Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
BHARATH MUNJAM
Adilabad504292

సిపిఐ జాతీయ మహా సభలకు తరలిరావాలి - సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోగే.ఉపేందర్

BMBHARATH MUNJAMSept 19, 2025 06:27:38
Gollet, Telangana:
పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో ఈనెల 21 నుంచి 25 వరకు జరిగే సిపిఐ జాతీయ మహాసభలకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిపిఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భోగే. ఉపేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాటాలు చేసేది వామపక్ష సిపిఐ పార్టీ అని అన్నారు. , కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసేందుకు జాతీయ మహాసభలు దోహదం చేస్తాయని అన్నారు.
11
comment0
Report
Adilabad504292

అలుముకున్న పొగ మంచు హఠాత్తుగా మారిపోయిన వాతావరణం

BMBHARATH MUNJAMSept 19, 2025 00:54:36
Gollet, Telangana:
తీవ్రమైన తుఫాన్లు వర్షాలతో అతలాకుతులం అయిన వాతావరణం శుక్రవారం తెల్లవారుజాము నుంచి హఠాత్తుగా మారిపోయింది. తెల్లవారుజాము నుంచే తీవ్రమైన పొగ మంచుతో ఒకరికొకరు కనిపించని పరిస్థితి ఏర్పడింది ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా లోని పలు మండలాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది అయితే ఇలాంటి వాతావరణం వర్షాల తర్వాత ఏర్పడటం సహజమేనని కానీ ఇది ఎక్కువ రోజులు కొనసాగితే పత్తి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు
14
comment0
Report
Adilabad504292

చిమ్మ చీకటిలో సులబ్ కాంప్లెక్స్ - ఇబ్బంది పడుతున్న ప్రజలు

BMBHARATH MUNJAMSept 18, 2025 15:30:01
Gollet, Telangana:
పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ శివారు ప్రాంతంలో ఉన్న సులబ్ కాంప్లెక్స్ కు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు లేని వారికోసం సదుద్దేశంతో నిర్మించిన ఈ సులబ్ కాంప్లెక్స్ గత కొన్ని సంవత్సరాలుగా చీకట్లోనే మగ్గుతుంది. దీనిని టౌన్షిప్ సమీపంలోని భగత్ సింగ్ నగర్, గౌతమ్ నగర్ ప్రాంత ప్రజలతో పాటు గోలేటి గ్రామపంచాయతీలోని పలువురు ఉపయోగించుకుంటున్నారు. అయితే విద్యుత్ సరఫరా లేకపోవడంతో రాత్రిపూట చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సింగరేణి విద్యుత్ కల్పించాల్సి ఉంది.
14
comment0
Report
Adilabad504292

మేఘావృతమైన ఆకాశం- పగలే చీకటిని తలపించేలా వాతావరణం

BMBHARATH MUNJAMSept 16, 2025 12:58:07
Gollet, Telangana:
పర్యావరణ పరిరక్షణ చర్యలు పాటించక వాతావరణంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు సంభవిస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. గత కొద్దిరోజులుగా తీవ్రమైన ఎండ, తీవ్రమైన ఉక్క పోత ఒకవైపు, భారీ వర్షాలు మరోవైపు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలంతా భారీ ఎండ ఉంటుండగా సాయంత్రం హఠాత్తుగా భారీ వర్షాలు కురవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని, వర్షం కురిసేముందు సూచనగా ఆకాశం మేఘావృతం కావడం, చల్లటి గాలులు వేయడం ఉండేదని, ప్రస్తుతం అలాంటి సూచన లేకుండానే భారీ వర్షాలు ఉంటున్నాయని పెద్దలు అభిప్రాయపడుతున్నారు
14
comment0
Report
Advertisement
Adilabad504292

సివిల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు 26 రోజుల పని దినాలు కల్పించాలి- కార్మిక సంఘాల డిమాండ్

BMBHARATH MUNJAMSept 15, 2025 05:01:27
Gollet, Telangana:
బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి టౌన్షిప్ లో పనిచేస్తున్న సివిల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు గతంలో లాగే 26 రోజుల పని దినాలు కల్పించాలని ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు బి. ఉపేందర్, ఐ ఎఫ్ టి యు గోలేటి బ్రాంచ్ కార్యదర్శి అరికెళ్ల పోశం డిమాండ్ చేశారు. గత వారం రోజుల నుంచి చేస్తున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా సోమవారం నిరసన తెలిపిన అనంతరం వారు మాట్లాడారు. పారిశుద్ధ కార్మికులకు 26 రోజులు పని దినాలు ఉండేవని ఇప్పుడు కొత్తగా వాటిని తగ్గిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
14
comment0
Report
Advertisement
Back to top