంచి హర్యానాలోని హిసార్కు మార్చారు.
1946: ఒకార దుకాన్ మూతపడింది. డాక్టర్ సుభాష్ చంద్ర తండ్రి నందకిషోర్ గోయెంకా 16 సంవత్సరాల వయస్సులో కుటుంబ వ్యాపారంలో చేరి గణనీయమైన పురోగతిని సాధించారు.
1948: జగన్నాథ్ గోయెంకా ఢిల్లీకి తరలివెళ్లి మోతీఖాన్లో భూమిని కొనుగోలు చేసి.. పాలిష్ చేసిన పప్పులను ఉత్పత్తి చేసే కంపెనీని స్థాపించారు.
1951: హిసార్లో ఒక కొత్త, లాభదాయకమైన యూనిట్ గుజరాత్, దక్షిణ రాష్ట్రాలకు పాలిష్ చేసిన శనగలను సరఫరా చేయడం ప్రారంభం
1969: మెస్సర్స్ రామ్గోపాల్ ఇంద్రప్రసాద్ పేరును సుభాష్ చంద్ర లక్ష్మీ నారాయణ్ (ఎస్ఎల్)గా మార్చారు.
1970: 20 ఏళ్ల వయసులో డాక్టర్ సుభాష్ చంద్ర కేవలం రూ.17తో ఒక సూట్కేస్ పట్టుకుని ఢిల్లీకి వెళ్లారు.
1971: ఢిల్లీలో డాక్టర్ సుభాష్ చంద్ర ఒక పప్పు మిల్లును లీజుకు తీసుకున్నారు. ఇది వ్యవసాయం నుండి పారిశ్రామిక రంగంలోకి మారడానికి నాంది పలికింది.
1976: కంపెనీ పేరును ఎస్సెల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్గా మార్చారు.
1981: భారతదేశంలో లామినేటెడ్ ప్లాస్టిక్ ట్యూబ్ టెక్నాలజీని ప్రవేశపెట్టి.. డాక్టర్ సుభాష్ చంద్ర ఎస్సెల్ ప్రోప్యాక్ లిమిటెడ్ను ప్రారంభించారు. ఇది తరువాత ప్రపంచంలోనే అతిపెద్ద ట్యూబ్ తయారీదారులలో ఒకటిగా అవతరించి.. సంవత్సరానికి 8 బిలియన్లకు పైగా ట్యూబ్లను ఉత్పత్తి చేసింది.
1990: ఆసియాలోనే అతిపెద్ద వినోద పార్క్ ఎస్సెల్ వరల్డ్ను ముంబైలో ప్రారంభించారు.
1992: భారతదేశపు మొట్టమొదటి హిందీ వినోద ఛానెల్ జీ టీవీ ప్రారంభం. ఇది భారతదేశపు శాటిలైట్ టెలివిజన్ పరిశ్రమకు పునాది వేసింది.
1995: భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ యాజమాన్యంలోని 24 గంటల వార్తా ఛానెల్ జీ న్యూస్ ప్రారంభం.
1995: జీ టీవీ యూకే ప్రారంభంతో జీ ఎంటర్టైన్మెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరణ
2001: భారతదేశపు మొట్టమొదటి, ఆసియాలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కర్మాగారమైన షిపుర్ రిఫైనరీ ప్రారంభం
2001: ఆన్లైన్లో టిక్కెట్ల అమ్మకాలను అనుమతించిన భారతదేశపు మొట్టమొదటి లాటరీ వేదిక ప్లేవిన్ లాటరీ ప్రారంభం
2004: ప్రస్తుతం ఆసియాలోనే అతిపెద్ద డిటిహెచ్ నెట్వర్క్ డిష్ టీవీ ప్రారంభం
2005: ప్రముఖ ఆంగ్ల బ్రాడ్షీట్ దినపత్రిక డీఎన్ఏ (డైలీ న్యూస్, అనాలిసిస్) ప్రారంభం
2005: మల్టీప్లెక్స్ సినిమా చైన్ ఈ-సిటీ బయోస్కోప్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, సిటీ ఎనర్జీ లిమిటెడ్ ప్రారంభం
2007: భారతదేశపు ఏకైక సమీకృత యుటిలిటీస్ కంపెనీ ఎస్సెల్ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ ప్రారంభం
2013: వినియోగదారుల అవసరాలకు ప్రాధాన్యతనిచ్చే ఆర్థిక సేవల సంస్థ ఎస్సెల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఎల్ఎల్పీ స్థాపన
2015: ప్రతి భారతీయుడికి ఒక గృహాన్ని అందించాలనే లక్ష్యంతో ఎస్సెల్ గ్రూప్ ఆశా 2022 ద్వారా గృహ నిర్మాణ రంగంలోకి ప్రవేశం
2016: ఎస్సెల్ గ్రూప్ తన 90 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.
కిడ్జీ: ఆసియాలోనే అతిపెద్ద ప్రీస్కూల్ చైన్గా ప్రారంభమై 4 లక్షలకు పైగా పిల్లల జీవితాలను ప్రభావితం చేసింది.
లివింగ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్
వినోద రంగ వ్యాపారాలలోకి గ్రూప్ విస్తరణలో భాగంగా ఇది స్థాపించింది.
ఎస్సెల్ గ్రూప్ భారతీయ టీవీ రంగ స్వరూపం మార్పు
సరళీకరణకు ముందు భారతీయ టెలివిజన్ చాలా వరకు కఠినమైన నియంత్రణలతో ఏకరీతిగా ఉండేది. కంటెంట్ వైవిధ్యం, ప్రాంతీయ ప్రాతినిధ్యం రెండింటిలోనూ పరిమితులు ఉండేవి. ఎస్సెల్ గ్రూప్ ప్రవేశం, ప్రకటనల ఆదాయం, ప్రేక్షకుల విభజన, విభిన్న కార్యక్రమాలపై ఆధారపడిన వాణిజ్య ఆధారిత నమూనాను ప్రవేశపెట్టి ఈ స్వరూపాన్ని మార్చివేసింది. జీ టీవీ సాధించిన అద్భుత విజయం, భారతదేశంలో ప్రైవేట్ ప్రసారాల సాధ్యాసాధ్యాలను నిరూపించింది. ఇది వార్తలు, వినోద రంగాలలోకి కొత్త సంస్థలు ప్రవేశించడానికి నాంది పలికింది. కాలక్రమేణా సంవత్సరాలు గడిచేకొద్దీ ఇది జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఒక పెద్ద నెట్వర్క్గా విస్తరించింది. వినోదం, వార్తలు, ప్రాంతీయ భాషా ఛానెల్లతో కూడిన విస్తృత పోర్ట్ఫోలియోను నిర్మించింది. కంపెనీలను మాత్రమే కాకుండా స్వయంప్రతిపత్తమైన పరిశ్రమలను కూడా స్థాపించిన తన మార్గదర్శక కార్యక్రమాల ద్వారా ఎస్సెల్ గ్రూప్ 'వందేళ్ల ముద్ర'ను సృష్టించింది. దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉపాధి అవకాశాలను కల్పించింది.
Heat Stroke Policy: ఎండల తీవ్రతకు హాస్పిటల్ పాలైతే.. ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇస్తాయా? రూల్స్ ఇవే!
Hyderabad, Telangana:Does health insurance pay for heatstroke: ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలను సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని సమస్యలకు మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయి. ఎండలు తీవ్రంగా ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటుతున్నాయి. అయితే, ఈ ఎండల తీవ్రత వల్ల హీట్ స్ట్రోక్ వస్తే, ఇన్సూరెన్స్ ద్వారా మనం ఆరోగ్య సేవలు పొందవచ్చా? ఆసుపత్రిలో బీమా కంపెనీలు డబ్బులు చెల్లిస్తాయా? కొన్ని నివేదికల ప్రకారం, ఆరోగ్య బీమా ఉంటే హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే అనారోగ్యానికి బీమా వర్తిస్తుంది. అయితే, దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మీరు తీసుకున్న బీమా పాలసీలో వడదెబ్బకు గురైతే చికిత్సకు డబ్బులు వస్తాయని ఉంటేనే మీరు క్లెయిమ్ చేసుకోగలరు. లేకపోతే ఇబ్బంది అవుతుంది. దీంతోపాటు రూమ్ రెంట్, డాక్టర్ ఫీజులు, టెస్టులు, మందుల ఖర్చులు కూడా మీరే పెట్టుకోవాల్సి వస్తుంది.
పాలసీ నిబంధనలు ఇవే:
మీరు ఏదైనా ఆరోగ్య బీమా తీసుకుంటే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోవాలి. ఎందుకంటే, వేసవి కాలం ప్రతి సంవత్సరం వస్తుంది. కాబట్టి వడదెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. బయటకు వెళ్లినప్పుడు ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకే, అలాంటి ఆరోగ్య బీమా తీసుకోవడం మంచిది. కొన్ని షరతులతో కూడిన పాలసీలు మాత్రమే డబ్బులు చెల్లిస్తాయి.
ఆరోగ్య బీమా షరతుల ప్రకారం, పేషెంట్ ఆసుపత్రిలో చేరి 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ఆ ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. వడదెబ్బ తగిలినప్పుడు ఆసుపత్రి రిపోర్టులో స్పష్టంగా రాసి ఉంటేనే క్లెయిమ్ చేసుకోవచ్చు. పాలసీ ప్రకారం, మీరు ప్రతి సంవత్సరం ప్రీమియం కడుతూ ఉండాలి. పాలసీ యాక్టివ్ గా ఉంటేనే హీట్ స్ట్రోక్ గురైనప్పుడు చికత్సికు మీరు ఈజీగా క్లెయిమ్ చేసుకోగలరు.
ఇలాంటి రూల్స్ పాటించకపోతే ఆసుపత్రిలో బిల్లులు కట్టినా కూడా మీరు డబ్బులు పొందలేరు. అంతేకాదు, మీరు కేవలం ఓపీ(OP)లో హీట్ స్ట్రోక్ ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇవ్వవు. పాలసీలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. కాబట్టి అన్ని విషయాలు సరిగ్గా ఉంటేనే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందగలరు. లేకపోతే మీ బీమా కంపెనీలు మీ అప్లికేషన్ ను రిజెక్ట్ చేసే అవకాశం ఉంది.
Also read: పీఎం కిసాన్ లబ్ధిదారుల లిస్ట్ నుండి మిమ్మల్ని తీసేశారా? ఈ కొత్త రూల్స్ చెక్ చేసుకోండి!
Also read: జూన్ 2027 వరకు ఉచితంగా ఆధార్ అప్డేట్! ఎలా చేయాలో చూడండి!
ఇవి ముఖ్యమైనవి:
కొన్ని రూల్స్ ప్రకారం, ఆసుపత్రిలో 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఇస్తాయి. అంతేకాదు, ఎండ దెబ్బ వల్లే ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు డాక్టర్ స్పష్టంగా రిపోర్టులో రాయాలి. లేకపోతే మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. పాలసీ కట్టినా కూడా మీరు డబ్బులు పొందలేరు. మీరు ఎంచుకునే బీమా కంపెనీలో హీట్ స్ట్రోక్ క్లెయిమ్ ఉన్న వాటిని మాత్రమే ఎంచుకోవడం మేలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
PM Modi Cabinet Meeting: నేడు కేంద్ర క్యాబినేట్ అత్యవసర సమావేశం..మంత్రులందరూ ఢిల్లీలో ఉండాలని మోదీ ఆదేశాలు!
New Delhi, Delhi:PM Modi Cabinet Meeting Today: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాత్కాలిక కేంద్ర మంత్రిమండలి నేడు అత్యవసరంగా సమావేశం జరగనుంది. తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ప్రధాని ఈ భేటీని పిలవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీలోని 'సేవా తీర్థ్' వేదికగా సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
కేంద్ర క్యాబినెట్ మంత్రులతో పాటు, స్వతంత్ర బాధ్యతలు గల సహాయ మంత్రులు, రాష్ట్ర మంత్రులందరూ ఈ చర్చల్లో పాల్గొంటారు. రాజకీయ, అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర మంత్రులెవరూ ఢిల్లీ వదిలి వెళ్లొద్దని, అందరూ రాజధానిలోనే అందుబాటులో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
భేటీలో ప్రధానాంశాలు ఇవేనా?
ఈ అత్యవసర నేపథ్యంలో రెండు అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ (క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ)..
మోదీ 3.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 10 నాటికి రెండేళ్లు పూర్తయింది. ఈ తరుణంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు, విస్తరణ ఉంటాయనే ప్రచారం. రెండో వారంలోనే ఈ మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం.. ఈ రోజు జరగనున్న అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
పశ్చిమాసియా సంక్షోభం..
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణంపై ఈ భేటీలో ప్రధానంగా సమీక్షించనున్నారు. అంతర్జాతీయ సంక్షోభం వల్ల భారతదేశంపై పడే ఆర్థిక ప్రభావం, ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరల పెరుగుదల, ఇంధన సరఫరా వంటి వ్యూహాత్మక అంశాలను ప్రధాని మోదీ మంత్రులతో చర్చించారు. అలాగే పశ్చిమాసియా సంక్షోభాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఉన్నతస్థాయి కమిటీ వివరాలు..
చైర్మన్: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
సభ్యులు: అమిత్ షా (హోం మంత్రి), నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి), హర్దీప్ సింగ్ పూరి (పెట్రోలియం మంత్రి)
అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణ రక్షణ భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు నిండుగా ఉన్నాయని, ఎలాంటి ఇంధన కొరత లేదా ఇబ్బందులు తలెత్తవని ఆయన దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు.
Also Read: బ్యాంకు కస్టమర్లకు విజ్ఞప్తి..వరుసగా 4 రోజులు ఆ బ్యాంకు బంద్..ఈ పనులు పూర్తి చేయండి!
Also Read: జూన్ 30 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు..పండగ చేసుకుంటున్న విద్యార్థులు..ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Aadhaar Update: గుడ్ న్యూస్.. జూన్ 2027 వరకు ఉచితంగా ఆధార్ అప్డేట్! ఎలా చేయాలో చూడండి!
Hyderabad, Telangana:Free Aadhaar Update Till 2027 June 14: ఆధార్ కార్డు అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన డాక్యుమెంట్గా మారిపోయింది. ఇది ఒక గుర్తింపు పత్రం. భారతదేశంలో ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, బ్యాంకు లావాదేవీలు, కొత్తగా సిమ్ కార్డు కొనాలంటే కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. దీంతో పాటు ట్రైన్, ఫ్లైట్లో ప్రయాణం చేయాలంటే కూడా ఆధార్ వివరాలు తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఆధార్ కార్డులో మీరు ఉచితంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. అడ్రస్, మొబైల్ నెంబర్, మీ వ్యక్తిగత వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.
ఆధార్ అప్డేట్లో ఇవి ఉచితం...
ఆధార్ వ్యక్తిగత వివరాలకు సంబంధించిన విషయాలను సులభంగా, ఉచితంగా అప్డేట్ చేసుకునే సౌలభ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఆధార్ కార్డుదారులు 2027 జూన్ 14వ తేదీ వరకు ఉచిత సేవలను పొందవచ్చు. మీరు మై ఆధార్ పోర్టల్ లేదా నేరుగా ఆన్లైన్ పోర్టల్లో కూడా ఈ అప్డేట్ సేవలను పొందవచ్చు.
ఆధార్ అప్డేట్కి ఇవి తప్పనిసరి...
ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే బ్యాంకు ఖాతా, డీమ్యాట్ అకౌంట్ విషయాల్లో ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినప్పుడు కూడా KYC రిజెక్ట్ అవుతుంది. పాన్ ఆధార్ లింక్, అథెంటికేషన్ కూడా సమస్యగా మారుతుంది. అంతేకాదు పెన్షన్, కొన్ని ప్రభుత్వ సంబంధిత సబ్సిడీలు, సిమ్ వెరిఫికేషన్ కూడా జరగవు.
Also read: ఆధార్ కార్డు ఉన్నవారికి బంపర్ గుడ్ న్యూస్.. మరోసారి గడువు పెంపు
Also read: Aadhaar Update: ఆధార్లో అడ్రస్, పుట్టినతేదీ మార్చేందుకు ఏమేం అవసరం, ఎలా చేయాలి
ఆధార్ అప్డేట్కి కావలసిన పత్రాలు..
My Aadhaar పోర్టల్ ఓపెన్ చేసి అక్కడ ఆధార్ నంబర్తో మీరు లాగిన్ అవ్వాలి. OTP నమోదు చేస్తే మీ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. అక్కడ మీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. డాక్యుమెంట్ అప్డేట్ ప్రాసెస్ సెలెక్ట్ చేస్తే మీ ఐడెంటిటీ ప్రూఫ్ను కూడా అక్కడ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత JPEG, PNG లేదా PDF ఫార్మాట్లో ఉన్న ఫైల్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి. చివరిగా సబ్మిట్ బటన్ను క్లిక్ చేయాలి.
LPG గ్యాస్ సిలిండర్లో మీరు సబ్సిడీ పొందాలంటే కూడా ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్తో లింక్ అయి ఉండాలి. అప్పుడే LPG సబ్సిడీ పొందుతారు. దీనికి కూడా మీ ఆధార్ ఎప్పటికీ అప్డేటెడ్గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఈ ప్రయోజనాన్ని కూడా పొందలేరు. ఆధార్ కార్డుతో కొత్త బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా మీ నంబర్తో ఇది ఖాతా ఓపెన్ చేస్తారు. దీనికి కూడా మీ వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Caste Census: కులగణనపై సుప్రీంకోర్టు తీర్పు.. తెలంగాణ మంత్రి హర్షం
Makthal, Telangana:Caste Census: కులగణన నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వం స్వాగతించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక అభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయానికి బలాన్నిచ్చేదిగా ఉందని పేర్కొన్నారు.
'సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు కులగణన అవసరమని సుప్రీంకోర్టు పేర్కొనడం ఎంతో కీలకం' అని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. వెనుకబడిన వర్గాల (బీసీ) అసలు జనాభా, వారి ఆర్థిక- సామాజిక పరిస్థితులు తెలిసినప్పుడే ప్రభుత్వాలు సరైన విధానాలు రూపొందించగలవని చెప్పారు. సమాజంలోని బలహీన వర్గాలకు న్యాయం చేయాలంటే కచ్చితమైన గణాంకాలు అవసరమని, అదే లక్ష్యంతో కులగణన చేపట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వెనుకబడిన వర్గాలకు నూతన ఆశలు కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు.
'కులగణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని.. ఇందులో కోర్టుల జోక్యం ఉండదని ధర్మాసనం స్పష్టం చేయడం రాజ్యాంగబద్ధ పరిపాలనకు బలం' అని మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు. సమగ్ర అభివృద్ధి, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం సాధనలో ఈ తీర్పు చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని, సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా తాము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై బీసీ సమాజం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. దేశంలో బీసీలు ఎంత మంది ఉన్నారో తెలిస్తే తమ బీసీ వర్గానికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే జనగణనతోపాటు కుల గణన కూడా చేయాలని బీసీ సంఘాలతోపాటు సామాజికవేత్తలు కోరుతున్నారు.
పాలమూరు ప్రాజెక్టుపై
పాలమూరు ప్రాజెక్టుపై స్పందిస్తూ.. 'బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై పోరాటాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. పదేళ్ల పాలనలో ప్రాజెక్టును పూర్తి చేయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ నిధులు కేటాయించి పాలమూరుపై వివక్ష చూపించారు. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాటలను నమ్మడం మానేశారు. వరుస ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం' అని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
Kurchi Thatha: సోషల్ మీడియా తీవ్ర దిగ్భ్రాంతి.. గుండెపోటుతో 'కుర్చీ తాత' మృతి
Hyderabad, Telangana:Kurchi Thatha Passes Away: ఒకే ఒక్క డైలాగ్తో క్రేజ్ సంపాదించుకుని.. ఏకంగా మహేశ్ బాబు తన సినిమాలో పాటగా పెట్టుకునే స్థాయికి చేరిన కుర్చీ తాత ఇక లేరు. వాకింగ్కు వెళ్లిన ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆయన మరణించారు. అతడి మరణంతో సోషల్ మీడియా ప్రపంచం దిగ్భ్రాంతికి గురయ్యింది. వడదెబ్బతో లేక గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది. నెటిజన్లు అతడి మరణం జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: Petrol Price: 'మోదీ పిలక ట్రంప్ చేతికి చిక్కింది.. ఇందిరకు ఉన్న తెగువ మోదీకి లేదు
‘కుర్చీ మడతపెట్టి’ అనే డైలాగ్తో కుర్చీ తాతగా మహ్మద్ పాషా అలియాస్ కాలా పాషా గుర్తింపు పొందారు. హైదరాబాద్లోని కృష్ణానగర్లో కుటుంబంతో నివసిస్తుండేవాడు. ఆయనకు ఒక భార్య, కుమార్తె ఉన్నారు. యూసుఫ్గూడలోని కృష్ణకాంత్ పార్కులో మహ్మద్ పాషా నిత్యం కనిపిస్తుంటాడు. బుధవారం వాకింగ్కు వెళ్లిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. గుండెపోటుతో లేక వడదెబ్బతో చనిపోయారా? అనేది తెలియడం లేదు. ఆయన మృతితో కుటుంబసభ్యులు దుఃఖంలో మునిగిపోయారు. ఆయన మరణంపై సోషల్ మీడియా ప్రేక్షకులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతడి అంత్యక్రియలు రేపు చేస్తారని కుటుంబసభ్యులు చెప్పారు. కాగా అతడి కుటుంబాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సంతాపం ప్రకటించారు. ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారని సమాచారం.
Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!
రాత్రికి రాత్రే ఫేమస్
ఒకసారి పార్క్ వద్ద ఓ మీడియా ఛానల్ (జీ తెలుగు న్యూస్ కాదు) ప్రతినిధి ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో కుర్చీ మడత పెట్టి ***తె అనే పదం వాడాడు. ఆ ఒక్క డైలాగ్తో సోషల్ మీడియాలో రాత్రికే రాత్రే స్టార్ అయ్యాడు. అనంతరం మరికొంతమంది అతడిని ఇంటర్వ్యూలు చేయడం.. అతడితో మాట్లాడించడంతో మహ్మద్ పాషా కాస్త కుర్చీ తాతగా మారిపోయాడు. సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్లో ఉండే ఈయన పలు టీవీ షోలలో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. పలు సోషల్ మీడియా ఛానల్స్ వారు ఇంటర్వ్యూలు కూడా చేశాయి. ఇక ఆయన డైలాగ్తో సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలో పాటగా పెట్టుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమాలో కుర్చీ తాత డైలాగ్ 'కుర్చీ మడతపెట్టి' అనే పాటను ప్రత్యేకంగా పెట్టారు. ఆ పాటలో మహేశ్ బాబు, శ్రీలీల ఊర మాస్ డ్యాన్స్ చేశారు. మహేశ్ బాబు తన కెరీర్లోనే ఆ స్థాయిలో డ్యాన్స్ ఎప్పుడూ చేయలేదు. పాటలో కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ను వాడుకున్నందుకు సంగీత దర్శకుడు థమన్ ఆ కుర్చీ తాతకు కొంత డబ్బులు ఇచ్చారని సమాచారం. అంతలా గుర్తింపు పొందిన వ్యక్తి మరణించడంతో అతడి వినోదం కోసం ఎదురుచూసే సోషల్ మీడియా ప్రేక్షకులకు ఇది కలచివేసే విషయం.
Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్.. భారీగా జీతాల పెంపు అప్పుడే
గతంలో పుకార్లు
కుర్చీ తాత మరణంపై గతంలో పలుమార్లు పుకార్లు వచ్చాయి. 'కుర్చీ తాత చనిపోయాడు' అంటూ సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు హల్చల్ చేశాయి. ఆ సమయంలో అతడితోపాటు అతడి కుటుంబసభ్యులు.. 'నేను బతికే ఉన్నా. తప్పుడు వార్తలు రాయొద్దు.. నమ్మవద్దు' అని స్వయంగా చెప్పుకున్నారు.
Bandi Bhageerath Case: బండి భగీరథ్ అరెస్టుపై తొలిసారి స్పందించిన కేంద్రమంత్రి బండి సంజయ్!
Hyderabad, Telangana:Bandi Bhageerath Case News: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇటీవలే పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. అయితే ఇదే విషయమై ప్రస్తుతం బండి భగీరథ్ కుమారుడు బండి సంజయ్ తొలిసారి స్పందించారు.PM Modi Melody Toffee: PM Modi Gifts Melody to Italian Prime Minister What Exactly Makes This Sweet So Special telugu news
Lakshmapur, Telangana:PM Modi Melody Toffee: సాధారణంగా దేశాధినేతల విదేశీ పర్యటనలు అంటే రొటీన్ రాజకీయాలు.. రక్షణ ఒప్పందాలు.. బిజినెస్ డీల్స్.. ఇవే గుర్తొస్తాయి. ఆ సమయంలో ఇచ్చిపుచ్చుకునే బహుమతులు కూడా అంతే ఖరీదైనవిగా ఉంటాయి. కానీ.. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ గిఫ్ట్ మరేదో కాదు.. మన దేశంలో దశాబ్దాలుగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఒక రూపాయి మెలోడీ చాక్లెట్ ప్యాకెట్.
ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం రోమ్ చేరుకున్న మోదీ.. మే 20న మెలోనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆమెకు ఈ తియ్యటి సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఈ క్రేజీ గిఫ్ట్కు ఫిదా అయిపోయిన జార్జియా మెలోని.. ఆ చాక్లెట్ ప్యాకెట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ థాంక్స్ చెప్పారు. దాంతో అటు ఇటలీలోనూ.. ఇటు ఇండియాలోనూ అసలు ఈ మెలోడీ చాక్లెట్ కథేంటి? ఒక సాధారణ చాక్లెట్ అంతర్జాతీయ దౌత్య నీతిలో ఎలా చోటు సంపాదించుకుంది? అనే చర్చ మొదలైంది. ఆ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం.
అసలు ఈ మెలోడీ టాఫీ వెనకున్న కథేంటి?
ఇటలీ ప్రధాని మెలోని, భారత ప్రధాని మోదీల మధ్య మంచి ఆత్మీయ అనుబంధం ఉంది. వీరిద్దరూ అంతర్జాతీయ వేదికలపై కలిసినప్పుడల్లా నెటిజన్లు సోషల్ మీడియాలో మెలోడీ అనే హాష్ ట్యాగ్ను తెగ ట్రెండ్ చేస్తుంటారు. జార్జియా మెలోని పేరులోని మొదటి నాలుగు అక్షరాలు మెలో, నరేంద్ర మోదీ పేరులోని చివరి రెండు అక్షరాలు డీ కలిపితే ఈ మెలోడీ అనే పదం పుట్టింది. ఇంగ్లీషులో మెలోడీ అంటేనే మాధుర్యం లేదా మధురమైన సంగీతం అని అర్థం. తమ ఇద్దరి కెమిస్ట్రీపై నెటిజన్లు చేసే ఈ అల్లరిని, మీమ్స్ను వీరిద్దరూ ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. పైగా చూసి సరదాగా నవ్వుకుంటారు. అందుకే ఈసారి ఏకంగా ప్రధాని మోదీనే స్వయంగా మెలోడీ టాఫీ ప్యాకెట్ పట్టుకెళ్లి ఇవ్వడంతో ఆ దౌత్య సంబంధాలకు మరింత మాధుర్యం అబ్బినట్లయింది.
రూ. 90,000 కోట్ల పార్లే సామ్రాజ్యం..:
ఈ మెలోడీ చాక్లెట్ను తయారు చేసేది మరెవరో కాదు.. మనందరికీ బాగా తెలిసిన స్వదేశీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ . దేశ స్వాతంత్ర్యానికి ముందే, భారతదేశ స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో 1929లో ముంబైలోని విలే పార్లేలో మోహన్లాల్ దయాల్ చౌహాన్ ఈ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం విజయ్ చౌహాన్.. ఆయన కుటుంబం ఈ కంపెనీ బాధ్యతలను చూసుకుంటున్నారు. పార్లే కుటుంబం కాలక్రమేణా విడిపోయినప్పటికీ.. మిగిలిన బ్రాండ్లు వేర్వేరు సభ్యుల చేతుల్లో ఉన్నాయి. ఉదాహరణకు ఫ్రూటీ, ఆపీ వంటి డ్రింక్స్ ఉన్న పార్లే ఆగ్రో ను ప్రకాష్ చౌహాన్, ఆయన కుమార్తెలు షానా, అలీషా, నాడియా నడుపుతుండగా.. ప్రసిద్ధ వాటర్ బాటిల్ బ్రాండ్ బిస్లరీ ఇంటర్నేషనల్ ను రమేష్ చౌహాన్ చూసుకుంటున్నారు. పార్లే ప్రొడక్ట్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకపోయినప్పటికీ.. దీని మార్కెట్ విలువ దాదాపు 8 నుండి 10 బిలియన్ డాలర్లు మన దేశీ కరెన్సీలో సుమారు రూ.80,000 కోట్ల నుండి రూ. 90,000 కోట్లు ఉంటుందని అంచనా.
Thank you for the gift pic.twitter.com/7ePxbJwPbA
— Giorgia Meloni (@GiorgiaMeloni) May 20, 2026
మెలోడీ ఇత్నీ చాక్లెటీ క్యూ హై? .. మార్కెట్ను షేక్ చేసిన మాస్టర్ స్ట్రోక్:
పార్లే సంస్థ 1983లో మెలోడీ టాఫీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పట్లోనే చాక్లెట్ మార్కెట్లో రారాజుగా ఉన్న క్యాడ్బరీ వంటి పెద్ద బ్రాండ్లను ఢీకొట్టడం పార్లేకు అంత సులువు కాలేదు. ఎందుకంటే క్యాడ్బరీ అప్పట్లో ప్రీమియం బ్రాండ్. వారి చాక్లెట్ బాక్స్లు రూ.10 నుండి రూ.100 వరకు ఉండేవి. సామాన్యులు వాటిని కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. సరిగ్గా ఇక్కడే పార్లే ఒక అద్భుతమైన బిజినెస్ స్ట్రాటజీని వాడింది. సాధారణ చాక్లెట్ బార్స్లా కాకుండా.. బయట నమలడానికి వీలుగా ఉండే క్యారమెల్ లేయర్, లోపల రిచ్ చాక్లెట్ సిరప్ ఉండేలా ఈ టాఫీని డిజైన్ చేసింది. అన్నింటికీ మించి.. దీని ధరను కేవలం 50 పైసలు, రూపాయికే అందుబాటులో ఉంచింది.
దీనికి తోడు వారు వాడిన అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీ ఒక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. మెలోడీ ఇత్నా చాక్లెటీ క్యూ హై? (మెలోడీ ఎందుకు ఇంత చాక్లెటీగా ఉంటుంది?) అనే ఒక ప్రశ్నను జనాల మైండ్లోకి వదిలారు. దానికి సమాధానంగా మెలోడీ ఖావో ఖుద్ జాన్ జావో (మెలోడీ తినండి, మీకే తెలుస్తుంది) అంటూ సరికొత్త ట్యాగ్లైన్తో టీవీ యాడ్స్ వదిలారు.
Also Read: రూ.2లక్షల డౌన్పేమెంట్ కట్టండి.. తర్వాత EMI కట్టుకోండి
అప్పట్లో టీవీలకు విపరీతమైన డిమాండ్ ఉన్న కాలం కావడంతో.. ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు, పాపులర్ టీవీ సీరియల్స్, పిల్లల కార్టూన్ షోల మధ్యలో ఈ యాడ్ను విపరీతంగా టెలికాస్ట్ చేశారు. దాంతో ప్రతి ఒక్కరి నోటా ఈ డైలాగ్ నానేది. ప్రశ్న అడిగి వదిలేయడం వల్ల జనాలు క్యూరియాసిటీతో ఈ చాక్లెట్ను కొని రుచి చూడటం మొదలుపెట్టారు. అలా అది ఒక తరం బాల్య జ్ఞాపకంగా మారిపోయింది.
పల్లెటూరి కిరాణా కొట్టు వరకు తీసుకెళ్లిన నెట్వర్క్:
కేవలం ప్రకటనలు మాత్రమే కాదు, పార్లేకు ఉన్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా మెలోడీ విజయానికి ప్రధాన కారణమని చెప్పాలి. పార్లే-జి బిస్కెట్ల పుణ్యమా అని అప్పటికే దేశంలోని మారుమూల పల్లెటూరి కిరాణా దుకాణం వరకు పార్లేకు గట్టి పట్టుంది. అదే దారిలో మెలోడీ చాక్లెట్లను కూడా గ్రామీణ మార్కెట్లలోకి సులభంగా తీసుకెళ్లగలిగారు. నాడు 90 కిడ్స్ నుంచి నేటి తరం వరకు అందరి చేతుల్లోనూ ఆడుతున్న ఈ రూపాయి చాక్లెట్.. ఇప్పుడు ఏకంగా ఇద్దరు ప్రపంచ దేశాల అధినేతల మధ్య దౌత్య వేదికపైకి చేరి సరికొత్త టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. ఇది మెలోడీ చాక్లెట్ వెనుకున్న కథ.
Also Read: మిడిల్ క్లాస్ జేబుకు చిల్లు పడకుండా.. రూ. 10లక్షల లోపే బెస్ట్ ఫ్యామిలీ కార్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bank Strike 2026: బ్యాంకు కస్టమర్లకు విజ్ఞప్తి..వరుసగా 4 రోజులు ఆ బ్యాంకు బంద్..ఈ పనులుంటే వెంటనే పూర్తి చేసుకోండి!
Hyderabad, Telangana:SBI Bank Strike 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈ నెల (మే) చివరి వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఎస్బీఐ ఉద్యోగుల సంఘం రెండు రోజుల సమ్మెకు పిలుపునివ్వడం, దానికి ముందు వీకెండ్ సెలవులు రావడమే ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 కోట్ల మంది ఎస్బీఐ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమ అత్యవసర బ్యాంకు పనులను ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.
వరుస సెలవుల షెడ్యూల్ ఎలా?
మే 23 (నాలుగో శనివారం): బ్యాంకులకు అధికారిక సెలవు.
మే 24 (ఆదివారం): జనరల్ హాలిడే.
మే 25 (సోమవారం): ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె.
మే 26 (మంగళవారం): ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె.
ఈ క్రమంలో మే 23 నుండి మే 26 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు ఎస్బీఐ బ్రాంచ్లు మూతపడనున్నాయి.
ప్రభావితమయ్యే సేవలు ఇవే..
బ్యాంకు శాఖలు పూర్తి స్థాయిలో మూతపడటం వల్ల కింది సేవలకు తీవ్ర అంతరాయం కలగవచ్చు. కౌంటర్లలో నగదు డిపాజిట్లు, విత్డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ ప్రక్రియ, బ్యాంక్ డ్రాఫ్ట్ల (DD) జారీతో పాటు లోన్లకు సంబంధించిన భౌతిక పత్రాల పరిశీలన, ఇతర ప్రాసెసింగ్ పనులు నిలిపోనున్నాయి.
ఈ నాలుగు రోజులు బ్యాంకు బ్రాంచ్లు పనిచేయకపోయినప్పటికీ.. ఏటీఎంలు (ATMs), ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) వంటి డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే, బ్యాకెండ్ సిబ్బంది లేకపోవడం వల్ల కొన్ని రకాల ఆన్లైన్ లావాదేవీల ప్రాసెసింగ్లో స్వల్ప జాప్యం జరగొచ్చు.
ఎస్బీఐ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏమిటి?
సిబ్బంది కొరత, పెన్షన్లు, నియామకాలతో పాటు మొత్తం 16 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎస్బీఐ ఉద్యోగుల సంఘం ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం.
సిబ్బంది నియామకాలు: ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు, సహాయక సిబ్బంది, సెక్యూరిటీ గార్డుల నియామకాలను తక్షణమే పెంచడం.
వేతన వ్యత్యాసాలు: ఉద్యోగుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాలను తొలగించి, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం.
పెన్షన్ నిబంధనల మార్పు: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద మెరుగైన ప్రయోజనాలు అందించడం, పెన్షన్ లెక్కింపు పద్ధతులను మార్చడం.
5 వర్కింగ్ డేస్ డిమాండ్!
ఇవి కేవలం ఎస్బీఐ ఉద్యోగుల డిమాండ్లు అయినప్పటికీ.. బ్యాంకింగ్ రంగం మొత్తంలో "వారానికి 5 రోజుల పని దినాల" (5-Day Week) విధానాన్ని తీసుకురావాలనే డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది. ఆర్బీఐ, స్టాక్ మార్కెట్, కమోడిటీ మార్కెట్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నీ శని, ఆదివారాలు పూర్తిగా మూతపడుతుంటే.. బ్యాంకులకు మాత్రం నెలకు రెండు శనివారాలు ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
Also Read: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..జనసేన, టీడీపీ లిస్టు కూడా రెడీ..రేపే నోటిఫికేషన్?!
Also REad: జూన్ 30 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు..పండగ చేసుకుంటున్న విద్యార్థులు..ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..జనసేన, టీడీపీ లిస్టు కూడా రెడీ..రేపే నోటిఫికేషన్?!
Nuzendla, Andhra Pradesh:AP Rajya Sabha Nominations 2026: ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రేపు (గురువారం) రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జాబితా ఆసక్తి రేపుతోంది.
బీజేపీ నుంచి అన్నామలై ఖరారు?
ఎన్డీఏ కూటమి ఒప్పందంలో భాగంగా ఒక స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ.. తమ అభ్యర్థిగా తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత కె.అన్నామలై పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే అధిష్ఠానం నుంచి కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు స్పష్టమైన సమాచారం అందినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
టీడీపీ రేసులో ఉన్న సీనియర్లు వీరే..
మిగిలిన మూడు స్థానాల్లో టీడీపీ, జనసేనలు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయనున్నాయి. టీడీపీ తరఫున పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీ తరఫన సిట్టింగ్ ఎంపీగా ఉన్న సానా సతీశ్కు మరోసారి రెన్యూవల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఎస్సీ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే టీడీపీ తరఫున వర్ల రామయ్యను ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాగే బీసీ వర్గానికి ఇవ్వాలనుకుంటే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే అదే విధంగా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ కూడా టీడీపీ తరఫున రాజ్యసభ సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ ముస్లిం మైనారిటీ కోటాలో అవకాశం ఇవ్వాలని భావిస్తే.. ప్రస్తుతం ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఎంఏ షరీఫ్ పేరును పరిశీలించవచ్చు.
జనసేన నుంచి ఊహించని ట్విస్ట్!
జనసేన కోటా స్థానానికి సంబంధించి ఇప్పటివరకు పార్టీ సీనియర్ నేత లింగమనేని రమేశ్ పేరు బలంగా వినిపించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం రేసులోకి మరో ఇద్దరు అనూహ్యంగా వచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు నరసింహరావుతో పాటు టాలీవుడ్లో వరుసగా క్రేజీ సినిమాలు తీస్తున్న ఒక ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ను కూడా జనసేన నుంచి రాజ్యసభకు పంపనున్నారని సమాచారం అందుతోంది.
చివరి నిమిషంలో అధిష్ఠానం పెద్దలు ఏవైనా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తప్ప.. దాదాపు పైన పేర్కొన్న పేర్లలో నుంచే ఏపీ కూటమి రాజ్యసభ తుది జాబితా వెలువడే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
Also Read: జూన్ 30 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు..పండగ చేసుకుంటున్న విద్యార్థులు..ఎక్కడంటే?
Also Read: బక్రీద్ పండగ ఎప్పుడు? మే 27 లేదా మే 28 ప్రభుత్వ సెలవు ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
