Back
Hyderabad500029blurImage

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు :మంత్రి

Manohar
Jun 20, 2024 13:12:54
Hyderabad, Telangana
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లోని పర్యాటక శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు పట్టిక, బయోమెట్రిక్ శాతంపై వివరాలు తెలుసుకున్నారు. ఖాళీగా కుర్చీలు దర్శనమివ్వడంపై మండిపడ్డారు. మరోసారి ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com