icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Pinewz
504292
BMBHARATH MUNJAMFollow1h ago

పోలీస్ స్టేషన్ నుంచి పరారైన నిందితుడి పట్టివేత

Gollet, Telangana:తిర్యాని మండలం పిట్టగూడా గ్రామానికి చెందిన హనుమంతరావు అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉండి రెబ్బెన పోలీస్ స్టేషన్ నుండి పరారైన నిందితుడు రాయి సిడాం వినోద్ కుమార్ ను మంగళవారం రెబ్బెన మండలం గోలేటి ఎక్స్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఆసిఫాబాద్ ఎస్పీ చిత్తరంజన్ తెలిపారు. మంగళవారం రెబ్బెన సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిర్యాని మండలం పిట్టగూడా గ్రామానికి చెందిన హనుమంతరావు మంత్రాలు చేయడంతోనే తమ కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడుతున్నారని భావించిన వినోద్ కుమార్ హనుమంతరావుపై కక్ష పెంచుకున్నాడని, ఈ విషయంలో గ్రామ పెద్దలు పంచాయతీ నిర్వహించి శాంతియుతంగా ఉండాలని సూచించినా వినోద్ కుమార్ వినలేదని అన్నారు. ఇదే క్రమంలో తేదీ 1-11-2025 న పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరుకున్న హనుమంతరావుపై వినోద్ కుమార్ గొ డ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. హనుమంతరావు భార్య బొజ్జుబాయిని కూడా హత్య చేస్తానని బెదిరించడంతో ఆమె అక్కడి నుండి పారిపోయి ప్రాణాలు దక్కించుకుందన్నారు. అనంతరం మృతుడి భార్య బొజ్జుబాయి ఫిర్యాదు మేరకు నిందితుడు వినోద్ కుమార్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రెబ్బెన పోలీస్ స్టేషన్ లో కస్టడీలో ఉంచగా మూత్రవిసర్జనకు వెళ్తానని చెప్పి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని తోసివేసి పరారయ్యాడని అన్నారు. ఈ నేపథ్యంలో నిందితున్ని పట్టుకునేందుకు జిల్లా ఎస్పీ నితికాపత్ రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కఠినమైన నిఘా కొనసాగించడంతో మంగళవారం రెబ్బెన మండలం గోలేటి క్రాస్ రోడ్ వద్ద అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు తెలిపారు నిందితున్ని పట్టుకోవడంలో కృషిచేసిన రెబ్బెన తిర్యాని ఎస్ఐలు వెంకట కృష్ణ, వెంకటేష్, పోలీసు సిబ్బంది శ్రీనివాస్, విద్యాసాగర్, శ్రీనివాస్, దుర్గేంద్ర, సందీప్ లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు.
0
0
Report
Pinewz
504292
BMBHARATH MUNJAMFollow3 Mar 2026, 02:43 pm

సమస్యలు పరిష్కరించ కంటే ఈనెల 17 నుంచి నిరవధిక సమ్మె - ఏఐటీయూసీ రీజియన్ అధ్యక్షుడు ఉపేందర్

Gollet, Telangana:బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తున్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు, హెల్పర్ల సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే ఈ నెల 17 నుండి నిరవధిక సమ్మెకు వెళ్తామని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు భోగి ఉపేందర్ స్పష్టం చేశారు. మంగళవారం యాజమాన్యం ప్రతినిధి టిటిసి సుదీర్ కు వినతిపత్రం, సమ్మె నోటీసు ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. డ్రైవర్లకు 32000, క్లీనర్లకు 18000 వేతనం చెల్లించాలని అన్నారు ప్రతినెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, 50 లక్షల ప్రమాద బీమా ఎవరైనా కార్మికులు చనిపోతే అంత్యక్రియలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులతో శ్రమ దోపిడీ చేయించకుండా 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లను డ్రైవర్లకు క్లీనర్లకు కేటాయించాలని వర్షాకాలంలో రవాణా సౌకర్యం కల్పించాలని, కార్మికుల హక్కులు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు డ్రైవర్లు క్లీనర్లు పాల్గొన్నారు
0
0
Report
Advertisement
Pinewz
504292
BMBHARATH MUNJAMFollow22 Feb 2026, 12:59 pm

గోలేటిలో ఘనంగా భీమన్న దేవుని జాతర

Gollet, Telangana:రెబ్బెన మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి లోని భీమన్న దేవాలయం వద్ద ఆదివారం జాతర ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి భీమన్న దేవుని దర్శించుకున్నారు. రెబ్బెన మండలంలోని గ్రామాలతో పాటు సమీప మండలాలైన తిర్యాని, ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్ నగర్, బెల్లంపల్లి తదితర మండలాల నుంచి భక్తులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం దేవాలయం నియమాల ప్రకారం రథోత్సవం జరిగింది. ఆలయ పూజారులు రక్తం పైన ఆసీనులు కాగా వందలాది మంది భక్తులు రథాన్ని అనుసరిస్తూ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, సింగరేణి అధికారులు, కార్మికులు భీమన్న దేవుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం విద్యుత్ దీపాలంకరణ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఆలయ కమిటీ తరపున తాగునీటి సదుపాయం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ దేవాలయంలో జాతర నిర్వహించడం ఇది రెండవసారి కాగా గతంలో కంటే ఈసారి ఏర్పాట్లు మెరుగయ్యాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా ఎక్కువ ప్రచారం చేయనందు న భక్తుల సంఖ్య తక్కువ అయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ భీమన్న దేవుని జాతర ఉదయం నుంచి సాయంత్రం వరకు అంగరంగ వైభవంగా జరిగింది.
0
0
Report
Pinewz
504292
BMBHARATH MUNJAMFollow15 Feb 2026, 12:33 pm

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా శివుని జాతరలు

Gollet, Telangana:మహాశివరాత్రి సందర్భంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు శివాలయాల వద్ద ఆదివారం జాతరలు ఘనంగా జరిగాయి.జిల్లాలోని ఆసిఫాబాద్, ఈస్ గాం శివాలయం, తిర్యాని మండలం సుంగాపూర్, రెబ్బెన మండలం నంబాల శివాలయం, దుగ్గపూర్ శివాలయం, కైరిగూడ శివాలయాల వద్ద పెద్ద ఎత్తున భక్తులు పూజలు నిర్వహించుకుని శివుడిని దర్శనం చేసుకున్నారు. పలు దేవాలయాల వద్ద ఆలయ కమిటీ సభ్యులు సౌకర్యాలు ఏర్పాటు చేసినా పెద్ద జాతరలు జరిగిన ప్రాంతాల్లో భక్తులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. ప్రత్యేకంగా ప్రకృతితో మమేకమై గోలేటి కైరిగూడ గ్రామాల సమీపంలో అడవిలో వెలిసిన శివాలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో ప్రతి జాతర వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం ప్రారంభమైన భక్తుల తాకిడి ఆదివారం రాత్రి వరకు కూడా కొనసాగింది.
0
0
Report
Advertisement
Back to top