504292
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా మే డే సంబరాలు
Gollet, Telangana:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మేడేను ఘనంగా జరుపుకున్నారు ముఖ్యంగా కాంగ్రెస్, బిఆర్ఎస్, సిపిఐ తదితర పార్టీల ఆధ్వర్యంలోని కార్మిక సంఘాల నాయకులు మే డే పథకాన్ని ఆవిష్కరించి కార్మికుల హక్కులకై పోరాడి పశువులు బాసిన పోరాట వీరుల కు నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో మే డే సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన రెబ్బెనలో ఏఐటియుసి మండల అధ్యక్షులు రాచకొండ రమేష్, గోలేటి లోని ఐ ఎఫ్ టి యు కార్యాలయం వద్ద ఆ సంఘం ఏరియా అధ్యక్షులు శ్రీనివాస్, గోలేటి సిహెచ్ పి వద్ద టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఎం శ్రీనివాసరావు, గోలేటి లోని ఐఎన్టియుసి కార్యాలయం వద్ద కేంద్ర కమిటీ నాయకులు హుస్సేన్, జనకాపూర్ లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐ ఎఫ్ టి యు నాయకులు రాజన్న శ్రీనివాస్ తదితరులు పతాకావిష్కరణ గావించారు. గోలేటి లోని ఏఐటీయూసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మేడే సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎంతోమంది నాయకుల శ్రమ వల్లనే ఈరోజు కార్మికులు కొన్ని హక్కులు సాధించుకున్నారని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.0
0
Report
504292
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు క్రీడ పోటీలు
Gollet, Telangana:మే 1న నిర్వహించుకునే 140 వ మే డే ను పురస్కరించుకొని మంగళవారం బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా, స్టోర్స్, విటిసి మహిళ ఉద్యోగినులకు ఎఐటియుసి ఆధ్వర్యంలో పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, ఉపాధ్యక్షులు బి మొగిలి పాల్గొని మాట్లాడుతూ మేడే యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి మహిళలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో క్రీడల్లో పాల్గొనడం సంతోషం కలిగించిందన్నారు. ఈ క్రీడల్లో బండారు నాగమణి, ఎన్ సరిత, కే పార్వతి, ఎం ప్రణీత, ఎన్ లక్ష్మి, ఏ మమత, కే పద్మ విజేతలుగా నిలిచారు. డీజిఎం జ్ఞానేశ్వర్ ఇంజనీర్ శ్రీనివాస్ విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్గనైజింగ్ కార్యదర్శులు శేష శయనారావు, మారం శ్రీనివాస్, కిరణ్, బ్రాంచి కోశాధికారి చంద్రశేఖర్,ఫిట్, సేఫ్టీ కమిటీల సభ్యులు కార్మికులు పాల్గొన్నారు.0
0
Report
504292
మేడేను పురస్కరించుకొని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహిళ ఉద్యోగినులకు క్రీడా పోటీలు
Gollet, Telangana:ప్రపంచ కార్మిక హక్కుల సాధన దినోత్సవం అయిన 140 వ మేడే ను పురస్కరించుకొని సోమవారం బెల్లంపల్లి ఏరియాలోని సిహెచ్పి వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహిళ ఉద్యోగినులకు క్రీడా పోటీలు నిర్వహించారు. సీఎస్పి ఫిట్ కార్యదర్శి అంబటి రామయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రీడా పోటీలలో మహిళ ఉద్యోగినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహుమతి ప్రధానోత్సవ సభలో పాల్గొన్న ఏఐటియుసి బ్రాంచి కార్యదర్శి ఎస్ తిరుపతి, ఏరియా ఉపాధ్యక్షులు భయ్యా మొగిలి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల హక్కుల కోసం పోరాడి ఎంతోమంది నాయకులు హక్కులు సాధించారని ఆ హక్కుల సాధనకు నిదర్శంగానే మేడే జరుపుకుంటున్నామని అన్నారు. గెలుపొందిన ఉద్యోగినులకు సిహెచ్పి హెచ్ ఓ డి కోటయ్య బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆర్గనైజింగ్ కార్యదర్శులు శేష సేయన రావు, కిరణ్, మారం శ్రీనివాస్, శమీ, సురేష్ కోరి, గోలేటి బ్రాంచ్ కోశాధికారి చంద్రశేఖర్ పలువురు కార్మిక సంఘ నాయకులు కార్మికులు పాల్గొన్నారు0
0
Report
Advertisement
504292
దమ్ముంటే బిఆర్ఎస్ నాయకులు స్వయం సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలి- కాంగ్రెస్
Gollet, Telangana:గత పది సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలించి అప్పులకుప్ప చేసిన బిఆర్ఎస్ నాయకులు కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లయితే స్వయం సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలని రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేసరి కిషన్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పల్లె ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. శనివారం రెబ్బెనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పద్ధతిగా లేదని గతంలో ఎంతోమంది మేధావులు మొత్తుకున్న అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని, కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టారని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కీలక నిర్మాణాలు పొంగిపోవడం, పంప్ హౌస్ లు దెబ్బతినడం వాస్తవం కాదా అని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని బిఆర్ఎస్ నాయకులుప్ ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇబ్బందిగా దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన బిఆర్ఎస్ నాయకులకు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని అన్నారు. సిబిఐ విచారణను ఎదుర్కోవడానికి దమ్ము లేక బిఆర్ఎస్ బిజెపితో కుమ్మక్కైందని, అందులో భాగంగానే బిఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీష్ రావు ఢిల్లీ వెళ్లి బిజెపి నేతలతో కలిశారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సర్పంచులు వెంకటేశా చారి, స్వప్న,లక్ష్మి,వెంకటేష్,బుజ్జక్క, ఐ ఎన్ టి సి నాయకులు కొవ్వూరు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు0
0
Report
504292
అంబేద్కర్ సేవలు మరువలేనివి కైరిగూడ ప్రాజెక్టు ఆఫీసర్ నరేందర్
Gollet, Telangana:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలు మరువలేనివని కైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మచ్చగిరి నరేందర్ అన్నారు. మంగళవారం సింగరేణి ఆధ్వర్యంలో కైరిగూడ ఓపెన్ కాస్ట్ వద్ద నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నా అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం దళిత వర్గాలకే కాకుండా దేశంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. అవకాశాలు తక్కువ ఉన్న కాలంలోనే అనేక కష్టనష్టాలు కూర్చి ఉన్నత చదువులు చదివి జీవితాంతం పేదల గురించి పాటుపడ్డారని అన్నారు. నేటి యువత చెడు మార్గాలకు వెళ్లకుండా అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ శంకర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ వీరన్న, అధికారులు రాజేశ్వర్, రజిని కుమార్, ఏటిసి ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్, ఐ ఎన్ టి వి సి పి కార్యదర్శి ఎం వి యు భాస్కరాచారి, ఏఐటీయూసీ నాయకులు శేష శయన రావు, టీబీజీకేఎస్ నాయకులు సత్యనారాయణ పలువురు సింగరేణి అధికారులు కార్మికులు పాల్గొన్నారు.0
0
Report
