సికింద్రాబాద్: బోనాల జాతరకు రావాలని కిషన్ రెడ్డికి ఆహ్వానం
Secunderabad, Telangana:సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, పూజారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 21, 22వ తేదీలలో అత్యంత వైభవంగా బోనాల జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
ఏరువాక పౌర్ణమి రోజు నదిలో కాడెడ్లు మృతి.. గుండెలవిసేలా రైతు దంపతుల రోదన
Kurnool, Andhra Pradesh:Farmer Couple Heart Break: ఏరువాక పండుగ అంటే రైతులు చేసుకునేది. తమకు ఎల్లప్పుడూ వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తున్న పశుపక్ష్యాదులతో ఆనందంగా గడిపే పండుగ ఏరువాక పౌర్ణమి. ఈ పండుగ రోజే తీవ్ర విషాద సంఘటన ఏర్పడింది. తుంగభద్ర నదీ తీరంలో వెళ్తున్న రెండు కాడెడ్లు పొరపాటున నీటిలో పడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన రైతు దంపతులు వాటిని కాపాడేందుకు ప్రయత్నించగా.. అయితే కాడెడ్లు అప్పటికే నీటిలో మునిగిపోయి మృతి చెందాయి. ఈ సంఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటనపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా మంచాలకు చెందిన కురవ సురేష్ వ్యవసాయం చేస్తుంటాడు. వ్యవసాయ పనుల కోసం రెండు కాడెడ్లు ఉన్నాయి. వాటిని ఎంతో అపురూపంగా.. ప్రేమగా చూసుకునేవారు. ఆలనా పాలనా చూసుకుంటూ కాడెడ్లను కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నారు. ఎడ్లకు సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి కావడంతో మంగళవారం పండుగ చేసుకుందామని భావించారు. అయితే తుంగభద్ర నదీ తీరంలో ఈ రెండు కాడెడ్లు నీటిలో పడిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నీటిలో మునిగి అవి మరణించాయి. కాడెడ్లు మృతి చెందడంతో సురేశ్ దంపతులు గుండెలవిసేలా రోదించారు. కుటుంబసభ్యుల్లా ఉన్న ఎడ్లు మృతి చెందడంతో ఆ రైతు దంపతులు రోదించిన విధానం అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు 'ఎక్స్' వేదికగా స్పందించారు.
'పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబసభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది' అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం తనన్నెంతో కలిచివేసిందని తెలిపారు. ఎడ్లు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ వాటి యజమాని కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఇప్పటికే ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాణంలా చూసుకునే ఎడ్లను కోల్పోయిన ఆ కుటుంబానికి కొంత సాయంగా నిలవాలని సూచించినట్లు చెప్పారు.
నేడు సత్యవేడులో పర్యటన
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. మాదనపాలెం సమీపంలోని హీరో మోటోకార్ప్ రెండో గ్లోబల్ పార్ట్స్ సెంటర్కు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఏపీఐఐసీ పరిధిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమిపూజ జరగనుంది. సీఎం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, హెలిపాడ్, వేదిక, రాకపోకల మార్గాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు. నెల్లూరు పర్యటన అనంతరం సాయంత్రం 4:20 గంటలకు హీరో మోటోకార్ప్ హెలిపాడ్కు సీఎం రానున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. శంకుస్థాపన అనంతరం హీరో మోటోకార్ప్ ప్లాంట్ను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీ సిటీ గెస్ట్ హౌస్కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు.
పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబ సభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం నన్నెంతో… pic.twitter.com/ivz4SXAfrU
— N Chandrababu Naidu (@ncbn) June 30, 2026
రైతులకు ఎగ్గొట్టిన రూ.30 వేల కోట్లు ఎప్పుడిస్తావ్ రేవంత్ రెడ్డి?: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Wanaparthy, Telangana:Rythu Bharosa: ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతులు, భూ యజమానులు, రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతులను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. 'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో మృగశిర కార్తె వచ్చినట్లు రైతుబంధు రైతుల ఖాతాల్లో ఠంచనుగా పడిపోయేది. ఒక్కసారి రైతుబంధు వేయడం మొదలైతే ఏ రోజు ఏ రైతు ఖాతాలో, ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు పడతాయో సామాన్య రైతుకు కూడా తెలిసిపోయేది' అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు.
రైతు భరోసా పేరిట మరోసారి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు పీఆర్ స్టంట్లు చేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్ మోసలు వివరిస్తూనే రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఏమేం చేసిందనేది వివరించారు. 'రైతు భరోసా అమలు విషయంలో రేవంత్ సర్కార్ పిల్లిమొగ్గలు వేస్తుంది. ఎకరాకు రూ.15 వేలను రూ.12 వేలకు కుదించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారు. ఒకసారి ఊర్ల వారీగా రైతు భరోసా వేశారు. అది గందరగోళంగా మారడంతో మళ్లీ ఎకరాల వారీగా వేశారు. దానిని కూడా మధ్యలోనే ఆపివేశారు' అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. గత యాసంగిలో అందరు రైతులకు అని చెప్పి రెండెకరాల వరకు వేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు.
'ఇప్పుడు రైతు భరోసా అంటూ మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టింది. రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా వేయడానికి సభల పేరుతో వృథా ఖర్చులు ఎందుకు?' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. పంటల కొనుగోళ్ల విషయంలోనూ ఈ సర్కారు చేతులెత్తేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే అంతే కొంటామని చెప్పి బాధ్యతల నుంచి తప్పుకున్నాడని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా యాప్ రైతులకు శాపంగా మారిందని చెప్పారు. ఈ వైఫల్యాల నుంచి రైతుల దృష్టిని మరల్చడానికి రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ పీఆర్ స్టంట్లు చేస్తోందని విమర్శించారు. రైతులందరికీ రైతు భరోసా వేయాలని, గతంలో ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులు విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఏపీలో బయటపడ్డ మరో బంగారు గని.. టన్నుల కొద్దీ బంగారం నిల్వలు
Thummala, Andhra Pradesh:Jowkala Mines: బంగారానికి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారనుంది. ఏపీలో బంగారం నిక్షేపాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గనులు ప్రారంభమవగా బంగారం మార్కెట్లో ఏపీ బ్రాండ్ హవా కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో మరో చోట కూడా బంగారం గనులు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లా కుప్పంలోనూ బంగారు గనులున్నాయని గుర్తించారు. అంతేకాకుండా సత్యసాయి జిల్లాలో కూడా బంగారం నిక్షేపాలు ఉన్నాయని అధికారులు తేల్చారు.
సత్యసాయి జిల్లాలోని ఎన్పీకుంట మండలం జౌకల ప్రాంతంలో ఖనిజాన్వేషణ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇక్కడ బంగారం నిల్వలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గతంలోనే జౌకల ప్రాంతంలో భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. అయితే ఇక్కడ బంగారం ఎంత మేరకు ఉందో తెలుసుకునేందుకు పరిశోధనలు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. బంగారాన్ని అన్వేషించేందుకు ఆరు ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
జౌకల ప్రాంతంలో మొత్తం ఆరు బ్లాకులు ఉండగా అక్కడ నాలుగు దశల్లో అధికారులు, శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేయనుంది. పరిశోధనలు పూర్తయ్యాక వచ్చే నివేదికలను పరిశీలించి బంగారం నిక్షేపాలపై ఒక స్పష్టత రానుంది. నివేదికలో ఉన్న అంశాల ఆధారంగా అక్కడ తవ్వకాలు చేయాలా? వద్దా? అనేది నిర్ణయానికి వస్తారు. 2015లోనే శ్రీ సత్యసాయి జిల్లా జౌకల ప్రాంతంలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని మినరల్ ఎక్స్ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్ పరిశోధనలు చేసింది.
కర్ణాటకలోని కోలార్ గ్రీన్స్టోన్ బెల్ట్తో ఈ ప్రాంతంతో జౌకల ప్రాంతం పోలి ఉందని.. ఇక్కడ బంగారు నిల్వలు ఉన్నట్లు ట్రస్ట్ సభ్యులు గుర్తించారు. అయితే 2022లో ఈ పరిశోధనలు జీ4 దశలో నిలిచిపోవడంతో బంగారం నిల్వల పరిశోధన ప్రక్రియ నిలిచిపోయింది. జొన్నగిరిలో బంగారు తవ్వకాలు ప్రారంభమైన తర్వాత ఏపీ ప్రభుత్వం జౌకలపై దృష్టి సారించింది. ఆగిపోయిన జీ4 దశ నుంచి మళ్లీ బంగారం నిక్షేపాలపై పరిశోధనలను ప్రారంభించనుంది. పరిశోధనల తర్వాత జౌకల ప్రాంతంలో బంగారు నిల్వలపై ఒక స్పష్టత వస్తుంది. నిక్షేపాలు ఉంటే తవ్వకాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
బంగారం నిల్వలు ఉన్నాయని చెబుతున్న జౌకల వెలిగల్లు గ్రీన్స్టోన్ బెల్ట్ కొత్తపల్లి బ్లాక్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఆరు బ్లాకుల్లో 5,560 హెక్టార్లలో పూర్తిస్థాయి పరిశోధనలు జరగనున్నాయి. 2001లోనే ఇక్కడ ప్రాథమికంగా బంగారం నిక్షేపాల కోసం అన్వేషించగా ఓ సంస్థ పరిశోధన చేసేందుకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత అడుగులు ముందుకు పడలేదు. ఈ ఒక్క జౌకల ప్రాంతం మాత్రమే కాదు రామగిరి, రొద్దం ప్రాంతంలోనూ బంగారు నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో బంగారు నిల్వలు ఉంటే వాటిని వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. ఇదే కాకుండా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బంగారు గనులు ఉన్నట్లు తెలుస్తోంది. గుడుపల్లె మండలం చిగురుగుంట-బిసానత్తం బ్లాక్లో బంగారం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాంతం కర్ణాటకలోని కేజీఎఫ్ ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇక్కడ కూడా బంగారం నిక్షేపాలు ఉంటాయని తెలుస్తోంది. అక్కడ కూడా త్వరలో పరిశోధనలు చేసే అవకాశం ఉంది.
రైతులను నిండా ముంచిన రేవంత్ రెడ్డిది రైతు వంచన ప్రభుత్వం.. హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
Mahbubnagar, Telangana:Harish Rao Challenge: 'తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ కాయితం ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి ఉద్యమం గురించి, త్యాగాల గురించి మాట్లాడుతుంటే నవ్విపోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టు ఉంది ఆయన తీరు' అని అసహనం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజల జోష్ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. జడ్చర్లలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు.
'హైదరాబాద్లో రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ అని పెడుతున్నాడు. అది రైతు ఆశీర్వాద సభ కాదు రైతుల వంచన సభ' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రైతును వంచించుతూనే ఉన్నాడని ఆరోపించారు. 'యాసంగి రైతు బంధు ఎగొట్టి ఇప్పుడు మళ్లీ వానాకాలం రైతుబంధు వేస్తానని మోసం చేస్తున్నాడు. రైతు రుణమాఫీ రూ.2 లక్షలు కాదు కదా రూ.లక్ష లోపు ఉన్నవాళ్లకు కూడా చెయ్యలేదు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నల్గొండలో ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నాడు. ఆ ఒట్టు అనేదానికి ప్రాణం ఉంటే ఈ రేవంత్ రెడ్డి అబద్ధాలకు ఉరేసుకొని ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేది. కనిపించిన దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా దేవుళ్లనే మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. 'పాలమూరు బిడ్డలు స్వచ్ఛమైన పాలలాంటి మనుసున్న బిడ్డలు. రేవంత్ రెడ్డి జూట మాటలు, బట్టెబాజ్ మాటలతో పాలమూరు పరువు తీస్తున్నాడు' అని మండిపడ్డారు.
'ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పిన మనిషి రేవంత్ రెడ్డి. హామీ ఇవ్వక పోయినా ప్రజలకు కావాల్సింది అర్ధం చేసుకొని రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్. రైతుబంధు పేరిట రూ.29, 300 కోట్లు రైతులకు రేవంత్ రెడ్డి బాకీపడ్డాడు. జూపల్లి కృష్ణారావు మతి ఉండి మాట్లాడుతాడో మతి లేక మాట్లాడతాడో అర్ధం కాదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే అన్నారు. ఇప్పుడు కేవలం 7 ఏడు రకాల వడ్లకే అంటున్నారు' అని గుర్తుచేశారు.
'కేసీఆర్ హయాంలో యూరియా కోసం గోదాములు కట్టించి నిల్వ ఉంచాడు. కానీ రేవంత్ రెడ్డి యాపులు అంటూ నాటకాలు చేస్తున్నాడు. అసెంబ్లీలో తరుగు పెడితే తోలు తీస్తానని రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ తెలంగాణలో ఏ ఊరులో అయినా తరుగు లేకుండా ఒక్క బస్తా కొన్నారా? రేవంత్ రెడ్డి ఎంత మంది తోళ్లు తీశాడు?' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. దళారుల చేతిలో, రైస్ మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ అయ్యాడు తప్ప ఎవరి తోలు తియ్యలేదు అని విమర్శించారు.
'కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి వచ్చాక 6 గంటలకు వచ్చింది. రైతుల కరెంటులో కోత పెట్టడానికే రైతు డిస్కం. సోలార్ పవర్ మాత్రమే రైతు డిస్కంలకు కేటాయిస్తారంట. ఒకవేళ అదే జరిగితే పొద్దున్న 9 నుండి సాయంత్రం 4 వరకే కరెంట్ వస్తది. రైతు డిస్కమ్ అనేది రైతు 24 గంటల కరెంటుకి ఉరితాడు అవుతది' అని రైతులను మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. 'కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా రైతు కుటుంబాలకు ఒక ధీమా లెక్క ఉండే. కానీ కేసీఆర్ పోయాక ఒక 6 నెలల నుంచి రైతు బీమా బంద్ అయ్యింది. ఎల్ఐసీకి బీమా డబ్బులను రేవంత్ రెడ్డి కట్టలేదు. 7,600 రైతు కుటుంబాలు రైతు బీమా కోసం ఎదురుచూస్తున్నాయి' అని రేవంత్ రెడ్డి మోసాలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వివరించారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి మోసం చేయని ఒక్క వర్గం లేదు: హరీశ్ రావు
Mahbubnagar, Telangana:Harish Rao vs Revanth Reddy: రైతులకు బాకీపడ్డ రూ.30 వేల కోట్లు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని రైతుల పక్షాన రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పటిలోగా పూర్తి చేస్తావో చెప్పాలని రైతుల పక్షాన నిలదీశారు. 'కేంద్రం కొనుమన్న పంటే కొంటాం, కేంద్రం కొనుమన్న అంతే కొంటాం అని అంటున్న రేవంత్ రెడ్డి మీరు ఉన్నది ఎందుకు. కేంద్రానికి సరెండర్ అయ్యారా? కేంద్రం టార్గెట్ 50 లక్షల మెట్రిక్ టన్నులు. అంతే కొంటే మిగితా రైతుల పరిస్థితి ఏంటి..? వడ్లు కొనే చేతకాని ప్రభుత్వాన్ని రైతులు నమ్ముతారా?' అని ప్రశ్నించారు.
జడ్చర్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల విస్తృత సమావేశం నిర్వహించగా.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు. 'కరోనా వచ్చినా కరువు వచ్చినా కేసీఆర్ హయాంలో రైతు బంధు ఆగలేదు. 11 విడతల్లో రూ.73 వేల కోట్లు కేసీఆర్ రైతుబంధు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చాక వచ్చిన 5 విడతల్లో 3 విడతలు ఎగొట్టాడు. మూడు పంటలకు మూడుసార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు ఇప్పటికే మూడు రైతు బంధులు ఎగ్గొట్టాడు' అని రేవంత్ రెడ్డి మోసాలను బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2021-2022లో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని.. దానితో పోల్చుతే మీరుకొన్నది ఎంత? అని రేవంత్ రెడ్డిని తీసిపడేశారు.
'పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కల్వకుర్తిలో 3 లక్షల 30 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం. నెట్టెంపాడుకు లక్ష 60 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం, భీమాలో లక్ష 70 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం. చెరువులు, కాల్వలు పూర్తి చేసి వలసలను వాపస్ తెచ్చాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చావా?' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
'తుంగభద్ర నది మీద శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా 65 టీఎంసీలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు డ్యాములు కడుతుంటే మన పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంటి?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. 'ఇంటర్లింకింగ్ అఫ్ రివర్స్, ఆల్మట్టి ఎత్తు, అక్రమ ప్రాజెక్టులు తుంగభద్ర, కృష్ణపై కడుతున్న ప్రాజెక్ట్లపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా రేవంత్ రెడ్డి నోరు మూసుకున్నాడు' అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు. తండాలను గ్రామ పంచాయితీలను చేస్తానన్నాడు చేసి చూపించాడు. హైకోర్టు మొట్టికాయలు వేసినా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు. ఫీజు కట్టక పిల్లల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు వారి చదువులు ఆగిపోతున్నాయి' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 'రేవంత్ పాలనలో ఎస్సీ/ఎస్టీలకు అన్యాయం. బీసీలకు అన్యాయం, వృద్ధులకు మోసం, రైతులకు ఢోకా రేవంత్ రెడ్డి మోసం చేయని ఒక్క వర్గం లేదు' అని విమర్శించారు.
'అందాల పోటీలకు వంద కోట్లు ఉంటాయి, ఫ్యూచర్ సిటీకి, నీ మనవడు ఫుట్బాల్ ఆటకు, మూసీకి వందల కోట్లు ఉంటాయి. పిల్లల చదువులకు ఉండవా రేవంత్ రెడ్డి. డబ్బులు లేక కాదు ఇవ్వాలనే మనుసు నీకు లేదు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సంగారెడ్డి పాశమైలారం సిగాచీ ఘటనలో 54 మంది చనిపోతే మనిషికి కోటి రూపాయలు ఇస్తానని ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. 'రూ.200 ఉన్న పింఛన్ను రూ.2000 చేసిన ఘనత కేసీఆర్. రూ.4000 ఇస్తానన్న రేవంత్ రెడ్డి రూపాయి కూడా పెంచలేదు. ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రతి కార్యకార్త ఒక సైనికుడి లాగా పోరాడాలని.. ప్రతి గ్రామంలో రేవంత్ చేస్తున్న స్కాంల మీద, తప్పిన మాట మీద చర్చ పెట్టాలని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 'కొడంగల్లో నరేందర్ రెడ్డి చిత్తూ చిత్తుగా ఓడిస్తే పోయి మల్కాజిగిరిలో 5000 ఓట్లతో గెలిచావు. మల్ల నిన్ను ఇక్కడ ఓడించడం ఖాయం. పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లను గెలిచి తీరుతాం. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు పూర్తి విశ్వాసం ప్రకటించారు.
దమ్ముంటే రాజీనామా చేయాలని అంటున్నారు. నీ అయ్య జాగీరా? రేవంత్ రెడ్డి ఫైర్
Hyderabad, Telangana:Farmers Welfare: 'ప్రభుత్వ ఉద్యోగులకు విడతల వారీగా జీతాలు ఇచ్చారు. కష్టమైనా ఫస్టు తారీఖున జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించా. బడి పిల్లల కూరగాయలు, బట్టలకు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టారు. సర్పంచ్లకు వందల కోట్లు బకాయిలు పెట్టారు. సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధర్నాలు చేశారు. బకాయిలు పెట్టింది బకాసురులు కట్టే పని మాత్రం నాకు పడింది. ఇనుప కంచెలు వేసుకుని నేను లోపల లేను' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
నవాబులం కాదు బీకారులం
హైదరాబాద్ మాదాపూర్లో రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసిన అనంతరం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. బీజేపీతోపాటు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. షేర్వానీ వేసుకుని నవాబు అని చెప్పుకోలేం.. మనం నవాబులం కాదు బీకారులం అని తెలిపారు. 'స్వయం సహాయక మహిళలు బడి పిల్లలకు వండి పెడితే వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వలేదు. హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వలేదు' అని రేవంత్ రెడ్డి బీద అరుపులు అరిచారు. అప్పులతో పాటు అడ్డగోలుగా తప్పులు కూడా చేశాడు.. ఢిల్లీకి పోయే పరిస్థితి లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
చర్చకు సిద్ధమా?
'రైతుల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. చర్చకు సిద్ధమా? పదేళ్లలో మీరు ఏం చేశారో, రెండున్నర యేళ్లలో మేం ఏం చేశామో చర్చకు సిద్ధం' అని బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కాళేశ్వరం కోసం రూ.లక్షా రెండు వేల కోట్లు చెల్లిస్తే రెండేళ్లలో కూలిపోయి కూలేశ్వరం అయింది. డబ్బులు గోదావరిలో కలిసిపోయాయి. ఏ ఊరిలో రైతులు పంటలు పండించినా కాళేశ్వరం నీళ్లతోనే పండాయి అన్నారు. మూడేళ్లలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా 2 కోట్ల 80 లక్షల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండించారు. కేసీఆర్ ఎంత కాలం కాశీ మజలీ కథలు చెపుతావు?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణలో ఆటలు సాగవు
'చిన్న రాక్షసులు బయలుదేరి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెపుతున్నాడు. కేసీఆర్ రావాలని ఎవరు కోరుకుంటున్నారు? రూ.లక్ష రుణమాఫీ చేయలేదు. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు. కోటీ ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు' అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 'ప్రతి పేదవాడి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చెప్పాడు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు.. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి ..వచ్చాయా..?' అని ప్రశ్నించారు. తెలంగాణలో బండి సంజయ్, కిషన్ రెడ్డికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాడని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చే ప్రభుత్వం మాదే అంటున్నాడు.. ఏందీ వచ్చేది.. తెలంగాణలో ఆటలు సాగవు అని హెచ్చరించారు.
'పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.8 వేల కోట్ల బకాయిలు పెట్టిపోయారు. ఆర్టీసీ రూ.వెయ్యి కోట్ల లాభాల్లోకి వచ్చింది.. సింగరేణి లాభాల్లోకి తెచ్చాం. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి తెచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వద్దని ఆటో వాళ్లను రెచ్చగొట్టి ధర్నాలు చేయించే ప్రయత్నం చేశారు. వెయ్యి బస్సులకు మహిళా సంఘాలను యజమానులను చేశాం' అని రేవంత్ రెడ్డి చిట్టా విప్పారు.
నీ అయ్య జాగీరా?
'దమ్ముంటే రాజీనామా చేయాలని అంటున్నారు. నీ అయ్య జాగీరా? నీ తాత గడీలు అనుకుంటున్నావా? గడీల ముందు బానిసలమా రాజీనామా చేయడానికి' అని ప్రతిపక్షాలపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఒక్క నిజం చెప్పితే తలకాయ వెయ్యి వక్కలు అవుతుందన్న శాపం కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నట్లుంది. ఒకరికి మించి ఒకరు అబద్దాలు చెబుతున్నారు. కేసీఆర్ను మించి అబద్దాలు చెపుతున్నారు. బుద్ది మారనంత వరకు దేవుడు వాళ్లను క్షమించరు' అని విమర్శించారు. 'బతుకమ్మ చీరలను జొన్న చేను కాడ పిట్టలు కొట్టడానికి కట్టారు. మేం పెట్టిన చీరలను ఆడబిడ్డలు సంతోషంగా కట్టుకుంటున్నారు' అని తెలిపారు.
రేవంత్ రెడ్డిది రైతు వంచన ప్రభుత్వం.. హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
Hyderabad, Telangana:Harish Rao Slams To Revanth Reddy On Rythu Bharosa Schemeముగిసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడి తెలంగాణ పర్యటన
Baddipadaga, Telangana:BJP National Chief Nitin Nabin Four Days Telangana Tour Endగనులు, ఖనిజ నిల్వలపై సీఎం చంద్రబాబు సమీక్ష
Amaravathi, Andhra Pradesh:AP CM Chandrababu Review On Minerals And Mines In Camp Officeయాదాద్రి ఆలయ నగరిలో మఠాలకు భూముల కేటాయింపు
Hyderabad, Telangana:Lands Allocations For Mathas At Yadadri Laxmi Narasimha Swamy Templeఎల్నినో ప్రభావంతో రైతులు వర్షాలకు తగ్గట్టు పంటలు వేసుకోవాలి: తెలంగాణ సీఎం
Hyderabad, Telangana:Telangana Rythu Bharosa: 'తాము బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ 30 నెలల్లో రైతును ఆత్మగౌరవంతో బతికేలా.. వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో నిండా మునిగింది. మళ్లీ లేవడానికి వీలులేకుండా అప్పులతో మన్ను కప్పారు. అన్ని రకాల అప్పులను తొవ్వితే గుట్టల కొద్దీ బయటపడ్డాయి. అందిన కాడికి చేబదులు తీసుకువచ్చారు' అని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.
ఈ ప్రభుత్వం మీది.. ప్రజలది
'9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద చెల్లిస్తాం.. నగదు సిద్ధం చేశాం. ఈ ప్రభుత్వం మీది.. ప్రజలది. ప్రభుత్వం రైతులది, ఆడబిడ్డలది, నిరుద్యోగులది' అని తెలంగాణ సీఎం ప్రకటించారు. '5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామంటే వద్దని అంటున్నారు. మూసీ వద్దని, మెట్రో వద్దని, రీజనల్ రింగ్ రోడ్డు వద్దని అంటున్నారు. పోర్లు దండాలు పెట్టినా అన్ని పనులు చేస్తా' అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత రైతులదని చెప్పారు.
తెలంగాణను వికాసం వైపు
'30 నెలల్లో సమాజంలో గౌరవం పెంచుకుని , విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నాం. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నాం. తప్పించుకుని తిరగడం లేదు. 25.35 లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద ప్రభుత్వం రాగానే రూ.7 వేల కోట్లు చెల్లించాం. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్లో బకాయిలు పెట్టిపోతే 2023లో చెల్లించాం. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచి ఇప్పటివరకు రూ.27 వేల కోట్లు రైతు ఖాతాల్లో వేశాం. ఈ విడుతతో కలిసి రూ.36 వేల కోట్ల రైతు భరోసా కింద చెల్లించాం' అని రేవంత్ రెడ్డి లెక్కాపద్దుల చిట్టా విప్పారు.
కాంగ్రెస్ పార్టీ పేటెంట్
'ఉచిత కరెంటు ను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉచిత కరెంటుతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తు సంతకం పెట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు అని ఇప్పుడు విమర్శిస్తున్నారు. నెలకు రూ.వెయ్యి కోట్లు ఉచిత కరెంటు కోసం ఖర్చు చేస్తున్నాం. ఇప్పటివరకు రూ30 వేల కోట్లు ఖర్చు చేశాం. సన్న వడ్ల బోనస్ కోసం రూ.4 వేల కోట్ల ఖర్చు చేశాం. మూడున్నర వేల కోట్ల రైతు బీమా కోసం ఖర్చు చేశాం. ఇప్పటివరకు లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. నెలకు రూ.6 వేల కోట్లు ఖర్చు పెట్టాం' అని రేవంత్ రెడ్డి వివరించారు.
అబద్దాల పునాదులపై నడపను
'నేను ఉన్నది ఉన్నట్లు చెపుతా.. చేసేది చెపుతా. కిరీటాలు పెట్టుకోవాలి, వజ్ర వైడూర్యాలు సంపాదించాలని నాకు లేదు. పదవి శాశ్వతం కాదు. మాట శాశ్వతం.. మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అన్న పేరు కోసం ప్రయత్నం. అబద్దాల పునాదులపైన ప్రభుత్వాన్ని నడపను' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'స్వయం సహాయక మహిళలతో 1000 మెగా వాట్ల సోలార్ ప్లాంట్లను పెట్టించాం. రిలయన్స్తో పోటీపడేలా మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించాం. స్వయం సహాయక మహిళల స్టాల్స్ కోసం రూ.1000 కోట్లు విలువ చేసే స్థలాన్ని శిల్పారామంలో కేటాయించాం. యాదయ్య, యాదిరెడ్డి, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్లు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు' అని తెలంగాణ సీఎం గుర్తుచేశారు. ఇప్పటివరకు 30 నెలల్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకున్నారు. ప్రతి శాఖలో ఉద్యోగాలు భర్తీ చేశాం. మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు. 'కాలానికి తగ్గట్లుగా రైతులు వ్యవసాయాన్ని మార్చుకోవాలి. ఈ సారి వర్షాలు పడవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలను బట్టి పంటలు వేసుకోవాలి. 7 రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాం.. డిమాండ్ ఉన్న సన్న వడ్లను వేయాలని రైతులకు చెబుతున్నాం' అని తెలంగాణ సీఎం రైతులకు సూచనలు ఇచ్చారు.
SBI, PNB, కెనరా బ్యాంకుల విలీనం నిజమేనా? కేంద్రం కీలక ప్రకటన..!!
Secunderabad, Telangana:Fact Check: సోషల్ మీడియా వచ్చాక.. ఏది నిజం.. ఏది అబద్దమూ తెలియడం లేదు. ప్రపంచంలో ఏ చిన్న మూలన ఏం జరిగిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. నిజాలతోపాటు అబద్దాలు కూడా అదే రీతిలో వైరల్ అవుతున్నాయి. అందుకే చాలా మందికి ఏ వార్త నిజం.. ఏది నిజం కాదన్న గందరగోళం ఉంటుంది. తాజాగా అలాంటి వార్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలోని మూడు అతిపెద్ద బ్యాంకులు విలీనం కాబోతున్నాయన్న వార్త జోరుగా వైరల్ అవుతోంది. ఇందులో వాస్తవం ఎంతో తెలుసుకుందాం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ .. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కెనరా బ్యాంక్. ఈ మూడు కూడా దేశంలోని అతిపెద్ద బ్యాంకులు. SBI అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అసలు వాస్తవం బయటకు వచ్చింది. ఇలాంటి వార్తలు నమ్మే ముందు అసలు నిజం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది.
సోషల్ మీడియా వేదికలపై ప్రచారంలో ఉన్న గ్రాఫిక్ ఇమేజ్ ఒక ప్రముఖ దినపత్రిలో వచ్చినట్లుగా వార్తను పోలి ఉండే విధంగా కావాలనే క్రియేట్ చేశారని పీఐబీ నిర్ధారించింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా రాసి ఉంది. ఈ ప్రచారంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీన ప్రతిపాదనను కేంద్రం ఆమోదం తెలిపిందన్న ప్రచారం పూర్తి అవాస్తవమని పేర్కొంది. భారత ప్రభుత్వం అలాంటి విలీన ప్రతిపాదనలను పరిశీలించడం లేదని.. ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఆ చిత్రం పూర్తిగా ఫేక్ అని.. ఏ అధికారిక ప్రభుత్వ కమ్యూనికేషన్ ప్రతిబింబించదు అని స్పష్టం చేసింది.
ఇలాంటి ఫేక్ గ్రాఫిక్స్ ను క్రియేట్ చేస్తూ ప్రజల్లో బ్యాంకింగ్ వ్యవస్థను భయాందోళనలు రేకెత్తించే ముఠాలపై, రూమర్స్ స్ప్రెడ్ చేసే వారిపై చట్టపరంగా కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ విభాగం సిద్ధంగా ఉందని సర్కార్ హెచ్చరించింది. కచ్చితమైన సమాచారం కోసం, ఎల్లప్పుడూ ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ http://rbi.org.in ను చెక్ చేయాలని వెల్లడించింది. భారత ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అనుమానాస్పద సమాచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్కు తెలియజేయాలని ఆ ఏజెన్సీ ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో పాటు, తన మొబైల్ నంబర్ ఇమెయిల్ చిరునామాను కూడా షేర్ చేసింది PIB.
An image circulating on social media platforms falsely claims that the Government has approved the merger of Punjab National Bank (PNB), Canara Bank, and State Bank of India (SBI).#PIBFactCheck
❌ This claim is #FAKE.
✅ The Government of India has NOT approved any proposal… pic.twitter.com/0A7gJZznHT
— PIB Fact Check (@PIBFactCheck) June 29, 2026
Also Read: EPFO 3.0: ఇక ATMకెళ్లి పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
విలువైన ఖనిజ నిల్వలు ఎక్కడ ఉన్నాయో మ్యాపింగ్ చేయండి: సీఎం చంద్రబాబు
Amaravathi, Andhra Pradesh:Chandrababu Review: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని చెప్పారు. రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మ్యాపింగ్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా విలువైన ఖనిజాల మార్కెట్ క్యాపిటలైజేషన్కు అవకాశం ఉందని గుర్తుచేశారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు.
బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యుమినా లాంటి వివిధ ఖనిజాలకు విలువ జోడింపు ప్రక్రియ ద్వారా గరిష్టంగా రెవెన్యూను ఆర్జించేందుకు ఆస్కారం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖనిజ ఆదాయం కారణంగానే రెవెన్యూ మిగులు సాధించాయని చెప్పారు. ఖనిజాల వ్యాల్యూ అడిషన్కు సంబంధించి విస్తృతంగా చర్చించి ఓ ప్రత్యేక విధానం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఈ ఖనిజాల విలువ జోడింపు ప్రక్రియ జరిగేలా చూడాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ లాంటి రాష్ట్రాల్లో లభ్యమయ్యే అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్పై క్లస్టర్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టైటానియం, ఇలమనైట్, మోనజైట్ లాంటి హై వాల్యూ మినరల్స్ నిల్వలు ఏ మేరకు ఉన్నాయనే దానిని గుర్తించాలని సూచించారు. ఎలక్ట్రానిక్స్, మాగ్నెట్స్ సహా విలువైన లోహాలను తయారు చేసేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత జరగాలని చెప్పారు. ప్రత్యేకమైన పరికరాల తయారీకి కీలకమైన ఈ లోహాలు అణు ఇంధనం సహా వ్యూహాత్మకంగా దేశానికి కూడా అత్యంత కీలకమని గుర్తుచేశారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని.. మిగతా బ్లాక్స్పై కూడా అధ్యయనం చేయాలని గనుల శాఖకు సూచనలు ఇచ్చారు.
రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్ ఖనిజాలు సహా ఇతర విలువైన ఖనిజాలను గుర్తించినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూలో 18 శాతం మేర వృద్ధి నమోదైనట్టు తెలిపారు. గనుల తవ్వకాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం ఆదేశించారు. ఖనిజ సంపద ద్వారా రాష్ట్రానికి గరిష్ట ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు. ఇసుక తవ్వకాలు, సరఫరాపై కూడా పూర్తి స్థాయి నిఘా ఉంచాలని చెప్పారు. ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలతోపాటు శాటిలైట్ చిత్రాల ద్వారా విశ్లేషించడం, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని వివరించారు. ప్రజల కోసమే ఇసుకపై వెయ్యి కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని వదిలేసి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని.. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ దూకుడు.. ఒకేసారి 28 జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జిల నియామకం
Amaravathi, Andhra Pradesh:BJP Appointments: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ రానున్న రోజుల్లో మరింత బలోపేతం కావాలని.. అత్యధిక స్థానాలు గెలుపొందే వ్యూహం రచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా ఇన్చార్జ్లను బీజేపీ నియమించింది. ఏపీలోని 28 జిల్లాలకు ఇన్ఛార్జిల నియమిస్తూ కాషాయ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడానికి నియమాకాలు చేపట్టినట్లు బీజేపీ తెలిపింది.
సామాజిక సమతూకం
ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కొత్త జిల్లా ఇన్ఛార్జిలను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, బూత్ కమిటీల బలోపేతం, సంస్థాగత విస్తరణ, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, పార్టీ కార్యక్రమాల సమన్వయం వంటి బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జిలు నిర్వహించనున్నారని మాధవ్ వెల్లడించారు. జిల్లా అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, వివిధ మోర్చాల నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కొత్త ఇన్చార్జ్లకు సూచించారు. ఇన్చార్జ్ల నియామకంలో పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమతూకం పాటించి ఇన్చార్జ్ బాధత్యలు అప్పగించారు.
పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు
పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని పీవీఎన్ మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జిలు స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ సంస్థాగత కార్యక్రమాలను వేగవంతం చేయాలని కొత్త ఇన్చార్జ్లకు సూచించారు. పార్టీ విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని ప్రకటించారు.
జిల్లా ఇన్ఛార్జిల వివరాలు
పార్వతీపురం మన్యం: పోలిమేర శ్రీనివాసరావు
అల్లూరి సీతారామరాజు: పుట్ట గంగయ్య
పోలవరం: గాడే శ్రీనివాసరావు
శ్రీకాకుళం: రవీందర్ రెడ్డి మేడపాటి
విజయనగరం: ఎన్. విజయానంద రెడ్డి
విశాఖపట్నం: రెడ్డి పావని
అనకాపల్లి: ఏపీఆర్ చౌదరి
కాకినాడ: ఆకుల శ్రీధర్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ: కరంకి శ్రీనివాస్
తూర్పు గోదావరి: బుద్ధా లక్ష్మీనారాయణ
పశ్చిమ గోదావరి: శ్రీదేవి రేలంగి
ఏలూరు: రామ్ కుమార్ చిలుకూరి
కృష్ణా: భోగిరెడ్డి ఆదిలక్ష్మి
ఎన్టీఆర్: వెంకట సుబ్బారావు నార్ని (తాతాజీ)
గుంటూరు: వైవీఆర్ మోహన్ (దొరబాబు)
పల్నాడు: తొగంటి శ్రీనివాస్ (జిల్లా ఇన్ఛార్జి), ఆవుల నాగేంద్ర కుమార్ యాదవ్ (జిల్లా కో-ఇన్ఛార్జి)
బాపట్ల: గాజుల వెంకయ్య నాయుడు
ప్రకాశం: జి. భరత్ కుమార్
మార్కాపురం: కొక్కెర శ్రీనివాస్ యాదవ్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు: చంద్రశేఖర్ భీమినేని
తిరుపతి: పీవీ కృష్ణారెడ్డి
చిత్తూరు: కేవీ లక్ష్మీనారాయణ రెడ్డి
అన్నమయ్య: టీడీ వరప్రసాద్
కడప: కొల్లా చిట్టిబాబు
శ్రీ సత్యసాయి: కునిగిరి నీలకంఠ
అనంతపురం: బెస్త చంద్రప్ప
కర్నూలు: సందిరెడ్డి శ్రీనివాసులు
నంద్యాల: పీడీ పార్థసారథి (జిల్లా ఇన్ఛార్జి), అంబిలి కాశీ విశ్వనాథ్ (జిల్లా కో-ఇన్ఛార్జి)
యాదాద్రిలో మఠాలకు భూముల కేటాయింపు.. ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సీఎం కీలక ఆదేశాలు
Yadagirigutta, Telangana:Yadadri Temple: తెలంగాణ పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో పలు మఠాలు కొలువుదీరనున్నాయి. ఆలయ నగరిలో వివిధ మఠాలకు భూములు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మఠాలకు భూముల కేటాయింపునకు సంబంధించి స్పష్టమైన విధానం రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూ యాజమాన్యపు హక్కులు దేవస్థానానికే ఉండాలని చెప్పారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేశారు. ఆలయం పరిధిలో భూముల కేటాయింపు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు తెలంగాణ సీఎం స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ (చారిటబుల్) ఫౌండేషన్ కోసం మార్కెట్ ధర ప్రకారం భూమిని కేటాయించాలని సీఎం సూచించారు.
యాదాద్రి గుట్టపైన అతిథి గృహాల నిర్మాణం కోసం ముందుకు వచ్చే వారి జాబితా రూపొందించాలని.. అతిథి గృహాల నిర్మాణాల్లోనూ టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడ అనుసరించాలని తెలంగాణ సీఎం తెలిపారు. దశల వారీగా అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపుపైన కూడా స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు.
యాదాద్రి ఆలయ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం భూ సేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని అధికారులకు తెలంగాణ సీఎం ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయం నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను సమగ్రంగా అధ్యయనంచేసి వారంలో నివేదిక ఇవ్వాలని కోరారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేయాలని అధికారులకు చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు నరేందర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్, ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితోపాటు దేవాదాయ, ఆర్థిక శాఖ అధికారులు, లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు.
