Home
Web Stories
Become a News Creator
Your local stories, Your voice
Join as Creator
Follow us on
Download App from
Advertisement
504292
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి- ఏఐటీయూసీ నేత ఉపేందర్
BM
BHARATH MUNJAM
Follow
Feb 10, 2026 06:46:39
Gollet, Telangana:
దేశంలోని కార్మిక, కర్షక వర్గానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల కు వ్యతిరేకంగా ఈనెల 12న చేపట్టే సార్వత్రిక సమ్మెను కార్మిక వర్గం విజయవంతం చేయాలని ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు బి ఉపేందర్ కోరారు. మంగళవారం కార్మికులతో కలిసి గోలేటిలో సమ్మె పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. గతంలో కార్మికులకు అనుకూలంగా ఉన్న 44 జీవోలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈనెల 12న చేపట్టే సమ్మెకు సింగరేణి, ఔట్సోర్సింగ్, ఓబి కంపెనీ, ఆర్టీసీ కార్మికులు పూర్తి మద్దతు ఇచ్చి సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు,కార్మిక నాయకులు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ వెంకటేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు
0
0
Share
Report
504292
ముగిసిన గంగాపూర్ వెంకటేశ్వర స్వామి జాతర
BM
BHARATH MUNJAM
Follow
Feb 02, 2026 16:18:36
Gollet, Telangana:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగపూర్ లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర సోమవారం సాయంత్రం తో ముగిసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి రెండు వరకు సాగిన ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. జాతర ప్రారంభమైన మొదటి రోజు స్వామివారి కళ్యాణం, రెండవ రోజు పల్లకి సేవ, రథోత్సవం కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిగాయి. అయితే ట్రాఫిక్ నియంత్రణలో అధికారులు ఎన్ని ఏర్పాట్లు చేసినా ఊహించని విధంగా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆదివారం సుమారు 10 గంటల పాటు ట్రాఫిక్ సమస్యలు భక్తులను వెంటాడాయి. ఇటీవల జరిగిన సమ్మక్క సారక్క జాతర లను దృష్టిలో పెట్టుకొని అంతగా భక్తులు రారనే ఉద్దేశంతో అధికార యంత్రాంగం అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేయగా ఎవరు ఊహించని విధంగా లక్షలాది మంది భక్తులు పోటెత్తడంతో ట్రాఫిక్ నియంత్రించడం పోలీసులకు కత్తిమీద సాములా మారింది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు వన్ వే పద్ధతి ప్రవేశపెట్టినా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఎక్కడ స్థలం సరిపోక రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి భక్తులు వెళ్లడంతో పంట పొలాలు సైతం దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి పై నమ్మకంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొనడం అటు అధికార వర్గంలో ఇటు పాలకవర్గంలోనూ సంతోషాన్ని కలిగించింది.
0
0
Share
Report
504292
అంగరంగ వైభవంగా గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ,రథోత్సవం
BM
BHARATH MUNJAM
Follow
Feb 01, 2026 17:46:28
Gollet, Telangana:
ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి పల్లకి సేవ, రథోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. వేలాదిమంది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో పల్లకి సేవ నిర్వహించగా భక్తులు తరించిపోయారు. అదేవిధంగా లక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రథోత్సవం గురించి ఉదయం నుండి వేచి ఉన్న వేలాదిమంది భక్తులు ఆ కార్యక్రమాన్ని తిలకించి పులకించిపోయారు. రథోత్సవం వేళ గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగి పోయింది. ట్రాఫిక్ ఇబ్బందులు, తదితర కారణాలతో గర్భగుడిలోని స్వామిని దర్శించుకోని భక్తులు కూడా రథోత్సవం వేళ స్వామి వారిని ప్రత్యక్షంగా తిలకించి తరించిపోయారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.
0
0
Share
Report
Advertisement
504292
గంగపూర్ జాతరకు పోటెత్తిన భక్తులు - ఏర్పాట్లలో విఫలమైన అధికారులు
BM
BHARATH MUNJAM
Follow
Feb 01, 2026 17:17:11
Gollet, Telangana:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరకు లక్షలాదిమంది భక్తులు పోటెత్తడంతో సరియైన ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక్క సారక్క జాతరను దృష్టిలో పెట్టుకొని గంగాపూర్ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు హాజరుకారనే ఉద్దేశంతో అధికారులు సాధారణ ఏర్పాట్లు చేయగా ఊహించని విధంగా భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఏర్పాట్లు సరిపోక పలు విధాలుగా ఇబ్బందులు పడ్డారు. వేలాది సంఖ్యలో వాహనాలు జాతరకు రాగా సుదూరంలో ఉన్న పార్కింగ్ ప్రాంతానికి వెళ్లలేక పలు వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కున్నాయి. ట్రాఫిక్ క్లియర్ చేయలేక అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రెబ్బెన నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపూర్ దేవాలయానికి వెళ్లాల్సిన భక్తులు ట్రాఫిక్ ఇబ్బందులతో వాహనాలను రైల్వే గేట్ అవతల నిలిపివేసి కాలినడకన దేవాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రోడ్డుకిరువైపులా పంటచేన్లు ఉండటంతో వాహనాల పార్కింగ్కు సరైన ఏర్పాట్లు చేయడంలో ఇబ్బంది ఎదురైనట్లు తెలుస్తోంది. ఉదయం సుమారు 10 గంటలకు ప్రారంభమైన ట్రాఫిక్ ఇబ్బందులు రాత్రి 7,8 గంటల వరకు కూడా కొనసాగాయి. ఇక ఎండోమెంట్ అధికారులు కూడా ఏర్పాట్లలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. టికెట్లు కొనుగోలు చేసి దర్శనానికి వెళ్లే మెట్లపై షామియానా కర్రలు అడ్డంగా అమర్చడం, షామియానా తాళ్లు ఊడిపోయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. దేవాదాయ శాఖ అధికారులు మంచినీటి సౌకర్యం గురించి కూడా అంతగా పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. భక్తులకు కొంగుబంగారమైన గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చినా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు లేవనే విమర్శలు వస్తున్నాయి.
0
0
Share
Report
504292
గంగాపూర్ జాతరలో గంటన్నర పాటు ట్రాఫిక్ జామ్- నరకం అనుభవించిన భక్తులు
BM
BHARATH MUNJAM
Follow
Feb 01, 2026 09:31:38
Rebbena, Telangana:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచిన గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరకు ఆదివారం వేలాది వాహనాల్లో భక్తులు పోటెత్తడంతో మధ్యాహ్నం పూట సుమారు గంటన్నర పాటు ట్రాఫిక్ నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు,మహిళలు,వృద్ధులు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని నానా ఇబ్బందులు పడ్డారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తుగా అన్ని విధాల రవాణా ఏర్పాట్లు, వన్ వే ప్లాన్ సిద్ధం చేసిన ఒకేసారి వేలాది సంఖ్యలో వాహనాలు రావడంతో ట్రాఫిక్ జాయిన్ ఎక్కడికి అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నంబాల రైల్వే గేట్ దాటిన తర్వాత ట్రాఫిక్ జామై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఎటు వెళ్లలేక యాతన పడ్డారు. కొంతమంది భక్తులు అయితే తెచ్చుకున్న వాహనాలను వదిలేసి కాలినడకకుండా దేవాలయానికి చేరుకోవడం కనిపించింది. గంటలపాటు ట్రాఫిక్ నిలిచి పోవడం పట్ల అధికారుల తీరుపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
0
0
Share
Report
Advertisement
Top Cities
New Delhi
Gurugram
Pune
Ahmedabad
Bengaluru
Back to top