సికింద్రాబాద్: బోనాల జాతరకు రావాలని కిషన్ రెడ్డికి ఆహ్వానం
Secunderabad, Telangana:సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, పూజారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 21, 22వ తేదీలలో అత్యంత వైభవంగా బోనాల జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
MLC Anantha Babu Arrest: ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు..ఆ వెంటనే రిమాండ్?!
Rajamahendravaram, Andhra Pradesh:MLC Anantha Babu Arrest News: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో బెయిల్ విచారణ నిమిత్తం రాజమండ్రి కోర్టుకు రాగా కోర్టు ఆవరణలో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.Telangana RTC Strike: చర్చల అనంతరం ఆర్టీసీ సమ్మెపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన
Hyderabad, Telangana:Telangana RTC Strike: అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తమకు తీవ్ర అన్యాయం.. మోసం చేయడంతో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో సమ్మె చేపట్టారు. సమ్మె ఉధృతంగా సాగుతుండగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా రేవంత్ రెడ్డి చలించకపోవడంతో మనస్తాపం చెందిన కార్మికులు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. శంకర్ గౌడ్ మరణంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. మంత్రివర్గ సమావేశం అనంతరం శుక్రవారం ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చల అనంతరం ఉప ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Telangana RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం.. రేపు ప్రభుత్వంతో ఆర్టీసీ సంఘాల చర్చ
రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నాయకులతో జరిగిన చర్చల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. 'శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరం. వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రాణం అనేది అత్యంత విలువైనది. శంకర్ గౌడ్ మరణంతో ఆ కుటుంబం మొత్తం తలకిందులైంది. ఇలాంటి విషాదకర సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున మేం, కార్మిక సంఘాల నాయకులుగా కార్మికులకు పిలుపునిద్దాం' అని ఆర్టీసీ జేఏసీ నాయకులతో డిప్యూటీ సీఎం తెలిపారు.
సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని డిప్యూటీ సీఎం ప్రకటించారు. సమస్య ఎంత క్లిష్టమైనదైనా సరే కూర్చుని మాట్లాడుకుంటే ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. 'ఇది ప్రజా ప్రభుత్వం. తెలంగాణలో ఎవరినీ శత్రువులుగా చూసే స్వభావం మాకు లేదు. ఆర్టీసీ అనేది రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఇతర రాష్ట్రాల్లో సంస్థల పరిస్థితి వేరుగా ఉన్నా.. ఆర్టీసీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది' అని గుర్తుచేశారు.
'బడ్జెట్ సమావేశాలు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా బిల్లు, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, నేను, ఇతర మంత్రులు బిజీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా సమ్మె నిర్ణయం తీసుకోవడంతో ఒక కార్మికుడిని కోల్పోవాల్సి వచ్చింది. ఇది అత్యంత బాధాకరం, ఆ కుటుంబానికి ఇది తీరని లోటు' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టీసీ అందరి సంస్థ అని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. 'పేదలు, మహిళలకు రవాణా పరంగా ఉన్న ఏకైక మార్గం ఆర్టీసీ. వారందరినీ దృష్టిలో పెట్టుకుని సంస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చి నిలబెట్టుకోవాల్సిన సామాజిక బాధ్యత ఉంది. ఆర్టీసీకి సంబంధించిన పాలనాపరమైన, విధానపరమైన నిర్ణయాలపై ఖచ్చితంగా చర్చిద్దాం. కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుందాం' అని ఆర్టీసీ జేఏసీ నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
MLC Anantha Babu Arrest: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు..ఎట్టకేలకు వెంటాడి పట్టుకున్న పోలీసులు..డ్రైవర్ హత్య కేసులో తదుపరి రిమాండ్!
Hyderabad, Telangana:MLC Anantha Babu Arrest News: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇప్పుడు సంచలన ఘటన జరిగింది. తొలి నుంచి ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. మరికొద్ది గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోర్టులో బెయిల్ విచారణ కోసం ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య లక్ష్మీదుర్గ వచ్చారు. కోర్టు నుంచి బయటకు రాగానే అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన వెంటనే అతడ్ని కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇప్పుడు వార్త ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఏం జరిగిందంటే?
2022 మే 19న ఏపీలోని వైయస్సార్ సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడి మృతి తర్వాత అర్ధరాత్రి సమయంలో డ్రైవర్ మృతదేహాన్ని ఎమ్మెల్సీ అనంత బాబు స్వయంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం అప్పట్లోపెను దుమారం రేపింది. తొలుత ఆ మృతిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగినప్పటికీ, తీవ్ర నిరసనల మధ్య విచారణ జరిపి అనంతబాబును ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతడ్ని రిమాండ్కు తరలించారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు గతేడాది (2025) జూలైలో ప్రభుత్వం ఈ కేసుపై తదుపరి విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. రిమాండ్ నుంచి బెయిల్పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు అతని గన్మెన్లు, అనుచరులను సిట్ విచారించింది. అయితే ఇటీవలే ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు భార్య ప్రమేయాన్ని నిర్ధారిస్తూ చార్జిషీట్ దాఖలు చేయడం కేసులో కీలక మలుపుగా మారింది. అనంతబాబుతో పాటు అతని భార్యపై క్రిమినల్ నేరారోపణలు ఉన్న నేపథ్యంలో వారిద్దరూ బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించారు. అయితే కోర్టులో విచారణ జరిగే అన్ని రోజుల పాటు ఎమ్మెల్సీ అనంతబాబు పరారీలో ఉన్నారు.
ఈ హత్య కేసులో అనంతబాబు భార్యను రెండవ నిందితురాలిగా (A-2) సిట్ పేర్కొనడంతో అప్పుడు అస్సలు కథ మొదలైంది. సుబ్రహ్మణ్యం హత్యలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా, ఆధారాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించారని సిట్ అధికారులు కోర్టుకు వివరించారు. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, ఇతర సాంకేతిక ఆధారాల విశ్లేషణ తర్వాతే ఆమెపై ఈ అభియోగాలు మోపినట్లు సిట్ వెల్లడించింది. దీంతో భార్యభర్తలిద్దరూ పరారీలో ఉండగా.. తాజాగా రాజమండ్రి కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు రావడం వల్ల వారిద్దరూ కోర్టుకు హాజరైనట్లు తెలుస్తోంది. కోర్టు నుంచి బయటకు రాగానే ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ఈ కేసులో తదుపరి ఏం జరుగుతుందో తెలియాలంటే వేచిచూడక తప్పదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RTC JAC Talks: ఆర్టీసీ ఉద్యోగులతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు..డిమాండ్లు నెరవేర్చే దిశగా అడుగులు!
Hyderabad, Telangana:Telangana RTC JAC Talks: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులు లేవనెత్తిన అంశాలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఉద్యోగుల డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.Education Mafia: ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాల ధరల నియంత్రణకు NHRC సంచలన నిర్ణయం..
Hyderabad, Telangana:Human Rights Commission Latest News: ప్రైవేట్ పాఠశాలల్లో ప్రతి ఏటా పెరుగుతున్న పుస్తకాల ధరల భారంతో సామాన్య తల్లిదండ్రులు విలవిలలాడుతున్న సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా ధరలను పెంచి.. ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దడాన్ని కమిషన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది రాజ్యాంగం కల్పించిన ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. అంతేకాకుండా వివిధ అంశాలపై కూడా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన కమిషన్.. కేంద్ర విద్యా శాఖ కార్యదర్శి.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాల మాఫియాను అరికట్టడానికి తీసుకున్న చర్యలు ఏమిటో నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది..
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ రూపొందించిన పుస్తకాల ధరలు చాలా తక్కువ పాటు అందుబాటులో ఉన్నాయని.. అయితే ప్రైవేటు పాఠశాలలు వీటిని కాదని భారీ ధరలు ఉండే ప్రైవేటు పబ్లిషర్ల పుస్తకాలను ఎందుకు సిఫారసు చేస్తున్నాయని NHRC ప్రశ్నించింది.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్సీఈఆర్టీ పుస్తకాలు తక్కువ ధరలకే లభిస్తుంటే.. ప్రైవేటు పుస్తకాల చెట్ల ధరలు దాదాపు మూడు వేల నుంచి పదివేల వరకు ఉండడం గమనార్హం.. ఇది విద్యార్థుల తల్లిదండ్రులపై పెను ఆర్థిక భారంగా మారుతోందని కమిషన్ వ్యాఖ్యానించింది..
Read more: Karimnagar: పన్ను ఎగవేతే లక్ష్యం.. చీకటి వ్యాపారానికి కరీంనగర్ అడ్డా..
కమిషన్ కొన్ని అంశాలపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. ప్రైవేటు పబ్లిషర్లతో స్కూల్ యాజమాన్యాలు లోపాయి గారి ఒప్పందాలు కుదుర్చుకొని.. భారీ కమిషన్ల కోసం తల్లిదండ్రులను పీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరలు ఆకాశాన్ని ఆకాశాన్నంటుతున్నా.. ఆ పుస్తకాల్లోని పాఠ్యాంశాల నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండడం లేదని.. కొన్ని పాఠశాలలు నిర్విత దుకాణాల్లోనే పుస్తకాలు కొనాలని నిబంధనలు పెట్టడం కూడా కట్ట విరుద్ధమని కమిషన్ పేర్కొంది. విద్యాసంస్థలు లాభాపేక్ష లేకుండా సేవ చేయాల్సిన చోట.. వ్యాపార సంస్థలుగా మారి దోపిడీకి పాల్పడుతున్నాయని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎన్ హెచ్ ఆర్ సి జోక్యంతోనైనా ప్రైవేట్ స్కూల్లో ఫీజులతో పాటు పుస్తకాల ధరలపై ఒక స్పష్టమైన నియంత్రణ వస్తుందని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు.
Read more: Karimnagar: పన్ను ఎగవేతే లక్ష్యం.. చీకటి వ్యాపారానికి కరీంనగర్ అడ్డా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Jagtial News: ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్టం: మాజీ మంత్రి జీవన్ రెడ్డి..
Karimnagar, Telangana:Jeevan Reddy News: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట పట్టడం దురదృష్టకరమని.. ఈ పరిస్థితికి ప్రభుత్వం మొండివైఖరి, నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన హాజరై.. తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డు ఎక్కడ ప్రభుత్వ వైఫల్యమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.. సమ్మె వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిసిన.. కార్మికుల గోడును ప్రభుత్వం పట్టించుకోలేదని.. చర్చల ద్వారా పరిష్కరించాల్సిన సమస్యలపై ఎలాంటి సమీక్ష లేకుండా.. కార్మికులను మానసిక శోభకు గురిచేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ కూడా చేశారు..
సమ్మె సమయంలో మృతి చెందిన కార్మికుడు శంకర్ గౌడ్ మరణం పట్ల జీవన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది సహజ మరణం కాదని.. ప్రభుత్వ హత్యనని ఆయన ఆరోపించారు. శంకర్ గౌడ్ మృతి బాధాకరం.. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. మృతుని కుటుంబానికి దాదాపు కోటి రూపాయల ఎగ్జిగ్రేషియా ప్రకటించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు..
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం పక్కన పెడితే.. ఉన్న సంస్థను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆర్టీసీని బలోపేతం చేయాల్సిన బాధ్యతలు ప్రభుత్వంపై ఉందని.. లాభనష్టాలతో సంబంధం లేకుండా ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని కోరారు. ప్రైవేటీకరణ ఆలోచనలను విరమించుకోకపోతే.. రాబోయే రోజుల్లో ప్రజా ఆగ్రహాన్ని చూడక తప్పదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
నిరంతరాయంగా ప్రజలకు సేవలు అందించే ఆర్టీసీ కార్మికుల కష్టాలు వర్ణనాతీతమని.. వారి పోరాటానికి BRS పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కార్మికులు అసలు అధైర్య పడవద్దని.. న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘాల నేతలతో పాటు స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు..
Read more: Actress Pragathi: ఆ పనిచేస్తూ నరకం చూపించాడు..!. నటి ప్రగతి ఆంటీ షాకింగ్ కామెంట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mumbai Indians Downfall: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ పతనం మొదలు..5 సార్లు విజేత ప్రదర్శన ఇదా? అంబానీ ఫ్యామిలీ చేసిన తప్పు అదే!
Hyderabad, Telangana:Mumbai Indians Downfall: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో 5 సార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు పతనం మొదలైందా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ అభిమానులు. రోహిత్ శర్మ నాయకత్వంలో ఈ జట్టు 5 ట్రోఫీలతో తిరుగులేని సామ్రాజ్యంగా ఎదిగింది. కానీ, గతంలో జరిగిన ఒకే ఒక్క ఐపీఎల్ ట్రేడ్ ఇప్పుడు ఆ టీమ్ను గద్దె నుంచి దించే ప్రయత్నం చేస్తోంది. అయితే ముంబై ఇండియన్స్ పతనం వెనుక ఉన్న అసలైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
భారత క్రికెట్ను దాని మూలాల వరకు కుదిపేసిన ఒక బోర్డు రూమ్ నిర్ణయంతో ఇదంతా మొదలైంది. ఐపీఎల్ 2024కు ముందు గుజరాత్ టైటాన్స్ నుండి హార్దిక్ పాండ్యాను తిరిగి ట్రేడ్ చేయాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించుకుంది. అదే సమయంలో పదేళ్లకు పైగా తన అసాధారమైన కెప్టెన్సీతో జట్టును పలుమార్లు విజేతగా నిలిపిన రోహిత్ శర్మ నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించింది. అప్పటి నుండి జరిగిన అన్ని పరిణామాలకు ఆ ఒక్క క్షణమే బీజం వేసింది.
రోహిత్ శర్మ కేవలం ముంబై ఇండియన్స్కు కెప్టెన్గా మాత్రమే వ్యవహరించలేదు. 2013, 2015, 2017, 2019, 2024లోని ఐపీఎల్ సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టును విజేతగా నిలిపి తిరుగులేని సామ్రజ్యం నిర్మించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ను నిలబెట్టాడు. అంతటి ప్రతిభ ఉన్న వ్యక్తిని కాదని హార్దిక్ పాండ్యాను జట్టులోకి ట్రేడ్ చేసుకుంటూనే రోహిత్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించింది.
హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా తిరిగి తీసుకురావడానికి ముంబై ఇండియన్స్ ఎక్కువ డబ్బును వెచ్చించడమే కాకుండా.. కెప్టెన్సీలో రోహిత్ శర్మను తొలగించి హార్దిక్ పాండ్యా తమ కెప్టెన్ అంటూ ప్రకటించింది. హార్దిక్ రాక జట్టును కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అంచనా వేశారు. కానీ దానికి బదులుగా, ఈ ట్రేడ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత నిరాశాజనకమైన ఫలితాలలో ఒకటిగా నిలిచింది. జట్టుకు అత్యంత అవసరమైనప్పుడు హార్దిక్ బ్యాట్తో గానీ, బంతితో గానీ రాణించడంలో నిలకడగా విఫలమయ్యాడు. మొదటి సంవత్సరంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు టైటిల్ గెలిచి.. ఆ తర్వాతి ఏడాది రన్నరప్గా నిలపడంలో హార్దిక్ పాండ్యా ఎంతో శ్రమించాడని చెప్పడంలో సంశయం లేదు.
కానీ, హార్దిక్ పాండ్యా ప్రస్తుత గణాంకాలు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. గతంలో మ్యాచ్ ఫలితాన్నే మార్చే ప్రదర్శన చేసిన పాండ్యా.. ఇప్పుడు ఫామ్ను కోల్పోయాడు. ప్రస్తుత ఐపీఎల్ 2026లో 6 మ్యాచ్లలో కేవలం 97 పరుగులు మాత్రమే చేసి, 10-19 శాతం మధ్య సగటును నమోదు చేశాడు. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడనే నమ్మకంతో జట్టులోకి తీసుకుని, కెప్టెన్సీ చేసిన ఆటగాడికి, ఈ గణాంకాలు ఒక ఘోరమైన వైఫల్యాన్ని సూచిస్తున్నాయి. దీనివల్ల ముంబై జట్టు పదేపదే లక్ష్యాలను ఛేదించే క్రమంలో ముందుగానే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడింది.
ఏ క్రికెట్ జట్టుకైనా హార్దిక్ పాండ్యా బ్యాటర్గా, పేస్ బౌలింగ్ చేసే ఆల్ రౌండర్గా అతనికున్న రెండు రకాల సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ 2026లో అతని బౌలింగ్ కూడా అంతే నిరాశపరిచింది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. మిడిల్ ఓవర్లలో పరుగులు విచ్చలవిడిగా ఇచ్చేశాడు. దీంతో అతని భారీ ధర ట్యాగ్కు, కెప్టెన్సీకి తగిన న్యాయం చేయలేకపోతున్నాడనే వాదన వినిపిస్తుంది.
హార్దిక్ సమస్యతో పాటు.. ఐపీఎల్ 2026 అంతటా ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ ఆందోళనకరంగా బలహీనంగా కనిపించింది. టాప్ ఆర్డర్ ఒత్తిడికి కుప్పకూలుతోంది. మిడిల్ ఆర్డర్ ఇన్నింగ్స్ను నిలబెట్టడంలో విఫలమవుతోంది. లోయర్ ఆర్డర్ చెప్పుకోదగ్గ సహకారం అందించడం లేదు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో క్వింటన్ డి కాక్, డానిష్ మాలేవార్, నమన్ ధీర్ అనే టాప్ త్రీ బ్యాట్స్మెన్లు కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పెవిలియన్కు తిరిగి వచ్చారు. ఆ మ్యాచ్లో మొత్తం స్కోరు 100 పరుగులు కూడా దాటలేదు. కేవలం సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మాత్రమే రెండంకెల స్కోరును చేరుకున్నారు.
ఇప్పటికే ఉన్న అన్ని సమస్యలకు తోడు, రోహిత్ శర్మను వెంటాడుతున్న నిరంతర ఫిట్నెస్ సంక్షోభం కూడా ఒక సమస్యగా మారింది. కండరాల గాయం (హ్యామ్స్ట్రింగ్ ఇంజ్యూరీ) తగ్గకపోవడంతో, ఈ మాజీ కెప్టెన్ ఐపీఎల్ 2026 టోర్నమెంట్ అంతటా జట్టులో స్థానం కోల్పోతూ, తిరిగి అప్పుడప్పుడూ ఆడుతూ కనిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు ఓపెనర్గా అతని ఉనికి జట్టుకు బ్యాటింగ్ స్థిరత్వాన్ని, అనుభవాన్ని, అలాగే కుప్పకూలుతున్న ఛేజ్ను ఒంటరిగా గెలిపించగల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లను అందించేది. కానీ దానికి బదులుగా, తన అభిమాన ఫ్రాంచైజీ మరింత సంక్షోభంలోకి జారుకుంటుండగా, అతను తీవ్ర ఆవేదనతో డ్రెస్సింగ్ రూమ్ నుండి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.
ఐపీఎల్లో గత కొన్నేళ్లుగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్కు అభేద్యమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో ఆ జట్టుపై విజయం సాధించిన సందర్భాలు వేళ్లపై లెక్కించవచ్చు. కానీ, ఈ సీజన్లో ఏకంగా మూడు సార్లు ఓటమిని చవిచూసింది ముంబై జట్టు. గురువారం చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 103 పరుగుల భారీ ఓటమి, ఆ ఫ్రాంచైజీ చరిత్రలోనే సొంతగడ్డపై అత్యంత అవమానకరమైన పరాజయాన్ని చవిచూసింది. ఒకప్పుడు ఆత్మవిశ్వాసంతో హోరెత్తిన ఆ మైదానం ఇప్పుడు నిశ్శబ్దంతో, అపనమ్మకంతో ప్రతిధ్వనిస్తోంది.
ముంబై ఇండియన్స్ ప్రస్తుతం ఐపీఎల్ 2026 పట్టికలో 7 మ్యాచ్లలో 2 విజయాలు, 5 ఓటములతో కేవలం 4 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఓటమి తర్వాత వారి నెట్ రన్ రేట్ మైనస్ -0.736కు పడిపోయింది, ఇది మొత్తం టోర్నమెంట్లోనే అత్యంత చెత్త గణాంకాలలో ఒకటిగా నిలిచింది. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ కంటే దిగువన లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్ మాత్రమే ఉన్నాయి. ఈ టోర్నమెంట్ను ఐదుసార్లు గెలిచిన ఫ్రాంచైజీకి, ఈ గణాంకాలు వారి ఘనమైన చరిత్రలో మునుపెన్నడూ లేని అవమానాన్ని సూచిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chandrababu Award: చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు.. రేపు ముంబైకి పయనం
Nuzendla, Andhra Pradesh:Economic Times Business Reformer Award: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి పాలనా సంస్కర్తగా గుర్తింపునిస్తూ అవార్డు లభించింది. ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ప్రకటించింది. గతంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, జై శంకర్, బిహార్ సీఎం నితీష్ కుమార్ అవార్డు అందుకోగా 2025 సంవత్సరానికి చంద్రబాబు ఎంపికయ్యారు. ఈ అవార్డును రేపు ముంబైలో ప్రదానం చేయనున్నారు.
Also Read: Telangana Cabinet Meeting: పీసీ ఘోష్ కమిషన్పై సంచలన నిర్ణయం.. తెలంగాణ మంత్రివర్గం నిర్ణయాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లాంటి విప్లవాత్మక విధానాలు అమలు చేసినందుకు గాను ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డును చంద్రబాబుకు అందిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పన, పారిశ్రామిక విధానాల్లో విప్లవాత్మక మార్పులు-పారిశ్రామిక అనుకూల పాలసీల రూపకల్పనలో చంద్రబాబు కృషిని ఎకనమిక్ టైమ్స్ జ్యూరీ కొనియాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏపీకి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చారని.. పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తూ అమలు చేస్తున్న సంస్కరణలను జ్యూరీ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. టెక్నాలజీ , ఇన్నోవేషన్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో చంద్రబాబు చేస్తున్న కృషికి ఈ అవార్డు లభించింది.
Also Read: Telangana RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం.. రేపు ప్రభుత్వంతో ఆర్టీసీ సంఘాల చర్చ
చంద్రబాబు రేపటి షెడ్యూల్
ముంబైలో శనివారం సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు చంద్రబాబు అమరావతి నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 12.50 గంటలకు క్యాంప్ ఆఫీసు నుంచి బయలుదేరి వెళ్తారు. 2.40 గంటలకు ముంబై విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 5.25 గంటలకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కు వెళ్తారు. రాత్రి 9.30 వరకు ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9.50 గంటలకు ముంబై నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
ఎక్కడ అందుకుంటారు?
వేదిక: ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్
సమయం: రేపు సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు
అతిథులు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా దిగ్గజ పారిశ్రామికవేత్తలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Viral Video: వీడు కదా అదృష్టవంతుడు అంటే.. మృత్యువు నోట్లో నుంచి ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్..
Hyderabad, Telangana:Latest Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా ప్రమాదాలు ఎప్పుడు, ఏ రూపంలో వస్తాయో ఎవరూ ఊహించలేరని ఈ వీడియో కళ్లకు కట్టినట్లు చెబుతోంది. ఈ వీడియోలో క్షణాల్లో ఒక ప్రమాదం జరగడం మీరు కళ్లకు కట్టినట్లు చూడొచ్చు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక పర్యాటక ప్రాంతంలో కొండపై ఉన్న ఇరుకైన రహదారిపై ఒక కారు అదుపుతప్పి లోయ అంచుకు చేరుకోవడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ కారు లోయలో పడిపోకుండా ఉండేందుకు అక్కడ ఉన్న స్థానికులు, పర్యాటకులు కూడా ప్రయత్నించడం మీరు చూడొచ్చు.. కొంతమంది వ్యక్తులు కారు వెనక భాగాన్ని గట్టిగా పట్టుకుని ఆపేందుకు కూడా ప్రయత్నిస్తుండం మీరు క్లియర్గా చూడొచ్చు.
కారు నెమ్మదిగా లోయలోకి జరిపోతుండగా.. లోపల డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తి పరిస్థితి ఎంతో దయనీయంగా ఉండడం మీరు చూడొచ్చు. అయితే, కారు ఒక్కసారిగా పల్టీలు కొడుతూ లోయలోకి పడిపోతున్న క్రమంలో.. ఆ వ్యక్తి ప్రాణాల మీద ఆశతో.. కారు డోర్ తెరిచి.. బయటకు దూకేయడం మీరు చూడొచ్చు. సెకన్ల వ్యవధిలో అతను బయటకు రావడం, మరుక్షణమే ఆ కారు లోయలోకి వెల్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్ తాగించిన తోటి కోడలు..
ఈ వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఇన్స్టాగ్రామ్తో పాటు ట్విట్టర్, యూట్యుబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. కొండ ప్రాంతాల్లో డ్రైవింగ్ చేసే క్రమంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన చూసిన తర్వాత నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు. అయితే, ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడిన్నట్లు తెలుస్తోంది.
Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్ తాగించిన తోటి కోడలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Remedies For Debt Relief: అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? శనివారం నాడు ఇలా చేస్తే అప్పుల బాధల నుంచి ఉపశమనం!
Hyderabad, Telangana:Saturday Remedies For Debt Relief: మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో ఎంతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. నెల మొత్తం ఎంత కష్టపడ్డా.. నెలాఖరులో ఖర్చుల రూపంలో డబ్బు మొత్తం ఆవిరి అయిపోతుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వల్ల డబ్బు నిలువక, ఎంత కష్టపడినా ఖర్చులు భారీగా పెరిగిపోయి.. పొదుపు అనేది లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. శనివారం కొన్ని పరిహారాలు చేయడం వల్ల అప్పుల బాధలు, అధిక ఖర్చులు వంటివి తగ్గిపోతాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏ పని ప్రారంభించాలన్నా తిథులతో పాటు క్రమం తప్పకుండా వాస్తు లెక్కలు కూడా చూస్తుంటారు. ఎవరైతే వాస్తు నియమాలు పాటిస్తూ తగిన పరిహారాలు చేస్తుంటారో వారికి ఆర్థిక, అనారోగ్య ఇబ్బందులు తొలిగి ఆనందంగా జీవిస్తారని జోత్యిష్క్యులు చెబుతున్నారు. ఎవరైతే వాస్తు నియమాలు సరిగ్గా పాటిస్తే, వారికి అన్నింటా కలిసొచ్చి.. ఇంట్లోని కుటుంబ సభ్యులకు ఆర్థిక, అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మనకు తెలిసి, తెలియక చేసిన తప్పులు మనల్ని వెంటాడి ఆర్థిక సమస్యలు, అనారోగ్య బాధలు వచ్చిపడుతుంటాయి. ఎవరైతే అప్పుల బాధలు సతమతం అవుతున్నారో అలాంటి వారు శనివారం నాడు కొన్ని పరిహారాలు పాటిస్తే ఎంతో మేలు కలుగుతుంది.
శని దేవుడికి శనివారం ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజున శనిదేవుడికి ప్రత్యేక పూజలు, పరిహారాలు పాటించడం వల్ల అనేక సమస్యల నుంచి బయటపడొచ్చు. శనివారం రోజున కొన్ని పనులు చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం ప్రాప్రిస్తూ.. ఆర్థిక సమస్యల వంటివి తీరిపోతాయట. క్రమం తప్పకుండా ప్రతి శనివారం ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేసి, పనికి రాని వస్తువులను ఇంటి బయట వేయాలి. ఇలా ఇల్లు శుభ్రం చేయడం వలన ఇంటిలో సానుకూల శక్తి పెరిగి.. ప్రతికూల శక్తి (నెగెటివ్ ఎనర్జీ) తగ్గిపోతుంది. ఎన్నో నెలలుగా వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.
అప్పుల బాధలు పోయి.. కుటుంబం మొత్తం ఆనందంగా జీవించాలంటే.. ఆవనూనెతో శనివారం నాడు దీపాన్ని వెలిగించాలట. ఇలా చేయడం వల్ల ఆర్థిక బాధలు తొలిగిపోతాయని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. శనివారం నాడు ఈ ఆవ నూనె దీపాన్ని ఇంట్లోని పూజ గది లేదా రావి చెట్టు కింద అయినా వెలిగిస్తే మేలు జరుగుతుంది. ప్రతి శనివారం ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందట. శనివారం నాడు నల్లకుక్కలు, నల్ల కాకులకు ఆహారం పెట్టడం ఎంతో మంచిదట.
అలాగే శనివారం నాడు దాన ధర్మాలు చేయడం కూడా మేలు కలుగుతుంది. శనిదేవునికి ప్రీతికరమైన రోజున ఎవరైతే వస్తువులు, నల్ల నువ్వులు, దుప్పట్, ఆవ నూనె వంటివి దానం చేస్తారో వారికి జీవితంలో కలిసొస్తుంది. ఇలా ఏడు వారాల పాటు ఇలా శనివారాలు ప్రత్యేక పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తగ్గి, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది.
నిత్యం అప్పుల సమస్యలతో కొట్టుమిట్టాడే వారు.. అప్పులు తీరక తీవ్ర ఇబ్బందులు పడేవారు ప్రతి శనివారం ఇనుము వస్తువులను దానం చేయడం ఎంతో మంచిదట. వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం నాడు ఇనుము వస్తువులు దానం చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. అలా ఇనుము వస్తువులను దానం చేయడం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. అప్పుల బాధలు క్రమంగా తగ్గుతాయి. అయితే శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా ఇంట్లోకి ఇనుము వస్తువులను కొనుగోలు చేయరాదు. అలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా రూపొందించింది. అయితే దీన్ని పాటించే ముందు సంబంధిత జోతిష్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Snake Viral Video: ఐక్యమత్యమే మహాబలం.. పాముకు చుక్కలు చూపించిన కప్పలు!
Hyderabad, Telangana:Frogs Attacks A Snake Viral Video: ప్రకృతిలో బలవంతుడిదే లోకం అని అనుకుంటూ ఉంటారు. సాధరణంగా పాము కనిపిస్తే కప్పలు ప్రాణభయంతో పరుగులు తీస్తూ ఉంటాయి. పాము నోటికి చిక్కి ఆహారంగా మారుపోతాయి. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో దీనికి చాలా భిన్నంగా ఉంది. అక్కడ తిరుగుతున్న పామును చూస్తుంటే ఆశ్చర్యం తప్పకుండా వేస్తుంది. అయితే ఒక విష సర్పం పదుల సంఖ్యలో ఉన్న కప్పల మధ్య చిక్కుకొని.. వాటి దాడిని తట్టుకోలేక విలవిలలాడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఒక పాత బాడిలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. ఆహారం కోసం ఆ బావిలోకి వెళ్లిందో లేక ప్రమాదవశాత్తు పడిందో తెలియదు కానీ.. ఒక ప్రమాదకరమైన పాము బావిలోని నీటిలో చిక్కుకుని ఉండడం మీరు చూడొచ్చు. అయితే, అదే బావిలో అప్పటికే పదుల సంఖ్యలో ఉండడం కూడా మీరు గమనించవచ్చు. సాధారణంగా ఆ ప్రమాదకరమైన పామును చూడగానే చెల్లాచెదురు కావాల్సిన కప్పలు..కానీ ఐక్యమత్యమే మహాబలం అని నిరూపించాయి.
ఆ పామును చూసి భయపడకుండా.. కప్పలన్నీ ఒక్కసారిగా ఆ సర్పంపై దాడికి దిగాయి.. పాము ఎటు వెళ్లలేక కప్పల మధ్య బందీగా ఉండిపోవాల్సి వచ్చింది.. అంతేకాకుండా కప్పలు గుంపులు గుంపులుగా పాము శరీరంపైకి ఎక్కి దానిని ఉక్కిరిబిక్కిరి చేయడం కూడా మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు.. పాము తనను తాను రక్షించుకోవడానికి కప్పలపై నుంచి అటు ఇటు పాకుతూ వెళ్లడం కూడా మీరు గమనించవచ్చు.
Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్ తాగించిన తోటి కోడలు
ఈ వింత మీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది ఈ వీడియోను చూసి కామెంట్స్ చేస్తున్నారు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు.. ఇక్కడ కాలం కలిసి రాక పాము కప్పలకు చిక్కింది.. అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా సమూహంగా ఉంటే ఎంతటి శత్రువునైనా ఎదిరించవచ్చు అనడానికి ఈ వీడియోనే నిదర్శనం.. అని మరికొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్ తాగించిన తోటి కోడలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Oppo F33 Proపై భారీ లాంచ్ ఆఫర్స్.. రూ.3,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం!
Hyderabad, Telangana:Oppo F33 Pro 5g Price: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం Oppo భారత మార్కెట్లోకి అద్భుతమైన ఫ్లాగ్షిప్ మోడల్ను స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. దీనిని కంపెనీ Oppo F33 Pro 5G స్మార్ట్ఫోన్ పేరుతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ఫోన్ గతంలో విడుదల చేసిన మోడల్స్ కంటే చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇది సరికొత్త డిజైన్తో అందుబాటులోకి వచ్చింది.. ఈ మొబైల్కి సంబంధించిన విక్రయాలు ఈ రోజు నుంచి భారతదేశ వ్యాప్తంతంగా ప్రారంభమయ్యాయి. ఈ మొబైల్ ఈ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు ఒప్పో అధికారిక స్టోర్లలో అందుబాటులో ఉంది.
ఇక ఒప్పో F33 ప్రో 5G స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో రెండు ప్రధాన స్టోరేజ్ వేరియంట్స్తో అందుబాటులోకి వచ్చింది. దీని మొదటి స్టోరేజ్ వేరియంట్ 8GB ర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999తో అందుబాటులో ఉండగా.. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్తో కూడిన మరో మోడల్ రూ.40,999తో లభిస్తోంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఈ స్మార్ట్ఫోన్ను ఇప్పుడే కొనుగోలు చేసేవారికి కొన్ని బ్యాంక్లకు సంబంధించి క్రెడిట్ కార్డ్లను వినియోగించి పేమెంట్ చేస్తే.. రూ. 3,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. ఈ స్మార్ట్ఫోన్ మిస్టీ ఫారెస్ట్, ప్యాషన్ రెడ్తో పాటు స్టార్రీ బ్లూ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.
ఇక ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.57 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ (AMOLED) డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ స్మార్ట్ఫోన్ వినియోగిస్తున్న సమయంలో మంచి అనుభూతి కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన భారీ 7,000mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది. అంతేకాకుండా దీని తోడు 80W సూపర్ ఊక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. అలాగే ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు కొన్ని రోజుల పాటు బ్యాటరీ లైఫ్ను అందిస్తోంది.
ఈ స్మార్ట్ఫోన్ వెనక భాగంలో అద్భుతమై కెమెరా మాడ్యుల్ కూడా లభిస్తోంది. ఇవే కాకుండా ఇందులో 50MP మెయిన్ సెన్సార్ కెమెరాతో పాటు అదనంగా 2MP మోనోక్రోమ్ లెన్స్తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇక ఫ్రంట్ భాగంలో కూడా అద్భుతమైన కెమెరా కూడా లభిస్తోంది. ఇది సెల్ఫీల కోసం ఏకంగా 50MP కెమెరాతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ ఫ్రంట్ కెమోరా కూడా అత్యంత అద్భుతమై క్వాలిటీని కలిగి ఉంటుంది.
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
ఇది లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మాక్స్ ప్రాసెసర్పై పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.. ఇది మల్టీ టాస్కింగ్తో పాటు స్పీడ్ విషయంలో యూజర్లకు ఎంతగానో పని చేస్తుంది..ఇది IP69K రేటింగ్ సపోర్ట్తో అందుబాటులో ఉంది. కాబట్టి నీరుతో పాటు ధూళి నుంచి రక్షణ కల్పించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది అద్భుతమైన అత్యాధునిక 5G కనెక్టివిటీతో అందుబాటులోకి వచ్చింది.. భారీ బ్యాటరీతో పాటు అద్భుతమైన సెల్ఫీ కెమెరా కావాలనుకునేవారు వారికి ఈ ఒప్పో F33 ప్రో 5G స్మార్ట్ఫోన్ చాలా బెస్ట్..
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
RCB Vs GT Preview 2026: గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్..ఆర్సీబీలోకి విధ్వంసకర బ్యాటర్? ప్లేయింగ్ 11 పై లీక్ న్యూస్!
Bengaluru, Karnataka:RCB Vs GT Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నేడు (ఏప్రిల్ 24) మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఆర్సీబీ గత మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై పరాజయం పాలవ్వగా.. గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ముంబై ఇండియన్స్పై ఓటమి పాలైంది.
ఆతిథ్య జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే.. రొమారియో షెపర్డ్, వికెట్ కీపర్ జితేష్ శర్మ ఈ సీజన్లో ఇప్పటివరకు వరుసగా కేవలం 39, 52 పరుగులు మాత్రమే చేయగలిగారు. కెప్టెన్ రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, కొంతమేర దేవదత్ పడిక్కల్ మినహా, డిఫెండింగ్ ఛాంపియన్ల మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.
ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. షెపర్డ్ స్థానంలో ఈ యువ ఆటగాడిని ఆర్సీబీ ప్లేయింగ్ 11లోకి తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 ప్రస్తుత సీజన్ కోసం ఆర్సీబీ జట్టు బెథెల్ను రూ.2.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. తన కెరీర్లో ఇప్పటివరకు ఆడిన 97 టీ20 మ్యాచ్లలో, బెథెల్ 141.98 స్ట్రైక్ రేట్తో మొత్తం 1843 పరుగులు సాధించాడు.
అలాగే గుజరాత్ టైటాన్స్ జట్టు తమ చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో 99 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత, శుభ్మన్ గిల్ సారథ్యంలోని జట్టు కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లు వరుసగా 49, 67, 28 పరుగులు మాత్రమే చేసి బ్యాటింగ్లో రాణించడంలో విఫలమయ్యారు.
వెస్ట్ ఇండీస్ ఆల్-రౌండర్ జాసన్ హోల్డర్కు ఈ సీజన్లో ఇప్పటివరకు తుది జట్టులో అవకాశం రాలేదు. కానీ గుజరాత్ జట్టు ఫిలిప్స్ స్థానంలో అతడిని తుది 12 మందిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో హోల్డర్ను రూ.7 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు 6 మ్యాచ్లలో కేవలం 35 పరుగులు మాత్రమే చేసిన ఎం.షారుఖ్ ఖాన్ స్థానంలో యువ కుమార్ కుశాగ్రాను జట్టులోకి తీసుకునేందుకు ఆలోచన చేసే అవకాశం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్/జాకబ్ బెథెల్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్వుడ్, రసిఖ్ దర్.
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు అంచనా..
శుభమన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్ / కుమార్ కుషాగ్రా, జాసన్ హోల్డర్ / గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అశోక్ శర్మ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Moto G87: త్వరలో భారత మార్కెట్లోకి మోటో G87.. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్.. ధర ఎంతంటే?
Hyderabad, Telangana:Moto G87 Specifications Price Leaked: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా ఎప్పటికప్పుడు దిమ్మతిరిగే ఫీచర్స్తో అద్భుతమైన స్మార్ట్ఫోన్స్ను విడుదల చేస్తూ వస్తోంది. అయితే, ఇవి అత్యంత తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్తో అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. త్వరలోనే మార్కెట్లోకి G సిరీస్ నుంచి మరో కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. ఇది మోటో G77 సక్సెసర్గా లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ Moto G87 స్మార్ట్ఫోన్ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, ఈ మొబైల్కి సంబంధించిన వివరాలు అధికార లాంచ్కి ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన అన్ని రకాల వివరాలు వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మోటో G87 స్మార్ట్ఫోన్ను కంపెనీ అద్భుతమై ఆరు వేర్వేరు రంగుల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో షేడెడ్ స్ప్రూస్, ఆర్కిటిక్ సీల్, బ్లాక్ ఆలివ్ కలర్స్ చాలా అద్బుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని డిజైన్ కూడా చాలా ప్రీమియంగా ఉండబోతున్నట్లు సంచారం.. ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ చాలా ప్రత్యేకమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ చిప్సెట్ ప్రాసెసర్తో విడుదల చేయబోతోంది. అలాగే 8GB ర్యామ్తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లో మొదటగా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన AMOLED డిస్ల్పేతో విడుదల కాబోతోంది.
ఇది చాలా అద్భుతమైన ఆండ్రాయిడ్ 16 వెర్షన్తో లాంచ్ అయ్యే ఛాన్స్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వెనక భాగంలో చాలా ప్రత్యేకమైన ట్రిపుల్ కెమెరా సెటప్తో విడుదల కాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 5000mAh భారీ బ్యాటరీతో పాటు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో లాంచ్ కాబోతోంది. అలాగే పంచ్-హోల్ డిజైన్తో పాటు ప్రత్యేకమైన వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వంటి అదనపు ఫీచర్లతో లాంచ్ లాంచ్ కాబోతోంది.
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
ఈ మోటో G87 స్మార్ట్ఫోన్ను కంపెనీ మొదటగా కేవలం ఒక్క స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 8GB + 256GB వేరియంట్లో లాంచ్ కాబోతోంది. దీని ధర దాదాపు రూ.44 వేల నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే, దీనిని కంపెనీ కాస్త ఎక్కువ ధరతోనే భారత మార్కెట్లోకి విడుదల చేసే ఛాన్స్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ త్వరలో భారత మార్కెట్లోకి కూడా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Venus And Jupiter: రాజయోగం అంటే వీరిదే! ఆ మూడు రాశుల వారికి బంపర్ జాక్పాట్..
Hyderabad, Telangana:Venus And Jupiter Conjunction 2026: జ్యోతిష్య శాస్త్రంలో రెండు గ్రహాలు కలయిక జరిపినప్పుడు యోగాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా రెండు శక్తివంతమైన గ్రహాలు సంయోగం జరిపినప్పుడు ఒక్కొక్క సందర్భంలో రెండు యోగాలు కూడా ఏర్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. అతి త్వరలోనే సంపదకు కారకుడైన శుక్రుడితో పాటు అదృష్టాన్ని ప్రసాదించే బృహస్పతి ఒకే రాశిలో కలయిక జరపబోతున్నాయి. దీని కారణంగా అన్ని రాశులవారిపై ఎంతో శక్తివంతమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా శుక్ర-గురు సంయోగంతో ఈ క్రింది మూడు రాశులవారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఈ సమయంలో తప్పకుండా ఉపశమనం కలుగుతుంది. అయితే, ఏయే రాశులవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందో? అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
మేష రాశి (Aries)
మేష రాశివారికి ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా జీవితంలో అద్భుతం జరుగుతుందని జ్యోతష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి పెండింగ్లో ఉన్న ప్రతి పని సులభంగా నెరవేరుతుది. అలాగే అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించి..భారీగా డబ్బులు కూడా సంపాదించే ఛాన్స్లు ఉన్నాయి. అలాగే పెండింగ్లో ఉన్న ప్రతి పని ఎంతో వేగంగా పూర్తవుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు పదోన్నతి (Promotion) లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న చోట ఉద్యోగం పొందుతారు.
మిథున రాశి (Gemini)
మిథున రాశివారికి అదృష్టం ఊహించని స్థాయిలో రెట్టింప అవుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దీని వల్ల డబ్బులు కూడా పెట్టుబడులు పెట్టే ఛాన్స్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉండి.. డబ్బులు కూడా ఊహించని స్థాయిలో పొందే ఛాన్స్లు ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దీంతో మార్కెట్లో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే సూచనలు ఉన్నాయి.
సింహ రాశి (Leo)
సింహ రాశివారికి ఈ రెండు రాజయోగాల కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అంతేకాకుండా ఆదాయం కూడా అనుకున్నంత స్థాయిలో పొందే ఛాన్స్లు ఉన్నాయి. ఆకస్మిక ధన లాభాలు కూడా తప్పకుండా పొందుతారు. అలాగే ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు ఎన్నో సమస్య నుంచి బయపడతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
