సికింద్రాబాద్: బోనాల జాతరకు రావాలని కిషన్ రెడ్డికి ఆహ్వానం
Secunderabad, Telangana:సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, పూజారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 21, 22వ తేదీలలో అత్యంత వైభవంగా బోనాల జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Petrol Price Hike: వైఎస్ జగన్, చంద్రబాబు కలిసి ఏపీని భ్రష్టు పట్టించారు: వైఎస్ షర్మిల
Vijayawada, Andhra Pradesh:Petrol And Diesel Price Hike: 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పరువు దిగజార్చారు. మోదీ పిలక ట్రంప్ చేతికి చిక్కింది. అమెరికా ఎదుట ఇందిరాగాంధీకి ఉన్న తెగువ .. మోదీకి లేదు' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్పై వ్యాట్ భారాన్ని మోపిన వారు ధర్నాలు చేయడానికి సిగ్గుండాలని పరోక్షంగా వైఎస్సార్సీపీని విమర్శించారు. భారతదేశాన్ని మళ్లీ నిలబెట్టాలి అంటే రాహుల్ గాంధీతోనే సాధ్యమని షర్మిల ప్రకటించారు.
Also Read: LSG vs RR Highlights: ప్లేఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్ ముందడుగు.. లక్నోపై విజయం
విజయవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో వైఎస్ షర్మిల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి కాంగ్రెస్ అవసరం ఉందని తెలిపారు. నేడు దేశం దారుణ స్థితిలో ఉందనని.. పెట్రోల్ వాడొద్దు అంటున్నారు, బయట తిరగొద్దు అని అంటున్నారు. బంగారం కొనొద్దు అంటున్నారు. దీనికి కారణం ప్రధాని మోదీ' అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
'ఆనాడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే జనాల మీద పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక భారం ప్రభుత్వం , ఒక భారం ఆయిల్ కంపెనీలు, మూడో భారం మాత్రమే ప్రజల మీద వేశారు. నేడు భారం అని చెప్పి మొత్తం ప్రజల నెత్తిన వేస్తున్నారు' అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. 'క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు లాభం పొందారు. ఇప్పుడు ధరలు పెరిగితే జనాల మీద రుద్దుతున్నారు' అని మండిపడ్డారు.
Also Read: YS Sharmila: వైఎస్ జగన్, చంద్రబాబు కలిసి ఏపీని భ్రష్టు పట్టించారు: వైఎస్ షర్మిల
'ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ చార్జీలు దారుణం. దేశంలో ఎక్కడ లేని ఛార్జీలు మనదగ్గర ఉన్నాయి. వ్యాట్ అని సెస్ అని జనాలను దోచేస్తున్నారు. పెట్రోల్ ధరలు ఏపీలో ఎక్కువగా ఉన్నాయని ధర్నాలు చేయడం సిగ్గుచేటు. మీ హయాంలో లీటర్ ధరపై 4 రూపాయల వ్యాట్ ఎందుకు వసూలు చేశారు? వ్యాట్ తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు మాట మార్చారు. మ్యానిఫెస్టోలో పెట్టి మోసం చేశారు' అని జగన్, చంద్రబాబు లక్ష్యంగా వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.
'ప్రధానమంత్రి మోదీ దేశ పరువు దిగజార్చారు. ఆనాడు ఇందిర హయాంలో ఒక మహిళగా అమెరికాను ఎదుర్కొన్నారు. మా దేశంపై మీ జోక్యం అనవసరం అని ధైర్యంగా చెప్పారు' అని వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. 'నేడు మోదీ ట్రాంప్ దగ్గర సాగిలపడ్డాడు. మోదీ పిలక ట్రాంప్ చేతికి చిక్కింది. అదానీ కోసం ట్రంప్ కి మోదీ బానిస అయ్యాడు. భారతీయులను సంకెళ్లు వేసి అమెరికా దేశానికి పంపితే కళ్ళప్పగించి చూశాం' అని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. 'ప్రస్తుతం పాకిస్తాన్, చైనా మళ్లీ అమెరికాకు దగ్గర అవుతున్నాయి. దేశ గౌరవాన్ని మోదీ దారుణంగా దిగజార్చారు. దేశాన్ని మళ్లీ నిలబెట్టాలి అంటే రాహుల్ తోనే సాధ్యం. రాహుల్ దాచుకున్నది ఏమీ లేదు . దోచుకున్నది ఏమీ లేదు' అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్.. భారీగా జీతాల పెంపు అప్పుడే
YS Sharmila: వైఎస్ జగన్, చంద్రబాబు కలిసి ఏపీని భ్రష్టు పట్టించారు: వైఎస్ షర్మిల
Vijayawada, Andhra Pradesh:YS Sharmila vs YS Jagan: 'విభజన హామీలకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు , జగన్ ఒక్క మాట కూడా బీజేపీని అడగలేదు. చంద్రబాబు, జగన్ ఇద్దరు కలిసి అభివృద్ధిని ఖూనీ చేశారు. 11 ఏళ్లు దాటుతున్న రాజధాని లేని రాష్ట్రం అంటే అది ఏపీనే. రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 'బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే బాబు, జగన్, పవన్ కల్యాణ్ ముగ్గురు మోదీకి ఊడిగం చేస్తున్నారు. పోటీలు పడి మద్దతు ఇస్తున్నారు. బీజేపీ బిల్లులకు గొర్రెల్లా మద్దతు ఇస్తున్నారు. జగన్ నవరత్నాలు, చంద్రబాబు సూపర్ సిక్స్లు మోసాలే' అని వైఎస్ షర్మిల విమర్శించారు. పదేళ్లలో ఉద్యోగాలు లేవని.. జలయజ్ఞం కింద పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేయలేదని.. బీజేపీ అంటే రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ అని వైఎస్ షర్మిల అభివర్ణించారు.
Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!
విజయవాడలో కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నాయకులు చేరడంతో వారికి ఆహ్వానం పలికిన అనంతరం షర్మిల కీలక ప్రసంగం చేశారు. వైఎస్ జగన్, చంద్రబాబుతోపాటు కేంద్ర సర్కార్పై నిప్పులు చెరిగారు. 'పాదయాత్రలు చేసినంత మాత్రాన వైఎస్సార్ వారసులు కారు. వైఎస్సార్ పేరు చెప్పి అధికారంలోకొచ్చి మెడలు, మిద్దెలు కట్టుకున్నారు. ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడం కాదు వైఎస్సార్ వారసత్వం. ప్యాలెస్లో బతికితే కాదు వైఎస్సార్ వారసత్వం. వైఎస్సార్ ఆశయాలు, ఐడియాలజీ పాటించే వారే నిజమైన వారసులు. కాంగ్రెస్ పార్టీని బలపరచడం అంటే ఆయన ఆశయాలను నిలబెట్టడం' అని వైఎస్ షర్మిల తెలిపారు.
Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్.. భారీగా జీతాల పెంపు అప్పుడే
తన తండ్రి వైఎస్సార్ సులువుగా ముఖ్యమంత్రి కాలేదని.. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎంతో కష్టపడ్డాడని షర్మిల చెప్పారు. ప్రజల కోసం వెళ్లి చనిపోయాడని గుర్తుచేసుకున్నారు. ఈ మధ్య నాయకులు ఒకసారి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు అందుబాటులో లేరు. సొంత పార్టీ నాయకులకు కూడా కనపడలేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా కలవడానికి వీలు లేదు' అని తన సోదరుడు వైఎస్ జగన్ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు.
ప్రజానాయకుడు వైఎస్సార్ అని.. ఇలాంటి నాయకుడు మళ్లీ పుట్టడు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా రచ్చబండ పెట్టాడు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతిదీ అద్భుతం. ఇతర పార్టీల ఐడియాలజీకి , కాంగ్రెస్ ఐడియాలజీకి చాలా భిన్నం. రాష్ట్ర ప్రజలు మళ్లీ కాంగ్రెస్ ఐడియాలజీ కోరుకుంటున్నారు' అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. 'దేశంలో, రాష్ట్రంలో రాజ్యాంగం బతికి ఉండాలి అంటే మళ్లీ కాంగ్రెస్ అధికారంలో రావాలి. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వాలి' అని ఆకాంక్షించారు. 'వైఎస్సార్ రాహుల్ను ప్రధాని చేయాలని కోరుకున్నారు. వైఎస్సార్ కలను నిజం చేయడానికి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా' అని వివరించారు.
Also Read: India Squad: అఫ్ఘానిస్తాన్ సిరీస్కు భారత జట్టు ప్రకటన.. హిట్మ్యాన్ రీఎంట్రీ
'విభజన తర్వాత ఆంధ్రరాష్ట్రం చితికి పోయింది. మళ్లీ రాష్ట్రం బాగుపడాలి అంటే కాంగ్రెస్ రావాలి. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువమంది చనిపోవద్దని రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించింది. ఆంధ్రకు అన్యాయం చేయాలని విభజన చేయలేదు. విభజిత రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఎన్నో హామీలు చట్టంలో పెట్టారు. విభజించిన తర్వాత రాష్ట్రం వెంటనే బాగుపడేలా హామీలు ఇచ్చారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ చట్టంలో పెట్టింది. హోదా వచ్చి ఉంటే పన్నుల రాయితీ ఉండేది. వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. కేంద్రమే నిర్మించి 35 లక్షల ఎకరాలను సస్యశామలం చేయాలని అనుకున్నారు. రాజధాని నిర్మాణం కేంద్రమే అని హామీ ఇచ్చారు. కడప స్టీల్ , దుగరాజపట్నం, మెట్రో రైల్, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇలా ఎన్ని హామీలు. ఆనాడే కేంద్రం ఇచ్చిన హామీల విలువ అక్షరాల రూ.5 లక్షల కోట్లు' అని వైఎస్ షర్మిల చిట్టా విప్పారు.
కానీ విభజన తర్వాత ఒక్క హామీ నేటికి నెరవేరలేదని.. కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరి ఉండేదని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్కి 11 ఏళ్లుగా వెన్నుపోటు పొడుస్తుంది. అధికారంలో వచ్చిన టీడీపీ, వైఎస్సార్సీపీలు స్వార్థ రాజకీయాలు చేసుకున్నాయి. హోదా మీద ఇద్దరు మాట్లాడలేదు. పోలవరానికి అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలేదు' అని జగన్, చంద్రబాబుపై మండిపడ్డారు.
LSG vs RR Highlights: ప్లేఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్ ముందడుగు.. లక్నోపై విజయం
Jaipur, Rajasthan:RR Won By 7 Wickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్న సమయంలో రాజస్థాన్ రాయల్స్ ముందడుగు వేసింది. రేసులో కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ అద్భుతంగా ఆడి లక్నో సూపర్ జియాంట్స్ను చిత్తు చేసింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్ రేసులో ఇంకా తానున్నానని రాజస్థాన్ ప్రకటించగా.. 9వ ఓటమితో లక్నో పాయింట్ల పట్టికలో తన అట్టడుగు స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. వైభవ్ సూర్యవంశీ భారీ ఇన్నింగ్స్తో రాజస్థాన్ మ్యాచ్ను సొంతం చేసుకుంది.
లక్నో విధించిన 221 లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఛేదించింది. కెప్టెన్ యశస్వి జైస్వాల్ 23 బంతుల్లో 43 పరుగులు చేసి సత్తా చాటగా.. బాల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చెలరేగి ఆడాడు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జియాంట్స్ నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలనే కసితో మిచెల్ మార్ష్ అద్భుతంగా ఆడి విధ్వంసం సృష్టించాడు. 57 బంతుల్లో 96 పరుగులు చేసి కొద్దిలో సెంచరీని మిస్సయ్యాడు. 11 ఫోర్లు, ఐదు సిక్సర్లతో దుమ్మురేపాడు. ఏమాత్రం బెరుకు లేకుండా పవర్ప్లే నుంచే దూకుడు ప్రారంభించగా.. అతడికి జోష్ ఇంగ్లిష్ జత కలిశాడు. 29 బంతుల్లో ఇంగ్లిష్ 60 పరుగులు చేసి సత్తా చాటాడు. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో దూకుడుగా ఆడి భారీ స్కోర్కు బాటలు వేశారు. నికోలస్ పూరన్ (16) తక్కువ స్కోర్ చేయగా.. కెప్టెన్ రిషబ్ పంత్ 32 బంతుల్లో 35 పరుగులతో రాణించాడు. రాజస్థాన్ బౌలింగ్ మెరుగవ్వాలని బౌలర్ల ప్రదర్శన చూస్తే చెప్పవచ్చు. యశ్ పూజా రెండు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ పడగొట్టాడు.
పాయింట్ల పట్టికలో ఆఖరున ఉన్న లక్నో సూపర్ జియాంట్స్ ఆ స్థానాన్ని తాజా ఓటమితో మరింత పదిలం చేసుకుంది. మొత్తం 13 మ్యాచ్లు ఆడి 4 విజయాలు, 9 ఓటములను చవిచూసి ఈ సీజన్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఆడిన 13 మ్యాచ్ల్లో ఏడు విజయాలు, 6 పరాజయలు పొంది ఇంకా ప్లేఆఫ్స్ రేసులో కొనసాగుతోంది. 23వ తేదీన లక్నో ఆఖరి మ్యాచ్ పంజాబ్తో ఆడనుండగా.. రాజస్థాన్ 24వ తేదీన ముంబై ఇండియన్స్ను ఢీకొట్టనుంది. లక్నోకు జయాపజయాలతో సంబంధం లేకపోయినా.. రాజస్థాన్కు మాత్రం భారీ ప్రయోజనం దాగి ఉంది. గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్లోకి అడుగుపెడుతుంది.. లేదంటే వెనక్కి జరుగుతుంది.
8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్.. భారీగా జీతాల పెంపు అప్పుడే!
Wadgaon, Maharashtra:Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం నుంచి బిగ్ అప్డేట్ వచ్చిందని తెలుస్తోంది. వేతన సంఘం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పింఛన్దారులు ఇంకాస్త ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని స్పష్టమవుతోంది. జీతాల పెంపు, పింఛన్ సవరణ అనేది ఇప్పట్లో ఉండకపోవచ్చని.. 2027 నుంచే అమలవుతుందని వార్తలు వస్తున్నాయి. 8వ వేతన సంఘం జీతాల సవరణ తక్షణమే అమలులోకి వచ్చే అవకాశం లేదని సమాచారం.
Also Read: Hyderabad Police: పోలీసుల మెరుపు వేగం.. గంటల్లోనే రూ.లక్షా 20 వేల నగదు బ్యాగు సీజ్
8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కమిటీ ప్రకటించి.. ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు, వారి వినతులు స్వీకరించింది. త్వరలో వేతన సంఘం అమలవుతుందని కొండత ఆశల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు భారీ షాక్ ఇచ్చే వార్త ఇది. కొత్త వేతన విధానం 2026 జనవరి 1 నుంచే అమల్లోకి రానున్నప్పటికీ.. సవరించిన జీతాలు 2027లో మాత్రమే అమలులోకి రావచ్చని ఓ నివేదిక సూచిస్తోంది.
Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!
జనవరి 2026 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చినా కూడా దాని ప్రయోజనాలు అంటే సవరించిన జీతాలు, పింఛన్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2027 వరకు వేచి ఉండాల్సి రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేతన సవరణ సంఘం అమలులో జాప్యం జరిగితే బకాయిలు పెరిగే అవకాశం ఉంది. వేతన చెల్లింపు, భత్యాలు, పింఛన్లపై వేతన సంఘం అధ్యయనం చేసి.. కేంద్రానికి తన తుది సిఫార్సులను సమర్పించడానికి మరికాస్త సమయం పట్టే అవకాశం ఉండడంతో ఇది అమలయ్యే సమయం పెరిగే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Also Read: Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ
8వ వేతన సంఘం వివరాలు
కేంద్ర మంత్రివర్గం 2025 జనవరిలో 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది. అనంతరం ఈ కమిటీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. గత వేతన సంఘాల మాదిరిగానే సంప్రదింపులు పూర్తి చేసి.. నివేదికను సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఈ సంస్థకు సుమారు 18 నెలల సమయం ఇచ్చింది. వస్తున్న సమాచారం ప్రకారం వేతన సంఘం సిఫార్సులు 2027 మధ్యలో సమర్పించే అవకాశం ఉంది. సమర్పించిన నివేదికను ప్రభుత్వం సమీక్ష చేసి.. సవరించిన జీతాలు, పెన్షన్ల తుది అమలును ప్రకటించనుంది. దీనికి సమయం పట్టేలా ఉంది.
వేతన సంఘం అమలులో ఏ మాత్రం ఆలస్యమైనా.. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలు పెరిగే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం చర్చలలో ఫిట్మెంట్ అంశం కీలక సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనాన్ని సవరించడానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు. 7వ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 2.57గా నిర్ణయించగా.. కనీస మూల వేతనం రూ.18,000కు పెరిగింది. ఈసారి ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.68 నుంచి 3.83 మధ్య ఉంచాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఆమోదం లభిస్తే కనీస ప్రాథమిక వేతనం రూ.51,000 నుంచి రూ.69,000 మధ్య గణనీయంగా పెరగవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటివరకు దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.
8వ వేతన సంఘం సమీక్షించే అంశాలు ఇవే..
కరువు భత్యం (డీఏ)
ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)
రవాణా భత్యం (టీఏ)
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ సవరణలు
Bandi bhagirath: కీలక ఆధారాలతో ఆ రోజు వస్తా.!. సిట్ పోలీసులకు బండి భగీరథ్ సంచలన లేఖ..
Hyderabad, Telangana:Bandi Bhagirath responds to Hyderabad police sit notices: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండీ భగీరథ్ పోక్సో కేసు వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతుంది. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలను సంధిస్తుంది. మే 8న కేసు నమోదైతే ఇప్పటి వరకు అరెస్ట్ చేయక పోవడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. మంత్రుల కొడుకులకు ఒక న్యాయం, ప్రజలకు మరో న్యాయమా అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు బండి సంజయ్ దేశం వదిలి పారిపోయాడా అంటూ పలు చోట్ల పోస్టర్ లు వెలిశాయి. ఈ క్రమంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తోంది. తమ ఎదుట విచారణకు రావాల్సిందిగా భగీరథ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పోలీసుల ముందు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే సమయం గడిచినప్పటికీ భగీరథ్.. పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో తాజాగా.. బండి భగీరథ్ సిట్ పోలీసులకు మెయిల్ చేయడం సంచలనంగా మారింది.
ఈ క్రమంలో తాను మే 15న సిట్ పోలీసుల ఎదుట హజరవుతానని ఆ లేఖలో పేర్కొన్నాడు. కీలక సాక్షాలతో విచారణకు హాజరవుతానంటూ బండి భగీరథ పేర్కొన్నాడు. తనకు రెండు రోజుల సమయం కావాలని గడువు కోరాడు. అంతే కాకుండా SIT దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని కూడా భగీరత్ తన లేఖలో పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ రోజు రాలేకపోయానని లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ మారింది.
బండి భగీరథ్ పై పోలీసులు BNS 74,75 తో పాటు సెక్షన్ 5 (i) రెడ్ విత్ 6 కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి నుంచి రెండో సారి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసి లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్ 5 (i)ను కూడా పోలీసులు జతపరిచారు.
Read more: Kalva kuntla Kavitha: మైనర్ అమ్మాయికే ఎక్కువ నష్టం..!.. బండి భగీరథ్
మరోవైపు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్ వేశారు. ఇక తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై రేపు విచారణ జరగనుంది. హైకోర్టు ఏవిధంగా తీర్పునిస్తుంది.. బండి సంజయ్ కొడుకు ఏవిధమైన ఆధారాలను సిట్ ముందు ఉంచుతారో అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
India Squad: అఫ్ఘానిస్తాన్ సిరీస్కు భారత జట్టు ప్రకటన.. హిట్మ్యాన్ రీఎంట్రీ, నలుగురికి తొలి ఛాన్స్
Wadgaon, Maharashtra:India Squad For Afghanistan Series: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు చేరుకోవడంతో భారత జట్టు తదుపరి టోర్నీలపై దృష్టి సారించింది. మెగా టోర్నీ ముగిసిన వారానికే టీమిండియా అఫ్ఘానిస్థాన్తో తలపడనుంది. ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్ కోసం అఫ్ఘానిస్థాన్ భారత పర్యటనకు రానుంది. ఐపీఎల్లో వేర్వేరు జట్లలో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు మళ్లీ భారత జట్టుగా కనిపించనున్నారు. జూన్ 6వ తేదీ నుంచి ఏకైక టెస్టు, 14, 17, 20 తేదీల్లో వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం సమావేశమైన బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్కు శుభమన్ గిల్ సారథ్యం వహించనుండగా.. ఐపీఎల్లో సత్తా చాటుతున్న ఆటగాళ్లందరికీ అవకాశం లభించింది.
Also Read: SRH Qualified: చెన్నైకి తీవ్ర నిరాశ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్లోకి హైదరాబాద్
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ టెస్టు, వన్డే సిరీస్కు ఎంపిక చేసిన జట్టు జాబితాను విడుదల చేసింది. ఈ సిరీస్లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు స్థానం లభిస్తుందా? లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుండగా.. కమిటీ సీనియర్ ఆటగాడికి చోటు కల్పించింది. అతడితోపాటు హార్దిక్ పాండ్యాకు కూడా స్థానం దక్కింది. ఇక ఐపీఎల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న రిషబ్ పంత్ను వన్డేలకు ఎంపిక చేయకపోగా టెస్టుకు ఎంపిక చేయడం గమనార్హం. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు చోటు దక్కలేదు. వీరిద్దరూ ఐపీఎల్లో సత్తా చాటలేకపోయారు. బుమ్రా అయితే ఒకటి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడికి జట్టులో స్థానం లభించలేదు.
Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!
నలుగురికి ఛాన్స్
ఏకైక టెస్టు మ్యాచ్కు గిల్ సారథ్యం వహిస్తుండగా.. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఎంపికవగా.. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న ప్రిన్స్ యాదవ్తోపాటు హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్కు జాతీయ జట్టులో తొలిసారి స్థానం లభించింది. అక్షర్ పటేల్, ఆకాశ్ దీప్లకు చోటు లభించకపోగా.. సీనియ్ బౌలర్ మహ్మద్ షమీ ఎంపికపై సెలక్షన్ కమిటీ చర్చించలేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించారు.
Also Read: Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ
భారత వన్డే జట్టు
శుభమన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే,
భారత టెస్ట్ జట్టు
శుభ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ దువ్రేల్, గుర్నూర్ దువ్రార్ జురేల్,
మ్యాచ్ల వివరాలు
ఏకైక టెస్టు: జూన్ 6-10 తేదీల్లో చండీగడ్, ముల్లాన్పూర్
తొలి వన్డే: జూన్ 14, ధర్మశాల (హిమాచల్ప్రదేశ్)
రెండో వన్డే: జూన్ 17, లక్నో (ఉత్తరప్రదేశ్)
మూడో వన్డే: జూన్ 20, చెన్నై (తమిళనాడు)
Hyderabad Police: పోలీసుల మెరుపు వేగం.. గంటల్లోనే రూ.లక్షా 20 వేల నగదు బ్యాగు స్వాధీనం
Secunderabad, Telangana:Ramgopalpet Police: హైదరాబాద్ పోలీసులు మెరుపు వేగంతో స్పందించి ఒక యువకుడికి సహాయం చేశారు. అతడు పోగొట్టుకున్న డబ్బు ఉన్న బ్యాగ్ను సురక్షితంగా అందించారు. ఫిర్యాదు అందిన కొన్ని నిమిషాల్లోనే అతడి బ్యాగును తిరిగి తీసుకువచ్చి ఇచ్చారు. ఈ సంఘటన హైదరాబాద్లో జరిగింది. ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఎల్లప్పుడూ అండగా.. రక్షణగా నిలుస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇంతకీ అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: Uppal X Road: ఉప్పల్ క్రాస్ రోడ్డు మూసివేత.. వాహనాల దారి మళ్లింపులు ఇవే!
హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో తన తండ్రికి శస్త్రచికిత్స చేస్తుండడంతో ఖర్చుల కోసం సాయి కుమార్ అనే యువకుడు రూ.1,20,000 నగదుతో ఈనెల 18వ తేదీన నగరానికి వచ్చాడు. తన తండ్రికి ఎలా ఉందోననే కంగారు.. ఆందోళనలో ఉన్న యువకుడు ఆటోలో నగదు బ్యాగుతో వచ్చాడు. అయితే ఆస్పత్రిలోకి కంగారు కంగారుగా వెళ్లిపోవడంతో ఆటోలోనే నగదు బ్యాగ్ మరచిపోయాడు. లోపలికి వెళ్లాక నగదు బ్యాగ్ గుర్తురావడంతో ఆందోళన చెందాడు. చుట్టుపక్కల ఆటో కోసం వెతికితే ఎలాంటి ప్రయోజనం లేకపోలేదు. దీంతో సాయికుమార్ వెంటనే సమీపంలోని రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!
తన తండ్రి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి నగదు బ్యాగుతో చేరుకుంటే.. కంగారులో చికిత్స కోసం ఉంచిన రూ.1,20,000 నగదు ఉన్న తన బ్యాగును ఆటోలోనే మర్చిపోయినట్లు ఫిర్యాదుదారుడు సాయికుమార్ వివరించాడు. వెంటనే స్పందించిన రాంగోపాల్పేట పోలీసులు విచారణ చేపట్టారు. ఆటో కోసం వెతకడం ప్రారంభించి సీసీ ఫుటేజీలు పరిశీలించారు. నగదు కలిగిన బ్యాగును అతి తక్కువ సమయంలోనే సురక్షితంగా రికవరీ చేసి బాధితుడికి అందజేశారు.
Also Read: Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ
ఫిర్యాదు అందిన వెంటనే రాంగోపాల్పేట ఎస్హెచ్ఓ (ఎస్హెచ్ఓ) బి. సురేష్ కుమార్ తక్షణమే స్పందించి కానిస్టేబుళ్లు జి.సురేష్, ఎస్. ప్రమోద్ కుమార్, బి. నరసింహలతో కూడిన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం ఆసుపత్రి పరిసరాల్లోని.. మార్గంలోని (సీసీటీవీ) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి ఆటో నంబర్ను గుర్తించారు. ఆ ఆటో డ్రైవర్ను విజయవంతంగా కనిపెట్టి ఆటోలో ఉన్న నగదు బ్యాగ్ను తీసుకున్నారు.
పోలీసు బృందం ఆటోను గుర్తించిన వెంటనే ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదుదారుడికి సంబంధించిన బ్యాగును, అందులోని రూ.1,20,000 డబ్బును పైసా కూడా తగ్గకుండా పోలీస్ అధికారుల సమక్షంలో భద్రంగా అప్పగించారు. కష్ట సమయంలో మెరుపు వేగంతో స్పందించి తన తండ్రి వైద్యానికి అవసరమైన నగదును తిరిగి ఇప్పించిన రాంగోపాల్పేట పోలీసులకు ఫిర్యాదుదారుడు సాయి కుమార్ ధన్యవాదాలు తెలిపాడు. ఆటో డ్రైవర్ నిజాయితీని రాంగోపాల్పేట ఎస్హెచ్ఓ సురేష్ కుమార్ అభినందించి శాలువాతో సత్కరించారు.
Petrol Diesel Price Hike: ముడి చమురు ఎఫెక్ట్.. దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్.. కొత్త ధరలివే..!!
Secunderabad, Telangana:Petrol Diesel Price Hike: :పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత దేశంపై కూడా కనిపిస్తోంది. పెరుగుతున్న చమురు ధరల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మంగళవారం నాడు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. ఈసారి పెట్రోల్ ధరను లీటరుకు 87 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 91 పైసలు పెంచాయి. కొత్త ధరల అమలు నేపథ్యంలో... రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 98.64కు చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ. 91.58గా ఉంది. చమురు కంపెనీలు సోమవారం అర్ధరాత్రి పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు కొత్త ధరల సమాచారాన్ని పంపగా.. మంగళవారం ఉదయం ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. నిరంతరం పెరుగుతున్న ధరలు ప్రజల్లో ఆందోళనను పెంచాయి.
4 రోజుల క్రితం కూడా ధరలు పెరిగాయి:
అంతకుముందు నాలుగు రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఆ రోజు.. పెట్రోల్ ధర లీటరుకు రూ. 3.14 పెరిగి లీటరుకు రూ. 97.77కు చేరింది. డీజిల్ ధరలు కూడా రూ. 3.11 పెరిగి లీటరుకు రూ. 90.67కు చేరుకున్నాయి. ఇప్పుడు కేవలం కొద్ది రోజుల్లోనే ఇది రెండవ సారి ధరల పెంపు అని చెప్పాలి. ఈ ధరల పెంపు ప్రభావం ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపింది.
Also Read: ప్రభుత్వ రంగ బ్యాంకు సంచలనం.. FDలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం.. కొత్త రేట్లు ఇవే
సామాన్య ప్రజల జేబులపై ప్రభావం:
పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల సాధారణ ప్రజలను నేరుగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా రోజూ వాహనాల్లో ప్రయాణించేవారు, రవాణా వ్యాపారంలో ఉన్నవారు, చిన్న వ్యాపారాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు. ఇంధన ధరల పెరుగుదల బస్సు, టాక్సీ, రవాణా ఖర్చులను పెంచుతుంది. ఇది ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే, రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read: మిడిల్ క్లాస్ నచ్చిన Top 5 Electric Scooters ఇవే..
#BREAKING: Fuel prices have increased, with petrol prices rising by 0.86 paise and diesel prices going up by 0.83 paise pic.twitter.com/CiaOUohkOj
— IANS (@ians_india) May 19, 2026
యుద్ధం.. ప్రపంచ మార్కెట్ కారణం:
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రపంచ ముడి చమురు సరఫరాలను ప్రభావితం చేస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ చమురు ధరలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. భారతదేశం తన చమురు అవసరాలలో గణనీయమైన భాగాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ప్రపంచ మార్కెట్లోని మార్పులు దేశంలోని ఇంధన ధరలను నేరుగా ప్రభావితం చేస్తాయి.
ప్రభుత్వం, చమురు కంపెనీలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి, అధిక పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఉపశమనం లభించే ఆశ తక్కువగా కనిపిస్తోంది. పెరుగుతున్న ధరలు గృహ బడ్జెట్లపై మరింత భారం మోపుతున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న కాలంలో మరిన్ని చెడు రోజులను ఎదుర్కొవల్సిన పరిస్థితి ఉందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
SRH Qualified: చెన్నైకి తీవ్ర నిరాశ.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్లోకి సన్రైజర్స్ హైదరాబాద్
Chennai, Tamil Nadu:SRH Qualified To Playoffs: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్లోకి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దూసుకెళ్లింది. చెన్నై జట్టుపై ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్ అద్భుత విజయం సాధించి ముందడుగు వేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో చెన్నైను చిత్తు చేసింది. టాప్ జట్టుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లోనూ ప్లేఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. మొదట తడబడి.. తర్వాత పుంజుకుని అనంతరం మళ్లీ వెనకబడడంతో ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు ఓడిపోయింది.
ప్రత్యర్థి విధించిన 181 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఛేదించింది. పవర్ప్లేలో తడబడినా.. తర్వాత బ్యాటర్లు పుంజుకోవడంతో మ్యాచ్ను సులువుగా హైదరాబాద్ సొంతం చేసుకుంది. ముందడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ మరోసారి నిరాశపర్చగా.. అభిషేక్ శర్మ (26) తక్కువ పరుగులకు ఔటయ్యాడు. ప్లేఆఫ్స్ లక్ష్యంగా ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఆడారు. 26 బంతుల్లో 47 పరుగులు చేసిన క్లాసెన్.. ఆరు బౌండరీలు, రెండు సిక్సర్లు బాదాడు. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. నితీశ్ కుమార్ రెడ్డి 7 బంతుల్లో 11 స్కోర్ చేశాడు. సలీల్ అరోరా విన్నింగ్ షాట్లు ఆడాడు.
అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (15), ఊర్విల్ పటేల్ (13) తక్కువ పరుగులకు ఔటయ్యారు. స్టార్ ఆటగాడు సంజూ శామ్సన్ 27 పరుగులు చేయగా.. కార్తీక్ శర్మ 32 స్కోర్ చేసి సత్తా చాటారు. డెవాల్డ్ బ్రేవిస్ 27 బంతుల్లో 44 పరుగులు జోడించాడు. శివమ్ దూబే (26), ప్రశాంత్ వీర్ (11) తలా కొంత స్కోర్ చేశారు. ప్రత్యర్థి సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ పదునైన బౌలింగ్ వేసింది. కెప్టెన్ పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా.. షకీబ్ హుస్సే రెండు వికెట్లు తీశాడు. ప్రఫుల్ హింగే, ఈషాన్ మలింగ ఒక్కో వికెట్ తీశారు.
ఐపీఎల్ 2026లో 13 మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ 8 విజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్కు చేరుకుంది. చెన్నై 13 మ్యాచ్లు ఆడి 6 విజయాలు, ఏడు ఓటములతో ప్లేఆఫ్స్కు దూరమైంది. కానీ ఈ సీజన్లో చెన్నై ప్రదర్శన గొప్పగా ఉంది. మొదట పడిపోవడం.. అనంతరం గొప్పగా పుంజుకుని ప్లేఆఫ్స్ రేసులోకి ప్రత్యర్థులను భయపెట్టింది.
AP Govt Gift: ఉచిత విద్యుత్కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!
Nuzendla, Andhra Pradesh:AP Govt Announces Another Gift: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త వినిపించింది. ఇప్పటికే పలు వర్గాల ప్రజలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తుండగా.. ఆ పథకాన్ని మరింత విస్తరించనుంది. కులవృత్తులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. కులవృత్తిపై ఆధారపడిన నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చేలా.. వారికి సాంత్వన కలిగించేలా ఉచితంగా విద్యుత్ అందించనుంది. హెయిర్ సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత విద్యుత్ పథకాన్ని ఎలా పొందాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి? అనే వివరాలు తెలుసుకుందాం.
Also Read: Matsyakarula Sevalo: సీఎం చంద్రబాబు తీపి కబురు.. రేపు ఒక్కొక్కరికి రూ.20 వేలు విడుదల
రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ వృత్తిదారులకు, బీపీఎస్ కుటుంబాలకు ఉచిత కరెంట్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. బీసీ వర్గాల జీవనోపాధి అభివృద్ధి కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. బీసీ వర్గాలకు చెందిన రజకులు (చాకలి), స్వర్ణకారులు (విశ్వబ్రాహ్మణులు), నాయీ బ్రాహ్మణులు (మంగలి), అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. ఉచిత పథకం పొందే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది.
Also Read: Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ
ఉచిత విద్యుత్ వివరాలు
==> సెలూన్లు (నాయీ బ్రాహ్మణులు): 200 యూనిట్లు ఫ్రీ
==> లాండ్రీ షాపులు (రజకులు): 150 యూనిట్లు ఫ్రీ
==> గోల్డ్ షాపులు (స్వర్ణకారులు): 100 యూనిట్లు ఫ్రీ
==> గృహాలు (తెల్ల రేషన్ కార్డు): 100 యూనిట్లు ఫ్రీ
Also Read: Manchu Manoj Trust: హీరో మంచు మనోజ్ 'మంచి' మనసు.. ఐదుగురి విద్యార్థుల దత్తత
ఉచిత విద్యుత్కు దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
అర్హులైన లబ్దిదారులు సంబంధిత పత్రాలతో ఏపీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
==> ఆధార్ కార్డు
==> రేషన్ కార్డు
==> కుల ధృవీకరణ పత్రం
==> ప్రస్తుత కరెంట్ బిల్లు / సర్వీస్ నెంబర్
==> ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్
సర్టిఫికెట్ అవసరం లేదు
కొన్ని వర్గాలకు ధ్రువపత్రాలు అవసరం లేదు. అత్యంత వెనుకబడిన వర్గాలైన దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, ముత్యాలమ్మవాండ్లు తదితర 32 ఉప కులాలకు చెందిన వారికి ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికెట్ అవసరం లేదు. అర్హులైన వృత్తిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.
Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ
Tirupati Urban, Andhra Pradesh:VVIPs Rush To Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో సినీ సందడి నెలకొంది. ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి, ఆయన సతీమణి నిక్కీ గల్రానీ శ్రీవారిని దర్శించుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ జంట స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఆది పినిశెట్టి దంపతులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి వీఐపీ బ్రేక్ ద్వారా ప్రత్యేక దర్శన భాగ్యాన్ని కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ దంపతులకు వేద ఆశీర్వచనం అందించి.. పట్టువస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందించారు.
దర్శనం అనంతరం ఆలయం వెలుపల నటుడు ఆది పినిశెట్టి మీడియాతో మాట్లాడారు. 'ఈరోజు మా పెళ్లి రోజు. ఈ ప్రత్యేకమైన రోజున స్వామిని దర్శించుకుని.. ఆయన ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే సూపర్ హిట్ చిత్రం మరకతమణికి సీక్వెల్గా మరకతమణి పార్ట్-2 చేయబోతున్నా' అని ఆది తెలిపారు. ఆలయం వెలుపల ఆదిని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.
హోంమంత్రి దర్శనం
తిరుమల వేంకటేశ్వర స్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం హోంమంత్రి వంగలపూడి అనిత తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు మంత్రికి స్వామి వారి పట్టు వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.
Also Read: Manchu Manoj Trust: హీరో మంచు మనోజ్ 'మంచి' మనసు.. ఐదుగురి విద్యార్థుల దత్తత
దర్శనానంతరం ఆలయం వెలుపల హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. 'వేంకటేశ్వర స్వామిని కుటుంబసమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించా. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి వైపు వేగంగా దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆ స్వామి వారిని కోరుకున్నా. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ప్రగతి పథంలో పయనిస్తుంది' అని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
Also Read: KTR Speech: తెలంగాణ అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్ రావాల్సిందే: కేటీఆర్
Matsyakarula Sevalo: సీఎం చంద్రబాబు తీపి కబురు.. రేపు ఒక్కొక్కరికి రూ.20 వేలు విడుదల
Kavali, Andhra Pradesh:Matsyakarula Sevalo Scheme Amount Release: సముద్రపు వేటపైనే జీవనోపాధిపై ఆధారపడిన మత్య్సకారుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వేటకు విరామం ఇవ్వడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడే మత్య్సకారులకు ఏపీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ఆర్థిక సహాయం అందించనుంది. గంగపుత్రులకు రెండో ఏడాది కూటమి ప్రభుత్వం మత్య్సకారుల సేవలో పథకం నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఏపీ ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ కింద ప్రతీ కుటుంబానికి రూ.20 వేలు జమ చేయడంతో 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు లబ్ది జరగనుంది.
Also Read: Manchu Manoj Trust: హీరో మంచు మనోజ్ 'మంచి' మనసు.. ఐదుగురి విద్యార్థుల దత్తత
వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మత్య్సకార కుటుంబాలకు నిధులు విడుదల చేయనున్నారు.
Also Read: KTR Speech: తెలంగాణ అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్ రావాల్సిందే: కేటీఆర్
ప్రతీ ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపలు పిల్లలు పెట్టే సమయంలో వేటకు విరామం ఉండే విషయం తెలిసిందే. వేట నిషేధం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడంతో ఉపాధి కోల్పోతున్నారు. వారి జీవనానికి ఇబ్బంది లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది.
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ ఏడాది లబ్ధిదారు కుటుంబాల సంఖ్య కూడా పెరగ్గా.. రెండేళ్లలో మత్య్సకారుల కుటుంబాలకు రూ.505 కోట్లను ప్రభుత్వం సహాయంగా అందించింది.
Also Read: Uppal X Road: ఉప్పల్ క్రాస్ రోడ్డు మూసివేత.. వాహనాల దారి మళ్లింపులు ఇవే!
బాధిత కుటుంబాలకు భరోసా
మత్య్సకారులకు ఈ సహాయంతోపాటు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అందిస్తోంది. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం సకాలంలో అందిస్తోంది. 2024-25లో 63 క్లెయిమ్స్కు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 పెండింగ్ క్లెయిమ్స్కు రూ.5.65 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అం
సీఎం చంద్రబాబు పర్యటన
==> మత్య్సకారుల సేవలో పథకం నిధుల విడుదల కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో జరగనుంది.
==> ఉదయం 9.30 గంటలకు అమరావతి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు
==> ఉదయం 10.30 గంటలకు కావలి మండలం తుమ్మలపెంటకు చేరుకుంటారు
==> 10.45 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగం
==> 11.55 నిమిషాలకు మత్య్సకారులకు నిధులు విడుదల చేస్తారు
==> మధ్యాహ్నం 01.15 గంటలకు గ్రామంలోని మత్య్సకార కుటుంబాలతో సమావేశం
==> మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం
==> సాయంత్రం 04.45 గంటలకు తిరిగి అమరావతికి చేరుకుంటారు
Women Welfare Schemes: మహిళలకు బంపర్ గిఫ్ట్.. అటు ఫ్రీ బస్సు జర్నీ.. ఇటు జూన్ 1నుంచి ప్రతినెలా రూ. 3000 అకౌంట్లో జమ..!!
Secunderabad, Telangana:Annapurna Yojana West Bengal: భారతదేశంలోని రెండు రాష్ట్రాలైన కేరళ, పశ్చిమ బెంగాల్లలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన వెంటనే మహిళలకు భారీ వరాలు కురిపించాయి. మహిళలు, సాధారణ ప్రజల కోసం అనేక ప్రధాన సహాయ కార్యక్రమాలను ప్రకటించాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని ఇటీవలి మంత్రివర్గ నిర్ణయాలలో మహిళలు, వృద్ధులు, పేదలను లక్ష్యంగా చేసుకున్న అనేక కొత్త కార్యక్రమాలు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మహిళలకు రూ. 3,000 ఆర్థిక సహాయం అందించే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం 2026 జూన్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ స్కీము కింద..మహిళలకు ప్రతి నెలా రూ. 3,000 సహాయం అందుతుంది. ఇప్పటికే లక్ష్మీ భండార్ స్కీము ప్రయోజనాలను పొందుతున్న మహిళలు ఆటోమేటిక్గా ఈ పథకం ప్రయోజనాలను పొందుతారు. లక్ష్మీ భండార్ స్కీమ్ పేరును మార్చుతూ అన్నపూర్ణ యోజన అని పేరు పెట్టారు. అంతేకాదు ఇప్పటి వరకు ఏ పథకంలోనూ పేర్లు లేని మహిళల కోసం ఒక కొత్త పోర్టల్ తెరవనున్నట్లు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం:
ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సువేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సౌకర్యం కూడా జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇక కొన్ని పాత పథకాలలో పలు కీలక మార్పులు చేసింది. మతపరమైన కారణాలతో నడుస్తున్న కొన్ని పాత సహాయ పథకాలను క్రమంగా నిలిపివేస్తామని కేబినెట్ నిర్ణయించింది. అయితే.. ఈ నెల వరకు నడుస్తున్న పథకాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఆ తర్వాత వాటిని రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.
Also Read: ప్రభుత్వ రంగ బ్యాంకు సంచలనం.. FDలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం.. కొత్త రేట్లు ఇవే
ఇక కేరళలోని కొత్తగా ఏర్పడిన యూడీఎఫ్ ప్రభుత్వం కూడా మహిళలు, సమాజంలోని బలహీన వర్గాల కోసం అనేక పెద్ద నిర్ణయాలు తీసుకుంది. కేరళలో కూడా కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ పథకం 2026 జూన్ 15 నుంచి అమల్లోకి వస్తుంది. ఆశా , అంగన్వాడీ కార్యకర్తలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం ఆరోగ్య, సామాజిక కార్యకర్తలకు కూడా ఉపశమనం కల్పించింది. ఆశా కార్యకర్తలకు ప్రతి నెలా రూ.3,000 అదనపు గౌరవ వేతనం అందించనుంది. ఇక అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు కూడా నెలకు అదనంగా రూ. 1,000 లభిస్తాయి.వీరితోపాటు పాఠశాలలో పనిచేస్తున్న వంటవాళ్లు, ఇతర సిబ్బంది జీతాలను కూడా పెంచారు.
వృద్ధుల కోసం కొత్త శాఖ:
దేశంలోనే తొలిసారిగా వృద్ధుల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వయోవృద్ధుల సంరక్షణ, వారి జీవితాలను మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. రాష్ట్రంలో కొత్త శాసనసభను ప్రారంభించడం కూడా ప్రభుత్వం తీసుకున్న ఇతర ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. ఇక కొన్ని కేసుల దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ఒక నివేదికను కూడా విడుదల చేస్తుంది. ఈ రెండు రాష్ట్రాల్లోని కొత్త ప్రభుత్వాలు మహిళలకు, సాధారణ ప్రజలకు సహాయాన్ని, సౌకర్యాలను పెంచడంపై ప్రాధాన్యతనిచ్చినట్లు చూడవచ్చు.
Also Read: మిడిల్ క్లాస్ నచ్చిన Top 5 Electric Scooters ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
