icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Gajalaxmi Rajayogam 2026: జూలై 3 నుంచి ఈ 5 రాశులపై లక్ష్మీనారాయణుల అనుగ్రహం.. కోట్లల్లో ధనలాభం!

Hyderabad, Telangana:

Gajalaxmi Rajayogam 2026 Effect Telugu: ఖగోళంలో గ్రహాల కదలికలు మానవ జీవితాలపై ఎంతగానో ప్రభావం చూపుతూ ఉంటాయి.. ఈ క్రమంలో జూలై 2 గురువారం రోజు ఒక అద్భుతమైన శుభ యోగం ఏర్పడింది.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దేవగురువు బృహస్పతి, శుక్రుడు, బుధ గ్రహాల అనుకూల ప్రభావం వల్ల అత్యంత శక్తివంతమైన గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది. దీనికి తోడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి శ్రవణా నక్షత్రంలోకి ప్రవేశిస్తూ.. మకర రాశిలో సంచారం చేసింది.. సూర్యుడి నుంచి చంద్రుడు 8వ స్థానంలో ఉండటం వల్ల  సమయోగం కూడా ఏర్పడింది. ఈ అరుదైన గ్రహాల కూటమి కారణంగా 5 రాశుల వారికి అదృష్టం వరించబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో ధనలాభాలు కలగడమే కాకుండా.. వృత్తిపరమైన విజయాలు చేకూరుతాయి. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి ధన లాభాలు:
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ రాశి నుంచి మూడవ స్థానంలో శుక్ర, గురువుల ప్రభావం వల్ల ఆర్థికంగా భారీ ప్రయోజనాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందం విపరీతంగా పెరుగుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరైతే వారి ఆత్మవిశ్వాసం, ధైర్యమైన నిర్ణయాల వల్ల విజయాలు కలుగుతాయి.

కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రాజయోగం ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఊహించని గుర్తింపును అందిస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్‌ కూడా లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయంగా మారుతుంది. ఆదాయం పెరిగినప్పటికీ.. ఖర్చులను నియంత్రించుకోవడం అవసరమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగం మారాలనుకునే వారికి అద్భుతమైన అవకాశాలు తలుపు తట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

తులా రాశి (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా.. శుభప్రదంగా సాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్‌లో పురోగతి సాధించడానికి అదృష్టం లభిస్తుంది.. మానసిక ఆందోళనలు, దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.. ఊహించని విధంగా ధనలాభం కలగడంతో పాటు, ఆత్మీయుల నుంచి విలువైన బహుమతులు కూడా పొందుతారు. ఇష్టమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ రోజంతా ఉల్లాసంగా గడుపుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మకర రాశి (Capricorn)
చంద్రుడు మకర రాశిలోనే సంచరిస్తుండటంతో పాటు అతనిపై గురు, బుధ, శుక్రుల శుభ దృష్టి ఉండటం వల్ల ఈ రాశి వారికి విశేష ఆర్థిక లాభాలు కలుగుతాయి. మీ ఆలోచనలు పదును పెరిగి.. కొత్త ప్రణాళికలతో విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటాయి.. ప్రేమ జీవితం, వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈ రోజు ఎంతో శృంగారభరితంగా.. సంతోషంగా సాగుతుంది.

మీన రాశి (Pisces)
మీన రాశి వారికి ఈ రాజయోగం కఠిన శ్రమ చేయడం వల్ల అద్భుతమైన విజయాలు కూడా పొందుతారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు సానుకూల ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది. విద్యార్థులు విద్యారంగంలో మెరుగైన ప్రతిభ కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోని వనరుల ద్వారా ధనలాభం కలుగుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషాలు నెలకొంటాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

శనిదేవుని అఖండ కృప.. ఈ 4 రాశుల వారికి గోల్డెన్ టైమ్.. డబ్బే డబ్బు!

Hyderabad, Telangana:

Shani Nakshatra Gochar 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.. ముఖ్యంగా కర్మఫల ప్రదాత అయిన శనిదేవుడి కదలికలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాడు.. తాజాగా జూలై 2 గురువారం ఉదయం 8:22 గంటలకు శనిదేవుడు తన నక్షత్రాన్ని మార్చుకుని రేవతి నక్షత్రంలోకి సంచారం చేశాడు.. ఈ రేవతి నక్షత్రానికి అధిపతి బుధ గ్రహం.. బుద్ధి కారకుడైన బుధుడు, కర్మఫల ప్రదాత అయిన శని దేవుడి కలయిక వల్ల ఏర్పడే ఈ ప్రత్యేక సమయం కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభాలతో పాటు, అదృష్టాన్ని తీసుకురాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ నక్షత్ర మార్పు కారణంగా ప్రధానంగా 4 రాశుల వారి జీవితాలు మలుపు తిరగబోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితంలో వీరికి తిరుగులేని విజయాలు దక్కబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ సమయం అత్యంత కీలకమైనదిగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని రీతిలో భారీ లాభాలు కలుగుతాయి.. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా వేగవంతం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏదైనా విలువైన వస్తువును లేదా ఆస్తిని పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. గతంతో పోలిస్తే.. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారుతుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి రిటర్న్స్ పొందుతారు. వ్యాపార విస్తరణకు ఇది ఎంతో అనుకూలమైన సమయం.

కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ నక్షత్ర మార్పు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.. ఉద్యోగ రీత్యా లేదా వృత్తిపరమైన కారణాల వల్ల సుదూర ప్రయాణాలు చేయవలసి వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఇవి వీరికి ఎంతో లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగులు తమ కార్యాలయంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సమాజంలో మీ ప్రతిష్ట, కీర్తి పెరుగుతాయి. ఉన్నతాధికారులు మీపై నమ్మకంతో పెద్ద బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో సుఖసంతోషాలతో పాటు సంపదలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనే మీ కల త్వరలోనే నెరవేరబోతోంది. ఆస్తికి సంబంధించిన పాత వివాదాలు లేదా కోర్టు కేసులు ఏవైనా ఉంటే.. అవి ఇప్పుడు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబంలో లేదా బంధువులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. జీవితంలో ఏదైనా పెద్ద శుభవార్త వినే అవకాశం ఉంది. దీనివల్ల మీ మనస్సు ఎంతో సంతోషంగా ఉంటుంది.

ధనుస్సు రాశి (Sagittarius) 
ధనుస్సు రాశి వారికి ఈ సమయం ఆర్థిక పురోభివృద్ధికి కొత్త బాటలు వేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ఈ కాలంలో మీ కుటుంబ సభ్యులతో.. ఆత్మీయులతో బంధాలు మరింత బలోపేతం అవుతాయి. పరస్పర ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. జీవితంలో భోగభాగ్యాలు, విలాసాలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు చేసే సుదూర ప్రయాణాలు అఖండ లాభాలను తెచ్చిపెడతాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణం సానుకూలంగా మారుతుంది. కార్యాలయంలో మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడి.. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

ఇంత బలుపా?.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్, వీడియో వైరల్!

Hyderabad, Telangana:

Siya Goyal Middle Finger Video: తన కాబోయే భర్తను చంపిన సియా గోయల్‌లో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించకపోవడంతో, సోషల్ మీడియా వేదికగా ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆమె మీడియాకు మిడిల్ ఫింగర్ చూపిస్తూ ప్రవర్తించిన వీడియో చర్చనీయాంశమైంది. విచారణ కోసం పోలీసులు ఆమెను ఇంటికి తీసుకెళ్తుండగా జరిగిన ఈ ఘటనపై, హత్య చేసినా ఆమెకు ప్రశాంతత లేదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఎక్స్ (X) వేదికగా 17 సెకన్ల వీడియో వైరల్ అవుతోంది. పూనేలోని మార్కెట్ యార్డ్‌లో ఉన్న తన ఇంటికి పోలీసులు ఆమెను తీసుకువెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. నలుపు రంగు టీ షర్ట్, ముఖానికి మాస్క్ ధరించిన సియా, ఒక్కసారిగా మీడియా వైపు చూసి మిడిల్ ఫింగర్ చూపించింది. తన అహంకారాన్ని బయట పెట్టింది. దీంతో నెట్టింటా సియాను ఏకిపారేస్తున్నారు. కాబోయే భర్తను చంపినా పొగరు తగ్గలేదు అని కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉండగా.. పూనే బిజినెస్‌మెన్ కేతన్ అగర్వాల్ మృతి కేసును మొదట ప్రమాదంగా భావించిన పోలీసులు, ఆ తర్వాత ఇది పక్కా పథకం ప్రకారం కాబోయే భార్య చేసిన హత్య అని నిర్ధారించారు. సియా తన లవర్‌ చేతన్‌తో కలిసి కేతన్‌ను 400 అడుగుల లోయలోకి తోసి ప్రాణాలు తీసింది. మొదట విచారణలో తప్పుడు సమాధానాలు చెప్పిన ఆమె, పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించింది. 

 

చేతన్‌ను ప్రేమించడమే కాకుండా, కేతన్‌కు జుట్టు లేదు, అతను విగ్గు పెట్టుకునేవాడు, నత్తి కూడా ఉంది. అందుకే నచ్చలేదని, తన కుటుంబం ఆ విషయాలను పట్టించుకోలేదని ఆమె చెప్పిందట. కుటుంబ సభ్యులను బాధ పెట్టడం కంటే అతడిని చంపడం సులువు అని ఆమె భావించినట్టు సమాచారం.

Read more:  సియా గోయల్ ఇచ్చిన సిగ్నల్ అదేనా.!. పూణె మర్డర్ కేసులో బైటపడ్డ షాకింగ్ నిజం..!

Read more: పూణె మర్డర్ కేసులో కీలక పరిణామం.. లోహగఢ్ కోటకు సియా గోయల్, చేతన్ చౌదరీ... ఎందుకో తెలుసా..?.

ఈ సంచలన హత్య కేసుపై నేటిజన్లు కేతన్‌కు సానుభూతి వ్యక్తం చేశారు. పెళ్లి నచ్చకపోతే చంపేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. హత్యకు నాలుగు రోజుల ముందే సియా అతడిని అదే లోయలోకి తోసి చంపడానికి ప్రయత్నించినట్లు కేతన్ తండ్రి ఆరోపించారు. బయటకు పాము వచ్చిందని భయపడి ఆమె నాటకం ఆడిందని, కేతన్ చనిపోయాక ఎమోషనల్ పోస్టులు పెట్టిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, సియా, కేతన్ కలిసి ఆనందంగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వీరి పెళ్లి కోసం రాజస్థాన్‌లో రూ.16 కోట్ల లగ్జరీ వేడుకను బుక్ చేసినట్లు తెలుస్తోంది. కేతన్ కుటుంబం ఆస్తుల విలువ సుమారు రూ.600 కోట్లు ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా సియా కేతన్ కుటుంబం వీరి పెళ్లిని నవంబర్‌లో ఫిక్స్ చేశారు. ఇక కేతన్‌, సియా రిలేషన్షిప్ పై ఆమె ప్రియుడు చేతన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఇద్దరు పన్నాగం పన్ని కేతన్ ని హతమార్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report
Advertisement

Mars Effect: జూలై 24 నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగులేదు.. కుజుడి సంచారంతో ఊహించని ధనలాభాలు!

Hyderabad, Telangana:

Mars Entry Into Mrigasira Nakshatra 2026 News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది.. ముఖ్యంగా శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పాటు భూమికి కారకుడైన కుజుడు జూలై నెలలో ఒక కీలకమైన నక్షత్రంలోకి సంచారం చేస్తున్నాడు.. 2026 జూలై 24, శుక్రవారం తెల్లవారుజామున 03:29 గంటలకు కుజుడు తన సొంతం నక్షత్రమైన మృగశిర నక్షత్రంలోకి సంచారం చేస్తాడు.. ఆగస్టు 12 వరకు కుజుడు ఇదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతాడు.. కుజుడు మృగశిరలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని అద్భుత మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్టలు, అపారమైన ఆత్మవిశ్వాసం లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో అదృష్టం పొందే రాశులవారి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మేష రాశి (Aries) 
మృగశిర నక్షత్రంలో కుజుడి ప్రవేశం మేష రాశి వారికి అద్భుతమైన శక్తిని, సాహసాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగాలతో పాటు వ్యాపార రంగాలలో ఉన్న వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు సుగమవుతాయి. ఆకస్మిక ధనలాభం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా మెరుగవుతుంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. తండ్రి వైపు నుంచి పూర్తి సపోర్ట్‌ లభిస్తుంది. దీనివల్ల నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.

కర్కాటక రాశి (Cancer) 
కర్కాటక రాశి జాతకులకు ఈ కుజ సంచారం అత్యంత శుభప్రదంగా, లాభదాయకంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో మీకు కొత్త బాధ్యతలు లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో మీ ఎదుగుదలకు తోడ్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కోరికలు నెరవేరే సమయం వచ్చింది.. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావడమే కాకుండా.. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.

సింహ రాశి (Leo) 
సింహ రాశి వారి జీవితాల్లో కూడా కుజుడి సంచారంతో కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభఫ్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి కెరీర్ ఊపందుకుంటుంది.. ఉద్యోగులకు జీతాల పెంపు (Salary Hike) లేదా పదోన్నతి (Promotion) లభించే బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఒక ముఖ్యమైన, పెద్ద డీల్‌ను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీలోని నాయకత్వ లక్షణాలు (Leadership Skills) అందరినీ ఆకట్టుకుంటాయి.

వృశ్చిక రాశి (Scorpio) 
కుజుడి నక్షత్ర మార్పు వృశ్చిక రాశి వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి (Spouse) నుంచి మీకు పూర్తి సహకారం, ప్రేమ లభించబోతున్నాయి. వ్యాపార రంగంలో పరిస్థితులు చాలా వేగంగా మెరుగుపడతాయి. ఉద్యోగస్తులు కెరీర్‌లో అఖండ విజయాలను సాధించేందుకు చక్కటి అవకాశాలను పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

దేశంలోనే తొలిసారిగా.. మహిళా రైతుల కోసం చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం..!!

BBhoomi1h ago
Secunderabad, Telangana:

Maharashtra Women Farmers Empowerment Bill: మహారాష్ట్ర శాసనసభ దేశంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ తీసుకోని అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రైతు సాధికారత బిల్లుకు రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ నిర్ణయంతో వ్యవసాయం లేదా వ్యవసాయ సంబంధిత పనుల్లో నిమగ్నమైన మహిళలకు అధికారికంగా రైతు హోదా లభిస్తుంది. ఇక నుంచి వారు ప్రభుత్వ పథకాల నుంచి నేరుగా లబ్ది పొందుతారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో లక్షలాది మంది మహిళలకు సామాజిక గౌరవాన్ని అందించడమే కాదు.. పురుగోతికి కూడా మార్గం సుగుమం చేసిందని చెప్పాలి. 

గ్రామాల్లో విత్తనాలు నాటడం నుంచి పంట కోయడం వరకు మహిళలు.. పురుషులతో సమానంగా కష్టపడుతుంటారు. అయినా కూడా భూమి పురుషుల పేర్ల మీదే ఉండటం వల్ల ప్రభుత్వ రికార్డుల్లో మహిళలను ఏనాడూ రైతులుగా పరిగణించలేదు. దీంతో వారు బ్యాంకు లోన్స్ లేదా ప్రభుత్వ సహాయానికి దూరమయ్యారని చెప్పాలి. ఈ కొత్త చట్టం ఈ అంతరాన్ని పూడ్చివేసి..కష్టపడిపనిచేసే మహిళలకు నిజమైన గుర్తింపు లభించేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పాలి. 

ఈ కొత్త చట్టం.. మహిళా రైతు నిర్వచనాన్ని మరింత విస్త్రుతం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి పంటలు పండించేవారే కాదు.. పశుపోషణ, పాడి, కోళ్ల పెంపకం, మత్స్య పరిశ్రమ, తేనెటీగల పెంపకం చేస్తున్న వారు కూడా రైతుల కోవాలోకి వస్తారు. ప్రభుత్వం ఈ మహిళలందరికీ మహిళా రైతు గుర్తింపు కార్డులు కూడా జారీ చేయనుంది. ఈ ఒక్క కార్డు ద్వారా వారు బ్యాంకులోన్స్, పంటల బీమా, ప్రభుత్వ రాయితీలు, విత్తనాలు, ఎరువులు సులభంగా పొందుతారు. అంతేకాదు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది. 

మొత్తం వ్యవస్థ మరింత  సజావుగా పనిచేసే విధంగా..  ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన చట్రాన్ని రూపొందిస్తోంది. ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు త్వరలోనే  రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కేవలం గుర్తింపు పత్రాలు ఇవ్వడం మాత్రమే సరిపోదని సభలో చర్చ సందర్భంగా వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఆరోగ్యం, పోషణ, ఆర్థిక సాధికారత వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని పేర్కొంది. కుటుంబ వ్యవసాయ భూముల్లో మహిళలను సహ-యజమానులుగా చేయాలనే కొన్ని సూచనలు కూడా వెలువడ్డాయి.

ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, మహిళలు ఇకపై పొలాల్లో కేవలం కూలీలుగా కాదు... వారికి స్వతంత్ర రైతుల హోదా లభిస్తుంది. ఈ చర్య గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా బలోపేతం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. వారు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారు. తమ సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

Also Read: వెండి కొంటున్నారా? అయితే గుడ్ న్యూస్...భారీగా పడుతున్న సిల్వర్ ధర...ఇప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చా..?

Also Read:  EPFO 3.0: ఇక ATMకెళ్లి పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

భక్తుల రద్దీ.. తిరుమల వెంకటేశ్వర క్షేత్రానికి రాజకీయ ప్రముఖుల తాకిడి

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు పోటెత్తారు. సాధారణ భక్తులతోపాటు ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ ప్రముఖులతోపాటు పలువురు సినీ ప్రముఖులు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నది ఎవరెవరో తెలుసుకుందాం.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం జరిగే దివ్య దర్శనాల్లో భాగంగా గురువారం పలువురు ప్రముఖులు వేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం అనంతరం వారు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి తిరుమల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం వీఐపీ దర్శన ఏర్పాట్లలో భాగంగా స్వామివారి సన్నిధికి చేరుకుని వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.

మాజీ గవర్నర్‌ దర్శనం
తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్‌ నాయకులు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్వామివారి కృపతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

సినీ ప్రముఖులు
 సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా తిరుమలలో దర్శనం చేసుకున్నారు. ప్రముఖ నటుడు సాయికుమార్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం సాయికుమార్‌ మాట్లాడుతూ.. 'తిరుమల దర్శనం జీవితంలో అత్యంత పవిత్రమైన అనుభవం' అని తెలిపారు. ప్రముఖ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్రప్రసాద్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ వాతావరణాన్ని ఎంతో ప్రశాంతంగా అనుభూతి చెందినట్లు తెలిపారు. దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. 'ఆయ‌నే ప‌ద్మాస‌నుడు. ప‌ద్మ‌ ఇప్పించింది ఆయ‌నే. నా జీవితంలో ఏదీ జ‌రిగినా ‌వారికి చెప్పుకోవ‌టం నాకు అల‌వాటు. అందుకే స్వామిని ద‌ర్శించుకున్నా. నాకు వ‌చ్చిన అవార్డు మీ అంద‌రికీ వ‌చ్చిన‌ట్లే' అని రాజేంద్ర ప్రసాద్‌ తెలిపారు.

నారా లోకేశ్‌, పీవీఎన్‌ మాధవ్‌
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్  కూడా తిరుమల వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుమలలో  కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని కంపార్ట్‌మెంట్లు  27 క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 10 నుంచి 15 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డీ) టోకెన్లు కలిగిన భక్తులకు 6 నుంచి 8 గంటలు సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2.3 గంటల సమయం పడుతుండగా.. నిన్న ఒక్కరోజే 78,067 మంది భక్తులు స్వామినిదర్శించుకున్నారు. స్వామివారికి 31,158 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీకి రూ.4.39 కోట్లు ఆదాయం లభించింది.

0
0
Report
Advertisement

జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి.. ప్రజా జీవితంలో రేవంత్‌ రెడ్డి @ 20 ఏళ్లు

Midjil, Telangana:

Revanth Reddy @ 20 Years: తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభించి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఒక స్వతంత్ర అభ్యర్థిగా జీవితం ప్రారంభించి అనంతరం రాష్ట్ర అత్యున్నత స్థాయి పదవిని అలంకరించారు. చిన్నగా ప్రారంభమైన అతడి రాజకీయ జీవితం ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. ఉమ్మడి పాలమూరు నుంచి ముఖ్యమంత్రిగా అయిన రెండో వ్యక్తిగా రేవంత్‌ రెడ్డి చరిత్ర సృష్టించారు. ఆయన రెండు దశాబ్దాల రాజకీయ చరిత్రపై 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ జడ్పీటీసీ సభ్యుడిగా ఆయన వేసిన తొలి అడుగు.. నేడు ఆయనను రాష్ట్ర అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టింది. ప్రజాప్రతినిధిగా ఆయన ప్రస్థానం ప్రారంభమై ఈనెల జూలై 4 నాటికి సరిగ్గా 20 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా తనకు రాజకీయ జీవితం ఇచ్చిన మిడ్జిల్‌లో జూలై 4వ తేదీన రేవంత్‌ రెడ్డి పర్యటించనున్నారు. మిడ్జిల్‌ ప్రజల సమక్షంలోనే ప్రజాప్రతినిధిగా తన జీవితం ప్రారంభించిన రోజును గుర్తుచేసుకోనున్నారు. అప్పట్లో తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం కానున్నారు. ప్రజాప్రతినిధి నుంచి సీఎం పీఠం దాకా సాగిన తన కెరీర్‌ పునాదిగా నిలిచిన మిడ్జిల్‌ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనున్నారు. తన రాజకీయ ప్రయాణంలో తనను ప్రజాప్రతినిధిగా తొలిసారి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలనే భావనతోనే.. 'మీ బిడ్డను.. మళ్లీ వస్తున్నా... మీ ఆశీర్వాదం, ఆదరణతోనే రాష్ట్రానికి సేవ చేసే అవకాశం వచ్చింది' అనే భావంతో మిడ్జిల్ ప్రజల ముందుకు వస్తున్నారు.

Also Read: మంత్రులపై కేటీఆర్‌ ఆగ్రహం.. చర్చకు రాకుండా తొడలు కొడితే ప్రయోజనం ఏంటి?

విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్‌ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో రేవంత్‌ రెడ్డి తొలి అడుగు స్వతంత్రంగానే పడింది. ఉమ్మడి రాష్ట్రంలో 2006 పరిషత్‌ ఎన్నికల్లో మిడ్జిల్‌ జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జూలై 4వ తేదీన విజయం సాధించారు. మరుసటి ఏడాది 2007లో మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి శాసనమండలిలో తొలిసారి అడుగుపెట్టారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి తన సరికొత్త పంథాతో  ఆ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు.

కొడంగల్‌ నియోజకవర్గం నుంచి 2009, 2014లో పోటీ చేసి ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ శాసనభలో టీడీపీఎల్పీ.. బీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం కావడం.. తెలుగుదేశం మనుగడ ప్రశ్నార్థకం కావడంతో రేవంత్‌ రెడ్డి ప్లేటు ఫిరాయించి పార్టీ మారారు. వెంటనే టీడీపీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేని జనాకర్షక నాయకుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారు. ప్రజల్లో రేవంత్‌రెడ్డికి వస్తున్న స్పందనను గ్రహించిన అధిష్ఠానం 2018 ఎన్నికలకు ముందు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. అయితే 2018 ఎన్నికల్లో అప్పటి అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ కొడంగల్‌పైన ప్రత్యేక దృష్టి సారించడం, ఇతర పరిణామాల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి మాటతప్పారు. అనంతరం2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి స్థానంలో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఎంపీగా విజయం సాధించారు.

2021 జూలై 7వ తేదీన టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ పగ్గాలు అందుకున్న రేవంత్‌రెడ్డి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని విజయతీరానికి చేర్చారు. 2023 డిసెంబర్‌ 7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ముఖ్యమంత్రి పీఠం వరకూ సాగిన రేవంత్‌రెడ్డి ప్రస్థానంలో మిడ్జిల్‌ జడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన సాధించిన తొలి విజయం ప్రత్యేకమనే చెప్పవచ్చు. ఆ ప్రత్యేకతను మరోమారు గుర్తు చేసుకునేందుకు రేవంత్‌రెడ్డి జూలై 4న మిడ్జిల్‌లో పర్యటించనున్నారు.

రేపు మిడ్జిల్‌ పర్యటన
మిడ్జిల్‌ పర్యటనకు రానున్న రేవంత్‌ రెడ్డి మొదట ఊరుకొండ ఆలయాన్ని సందర్శించనున్నారు. తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన అనుచరులు, ఆత్మీయులు, ముఖ్య నాయకులు, ఆనాటి పెద్దలతో కలిసి 'ఆత్మీయ విందు' చేస్తారు. మిడ్జిల్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్‍ రెడ్డి కీలక ప్రసంగం చేస్తారు. ఈ సంధర్భంగా మిడ్జిల్ మండలంపై వరాల జల్లు కురుపించే అవకాశం ఉంది. ఇప్పటికే మిడ్జిల్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసిన విషయం తెలిసిందే.

0
0
Report

జగిత్యాల ప్రగతి పథం.. చల్గల్‌లో కేంద్రీయ విద్యాలయం.. ఎమ్మెల్యే సంజయ్ కీలక ప్రకటన..!

Jagtial, Telangana:

Jagtial Kendriya Vidyalaya Latest News: జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా కేంద్రీయ విద్యాలయం (KV) ఏర్పాటుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మోతే రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గత ఎనిమిది నెలలుగా కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ప్రక్రియల వల్ల కొంత ఆలస్యం జరగడం వాస్తవమేనని.. అయితే, దీన్ని రాజకీయం చేస్తూ.. కొందరు ఇష్టారాజ్యంగా మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో పండ్ల మార్కెట్ కొరకు వాలంతరి భూమిని కేటాయించినప్పుడు.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేసినప్పటికీ స్థల మార్పిడిలో తీవ్ర ఆలస్యమైందనే విషయాన్ని మీడియా మిత్రులు, అధికారులు గమనించాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గుర్తుచేశారు. వాటర్ అండ్ ల్యాండ్ రీసెర్చ్ సంస్థ (వాలాంతరి) అనేది ఒక అటానమస్ సంస్థ అని.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల శాస్త్రవేత్తల శిక్షణ నిమిత్తం ఆ భూమి కేటాయింపులో కొంత జాప్యం జరిగిందని వివరించారు. కొందరు పూర్తి అవగాహన లేకుండా తెలిసి తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు.

నేడు క్యాబినెట్ ఆమోదం.. 
కేంద్రీయ విద్యాలయం తాత్కాలిక నిర్వహణ కొరకు పాత ఎస్పీ కార్యాలయాన్ని కేవీ డిప్యూటీ డైరెక్టర్, డీఈఓ, కలెక్టర్‌తో పాటు కరీంనగర్ కేవీ ప్రిన్సిపాల్ సందర్శించి ఆమోదం తెలిపారని సంజయ్ కుమార్ వెల్లడించారు. శాశ్వత భవన నిర్మాణం కోసం చల్గల్‌లో 5 ఎకరాల భూమికి కలెక్టర్ అడ్వాన్స్ పొసెషన్ ఇచ్చారని తెలిపారు. పూర్తి స్థాయి కేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం అవసరం కాబట్టి.. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం రానుందని.. మంత్రి కూడా దీనికోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని చెప్పారు. కేవీ కోసం తాను చేసిన ప్రయత్నాలకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

దళితుడు మంత్రిగా ఉండడం కొందరికి ఇష్టం లేదు..
జగిత్యాల అభివృద్ధికి మంత్రి లక్ష్మణ్ కుమార్ విశేషంగా కృషి చేస్తున్నారని.. అయితే, ఒక దళితుడు మంత్రిగా ఉండడం ఒక సీనియర్ నాయకునికి ఇష్టం లేదని.. అందుకే సర్కార్‌ను దింపుతాం, నాకు మంత్రి అయ్యే అర్హత ఉందంటూ అహంకారంతో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. విమర్శలు ఎప్పుడైనా నిర్మాణాత్మకంగా ఉండాలి కానీ.. ఇలా వ్యక్తిగత కక్షలతో ఉండకూడదని హితవు పలికారు. చల్గల్‌లో రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని 7 ఎకరాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కొరకు, 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం కొరకు కేటాయించడం జరిగిందన్నారు. మంత్రులు, ఎంపీతో కలిసి జగిత్యాల ప్రగతికి కట్టుబడి ఉంటానని, వాలాంతరిలో వ్యవసాయ అభివృద్ధికి కేంద్ర నిధుల కోసం ఎంపీ సహకారం కోరతామని తెలిపారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

ప్రోటీన్ అనుకుంటే క్యాన్సర్ ముప్పు.. కరీంనగర్ కల్తీ మీల్‌మేకర్ ప్యాకెట్లపై అధికారుల నిర్లక్ష్యం?

Hyderabad, Telangana:

Karimnagar Adulterated Meal Maker Scam: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్లపై.. అధికారులు దాడులు చేయడం ఒకెత్తయితే.. అప్పటికే మార్కెట్లోకి చేరిన విషాన్ని వెలికి తీయడం మరో ఎత్తు.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం దేశరాజు పల్లి శివారులో ఓ ఫ్యాక్టరీ పై బుధవారం పోలీసులతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడి చేసి భారీ కల్తీ సోయా చంక్స్ (మీల్‌మేకర్) పట్టుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఫ్యాక్టరీని సీజ్ చేసి చేతులు దులుపుకున్న అధికారులు.. అప్పటికే మార్కెట్లోకి సరఫరా అయిన కల్తీ నిల్వలను స్వాధీనం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. 

VS బ్రాండ్ పేరుతో మార్కెట్లో విక్రయాలు..
దేశరాజు పల్లి ఫ్యాక్టరీ నుంచి విఎస్ బ్రాండ్ అని బ్రాండ్ పేరుతో ఈ కల్తీ మీల్‌మేకర్ మార్కెట్లోకి విడుదలైనట్లు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ హోటల్స్ తో పాటు రిటైల్ కిరాణ దుకాణాలకు ఈ కల్తీ ప్యాకెట్లు ఇప్పటికే చేరిపోయాయి.. బ్రాండెడ్ ప్యాకెట్ల లోని కాకుండా బస్తాల కొద్దీ విడిగా కూడా వీటిని విక్రయించినట్లు తెలుస్తోంది. ఫ్యాక్టరీ పై దాడి జరిగి 24 గంటలు గడుస్తున్నప్పటికీ.. దుకాణాల్లో ఉన్న ఈ నిల్వలను రికవరీ చేసేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలుగుతోంది..

కిడ్నీ, లివర్ పై ప్రభావం..
ఫ్యాక్టరీని పట్టుకుంటే సరిపోతుందా? అప్పటికే దుకాణాలకు చేరిన కల్తీ మీల్‌మేకర్ మేము కొనుక్కుని తింటే మా ఆరోగ్యాల పరిస్థితి ఏంటి? అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా శాఖాహారులు ప్రోటీన్ కోసం ఎక్కువగా వీటిని వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ ఫ్యాక్టరీలో నాసిరకం పదార్థాలతో పాటు ప్రమాదకరమైన రసాయనాలు, రంగులు కలిపి కృత్రిమంగా చంక్స్ తయారుచేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి కల్తీ ఆహారాన్ని తినడం వల్ల జీర్ణకోశ సంబంధిత సమస్యలు రావడమే కాకుండా కిడ్నీ, లివర్ పై ఊహించని స్థాయిలో ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీసే ప్రమాదం కూడా కనిపిస్తోంది. 

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

తక్షణమే రికవరీ చేయాలని డిమాండ్..
పట్టణంలోని సూపర్ మార్కెట్ల నుంచి పల్లెల్లోని చిన్నచిన్న కిరాణా కొట్టుల వరకు విఎస్ బ్రాండ్ నిల్వలు ఇంకా చలామణిలో ఉన్నాయని.. ప్రజలు తెలియక వీటిని కొనుగోలు చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పందించి ప్రత్యేకమైన బృందాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టాలని.. మార్కెట్లో ఉన్న సరుకును తక్షణమే సీజ్ చేయడంతో పాటు.. ప్రజలు ఈ బ్రాండ్ కలిగిన వాటిని కొనుగోలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజాసంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
0
Report
Advertisement

ఉపాధి ఆశ చూపి ఘోరం.. ఒంటిపై బంగారం లాక్కొని బావిలో పడేసిన దుర్మార్గుడు!

Hyderabad, Telangana:

Karimnagar Crime News: ఉపాధి ఆశ చూపిన ఓ కిరాతకుడు నమ్మకద్రోహానికి పాల్పడ్డాడు.. పని ఇప్పిస్తానని నమ్మించి.. ఓ అమాయక మహిళను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి.. ఆమె మెడలో ఉన్న బంగారాన్ని దోచుకోవడమే కాకుండా.. సాక్ష్యం లేకుండా చేయాలని కుట్రతో బావిలోకి తోసేసిన దారుణ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో వెలుగు చూసింది. మృత్తుతో పోరాడి.. ప్రాణాలతో బయటపడ్డ ఆ మహిళ ఉదాంత స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తుంది..

నమ్మించి తీసుకెళ్లి.. నట్టేట ముంచాడు..
పోలీసులతో పాటు స్థానికులందించిన కథనం ప్రకారం.. కరీంనగర్ నగరానికి చెందిన ఓ మహిళ కొద్దిరోజులుగా పని కోసం వెతుకులాడుతోంది.. దీనిని ఆసరాగా చేసుకున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి.. ఆమెకు మంచి పని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి నమ్మించాడు.. అతని మాటలను నిజమని నమ్మిన సదరు మహిళ.. అతను చెప్పిన చోటుకు వెళ్ళింది. పథకం ప్రకారం ఆ వ్యక్తి ఆమెను నుస్తులాపూర్ శివారులోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.

చుట్టుపక్కల ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్నాక.. ఆ కిరాతకుడు తన అసలు రూపాన్ని బయట పెట్టాడు.. మహిళపై ఒక్కసారిగా దాడి చేసి ఆమె మెడలో ఉన్న అర్థతులం బంగారు గొలుసును బలవంతంగా లాక్కున్నాడు.. అంతటితో ఆగకుండా ఆమె గట్టిగా కేకలు వేస్తే ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో.. పక్కనే ఉన్న ఒక పాడుబడిన వ్యవసాయ బావిలోకి ఆమెను నెట్టేసి అక్కడి నుంచి పరారయ్యాడు..

బావిలోనే 24 గంటల నరకయాతన.. 
బావిలో పడిపోయిన బాధితురాలు తీవ్రభయాందోళనకు గురయ్యింది.. లోతైన ఆ భావించి పైకి రావడం సాధ్యం కాకపోవడంతో పాటు చుట్టుపక్కల జనాలు లేకపోవడంతో ఆమె పెట్టిన కేకలు ఎవరికి వినిపించలేదు.. దాదాపు 24 గంటల పాటు ఆమె నీటిలో.. ఆ చీకటి బావిలోనే ప్రాణాల కోసం కొట్టుమిట్టాడింది.. ఆకలితో పాటు దాహం, భయంతో నరకయాతన అనుభవించింది.. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా ప్రాణాలను నిలబెట్టుకుంది..

రక్షించిన బావి యజమాని.. 
మర్రిశెట్టి రోజు ఉదయం బావి యజమాని తన పొలానికి వచ్చి.. బావి వైపు వెళ్లక లోపలి నుంచి మహిళ ములుగుతున్న శబ్దం వినిపించింది. అనుమానంతో లోపలికి తొంగి చూడగా.. ఒక మహిళ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ కనిపించింది.. వెంటనే సదరు యజమాని గ్రామంలోని స్థానికులకు సమాచారం అందించాడు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

రంగంలోకి పోలీసులు..
ఈ ఘోర ఉదాంతం పై సమాచారం అందుకున్న తిమ్మాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.. బాధితురాలి ప్రథమక చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. అనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి ఒంటరిగా నిర్మానుష ప్రాంతాలకు వెళ్ళవద్దని.. మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని.. నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేకమైన బృందాలను రంగంలోకి దించామని పోలీసులు తెలిపారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Tamil Nadu Deputy CM: డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యేందుకు త్రిషకు తొలగిన అడ్డంకి..రాజకీయాలకు దూరంగా లారెన్స్!

Tamil Nadu:Tamil Nadu Deputy CM Trisha: తమిళనాడు సీఎం విజయ్ పార్టీ విజయం సాధించిన తర్వాత తాను పోటీ చేసిన రెండో స్థానం తిరుచ్చీ నుంచి ఇప్పుడు ఎవరు బరిలో దిగనున్నారనే విషయం ఇప్పుడు ఆసక్తి నెలకొంది. నిన్న మొన్నటి వరకు నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ తిరుచ్చీ అసెంబ్లీ స్థానానికి టీవీకే పార్టీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే తాను ప్రస్తుతం మరికొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటానని లారెన్స్ ప్రకటన తర్వాత ఆ స్థానంలో త్రిష పోటీ చేసే అవకాశం ఉందని టీవీకే నేతలు అంటున్నారు. ఒకవేళ ఆ స్థానంలో ఆమె గెలిస్తే.. డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.
0
0
Report

Ayodhya Mandir Funds Theft: అయోధ్య రాముడి నిధుల గోల్‌మాల్..నిందితుల ఇళ్లు కూల్చివేతకు యోగి ప్రభుత్వం ఆదేశం!

Ayodhya, Uttar Pradesh:

Ayodhya Mandir Funds Theft News: అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశవిదేశాల నుంచి భక్తులు సమర్పించిన విరాళాల సొమ్మును స్వాహా చేసిన నిందితులపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ భారీ కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్.. నిందితుల అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు, వారు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను కూల్చివేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ నిధుల దుర్వినియోగం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న లవ్ కుశ్ మిశ్రాకు ఇప్పటికే గట్టి షాక్ తగిలింది. అయోధ్య-లక్నో జాతీయ రహదారి సమీపంలో అతను కొనుగోలు చేసిన వివాదాస్పద స్థలంలో నిర్మిస్తున్న రెండంతస్తుల నివాస భవనానికి అయోధ్య అభివృద్ధి సంస్థ (ADA) అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేని, అక్రమ సంపాదనతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని త్వరలోనే కూల్చివేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న రామాలయ నిధులను వ్యక్తిగత ఆస్తుల కోసం మళ్లించడాన్ని యోగి ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది.

ఐదేళ్ల ట్రస్టు నిధులపై సిట్ ఆడిట్..
ఈ కుంభకోణం మూలాలను, ఇందులో ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే విషయాన్ని పూర్తిగా వెలికితీసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) రంగంలోకి దించింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు గడిచిన ఐదేళ్లలో అందిన నిధులు, విరాళాలపై సిట్ అధికారులు ప్రస్తుతం ముమ్మరంగా ఆడిట్ నిర్వహిస్తున్నారు.

ట్రస్టుకు వచ్చిన నగదు, ఆన్‌లైన్ విరాళాలు, వాటి ఖర్చులకు సంబంధించిన ప్రతి రికార్డును అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్వామివారి సొమ్మును సొంతానికి వాడుకున్న ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని యోగి సర్కార్ స్పష్టం చేసింది. ఈ పరిణామం యూపీతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

Also Read: నీట్-2026 విద్యార్థులకు అలర్ట్..రీ-ఎగ్జామ్ ఫలితాలను విడుదల చేసేది ఆరోజే!

ALso Read: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు..త్వరలోనే భారీగా పెరగనున్న జీతాలు..ఎంత పెరుగుతాయంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

NEET UG Result 2026: నీట్-2026 విద్యార్థులకు అలర్ట్..రీ-ఎగ్జామ్ ఫలితాలను విడుదల చేసేది ఆరోజే!

New Delhi, Delhi:

Re-NEET UG Result 2026: మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ వివాదాల కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూన్ 21న నిర్వహించిన నీట్ యూజీ 2026 రీజన్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలై 20 లోగా ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కసరత్తు చేస్తుందని సమాచారం అందుతోంది. రాబోయే విద్యా సంవత్సరానికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు, త్వరగా ఫలితాలను ప్రకటించాలని ఎన్‌టీఏ లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది. 

జూన్ 21వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ కు దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 5440 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అలాగే విదేశాల్లో ఏర్పాటు చేసిన 14 కేంద్రాల్లో విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జూన్ 25వ తారీఖున తాత్కాలిక కీని విడుదల చేసి, జూన్ 28 వరకు అభ్యంతరాల స్వీకరణకు ఎన్‌టీఏ అవకాశం కల్పించింది. 

ఫలితాల తర్వాత తదుపరి ప్రక్రియ..
NTA త్వరలోనే ఫైనల్ ఆన్సర్ కి నీ విడుదల చేయనుంది. అది వచ్చిన వెంటనే తొలి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు విడుదలైన వెంటనే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ) కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. నీట్ యూజీ పరీక్షలు అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కౌన్సిలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. విద్యార్థులు మెరిట్ ర్యాంకులు ఆధారంగా దేశంలో వివిధ వైద్య కళాశాలలో సీట్లు కేటాయించడం జరుగుతుంది. 

గతేడాది 2025లో మే 4 జరిగిన పరీక్ష ఫలితాలు జూన్ 14లో విడుదలవగా.. జూలై 21 నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా అదే తరహాలో స్టడీ సైకిల్ గా పెట్టుకొని అధికారులు శ్రమిస్తున్నారు.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు..త్వరలోనే భారీగా పెరగనున్న జీతాలు..ఎంత పెరుగుతాయంటే?

Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్..వారంలో రెండు రోజులు సెలవులు..ఎప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

ఉపాధి హామీ స్థానంలో వీబీ జీ రాం జీ.. ఆంధ్రప్రదేశ్‌లో అట్టహాసంగా ప్రారంభం

Koduru, Andhra Pradesh:

ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీ రాం జీ) చట్టం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేశారు. ఈ పథకాన్ని కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ప్రారంభించారు. వీబీ జీ రాం జీ చట్టంలో గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రజల అభివృద్ధితోపాటు రైతుల కోసం ప్రత్యేక కార్యాచరణ ఉంటుందని ప్రజాప్రతినిధులు వెల్లడించారు.

ఏపీలోని తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పరిధిలోని ముక్కావారిపల్లెలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా వీబీ జీ రాం జీ పథకాన్ని ప్రారంభించారు. వీజీ జీ రాం పథకంలో భాగంగా ఫారం పాండ్‌కు శుంకుస్థాపన చేశారు. అనంతరం వీబీ జీ రాం జీ పథకం కింద కలప ఉత్పత్తి చేసే టేకు, మద్ది, వేప, యూకలిప్టస్ తదితర 10 రకాల మొక్కలను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాటి నీళ్లు పోశారు. పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణతోపాటు పంచాయతీల ఆదాయం పెంచేందుకు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణలో కలప ఉత్పత్తి, వుడ్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

అనంతరం సభా ప్రాంగణానికి సమీపంలో ఏర్పాటుచేసిన మ్యాజిక్ డ్రెయిన్ నమూనాను చూపించి ఆ కాన్సెప్ట్‌ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు అధికారులు వివరించారు. మురుగునీటి నిర్వహణలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న ఆవిష్కరణ 'ఈ మ్యాజిక్ డ్రెయిన్' మొత్తం మూడు లేయర్లలో నిర్మాణాన్ని ప్రదర్శించారు. మ్యాజిక్ డ్రెయిన్లలో ఎర్త్ వర్క్, మొదటి లేయర్‌లో 30 సెంటీమీటర్ల మందంతో వేసిన 100 ఎంఎం కంకర, రెండో లేయర్‌లో వేసిన 40 ఎంఎం కంకర, మూడో లేయర్‌లో వేసిన 20 ఎంఎం కంకరతో నింపనున్నట్టు వివరించారు. మ్యాజిక్ డ్రెయిన్ పని తీరును కేంద్ర మంత్రి, సీఎం వీక్షించారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సాధించిన విజయాల సమాహారంతో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని అతిథులు తిలకించారు. మోడల్ పంచాయతీలు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీలు, జియో ట్యాగింగ్ వంటి పారదర్శక విధానాలతో సాధించిన ప్రగతిని అతిథులంతా వీక్షించారు. అనంతరం వేదిక మీద ఏర్పాటు చేసిన వీబీ జీ రాంజీ శిలాఫలకాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. లబ్దిదారులైన ఉపాధి శ్రామికులకు  వీబీ జీ రాం జీ కార్డులు పంపిణీ చేశారు. అనంతరం ఓపీఈడీ బుక్‌లెట్‌ను ఆవిష్కరించగా.. అనంతరం పోర్టల్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్, సమాచార ప్రసార, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు  సత్యకుమార్ యాదవ్ , అనగాని సత్యప్రసాద్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి  రోహిత్ కన్సాల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి  కాంతిలాల్ దండే, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్  కృష్ణ తేజ తదితరులు ఉన్నారు.

0
0
Report

AP Capital Issue: 12 ఏళ్లు గడుస్తున్నా ఏపీ రాజధానిపై నో క్లారిటీ! రాజధాని లేకపోవడానికి కారణం వాళ్లేనా?

Vijayawada, Andhra Pradesh:

AP Capital Issue News: ఆంధ్రప్రదేశ్ పునవ్యవస్థీకరణ జరిగి 2014 నుంచి ఇప్పటివరకు 12 ఏళ్లు గడుస్తున్నా రాష్ట్రానికి ఒక ఖచ్చితమైన, పూర్తిస్థాయి రాజధాని నగరం రూపుదిద్దుకునే మార్గం కుదరలేదు. రాజకీయ అస్థిరత ప్రభుత్వాలు మారినప్పుడల్లా మారిన విధానాలు, వ్యూహాత్మక లోపాలే ప్రధాన కారణాలుగా వస్తున్నాయి. దీనికి ఏ ఒక్కరిని బాధ్యులు చేయడం కంటే, రెండు వేరువేరు ప్రభుత్వాల పరస్పర అభివృద్ధి నిర్ణయాలను విశ్లేషించాల్సి ఉంటుంది. 

టీడీపీ ప్రభుత్వం (2014-19)
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి మెగాసిటీగా నిర్మించాలని సంకల్పించారు. దాదాపు 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడం ఒక రికార్డు. అయితే సింగపూర్ మాస్టర్ ప్లాన్, గ్రాఫిక్స్, అంతర్జాతీయ డిజైన్ చుట్టూ కథ నడపడంతో ప్రాజెక్టు ప్రారంభం కావడానికి చాలా సమయం పట్టింది. 

తాత్కాలిక భవనాలకే పరిమితం..
ఐదేళ్ల కాలంలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి తాత్కాలిక భవనాలను నిర్మించినప్పటికీ.. శాశ్వత రాజధాని నిర్మాణ పనులు పునాదులు దశలోనే ఉండిపోయాయి. 2019 నాటికి కనీసం ఒక ఐకానిక్ భవనం కూడా పూర్తి కాకపోవడం ప్రతికూలంగా మారింది. 

వైసీపీ మూడు రాజధానుల ప్రయోగం (2019-2024)
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం, చంద్రబాబు కలలో ప్రాజెక్టు అయినా అమరావతిని పూర్తిగా పక్కన పెట్టింది. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అందులో విశాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి నుంచి లెజిస్లెటివ్ క్యాపిటల్, కర్నూలు నుంచి జ్యూడిషల్ క్యాపిటల్.. ఈ విధంగా మూడు రాజధానులు అంశాన్ని వైసీపీ ప్రతిపాదించింది. 

ఈ నిర్ణయం వల్ల అమరావతి పనులు పూర్తిగా ఆగిపోయాయి. అటు విశాఖలోను పనులు సాగలేదు. భూములు ్ఇచ్చిన రైతులు కోర్టుకు వెళ్ళటం, హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు స్టేలతో ఐదేళ్ల కాలం చట్టపరమైన వివాదాలకు సరిపోయింది. దీనివల్ల ఏపీ రాజధాని లేదని గందరగోళం ఏర్పడింది. 

కేంద్ర ప్రభుత్వ వైఖరి..
విభజన చట్టం ప్రకారం రాజధాని ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంది. అయితే అమరావతి ప్రారంభంలో కొంత నిధులు ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. రాష్ట్రంలో రాజధాని మార్పు వివాదం నడుస్తున్న కూడా కేంద్రం అది రాష్ట్ర పరిధిలోని అంశం అని పేర్కొంటూ తటస్థంగా ఉండిపోయింది. 

ప్రస్తుత పరిస్థితి.. 
2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. 'ఏకైక రాజధాని అమరావతి' ప్రాజెక్టు మళ్ళీ పట్టాలెక్కించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి నిధుల సమీకరణం తో పాటు పనులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అయితే ఇదే క్రమంలో ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మరోసారి 'మావిగన్' (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు) అంటూ రాజధాని మార్పు చేయాలని సంకల్పిస్తున్నారు. ఇదే నినాదంతో తాము ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే మళ్లీ రాజధానిని మారుస్తుందా? కూటమి ప్రభుత్వం వచ్చినా ఎన్నేళ్లకు రాజధాని పనులు పూర్తవుతాయనేది ప్రతి ఏపీ పౌరుడిలో తొలుస్తున్న ప్రశ్న.

చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ఒక ప్రభుత్వం తెచ్చిన ప్లాన్ ను, తర్వాత ప్రభుత్వం రద్దు చేయడం.. ఆపై మళ్ళీ ప్రభుత్వం మారి పాత ప్లాన్‌కే రావటం వల్ల దశాబ్ద కాలం వృథా అయ్యింది. ఈ రాజకీయ ప్రాంతాలు, పాలసీల్లో స్థిరత్వం లేకపోవడమే ఏపీ రాజధానికి ఆలస్యం కావడానికి అసలు కారణం.

Also Read: అమరావతి Vs మావిగన్.. జగన్ 'మావిగన్' సవాలుపై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు..

Also Read: డిప్యూటీ సీఎంను దూషించిన కేసులో ప్రశ్న రావణ్‌కు బెయిల్..గంటలోనే మరో ట్విస్ట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top