icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Venu Swamy: అందమైన అమ్మాయిల మొగుళ్లు తొందరగా చనిపోతారు.!. రచ్చగా మారిన వేణు స్వామి కామెంట్స్...

Hyderabad, Telangana:

Venu swamy controversy comments on marriages: సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణు స్వామి మరో సారి వార్తలలో నిలిచారు.  ఇప్పటికే నాగార్జున కుటుంబం, ప్రభాస్ పెళ్లి, సమంతపై రచ్చ, రష్మికమందన్నలపై వేణు స్వామి ఏ రెంజ్ లో కాంట్రవర్సీ చేశారో అందరికి తెలిసిందే. ఇక కొన్ని నెలల క్రితం నటి ప్రగతి పతకాలు గెల్చిన కూడా తన క్రెడిట్ అంటూ మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. వేణుస్వామి  వివాదం తెలంగాణ మహిళ కమిషన్ వరకు సైతం వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంట్రవర్సీ జ్యోతిష్యాల జోలికి పోనని కూడా చెప్పారు. కానీ మరల రోటీన్ గా వేణు స్వామిఏదో ఒక కాంట్రవర్సీలతో నిత్యం వార్తలలో ఉంటున్నారు. తాజాగా.. ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారంగా మారాయి.

వేణుస్వామి మాట్లాడుతూ.. అందమైన అమ్మాయిల్ని భార్యలుగా చేసుకున్న వారు తొందరగా చచ్చిపోతారని బాంబు పేల్చారు. వీరిలో చాలా మంది తొందరగా విడిపోవడం లేదా డైవర్స్ లు తీసుకొవడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా అమ్మాయిలు ఎక్కువగా తులసీ మొక్కల లాంటి మంచి వారిని కాదని గంజాయి మొక్కల లాంటి చెడు గుణాల్ని ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడుతారని అన్నారు.  

ఇది కలియుగం అని అందుకు దీని ప్రభావంతో అమ్మాయిలు ఎక్కువగా చెడు గుణాలు ఉన్నవారి పట్ల ఎక్కువగా అట్రాక్ట్ అవుతారని మాట్లాడారు. కొంత మంది పెళ్లిళ్ల సమయంలో జాతకాలు కలవక పోతే పేర్లు మార్చుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారని దీని వల్ల కూడా చాలా దోషాలు వస్తాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

Read more: Ketan Agarwal Death Case: పూణె బిజినెస్ మెన్ ఘటన.. కాబోయే భర్తను చంపిన కిల్లర్ లేడికి చెప్పుల దండ.. వీడియో వైరల్..

దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అమ్మాయిల్ని టార్గెట్ చేసుకుని వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని ఏకీపారేస్తున్నారు. అందరు ఒకలా ఉండరని ఈవ్యాఖ్యలు మహిళల్ని కించపర్చే విధంగా ఉన్నాయని నెటిజన్లు వేణుస్వామిని మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు.

 

0
0
Report

Jagtial: టీచర్‌గా మారిన జగిత్యాల కలెక్టర్.. విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం..

Hyderabad, Telangana:

Jagtial Collector Satya Prasad News: మేడిపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో గురువారం ఒక అద్భుతం జరిగింది. ఎప్పుడూ ఫైళ్లు, అధికారిక సమీక్షలతో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.. ఒక్కసారిగా ఉపాధ్యాయుడి అవతారమెత్తి ఆశ్చర్యపరిచారు. పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థుల మధ్యకు వెళ్లి వారితో ముచ్చటించడమే కాకుండా బ్లాక్‌బోర్డు ముందుకు వచ్చి స్వయంగా పాఠాలు చెప్పి అందరినీ టీచర్స్‌తో పాటు విద్యార్థులను ఆశ్చర్యపరిచారు..

క్లాస్ రూమ్‌లో టీచర్‌గా మారిన కలెక్టర్..
తనిఖీల్లో భాగంగా పాఠశాలలోని తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ సత్యప్రసాద్.. విద్యార్థుల టీచింగ్‌తో పాటు లెర్నీంగ్‌ లెవల్స్‌ను(Learning Levels) స్వయంగా పరీక్షించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల గురించి ఉపాధ్యాయులను ఆరా తీశారు. అనంతరం కాసేపు విద్యార్థులకు గురువుగా మారి సబ్జెక్టుల్లోని పలు అంశాలను సులువుగా వివరించే ప్రయత్నం చేశారు.. కలెక్టర్ స్వయంగా పాఠాలు చెబుతుంటే విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా విన్నారు.. ఆయన అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు అంతే చురుగ్గా సమాధానాలు ఇవ్వడంతో కలెక్టర్ వారిని ప్రత్యేకంగా అభినందించిన్నట్లు తెలుస్తోంది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదని ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఆదేశించారు.

విద్యార్థులతో కలిసి భోజనం..
కేవలం చదువుకే పరిమితం కాకుండా.. విద్యార్థులకు అందుతున్న వసతులను కూడా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించిన్నట్లు తెలుస్తోంది. పాఠశాలలోని వంట గదిని సందర్శించి పరిశుభ్రతను చెక్‌ చేశారు. విద్యార్థులకు నిత్యం మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. అన్నం, కూరల నాణ్యతను స్వయంగా రుచి చూసి పరిశీలించారు.. కలెక్టర్ తమతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం రెట్టింపు అయ్యింది.. పాఠశాల వాతావరణం, భోజన సదుపాయాలపై విద్యార్థుల నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకున్నట్లు సమాచారం..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

అధికారుల సమక్షంలో తనిఖీలు..
కలెక్టర్ చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీలు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక అత్యున్నత స్థాయి అధికారి క్షేత్రస్థాయికి వచ్చి.. విద్యార్థుల్లో ఒకరిగా కలిసిపోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) జీవాకర్ రెడ్డితో పాటు స్థానిక రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Organ Donation: మరణించి ఆరేళ్లు అయినా ఫొటోకి దండ వేయలేదు..చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోసిన హేమంత్ అగర్వాల్!

New Delhi, Delhi:

Zee Media Organ Donation: "కొందరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా.. ఇతరుల రూపంలో ఇక్కడే జీవిస్తూ ఉంటారు" అనే మాటను నిజం చేశారు మీరట్‌కు చెందిన హేమంత్ కుమార్ అగర్వాల్. కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించిన హేమంత్, సుమారు పదేళ్ల క్రితం ఢిల్లీలోని ద్వారకలో తన కలల ఇల్లాంటి ఒక అందమైన ఇంటిని నిర్మించుకున్నారు. కానీ, ఆ సంతోషాన్ని అనుభవించేందుకు విధి ఆయనకు ఎక్కువ సమయాన్ని ఇవ్వలేదు.

ఊహించని మలుపు..
2020, ఫిబ్రవరి 29న హేమంత్‌కు అకస్మాత్తుగా తీవ్ర జ్వరం, వాంతులు అయ్యాయి. మానసిక స్థితిలో మార్పు రావడంతో మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేసిన CT స్కాన్‌లో బ్రెయిన్ హెమరేజ్ (ఇంట్రావెంట్రిక్యులర్ హెమరేజ్) ఉన్నట్లు తేలింది. పరిస్థితి విషమించడంతో వెంటనే గుర్గావ్‌లోని ఆర్టెమిస్ ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మార్చి 12, 2020న వైద్యులు ఆయనను 'బ్రెయిన్ డెడ్'గా ప్రకటించారు.

ఆ తీరని శోకసమయంలో ఆర్టెమిస్ ఆసుపత్రి వైద్యులు, మోహన్ ఫౌండేషన్ కౌన్సిలర్లు అవయవ దానం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తండ్రి ఆశయాలను తెలిసిన కుమార్తె అపూర్వ, కుమారుడు ఆర్యన్‌లతో పాటు భార్య బర్ఖా అగర్వాల్ భారమైన హృదయంతోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. హేమంత్ రెండు మూత్రపిండాలు, కాలేయాన్ని దానం చేశారు. ఆయన కాలేయాన్ని విభజించడం ద్వారా ఒక చిన్నారికి, ఒక వయోజనుడికి పునర్జన్మ లభించింది.

"ఆయన చనిపోయి ఆరేళ్లు గడిచినా, నేను ఇంకా ఆయన ఫోటోకి దండ వేయలేదు. ఎందుకంటే ఆయన ఈ ప్రపంచంలో వేరొకరి రూపంలో ఇంకా బతుకుతూనే ఉన్నారు" అని హేమంత్ అగర్వాల్ కుమార్తె బర్ఖా అగర్వాల్ పేర్కొన్నారు.

అవయవ మార్పిడి: భయాలు - వాస్తవాలు
సమాజంలో అవగాహన లోపం వల్ల అవయవాలు అమ్ముకుంటారనే అపోహలు ఉన్నాయి. కానీ, భారత ప్రభుత్వ పారదర్శక వ్యవస్థ దీనిని పూర్తిగా అడ్డుకుంటుంది. దానం చేసిన అవయవం సరైన వ్యక్తికే చెందుతుందని నమ్మడానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. 

NOTTO (నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్).. దేశంలో ఎక్కడ అవయవ దానం జరిగినా, దాని పూర్తి రికార్డు ఈ ప్రభుత్వ ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లో నమోదవుతుంది. ధనిక, పేద అనే భేదం లేకుండా కేవలం రోగి అనారోగ్య తీవ్రత, రక్త వర్గం (బ్లడ్ గ్రూప్), అవయవాల సరిపోలిక ఆధారంగా మాత్రమే కంప్యూటర్ ఆటోమేటిక్‌గా స్వీకర్తను ఎంపిక చేస్తుంది. ఇందులో మానవ జోక్యం సాధ్యం కాదు.

కఠినమైన చట్టాలు..
మానవ అవయవ మార్పిడి చట్టం (THOA) ప్రకారం, అవయవాల అక్రమ రవాణా, విక్రయాలు పూర్తిగా చట్టవిరుద్ధం. ఏ ఆసుపత్రి లేదా వైద్యుడు స్వచ్ఛందంగా ఎవరికీ అవయవాలను ఇవ్వలేరు. ఎలాంటి ఒత్తిళ్లు, వాణిజ్య లావాదేవీలకు తావులేకుండా ఉండేందుకు దాత, గ్రహీత వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు.

అవయవ దానం గురించి తెలుసుకోవలసిన 6 ముఖ్య విషయాలు..
1) 
ఎవరు దానం చేయవచ్చు?: జీవించి ఉన్నవారు (ఒక మూత్రపిండం లేదా కాలేయంలో కొంత భాగం) లేదా బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత (గుండె, కళ్ళు, కాలేయం, మూత్రపిండాలు) దానం చేయవచ్చు.

2) ప్రక్రియ ఎలా ఉంటుంది?: మీ ప్రియమైన వారికి బ్రెయిన్ డెడ్ అని వైద్యులు ధృవీకరించిన వెంటనే ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించాలి లేదా ప్రభుత్వ హెల్ప్‌లైన్ 1800-11-4770 కు కాల్ చేయవచ్చు.

3) ఖర్చులు ఉంటాయా? 
అవయవ దానానికి ఎలాంటి రుసుము ఉండదు. దాత కుటుంబం నుండి ఎలాంటి అదనపు చికిత్స ఖర్చులు వసూలు చేయరు.

4) మృతదేహానికి గౌరవం 
అవయవాల సేకరణ ఆపరేషన్ అత్యంత గౌరవప్రదంగా జరుగుతుంది. శరీరంపై ఎలాంటి వికృత మచ్చలు పడకుండా జాగ్రత్త వహిస్తారు.

5) అంతిమ సంస్కారాలు: ఆపరేషన్ పూర్తయిన వెంటనే మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.

6) ఒక్కరి నిర్ణయం - ఎందరికో ప్రాణం: ఒకరి అవయవ దానం ద్వారా దాదాపు 8 మంది ప్రాణాలను కాపాడవచ్చు.

జీ మీడియా విజ్ఞప్తి..
భారతదేశంలో ప్రతి ఏడాది అవయవాలు సకాలంలో దొరక్క లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జీ మీడియా చేపట్టిన 'జిందగీ కే బాద్ భీ' అవగాహన ప్రచారంలో భాగస్వామ్యం అవ్వండి. అపోహలను వీడి అవయవ దానానికి ప్రతిజ్ఞ చేయండి. మీ ఒకే ఒక్క నిర్ణయం మరొక కుటుంబంలో వెలుగులు నింపగలదు.

Also Read: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..20 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు..ఆ రోజు నుంచే అమలు!

Also REad: విద్యార్థులకు చుక్కలు చూపిన నీట్ రీ-ఎగ్జామ్..కటాఫ్ భారీగా తగ్గే ఛాన్స్ ఉందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Cobra Video: వాటర్ గన్‌తో కోబ్రాకు స్నానం.. వామ్మో ఓ సారి వీడియో చూడండి!

Hyderabad, Telangana:

 Man Gives Bath To King Cobra Video Watch: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. వాటిలో కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి.. కానీ, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం నెటిజన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. చూసేందుకే ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోలో.. ఒక యువకుడు ఏకంగా అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు వాటర్ గన్‌తో స్నానం చేయించాడు. ప్రస్తుతానికి ఈ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బుసలు కొడుతున్న త్రాచు.. 
సాధారణంగా నాగుపాము పేరు చెబితేనే.. ఎవరైనా సరే ఆమడదూరం వెళ్లిపోతూ ఉంటారు. అలాంటిది ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.. ఒక పెద్ద నాగుపాము ముందు నిలబడిన ఒక యువకుడు, కారు వాష్‌ చేసేందుకు వాడే వాటర్ గన్ చేతపట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు.. అందులో నీళ్లు నింపి.. ఆ పాముపైకి చిమ్మడం మొదలు పెట్టాడు...

సాధారణంగా పాములు తమపైకి ఏదైనా వస్తువు వస్తున్నప్పుడు తీవ్రంగా స్పందిస్తూ ఉండడం మీరు ఇతర వీడియోల్లో చూసి ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది.. ఆ యువకుడు వాటర్ గన్‌తో నీళ్లు కొడుతుంటే, ఆ నాగుపాము కోపంతో ఊగిపోవడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. తన పడగ విప్పి, ఆ యువకుడిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించడం మీరు గమనించవచ్చు. ఒక్కసారిగా ముందుకు దూకుతూ బుసలు కొట్టడం మీరు చూడొచ్చు. అయితే, ఆ యువకుడు మాత్రం ఏమాత్రం భయపడకుండా.. చాలా చాకచక్యంగా వెనక్కి తప్పుకుంటూ మళ్లీ మళ్లీ దానిపై వాటర్‌ గన్‌తో నీళ్లు కొట్టడం మీరు గమనించవచ్చు.

 
 
 
 
 

నెటిజన్ల రియాక్షన్ ఇదే..
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ అయిన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్‌తో పాటు వేలాది లైకులను సొంతం చేసుకుంది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. యమధర్మరాజుతో ఇలాంటి ఆటలు వద్దు సోదరా.. ఒక్కసారి మిస్ అయితే ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని ఒకరు కామెంట్ చేయగా.. వీడికి ధైర్యం ఎక్కువో.. లేక వ్యూస్ కోసం పిచ్చి ఎక్కువో అర్థం కావడం లేదంటూ మరికొందరు మండి పడుతున్నారు..

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

మరికొందరు మాత్రం ఆ పాముకు వేసవి కారణంగా ఎండ తీవ్రతతో పాటు వేడిమి తట్టుకోలేక నీళ్లు పోస్తున్నాడేమో అంటూ జోకులు పేలుస్తున్నారు. ఏదేమైనప్పటికీ, కేవలం సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునే స్టంట్లు చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఈ వీడియోను kaka_caca_petualang అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి షేర్‌ చేశారు. ఇప్పటి వరకు 7 వేల మందికి పైగా లైక్‌ చేసిన్నట్లు తెలుస్తోంది. 

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
0
Report

Viral Video: పుల్ల ఐస్‌క్రీమ్‌లో చనిపోయిన కప్ప.. చూస్తే ఇక జీవితంలో తినరు! వీడియో..

Hyderabad, Telangana:

 Frog Found in Ice Cream Video: వేసవి కాలంలోనో లేదా కాస్త చల్లదనం కోసమో ఐస్‌క్రీమ్ తినడం అందరికీ ఇష్టమే.. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పుల్ల ఐస్ (Ice Candy) అంటే ఎంతగానో ఇష్టపడి తింటూ ఉంటారు.. అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం.. ఇకపై ఐస్‌క్రీమ్ తినే ముందు వంద సార్లు ఆలోచించాల్సిందే.. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఐస్‌క్రీమ్‌లో ఏకంగా ఒక చనిపోయిన కప్ప ప్రత్యక్షమైంది.. ఈ షాకింగ్ దృశ్యం ఇప్పుడు నెటిజన్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తింటుండగా బయటపడ్డ కప్ప..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే... ఒక వ్యక్తి రోడ్డు పక్కన ఐస్‌క్రీమ్ కొనుక్కుని తింటున్నాడు. సగం ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత.. అతనికి అందులో ఏదో తేడాగా అనిపించింది. రంగు మారి, వింతగా కనిపిస్తున్న ఆ భాగాన్ని గమనించగా.. అది మరేదో కాదు.. ఐస్‌క్రీమ్‌తో పాటే గడ్డకట్టుకుపోయిన ఒక చిన్న చనిపోయిన కప్ప అని తేలింది. అంతేకాకుండా మీరు కూడా ఈ వీడియో ఆ చనిపోయిన నల్ల కప్పను చూడొచ్చు..

దీంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు.. వెంటనే ఆ ఐస్ పుల్లను అక్కడే ఉన్న స్థానికులకు చూపించాడు. ఐస్‌క్రీమ్ మధ్యలో కప్ప కాళ్లు, శరీరం స్పష్టంగా కనిపిస్తుండటంతో చుట్టుపక్కల వారు సైతం ఆశ్చర్యపోయిన్నట్లు తెలుస్తోంది.. ఇదేం ఘోరం.. ఇలాంటి ఐస్‌క్రీమ్‌లు తింటే ప్రాణాలు పోవాల్సిందేనా? అంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడం వీడియోలో మీరు క్లియర్‌గా వినొచ్చు..

 
 
 
 
 

ఈ భయంకరమైన ఘటన ఎక్కడ, ఏ ప్రాంతంలో జరిగిందనే దానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియలేదు.. కానీ, ఈ వీడియో మాత్రం ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆహార భద్రతా ప్రమాణాలను (Food Safety Standards) గాలికొదిలేసి.. ఇలాంటి నాణ్యత లేని ఐస్‌క్రీమ్‌లను తయారు చేస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

మరికొంతమందైతే.. ఇకపై బయట ఐస్‌క్రీమ్‌లు తినడమే మానేయాలని కామెంట్ చేయగా.. తయారీ కేంద్రాల్లో కనీస పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఇలాంటి కీటకాలు, జంతువులు ఐస్‌క్రీమ్ మిశ్రమంలో పడిపోతున్నాయని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆహార పదార్థాలలో ఎలుకలు, కప్పలు, పాములు రావడం ఎక్కువైపోవడంతో ప్రజలు బయట ఫుడ్ తినాలంటేనే జంకుతున్నారు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం ఐస్‌క్రీమ్ ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. ఏదేమైనా.. బయట ఏ వస్తువు కొని తిన్నా.. కాస్త జాగ్రత్తగా చూసుకుని తినడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
0
Report

Free Breakfast Hyderabad: ఆ ప్రాంతంలో నిత్యం టిఫిన్ ఉచితం..365 రోజులు ఎప్పుడు వచ్చినా ఫుడ్ పెడతారు!

Hyderabad, Telangana:

Hyderabad Free Breakfast: ఎందరికో ఆశ్రయాన్ని ఇవ్వడమే కాకుండా.. ఆకలితో అలమటించే వారికి ఇంత అన్నం పెట్టే సేవా నిలయంగా హైదరాబాద్ నిలవనుంది. అలాంటి ఒక గొప్ప సేవా దృక్పథంతో, గత కొంతకాలంగా నిరుపేదల ఆకలిని తీరుస్తోంది 'ఆహార్ సేవ' అనే స్వచ్ఛంద సంస్థ. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో, ఎలాంటి విరామం లేకుండా సంవత్సరంలో 365 రోజులూ ఉచితంగా రుచికరమైన అల్పాహారాన్ని (టిఫిన్) అందిస్తూ ఈ సంస్థ నగర ప్రజల మన్ననలు పొందుతోంది.

ఈ అద్భుతమైన మహత్ కార్యానికి వ్యవస్థాపకుడు రంజన్ గాంధీ శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఉదయం 3 గంటల నుంచే వంటశాలలో టిఫిన్‌ల తయారీ ప్రారంభమవుతుంది. వర్షం పడినా, చలి వణికించినా, సెలవు రోజైనా ఈ సేవకు ఎటువంటి ఆటంకం కలగదు. సరిగ్గా ఉదయం 7:30 గంటలకల్లా పంపిణీ కేంద్రాల వద్దకు వేడివేడి ఆహారం చేరుకుంటుంది. నిరుపేదలు, రోజువారీ కూలీల కోసం ఇడ్లీ, బోండా, ఊతప్ప, ఉప్మా వంటి నాలుగు రకాల వైవిధ్యమైన, పోషకాలతో కూడిన టిఫిన్‌లను ఇక్కడ వడ్డిస్తారు.

ప్రస్తుతం ఈ సంస్థ తన సేవా పరిధిని కేవలం కాచిగూడకే పరిమితం చేయకుండా, హైదరాబాద్‌లోని మరో 5 నుంచి 6 కీలక ప్రాంతాలకు విస్తరించింది. నాంపల్లిలోని శ్యామ్ మందిర్ ఎదురుగా, నిలోఫర్ హాస్పిటల్ వద్ద, పబ్లిక్ గార్డెన్ సమీపంలో, నాంపల్లి సుభాన్ బేకరీ వద్ద, ఉస్మాన్‌గంజ్‌లోని బాలసదన్‌లో ఈ ఉచిత అల్పాహార కేంద్రాలు నడుస్తున్నాయి. వీటితో పాటు బేగంపేట్‌లోని దేవనార్ బ్లైండ్ స్కూల్, మలక్‌పేట్‌లోని డెఫ్ అండ్ డంబ్ పాఠశాలలకు కూడా సంస్థ నిత్యం అల్పాహారాన్ని సరఫరా చేస్తోంది.

ఇంత పెద్ద ఎత్తున ప్రతిరోజూ వేలాది మందికి నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి రోజుకు సుమారు రూ.20,000 వరకు ఖర్చు అవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఖర్చంతా పూర్తిగా మానవతావాదులు, దాతలు అందించే విరాళాల ద్వారానే సమకూరుతోంది. కేవలం అల్పాహారమే కాకుండా, అనాథాశ్రమాలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల పాఠశాలలకు కూడా ఆహార్ సేవ నిరంతరం తోడ్పాటునందిస్తోంది.

ఆకలి లేని సమాజ స్థాపనే ధ్యేయంగా రంజన్ గాంధీ నాయకత్వంలో సాగుతున్న "ఆహార్ సేవ" ప్రయాణం నిజంగా అభినందనీయం. ఆకలితో ఉన్న పేదవాడి ముఖంలో ఈ సంస్థ నింపుతున్న నవ్వులు ఎందరికో స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కేంద్రాలు ఏర్పాటై, మరింత మంది నిరుపేదలకు ఆకలి బాధలు తప్పాలని ఆశిద్దాం.

Also Read: అంగన్వాడీల్లో 15,982 ఉద్యోగాలు..ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు వచ్చినట్టే?!

Also Read: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..20 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు..ఆ రోజు నుంచే అమలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Nothing నుంచి సరికొత్త B సిరీస్ ఫోన్.. అదిరిపోయే డిజైన్, గ్లిఫ్ లైటింగ్‌తో ఎంట్రీ!

Hyderabad, Telangana:

Nothing Phone 4b Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ  నథింగ్ (Nothing) టెక్ తమ వినియోగదారులను ఆకర్షించడానికి ఎప్పుడూ ముందే ఉంటుంది. తన అద్భుతమైన ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సరికొత్త డిజైన్‌తో మార్కెట్‌లోకి మరో అద్భుతమైన మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ నథింగ్ ఫోన్ 4b (Nothing Phone 4b) పేరుతో మార్కెట్‌లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేయబోతోంది.. జూలై 7న భారత మార్కెట్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ అఫీషియల్ డిజైన్ లుక్‌ను కంపెనీ తాజాగా రివీల్ చేయడం విశేషం.. ఈ కొత్త మొబైల్‌కు సంబంధించిన డిజైన్, ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ లుక్..
Nothing ఫోన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది.. దాని వెనుక భాగంలో ఉండే ట్రాన్స్‌పరెంట్ డిజైన్.. నథింగ్ ఫోన్ (4b)లో కూడా కంపెనీ తన సిగ్నేచర్ ట్రాన్స్‌పరెంట్ రియర్ ప్యానెల్‌ను కొనసాగించిన్నట్లు తెలుస్తోంది.. ఈసారి అద్భుతమైన బ్లూ కలర్ ఆప్షన్‌తో తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఫోన్ వెనుక భాగంలో స్క్రూలతో పాటు ఇండస్ట్రియల్ యాక్సెంట్లు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మొబైల్‌కు ప్రీమియంతో పాటు క్లాసీ లుక్‌ను అందిస్తుంది.. ఎక్కువ సమయం ఫోన్ వాడినా చేతికి సౌకర్యవంతంగా ఉండేలా సాఫ్ట్-టచ్ ఫినిషింగ్‌ను అందించారు..

మెరిసిపోయే గ్లిఫ్ బార్..
ఈ నథింగ్ ఫోన్ (4b) ఫోన్ వెనుక భాగంలో కెమెరా మాడ్యూల్ పక్కన అడ్డంగా (Horizontal) ఉండే గ్లిఫ్ లైటింగ్ బార్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది నథింగ్ బ్రాండ్ ప్రత్యేకతగా ఉండబోతోంది.. నోటిఫికేషన్లు, కాల్స్ వచ్చినప్పుడు ఈ గ్లిఫ్ లైట్లు మెరుస్తూ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే.. వెనుక భాగంలో ఎడమ వైపు పైభాగంలో ఓవల్ షేప్‌లో కెమెరాలను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. దీనితో పాటు ఎల్‌ఈడీ ఫ్లాష్, అదనపు సెన్సార్లను కూడా అందుబాటులో ఉంచారు..

బడ్జెట్ ధరలోనే B సిరీస్ ప్రారంభం..
నథింగ్ సంస్థ ఇప్పటివరకు ప్రీమియం సిరీస్‌తో పాటు బడ్జెట్ విభాగాల్లో a-సిరీస్ ఫోన్లను అందిస్తూ వచ్చింది. అయితే, ఈసారి మరింత మంది కస్టమర్లను ఆకర్శించేందుకు B సిరీస్‌ను పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది a-సిరీస్ కంటే తక్కువ ధరలో, అంటే సుమారు రూ.25,000 బడ్జెట్ ధరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో దీనికి సంబంధించిన మైక్రోసైట్ కూడా లైవ్ అవ్వడం విశేషం..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఇక లీక్ అయిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళితే, నథింగ్ ఫోన్ (4b)లో అద్భుతమైన ఫీచర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 లేదా 7s జెన్ 4 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది గరిష్టంగా 8GB ర్యామ్‌తో పాటు 12GB ర్యామ్ వేరియంట్స్‌లో లాంచ్‌ కాబోతోంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత నథింగ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన పెద్ద అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అలాగే లాంగ్ లైఫ్ ఇచ్చే 5,400mAh బ్యాటరీని కూడా కలిగి ఉండడం విశేషం.. అయితే, దీనిని కంపెనీ జూలై 7న జరిగే అఫీషియల్ లాంచ్‌లో దీని పూర్తి ఫీచర్స్‌తో పాటు ధర వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సంచారం.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

AP Power Sector Jobs: ఏపీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. విద్యుత్ శాఖలో 629 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

Vijayawada, Andhra Pradesh:

AP Power Sector Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు యువతకు ఉపాధి కల్పించాలని నిర్ణయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు విద్యుత్ సంస్థలు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశాయి. 

రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ విషయమై మాట్లాడుతూ.. "గత కొంతకాలంగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న యువతకు ఇచ్చిన మాట నెరవేర్చుకున్నందుకు సంతోషంగా ఉంద"ని అన్నారు. రాబోయే రోజులు జాబ్ క్యాలెండర్ ద్వారా అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

విద్యుత్ శాఖలో ఖాళీల వివరాలు.. 
ఈ భార్తీ నియామక ప్రక్రియలో భాగంగా ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో లతోపాటు వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలలో (డిస్కమ్స్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 629 పోస్టులను విభజన చేసి వివిధ సంస్థలకు కేటాయించారు. ఏపీ ట్రాన్స్‌కోలో 200, ఏపీ జెన్‌కోలో 100, ఏపీఎస్పీడీసీఎల్‌లో 134, ఏపీసీపీడీసీఎల్‌లో 60, ఏపీఈపీడీసీఎల్‌లో 135 ఏఈఈ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. 

దరఖాస్తు తేదీలు
APSPDCL పరిధిలో దరఖాస్తులు: దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APSPDCL) పరిధిలోని పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జూన్ 30 నుండి జూలై 27 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికాం విభాగాల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు పెద్ద పీట వేశారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శక విధానంలో రిక్రూట్‌మెంట్ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతిలో విద్యుత్ రంగం అత్యంత కీలకమైనది. ఈ నియామకాల ద్వారా అటు విద్యుత్ సంస్థల పనితీరు మెరుగవడమే కాకుండా, వేలాది కుటుంబాల్లో సరికొత్త వెలుగులు నిండనున్నాయి. కొన్నేళ్లుగా లైబ్రరీలలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న మధ్యతరగతి నిరుద్యోగ యువతకు ఇది ఒక సువర్ణావకాశం. అర్హులైన అభ్యర్థులందరూ పట్టుదలను ఆయుధంగా చేసుకుని తమ కలల ఉద్యోగాన్ని చేజిక్కించుకోవాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.

Also REad: బాబాయ్ ఆశీస్సులు తీసుకున్న అబ్బాయ్.. మంగళగిరిలో డిప్యూటీ సీఎంను కలిసిన రామ్‌చరణ్!

Also Read; "బెజవాడ సాయికృష్ణ పోలీస్ కస్టడీలో చనిపోయాడు"..సిట్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన నిజాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

తెలంగాణ హక్కులు కాపాడాల్సిన రేవంత్‌ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంతపాడుతున్నాడు: కవిత

Hyderabad, Telangana:

తుంగభద్రలో మన నీటి వాటాకు తూట్లు పొడిచే పనికి రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నాడని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ఆర్డీఎస్ చుట్టూ కర్ణాటక చేపట్టే ప్రాజెక్టులతో తెలంగాణ నీటి హక్కును కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మన హక్కులను కాపాడాల్సిన రేవంత్‌ రెడ్డి కర్ణాటక దోపిడీకి వంత పాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ మీద నిర్మించి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి వెళ్లవద్దని సూచించారు.

తుంగభద్ర నీటి వ్యవహారాల్లో రేవంత్‌ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేసేలా వ్యవహరిస్తుండడంతో మాజీ ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ వీడియో సందేశం విడుదల చేశారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని రేవంత్‌ రెడ్డికి సూచించారు. కేంద్ర జల సంఘం వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేయవద్దని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి హితవు పలికారు.

'తెలంగాణ సాధించుకొని 12 ఏళ్లు గడిచిన తర్వాత కూడా మనం పూర్తిస్థాయిలో కృష్ణా, తుంగభద్రలో మన నీటిని వాడుకోలేదు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్ నడిగడ్డను బతికించి ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు ఉపయోగపడే ప్రాజెక్ట్. ఆర్డీఎస్‌లో మనకు 16 టీఎంసీల వాటా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ వచ్చిన తర్వాత గానీ 6 టీఎంసీల కన్నా ఎక్కువ వాడుకోలేదు. మన నీటిని పూర్తిస్థాయిలో వాడుకునేందుకు ఆర్డీఎస్ చుట్టుపక్కల రిజర్వాయర్లను బలోపేతం చేయాల్సి ఉంది' అని మాజీ ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నడిగడ్డకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 

'తెలంగాణకు ఆర్డీఎస్‌లో 16 టీఎంసీలు వచ్చినట్లే ఏపీకి సుంకేశుల నుంచి 16 టీఎంసీల వాటా ఉంది. కానీ వాళ్లు దాన్ని 32 టీఎంసీలు చేసుకోని బీభత్సంగా నీటిని వాడుకుంటున్నారు. మనం మాత్రం ఆ పని చేయలేదు. మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు కట్టుకునేలోపే కర్ణాటక తుంగభద్ర మీద మూడు ప్రాజెక్టులు కడుతోంది. కురిడి, కల్పగల్ గ్రామాల్లో 2 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మిస్తోంది ఆర్డీఎస్‌కు  15 కిలోమీటర్‌ ఎగువన చిక్కాలపర్వి వద్ద 2.50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో బ్యారేజ్ నిర్మిస్తోంది. ఆర్డీఎస్‌కు  దిగువన రాయిచూరు జిల్లాలోని చిక్క మంచాల సమీపంలో 5 టీఎంసీల కెపాసిటీతో మరో బ్యారేజి నిర్మిస్తోంది. మొత్తంగా ఆర్డీఎస్‌కు ఎగువన, దిగువ 10 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా కర్ణాటక ప్రాజెక్టులు చేపడుతోంది' అని కవిత వివరించారు.

'వాస్తవానికి కర్ణాటకకు ఆర్డీఎస్‌లో 1.20 టీఎంసీ వాటా నీళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ పది టీఎంసీల నీళ్లు వినియోగించుకునే ప్రయత్న చేస్తోంది. అలాంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వెళ్లి చంద్రబాబు, డీకే శివకుమార్‌లను కూర్చొబెట్టుకుని తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. కర్ణాటక ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే తుంగభద్రలో మన వాటా హక్కును పర్మినెంట్‌గా కోల్పోతాం' అని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. 

'కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ మీరు అధికారంలోకి రాదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై చర్యలు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రే మా ప్రాజెక్టులకు అంగీకారం తెలిపారని కర్ణాటక వాదిస్తుంది. రేవంత్‌ రెడ్డి చేసే ఈ పని నడిగడ్డ ప్రజలకు అతిపెద్ద గుదిబండగా మారుతుంది' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కేంద్ర జల సంఘం దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని మరోమారు విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి కేంద్రంతో మన నీటి వాటా హక్కుల కోసం పోరాడుదామని.. కృష్ణా, తుంగభద్రలో మన వాటాను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి శాశ్వతంగా తాగు, సాగు నీరు వచ్చేలా చేసుకుందామని సూచించారు.

0
0
Report
Advertisement

Vivo లవర్స్‌కు పండగే.. రూ.9,000 బోనస్‌తో Vivo T5x 5G మీ సొంతం!

Hyderabad, Telangana:

Vivo T5x 5g Offer News: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే శుభవార్త అందించింది. ప్రముఖ మొబైల్ బ్రాండ్  Vivo నుంచి మార్కెట్లోకి వచ్చిన ప్రీమియం ఫీచర్ల స్మార్ట్‌ఫోన్ Vivo T5x 5Gపై ప్రస్తుతం కళ్లు చెదిరే డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు లభిస్తున్నాయి. ఎన్నో అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఈ 5G ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని టెక్ నిపుణులు చెబుతున్నారు. భారీ తగ్గింపుల కారణంగా ఈ ఫోన్ స్టాక్ వేగంగా అమ్ముడవుతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఏకంగా రూ.6,000 ఫ్లాట్ డిస్కౌంట్..
మార్కెట్లో Vivo T5x 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర (MRP) రూ.28,999 కాగా.. అయితే, ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న ప్రత్యేక సేల్ ఆఫర్లలో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ.6,000 వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది.. ఈ మెగా డిస్కౌంట్ తర్వాత స్మార్ట్‌ఫోన్ ధర నేరుగా రూ.22,999కే సొంతం చేసుకోవచ్చు.. ఇది నేరుగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో లభించడం విశేషం.. ఇవే కాకుండా దీనిపై ఫ్లిప్‌కార్ట్ దిమ్మతిరిగే అద్భుతమైన బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ను అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి చాలా చీప్‌ ధరకే సొంతం చేసుకోవచ్చు.  

బోలెడు బ్యాంక్‌ ఆఫర్స్‌..
ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్లకు మరింత లాభం చేకూర్చేందుకు ఫ్లిప్‌కార్ట్ పలు క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా అందిస్తూ వస్తోంది.. ఇందులో భాగంగా మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ (Flipkart Axis Bank) లేదా SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పేమెంట్ చేస్తే.. అదనంగా దాదాపు రూ.1,150 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీనివల్ల ఫోన్ ధర మరింత తగ్గుతుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

పాత ఫోన్ ఇస్తే రూ.9,000 ఎక్చేంజ్ బోనస్..
మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను Exchange చేసుకోవాలనుకుంటే, ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై ఏకంగా రూ.9,000 వరకు భారీ ఎక్చేంజ్ బోనస్‌ను ఆఫర్ చేస్తోంది. ఒకవేళ మీ పాత ఫోన్‌కు పూర్తి ఎక్చేంజ్ విలువ లభిస్తే.. అన్ని ఆఫర్లు పోను ఈ సరికొత్త Vivo T5x 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.18,849 లోపే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఎక్చేంజ్ బోనస్ అనేది మీరు ఎక్చేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్‌ కండీషన్, మోడల్‌తో పాటు బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. పాత ఫోన్ స్క్రీన్ బాగుండి, ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉంటే గరిష్ట తగ్గింపు లభించే అవకాశం ఉంది. దీంతో మీరు ఫుల్‌ డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

ఒకరికి  మోదం ఒకరికి ఖేదం.. జొన్నగిరి బంగారు గనులపై స్థానికుల తీవ్ర అభ్యంతరం

Jonnagiri, Andhra Pradesh:

కర్నూలు జిల్లాలో బంగారు గనులు..తమ గ్రామాలను బుగ్గిపాలు చేస్తున్నాయనీ అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. జొన్నగిరిలోని గోల్డ్ మైన్స్ తవ్వకాలు ఒకరికి  మోదం..మరొకరికి ఖేదం అన్నట్లుగా వుంది. తమ పొలాల్లో బంగారు నిక్షేపాలున్నా..వాటి వల్ల తమకేమీ ఉపయోగం లేకపోగా..గనుల తవ్వకాల్లో కెమికల్స్ వాడకంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, వాటి వాడకం వల్ల తమకు చర్మసంబదిత రోగాలు వస్తున్నాయని వాపోతున్నారు.

కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామంలో భారీ బంగారు నిక్షేపాలను గుర్తించడమే కాకుండా, వెలికితీత పనులు కూడా అధికారికంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యం తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బంగారు గనుల ప్రాజెక్ట్‌గా ఇది నిలవనుంది. జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.400 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ 'జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్‌'ను చేపట్టింది. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో తవ్వకాలు జరుపుతున్నారు. ఒక్క జొన్నగిరిలోనే దాదాపు 50 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయని అంచనా. పూర్తిస్థాయిలో ఉత్పత్తి మొదలయ్యాక, రాబోయే 15 ఏళ్ల పాటు ఏటా 1000 కిలోల (ఒక టన్ను) శుద్ధి చేసిన బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి గ్రామాల పరిధి లో 1477 ఎకరాల్లో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ తవ్వకాలకు అనుమతులు పొందింది. ఆ సంస్థకు పలు రాష్ట్రాల్లో 35 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఖనిజాలు తవ్విన అనుభవం ఉంది. బంగారు గనులున్న జొన్నగిరి ప్రాంతంలోనే ఉత్పత్తికి అవసరమైన పరిశ్రమను 320 కోట్ల రూపాయలతో చేపట్టింది. 2006లోనే తవ్వకాలకు అనుమతులు పొందినప్పటికీ ఇక్కడ దొరికే బంగారం నాణ్యత, తవ్వకాలు లాభదాయకమా? కాదా? నిర్ధారించుకుని కర్మాగారం నిర్మించడానికి ఆ సంస్థకు ఏకంగా 19 ఏళ్లు పట్టింది.

ఒక మినీప్లాంట్‌లో ఖనిజం శుద్ధి చేసి, బంగారం నాణ్యత నిర్ధరించుకుంది. సంతృప్తికర ఫలితాలు రావడంతో పూర్తిస్థాయి ప్లాంట్ నిర్మించింది. జియో మైసూర్ సర్వీసెస్ సర్వే ప్రకారం ఈ ప్రాంతంలో కోటి టన్నుల బంగారం ఖనిజ నిల్వలు ఉన్నట్లు అంచనా. తూర్పు బ్లాక్‌లో భూమి అడుగున దాదాపు 180 మీటర్ల లోతులో 6.8 మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉన్నట్లు గుర్తించింది. 2043 వరకు ఈ ప్రాంతంలో తవ్వకాలకు అనుమతి తీసుకోవడంతో పాటు ఆ తరువాత మరో 50 సంవత్సరాల పాటు వాటిని కొనసాగించడానికి కూడా ముందస్తు అనుమతులు పొందింది.

బంగారం, వెండి తదితర ఖనిజాల వెలికితీతలో అపార అనుభవమున్న జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. కొన్నేళ్లుగా ప్రారంభానికి నోచుకోని ఈ కర్మాగారాన్ని పట్టా లెక్కించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టి, ఎట్టకేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కర్మాగారం ప్రారంభించారు. ఇక్కడ మొదటి ఏడాది 600 కిలోలు, మరుసటి ఏడాది 1500 కిలోలు బంగారాన్ని ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. ఇంత పెద్ద బంగారు పరిశ్రమ ఏర్పాటు వల్ల తమకు ఉపాధి లభిస్తుందని ఇక్కడి వారు ఆశపడ్డారు. కానీ పరపతి,సిఫారసు లేనిదే పరిశ్రమలో ఉపాధి కూడా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు.

శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాయలసీమలో రతనాలు రాశులుగా పోసి అమ్మేవారని పెద్దలు చెబుతుంటారు. ఇప్పటికే జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో తొలకరి వర్షాలు కురుస్తే బీడు భూముల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. వీటికోసం ప్రజలు రోజూ ఉదయమే పొలాల వెంట అన్వేషణ చేస్తుంటారు. అలాంటి జొన్నగిరి ప్రాంతంలో బంగారు ఖనిజాలు కూడా లభ్యమవడం విశేషం. జొన్నగిరి ఇక స్వర్ణగిరిగా మారుతున్నందుకు తమకు చాలా సంతోషంగా ఉన్నా..బంగారం కోసం చేస్తున్న మైనింగ్ వల్ల తమ గ్రామాలు, ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. తాగు నీటి సమస్య కూడా తీవ్రమైందని, డబ్బులు పెట్టీ నీళ్లు కొనాల్సిన పరిస్థితి వచ్చిందని పరిసర గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు 1500 ఎకరాలు రైతుల వద్ద భూములను కొని, మరి కొందరి వద్ద లీజుకు తీసుకుని తవ్వకాలు చేస్తున్నారు. ఇక్కడ గోల్డ్ మైనింగ్ చేయడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో ఇక్కడి ప్రజల పరిస్థితి మరోలా కనిపిస్తోంది.  జొన్నగిరి బంగారు గని కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగ పడుతుంది తప్ప, సామాన్య ప్రజలకు ఏవిధమైన లాభం లేదని అంటున్నారు.

0
0
Report

తిరుమల వెంకటేశ్వర స్వామి సేవలో హీరో నాని, ఇతర ప్రముఖులు

Tirupati Urban, Andhra Pradesh:

కోరిన కోరికలు తీర్చే కొంగు బొంగారంగా.. ఇల వైకుంఠంగా ప్రఖ్యాతిగాంచిన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసిన అనంతరం మొన్నటి దాకా భారీ ఎత్తున భక్తులు ఉండగా.. ఇప్పుడు కొంత రద్దీ తగ్గింది. కానీ సాధారణం కన్నా అధికంగానే భక్తుల రద్దీ కొనసాగుతుండగా.. పలువురు ప్రముఖులు కూడా దర్శించుకున్నారు. గురువారం స్వామిని దర్శించుకునేందుకు సినీ నటుడు నాని, కర్ణాటక మంత్రి, ఇతర ప్రముఖులు వచ్చారు.

తెలుగు సినీ నటుడు నాని తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శనంలో ఆలయంలోకి వచ్చిన ఆయన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం అనంతరం నాని కుటుంబసభ్యులు మాట్లాడుతూ స్వామి వారి దర్శనం బాగా జరిగిందని తెలిపారు. ఇక నానిని చూసేందుకు అతడి అభిమానులు ఎగబడ్డారు. కొందరు ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు.

ఇక కర్ణాటక రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి వేద ఆశీర్వచనం అందించి.. తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు.

భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంతో పోలిస్తే అధికంగానే ఉంది. వైకుంఠంలోని వేచి ఉన్న 31 కంపార్ట్మెంట్లు వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. టోకెన్‌ పొందిన టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డీ) దర్శనానికి 12 గంటలు సమయం పడుతుండగా.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-5 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 24వ తేదీన 70,139 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 34,940 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.63 కోట్లు లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

0
0
Report
Advertisement

కేవలం రూ.5,000 లోపే 32 ఇంచుల బ్రాండెడ్ స్మార్ట్ టీవీ.. ఎలా కొనాలో చూడండి!

Hyderabad, Telangana:

VW 32 inch Smart TV 2025 Edition Flipkart Offer: డిజిటల్ కాలంలో ప్రతి ఇంట్లోనూ ఒక మంచి స్మార్ట్ టీవీ ఉండటం సర్వసాధారణం అయిపోయింది. అయితే, బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు ఉన్న టీవీని కొనుగోలు చేయడం అనేది కాస్త కష్టమైన పనే.. అలాంటి వారికోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఒక అదిరిపోయే సువర్ణావకాశాన్ని అందిస్తోంది.. విసియో వరల్డ్ (VW) బ్రాండ్‌కు సంబంధించిన VW NA 80 cm (32 inch) HD Ready LED TV 2025 Edition (VW32A) స్మార్ట్‌టీవీపై ఊహించని రేంజ్‌లో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.. అయితే, దీనిపై లభిస్తున్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.12,999 టీవీ ఇప్పుడు రూ.7,699 లకే..
సాధారణంగా ఈ వీడబ్ల్యూ (VW) 32 అంగుళాల 2025 ఎడిషన్ స్మార్ట్ టీవీ అసలు ధర (MRP) రూ. 12,999తో అందుబాటులో ఉంది.. కానీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న స్పెషల్ సేల్ ఆఫర్స్‌లో భాగంగా ఈ టీవీపై ఏకంగా రూ.5,300 వరకు ఫ్లాట్ డిస్కౌంట్‌ లభిస్తోంది.. ఈ బంపర్ డిస్కౌంట్ కారణంగా కస్టమర్లు ఈ సరికొత్త స్మార్ట్ టీవీని కేవలం రూ.7,699 లోపే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం అందుబాటులో ఉండడం విశేషం..

బ్యాంక్ ఆఫర్ల వివరాలు ఇవే..
ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా..ఈ టీవీని ఇప్పుడే కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి మరింత ఆకర్షించడానికి అదనపు బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్‌కార్ట్ అందిస్తూ వస్తోంది.. ఈ టీవీని కొనుగోలు చేసే సమయంలో మీరు యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డ్‌ ఉపయోగించి పేమెంట్ చేస్తే దాదాపు.. దాదాపు రూ.385 వరకు అదనపు ఇన్స్టంట్ తగ్గింపు లభిస్తుంది. దీనితో టీవీ ధర మరింత తగ్గుతుంది.

కేవలం రూ.5,000 లోపే మీ ఇంటికి..
ఈ డీల్‌లో అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే.. భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉండటం.. మీ ఇంట్లో ఉన్న పాత వర్కింగ్ కండిషన్ టీవీని ఎక్స్చేంజ్ చేస్తే.. దాదాపు రూ. 2,090 వరకు అదనపు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తోంది.. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను పూర్తిగా వినియోగించుకుంటే.. ఈ సరికొత్త 2025 ఎడిషన్ స్మార్ట్ టీవీని కస్టమర్లు నెట్ ఎఫెక్టివ్ ధర రూ. 5,000 లోపే పొందవచ్చు.. అయితే, ఈ ఎక్స్చేంజ్ బోనస్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే పాత స్మార్ట్‌టీవీ మోడల్‌తో పాటు దాని కండీషన్‌పై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. పాత టీవీ కండిషన్ బాగుంటే గరిష్ట తగ్గింపు లభిస్తుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

వచ్చే వారమే Redmi K90 Ultra లాంచ్.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పవర్‌ఫుల్ ఫీచర్స్!

Hyderabad, Telangana:

Redmi K90 Ultra to Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమి (Xiaomi) సబ్-బ్రాండ్ అయిన  రెడ్‌మి (Redmi) గ్లోబల్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. మొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న తమ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్  రెడ్‌మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) విడుదలకు ఖరారైంది. వచ్చే వారం చైనా మార్కెట్లో ఈ ఫోన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్  వైబో (Weibo) ద్వారా రెడ్‌మి ఈ సమాచారాన్ని వెల్లడించింది.. జూన్ 30వ తేదిన విడుదల చేయబోతున్నట్లు తెలిపింది..

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌..
Redmi K90 Ultra స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ (Qualcomm)కు చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) చిప్‌సెట్‌తో మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది.. హెవీ గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్ కోసం ఈ ప్రాసెసర్ అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. గేమింగ్ ఆడే సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో సరికొత్త అప్‌గ్రేడెడ్ థర్మల్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్‌ను కూడా అందిస్తోంది.. ఫోన్‌ను కూల్‌గా ఉంచేందుకు ఇందులో యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ (కూలింగ్ ఫ్యాన్) కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

అద్భుతమైన డిస్‌ప్లే.. 
ఈ స్మార్ట్‌ఫోన్ లుక్‌తో పాటు డిజైన్ పరంగా చాలా క్లాసీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. కంపెనీ ఇప్పటికే దీనికి సంబంధించిన సిల్వర్ కలర్ వేరియంట్‌ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే.. ఫోన్ వెనుక భాగంలో పెద్ద హారిజాంటల్ కెమెరా మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది చూడటానికి ఇటీవల మార్కెట్లోకి వచ్చిన రెడ్‌మి K90 మ్యాక్స్ (Redmi K90 Max) మోడల్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే.. ఇందులో 165Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.59-ఇంచుల 1.5K LTPS OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉందని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్..
రెడ్‌మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) స్మార్ట్‌ఫోన్ చైనాకు చెందిన 3C సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్‌లో లిస్ట్ అయిన్నట్లు కూడా తెలుస్తోంది.. దీని ప్రకారం.. ఈ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది.. దీనివల్ల నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ ఫుల్ అవుతుందని సమాచారం. అలాగే వినియోగదారుల సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని.. ఇందులో సరికొత్త అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ (Ultrasonic Fingerprint Scanner)ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

K90 సిరీస్‌లో మరో సంచలనం..
ఇప్పటికే రెడ్‌మి K90 సిరీస్‌లో బేస్ మోడల్‌తో పాటు రెడ్‌మి K90 ప్రో, రెడ్‌మి K90 మ్యాక్స్ వంటి మోడళ్లను కంపెనీ పరిచయం చేసింది. కాగా.. ఇప్పుడు రాబోతున్న అల్ట్రా మోడల్ సరికొత్త టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో పాటు పవర్‌ఫుల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్‌తో సాంసంగ్‌, ఒప్పో వంటి బ్రాండ్ల ప్రీమియం ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. తొలుత జూన్ 30న చైనాలో విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్.. ఆ తర్వాత త్వరలోనే భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ధరతో పాటు పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు వచ్చే వారం లాంచ్ ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Gold Rate: భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. జూలైలో మరింత పతనం.. 10గ్రాముల పసిడి రూ. 1 లక్షకు చేరుకుంటుందా?

BBhoomi6h ago
Secunderabad, Telangana:

Gold Rate: బంగారం ధరలు ఎవరూ ఊహించని స్థాయిలో భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన మూడు నాలుగు రోజులుగా గమనించినట్లయితే ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గుతున్నట్లు మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్ లో 4100డాలర్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో గమనిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44లక్షల వద్ద కొనసాగుతోంది. ఒకే నెలలో సుమారు 6 శాతం వరకు బంగారం ధర తగ్గినట్లు మనము గమనించవచ్చు.  జూన్ నెలలో బంగారం ధర గరిష్టంగా 1. 55 లక్షల రూపాయల వరకు పెరిగింది. అంటే ఒకే నెలలో సుమారు 10వేల రూపాయల వరకు తగ్గినట్లు మనం గమనించవచ్చు.

 అయితే బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం అని చెప్పాలి. దీనికి తోడు డాలర్ విలువ పెరగడం కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టేందుకు ప్రధాన కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు.  అన్నిటికంటే ప్రధానమైనది బంగారం దగ్గర తగ్గడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు భవిష్యత్తులో భారీగా పెంచుతుంది అన్న వార్తలు వస్తున్నాయి.  ఇవి కూడా ఇన్వెస్టర్లను బంగారం నుంచి బయటకు వచ్చేందుకు దోహదం చేస్తున్నాయని చెప్పవచ్చు.  

సాధారణంగా బంగారం ధర అనేది ఎక్కువగా డాలర్ విలువపై ఆధారపడి ఉంటుంది.  ఎప్పుడైతే డాలర్ విలువ పడిపోతుందో అప్పుడు బంగారం ధర భారీగా పెరుగుతుంది. ఎందుకంటే పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల నుంచి బయటకు తీసి బంగారంలో పెట్టుబడి పెడుతుంటారు. ఎప్పుడైతే అమెరికా డాలర్ విలువ పెరుగుతుందో అప్పుడు ధర బంగారం ధర మళ్ళీ తగ్గుముఖం పడుతుంది. 

ఎందుకంటే అమెరికా డాలర్ బలపడితే.. అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది.  అప్పుడు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి తీసి ట్రెజరీ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోన్ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు కూడా భారీగా తగ్గడం కూడా  బంగారం పైన ప్రభావం చూపుతోందని చెప్పాలి.  దీనికి తోడు జూలైలో బంగారం ధరలు తగ్గుతాయా లేదా అనే అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తుంది.

 అయితే అమెరికా విడుదల చేసే కీలకమైన ఆర్థిక డేటా పర్సనల్ కాన్సెప్షన్ ఎక్స్పెండిచర్ల నివేదికలో సానుకూలంగా వచ్చినట్లయితే బంగారంపై ఒత్తిడి పెరిగి ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం టెక్నికల్ గా చూస్తే బంగారం ధర 450డాలర్లుగా ఉంది. జూలై నెలలో ఈ స్థాయి వద్ద బంగారానికి బలమైన సపోర్టు లభించే ఛాన్స్ కనిపిస్తుంది. అందుకే ధరలు జూలై నెలలో భారీగా తగ్గడం అంత సులభం కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆనంద్ రాఠి సంస్థ విడుదల చేసిన కమ్యూనిటీ నివేదిక ప్రకారము ప్రస్తుతం వచ్చినటువంటి ఈ కరెక్షన్ తాత్కాలికం మాత్రమే అని దీర్ఘకాలిక ట్రేడ్ ఇంకా బలంగానే ఉంటుందని.. బంగారం ధరలో మళ్లీ వేగం పంచుకునే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.

Also Read: నిరుద్యోగులకు నెలకు రూ. 3,000.. జర్నలిస్టులకు రూ. 5,000 పెన్షన్..!!

Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top