Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500036

గడ్డిఅన్నారం: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Jul 08, 2024 13:23:20
Hyderabad, Telangana
సీజనల్ వ్యాధుల పట్ల డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సూచించారు. సోమవారం డివిజన్ పరిధిలోని కోదండరాం నగర్ లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారం ఆరుబయట వేయద్దని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Feb 15, 2026 07:55:45
Hyderabad, Telangana:

Side Effects of Watermelon: వేసవి కాలంలో పుచ్చకాయ ఒక అద్భుతమైన వరప్రసాదం. శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ, దాహాన్ని తీర్చే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారికి పుచ్చకాయ అమృతంలా కాకుండా విషంలా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయలో 90 శాతం నీరు, విటమిన్ ఎ, సి, బి6, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ, కింది సమస్యలు ఉన్నవారు దీనిని పరిమితంగానే తీసుకోవాలి.

మధుమేహం
పుచ్చకాయలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. డయాబెటిస్ ఉన్నవారు దీనిని అధికంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వైద్యుల సలహా మేరకు స్వల్ప పరిమాణంలోనే తీసుకోవాలి.

జీర్ణకోశ సమస్యలు
పుచ్చకాయలో 'లైకోపీన్' అనే పదార్థం ఉంటుంది. ఇది గుండెకు మంచిదే అయినప్పటికీ, అధికంగా తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు దీనిని మితంగా తినాలి.

కిడ్నీ సమస్యలు
పుచ్చకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా ఇది గుండెకు మంచిదే, కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగితే గుండె లయ తప్పడం, కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తవచ్చు.

ఎలక్ట్రోలైట్ అసమతుల్యత
అతిగా పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో నీటి శాతం విపరీతంగా పెరిగి, సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. దీనిని 'వాటర్ ఇంటాక్సికేషన్' అని పిలుస్తారు. దీనివల్ల కాళ్లలో వాపులు, అలసట, మెదడుపై ప్రభావం పడే అవకాశం ఉంది.

పుచ్చకాయ తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు..
1) రాత్రి సమయంలో పుచ్చకాయ తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. తరచుగా మూత్ర విసర్జన జరగడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
2) కొంతమందికి ఖాళీ కడుపుతో పుచ్చకాయ తింటే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది.
3) రోజుకు 200 నుండి 300 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకపోవడం ఉత్తమం.

గమనిక: పుచ్చకాయ ఆరోగ్యకరమైన పండే అయినప్పటికీ, పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు తమ ఆహారంలో దీనిని చేర్చుకునే ముందు పోషకాహార నిపుణులను సంప్రదించడం మంచిది.

Also Read: MS Dhoni Pension From BCCI: రిటైర్మెంట్ తర్వాత ధోనీ పెన్షన్ ఎంతో తెలుసా? కపిల్ దేవ్, సచిన్, యువరాజ్‌లకు బీసీసీఐ ఎంత ఇస్తుందంటే?

Also Read: India vs Pakistan Preview: టీ20 ప్రపంచకప్‌లో నేడే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్..రెండు జట్ల బలాలు, పిచ్ రిపోర్ట్ వచ్చేసింది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 15, 2026 07:22:39
Dubai, Dubai:

Indian Gold Or Dubai Gold Which Is Better: దుబాయ్ అనగానే గుర్తొచ్చేది ఆకాశహర్మ్యాలు, మెరిసిపోయే బంగారం. భారత్‌తో పోలిస్తే అక్కడ పసిడి ధర తక్కువని, నాణ్యత అధికమని చాలా మంది ప్రయాణికులు దుబాయ్‌లో బంగారం కొనేందుకు ఆరాటపడుతుంటారు. అయితే, కస్టమ్స్ నిబంధనలు, పన్నుల లెక్కలు తెలియకుండా బంగారం కొంటే లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది. 

భారతదేశం కంటే దుబాయ్‌లో బంగారం చౌకగా ఉండటానికి ప్రధాన కారణం అక్కడి పన్ను విధానం. కానీ, దానిని భారత్‌కు తీసుకువచ్చేటప్పుడు ఉండే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.

దుబాయ్‌లో ధర ఎందుకు తక్కువ?
భారత్‌లో బంగారంపై దిగుమతి సుంకం, జీఎస్‌టీ కలిపి పన్ను భారం ఎక్కువగా ఉంటుంది. దుబాయ్‌లో దిగుమతి సుంకాలు తక్కువగా ఉండటం, తయారీ ఖర్చులు తక్కువగా ఉండటంతో అక్కడ గ్రాముపై భారత్ కంటే రూ.300 నుండి రూ.500 వరకు వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.

ఎంత బంగారం తీసుకురావచ్చు?
విదేశాల నుండి వచ్చే భారతీయులకు కస్టమ్స్ శాఖ నిర్దిష్ట పరిమితులను విధించింది. ఈ రాయితీలు మీరు కనీసం ఒక సంవత్సరం విదేశాల్లో నివసిస్తేనే వర్తిస్తాయి. మహిళలు గరిష్టంగా 40 గ్రాముల వరకు (విలువ రూ.1 లక్ష లోపు) పన్ను లేకుండా తీసుకురావచ్చు. అలాగే పురుషులు గరిష్టంగా 20 గ్రాముల వరకు (విలువ రూ.50 వేల లోపు) పన్ను లేకుండా బంగారాన్ని స్వదేశానికి తెచ్చుకోవచ్చు. ఏడాది కంటే తక్కువ వయసున్న చిన్నారులకు ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే ఈ రాయితీ వర్తిస్తుంది. 

ఆభరణాలు vs బిస్కెట్లు: తేడా ఏంటి?
చాలా మంది చేసే తప్పు ఇక్కడే ఉంది. పైన చెప్పిన పన్ను మినహాయింపులు కేవలం బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తాయి. మీరు కాయిన్స్ లేదా బిస్కెట్లు తీసుకువస్తే, మొదటి గ్రాము నుండే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పరిమితికి మించి తెచ్చే బంగారంపై సుమారు 12.5% నుండి 15% వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి రావచ్చు. అప్పుడు దుబాయ్ బంగారం ధర, భారత్ ధరతో సమానమవుతుంది.

మీ వద్ద పరిమితికి మించి బంగారం ఉంటే ఎయిర్‌పోర్టులోని 'రెడ్ ఛానల్' వద్ద అధికారులకు స్వచ్ఛందంగా తెలియజేయాలి. కొనుగోలు చేసిన దుకాణం నుండి ఒరిజినల్ బిల్లులను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ఒకవేళ అధికారులకు చెప్పకుండా దాచి తీసుకువస్తూ పట్టుబడితే, భారీ జరిమానాతో పాటు సెక్షన్ 135 కింద జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది.

అక్కడ కొనడం లాభమేనా?
మీరు పరిమితికి లోబడి (మహిళలైతే 40గ్రా, పురుషులైతే 20గ్రా) కొనుగోలు చేస్తే దుబాయ్ బంగారం కచ్చితంగా లాభదాయకమే. కానీ, భారీ మొత్తంలో కొని పన్నులు చెల్లిస్తే.. ప్రయాణ ఖర్చులు, పన్నులు కలిపి భారత్‌లో కొన్న ధరకే సమానమవుతుంది. కాబట్టి, లెక్కలు చూసుకుని కొనుగోలు చేయడం ఉత్తమం.

Also REad: India vs Pakistan Preview: టీ20 ప్రపంచకప్‌లో నేడే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్..రెండు జట్ల బలాలు, పిచ్ రిపోర్ట్ వచ్చేసింది!

Also Read: School Holiday: విద్యార్థులకు, తల్లీదండ్రులకు గుడ్‌న్యూస్..రేపు సోమవారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..ఉత్తర్వులు జారీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 15, 2026 06:33:00
Colombo, Western Province:

India Vs Pakistan T20 World Cup 2026: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. టీ20 ప్రపంచకప్‌‌లో నేడు అనగా ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ మ్యాచ్ జరగనుంది. దాయాదీ దేశాల మ్యాచ్‌ను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రేజీయస్ట్ మ్యాచ్ శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. అయితే మ్యాచ్‌కు ముందు పిచ్ రిపోర్టు, ఇరు జట్లు బలాబలాల గురించి అంచనాకి వద్దాం.

పాత రికార్డులు ఏంటి?
ఐసీసీ నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ చరిత్రలో టీమ్ఇండియా, పాకిస్థాన్ మధ్య మొత్తం 16 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో 13 మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా.. ఈ క్రమంలో పాకిస్థాన్ జట్టుపై భారత్ ఆధిపత్యం తెలియజేస్తుంది. 

అయితే వీటిలో ఆశ్చర్యం ఏమిటంటే.. జరిగిన మ్యాచ్‌ల్లో 75 శాతం ఛేజింగ్ జట్టు విజయం సాధించడం విశేషం. దీన్ని బట్టి చూస్తే నేడు టాస్ ని బట్టి కూడా గెలుపోటములు ఓ సుమారు అంచనాకు రావొచ్చని అర్థం అనమాట. టాస్ గెలిచిన జట్టుకు మానసికంగానే కాకుండా డ్యూ విషయంలోనూ కలిసొచ్చే అంశం కానుంది. మరోవైపు భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే సాధారణంగా తక్కువ స్కోర్లు నమోదవుతాయి. ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు 159 కాగా.. అత్యల్ప స్కోరు 118 కావడం కొసమెరుపు.

పిచ్ రిపోర్ట్..
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోని పిచ్ సాధారణంగా నెమ్మది స్వభావం కలిగినది. ఈ పిచ్‌పై 200+ స్కోరు చేసిన సందర్భాలు చాలా అరుదు. ఒకవేళ 150 నుంచి 160 మధ్య మొదటి ఇన్నింగ్స్‌లో పరుగులు రాబడితే మ్యాచ్ మరింత టైట్‌గా నడిచే అవకాశం ఉంది.

ప్రేమదాస స్టేడియంలోని పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. మ్యాచ్ కొనసాగే కొద్దీ బ్యాటర్లకు కష్టతరమవుతుందట. అయితే ఈ ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌‌లలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించడం గమనార్హం. అయితే ఈ రోజు టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 

క్రికెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిచ్ నెమ్మదిగా ఉంటే, 150-155 పరుగులు బెస్ట్ స్కోరుగా నిలవనుంది. ముందుగా బ్యాటింగ్ చేసే టీమ్ అదిరిపోయే ఆరంభం పొందగలిగితే మ్యాచ్ కంట్రోల్ చేసేందుకు 160 నుంచి 170 రన్స్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ 175+ స్కోర్ చేస్తే..ఛేజింగ్ జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది. 

అయితే ఈ మ్యాచ్‌ల్లో స్పిన్ బౌలర్లు ప్రధానపాత్ర పోషించే అవకాశం ఉంది. టీమ్ఇండియాలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు. అలాగే పాకిస్థాన్‌ టీమ్‌లో మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్ ఉన్నారు. ఒకవేళ పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు పెద్ద ఇబ్బందిగా మారనుంది. 

Also Read: MS Dhoni Pension From BCCI: రిటైర్మెంట్ తర్వాత ధోనీ పెన్షన్ ఎంతో తెలుసా? కపిల్ దేవ్, సచిన్, యువరాజ్‌లకు బీసీసీఐ ఎంత ఇస్తుందంటే?

Also Read: School Holiday: విద్యార్థులకు, తల్లీదండ్రులకు గుడ్‌న్యూస్..రేపు సోమవారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..ఉత్తర్వులు జారీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 15, 2026 05:50:10
Hyderabad, Telangana:

MS Dhoni Monthly Pension From BCCI: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ క్రికెట్ చరిత్రలో మూడు ఐసీసీ ట్రోఫీలను జట్టుకు అందజేసిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ రికార్డు సృష్టించాడు. 2020లో ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే అందరి ఉద్యోగుల లాగే ధోనీకి కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి నెలా నెలా పెన్షన్ అందుతుంది. అయితే ధోనీ నెలా నెలా ఎంత పెన్షన్ తీసుకుంటున్నాడు. అతనితో పాటు మిగిలిన మాజీ క్రికెటర్లకు ఎంతమేరు ఫించను లభిస్తోందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

క్రికెటర్లలో స్టార్ క్రికెటర్లు కోట్ల కొద్ది సంపాదించినా.. వారికి ప్రకటనల ప్రచారకర్తల ద్వారా ఎంత డబ్బు ముట్టినా.. వారు బీసీసీఐ కాంట్రాక్ట్‌లో పనిచేస్తూ రిటైర్ అయితే వారికి తప్పనిసరిగా పెన్షన్ అందుతుంది. దేశానికి సేవ చేసినందుకు గుర్తుగా వారికి ఈ పెన్షను అందజేస్తారు. టీమ్ఇండియా తరఫున ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా క్రికెటర్ పెన్షన్‌ను బీసీసీఐ నిర్ణయిస్తుంది. 

2022లో బీసీసీఐకి అధ్యక్షత వహించిన సౌరవ్ గంగూలీ నేతృత్వంలో క్రికెటర్ల పెన్షన్‌ను పెంచారు. నిబంధనల ప్రకారం.. 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లకు వారు రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.70,000 పెన్షన్ అందుతుంది. అయితే ఈ క్రమంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన కెరీర్‌లో 90 టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ తరఫున ప్రాతినధ్యం వహించిన క్రమంలో అతనికి అత్యున్నత కేటగిరి పెన్షన్ రూ.70,000 లభిస్తుంది. 

అయితే ధోనీతో పాటు బీసీసీఐ నుంచి నెలకు రూ.70,000 అందుకుంటున్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. వారిలో సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ వంటి స్టార్ ఆటగాళ్లు ఈ లిస్టులో ఉన్నారు.  అలాగే మరికొందరు స్టార్ క్రికెటర్లు అయిన యువరాజ్ సింగ్ ‌కు నెలకు రూ.60,000 పెన్షన్ లభిస్తుంది. వారితో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించిన మాజీ ఆటగాళ్లు, మహిళా క్రికెటర్లకు వారి అనుభవం, మ్యాచ్‌ల సంఖ్యను బట్టి వారికి నెలకు రూ.30,000 నుంచి రూ.45,000 వరకు పెన్షన్ అందజేస్తుంది బీసీసీఐ. 

ఎంఎస్ ధోనీ సాధించిన రికార్డులు ఇవే..
2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, టీమ్ఇండియా క్రికెట్ రూపురేఖలను మార్చేశాడు. ఆయన కెప్టెన్సీలో భారత జట్టు సాధించిన ప్రధాన విజయాలు ఇవే.

1) 2007లో తొలి టీ20 వరల్డ్ కప్ గెలుపు

2) దాదాపుగా 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 2011లో వన్డే వరల్డ్ కప్ కైవసం

3) 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత

4) క్రికెట్‌లో ధోనీ చేసిన కృషికి గాను 2025లో ICC హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవం దక్కింది

ధోనీ తన కెరీర్‌లో మొత్తం 538 అంతర్జాతీయ మ్యాచుల్లో 17,266 రన్స్ రాబట్టాడు. వికెట్ కీపింగ్‌లోనూ ఎందరికో అందని రికార్డులను ఆయన నెలకొల్పాడు.

Also Read: School Holiday: విద్యార్థులకు, తల్లీదండ్రులకు గుడ్‌న్యూస్..రేపు సోమవారం స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..ఉత్తర్వులు జారీ!

Also Read: Hardik Pandya Violation: బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా..పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు లవర్‌తో ఇలా! వేటు తప్పదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 15, 2026 05:20:53
Hyderabad, Telangana:

Sun Venus Saturn Conjunction Effect On Zodiac Telugu: 2026 సంవత్సరం ప్రారంభం నుంచి అనేక గ్రహాలు కదలికలు చేయడమే కాకుండా.. కొన్ని ప్రధాన గ్రహాలు రాశి సంచారం చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైన సంయోగం జరగబోతోంది. ఈ సమయంలో రాహువుతో పాటు బుధుడు శుక్రుడు వంటి ప్రధాన గ్రహాలు కుంభరాశిలో కలిసి ఉండబోతున్నాయి. నిజానికి ఏవైనా రెండు గ్రహాలు కలిస్తేనే ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటిది ఈ నెలలో కుంభరాశిలో చాలా శక్తివంతమైన గ్రహాలు కలయిక జరపడం విశేషం..దాదాపు 120 సంవత్సరాల తర్వాత ఇలా కొన్ని గ్రహాలు కుంభరాశిలో సంయోగం చెందబోతున్నాయి.. ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఫిబ్రవరి 23వ తేదీన కుజుడు వెళ్తాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది.  ఇప్పటికే కొన్ని గ్రహాలు కుంభరాశిలో సంచార దశలో ఉన్నాయి. దీంతో అన్ని గ్రహాలకు కలయిక జరుగుతుంది. దీని ప్రభావం ఈ క్రింది రాశుల వారిపై పడబోతోంది. 

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
వృషభ రాశి 
ముఖ్యంగా కుంభరాశిలో ఈ గ్రహాల కలయిక కారణంగా కెరీర్ పరంగా చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అద్భుతమైన లాభాలు పొందుతారు. చాలా కాలంగా కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో బాధ్యత కూడా విపరీతంగా పెరుగుతుంది.  గౌరవం పెరగడమే కాకుండా ఈ సమయంలో అనేక రకాల లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసే వ్యక్తులకు కొత్త లాభాలు ఎంతో సంతోషాన్ని అందిస్తాయి. ఆరోగ్యం సాధారణంగా మారుతుంది. అలాగే ఇప్పటికే వ్యాయామాలు చేస్తున్నవారు అలాగే కంటిన్యూ చేయడం మంచిది. 

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా వీరికి పెండింగ్లో ఉన్న ప్రతి పని విజయం సాధించే దిశగా ముందుకు సాగుతుంది. అలాగే సామాజిక జీవితం కూడా చాలా బాగుంటుంది. భాగస్వామ్య జీవితంలో సంబంధాలు మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో మానసిక సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాలు అందించబోతోంది.

ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా కలిసి రాబోతోంది. విద్యతో పాటు వృత్తిపరమైన జీవితంలో సానుకూలమైన ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. పాత వివాదాల నుంచి ఎంతో సులభంగా పరిష్కారం లభించబోతోంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం కాబోతున్నాయి. కుటుంబం నుంచి కూడా మంచి మద్దతు కూడా లభించబోతోంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. దీంతోపాటు ఈ సమయంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Also Read:  Mahashivratri 2026: మహా శివరాత్రి ఎప్పుడు..?.. ఉపవాసం, జాగరణ నియామలు ఏంటో తెలుసా..?

మకర రాశి 
మకర రాశి వారికి కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా.. ఈ సమయంలో ఎన్నో రకాల ఆదాయ వనరులు పొందుతారు. పాత ప్రణాళికలు ఆకస్మిక ధన లాభాలను తెచ్చిపెడతాయి. పనుల్లో కష్టపడటం వల్ల ప్రశంసలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో చాలా బాగుంటా. చిన్నచిన్న ఉద్రుక్తతలు వచ్చినప్పటికీ.. ఈ సమయం చాలా బాగుంటుంది. అంతేకాకుండా అవగాహన పరిస్థితులు కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read:  Mahashivratri 2026: మహా శివరాత్రి ఎప్పుడు..?.. ఉపవాసం, జాగరణ నియామలు ఏంటో తెలుసా..?

Also Read: Mahashivratri 2026: మహా శివరాత్రి ఎప్పుడు..?.. ఉపవాసం, జాగరణ నియామలు ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 15, 2026 05:08:38
Jagtial, Telangana:

Mahashivratri 2026 Special Story Telugu: ఈ మహాశివరాత్రి వేళ లోకమంతా హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో మారుమోగుతున్న సమయంలో జగిత్యాల జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్తన భక్తిని వినూత్నంగా చాటుకున్నారు.. మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచంలోనే ఎవరు ప్రయత్నించని రీతిలో.. ఓ చిన్న సూదిపై నాగుపాము పడగ నీడలో కొలువుదీరిన పరమశివుని విగ్రహాన్ని రూపొందించారు. ఇంత సూక్ష్మంగా ఆ స్వామి వారి విగ్రహం చెక్కడం ఇదే మొదటిసారి.. 

సాధారణంగా చాలామందికి సూది కంటికి సరిగ్గా కనిపించదు.. అలాంటిది అతను అదే సూది మనపై ఒక నాగుపాము పడగను విప్పుతున్నట్లు.. ఆ నీడలో శివయ్య ఆశీర్వదిస్తున్నట్లుగా ఉన్న రూపం చాలా అద్భుతంగా చెక్కారు.. ఈ సూక్ష్మ విగ్రహాన్ని కేవలం సూది, నైలాన్ పెన్సిల్ రంగులను ఉపయోగించి తయారు చేసినట్లు ఆయన తెలిపారు.  ఎంతో కష్టపడి.. ఈ చిన్న విగ్రహాన్ని చెక్కినట్లు ఆయన తెలిపారు..

ఈ అద్భుతాన్ని తీర్చిదిద్దడానికి దయాకర్ సుమారు 10 గంటల పాటు కఠినంగా శ్రమించినట్లు తెలుస్తోంది.  అత్యంత ఏకాగ్రతతో కంటిపై ఒత్తిడి పడిన ఏమాత్రం లెక్కచేయకుండా.. అతను ఈ శివలింగ రూపాన్ని మలిచినట్లు  సమాచారం. లోకమంతా మహాశివరాత్రి సంబరాలు జరుపుకుంటున్న వేల.. నా ప్రత్యేకమైన కళ ద్వారా అందరికీ ఆ మహా శివుడి అనుగ్రహం లభించాలని కోరుకుంటూ.. నాగుపాము నీడలో ఉన్న ఈ శివయ్యను ఇంత సూక్ష్మంగా రూపొందించడం ఇదే మొదటి సారి అంటూ.. గుర్రం దయాకర్ తెలిపారు.

గుర్రం దయాకర్ అద్భుతమైన కళాకారుడు.. తన ప్రతిభను గుర్తించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా ప్రత్యేకమైన గౌరవం అందించింది. అంతేకాకుండా గౌరవ డాక్టరేట్ కూడా ఆయన అందుకున్నారు. సూక్ష్మ కళ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటూ.. ప్రతి పండగకు ఇలాంటి వినూత్న కళాఖండాలను సృష్టిస్తూ సమాజాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.. ఇలాంటి విగ్రహాలను ఇప్పటివరకు అతను వందల సంఖ్యలు చెక్కినట్లు తెలుస్తోంది.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 14, 2026 16:01:43
Nunna, Vijayawada, Andhra Pradesh:

School Holiday Tomorrow: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మహాశివరాత్రి మరుసటి రోజును ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ సాధారణ పరిపాలన శాఖ (GAD) ఉత్తర్వులు జారీ చేసింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు రాత్రంతా జాగరణ చేస్తారు. ఈ నేపథ్యంలో మరుసటి రోజున విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. ఫిబ్రవరి 16, 2026 (సోమవారం) మహాశివరాత్రి తర్వాతి రోజున ఆప్షనల్ హాలిడే గా ప్రకటించారు. అంటే, సెలవుల జాబితా ప్రకారం అర్హత ఉన్న వారు ఈ సెలవును వాడుకోవచ్చు.

ఎందుకు ఈ నిర్ణయం?
సాధారణంగా మహాశివరాత్రి నాడు శివాలయాల్లో భక్తులు రాత్రంతా 'లింగోద్భవ కాల' పూజలు, జాగరణలు నిర్వహిస్తారు. రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల మరుసటి రోజున కార్యాలయాలకు లేదా విధులకు హాజరుకావడం ఉద్యోగులకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. భక్తులు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ వెసులుబాటు కల్పించింది.

సెలవుల క్యాలెండర్‌లో మార్పులు
ప్రభుత్వం ప్రతి ఏటా విడుదల చేసే సాధారణ సెలవుల, ఐచ్ఛిక సెలవుల (Optional Holidays) జాబితాలో భాగంగా ఈ అప్‌డేట్‌ను చేర్చారు. ఫిబ్రవరి 15 మహాశివరాత్రి (ఆదివారం) సందర్భంగా సాధారణ సెలవు ఉండగా..  ఫిబ్రవరి 16న శివరాత్రి తర్వాతి రోజు (సోమవారం) ఆప్షన్ హాలీడేని ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఉత్తర్వులతో శివ భక్తులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని, మరుసటి రోజున హాయిగా విశ్రాంతి పొందే అవకాశం కలిగింది. అయితే ఇది ఐచ్ఛిక సెలవు కాబట్టి, ఆయా కార్యాలయాల నిబంధనలకు లోబడి దీనిని వినియోగించుకోవాల్సి ఉంటుంది.

Also Read: Mahashivaratri 2026: మహాశివరాత్రి 2026..శుభ ముహూర్తాలు, పూజా సమయాలు, అభిషేకాలకు అనుకూల సమయం ఇదే!

Also Read: Gold Investment India: భారత్‌లో రూ.452 లక్షల కోట్ల పసిడి..ప్రపంచంలోనే అత్యధికంగా 'బంగారు'కొండలు ఇక్కడే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 14, 2026 14:33:43
Nunna, Vijayawada, Andhra Pradesh:

Free Admission In Private School In AP: ఆంధ్రప్రదేశ్‌లోని పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. విద్యా హక్కు చట్టం (RTE) - 2009 కింద ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్ల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనివల్ల వేల రూపాయల ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడే పేద కుటుంబాలకు తమ పిల్లలను నాణ్యమైన స్కూళ్లలో చదివించే అవకాశం లభిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) కోసం ఒకటో తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 20 నుంచి ఈ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

రిజర్వేషన్ల వివరాలు (25% కోటా)
మొత్తం కేటాయించిన సీట్లలో వివిధ వర్గాలకు కింది విధంగా ప్రాధాన్యత ఉంటుంది. ఎస్సీ (SC) కేటగిరీలో 10 శాతం, ఎస్టీ (ST)కి 4 శాతం, బీసీ మైనారిటీలు & ఇతరులు 6 శాతం,  అనాథలు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలు 5 శాతంగా నిర్ణయించారు.

దరఖాస్తుకు ఉండాల్సిన అర్హతలు
1) గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.20 లక్షల లోపు ఉండాలి.
2) పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.44 లక్షల లోపు ఉండాలి.
3) వయోపరిమితి విద్యార్థికి కనీసం 5 ఏళ్లు నిండి ఉండాలి.
4) స్టేట్ సిలబస్ జూన్ 2, 2020 నుండి మే 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.
5) సీబీఎస్‌ఈ (CBSE) ఏప్రిల్ 1, 2020 నుండి మార్చి 31, 2021 మధ్య జన్మించి ఉండాలి.

అవసరమైన పత్రాలు
దరఖాస్తు సమయంలో కింది సర్టిఫికేట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరి.

దరఖాస్తు ఎలా చేయాలి?
అర్హులైన తల్లిదండ్రులు కింది మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు. మండల విద్యాశాఖ అధికారి (MEO) కార్యాలయంలో దరఖాస్తు చేయవచ్చు. ప్రభుత్వం కేటాయించిన అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలల్లో పెరుగుతున్న ఫీజుల భారం నుంచి పేద తల్లిదండ్రులను రక్షించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైనా సందేహం ఉంటే 1800 425 899 అనే టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

ALso Read; Mahashivaratri 2026: మహాశివరాత్రి 2026..శుభ ముహూర్తాలు, పూజా సమయాలు, అభిషేకాలకు అనుకూల సమయం ఇదే!

Also Read: AP Budget 2026 27: ఏపీ బడ్జెట్ 2026-27..రూ.3,32,205 కోట్లతో భారీ కేటాయింపులు..ముఖ్యాంశాలివే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 14, 2026 14:14:40
Hyderabad, Telangana:

Mahashivratri 2026 Shubh Muhurat: మహాశివరాత్రి 2026 పర్వదినం సందర్భంగా శివ భక్తులు పరమశివుని అనుగ్రహం కోసం వేచి చూస్తున్నారు. ఈ ఏడాది శివరాత్రి ఫిబ్రవరి 15, 16 తేదీల్లో రానుంది. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పూజా ముహూర్తాలు, అభిషేక సమయాలు, పూజా విధానంపై పండితులు అందించిన సమగ్ర సమాచారం తెలుసుకుందాం. శివ-పార్వతుల కళ్యాణం జరిగిన ఈ పవిత్ర దినాన ఉపవాసం, జాగరణ, అభిషేకానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.

ఉపవాసం, పూజా సమయాలు
ఉపవాస కాలం ఫిబ్రవరి 15 సాయంత్రం 5:04 గంటల నుండి ఫిబ్రవరి 16 సాయంత్రం 5:34 వరకు ఉంటుందట. అలాగే ఉపవాస విరామం (పారణ) ఫిబ్రవరి 16 ఉదయం 6:59 నుండి మధ్యాహ్నం 3:24 వరకు ఉంటుంది.

జలాభిషేకానికి శుభ ముహూర్తాలు
శివరాత్రి నాడు శివలింగానికి జలాభిషేకం చేసేందుకు కింది సమయాలు అత్యంత అనుకూలమైనవి.

ఉదయం 6:14 – 7:14
ఉదయం 8:24 – 9:48
ఉదయం 9:48 – 11:11
ఉదయం 11:11 – మధ్యాహ్నం 12:35

అరుదైన యోగాలు - రాజయోగాలు
ఈ ఏడాది శివరాత్రి నాడు 10 పవిత్ర యోగాలతో పాటు కుంభరాశిలో అరుదైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. శివయోగం, సర్వార్థసిద్ధి, లక్ష్మీ నారాయణ రాజయోగం, బుధాదిత్య రాజయోగం, శశ మహాపురుష రాజయోగం. ఇవి భక్తుల జీవితాల్లో సుఖశాంతులను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.

శివలింగ పూజా విధానం
ప్రారంభం: తెల్లవారుజామునే నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి శివ పూజ సంకల్పం చేసుకోవాలి.

అభిషేకం: పంచామృతాలు (పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర), గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తూ "ఓం నమః శివాయ" మంత్రాన్ని జపించాలి.

పత్ర సమర్పణ: మారేడు దళాలు (బిల్వ పత్రాలు), శమీ పత్రాలు, ధత్తూరం, భాంగ్, తెల్లని పూలతో శివుడిని అర్చించాలి.

హారతి: శివరాత్రి కథను చదువుకుని లేదా విన్న తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి.

శివరాత్రి పురాణ విశిష్టత
ఫాల్గుణ కృష్ణ చతుర్దశి నాడు శివ-పార్వతుల వివాహం జరిగిందని, అందుకే ఈ రోజున పూజలు చేస్తే వైవాహిక జీవితం బాగుంటుందని నమ్మకం. సముద్ర మథనం లో పుట్టిన హాలాహలాన్ని మింగి లోకాన్ని రక్షించిన శివుడికి కృతజ్ఞతగా దేవతలు రాత్రంతా జాగరణ చేశారని, ఆ జ్ఞాపకార్థమే శివరాత్రి జాగరణ నిర్వహిస్తారు.

Also Read: AP Budget 2026 27: ఏపీ బడ్జెట్ 2026-27..రూ.3,32,205 కోట్లతో భారీ కేటాయింపులు..ముఖ్యాంశాలివే!

Also Read: Hardik Pandya Violation: బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేసిన హార్దిక్ పాండ్యా..పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు లవర్‌తో ఇలా! వేటు తప్పదా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Feb 14, 2026 13:12:32
Gollet, Telangana:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా యోగా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లాకు పేరు తేవాలని యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కేసరి ఆంజనేయులు గౌడ్, గోలేటి సర్పంచ్ ఏ బాబురావు అన్నారు. శనివారం గోలేటిలోని సి ఈ ఆర్ క్లబ్ లో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాసన ఎంపిక పోటీల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ ఎంపిక పోటీలకు జిల్లాలోని ఆరు మండలాల క్రీడాకారులు పాల్గొన్నారు. ట్రెడిషనల్ యోగాసన, ఆర్టిస్టిక్ యోగాసన, రిథమిక్ యోగాసన అంశాలలో పోటీలు నిర్వహించి క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 21 నుంచి 23 వరకు హైదరాబాదులోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగు సీఎం కప్ యోగాసన పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్ తిరుపతి యోగా గురువు బోయ ఉమారాణి ప్రోగ్రాం కన్వీనర్ కుమ్మరి మల్లేష్ సింగరేణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవితేజ తదితరులు పాల్గొన్నారు.
0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 14, 2026 12:46:15
Hyderabad, Telangana:

 Cobra Video Watch Here: ప్రస్తుతం చాలామంది అడవుల్లో నుంచి జనావాసాలకు సమీపంలోకి వచ్చే పాములను రెస్క్యూ చేసి అడవుల్లో వదిలి పెడుతున్నారు. ఈ సమయంలో స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ప్రాణాలకు తెగించి మరి అత్యంత పెద్ద ప్రమాదకరమైన పాములను కూడా పట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో కాటేయడానికి ప్రయత్నించిన పాముల నుంచి కూడా ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. ఇలాంటి ఘటనాలకు సంబంధించిన అనేక వీడియోలు మనం సోషల్ మీడియాలో తరచుగా చూస్తూ ఉంటారు. తాజాగా కూడా ఓ వీడియోలో ఇదే ఘటన రిపీట్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ స్నేక్ క్యాచర్ అత్యంత ప్రమాదకరమైన నాగుపాముని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో.. అది వెనక్కి తిరిగి కాటేయడానికి ప్రయత్నించడం మీరు వీడియోలో చూడొచ్చు.. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఓ వన్యప్రాణి సంరక్షకుడు సమాచారం మేరకు.. ఘటన స్థలానికి వెళ్ళాడు.. అక్కడ ఆయన ప్రమాదకరమైన నాకు పామును గుర్తించి.. దానిని పట్టుకునేందుకు ప్రయత్నించే సమయంలో ఇది జరిగింది..

ఈ వీడియోలో ఆ ప్రమాదకరమైన నాగుపాము ఒకచోట ఉండడం.. అది కెమెరా వైపు చూస్తూ ఉండడం దాని వెనక ఆ వ్యక్తి పట్టుకోవడానికి ప్రయత్నించడం మీరు చూడొచ్చు.. అయితే, ఇదే సమయంలో ఆ భావం ఒక్కసారిగా అతని వైపు తిరిగి.. దాని తోకను పట్టుకున్న అతని చేతిపై కాటేసేందుకు ప్రయత్నించింది. దీనిని ముందుగానే భావించిన అతను.. వెంటనే ఎంతో జాగ్రత్తని వదిలిపెట్టి చేతులు పైకి చాచాడు.. దీంతో ఆ పాము కాటు బారి నుంచి అతను తప్పించుకోగలిగాడు..

 
 
 
 
 

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.. కాబట్టి వన్యప్రాణి సంరక్షకులు పాములను పట్టుకునే సమయంలో ఒకటికి రెండుసార్లు చూస్తూ పట్టుకోవడం మేలని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పాముకాటుకు గురై తీవ్ర గాయాల పాలైన వారు కూడా ఉన్నారు.. కాబట్టి పాములను పట్టుకునే క్రమంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ.. వాటిని రక్షించడం మంచిది.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన చాలామందికి సోషల్ మీడియా వినియోగదారులు తమ అభిప్రాయాలు కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 14, 2026 12:32:01
Hyderabad, Telangana:

 Cobra On Nandi Video Viral: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలు మహాశివరాత్రి ఒకటి. శివపార్వతుల కళ్యాణం ఇదే రోజు జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే హిందువులంతా.. దీనిని పవిత్రమైన రోజుగా భావించి శివపార్వతులను పూజిస్తారు. ఈరోజు అందరూ భక్తిశ్రద్ధలతో స్వామిని పూజించడమే కాకుండా ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఇక ఈరోజు శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. భారీ ఎత్తున భక్తులంతా శివుడికి సంబంధించిన ఆలయాలను సందర్శించి.. జాగారాలను పాటిస్తూ ఉంటారు. ఇంతటి ప్రత్యేకమైన పండుగకు ముందు రోజే ఓ శివాలయంలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాము నందిపై పడక విప్పి దర్శనం ఇచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. నాగుపాము ఓ చిన్న ఆలయంలో శివలింగం ముందు ఉన్న నందీశ్వరుడిపై పడగవి దర్శనమిచ్చింది. మహాశివరాత్రికి ముందు రోజే ఇలా జరగడం చాలా విశేషమని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. అయితే అక్కడే ఉన్న కొంతమంది భక్తులు వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించగా.. ఓ స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుంది. అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది..

 
 
 
 
 

రెస్క్యూ ఆపరేషన్..
ఓ స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని చూడగా.. ఆ పాము శివలింగం ముందు ఉన్న నందీశ్వరునిపై పడగవిప్పి ఆడుతూ కనిపించింది. అయితే, ఆ యువతి ఆ పాముని పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఆమె ఆ పామును పడుతున్న సమయంలో స్థానికంగా ఉన్న చాలామంది అక్కడికి తరలివచ్చారు. ఆ స్నేక్ క్యాచర్ చాలా నెమ్మదిగా నందీశ్వరుడి పై ఉన్న పామును ఎడమ చేతితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాము తోకను నెమ్మదిగా వెనక్కి లాగి.. దానిని పట్టుకుని ఎందుకు ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో పాము దాడి చేసేందుకు యత్నిస్తుంది..

ఆ నాగుపాము చాలా యాక్టివ్‌గా ఉండడం వల్ల.. పట్టుకునే సమయంలో యువతిపై దాడి చేసే ప్రయత్నం చేస్తోంది. అయితే, ఆ యువతి ఏమాత్రం భయపడకుండా.. ఆ పామును ఎలాగోలా చేత్తో పట్టుకొని.. ఖాళీ ప్రదేశానికి తీసుకువచ్చింది. ఈ సమయంలో ఫామ్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తోంది. దీనిని ముందుగానే గమనించిన ఆ యువతి వెంటనే ఆ పాము తోక పట్టుకొని.. ఒక ప్లాస్టిక్ డబ్బాలో బంధించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 14, 2026 12:18:09
Hyderabad, Telangana:

Nava Panchama Raja Yogam Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మార్చి 9వ తేది చాలా శుభప్రదమైనది. ఎందుకంటే ఈ రోజు బుధుడితోపాటు గృహస్పతి గ్రహం 120 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. ఈ రెండు గ్రహాల ప్రభావంతో ఎంతో శక్తివంతమైన నవ పంచమి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశుల వారు అద్భుతమైన  అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతారు. 

120 డిగ్రీల కోణంలోకి రెండు గ్రహాలు రావడం వల్ల ఎంతో శక్తివంతమైన యోగాలు అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే కొన్ని రాశుల వారికి ఊహించని స్థాయిలో మేలు జరుగుతుంది. అయితే, ఈ సమయంలో ఏర్పడిన నవపంచమి రాజయోగంతో ఆర్థికంగా కూడా చాలా మేలు జరగబోతోంది. ఈ యోగం ఏ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
మేష రాశి 
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బును కూడా తిరిగి పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి అద్భుతమైన ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.

మిథున రాశి 
మిధున రాశి వారికి బృహస్పతి, బుధుడి అద్భుతమైన నవ పంచమి రాజయోగంతో వ్యక్తిగత జీవితం చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో స్వర్ణ యుగం ప్రారంభమవుతుంది. అలాగే ఎలాంటి పనుల్లోనైనా అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు లాభసాటిగా కూడా మారవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.

సింహరాశి 
సింహరాశి వారికి నవ పంచమి రాజయోగం ప్రభావంతో సామాజిక స్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన శుభవార్తలు లభిస్తాయి. పాత పెట్టబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందే అవకాశాలున్నాయి. అలాగే ఈ సమయంలో ఉన్నతాధికారుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందుతారు. 

తులారాశి 
తులారాశి వారికి చాలావరకు అదృష్టం కలిసి రాబోతోంది. ముఖ్యంగా వీరికి ఆధ్యాత్మికతపై ఆసక్తి విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామితో విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

ధనస్సు రాశి 
బృహస్పతి ఎఫెక్ట్‌తో ధనస్సు రాశి వారికి కూడా చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరికి అనుకూలమైన రోజులు రావడం ప్రారంభమవుతాయి. అలాగే సొంత వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి కల కూడా నెరవేరుతుంది. కొత్త స్టార్టప్ ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ప్రయాణాలు చేసిన మంచి లాభాలు పొందుతారు.

Also Read:  Mahashivratri 2026: మహా శివరాత్రి ఎప్పుడు..?.. ఉపవాసం, జాగరణ నియామలు ఏంటో తెలుసా..?

Also Read: Mahashivratri 2026: మహా శివరాత్రి ఎప్పుడు..?.. ఉపవాసం, జాగరణ నియామలు ఏంటో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 14, 2026 10:03:27
Hyderabad, Telangana:

Spa Center Telugu News: నగంలోని మసాజ్‌ సెంటర్ల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార ముసుగును కేపీహెచ్‌బీ పోలీసులు రట్టు చేశారు.. చాలా రద్దిగా ఉండే స్థానిక నివాస ప్రాంతాల మధ్య వెలసిన ఓ వెల్‌నెస్‌ సెంటర్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అధికారిక సమాచారంతో పోలీసులు శనివారం అకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ ఎత్తున నిందుతులు పట్టుబడటంతో పోలీసు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. KPHB పరిధిలోని అసాన వెల్ నెస్ స్పా కేంద్రంగా గత కొన్ని రోజుల నుంచి ఈ దందా కొనసాగుతోంది.. మసాజ్‌ సెంటర్‌ ముసుగులో నిర్వాహకులు ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.. ముఖ్యంగా పురుషులకు యువతులతో క్రాస్‌ మసాజ్‌ చేస్తామంటూ సోషల్ మీడియాల్లో విటులను ఆకర్శిస్తున్నట్లు తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి.. వారికి అధికంగా డబ్బు ఆశచూపి.. ఈ వ్యభిచార రూపంలోకి  దించుతున్నట్లు విచారణలో తెలిసింది. 

Also Read: Sangareddy: అయ్యే.. ఎన్నికల డబ్బులు చోరీ.. మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కిన యువకుడు!

గత కొన్ని రోజులుగా ఈ స్పాపై పోలీసు నిఘా ఉంచిన్నట్లు తెలుస్తోంది.. అయితే, శనివారం మధ్యహ్నం ఆకస్మికంగా లోపలికి ప్రవేశించి.. ప్రత్యేకంగా తనిఖీలు చేశారు. వీరు మసాజ్‌ సెంటర్‌ లోపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదులను చూసి పోలీసులు అధికారులు ఆశ్చర్యపోయారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన మసాజ్‌ సౌకర్యాల కంటే.. అసాంఘిక కార్యకలాపాలకు అనుగుణంగానే ఈ గదులు రూపొందించిన్నట్లు వారు గుర్తించారు. 

ఈ ఆకస్మిక మెరుపు దాడుల్లో పోలీసులు దాదాపు 15 మందికి పైగా యువతులను సురక్షితంగా రక్షించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరిని పునరావాస కేంద్రాలకు కూడా తరిలించిన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులతో పాటు ఇతర సిబ్బంది కలిపి మొత్తం 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందుతుల వద్ద నుంచి స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Also Read: Sangareddy: అయ్యే.. ఎన్నికల డబ్బులు చోరీ.. మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కిన యువకుడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
IPInamdar Paresh
Feb 14, 2026 09:13:24
Hyderabad, Telangana:

 Delhi woman jumps from fourth floor hotel after argument with boy friend: యువతీ, యువకులు ఎక్కడ చూసిన వాలెంటైన్స్ డే సంబరాల్లో మునిగితెలుతున్నారు. కొంత మంది తమ ప్రియమైన వాళ్లతో ఈ రోజు ఎంజాయ్ చేసేందుకు హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్తుంటారు. తమ వారికి లవ్ ను ప్రపోజ్ చేస్తారు. ఇదంతా ప్రతిఏటా జరిగిదే. కొంత మంది ప్రేమను యాక్సెప్ట్ చేస్తే ఆనందంతో పొంగిపోతే, మరికొంత మంది తమ ప్రేమను ఒప్పుకోలేని ఆవేశంతో ఎదుటివారిని చంపడం లేదా ఆత్మహత్యలకు పాల్పడటం చేస్తారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల యువతి ఏకంగా నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకేసింది. 

 

ఢిల్లీలోని ఫర్ష్ బజార్ ప్రాంతంలోని  ఒక హోటల్‌ ఉంది. అందలో యువతి, తన ప్రియుడితో కలిసి నాలుగో అంతస్థులోని గదిలో దిగారు. అయితే.. వీరిద్దరు వాలెంటైన్స్ డేను ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ ఇంతలో వారి మధ్య ఏంగొడవ ఏంజరిగిందో కానీ ఆమె శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హోటల్ విండో నుంచి కిందకు దూకేసింది. ఆమె గటట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు షాక్ అయ్యారు.

ఇంతలో ఆమె లక్ బాగుండి ఆమె నెల మీద కాకుండా అక్కడ ఉన్న కాటున్ డబ్బాలలో పడింది. దీంతో స్వల్పగాయలలో బైటపడింది. వెంటనే ఆమెను స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఆ జంటపై కేసు నమోదు చేశారు.

Read more: Women Beneficiaries: మహిళలకు బంపర్ జాక్‌పాట్.. ఎన్నికల వేళ వారి అకౌంట్‌లో ఏకంగా రూ. 5000లు జమా.. డిటెయిల్స్..

యువతి ప్రేమను యువకుడు రిజక్ట్ చేశాడని అందుకే ఆమె నాలుగో అంతస్తు నుంచి దూకేసిందని అక్కడి వారు చెబుతున్నారు. తనను ఇన్నాళ్లు ప్రేమ పేరుతో మోసం చేశాడని తెలిసి ఈ విధంగా తన ప్రాణాలు తీసుకొవాలని సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెబుతున్నారు. మొత్తంగా దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top