Back

Telangana News: క్లినికల్ ట్రయల్స్ పేరు మీద జంతువులను హింసించ రాదు
Hyderabad, Telangana
పీటా ఇండియా ఎన్జీవో వారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ యందు సైన్స్ పాలసీ అడ్వైజర్ అంజన అగర్వాల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.
తెలంగాణకి సంబంధించిన ఒక టెస్టింగ్ లేబరేటరీ లో అమాయకమైన కుక్కలను కోతులను మరియు ఇతర జంతువులను టెస్టింగ్ పేరిట హింసకు గురి చేస్తున్నట్లు మీడియా ముఖంగా తెలిపారు.
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Hyderabad, Telangana:
గోమాత రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని జన్ ఊర్జా మంచ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ నిషిత దీక్షిత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యువ తులసి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివకుమార్, బాలస్వామి లు మాట్లాడారు. గోహత్య మహా పాపమని, గోవులను కిరాతకంగా హత్య చేసిన ఏ దేశము ఏ ప్రాంతము అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని అన్నారు. గోవులను హత్య చేసిన మహా నేతలు సైతం నేలకొరిగిన విషయాన్ని గుర్తు చేశారు.
0
Share
Report
Bhimavaram, Andhra Pradesh:
సామాజిక బాధ్యత,సేవా స్పూర్తితో జిల్లా పోలీస్ శాఖకు హై-టెక్ డ్రోన్ ను అందించిన శాసనసభ ఉపసభాపతి శ్రీ కనుమూరు రఘు రామ కృష్ణ రాజు.
జిల్లా పోలీసు శాఖకు మౌలిక వసతులు కల్పనకై విశేష కృషి చేస్తున్న రఘు రామ కృష్ణ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లా ఎస్పీ. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నయీం అస్మి తో కలిసి మొక్కలు నాటారు రఘురామకృష్ణరాజు.
0
Share
Report
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు, కాళ్ల మండలం పెదఆమిరంలో ఓపెన్ ఎయిర్ థియేటర్లుకు శంకుస్థాపన చేయబోతున్నామని ఏపి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. జిల్లాలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండి నియోజకవర్గంలో శిల్పారామం లాంటిది ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది.
1
Share
Report
Bhimavaram, Andhra Pradesh:
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరులో రైతులకు డ్రోన్లు పంపిణీ చేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.
0
Share
Report
Bollaram, Telangana:
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి సంబంధించి 13వ విడత 11 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 17 మంది లబ్ధిదారులకు అందజేసిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.
0
Share
Report
Hyderabad, Telangana:
బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు దీనిలో భాగంగా అక్రమంగా నిషేధిత మత్తు పదార్థాలను అమ్ముతున్న కరణ్ పరమార్(32) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ కిషన్ వెల్లడించారు.నిందితుడి వద్ద నుండి 19.36 గ్రాముల కొకైన్ తో పాటు 6.77 గ్రాముల కుష్ గంజాయి, 55 వేల రూపాయల నగదు ఐఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు కరణ్ పరమార్ గోవాకు చెందిన సంతోష్ జావిద్ నుండి కొరియర్ ద్వారా ఈ మత్తు పదార్థాలను తెప్పించుకొని నగరంలో అవిక్రయిస్తున్నట్లు గుర్తించామని అన్నారు.
1
Share
Report
Hyderabad, Telangana:
జెప్టో యాప్ గుడ్లు ఆర్డర్ పెట్టిన వినియోగదారుడు కి చేదు అనుభవం ఎదురైంది. హైదర్ నగర్ లో నివాసం ఉండే దేవా నేడు ఉదయం యాప్ లో ఆర్డర్ చేసుకోక కనీసం వాటిని పరీక్షించకుండా సిబ్బంది కుళ్ళిపోయిన గుడ్లను వినియోగదారుడికి అందజేశారు. వెంటనే సంబంధిత సిబ్బందికి తెలియజేసిన నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా పట్టించుకోలేదన్నారు. ఇలాంటి వారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని వినియోగదారుడు వాపోయారు.
1
Share
Report
Hyderabad, Telangana:
బిల్డర్ నన్ను మోసం చేశాడు అంటూ హైదర్ నగర్ మేస్త్రీ రాము సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు ఇవ్వాల్సిన రూ.8 లక్షలు ఇవ్వలేదని, మొత్తం నగదు ఇస్తేనే సెల్ టవర్ దిగుతానని పట్టబట్టాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని అతడికి సర్ది చెప్పగా కిందికి దిగాడు।
1
Share
Report
Hyderabad, Telangana:
పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ. అసలు ఆపరేషన్ సింధూర్ జరిగితే ఇప్పటివరకు మట్టుపెట్టిన ఉగ్రవాదుల ఫోటోలు కానీ వీడియోలు కానీ విడుదల చేయలేని పరిస్థితిలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. నేడు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కూకట్ పల్లి రాజీవ్ సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగంతో కలిసి నివాళులు అర్పించారు.
1
Share
Report