కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద ఉస్మానియా అలైడ్ సైన్స్ విద్యార్థులు నిరసన తెలిపారు
కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉస్మానియా అలైడ్ సైన్స్ విద్యార్థుల ప్రదర్శన BSC అలైడ్ సైన్స్ స్టూడెంట్స్ కాలేజ్ యూనివర్శిటీలో సరైన టీచింగ్ స్టాఫ్ లేకపోవడం మరియు విద్యార్థులను లోనికి అనుమతించకపోవడం వల్ల 860 మంది విద్యార్థులలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. మైదానంలో చాలా అన్యాయం జరుగుతోందని, ఫెయిల్ అయిన 844 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని, బీఎస్సీలో సౌకర్యాలు కల్పించాలన్నారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
KTR Chit Chat: 'వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఫెయిల్ కాదు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్, 136 మున్సిపాలిటీలు గెలిచాం. రేవంత్ సీఎం అయ్యాక.. సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేదు. నేకు ఐరన్ లెగ్ కాదు.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు ఐరన్ లెగ్లు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రేవంత్ సీఎం అయ్యాక.. సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేదని గుర్తుచేశారు.
Also Read: KCR Meeting: రేపు ఏం జరగనుంది? క్లీన్చిట్ ఎమ్మెల్యేలు కేసీఆర్ మీటింగ్కు వెళ్తారా?
రేపు బీఆర్ఎస్ పార్టీ కార్య నిర్వాహక సమావేశం కావడంతో పతెలంగాణ భవన్లో మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'రేవంత్.. ఎవరితో ఫుట్బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు. నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకుంటాను. రేవంత్ ఇంట్లో మహిళలు, పిల్లలను, మనమడి గురించి నేను మాట్లాడను. రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబసభ్యుల విషయంలో నేను చిల్లర రాజకీయాలు చేయను' అని కేటీఆర్ తెలిపారు. 'కేసీఆర్ రేపు అన్ని విషయాలపై దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేపడతామని పేర్కొన్నారు. 'రేవంత్ రెడ్డి సర్కార్కు హనీమూన్ ముగిసింది. ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు. కేసీఆర్ బహిరంగ సభలపై రేపటి సమావేశంలో నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ప్రెస్మీట్ పెట్టి.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామనటం పెద్ద కామెడీ. రేవంత్ చెప్తోన్న 66శాతం నిజమైతే.. పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బైపోల్స్కు రావాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.
Also Read: Tomorrow School Holiday: విద్యార్థులకు లక్కీ హలీడే.. రేపు అన్నీ స్కూళ్లకు సెలవు!
'పంచాయతీ ఎన్నికల దెబ్బకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఇప్పడు నిర్వహించరు. మొదట మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రేటర్లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదు. గ్రేటర్ను మూడు కార్పొరేషన్లు చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. అయితే గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై రేవంత్ రెడ్డికి స్పష్టత లేదు. 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం పక్కా' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'ఫార్ములా, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఏమీ లేదని రేవంత్ కు అర్థమైంది. రేవంత్ పాలనకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే సూచిక. రేవంత్ రెడ్డి దెబ్బకు పరిశ్రమలు ఆంధ్రకు వెళ్ళిపోతున్నాయి. విరూపాక్ష అనే కంపెనీ కర్నూలుకు వెళ్లిపోయింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. టైం కోసం ఎదురుచూస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వమని చెప్పటానికి రేవంత్ ఎవరు?' అని మీడియాతో కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read: KTR Challenge: ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ దమ్మున్న సవాల్
'పార్లమెంట్ ఎన్నికల్లో 50శాతం, అసెంబ్లీ ఎన్నికల్లో 30శాతం సీట్లు బీసీలకు ఇచ్చాం. రేవంత్ రెడ్డి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ యార్డ్లు బీసీలకు ఇచ్చింది మేము. రాజకీయం వేరే.. విద్యా, ఉపాధిలో బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు? అఖిలేష్ మా పాత దోస్త్. ఫ్రెండ్లీగా ఉంటే.. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు బాధ ఎందుకు?' అని కేటీఆర్ ప్రశ్నించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KCR in Nandi Nagar: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. గత కొంతకాలంగా ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్కే పరిమితమైన ఆయన, మళ్లీ నగరానికి రావడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
ఎర్రవల్లి నుండి నగరానికి..
తన తుంటి ఎముక శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న కేసీఆర్, ఎక్కువ సమయం ఎర్రవల్లి నివాసంలోనే గడుపుతూ పార్టీ కార్యకలాపాలను అక్కడి నుండే పర్యవేక్షిస్తున్నారు. అయితే, తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై దృష్టి సారించేందుకు ఆయన హైదరాబాద్లోని తన నివాసానికి చేరుకున్నారు.
పార్టీ నేతలతో కీలక భేటీలు
కేసీఆర్ రాకతో తెలంగాణ భవన్తో పాటు ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. ఈ క్రమంలో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. తమ అధినేత మళ్లీ ప్రజల మధ్యకు, పార్టీ ఆఫీసుకు వస్తుండటంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఆరోగ్యం, విశ్రాంతి
శస్త్రచికిత్స తర్వాత వైద్యుల సూచనల మేరకు కేసీఆర్ ఇన్నాళ్లూ విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడంతో, మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో వేగం పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఫామ్హౌస్కే పరిమితమయ్యారన్న విమర్శలకు చెక్ పెడుతూ, ఆయన ఇకపై హైదరాబాద్ నుండే అందుబాటులో ఉండనున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.
రాజకీయ ప్రాధాన్యత
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నగరానికి రావడం, అది కూడా కీలక చర్చల కోసం రావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు పోరాటాల గురించి ఆయన త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిసెంబరు 21న బీఆర్ఎస్ కీలక సమావేశం..
తెలంగాణ భవన్లో ఆదివారం అనగా డిసెంబరు 21న బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో నేతలు సమావేశం కానున్నారు. ఈ కీలక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారని తెలుస్తోంది. దీంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల, నదీ జలాల అంశంపై పోరుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వీటిపై కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
Also Read: Carrot Benefits: శీతాకాలంలో రోజూ క్యారెట్ తింటే ఏం జరుగుతుంది? ఆరోగ్యమా!! అనారోగ్యమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Carrot Benefits For Health: శీతాకాలం వచ్చిందంటే చాలు చలితో పాటు రకరకాల ఇన్ఫెక్షన్లు కూడా మన దరిచేరుతుంటాయి. ఈ కాలంలో లభించే అద్భుతమైన కూరగాయల్లో క్యారెట్ ఒకటి. రుచికి తియ్యగా ఉండే క్యారెట్ కేవలం ఆహారం మాత్రమే కాదు, పోషకాల గని కూడా. శీతాకాలంలో ప్రతిరోజూ క్యారెట్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
క్యారెట్లోని ముఖ్యమైన పోషకాలు
క్యారెట్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ (బీటా-కెరోటిన్) కంటి చూపుకు మేలు చేస్తుండగా.. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే క్యారెట్లోని పొటాషియం రక్తపోటును నియంత్రించి.. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Also REad; Coin Under Pillow: నిద్రపోయే ముందు దిండు కింది రూపాయి బిళ్ళ ఉంచితే.. అదృష్టం వస్తుందట..నిజమిదే?
రోజూ క్యారెట్ తినడం వల్ల కలిగే 5 ప్రధాన లాభాలు
1. రోగనిరోధక శక్తి పెంపు
చలికాలంలో వైరల్ ఫీవర్లు, జలుబు, దగ్గు వంటివి వేగంగా వ్యాపిస్తాయి. క్యారెట్లోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడే బలాన్ని ఇచ్చి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
2. కంటి చూపు మెరుగుపడుతుంది
క్యారెట్లో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్ళాక విటమిన్-ఏగా మారుతుంది. ఇది రేచీకటి వంటి సమస్యలను నివారించడమే కాకుండా, కంటి చూపును స్పష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది.
3. మెరిసే చర్మం
శీతాకాలపు చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి, కాంతివిహీనంగా మారుతుంది. క్యారెట్లలోని పొటాషియం చర్మంలో తేమను నిలుపుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సహజమైన మెరుపును ఇచ్చి, మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి.
4. గుండె ఆరోగ్యానికి మేలు
క్యారెట్లో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులోని ఫైబర్ పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది.
5. మెరుగైన జీర్ణక్రియ
క్యారెట్లు ఫైబర్కు మంచి మూలం. వీటిని ప్రతిరోజూ సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
ఎలా తీసుకోవాలి?
క్యారెట్లను పచ్చిగా సలాడ్ లాగా తీసుకోవచ్చు లేదా జ్యూస్ రూపంలో తాగవచ్చు. అయితే, వండిన క్యారెట్ల కంటే పచ్చిగా తినడం వల్ల పూర్తి స్థాయిలో ఫైబర్ అందుతుంది.
(గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు లేదా కొత్త డైట్ ప్రారంభించేవారు వైద్యుని సంప్రదించడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Most Deadly King Cobra Video Watch: ప్రస్తుతం కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు సాహసోపేతమైన పనులు చేస్తున్నారు. డేంజర్ అని తెలిసినప్పటికీ కూడా అలాంటి పనులే చేసి సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. అలాగే మరికొంతమంది అయితే బహిరంగ ప్రదేశాల్లో చేయకూడని పనులు చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత విషపూరితమైన సంస్కృపాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.. దీంతో కొంతమంది పాములతో సాహసం చేసి మరి వాటితో ఆడుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోని ఇప్పుడు వైరల్గా మారింది.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాతో ఆటలాటడం మీరు గమనించవచ్చు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి కూర్చొని కనిపించడం మీరు చూడొచ్చు.. అలాగే అతని మెడలో అత్యంత పొడవైన ప్రమాదకరమైన నాగుపాము కూడా మీరు చూడొచ్చు. ఆ నాగుపాము పడగ విప్పి పొడవుగా కనిపించడం కూడా మీరు గమనించవచ్చు. పడక విప్పి అలాగే నిలబడి కనిపిస్తోంది. అయితే ఆ యువకుడు నెమ్మదిగా పైకి లేస్తూ ఉండడం కూడా మీరు చూడొచ్చు..
ఎంతో నెమ్మదిగా ఆ యువకుడు పామును రెండు చేతుల పట్టుకొని పైకి లేవడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. అలాగే పైకి లేచిన వెంటనే ఆ యువకుడు పాము తో పాటు అటూ ఇటూ తిరగడం కూడా గమనించవచ్చు. అతను మూడు వైపుల పాములు మెడలో వేసుకుని తిరుగుతూనే ఉన్నాడు. అయితే, ఈ సమయంలో పాము ఏమాత్రం అతనిపై దాడి చేయలేకపోయింది. అంతేకాకుండా అతడు ఏ దిక్కున తిరిగితే.. ఆ దిక్కులో పాము కూడా తిరగడం మీరు చూడొచ్చు. ఇలా ఆ ప్రమాదకరమైన పాము మెడకు చుట్టుకొని ఆడుతున్న దృశ్యాలు ఇప్పుడు అందర్నీ షాక్ కు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫేమ్ కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారని సోషల్ మీడియా వినియోగదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో చూసిన చాలా మంది వారి అభిప్రాయాలను కామెంట్లలో తెలుపుతున్నారు. నిజానికి ఆ పాము పెంచుకున్నదై ఉంటుందని.. అందుకే ఆ యువకుడు మెడకు చుట్టుకున్నప్పటికీ పాము ఏమాత్రం దాడి చేయలేక పోయిందని అంటున్నారు. ఇక మరికొంతమంది ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని కామెంట్లలో తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పాములను పట్టుకునే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణానికి ప్రమాదం.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని కోట్ల మందికి పైగా వీక్షించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
EPFO Pension Nomination Rules: ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకోని వారి విషయంలో ఓ సందేహం ఉంటుంది. వివాహితులు అయితే నామినీగా తన భాగస్వామిని ఎంచుకుంటారు. మరి అవివాహితులు ఈపీఎఫ్ లేదా పెన్షన్ లో జమ అయిన డబ్బు ఎవరికి చెందుతున్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా అవివాహిత ఉద్యోగులు తమ సోదరుడు లేదా సోదరిని నామినీని చేయవచ్చా అనే విషయంపై స్పష్టత లేక అయోమయంలో ఉంటారు. ఇలాంటి సందేహాలకు ఎంప్లాయిూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వివరణ ఇచ్చింది.
ఈపీఎఫ్ఓ రూల్స్ ఏం చెబుతున్నాయి?
అవివాహిత ఉద్యోగి తన సోదరుడు లేదా సోదరిని నామినీగా ఎంచుకోవచ్చా. అంటే ఈపీఎఫ్ఓ సమాధానం అవుననే చెబుతోంది. కానీ కొన్ని కండిషన్స్ పెట్టింది. పీఎఫ్, ఈపీఎస్ రెండింటికీ వేర్వేరు నామినేషన్లు అవసరమని ఈపీఎఫ్ఓ నియమాలు స్పష్టం చేస్తున్నాయి. 1952 ఉద్యోగుల భవిష్య నిధి స్కీములోని పేరా 2 జీ ప్రకారం కుటుంబం అనే పదానికి నిర్వచనం ఉంది. పురుష సభ్యుడి విషయంలో భార్య, పిల్లలు, అతనిపై ఆధారపడిన తల్లిదండ్రులు కుటుంబంగా పరిగణిస్తారు. మహిళా ఉద్యోగి విషయంలో భర్త, పిల్లలు, ఆమెపై ఆధారపడిన తల్లిదండ్రులు, భర్తపై ఆధారపడిన తల్లిదండ్రులను కుటుంబంగా లెక్కిస్తారు.
సోదరులు, సోదరీమణుల విషయంలో రూల్స్ ఏం చెబుతున్నాయి?
ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. EPF పథకంలోని పేరా 61(4) ప్రకారం, నామినేషన్ చేసే సమయంలో ఉద్యోగికి కుటుంబం లేకపోతే, అతను లేదా ఆమె సోదరుడు, సోదరి సహా ఎవరినైనా నామినేట్ చేయవచ్చు. అంటే అవివాహితుడిగా ఉండి, పై నిర్వచనం ప్రకారం కుటుంబ సభ్యులు లేని ఉద్యోగి తన తోబుట్టువును నామినీగా పేర్కొనడానికి అర్హుడే అవుతారు. అయితే, ఉద్యోగి వివాహం చేసుకున్న వెంటనే లేదా కుటుంబం ఏర్పడిన వెంటనే, ముందుగా చేసిన నామినేషన్ ఆటోమెటిగ్గా చెల్లుబాటు కాకుండా పోతుంది. అప్పుడు EPFO నిర్వచించిన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరుతో కొత్తగా నామినేషన్ చేయడం తప్పనిసరి అవుతుంది.
పెన్షన్కు సంబంధించిన నియమాలు :
పెన్షన్ విషయంలో కూడా EPFO స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, 1995 లోని పేరా 2(vii) ప్రకారం, కుటుంబం అంటే జీవిత భాగస్వామి, పిల్లలు మాత్రమే. EPSలోని పేరా 16(5)(a) ప్రకారం, ఒక ఉద్యోగి అవివాహితుడిగా ఉండి, జీవించి ఉన్న జీవిత భాగస్వామి లేదా అర్హత కలిగిన పిల్లలు లేకపోతే, అతను తన పెన్షన్ కోసం ఏ వ్యక్తినైనా నామినేట్ చేయవచ్చు. ఇక్కడ కూడా అదే షరతు వర్తిస్తుంది. ఉద్యోగికి తర్వాత కుటుంబం ఏర్పడితే, ఆ నామినేషన్ రద్దు అవుతుంది.
PF, పెన్షన్కు వేర్వేరు నామినేషన్లు అవసరం:
ఒక ఉద్యోగి అవివాహితుడిగా ఉండి, EPFO నిర్వచనం ప్రకారం కుటుంబ సభ్యులు లేకపోతే, అతను లేదా ఆమె తమ సోదరుడు లేదా సోదరిని PFకూ, పెన్షన్కూ నామినేట్ చేయవచ్చు. అయితే PFకి ఒక ఫారం, EPSకి మరో ప్రత్యేక నామినేషన్ ఫారం తప్పనిసరిగా సమర్పించాలి. ఈ విషయంలో చిన్న నిర్లక్ష్యం జరిగినా, భవిష్యత్తులో మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఉద్యోగులు తమ వ్యక్తిగత పరిస్థితులు మారిన వెంటనే నామినేషన్ వివరాలను సకాలంలో అప్ డేట్ చేసుకోవాలి. .
Also Read: PF Interest: మీ పీఎఫ్ అకౌంట్ ఎంత వడ్డీని సంపాదించింది? ఒకే ఒక క్లిక్ తో ఇలా చెక్ చేసుకోండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rare Snakes Video Watch Here: భూమిపై చాలా రకాల వింత జంతువులు నివసిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు వీటికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. కొన్ని జీవులు చూడడానికి ఎంతో భయానకంగా ఉన్నప్పటికీ.. అంత ప్రమాదకరమైన ఉండవు. అయితే, కొన్ని రకాల పాముల జాతులు కూడా చూడడానికి ఎంతగానో భయంకరంగా ఉంటాయి. కానీ ఇవి అంతగా విషాన్ని కలిగి ఉండవు. నిత్యం ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు మనం సోషల్ మీడియాలో తరచుగా చూస్తూ ఉంటాం. మంది పాములు పట్టే క్రమంలో వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నవి కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా కూడా ఓ వీడియో వైరల్ అవుతోంది.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో విషయానికొస్తే.. ఓ వ్యక్తి తన రెండు చేతుల నిండా పాములను తాళ్లలా పట్టుకొని అటు ఇటు తిరగడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ వేలాడుతున్న పాములను వీడియోకు చూపిస్తూ.. ఉండడం కూడా గమనించవచ్చు. అయితే, ఈ వీడియోలో అతడు పట్టుకున్న పాములన్ని బొమ్మ పాముల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని చూసిన చాలామంది ఇవి బొమ్మ పాములని కూడా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇవి అరుదైన జాతికి సంబంధించిన పాములని.. వీటివల్ల మనుషులకు అంతగా ప్రమాదం ఉండదని సమాచారం. అందుకే ఆ యువకుడు తన రెండు చేతుల నిండా పాములను పట్టుకుని ఆడుతూ ఉన్నాడు.
ఈ వీడియో చూసిన కొంతమంది వారి అభిప్రాయాలను కూడా కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆ యువకుడు పట్టుకున్న పాములు ప్రమాదకరమైనవి కాకపోయినప్పటికీ.. వీడియో చూస్తుంటే మాత్రం భయమేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే ఆ వ్యక్తి పాములు పట్టడంలో నైపుణ్యం కలవాడని.. అందుకే ఆ పాములు అతన్ని ఏమీ చేయలేకపోతున్నాయని కామెంట్లు రాస్తున్నారు. ఏది ఏమైనా ఇలా పాములకు హాని కలిగించడం అంత మంచిది కాదని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు..
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో therealtarzan అనే అకౌంటెంట్ షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 98 లక్షల మందికిపైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను చూసి లైక్ చేశారు. అలాగే కొంతమంది ఈ వీడియోను చూసి ఫన్నీగా కామెంట్లు కూడా పెడుతున్నారు. సాధారణంగా ఇలా అడవుల్లో జీవించే అరుదైన వన్యప్రాణులతో ఆడడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి, ఇలా పదుల సంఖ్యలో పాములను అడవుల నుంచి తెచ్చుకునే బదులు, ఇంట్లో ఒకటి లేదా రెండింటిని పెంచుకోవడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Brinjal Side Effects Telugu News: అడవికి రారాజు సింహం అయితే.. కూరగాయలకు రారాజు వంకాయగా చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వంకాయను ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. ప్రతి ఫంక్షన్లో తప్పకుండా వంకాయ కర్రీ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు రోజు వంకాయ కర్రీని తింటూ ఉంటారు. ఇందులో ఫైబర్ తో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి వంకాయకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇతర దేశాల్లో కూడా వంకాయను సలాడ్స్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అయితే, కొంతమందికి వంకాయ మాత్రం చాలా ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అతిగా వంకాయలను తినడం వల్ల ఎన్నో రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు అంటున్నారు. నిజానికి వంకాయ తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
అలెర్జీ:
కొంతమంది ఎక్కువగా అలర్జీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే వీరు కూడా వంకాయకు దూరంగా ఉండాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వంకాయతో పాటు బంగాళదుంప, టమాటో కలిపి వండడం వల్ల వీరికి విషయంగా మారే అవకాశాలున్నాయి. దీంతో అలర్జీ సమస్య మరింత తీవ్రతరం కావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొంతమందిలో ఇలా కలిపి తినడం వల్ల దద్దుర్లతో పాటు తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.
కీళ్ల నొప్పులు:
ఆర్థరైటిస్ నొప్పులతో బాధపడేవారు ఎక్కువగా వంకాయలు తినడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో లభించే కొన్ని మూలకాల వల్ల శరీరంలోని ఈ నొప్పులు పెరిగే అవకాశాలు ఉన్నాయని.. ఇప్పటికే కీళ్ల నొప్పుల మందులు వినియోగిస్తున్న వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో వంకాయలను అతిగా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్తహీనత:
ఈ వంకాయల్లో నాసునిన్ అనే యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఐరన్ లోపం సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు దీనిని తినడం వల్ల మరింత సమస్యకు గురవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఐరన్ గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తాయని.. దీని కారణంగా ఐరన్ లోపం వంటి సమస్యలు తీవ్రతరం అవుతున్నాయని వారంటున్నారు.
మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు:
ఆక్సలేట్లు ఉండే కూరగాయల్లో వంకాయ కూడా ఒకటి. కాబట్టి ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల వంటి సమస్యలతో బాధపడుతున్న వారు దీనిని అతిగా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వంకాయ ను ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలలో రాళ్లను మరింత పెద్దదిగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇతర మూత్రపిండాల సమస్యలకు కూడా దారి తీసే ఛాన్స్ ఉందని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Phool Makhana: ఫూల్ మఖానాలతో ఫుల్ ఆరోగ్యం.. షుగర్ మొత్తం మాయం.. గుండె జబ్బులు పరార్..!
జీర్ణ సమస్యలు:
చాలామందిలో వంకాయ తినడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది శరీరంలోని అధిక ఫైబర్ను పెంచి ప్రేగు సిండ్రోమ్ సమస్యలకు దారితీస్తుంది. దీని కారణంగా జీర్ణవ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. చాలామందిలో అతిగా వంకాయ తినడం వల్ల కడుపు ఉబ్బరంతో పాటు గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కొంతమంది ఆరోగ్య నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే.. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించదు..
Also Read: Phool Makhana: ఫూల్ మఖానాలతో ఫుల్ ఆరోగ్యం.. షుగర్ మొత్తం మాయం.. గుండె జబ్బులు పరార్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EDLI Rules: ప్రైవేట్ ఉద్యోగులకు ప్రావిడెండ్ ఫండ్ ఖాతాలు దీర్ఘకాలికంగా ఆర్థిక భద్రత కల్పిస్తున్నాయి. ఉద్యోగి మరణించిన తర్వాత అవసరమయ్యే నిధుల కోసం పీఎఫ్ లో జమయ్యే మొత్తం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అకౌంట్స్ ను ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. సాధారణంగా నెలకు కనీసం రూ. 15వేల వేతనం ఉన్న సంస్థలో ఉద్యోగంలో చేరిన వెంటనే ఉద్యోగికి పీఎఫ్ అకౌంట్ ప్రారంభం అవుతుంది. ఈ స్కీమ్ ప్రకారం ఉద్యోగి బేసిక్ సాలరీలో 12శాతం ప్రతి నెలా పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. అంతే మొత్తాన్ని కూడా యజమాని తన వాటాగా చెల్లిస్తారు.
అయితే పీఎఫ్ తోపాటు ఈపీఎఫ్ఓ ద్వారా ఉద్యోగులు పెన్షన్, జీవిత బీమా ప్రయోజనాలు కూడా పొందుతారు. ఈ జీవిత బీమా సౌకర్యాన్నే ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని పిలుస్తారు. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగి ఆకస్మాత్తుగా మరణించిన సందర్భంలో ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసాకి కల్పిస్తుంది. ఇప్పుడు ఈడీఎల్ఐ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
EDLI పథకం అంటే ఏమిటి?
ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీము 1976లో ప్రారంభమైంది. EPFOలో నమోదు అయిన ప్రతి ఉద్యోగి ఈ పథకం పరిధిలోకి వస్తారు. ఉద్యోగి సహజ మరణం, అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తు మరణించినప్పుడు, అతని లేదా ఆమె నామినీకి ఒకేసారి బీమా మొత్తాన్ని చెల్లించడం ఈ పథకం లక్ష్యం. ఈ బీమా ప్రయోజనం ఉద్యోగికి కంపెనీతో పాటు కేంద్ర ప్రభుత్వం కలిపి అందిస్తున్న భద్రతగా భావించవచ్చు.
బీమా ఎంత?
ప్రారంభంలో EDLI పథకం కింద గరిష్ట బీమా పరిమితి రూ. 3.60 లక్షలుగా ఉండేది. 2015 సెప్టెంబర్లో EPFO ఈ పరిమితిని రూ. 6 లక్షలకు పెంచింది. ఆ తర్వాత దీన్ని 7లక్షలు చేసింది. ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు మరణించినట్లయితే అతని నామినీకి గరిష్టం 7లక్షల వరకు చెల్లిస్తారు.
భీమా కోసం ఉద్యోగి జీతం నుండి ఎంత కట్ అవుతుంది?
ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి ప్రీమియం కట్ అవ్వదు. ఈ స్కీమ్ కోసం అవసరమైన మొత్తాన్ని సంస్థనే చెల్లిస్తుంది. ఒక ఉద్యోగి సంస్థలో కనీసం ఏడాది పనిచేసి.. ఏదైనా అనుకోని ప్రమాదం, లేదా అనారోగ్య సమస్యతో మరణించినట్లయితే అతని వారి కుటుంబానికి లేదా నామినీకి ఈ స్కీమ్ ప్రయోజనాలు అందుతాయి.
కంపెనీ వాటా ఎంత?
ప్రస్తుతం వ్యవస్థీకృత రంగంలో ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12 శాతం EPF కోసం కట్ అవుతుంది. యజమాని కూడా సమానంగా 12 శాతం తన వాటాగా చెల్లిస్తాడు. యజమాని చెల్లించే మొత్తాన్ని మూడు భాగాలుగా విభజిస్తారు. దీనిలో 3.67 శాతం ఈపీఎఫ్ కు , 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కు కేటాయిస్తారు. అదనంగా EDLI స్కీమ్ కింద 0.50 శాతం వాటాను యజమాని చెల్లించాలి.
ఎలా లెక్కిస్తారు?
EDLI బీమా మొత్తాన్ని లెక్కించడానికి ఉద్యోగి గత 12 నెలల సగటు నెలవారీ వేతనాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. గరిష్టంగా ఈ జీత పరిమితి రూ. 15,000గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని 30తో గుణిస్తే రూ. 4,50,000 వస్తుంది. దీనికి అదనంగా రూ. 2,50,000 బోనస్ జతచేస్తారు. ఇలా మొత్తం EDLI బీమా విలువ రూ. 7,00,000 అవుతుంది.
Also Read: PF Interest: మీ పీఎఫ్ అకౌంట్ ఎంత వడ్డీని సంపాదించింది? ఒకే ఒక క్లిక్ తో ఇలా చెక్ చేసుకోండి..!!
EDLI క్లెయిమ్ చేసేందుకు ఏ పత్రాలు అవసరం?
ఉద్యోగి మరణించిన తరువాత EDLI క్లెయిమ్ కోసం నామినీ లేదా చట్టపరమైన వారసుడు అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఇందులో ఫారమ్ 5IF, ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, పాన్ కార్డు, చట్టపరమైన వారసత్వ ధృవీకరణ పత్రం, మైనర్ తరపున క్లెయిమ్ అయితే సంరక్షకుడి పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, క్యాన్సిల్ చెక్కు, పాస్పోర్ట్ సైజు ఫోటో అవసరం ఉంటుంది.
బీమాను ఎలా క్లెయిమ్ చేయాలి?
EPF సభ్యుడు అకస్మాత్తుగా మరణిస్తే, అతని నామినీ లేదా చట్టపరమైన వారసుడు ఫారమ్ 5IFను పూరించి, మరణ ధృవీకరణ పత్రంతో పాటు సంబంధిత EPFO కార్యాలయానికి సమర్పించాలి. అన్ని వివరాలు సరిగా ఉంటే క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఎంత సమయం పడుతుంది?
క్లెయిమ్ దాఖలు చేసిన తర్వాత అధికారులు పత్రాలను పరిశీలిస్తారు. అన్ని వివరాలు సరైనవని నిర్ధారణ అయినట్లయితే, సుమారు 30 రోజుల్లోపు EDLI బీమా మొత్తాన్ని నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. నామినీ లేకపోతే, చట్టపరమైన వారసుడు ఈ మొత్తాన్ని పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rupee Rebounds Sharply To 89.27 as RBI Intervention: భారత రూపాయి ఇటీవలి రోజుల్లో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ ఇప్పుడు క్రమంగా పుంజుకుంటుకున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రూపాయి విలువను స్థిరంగా ఉంచేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో జోక్యం చేసుకుని.. అమెరికా డాలర్లను భారీగా విక్రయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్బిఐ తీసుకున్న ఈ చర్యల వల్ల డాలర్ల సరఫరా పెరిగి.. రూపాయికి తక్షణ మద్ధతు లభించినట్లయ్యింది. ఇదే తరహాలో ఆర్బిఐ అక్టోబర్, నవంబర్ నెలల్లో కూడా జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు డాలర్ల విక్రయంతో రూపాయి విలువ మరింత పతనం అవ్వకుండా అడ్డుకోవడం లో కేంద్ర బ్యాంక్ ప్రముఖ పాత్ర పోషించింది.
ఇక ఆర్బిఐ జోక్యానికి తోడుగా అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలహీనపడటం, ముడి చమురు ధరలు తగ్గడం కూడా రూపాయికి అనుకూలంగా మారింది. చమురు ధరలు తగ్గుతే.. భారత దిగుమతులపై ఖర్చులు తగ్గుతాయి. దీంతో విదేశీ కరెన్సీపై ఒత్తిడి కొంత మేర పెరుగుతుంది. ఫలితంగా రూపాయి విలువకు బలం చేకూరినట్లవుతుంది. ఈ అంశాల సమిష్టి ప్రభావంతో ఒక దశలో 91 స్థాయిని దాటుతూ చరిత్రలోనే అత్యల్ప స్థాయికి క్షీణించిన రూపాయి.. ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటోంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే రూపాయి డాలర్ తో పోలిస్తే కాస్త మెరుగుదలను చూపించింది. ప్రస్తుతం దాదాపు 89.96 స్థాయికి చేరుకుని బలపడినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే రూపాయి గతంలో ఇంత బలహీనపడేందుకు కారణాలు ఏంటన్న ప్రశ్నకు ఆర్థిక నిపుణులు పలు అంశాలను సూచిస్తున్నారు. ముఖ్యంగా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను వెనక్కి మళ్లించుకోవడం ప్రధాన కారణం అంటున్నారు. ఇటీవల కాలంలో సుమారు 18 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు భారత్ నుంచి బయటకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఇది డాలర్లకు డిమాండ్ పెంచి.. రూపాయిపై ఒత్తిడి పెంచి క్షీణించేందుకు దారితీసింది.
ఇక దీనికి తోడుగా అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు కూడా రూపాయి బలహీనతకు కారణం అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ ఉత్పత్తులపై భారీగా 50 శాతం వరకు సుంకాలు విధించడంతో రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు అనేది పెరిగింది. ఈ పరిణామాల వల్ల దిగుమతుల కోసం డాలర్ల అవసరం మరింత పెరిగి.. దేశీయ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా రూపాయి విలువ క్షీణించేందుకు ఒక కారణంగా మారిందని చెప్పాలి. భారతర్ లో బంగారానికి భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ధరలు పెరిగినప్పుడల్లా పెద్ద మొత్తంలో దిగుమతులు చేయాల్సి వస్తుంది. దీనికోసం అధికంగా డాలర్లను ఖర్చు చేయాల్సి రావడంతో దిగుమతి బిల్లు కూడా భారీగా పెరుగుతోంది. ఫలితంగా వాణిజ్య లోటు ఎక్కువ అవుతుంది. ఈ పరిస్థితి చివరకు రూపాయి విలువను మరింత క్షీణతకు గురిచేస్తుంది.
ఇప్పటికే 91 మార్కును దిగువకు నెమ్మదిగా కదులుతున్న రూపాయి.. రిజర్వ్ బ్యాంక్ చర్యల, అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో కొంత ఊరట లభిస్తోంది. అయితే ఈ పుంజుకోవడం స్థిరంగా కొనసాగాలంటే.. విదేశీ పెట్టుబడులు తిరిగి రావడం, వాణిజ్య లోటు కంట్రోల్లో ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు తగ్గడం కీలకంగా మారనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Karmayogi Awas Yojana 2025: సొంతిల్లు అనేది ప్రతి ఒకరి కల. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు రూపాయి రూపాయి కూడబెట్టేవాళ్లేందరో ఉన్నారు. ముఖ్యంగా సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు నేటి రోజుల్లో సొంతిల్లు అనేది కలగానే మిగులుతోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ సొంతిటి కల నెరవేర్చుకోవడం సవాలుగానే ఉంటుంది. పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలు, మార్కెట్ ధరలకు అనుగుణంగా ఇల్లుకొనుగోలు చేయడం అనేది చాలా మందికి సాధ్యం అవ్వడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చే విధంగా ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ కర్మయోగి ఆవాస్ యోజన 2025 పేరుతో కొత్త గృహ పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నవారితోపాటు రిటైర్ట్ ఉద్యోగులు కూడా ఈ స్కీమ్ ను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.
ఈ స్కీం పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాదు.. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్, ప్రభుత్వ బ్యాంకులు, స్వయంప్రతిపత్తి సంస్థల్లో పనిచేసే సిబ్బందిని కూడా అర్హులుగా చేర్చింది. ఢిల్లీలోని నరేలా సబ్ సిటీలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 1,168 ప్లాట్లను ఈస్కీమ్ కింద విక్రయించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు మార్కెట్ ధరలతో పోల్చినట్లయితే సుమారు 25శాతం తక్కువ తగ్గింపు ధరకే ఇల్లు అందిస్తుండటం ఈ స్కీమ్ ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.
ఇక డీడీఏ అన్ని కేటగిరీ ఫ్లాట్లపై ఈ డిస్కౌంట్స్ అందిస్తోంది. 1BHK, 2BHK, 3BHK ఫ్లాట్లు ఈ స్కీమ్ కింద అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ తర్వాత సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ధర సుమారు రూ. 34లక్షలు ఉంది. డబుల్ బెడ్ రూం అయితే రూ. 80 లక్షలు, త్రిబుల్ బెడ్ రూం లగ్జరీ ఫ్లాట్ అయితే రూ. 1.15కోట్ల నుంచి రూ. 1.27కోట్ల మధ్య ఉండనున్నట్లు డీడీఏ తెలిపింది. ఇవి ప్రస్తుత మార్కెట్ ధరలతో పోల్చినట్లయితే తక్కువగా ఉండటంతో ఉద్యోగుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ స్కీములో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. దరఖాస్తుదారుడికి ఇప్పటికే ఢిల్లీలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇల్లు లేదా స్థలం ఉన్నా కూడా అర్హత కోల్పోరు. అంటే ఇప్పటికే సొంతిల్లు ఉన్నవారు కూడా ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఫ్లాట్లను కూడా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది డీడీఏ.
ఇక ఈ కర్మయోగి ఆవాస్ యోజన 2025 కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 19, 2025 నుంచి ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న అర్హులైన ఉద్యోగులు డిడిఏ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ఈ పథకం కీలక అడుగుగా నిలుస్తోంది. ఇలాంటి గృహ పథకాలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తే ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Gold Price Prediction 2050 in india: బంగారానికి మెరుపు ఎక్కువే.. పరుగు ఎక్కువే. ఎంత ప్రకాశిస్తుందో అంతే వేగంగా పరుగెడుతోంది. బంగారం.. అమ్మో బంగారం అనే స్థాయికి చేరుకుంది. సామాన్య ప్రజలకు బంగారం అంటేనే గుండెలో ఏదోరకమైన దడ పుడుతోంది. డబ్బునొడికి కూడా కాస్త టెన్షనే పెట్టిస్తోంది. 2025లో బంగారం ధరలు దాదాపు 60శాతానికి మించి పెరిగింది. నిజానికి బంగారం అనేది సురక్షితమైన, నమ్మదగ్గ పెట్టుబడి ఆప్షన్ గా పరిగణిస్తుంటారు. దాని ఆకర్షణ, ధర పెరుగుదల పరిమితం కాదు. ఆర్ధిక అనిశ్చితి సమయంలో బంగారం మనకు తోడుగా నిలుస్తుంది. అందుకే గత 25ఏళ్లుగా బంగారం సగటున 14.6శాతం వార్షిక రాబడిని ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. సాంప్రదాయ పొదుపు పథకం లేదా బ్యాంక్ డిపాజిట్ కంటే చాలా ఎక్కువ రెట్లు అనిచెప్పాలి.
గత 25ఏండ్లలో బంగారం ధర ఎంత పెరిగింది?
2000అక్టోబర్ నెలలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 4,400గా ఉంది. 25 సంవత్సరాల తర్వాత అంటే 2025లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1.33 లక్షలకు చేరుకుంది. అంటే ఏడాదికి 14.6శాతం వ్రుద్ది రేటును సూచిస్తుంది. పరుగులు పెడుతున్న బంగారం ధరను ద్రుష్టిలో ఉంచుకుని 25ఏళ్ల తర్వాత మీ పిల్లలు తమ బంగారు ఆభరణాలు ఎంత ధరకు లభిస్తాయని మీరేప్పుడైనా ఆలోచించారా? 25ఏళ్ల తర్వాత అంటే 2025లో 10 గ్రాముల బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసుకుందాం.
2050 నాటికి బంగారం ఎంతకు చేరుకోవచ్చు?
రాబోయే 25ఏండ్లకు బంగారం ధరలు ఈ రేటుతో (14.6 CAGR) పెరిగినట్లయితే.. 10 గ్రాములకు దాదాపు రూ. 40లక్షలు అవుతుంది. మీ దగ్గర రూ. కోటి ఉంటే మీరు 25 గ్రాముల బంగారాన్ని మాత్రమే కొంటారు. అంటే 25 తులాలు మాత్రమే కొనుగోలు చేస్తారు. 25 తులాలు అంటే గాజులు, చిన్న నెక్లెస్, లాంగ్ చైన్, నల్లపూసలు ఇవి మాత్రమే చేయించుకోవచ్చు. అయితే ఈ లెక్కలు కేవలం అంచనాలు మాత్రమే అని గుర్తించుకోండి.
బంగారం ధరలు వడ్డీరేట్లు, డాలర్ స్థితి, కేంద్ర బ్యాంకు విధానాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితి వంటి అనేక దేశీయ, ప్రపంచ అంశాలపై ఆధారపడి, ముడిపడి ఉంటాయి. అందువల్ల 2050లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 40లక్షల కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది.
బంగారం ధర పెరుగుదలకు కారణాలేంటి?
గత 25 సంవత్సరాలుగా, స్టాక్ మార్కెట్ లేదా బాండ్లు వంటి ఆస్తులు తమ ప్రకాశాన్ని కోల్పోయినప్పుడల్లా, బంగారం తన ఉనికిని నిలుపుకుంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి, కరెన్సీ హెచ్చుతగ్గుల సమయంలో పెట్టుబడిదారులకు బంగారం ఎల్లప్పుడూ నమ్మకమైన, సురక్షితమైన స్వర్గధామంగా ఉంటుంది. కేంద్ర బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారుల స్థిరమైన కొనుగోళ్లు కూడా దాని ధరలకు మద్దతు ఇచ్చాయి. అందుకే బంగారం ధరలు భారీగా పెరిగాయి.
ఇల్లు కట్టుకోవాలా? బంగారం కొనుక్కోవాలా?
2050 నాటికి బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 40లక్షలకు చేరుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలా లేదంటే ఇల్లు కట్టుకోవాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత అవసరాలు, ఆర్థిక స్థితి ఆధారంగా తీసుకోవాలంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే మీరు ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటూ స్థిరమైన ఆదాయం కలిగి ఉన్నట్లయితే.. మీరు ముందుగా ఇల్లు కట్టుకోవడం బెస్ట్ అనిచెబుతున్నారు.
ఎందుకంటే ఇల్లు అనేది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు.. జీవన అవసరం. అద్దె ఖర్చు తగ్గడంతోపాటు కుటుంబానికి భద్రత, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒకవేళ ఇప్పటికే స్వంత ఇల్లు ఉన్నవారయితే భవిష్యత్ ఆర్థిక భద్రత కోసమైతే బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎందుకంటే బంగారం ద్రవ్యోల్బణానికి ఎదురుగా నిలిచే ఆస్తిగా భావిస్తారు. దీర్ఘకాలంలో విలువను మరింత పెంచుతుంది. 2050లో రూ. 40లక్షలు అనే సంఖ్య పెద్దగా అనిపించినా.. అప్పటి రూపాయి విలువ తగ్గడం, జీవన ఖర్చులు పెరగడం వంటి అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కేవలం ధర అంచనాల ఆధారంగా మాత్రమే కాకుండా అవసరం, భవిష్యత్ లక్ష్యాలను ద్రుష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
మరో ఉత్తమ నిర్ణయం ఏంటంటే.. మీ దగ్గర ఉన్న డబ్బుతో ఇల్లు కట్టుకుని.. మిగిలిన డబ్బును దశలవారీగా బంగారంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే.. జీవన భద్రతతోపాటు భవిష్యత్ కు ఆర్థిక రక్షణ కూడా సాధ్యం అవుతుంది. ఏది ఏకమైనప్పటికీ ముందుగా గూడు తర్వాతే ఆర్భాటాలు, హంగులు, బంగారాలు.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.