Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
Benefits of Wearing Gold Ornaments: బంగారం ధరిస్తే ఆ రోగాలు రావా? ఆభరణాల వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే!...
HDHarish Darla
Feb 01, 2026 10:11:23
Hyderabad, Telangana

Science Behind Wearing Gold Ornaments: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా, పసిడిపై భారతీయులకున్న మక్కువ ఏమాత్రం తగ్గదు. అయితే, మన పూర్వీకులు నగలను కేవలం అలంకరణ కోసమే కాకుండా, శరీర ఆరోగ్యాన్ని కాపాడే ఒక 'మెడికల్ థెరపీ'లా భావించేవారని మీకు తెలుసా? ముక్కుపుడక నుండి కాలి మెట్టెల వరకు మనం ధరించే ప్రతి ఆభరణం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉందని పెద్దలు చెబుతున్నారు. భారతీయ సంప్రదాయంలో దాదాపు 36 రకాల ఆభరణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి శరీరంలోని కీలకమైన ఆక్యుప్రెషర్ పాయింట్లపై ప్రభావం చూపిస్తాయి.

లోహాల వెనుక ఉన్న 'థర్మల్' సైన్స్
మనం ధరించే లోహాలు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

బంగారం (Gold): ఇది వెచ్చని లోహం. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చల్లని వాతావరణం ఉన్న ప్రాంతాల్లో శరీర వేడిని నిలుపుకోవడానికి బంగారం అద్భుతంగా పనిచేస్తుంది.

వెండి (Silver): ఇది చలువ చేసే లోహం. శరీరంలోని అధిక వేడిని గ్రహించి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అందుకే మన దేశం వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో వెండి ఆభరణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.

రాగి (Copper): ఇది శరీరంలోని ఎలెక్ట్రో-మ్యాగ్నెటిక్ శక్తిని సమతుల్యం చేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో రాగి సహాయపడుతుంది.

ఆభరణాలు - ఆక్యుప్రెషర్ ప్రయోజనాలు
శరీరంలోని నరాల చివరలు కొన్ని నిర్దిష్ట ప్రదేశాల్లో కేంద్రీకృతమై ఉంటాయి. నగలు వాటిని స్టిమ్యులేట్ చేస్తాయి.

ముక్కుపుడక: ముక్కుపై ఉండే నిర్దిష్ట నరాలను నొక్కడం ద్వారా శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, మహిళల్లో నెలసరి సమస్యలు, ప్రసవ వేదన తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది.

చెవి రింగులు: చెవి లోబ్స్‌పై ఉండే పాయింట్లు కంటి చూపును మెరుగుపరచడంలో, మెదడు చురుగ్గా పనిచేయడంలో తోడ్పడతాయి.

కాలి మెట్టెలు: బొటనవేలి పక్కన ఉండే వేలికి వెండి మెట్టెలు ధరించడం వల్ల ఆ నరం గర్భాశయం గుండా గుండెకు అనుసంధానమై ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించి, మహిళల హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.

మన పూర్వీకులు వాతావరణాన్ని బట్టి లోహాలను ఎంచుకునేవారు. అందుకే నడుము పైన బంగారాన్ని, పాదాలకు వెండిని ధరించాలని ఒక నియమం పెట్టారు. బంగారం శరీరంలోని విద్యుత్ శక్తిని బయటకు పోనివ్వకుండా అడ్డుకుంటే, వెండి భూమిలోని ధనాత్మక శక్తిని శరీరంలోకి పంపి పునరుజ్జీవింపజేస్తుంది.

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం ప్రాచీన నమ్మకాలు, సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయ కోణాలను వివరించడానికి మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

Also REad: Defence Budget 2026: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత రికార్డు స్థాయిలో డిఫెన్స్ బడ్జెట్..5 రాష్ట్రాల బడ్జెట్ సైన్యానికి!

Also REad: Union Budget 2026: బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటి? తెలుగు రాష్ట్రాలకు కీలక కేటాయింపులు ఇవే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 01, 2026 10:45:31
Tirupati Urban, Andhra Pradesh:

Muddadi Ravi Chandra: తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగించారని తీవ్ర ఆరోపణలు రావడంతో సిట్‌ విచారణ చేస్తుండగా.. తాజాగా వచ్చిన రిపోర్టులో అలాంటి సాక్ష్యాలు లేవని తేలింది. ఈ క్రమంలో మరోసారి ఏపీ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ ఏర్పడగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ ఈఓగా ఉన్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది.

Also Read: AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. సీపీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే వార్త

తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ అనిల్ కుమార్ సింఘాల్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో టీటీడీ ఈఓగా ఉన్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను 2025 సెప్టెంబర్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఏరికోరి తీసుకువచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదికలో అసలు ఆవులు లేవు, నెయ్యి లేదు, అంతా కాక్టెయిల్ కెమికల్స్ అని తేల్చడంతో తిరుమల లడ్డూ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను టీటీడీ ఈఓ బాధ్యతల నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఆరు నెలలు కూడా పూర్తికాకుండానే అనిల్ కుమార్‌ను సాగనంపడం మరో వివాదానికి దారి తీసే అవకాశం ఉంది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్‌.. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంపు

రవిచంద్ర ముద్దాడ ఎవరు?
టీటీడీ కొత్త ఈఓగా ఐఏఎస్‌ అధికారి రవిచంద్ర ముద్దాడను పూర్తి అదనపు బాధ్యతలతో ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర ముద్దాడకు టీటీడీ ఈఓ బాధ్యతలు అదనంగా అప్పగించారు. 1996 బ్యాచ్‌కు చెందిన రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్‌ కేడర్ అధికారి. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. వివాదస్పదమైన వందల కోట్ల భూమిని కబ్జా నుంచి కాపాడి ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వ విధానాల రూపకల్పనలో మేటి అధికారిగా పేరు పొందిన రవిచంద్ర ముద్దాడ నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.

Also Read: Love Affair: ఇద్దరి అబ్బాయిల వేధింపులతో మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం

కరోనా సమయంలో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా రవిచంద్ర పని చేశారు. తనకు అప్పగించిన విధులను చిత్తశుద్ధితో నిర్వహించే సమర్ధమైన అధికారిగా గుర్తింపు పొందారు. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వ అధికారంలో ఉన్నా వ్యక్తిగత పేరు కన్నా ప్రభుత్వానికి పేరు రావాలని నిజాయితీగా కష్టపడి పని చేసే అత్యుత్తమ అధికారిగా రవిచంద్ర ముద్దాడ గుర్తింపు తెచ్చుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 01, 2026 09:50:03
Hyderabad, Telangana:

Defence Budget 2026 Highlights: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత లభించింది. సరిహద్దుల్లో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఇటీవల పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన 'ఆపరేషన్ సింధూర్' ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

భారత రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రక్షణ బడ్జెట్‌లో 15 శాతం పెరుగుదలను ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేటాయింపులు భారీగా పెరిగాయి. మొత్తం రక్షణ బడ్జెట్ ₹7.85 లక్షల కోట్లు (గత ఏడాది ₹6.81 లక్షల కోట్లు)గా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

మూలధన బడ్జెట్ (Capital Outlay): ₹2.19 లక్షల కోట్లు. ఇది కొత్త ఆయుధాల కొనుగోలు, ఆధునీకరణ కోసం కేటాయించిన నిధులు. ఇందులో రికార్డు స్థాయిలో 22 శాతం పెరుగుదల నమోదైంది.

నౌకాదళానికి 'రాఫెల్-ఎం' బలం
భారత వైమానిక దళం వద్ద ఇప్పటికే 36 రాఫెల్ జెట్లు ఉండగా, ఇప్పుడు నేవీ కోసం ప్రత్యేకంగా రాఫెల్-ఎం (Rafale-M) ఫైటర్ జెట్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం కానుంది.

సుమారు 26 లేదా అంతకంటే ఎక్కువ రాఫెల్-ఎం జెట్లను సముద్ర సరిహద్దు భద్రత కోసం కొనుగోలు చేయనున్నారు. ఇది హిందూ మహాసముద్రంలో నేవీ యొక్క వైమానిక శక్తిని రెట్టింపు చేస్తుంది.

ప్రాజెక్ట్ 75I: అధునాతన జలాంతర్గాములు
సముద్ర గర్భంలో భారత సైన్యం పట్టు పెంచుకోవడానికి జలాంతర్గామి రంగానికి భారీ నిధులు అందనున్నాయి. ప్రాజెక్ట్ 75I కింద ఆరు స్టెల్త్ జలాంతర్గాములు కొత్త స్టెల్త్ జలాంతర్గాములను నిర్మించనున్నారు.

ఇవి 'ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్' (AIP) టెక్నాలజీతో పనిచేస్తాయి. దీనివల్ల ఇవి ఎక్కువ రోజులు నీటి అడుగునే ఉండి శత్రువుల కంటికి చిక్కకుండా దాడి చేయగలవు.

ఆపరేషన్ సింధూర్ ప్రభావం
పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ సింధూర్' తర్వాత దేశ భద్రతపై ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంబిస్తోంది. మునుపటి దశాబ్దంలో బడ్జెట్ పెరుగుదల 9-10 శాతానికే పరిమితమవ్వగా, ఈసారి 15 శాతానికి పెంచడం దేశ భద్రత పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుతోంది.

ఈ కేటాయింపులు కేవలం ప్రస్తుత ముప్పులను ఎదుర్కోవడమే కాకుండా, రాబోయే దశాబ్ద కాలంలో భారత సైన్యాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దళంగా మార్చడానికి పునాది వేయనున్నాయి. కొత్త ఆయుధాలు, ఆధునిక సాంకేతికత, మెరుగైన భద్రతా వ్యవస్థలతో త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్) మరింత బలోపేతం కానున్నాయి.

Also REad: Union Budget 2026: బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేంటి? తెలుగు రాష్ట్రాలకు కీలక కేటాయింపులు ఇవే..

Also REad: Union Budget 2026: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం..పన్ను నిబంధనల్లో భారీ సడలింపులు..టీసీఎస్ తగ్గింపు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Feb 01, 2026 09:31:38
Rebbena, Telangana:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచిన గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరకు ఆదివారం వేలాది వాహనాల్లో భక్తులు పోటెత్తడంతో మధ్యాహ్నం పూట సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు,మహిళలు,వృద్ధులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని నానా ఇబ్బందులు పడ్డారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తుగా అన్ని విధాల రవాణా ఏర్పాట్లు, వన్ వే ప్లాన్ సిద్ధం చేసిన ఒకేసారి వేలాది సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ జాయిన్ ఎక్కడికి అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నంబాల రైల్వే గేట్ దాటిన తర్వాత ట్రాఫిక్ జామై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఎటు వెళ్లలేక యాతన పడ్డారు. కొంతమంది భక్తులు అయితే తెచ్చుకున్న వాహనాలను వదిలేసి కాలినడకకుండా దేవాలయానికి చేరుకోవడం కనిపించింది. గంటలపాటు ట్రాఫిక్ నిలిచి పోవడం పట్ల అధికారుల తీరుపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
0
comment0
Report
HDHarish Darla
Feb 01, 2026 09:08:02
Hyderabad, Telangana:

Andhra Telangana Allocation In Budget: 2026-27 కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేటాయింపులు మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు దక్కినప్పటికీ, అమరావతి నిధులు, మెట్రో విస్తరణ వంటి కీలక ఆకాంక్షలు నెరవేరకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణలకు పర్యాటక, రవాణా రంగాల్లో ప్రాధాన్యత లభించింది.

హైదరాబాద్‌కు 'హైస్పీడ్' జోరు
దక్షిణ భారతదేశంలో కనెక్టివిటీని పెంచేందుకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని మూడు ప్రధాన హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రతిపాదించారు.

1) హైదరాబాద్ - బెంగళూరు

2) హైదరాబాద్ - చెన్నై

3) హైదరాబాద్ - పూణే ఈ కారిడార్ల వల్ల హైదరాబాద్‌కు నేరుగా, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు పరోక్షంగా రవాణా ప్రయోజనాలు చేకూరనున్నాయి.

అరకు, పులికాట్‌లకు కొత్త రూపు
పర్యావరణ హిత పర్యాటకాన్ని (Eco-Tourism) ప్రోత్సహించేలా కీలక ప్రకటనలు చేశారు.

అరకు వ్యాలీ (AP): ఇక్కడ ఎకో-ట్రయల్స్, మౌంటైన్ ట్రెక్కింగ్, హైకింగ్ కోసం కొత్త డెస్టినేషన్లను అభివృద్ధి చేయనున్నారు.

పులికాట్ సరస్సు (AP-TN సరిహద్దు): పక్షుల సందర్శన కోసం ప్రత్యేక ట్రయల్స్, లోకల్ గైడ్ల కోసం హోమ్‌స్టే క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు.

రేర్ ఎర్త్ & ఈస్ట్ కోస్ట్ కారిడార్లు
రేర్ ఎర్త్ కారిడార్: ఆంధ్రప్రదేశ్, ఓడిశా, కేరళ రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల మైనింగ్, ప్రాసెసింగ్, తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు.

పూర్వోదయ: ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలోని పోర్టులు, లాజిస్టిక్స్ రంగాలు భారీగా లబ్ధి పొందనున్నాయి.

నిరాశ పరిచిన అంశాలు..
బడ్జెట్‌లో కొన్ని కేటాయింపులు ఉన్నప్పటికీ, ప్రధాన డిమాండ్లపై కేంద్రం మౌనం వహించింది.

అమరావతి: ఎకనామిక్ సర్వేలో అమరావతి ప్రస్తావన ఉన్నప్పటికీ, బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధుల కేటాయింపులు జరగలేదు.

హైదరాబాద్ మెట్రో: మెట్రో రెండో దశ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆశించిన నిధులు ఈ బడ్జెట్‌లో దక్కలేదు.

మొత్తంగా చూస్తే, దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై కేంద్రం మొగ్గు చూపింది. అయితే, తక్షణ నిధులు అవసరమైన రాజధాని, మెట్రో వంటి ప్రాజెక్టులకు మొండిచేయి ఎదురైంది.

Also Read: Union Budget 2026: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం..పన్ను నిబంధనల్లో భారీ సడలింపులు..టీసీఎస్ తగ్గింపు!

Also REad: 8th Pay Commission: ఉద్యోగులకు తీపికబురు..63 శాతానికి పెరిగిన డీఏ (DA)..ఎప్పడు అకౌంట్లో జమ చేస్తారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 01, 2026 08:35:16
Keraniganj, Dhaka Division:

Pakistan Terrorist In Bangladesh: బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభం తర్వాత ఆ దేశం ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా మారుతోందా? పాకిస్థాన్ తన గూఢచారి సంస్థ 'ISI' ద్వారా ఢాకా నేల నుండి భారత్‌పై కుట్రలు పన్నుతోందా? తాజా నివేదికలు అవుననే సమాధానమిస్తున్నాయి. ప్రముఖ బంగ్లాదేశ్ జర్నలిస్ట్ సాహిదుల్ హసన్ ఖోకోన్ వెల్లడించిన వివరాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ విమానాల్లో ఉగ్రవాదులు బహిరంగంగానే ఢాకా చేరుకుంటున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఢాకా ఎయిర్‌పోర్టులో ఉగ్రవాదుల ల్యాండింగ్?
రిపోర్టర్ ఖోకోన్ కథనం ప్రకారం.. జనవరి 30న కరాచీ నుండి బయలుదేరిన బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ (BG-342) విమానంలో 113 మంది ప్రయాణికులు ఢాకా చేరుకున్నారు. వీరిలో పలువురు లష్కరే తోయిబా (LeT) సభ్యులు ఉన్నారని, వారి పాస్‌పోర్ట్ వివరాల్లోనే వారి సంస్థాగత సంబంధాలు స్పష్టంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. బంగ్లాదేశ్ ప్రస్తుత పాలక యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే వీరిని అనుమతిస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

'మొహజీర్ రెజిమెంట్' - ISI కొత్త వ్యూహం
పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI, ఢాకాలో ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసిందని, దాని ద్వారా 'మొహజీర్ రెజిమెంట్' అనే పేరుతో ఒక ఉగ్రవాద విభాగాన్ని భారత్‌పైకి ఉసిగొల్పుతోందని నివేదికలు పేర్కొంటున్నాయి. 18 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు గల యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి వారిని IED (బాంబుల) తయారీలో, ఆత్మాహుతి దాడులు చేయడంలో నిష్ణాతులుగా మార్చడం వారి లక్ష్యంగా ప్లాన్ చేశారట. బంగ్లాదేశ్ సరిహద్దుల ద్వారా వీరిని పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోకి పంపడానికి ISI ప్లాన్ చేస్తోంది.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతమున్న అస్థిరతను పాకిస్థాన్ పూర్తిగా వాడుకుంటోంది. 1971 నాటి పరాజయానికి ప్రతీకారంగా, బంగ్లా ప్రజల్లో భారత్ వ్యతిరేకతను రెచ్చగొట్టడం ద్వారా అక్కడ రాడికల్ ఇస్లామిక్ గ్రూపులకు పాక్ మద్దతు ఇస్తోంది. పాకిస్థాన్ ఉగ్రవాద ప్రాక్సీ యుద్ధంలో బంగ్లాదేశ్ చిక్కుకుంటే, అది ఆ దేశానికే పెను ప్రమాదమని 'బ్లిట్జ్' అనే వార్తా పత్రిక తన నివేదికలో హెచ్చరించింది.

భారతదేశం అప్రమత్తం
ఇస్లామాబాద్ నుండి జరిగే ఎలాంటి ఉగ్రవాద దాడినైనా 'యుద్ధ చర్య'గా పరిగణిస్తామని న్యూఢిల్లీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి భారత భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. అయినప్పటికీ, సరిహద్దుల్లోని కొన్ని రక్షణ లేని ప్రాంతాల ద్వారా ఉగ్రవాదులు భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉండటం భద్రతా పరంగా పెద్ద సవాలుగా మారింది.

పాకిస్థాన్ తన 'డెర్టీ గేమ్'ను ఇప్పుడు తూర్పు సరిహద్దుల నుండి ప్రారంభించింది. భారతదేశం కేవలం రక్షణ చర్యలకే పరిమితం కాకుండా, ఈ ఉగ్రవాద ముప్పును మొగ్గలోనే తుంచేయడానికి చురుకైన వ్యూహాలను అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది.

Also Read: Union Budget 2026: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం..పన్ను నిబంధనల్లో భారీ సడలింపులు..టీసీఎస్ తగ్గింపు!

Also Read: Mega 158 Heroine Name: చిరంజీవి సరసన నేషనల్ అవార్డ్ బ్యూటీ..బాబీ డైరెక్షన్‌లో కొత్త సినిమాలో ఎవరెవరు ఉన్నారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 01, 2026 07:56:55
Hyderabad, Telangana:

Union Budget 2026 Tax Changes: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పన్ను చెల్లింపుదారులకు తీపి కబురు అందించారు. ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్న నూతన ఆదాయపు పన్ను నిబంధనలు, పన్ను విధానంలో కీలక మార్పులను ప్రభుత్వం ప్రకటించింది. మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు, చిన్న తరహా వ్యాపారులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం పలు సానుకూల నిర్ణయాలు తీసుకుంది.

టీసీఎస్ (TCS) భారీగా తగ్గింపు
కొన్ని రకాల ఆర్థిక లావాదేవీలపై వసూలు చేసే మూలం వద్ద పన్ను సేకరణ (TCS)ను ప్రస్తుతం ఉన్న 5% నుండి 2 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇది వినియోగదారులకు, పెట్టుబడిదారులకు గొప్ప ఉపశమనం.

మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్‌లపై ఊరట
రోడ్డు ప్రమాద బాధితులకు లభించే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ చెల్లింపులపై పన్ను నిబంధనలను సడలించారు. దీనివల్ల ప్రమాద సమయంలో బాధితులకు అందే ఆర్థిక సాయంపై భారం తగ్గుతుంది.

ఐటి రిటర్న్స్ (ITR) గడువు తేదీలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పన్ను చెల్లించడానికి మార్చి 31 వరకు గడువు ఉంటుంది. ఐటిఆర్-1 (ITR 1), ఐటిఆర్-2 (ITR 2) దాఖలు చేయడానికి జులై 31 వరకు గడువు పొడిగించారు. చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు పన్ను చెల్లింపుల ప్రక్రియలో అదనంగా 6 నెలల ఊరట కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

విదేశీ ఆస్తుల ప్రకటనకు 'గోల్డెన్ ఛాన్స్'
విదేశాల్లో ఆస్తులు ఉండి, ఇప్పటివరకు వెల్లడించని వారి కోసం ప్రభుత్వం 'వన్ టైమ్ స్కీమ్' (One Time Scheme) ప్రకటించింది. ఈ పథకం ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ విదేశీ ఆస్తులను ఎలాంటి కఠినమైన జరిమానాలు లేకుండా స్వచ్ఛందంగా ప్రకటించవచ్చు.

మొత్తంగా, ఈ కొత్త ఐటి చట్టం-2025 పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ, సామాన్యులపై భారాన్ని తగ్గించే లక్ష్యంతో రూపొందించబడింది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి.

Also REad: AUS Squad For T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ ఆసీస్ జట్టు ప్రకటన..స్టార్ ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్, స్మిత్‌కు దక్కని చోటు!

Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు తీపికబురు..63 శాతానికి పెరిగిన డీఏ (DA)..ఎప్పడు అకౌంట్లో జమ చేస్తారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 01, 2026 01:41:34
Amaravati, Andhra Pradesh:

Good News To Govt Employees: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వరుసగా శుభవార్తలు వినిపిస్తోంది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించిన సమస్యలు, డిమాండ్లు పరిష్కారం చూపిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే దసరా సమయంలో కరువు భత్యం (డీఏ) ప్రకటించిన ప్రభుత్వం అనంతరం దీపావళి, సంక్రాంతి పండుగకు వరాలు‌ ప్రకటించింది. తాజాగా మరో శుభవార్త వినిపించింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించి శుభవార్త చెబుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలకు భారీ ఊరట లభించనుంది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్‌.. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంపు

ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సేవలపై నియమించిన ప్రత్యేక కమిటీ తాజాగా సమావేశమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జీవో నెం.880 ద్వారా నియామకమైన ప్రత్యేక కమిటీ గత నెల 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పదవీ విరమణ పొందిన సీపీఎస్‌ ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ వర్తింపచేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.

Also Read: YS Jagan: ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వైఖరి అత్యంత ప్రమాదకరం: వైఎస్‌ జగన్‌

ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులు వీరే..
స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్
ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్ చంద్
వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్
ఎన్టీఆర్‌ హెల్త్ ట్రస్ట్ సీఈవో దినేష్ కుమార్
ఏపీ జేఏసీ చైర్మన్ విద్యా సాగర్

Also Read: Union Budget: బడ్జెట్‌లో 75 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి.. నిర్మల సీతారామన్‌ ఏం చేశారంటే?

సమావేశమైన ప్రత్యేక కమిటీ ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించింది. సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో రిటైర్డ్ సీపీఎస్‌ ఉద్యోగులకు హెల్త్ కార్డులు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాదిరిగా సీపీఎస్‌ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా హెల్త్‌ కార్డులు వర్తింపజేయాలని  ప్రత్యేక కమిటీ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ నిర్ణయంతో సీపీఎస్‌ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండడంతో వారు వైద్య సేవలు పొందడానికి చాలా ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వం హెల్త్‌ కార్డుల పరిధిలోకి తీసుకోవడంతో సీపీఎస్‌ రిటైర్డ్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: IND beat NZ: టీ20 ప్రపంచకప్‌ ముందు భారత్‌ అద్భుతం.. న్యూజిలాండ్‌తో 4-1తో సిరీస్‌ సొంతం

ఇటీవల చెల్లింపులు
కాగా ​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం కిందట ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపులను చెల్లించింది. వివిధ రకాల బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండడంతో కొంత విడుదల చేసింది. విడుదల చేసిన బిల్లుల్లో టీఏ, టీటీఏ బిల్లులు ఉన్నాయి. 1 ఏప్రిల్ 25 నుంచి ఉద్యోగులకు సంబంధించిన టీఏ, టీటీఏ బకాయిల కోసం సుమారు రూ.150 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 01, 2026 01:13:24
Mulugu, Telangana:

Telangana Govt Employees: రోజురోజుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. తమకు హక్కుగా.. న్యాయపరంగా దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలతోపాటు ఇతర చెల్లింపులు రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఫించన్‌దారుల పరిస్థితి గడ్డుగా మారింది. తాము రూపాయి రూపాయి కూడబెట్టుకుని దాచుకున్న సొమ్ము ప్రభుత్వం చెల్లించకపోవడంతో తమ అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి. కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ డిమాండ్లు, సమస్యలపై కమిటీలతో కాలయాపన.. విడతలవారీగా అత్తెసరు చెల్లింపులు చేస్తుండడంతో అవి ఎవరికీ చాలడం లేదు. దీంతో పెండింగ్‌ బిల్లుల చెల్లింపు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా మిగిలిన నాలుగు డీఏలు కూడా చెల్లించాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం డిమాండ్‌ చేసింది. ఇక పెన్షనర్ల బకాయిలను ఒకేసారి మొత్తం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది.

Also Read: Union Budget: బడ్జెట్‌లో 75 ఏళ్ల సంప్రదాయానికి స్వస్తి.. నిర్మల సీతారామన్‌ ఏం చేశారంటే?

ప్రభుత్వ ఉద్యోగులు తమకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులపై ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో తమకు చెల్లించాల్సిన బిల్లులను ప్రతి నెలా రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకారం ప్రతి నెలా పెండింగ్‌ బిల్లులు విడుదల అవుతున్నారు. అయితే ప్రతి నెలా విడుదల చేస్తున్న పెండింగ్‌ బిల్లులు తమకు సరిపోవడం లేదని.. వాటిని పెంచాలని ప్రభుత్వ ఉద్యోగులు తాజాగా డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read: IND beat NZ: టీ20 ప్రపంచకప్‌ ముందు భారత్‌ అద్భుతం.. న్యూజిలాండ్‌తో 4-1తో సిరీస్‌ సొంతం

పెండింగ్‌ బిల్లుల చెల్లింపు నెలకు రూ. 700 కోట్లు కాకుండా రూ.1,500 కోట్లకు పెంచాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం డిమాండ్‌ చేసింది. ఇక పెన్షనర్ల బకాయిలను ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించాలని అధికారుల సంఘం కోరింది. ఈ సందర్భంగా ములుగులో సమావేశమైన టీజీవో సంఘం రాష్ట్ర కార్యవర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక డీఏ విడుదల చేస్తామని చెప్పడం.. టీజీవో కేంద్ర సంఘం, జిల్లా సంఘం భవనాలకు స్థలం, భవన నిర్మాణాలకు 50 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసింది. తక్షణమే ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం విధివిధానాలను ప్రకటించి అమలుచేయాలని టీజీఓ సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బీ శ్యామ్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు బకాయిపడిన నాలుగు పెండింగ్‌ కరువు భత్యం (డీఏలు) విడుదల చేయాలని టీజీఓ సంఘం డిమాండ్‌ చేసింది.

Also Read: YS Jagan: ప్రజాస్వామ్యానికి చంద్రబాబు వైఖరి అత్యంత ప్రమాదకరం: వైఎస్‌ జగన్‌

మరిన్ని డిమాండ్లు
2023 జూలై 1వ తేదీ నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికలను తెప్పించుకుని 42 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి.
సీపీఎస్‌ను రద్ధు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలి
పెండింగ్‌లో ఉన్న వాహనాల అద్దె బకాయిలను రూ.34 వేల నుంచి రూ.50 వేలకు పెంచి వెంటనే చెల్లించాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 19:24:34
Hyderabad, Telangana:

BRS Party Protest: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క బీఆర్ఎస్‌ పార్టీకి మాత్రమే నాయకుడు కాదు యావత్ తెలంగాణ సమాజానికి నాయకుడు అని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి ప్రకటించారు. కేసీఆర్‌కు సిట్ పేరిట నోటీసులు ఇచ్చి అత్యంత హేయమైన, దుర్మార్గమైన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతోందని మండిపడ్డారు. తెలంగాణ జాతిని వీరోచిత జాతిగా మార్చిన నాయకుడు కేసీఆర్ అని గుర్తుచేశారు. తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి పరిచి చేతికిస్తే విధ్వంసం చేస్తున్నారని రేవంత్‌ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ జాతిరత్నం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ రేపు ప్రజలు ఎక్కడికక్కడే నిరసనలు చేయాలని పిలుపునిస్తున్నట్లు చెప్పారు. 'మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతోనే రేవంత్ కేసీఆర్‌కు సిట్ పేరిట నోటీసులు పంపారు. బీఆర్ఎస్ శ్రేణుల దృష్టి మున్సిపల్ ఎన్నికలపై ఉండకుండా చేసేందుకే కేసీఆర్‌కు సిట్ నోటీసులు. సిట్‌లో ఉన్నది పోలీసులా రేవంత్ ప్రైవేటు సైన్యమా అని అనుమానాలు కలుగుతున్నాయి' అని మధుసూదనాచారి సందేహం వ్యక్తం చేశారు.

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఔన్నత్యాన్ని తగ్గించేందుకు రేవంత్ చేసిన చిల్లరమల్లర యత్నమే సిట్ నోటీసులు అని మధుసూదనాచారి కొట్టిపారేశారు. 'తెలంగాణ ఎవరి వల్ల వచ్చింది అంటే కేసీఆర్ వల్లే అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. కేసీఆర్‌తో అభివృద్ధిలో పోటీపడాలి కానీ ఈ ప్రభుత్వం హుందాతో పరిణతితో వ్యవహరించడం లేదు. కేసీఆర్‌కు చట్టం అంటే అమితమైన గౌరవం. ఉద్యమాన్ని కేసీఆర్ శాంతియుతంగా గాంధేయవాదంతో నడిపారు' అని గుర్తుచేశారు.

'అందరి మనసులు గెలిచి కేసీఆర్ తెలంగాణ సాధించారు. కేసీఆర్ అధికారంలో ఉండగా ఏనాడు ఎవరిపై కక్ష సాధించలేదు. కేసీఆర్‌కు నోటీసులను తెలంగాణ మేధావులు కళాకారులు కవులు తీవ్రంగా పరిగణించాలి' అని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి పిలుపునిచ్చారు. బొగ్గు స్కాం, జల వివాదాల నేపథ్యంలో రేవంత్ కేసీఆర్‌కు నోటీసులు పంపారని అందరికీ తెలుసని ప్రకటించారు. మాజీ మంత్రి హరీశ్ రావు వరసగా కుంభకోణాలు బయటపెడుతుండటంతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌ పార్టీపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు.

'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తయారు చేసిన సైనికులు రాష్ట్రంలో లక్షలాది మంది ఉన్నారు. వారు తమ నాయకుడికి నోటీసులను సహించరు.. రేపు ఎక్కడికక్కడ తమ నిరసన వ్యక్తం చేస్తారు' అని శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి ప్రకటించారు. తన గురువు చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటానికి రేవంత్ తెలంగాణ ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ పార్టీని బలహీనం చేయాలనే కుట్రలు ఫలించవు అని స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 18:45:38
New Delhi, Delhi:

Union Budget Part B Speech: దాదాపు 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశం యావత్‌ కేంద్ర బడ్జెట్‌పై ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కోట్లాది ప్రజలు భారీ ఆశలు పెంచుకున్నారు. తమకు ఏమైనా ప్రయోజనకరమైన నిర్ణయాలు ఉంటాయోనని ఎదురుచూస్తున్నారు. ఈ ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది. పార్లమెంట్‌లో నిర్మల సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కొత్త సంప్రదాయానికి తెరలేపుతున్నట్లు సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. 2026-27 బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుండడంతో బడ్జెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌తో 75 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు పలకనున్నట్లు సమాచారం. పార్ట్ బీ ద్వారా దేశ ఆర్థిక భవిష్యత్తుకు అవసరమైన దార్శనికతను ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మల సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కాగితరహిత బడ్జెట్‌ ఉంటుందని చెబుతున్నారు. బడ్జెట్‌లో జీడీపీ లోటు, ఆర్థిక ఏకీకరణపై రోడ్‌మ్యాప్‌ను మార్కెట్లు ఆశిస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 18:22:12
Parvathagiri, Telangana:

Women Constable Love Affair: పెళ్లి చేసుకుంటానని దూరపు చుట్టమైన యువకుడు నమ్మించి మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమిస్తున్నాడు. అయితే తరచూ వీడియో కాల్‌ చేయాలని.. ఎవరితో మాట్లాడవద్దని వేధించాడు. అతడి వైఖరి నచ్చకపోవడంతో సదరు యువతి వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధమవగా.. అతడు పెళ్లి చేసుకోవాలనుకునే యువకుడికి యువతి గురించి తప్పు సమాచారం ఇచ్చాడు. దీంతో పెళ్లి చేసుకోవాలనుకున్న యువకుడు కూడా బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ వేధింపులకు పాల్పడడంతో ఆ యువతి మానసిక వేధన భరించలేక ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో వరంగల్ జిల్లా పర్వతగురి మండలం సీత్యతండాకు చెందిన అనిత అనే మహిళా కానిస్టేబుల్ విధులు నిర్వహించేది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ అనే దూరపు బంధువు. తనను పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా చెబుతూ డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయాలని, వేరే ఎవరితో చనువుగా మాట్లాడవద్దని వేధింపులకు పాల్పడేవాడు. అతడి వైఖరి నచ్చకపోవడంతో పెళ్లి చేసుకునేందుకు అనిత ససేమిరా అని తన స్నేహితుడు జబ్బార్‌ లాల్‌ అనే వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది.

ఈ క్రమంలో జబ్బార్ లాల్‌తో సన్నిహితంగా ఉంటుందని.. అతడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవడంతో రాజేందర్ అనిత గురించి చెడుగా చెప్పాడు. జబ్బార్ లాల్‌కు ఫోన్ చేసి అనిత గురించి తప్పుడు సమాచారమిచ్చాడు. ఆ యువతి ప్రవర్తన.. ఇతరులతో సంబంధాలు ఉన్నాయని చెప్పడంతో అనితను జబ్బార్‌ లాల్‌ వేధించడం ప్రారంభించాడు. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని జబ్బార్ లాల్ వేధింపులకు దిగాడు. దీంతో అనిత తీవ్ర మానసిక క్షోభకు గురయ్యింది.

ఇద్దరి మధ్య మానసికంగా నరకం అనుభవించిన యువతి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ క్రమంలో రాజేందర్‌కు ఫోన్ చేసి 'మీ ఇద్దరితో నా జీవితం నాశనమైంది. నాకు చావే దిక్కు' అని అతడితో అనిత కన్నీరు పెట్టుకుంది. దీంతో 'చస్తే చావు' అంటూ రాజేందర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆ యువతి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించేలోగా ఆ యువతి ప్రాణాలు వదిలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజేందర్, జబ్బార్ లాల్ ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు సమాచారం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 18:17:36
Hyderabad, Telangana:

AI Policy Symposium: రాజకీయ పాఠాలు నేర్చుకునేందుకు అమెరికాకు వెళ్లిన రేవంత్‌ రెడ్డి అరుదైన గౌరవం పొందారు. అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్‌షిప్ ఇన్ ది ట్వంటీ ఫస్ట్ సెంచరీ కార్యక్రమానికి వెళ్లిన రేవంత్‌ రెడ్డిని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. భారత్​ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి  ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకున్నారు.

మార్చిలో జరిగే ఏఐ పాలసీ సింపోజియంలో హార్వర్డ్ కెన్నడీ స్కూల్​  డీన్ జెరెమీ వైన్‌స్టీన్‌తో కలిసి సింపోజియం ప్రారంభించాలని రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వాన లేఖను అందించారు. వివిధ రంగాల ప్రముఖులతో పాటు సాంకేతిక నిపుణులు ఈ సింపోజియం కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే హైదరాబాద్ నుంచే వర్చువల్‌గా ఈ వేదికపై ప్రసంగించే అవకాశాన్ని పరిశీలిస్తానని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

హార్వర్డ్ యూనివర్సిటీలో కార్యక్రమాల చివరి రోజున వివిధ ప్రతినిధి బృందాలు, పలు  స్కూల్ విద్యార్థులు, అలూమ్నీతో పాటు ఎంఐటీ, కొలంబియా యూనివర్సిటీల విద్యార్థులు, పూర్వ విద్యార్థులతో  రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకత్వం, ఆర్థిక వృద్ధి, సుస్థిరాభివృద్ధి,  పర్యావరణం, రైతులు, మహిళలు, యువత సంక్షేమం వంటి అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ రైజింగ్​ విజన్​ 2047 లక్ష్యాలు, ఎదురయ్యే సవాళ్లు, సాధికారత అభివృద్ధి దిశగా ఉన్న అవకాశాలను వివరించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.

భవిష్యత్తు భారత పురోభివృద్ధిలో  తెలంగాణ, అందులో ప్రధానంగా హైదరాబాద్ ముందుండి దిశానిర్దేశం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిపింది. వివిధ దేశాల్లో చదువుతున్న  విద్యార్థులు తెలంగాణ రైజింగ్  బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సూచించినట్లు ప్రకటన విడుదల చేసింది. కాగా శిక్షణ పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి రేపు హైదరాబాద్‌ చేరుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ చేరుకున్న అనంతరం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 31, 2026 18:05:50
Hyderabad, Telangana:

Excise Constable Sowmya: గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకున్న ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య వారు వాహనంతో ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో కొనప్రాణంతో కొట్టుమిట్టాడిన సౌమ్య చివరికి ప్రాణం విడిచింది. నిమ్స్‌ వైద్యులు ఆమెను బతికించేందుకు చేసిన కృషి విఫలమైంది. గంజాయి ముఠా బారిన పడిన ఓ పోలీస్‌ ఉద్యోగి చనిపోవడం తెలంగాణలో తీవ్రంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

గంజాయి బ్యాచ్‌ కారుతో ఢీ కొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ సౌమ్య మరణించినట్లు నిమ్స్‌ ఆస్పత్రి ప్రకటించింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇప్పటికే నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప శ‌నివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుద‌ల చేయగా.. విడుదల చేసిన కొన్ని నిమిషాలకే ఆమె ప్రాణం విడిచింది. 

నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్య మరణంపై నిమ్స్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వివిధ విభాగాల నిపుణుల ద్వారా అవసరమైన అన్ని అత్యాధునిక వైద్య సేవలు, లైఫ్ సపోర్ట్ చికిత్సలు అందించినట్లు నిమ్స్‌ వైద్యులు తెలిపారు. వైద్యులు అత్యంత శ్రద్ధతో నిరంతర వైద్య ప్రయత్నాలు చేసినప్పటికీ, సౌమ్య ను కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె 31 జనవరి 2026 రాత్రి 9:41 గంటలకు  మృతిచెందారని నిమ్స్‌ వైద్యులు ప్రకటించారు. ఈ విషాద సమయంలో మృతురాలి కుటుంబ సభ్యులకు నిమ్స్ యాజమాన్యం  సానుభూతి తెలిపింది. సౌమ్య శరీరంలోని అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఓ కిడ్నీ తొలగించామని ఇప్పటికే వైద్యులు తెలిపారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గ‌త శుక్ర‌వారం రాత్రి గంజాయి త‌ర‌లిస్తున్న స్మ‌గ్ల‌ర్లు తమ కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య‌ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో మ‌తిన్, స‌ఫియుద్దీన్, స‌య్య‌ద్ సోహైల్ ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top