సీతాఫల్మండి: డ్రైనేజీ లైన్ సమస్యలు పరిష్కరిస్తాం
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Albino Python Snake Viral Video Watch: సాధారణంగా పాములు కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెడుతూ ఉంటాం.. అలాంటిది మనుషుల ప్రాణాలను నిమిషాల్లో తీయగల ప్రమాదకరమైన విష సర్పంతో ఓ చిన్నారి ఆడుకుంటే? అది ఆ పాప ముఖాన్ని ముద్దాడుతుంటే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే వెన్నులో మనకు పుడుతుంది కదూ.. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నారి హాయిగా పడుకుని.. టీవీ చూస్తుండడం మీరు గమనించవచ్చు.. అయితే ఆమె పక్కనే అత్యంత భయంకరమైన తెల్లటి రంగులో ఉన్న ఓ పెద్ద పాము ఉండడం కూడా మీరు చూడొచ్చు.. ఆ పాము మెల్లగా ఆ చిన్నారి ముఖం వద్దకు వచ్చి.. దాని నాలుకతో పాప ముఖాన్ని నాకుతోంది. మనం ఇంట్లో పెంచుకునే కుక్కలు లేదా పిల్లులు చేసే చేష్టల్లాగే ఆ పాము కూడా చాలా ఫ్రెండ్లీగా ప్రవర్తించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు..
సాధారణంగా చిన్నపిల్లలు ఏదైనా చిన్న పురుగును చూసిన భయపడుతూ ఉంటారు.. కానీ ఈ వీడియోలో ఉన్న చిన్నారి మాత్రం ఆ పామును చూసి అస్సలు భయపడకుండా ఉండడం.. దానిని చాలా ప్రేమగా నిమురుతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా.. ఆ పాము కూడా ఆ చిన్నారికి ఎలాంటి హాని తలపెట్టకుండా ఆమెతో ఆడుకుంటుంది.. ఈ దృశ్యాలను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు.. ఇదేం వింత స్నేహం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు... ఇక మరికొందరైతే ఇది ఎంత ఫ్రెండ్లీగా ఉన్న ప్రమాదకరం.. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తున్నారు..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
నిపుణులు తెలిపిన అభిప్రాయం ప్రకారం.. ఆ వీడియోలో ఉన్నది అల్బీనో రకానికి చెందిన సర్పమని తెలుస్తోంది. జన్యుపరమైన లోపాల వల్ల వీటికి తెల్లటి రంగు వస్తుంది.. అయితే ఇవి పెంచుకునే పాములే అయినప్పటికీ చిన్నపిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని వన్యప్రాయాన్ని సంరక్షకులు సైతం సూచిస్తున్నారు. ఈ వీడియో ఎక్కడ తీశారు అనే విషయంపై ఇంకా స్పష్టత లేనప్పటికీ.. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ తో పాటు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో విపరీతంగా వైరల్ అవుతుంది. దీనికి మిలియన్ల కొద్ది వ్యూస్ కూడా వస్తున్నాయి..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
MRI Scan Prices Hike: పశ్చిమ ఆసియాలో రాజుకున్న యుద్ధ జ్వాలలు కేవలం పెట్రోల్ డీజిల్ ధరలనే కాదు.. సామాన్యుడి ఆరోగ్య బడ్జెట్ను కూడా దెబ్బతీసేలా ఉన్నాయి..ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న పోరు ప్రపంచవ్యాప్తంగా హీలియం కొరతకు దారితీస్తోంది. దీని ప్రభావం నేరుగా భారతదేశంలోని వైద్య సేవలపై.. ముఖ్యంగా ఎంఆర్ఐ (MRI) స్కాన్ చార్జీలపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, హీలియంకి ఈ స్కాన్ మిషన్లకు ఎలాంటి సంబంధం ఉంది? ఈ రీజన్ వల్లనే ధరలు ఎలా పెరుగుతాయి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఒక MRI మిషన్ పనిచేయాలంటే హీలియం గ్యాస్ అత్యంత కీలక.. ఈ యంత్రంలో ఉండే శక్తివంతమైన సూపర్ కండక్టింగ్ మాగ్నెట్లను అతి శీతలీకరణ స్థితిలో ఉంచడానికి ద్రవరూపంలో ఉన్న హీలియంను ఉపయోగిస్తారు. మిషన్ వేడెక్కకుండా నిరంతరం చల్లబరిచే ఈ గ్యాస్ హరహర ఆగిపోతే.. కోట్ల విలువైన యంత్రాలు మొరాయించే అవకాశాలు ఉన్నాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచ హీలియం ఉత్పత్తిలో మూడింట ఒక వంతు వాటా ఒక్క ఖతార్ దేశానిదే.. అయితే, ఇటీవల ఇరాన్ దాడుల నేపథ్యంలో ఖతార్లోని ప్రధాన గ్యాస్ తయారీ కేంద్రాలు దెబ్బతిన్నట్లు మనం వార్తల్లో చూసాం.. దీంతో ఉత్పత్తి ఒక్కసారిగా నిలిచిపోయింది.. భారతదేశ తన హీలియం అవసరాల కోసం ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. సరఫరా గొలుసు దెబ్బతీయడంతో మార్కెట్లోని హీలియం ధరలు అప్పుడే పెరగడం ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
Read more: Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
ప్రస్తుతం ఒక MRI స్కాన్కు ప్రాంతాన్ని బట్టి రూ.5 వేల నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నారు.. ఒకవేళ హీలియం కొరత ఇలాగే కొనసాగితే.. నిర్వహణ వేయం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా 20 నుంచి 30 శాతం వరకు ధరలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి స్టాక్ అందుబాటులో ఉన్నప్పటికీ యుద్దం సుదీర్ఘకాలం కొనసాగితే సేవలో అంతరాయం తప్పదని మెడికల్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
Read more: Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Two snakes spotted near silathoranam queue line in Tirumala: కలియుగ దైవం, భక్తుల కొంగు బంగారంఅయిన తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఒకవైపు వరుస సెలవులు,మరోవైపు లాంగ్ వీకెండ్ లలో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.టొకెన్లు ఉన్నవారి దర్శనాలకు 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇక టోకెన్లు లేని వారికి 12 నుంచి 14 గంటల సమయం పడుతుంది. రూ. 300 టొకెన్లు ఉన్నవారికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. తిరుమలలో దాదాపు అన్ని కంపార్ట్ మెంట్ లు భక్తులతో నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు వేచిఉంటున్నారు. మరోవైపు తిరుమలలో ఇటీవల అడవి జంతువులు కూడా మెట్ల మార్గంలోకి వచ్చే స్తున్నాయి.
ఇప్పటికే చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులు,పాములు తరచుగా భక్తులకు టెన్షన్ పెడుతున్నాయి. టీటీడీ అధికారులు మాత్రం భక్తులంతా గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా.. తిరుమలలో రెండు పాములు శిలాతోరణం వద్ద రెండు పాములు హల్ చల్ చేశాయి. ఈ ఘటనతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
తిరుమల లోని శిలాతోరణం వద్ద క్యూలైన్ లో రెండు పాములు భక్తుల్ని ముప్పుతిప్పలు పెట్టాయి. అందులో ఒకటి 8 అడుగులు ఉండగా, మరొకటి 6 అడుగుల పొడవు ఉంది. జనాల రద్దీ మధ్య ఈ పాములు రావడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు.
Read more: Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు వెంటనే అక్కడికి చేరుకొని భక్తుల మధ్య బుసలు కొడుతున్న రెండు పాముల్ని చాకచక్యంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత వాటిని దట్టమైన అడవిలో వదిలేశాడు. దీంతో అక్కడున్న భక్తులు హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు మెట్ల మార్గంలో, శిలాతోరణం గుండా తిరుమలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. గుంపులు, గుంపులుగా వెళ్లాలని భక్తులకు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
AP High Court Recruitment Notification: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది అద్భుత అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్రంలోనే అత్యున్నత న్యాయసంస్థ హైకోర్టులో భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన వెలువడింది. ఇప్పటికే ఉగాది పండుగకు ఉద్యోగాల క్యాలెండర్ ప్రభుత్వం విడుదల చేయగా.. తాజాగా హైకోర్టులో ఉద్యోగాల భర్తీ ప్రకటన రావడంతో నిరుద్యోగులకు ఇది చక్కటి అవకాశం. ఏపీ హైకోర్టు ఉద్యోగాల భర్తీకి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Telangana PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు గల్లంతు.. పీఆర్సీ కమిటీ గడువు మళ్లీ పొడిగింపు
ఏపీ హైకోర్టులో చాలా కాలం తర్వాత భారీగా ఉద్యోగాల ప్రకటన వెలువడింది. రాష్ట్ర హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 78 అసిస్టెంట్స్, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ ఖాళీలతోపాటు తదితర పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయనుంది. మొత్తం పోస్టులు 300 ఉండగా.. వాటికి ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
Also Read: KTR On Sports Meet: అసెంబ్లీ సమావేశాల వేళ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలా? కేటీఆర్ ఆగ్రహం
పోస్టుల వివరాలు
సీనియర్ సిస్టమ్ ఆఫీసర్: 1
సెక్షన్ ఆఫీసర్స్: 5
కంప్యూటర్ ఆపరేటర్:31
అసిస్టెంట్ లైబ్రెరీయన్: 1
లైబ్రైరియన్ గ్రేడ్-II: 1
యూడీ స్టెనోగ్రాఫర్: 7
అసిస్టెంట్: 78
ఎగ్జామినర్: 27
టైపిస్ట్: 44
కాపీస్ట్: 34
డేటా ఎంట్రీ ఆపరేటర్: 50
స్టెనోగ్రాఫర్: 1
ఆఫీస్ సబార్డినేట్: 20
ఈ పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో వివిధ విద్యార్హతలు ఉన్నాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 7వ తరగతి/ డిగ్రీ/ బీటెక్/ లా డిగ్రీ చదివిన వారు హైకోర్టు ఉద్యోగాలకు అర్హులు. దీంతోపాటు టైపింగ్ లేదా షార్ట్హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు కూడా ఉండాలి. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే వారిని కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు.
Also Read: Lavanya Drunk: తప్ప తాగి హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ నానా రచ్చ.. తిరగబడ్డ గ్రామస్తులు
వయో పరిమితి
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారి వయో పరిమితి 01.01.2026 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల వయో పరిమితి సడలింపు ఉంది.
దరఖాస్తు ప్రారంభం: 30.03.2026 చివరి గడువు: 19.04.2026.
పూర్తి వివరాలకు https://aphc.gov.in/docs/notification_1774248554_0.pdf
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
MLA And MLCs Sports Meet: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్హాట్గా కొనసాగుతుండగా.. కాంగ్రెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహిస్తుండడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం చేతకాదు కానీ క్రీడా పోటీలా? అని మండిపడ్డారు. కీలకమైన అంశాలపై చర్చను పక్కన పెట్టేందుకే ప్రభుత్వం కొత్త ఎత్తుగడ అని విమర్శించారు.
Also Read: Telangana PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు గల్లంతు.. పీఆర్సీ కమిటీ గడువు మళ్లీ పొడిగింపు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో గురువారం లాబీల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో అత్యంత కీలకమైన పద్దులపై చర్చలతో కొనసాగుతున్న సమయంలో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇంత సీరియస్గా సభ జరుగుతున్న సమయంలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని తాను శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన నుంచి ఎలాంటి సమాధానం లేదని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read: Lavanya Drunk: తప్ప తాగి హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ నానా రచ్చ.. తిరగబడ్డ గ్రామస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సాగునీటి వంటి అత్యంత ముఖ్యమైన సబ్జెక్టులపై సభలో లోతైన చర్చ జరగాల్సి ఉందని.. కానీ ప్రభుత్వం మాత్రం పద్దులపై చర్చను త్వరగా ముగించి పారిపోవాలని చూస్తోందని విమర్శించారు. కీలకమైన అంశాలపై చర్చలు జరగాల్సిన సమయంలో ఎమ్మెల్యేలు ఆటలు ఆడుతుంటే ప్రజలు ఏమనుకుంటారని ప్రశ్నించారు.
Also Read: Harish Rao: 'తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాడు': హరీశ్ రావు
ఈ నెల 28, 29 తేదీల్లో ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల కాలాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా.. ఇలాంటి కార్యక్రమాలతో కాలయాపన చేయడం సరికాదని తప్పుబట్టారు. పద్దులపై చర్చకు తగినంత సమయం కేటాయించకుండా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు. చర్చించాల్సిన కీలకమైన అంశాలు పక్కనపెట్టి ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక క్రీడా పోటీలను ఒక సాకుగా చూపిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Govt Employees: గంపెడాశలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పిడుగులాంటి వార్త ఇది. వేతన సవరణ సంఘం గడువును మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు పీఆర్సీ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పీఆర్సీ కమిటీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. భారీ ఆశల్లో ఉన్న ఉద్యోగులకు ఈ వార్త చేదు గుళికగా మారింది.
Also Read: Lavanya Drunk: తప్ప తాగి హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ నానా రచ్చ.. తిరగబడ్డ గ్రామస్తులు
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 2020 సవరించిన వేతన శ్రేణుల (ఆర్పీ-2020) పే-ఫిక్సేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గడువును మరోసారి పొడిగించింది. పీఆర్సీ కమిటీ గడువు పొడిగిస్తూ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలలు పొడిగించడంతో సెప్టెంబర్ వరకు ఈ కమిటీ గడువు పొడిగించారు. పెండింగ్లో ఉన్న పే-ఫిక్సేషన్ పనులన్నింటినీ సెప్టెంబర్ 30, 2026లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Also Read: Harish Rao: 'తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కాడు': హరీశ్ రావు
ఈ ప్రక్రియను మార్చి 31, 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉండగా మూడేళ్ల నుంచి గడువు పొడిగిస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి పొడిగింపు చేశారు. కొన్ని కారణాలతో ఇంకా అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం భావించి గడువు పొడిగించినట్లు తెలుస్తోంది. అయితే ఆఫీసర్స్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం గడువు పొడిగించినట్లు సమాచారం. అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు నిర్ణీత గడువులోగా అర్హతలకు అనుగుణంగా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Also Read: YS Jagan: ఇక రోజూ చంద్రబాబుకు సినిమా చూపిస్తా..! పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
ప్రభుత్వం తాజాగా పొడిగించడంతో ఉద్యోగులు తమ జీతాల పెంపు ఆశలు అడియాశలైనట్లు భావిస్తున్నారు. ఇప్పటికే అనేక సమస్యలు పెండింగ్లో ఉండగా ఇప్పుడు పీఆర్సీని కూడా వాయిదా వేయడంతో ప్రభుత్వం తమపై నిర్లక్ష వైఖరి ప్రదర్శిస్తోందని ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే నాలుగు డీఏలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు దిక్కులేదు. ఇక పెండింగ్ బిల్లులు విడతల వారీగా ఇస్తుండగా.. రిటైర్మెంట్ ఉద్యోగులకు వారి బెనిఫిట్స్ రాక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇన్ని సమస్యలు పరిష్కారం కాకపోయినా పీఆర్సీ వస్తుందనుకుంటే మరోసారి రేవంత్ రెడ్డి సర్కార్ పొడిగించడంతో వారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వేతన స్థిరీకరణ సమస్యలు పరిష్కారమై తమ ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందుతాయని ఆశించగా నిరాశే ఎదురైంది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటిని మరచిపోయారు. ఓట్ల కోసం తమను వాడుకున్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల్లోనే కొత్త పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించి ఇప్పుడు రెండున్నరేళ్లవుతున్నా అమలు చేయకపోవడంపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు. తాజాగా పీఆర్సీ కమిటీ గడువు పొడిగింపుతో ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే భారీ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డీఏలు పెండింగ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు వంటివి అపరిష్కృతంగా ఉండడంతో ఉద్యోగ వర్గాలు ఉద్యమానికి సమాయత్తం అవుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
IPL 2026 Full Schedule News: క్రికెట్ అభిమానులకు గుడ్న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్కు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ను విడుదల చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు ఫుల్ షెడ్యూల్ను తాజాగా విడుదల చేసింది. మిగిలిన మ్యాచ్ల వేదికలతో పాటు ఇతర వివరాలను ఆ షెడ్యూల్లో పొందుపరిచింది.
తొలి షెడ్యూల్ మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు ప్లాన్ చేయగా.. ఇప్పుడు రెండో ఫేజ్ కోసం 2026 ఏప్రిల్ 13 నుంచి మే 24 మధ్య 12 వేదికలలో 50 లీగ్ మ్యాచ్లు జరుగుతాయని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే రెండో షెడ్యూల్ విడుదల చేసే క్రమంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను మే 31న నిర్వహించనున్నట్లు తెలియజేసింది. అయితే ప్లేఆఫ్స్ గురించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు హోమ్ గ్రౌండ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఫైనల్ మ్యాచ్కు వేదిక కానుంది.
దేశంలో రాబోయే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం వంటి రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఏడాది బీసీసీఐ విడతలుగా మ్యాచ్ల షెడ్యూల్ను విడుదల చేసింది. భారత ఎన్నికల సంఘంతో సమన్వయం చేసుకోవడం ద్వారా బీసీసీఐకి అవసరమైన సెక్యూరిటీ, లాజిస్టికల్ ప్రణాళికలతో మొత్తం 70 లీగ్ మ్యాచ్లను దేశంలోనే సురక్షితంగా నిర్వహించేలా పక్కాగా ప్లాన్ చేసింది.
రెండో దశ ఏప్రిల్ 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ప్రతిష్టాత్మక పోరుతో తిరిగి ప్రారంభమవుతుంది. టోర్నీ రెండవ భాగంలో ఎనిమిది డబుల్-హెడర్ మ్యాచ్లు ఉండబోతున్నాయి. మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు, అలాగే సాయంత్రపు మ్యాచ్లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
సాంప్రదాయానికి భిన్నంగా మార్చి 28న బెంగళూరులో జరగాల్సిన సీజన్ ఆరంభ మ్యాచ్కు సంబంధించిన ఆరంభోత్సవాలను బీసీసీఐ రద్దు చేసింది. గతేడాది టైటిల్ వేడుకల సందర్భంగా బెంగళూరు నగరంలో జరిగిన ఘోర తొక్కిసలాట బాధితుల నివాళులర్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ సీజన్ను ఘనంగా ముగించేందుకు మే 31న జరిగే ఫైనల్కు ఒక భారీ ముగింపు వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Snakes Video Latest: సాధారణంగా పాము కనిపిస్తేనే వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అలాంటిది పదుల సంఖ్యలో విషపూరితమైన పాములు ఆ బాలుడి చేతిలో ఉన్న ఏమాత్రం భయం లేకుండా వాటితో ఆడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరిని ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది. ప్రకృతికి, మానవునికి మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని చాటి చెప్పేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్లలో రాసుకాస్తున్నారు..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్న అబ్బాయి పదుల సంఖ్యలో ఉన్న పాములను చేతిలో పట్టుకొని ఉండడం మీరు గమనించవచ్చు. ఆ పిల్లాడు ఎంతో చాకచక్యంగా ఆ పాములను.. భయమన్నదే లేకుండా వాటి తోకలను పట్టుకొని ఒకచోటు నుంచి మరోచోటికి ఎంతో ఉత్సాహంగా గెంతులు వేస్తూ ఉన్నాడు. సాధారణంగా మనుషుల అలికిడి తగిలితేనే దాడి చేసే పాములు.. ఈ పిల్లాడి విషయంలో మాత్రం ఎంతో శాంతంగా ఉండడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి.. ఆ చిన్నారి చేస్తున్న పనులకు పాములు ఏమాత్రం స్పందించకపోవడమే కాకుండా.. అతనితో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నట్లు కనిపిస్తోంది..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. నిజంగా ఈ పిల్లాడు అత్యంత ధైర్యవంతుడని కొంతమంది కామెంట్లు చేస్తూ వస్తుంటే.. ఇది అత్యంత ప్రమాద.. తల్లిదండ్రులు ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదని మరికొంతమంది వన్యప్రాణి సంరక్షకులు సూచిస్తూ ఉన్నారు. అలాగే ఈ పాములు విషపూరితమైనవా.. కాదా అనే చర్చ కూడా విపరీతంగా నడుస్తూ వస్తోంది. అయితే ఆ పిల్లాడి విశ్వాసంతో పాటు.. పాములతో అతను వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. అవి అతనికి ఎప్పటినుంచో అలవాటుగా ఉన్నట్లు అర్థమవుతుంది..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
ఈ వీడియో చూసిన వన్యప్రాణి సంరక్షకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పాములు సహజంగానే తమ రక్షణ కోసం దాడి చేస్తాయని.. చిన్నపిల్లలను ఇలాంటి ప్రమాదకరమైన జీవుల దగ్గరకు వదలడం ప్రాణాపాయానికి దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. వీడియో వైరల్ కోసం ఇలాంటి సాహసాలు చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందింది అనేది ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతూ షేర్ల వర్షం కురిపిస్తోంది.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Vemulawada Rajanna Temple News: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు గురువారం రోజున ఆలయ ప్రాంగణంలో భక్తులందరికీ స్వామివారిని దర్శనమిచ్చారు. సీతారాముల కళ్యాణ్ ఉత్సవాల సంబరాల్లో భాగంగా అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు.
నవరాత్రులు ఎనిమిదవ రోజు వేకువ జామునే శ్రీ సీతారామ స్వామి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైన అభిషేకం నిర్వహించారు. వేదమంత్రాల సాక్షిగా స్వామివారికి విశేషమైన అర్చనలు చేశారు. అనంతరం శ్రీ రామచంద్ర మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు..
మరోవైపు ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని క్షేత్రానికి పాలకుడైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. అభిషేకానంతరం స్వామి వారి పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. శివకేశవుల అద్వైత క్షేత్రమైన వేములవాడలో అటు శివుడికి ఇటు రామయ్యకు ఏకకాలంలో జరుగుతున్న ఈ పూజల్లో పాల్గొనడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు.
Also Read: 10 వేల మంది పోలీసులతో రాజా సింగ్ ర్యాలీ.. శోభాయాత్రలో హై టెన్షన్..
నవరాత్రుల సందర్భంగా ఆలయ యాగశాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పుణ్యాహవచనం పఠించిన అనంతరం మూలమంత్ర హోమం, స్వామివారి పరివార దేవతల హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు యాగశాల ప్రవేశం చేసి.. అగ్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ హోమ క్రతువుల నుంచి వెలుబడిన పవిత్రమైన ధూమంతో దేవాలయం మరింత పుణ్యమైంది గా మారిందని అర్చకులు చెబుతున్నారు. రామ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Dhurandhar The Revenge: ‘దురందర్ 2’లో ప్రధాని మోడీ.. దావూద్ లదే రోల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Energy Emergency India News: పశ్చిమాసియాలోని ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలపై పడుతోంది. కొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితి చేయిదాటిపోయింది. ఇరాన్లోని హోర్ముజ్ జలసంధిని మూసివేసిన కారణంగా ఆసియాలోని అనేక దేశాలలో చమురు సంక్షోభానికి దారితీసింది. ఆసియాలోని అనేక దేశాలు ఈ ద్వారం గుండా చమురు దిగుమతులు చేసుకునే క్రమంలో అవి నిలిచిపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
గత 26 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతున్న క్రమంలో ఈ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చమురు కొరత నేపథ్యంలో పలు ఆసియా దేశాలు ముందస్తు చర్యలు మొదలుపెట్టాయి. మరోవైపు భారతదేశంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా లేనప్పటికీ.. మనం కరోనా కాలం నాటి పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయినా కొన్ని దేశాలు మాత్రం అత్యవసర పరిస్థితి విధించేందుకు సిద్ధమయ్యాయి.
భారత్లో పరిస్థితి ఏంటి?
భారతదేశంలో ఇంకా ఇంధన సంక్షోభం ప్రారంభం కాలేదు. అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వదంతుల కారణంగా అనేక నగరాల్లోని పెట్రోల్ పంపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. గ్యాస్, ఆయిల్ సంక్షోభం వస్తుందనే అపోహ ప్రజల్లో వ్యాపిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఇంధన అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. భారతదేశం ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాల సంఖ్య 27 నుండి 41కి పెరిగింది.
పాకిస్తాన్
చమురు సంక్షోభాన్ని ఎదుర్కోనేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ రంగ ఉద్యోగులు కేవలం 4 రోజులు మాత్రమే పని చేస్తారని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాలలు, కళాశాలలను రెండు వారాల పాటు మూసివేసినట్లు సమాచారం. పాకిస్తాన్ చమురు దిగుమతులలో దాదాపు 90 శాతం నిలిచిపోయాయి. ఈ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.350కి పెరిగాయి.
బంగ్లాదేశ్
దేశంలో ఇంధన నిల్వలు కేవలం 9 నుంచి 14 రోజులకు మాత్రమే సరిపోతాయని బంగ్లాదేశ్లోని తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం తెలిపింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించింది. పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులను నిర్వహించడంతో పాటు ప్రతిరోజూ ఐదు గంటల విద్యుత్ కోతను అమలు చేశారు. వస్త్ర రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
శ్రీలంక
శ్రీలంకలో ప్రభుత్వ సెలవులను తప్పనిసరి చేశారు. పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు వారానికి 15 లీటర్ల పరిమితిని విధించారు. ఎవరూ అదనపు ఇంధనాన్ని కొనుగోలు చేయకుండా చూసేందుకు 'క్యూఆర్ ఆధారిత ఫ్యూయల్ పాస్ వ్యవస్థ'ను అమలు చేశారు.
థాయ్లాండ్
థాయ్లాండ్లో ప్రభుత్వ రంగాలలో ఇంటి నుండి పని చేయాలని, విదేశాలకు ప్రయాణించవద్దని ఆదేశాలు జారీ చేశారు.
వియత్నాం
వియత్నాంలో ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించగా.. ఇక్కడ రిమోట్ వర్కింగ్ విధానాన్ని పరిశీలిస్తున్నారు.
తైవాన్
తైవాన్ వద్ద కేవలం 11 రోజులకు సరిపడా LNG నిల్వలు మాత్రమే ఉన్నాయి.
ఇండోనేషియా
ఏప్రిల్ నుంచి అమలు చేయనున్న హైబ్రిడ్ మోడల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి. ఈ విషయంలో త్వరలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఫిలిప్పీన్స్ అత్యవసర పరిస్థితి
ఫిలిప్పీన్స్ దేశంలో 'జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి'ని ప్రకటించారు. ఇంధన నిల్వలు కేవలం 45 రోజులకు మాత్రమే సరిపోతాయని ప్రజలకు తెలియజేశారు.
జపాన్
జపాన్ దేశం తన నిల్వల నుండి చమురును మరోసారి మార్కెట్లోకి విడుదల చేయాలని IEAను కోరింది.
దక్షిణ కొరియా
దక్షిణ కొరియా దేశంలో ప్రభుత్వ సంస్థలలో వెహికల్ నంబరు ఆధారిత నియంత్రణ విధానాన్ని అమలు చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook