icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

'సర్‌' బండి సంజయ్‌ అప్రమత్తం.. హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆందోళన

Vemulawada, Telangana:

Telangana SIR: తెలంగాణలో జరుగుతున్న సర్‌ ప్రక్రియపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అప్రమత్తం అయ్యారు. 'సర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది' అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అధికారులకు ప్రభుత్వం సహకరించడం లేదని. మజ్లిస్‌తో కుమ్కక్కై కాంగ్రెస్ హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపణలు చేశారు.

వేములవాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రాష్ట్ర ప్రభుత్వం సర్‌ను ఉపయోగించుకుని హిందువల ఓట్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో హిందువుల ఇళ్లకు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదు. తెలంగాణలోని హిందువులంతా జాగృతం కావాలని.. లేనపోతే హిందువులంతా మైనారిటీలయ్యే ప్రమాదం ఉంది' అని బండి సంజయ్‌  హెచ్చరించారు. 

ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఎన్నికల తరువాత తన ధ్యాస, శ్వాస అంతా అభివృద్దే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు బండి సంజయ్‌ ప్రకటించారు. రాజకీయాలకతీతంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అనే వివక్ష లేకుండా ఓటేసిన ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తానని చెప్పారు. 'రేవంత్ రెడ్డి ఇంత అప్పు చేసి ఏం చేశాడంటే.. చేసిందేమీ లేదు. ఇయాళ జీతాలు, పెన్షన్లు, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలంటే కూడా పైసల్లేని దుస్థితి ఏర్పడింది' అని వివరించారు. అప్పులు, అవినీతి, అక్రమాలు మాత్రమేనని కాంగ్రెస్‌ పాలనపై విమర్శించారు. 

'కాంగ్రెస్ పాలనలో దోచుకున్నదంతా ఢిల్లీకి పెద్దలకు మూటలు పంపుతున్నారు. రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్రం ఇస్తున్న నిధులతోనే' అని బండి సంజయ్‌ తెలిపారు. తెలంగాణను రేవంత్ రెడ్డి శ్రీలంక, పాకిస్తాన్‌లా మార్చే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ అప్పుల ఊబి నుంచి బయటకు రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో అప్పుల బాధ తీరదు.. అవినీతి ఆగదు. అభివృద్ది జరగదని తెలిపారు. వీబీజీ రామ్ జీ పథకంతో పనిదినాలు పెంచి ఆస్తులు సృష్టించడం తప్పా.. దీనిపై కోర్టుకు వెళ్లడం ఏమిటని బండి సంజయ్‌ ప్రశ్నించారు. మోదీకి మంచి పేరొస్తే ఓర్వలేరా? అని నిలదీశారు.

0
0
Report

IND Vs ENG 2nd T20: నేడే భారత్ Vs ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్..వైభవ్ సూర్యవంశీ గ్రాండ్ ఎంట్రీ పక్కా!

Stretford, England:

IND Vs ENG 2nd T20I Preview: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా ఐదు టీ20 మ్యాచ్‌లను ఆడనుండగా.. అందులో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరుజట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఇదే మ్యాచ్‌లో భారత యువ కెరటం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. 

అయితే ఇంతకు ముందు ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా జరిగిన టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడన్న వార్తలు వచ్చాయి. అయితే అది కుదరలేదు. కేవలం వైభవ్ బెంచ్ మార్క్‌‌కు పరిమితమవ్వగా.. ఆ సిరీస్‌లో ఐర్లాండ్‌తో వైట్‌వాష్‌కు గురయ్యింది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు అవకాశం వస్తుందని ఎదురుచూసిన వారికి నిరాశే మిగిలింది. 

ఈ వారం ప్రారంభంలో డర్హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ తొలి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని సీనియర్ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపించినప్పటికీ, జట్టు యాజమాన్యం తమ సాధారణ ఓపెనింగ్ జోడీతోనే ముందుకు సాగింది. అయితే, సంజు శాంసన్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటంతో, త్వరలోనే సూర్యవంశీ అతని స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.

అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ పర్యటనలో ఇప్పటికే రెండు అర్ధశతకాలు (మొదటిది ఐర్లాండ్‌పై, రెండోది జూలై 1న ఇంగ్లాండ్‌పై) సాధించాడు. కాబట్టి జట్టులో అతని స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. పరుగులు సాధించాల్సిన ఒత్తిడి పూర్తిగా సంజు శాంసన్‌పైనే ఉంది. వర్షం కారణంగా రద్దయిన తొలి మ్యాచ్‌లో, శాంసన్ ఏడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 

భారత్‌కు మరో ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. కొత్తగా ఎంపికైన వైస్ కెప్టెన్ తిలక్ వర్మ పేలవమైన ఫామ్. అతని స్ట్రైక్ రేట్ ఎంత ఆందోళనకరంగా ఉందో, స్లో బాల్స్‌ను ఎదుర్కోవడంలో అతని తీరు కూడా అంతే ప్రశ్నార్థకంగా ఉంది. ఈ ఏడాది ఆడిన గత 12 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ కేవలం 12 సిక్సర్లు మాత్రమే కొట్టగలిగాడు. అంటే సగటున మ్యాచ్‌కు ఒకటి చొప్పున అన్నమాట. ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో, ముఖ్యంగా స్పిన్ విభాగంలో ఎలాంటి మార్పులు లేకుండా బౌలింగ్ విభాగం పటిష్టంగా కొనసాగే అవకాశం ఉంది.

ఇంగ్లాండ్ విషయానికొస్తే, మొదటి T20Iలో పూర్తిస్థాయిలో కనిపించని వారి బ్యాటింగ్ లైనప్ భారత్‌కు గట్టి సవాలు విసిరే అవకాశం ఉంది. సిరీస్ ప్రారంభ మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకున్న జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి రాగా, జోష్ టంగ్ కూడా జట్టులో చేరారు. టంగ్ ఈ రోజు తన వైట్-బాల్ అరంగేట్రం చేయనున్నారు.

భారత్ vs ఇంగ్లాండ్ రెండో T20I ఎప్పుడు,ఎక్కడ?
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 మ్యాచ్‌ల T20I సిరీస్‌లో రెండో మ్యాచ్, మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో శనివారం, జూలై 4న సాయంత్రం 7:00 గంటల (IST) నుండి జరుగుతుంది. ఈ 5 మ్యాచ్‌ల సిరీస్ మొత్తాన్ని సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ ఛానెళ్లలోనూ, అలాగే సోనీ లివ్ (Sony LIV) యాప్ లేదా వెబ్‌సైట్‌లోనూ ప్రసారం చేస్తున్నారు.

Also Read: క్రికెట్ ప్రపంచంలో మరో కొత్త క్రష్..ఆస్ట్రేలియా మహిళల టీమ్‌లో భారత సంతతి యువతి!

Also Read: అమెరికన్ పాప్ సింగర్ పోటిగా విరాట్ కోహ్లీ..అందులో కిమ్ కర్దాషియన్‌‌నే మించిపోయాడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Peddi OTT Release: ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన రామ్‌చరణ్ 'పెద్ది'..ఆ ఫ్యాన్స్ మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే!

Hyderabad, Telangana:

Peddi OTT Release Date: బాక్సాఫీస్ వద్ద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ వేదికగా విడుదలకు సిద్ధమైంది. 

10 రోజుల్లో రూ.378 కోట్లు..!
టాలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో 'పెద్ది' సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుటి వరకు రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. 

ఆ ఓటీటీలో విడుదలకు సిద్ధం..
కేవలం 35 రోజుల థియేటర్ రన్ తర్వాత ఓటీటీలో విడుదల కానుండడం విశేషం. ఈ సినిమాను ఓటీటీలో విడుదల తేదీని ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. జూలై 9న తమ ప్లాట్‌ఫారమ్‌లో సినిమాను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. అయితే ఈ సినిమాను త్వరలోనే హిందీ వెర్షన్‌లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

సినిమా ప్రత్యేకతలు..నటీనటుల ప్రతిభ
డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. సినిమాలో క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్‌గా రామ్ చరణ్ చూపించిన వేరియేషన్స్, అద్భుత నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి.

అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, అప్పల సూరి పాత్రలో జగపతి బాబు నటనకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు త్రిపాఠి, రావు రమేష్, బొమన్ ఇరానీ, రవి కిషన్, సత్య తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషించాయి.

వృద్ధి సినిమాస్ సమర్పణలో టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ 'మైత్రీ మూవీ మేకర్స్', 'సుకుమార్ రైటింగ్స్' సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించాయి. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇదొక ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: టాలీవుడ్ చరిత్రలో సమంత అతిపెద్ద రికార్డు..అనుష్కని వెనక్కి నెట్టిన లేడీ సూపర్‌స్టార్

Also Read: మూడో పెళ్లికి రెడీ అయిన బాలీవుడ్ స్టార్ హీరో..60 ఏళ్ల వయసులో ప్రియురాలితో పరిణయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Telegram Anti Piracy: టెలిగ్రామ్‌కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు..15 రోజుల్లో పైరసీ కంటెంట్‌ను ఆపాల్సిందే!

Hyderabad, Telangana:

Telegram Anti Piracy Notice: టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాలు, ఓటీటీ (OTT) కంటెంట్ పెద్ద ఎత్తున విస్తరించడంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టెలిగ్రామ్ యాజమాన్యానికి హెచ్చరికగా నోటీసులు జారీ చేస్తూ.. తమ యాప్ లేదా ప్లాట్‌ఫారమ్ స్థాయిలోనే పైరసీ నిరోధక చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఇందుకు కేవలం 15 రోజుల గడువు మాత్రమే ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

గతంలో ప్రభుత్వం విడివిడిగా పైరసీ ఛానెళ్ల తొలగించగా.. ఇప్పుడు ఆ ప్రక్రియను సదరు పైరసీ షేర్ చేస్తున్న ప్లాట్‌ఫారమ్‌కే పూర్తి జవాబుదారీ తనాన్ని అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

కేంద్రం డిమాండ్లు, ఆదేశాలు..
1)
కేవలం ప్రభుత్వం ఫిర్యాదు చేసే వరకు వేచి చూడకుండా, పైరసీ కంటెంట్‌ను స్వయంగా గుర్తించడం, రిపోర్ట్ చేయడం, బ్లాక్ చేయడం సహా అలాంటి పైరసీ కంటెంట్‌ను పూర్తిగా తొలగించడం కోసం టెలిగ్రామ్ తన అంతర్గత సాంకేతిక వ్యవస్థలను బలోపేతం చేయాలి.

2) పదేపదే పైరసీకి పాల్పడుతున్న ఛానెళ్లు, గ్రూపులు, బాట్‌లు, ఖాతాలతో పాటు వాటి నిర్వాహకులు, సంబంధిత సంస్థలపై శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

3) చలనచిత్ర నిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, చట్ట అమలు సంస్థలు నేరుగా ఫిర్యాదులు చేయడానికి వీలుగా టెలిగ్రామ్ కలిగి ఉన్న ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వివరాలను సమర్పించాలని మంత్రిత్వ శాఖ కోరింది.

4) ప్లాట్‌ఫారమ్ నుండి పైరసీ కంటెంట్‌ను నిరోధించడానికి ఇప్పటివరకు తీసుకున్న, తీసుకోబోయే చర్యలపై 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్' సమర్పించడానికి టెలిగ్రామ్‌కు 15 రోజుల గడువు ఇచ్చారు.

కేంద్రం హెచ్చరిక.. చట్టపరమైన నిబంధనలు..
"ప్రభుత్వం ఒక్కొక్క పైరసీ ఛానెల్‌ను గుర్తించే వరకు టెలిగ్రామ్ కేవలం వేచి చూడకూడదు" అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఐటీ చట్టం, 2000.. ఐటీ నిబంధనలు, 2021 ప్రకారం ఒక మధ్యవర్తిగా తగిన శ్రద్ధ వహించాల్సిన బాధ్యత టెలిగ్రామ్‌పై ఉంది. కేవలం ఏదో ఒక ఛానెల్‌ను డిలీట్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని కేంద్రం తేల్చిచెప్పింది. (గతంలో ప్రభుత్వం ఇలాంటి 3,000కు పైగా టెలిగ్రామ్ ఛానెళ్లపై చర్యలు తీసుకుంది).

భారతదేశంలో కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ వివాదం మాత్రమే కాదు. కాపీరైట్ చట్టం, 1957.. సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952 ప్రకారం ఇది తీవ్రమైన క్రిమినల్ నేరం. పైరసీ కంటెంట్ నిరంతరం అందుబాటులో ఉన్నా, నిబంధనలను పాటించకుండా తప్పించుకోవాలని చూసినా లేదా అసంపూర్ణంగా స్పందించినా.. చట్టపరమైన నిబంధనల ప్రకారం టెలిగ్రామ్‌పై తదుపరి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.

ఈ చర్య ఎందుకు ముఖ్యం?
భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న సృష్టికర్తల ఆర్థిక వ్యవస్థ, చలనచిత్ర పరిశ్రమ, ప్రసారకర్తలు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, నిర్మాతలు, పంపిణీదారుల హక్కులను, వారి శ్రమను, భారీ పెట్టుబడులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కఠినమైన చర్యకు పూనుకుంది.

Also Read: ఇథనాల్ పెట్రోల్‌తో మీ కారు, బైక్‌కి ప్రమాదమా? ఇంజిన్ తుప్పు పడుతుందా?

Also REad: క్రికెట్ ప్రపంచంలో మరో కొత్త క్రష్..ఆస్ట్రేలియా మహిళల టీమ్‌లో భారత సంతతి యువతి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Flipkart GOAT సేల్ ధమాకా.. రూ.21 వేల లోపే Samsung 5G స్మార్ట్‌ఫోన్.. భారీ ఆఫర్లు!

Hyderabad, Telangana:

Samsung Galaxy A14 5G Price: మీరు ఎప్పటి నుంచో అద్భుతమైన ఫీచర్లతో, తక్కువ బడ్జెట్‌లో ఒక ప్రీమియం 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక అద్భుతమైన అవకాశం రానే వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ఎంతగానో ఆకట్టుకుంటోంది. జూలై 4వ తేదీన ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన Flipkart GOAT సేల్‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్ సాంసంగ్‌కు చెందిన Samsung Galaxy A14 5G స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్ లుక్స్, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కారణంగా ప్రస్తుతం మార్కెట్లో దీనికి భారీ డిమాండ్ ఉంది.

ధర, ఫ్లాట్ డిస్కౌంట్ వివరాలు..
సాంసంగ్‌ గెలాక్సీ A14 5G స్మార్ట్‌ఫోన్‌ లోని టాప్-ఎండ్ వేరియంట్ 8 GB RAM + 128 GB స్టోరేజ్ (Black కలర్) మోడల్ అసలు ధర (MRP) మార్కెట్‌లో రూ. 22,999తో అందుబాటులో ఉండగా.. ఈ ప్రత్యేకమైన Flipkart GOAT సేల్‌లో భాగంగా కస్టమర్లకు ఏకంగా రూ.2,009 ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.. ఈ తగ్గింపు తర్వాత ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.20,990 లోపే వినియోగదారులకు సొంతం చేసుకునే సువర్ణావకాశం లభిస్తోంది.

అదనపు బ్యాంక్ ఆఫర్లు.. 
ఫ్లాట్ డిస్కౌంట్‌తోనే ఆఫర్లే కాకుండా అదనంగా బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. ఇందులో భాగంగా కొనుగోలు చేసే కస్టమర్లకు మరింత లాభం కలుగుతుంది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌తో అనుసంధానమైన యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) లేదా ఎస్‌బీఐ (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి పేమెంట్ చేస్తే, కస్టమర్లకు దాదాపు రూ.1,500 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవాలనుకునే వారి కోసం బెస్ట్ ఎక్స్ఛేంజ్ వాల్యూతో పాటు నో-కాస్ట్ EMI (No-Cost EMI) వంటి ఆకర్షణీయమైన అదనపు ఆఫర్లు కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ప్రీమియం ఫీచర్ల..
సాంసంగ్‌ గెలాక్సీ A14 5G స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ఇది అద్భుతమైన స్క్రీన్, స్మూత్ రీఫ్రెష్ రేట్‌తో విజువల్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.. 8 GB భారీ ర్యామ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్, గేమింగ్ ఎంతో స్మూత్‌గా నడుస్తుంది. ఇది అదిరిపోయే క్వాలిటీతో ఫొటోలు తీసేందుకు వీలుగా ఇందులో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. అలాగే రోజంతా బ్యాటరీ లైఫ్‌ను అందించేందుకు పవర్‌ఫుల్ బ్యాటరీ బ్యాకప్‌ కూడా లభిస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Ethanol Blending Issues: ఇథనాల్ పెట్రోల్‌తో మీ కారు, బైక్‌కి ప్రమాదమా? ఇంజిన్ తుప్పు పడుతుందా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ రాదా?

Hyderabad, Telangana:

Ethanol Blending Issues News: దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన ఇంథనాన్ని (E20) వాడకంపై వాహనదారుల్లో ఎన్నో సందేశాలు నెలకొన్నాయి. అలాగే సోషల్ మీడియాలో అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే "E20 పెట్రోల్ వాడితే ఇంజిన్లు పాడైపోతాయా? ఇన్సూరెన్స్ రాదా? పర్యావరణానికి కీడా?" అంటూ వస్తున్న అసత్య ప్రచారాలకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఒక సుదీర్ఘమైన, 10-అంశాల వివరణాత్మక ప్రకటనతో వినియోగదారుల అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.

అమెరికా, బ్రెజిల్ వంటి అంతర్జాతీయ దేశాల అనుభవాలను, పటిష్టమైన శాస్త్రీయ పరిశోధనలను అధ్యయనం చేసిన తర్వాతే ఈ విధానాన్ని భారత్‌లో ప్రవేశపెట్టామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇథనాల్ తయారీతో నీటి కొరత వస్తుందా?
ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 10 వేల లీటర్ల నీరు అవసరమవుతుంది, దీనివల్ల దేశంలో నీటి ఎద్దడి వస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. అయితే ఆధునిక డిస్టిలరీలు అత్యంత అధునాతన సాంకేతికతను వాడుతున్నాయి. ప్రస్తుతం ఒక లీటర్ ఇథనాల్ తయారీకి కేవలం 3 నుండి 5 లీటర్ల శుద్ధి చేసిన నీరు మాత్రమే ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా, ఈ కర్మాగారాలు 'జీరో లిక్విడ్ డిశ్చార్జ్' (ZLD) వ్యవస్థను పాటిస్తూ నీటిని నిరంతరం రీసైకిల్ చేస్తున్నాయి. కాబట్టి భూగర్భ జలాలు హరించిపోతాయనే వాదన ముమ్మాటికీ తప్పని కేంద్రం తేల్చేసింది.

ఆహార భద్రతకు ముప్పు ఉందా?
దేశీయ ఆహార అవసరాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కోటా పూర్తిగా తీరిన తర్వాత.. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) వద్ద మిగిలిపోయిన మిగులు బియ్యం, పాడైపోయిన ధాన్యాలు, చెరకు రసాన్ని మాత్రమే ఇథనాల్ తయారీకి వినియోగిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఆహార కొరత వచ్చే అవకాశమే లేదు.

కారు, బైక్ ఇంజిన్లు దెబ్బతింటాయా?
భారత వాహన తయారీ సంస్థల సంఘం (SIAM) భాగస్వామ్యంతో కఠినమైన 'మెటీరియల్ కంపాటబిలిటీ' పరీక్షలు జరిపిన తర్వాతే E20 ఇంధనాన్ని మార్కెట్లోకి తెచ్చారు. ఇథనాల్ వల్ల ఇంజిన్ భాగాలు తుప్పు పడతాయనే ఆందోళనల నేపథ్యంలో, చమురు సంస్థలు పెట్రోల్‌లో ప్రత్యేకమైన యాంటీ-కొరోసివ్ అడిటివ్స్‌ను కలుపుతున్నాయి.

ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త వాహనాలన్నీ E20 ఇంధనానికి అనుకూలంగానే తయారవుతున్నాయి. పాత వాహనాల్లో దీనివల్ల ఎలాంటి తక్షణ ప్రమాదాలు జరగవని శాస్త్రీయంగా నిరూపితమైంది.

బీమా (Insurance) క్లెయిమ్ తిరస్కరిస్తారా?
కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, సరఫరా చేస్తున్న ఇంధనాన్ని వాడినప్పుడు బీమా కంపెనీలు క్లెయిమ్‌లను నిరాకరించే అధికారమే లేదు. ఇన్సూరెన్స్ రాదనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.

పర్యావరణానికి, ఆర్థిక వ్యవస్థకు కలిగే లాభాలు..
ఐఐటీ (IIT) వంటి ప్రతిష్టాత్మక సంస్థల పరిశోధనల ప్రకారం.. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే E20 ఇంధనం వల్ల హానికరమైన కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. ముడి చమురు దిగుమతుల కోసం విదేశాలకు తరలిపోయే వేల కోట్ల రూపాయల విదేశీ మార్పిడి ద్రవ్యం ఆదా అవుతుంది. ఆదా అయిన సొమ్ము ఇథనాల్ సరఫరా చేసే దేశీయ చెరకు, ధాన్యపు రైతుల ఖాతాల్లోకి నేరుగా చేరుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది.

పర్యావరణ పరిరక్షణ, ఇంధన భద్రత, రైతు సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రతిష్టాత్మక జాతీయ ప్రాజెక్టుపై స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వ్యాప్తి చేస్తున్న నిరాధారమైన పుకార్లను పౌరులు, వాహనదారులు నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం గట్టిగా విజ్ఞప్తి చేసింది.

(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని కేంద్ర ప్రభుత్వ నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత విషయాలపై అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: AP Gold Mines: ఏపీలో మరో బంగారు గని? లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు!

Also Read: "నీ తొడల సైజ్ ఎంత?".. స్టార్ డైరెక్టర్ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయిన మౌనీషా చౌదరి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

BLA Suicide Bombing: పాకిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి దాడి..30 మందికి పైగా పారామిలిటరీ బలగాలు మృతి!

Karachi, Sindh:

BLA Suicide Bombing News: పాకిస్థాన్ ఆర్మీ జవాన్లపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దాడికి పాల్పడింది. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ శిబిరంపై జరిగిన ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. ఈ దాడిలో 30 మందికి పైగా పారామిలిటరీ సిబ్బంది మరణించగా, పలువురు గాయపడ్డారని ఆరోపించింది.

అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. పేలుడు పదార్థాలతో నిండిన వాహనం జీవానీలోని పన్వాన్ కోస్ట్ గార్డ్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందని BLA పేర్కొంది. ఈ దాడిని ఒక సమన్వయ ఆపరేషన్‌లో భాగంగా జరిపిన ఆత్మాహుతి వాహన ఆధారిత పేలుడు పరికరాల దాడిగా అభివర్ణించింది.

"ఈ శక్తివంతమైన పేలుడు ఫలితంగా, కోస్ట్ గార్డ్స్ పటిష్టమైన వలసవాద శిబిరం పూర్తిగా శిథిలాల కుప్పగా మారిపోయింది" అని BLA ప్రతినిధి జీయంద్ బలూచ్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపినట్లు 'ది బలూచిస్తాన్ పోస్ట్' నివేదించింది.

"దాడి జరిగిన వెంటనే, మా సంస్థ హై కమాండ్ దళమైన ఫతే స్క్వాడ్, వేగంగా, వ్యవస్థీకృత పద్ధతిలో ముందుకు సాగి, ధ్వంసమైన శిబిరంపై అన్ని వైపుల నుండి దాడి ప్రారంభించింది" అని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ దాడికి తామే బాధ్యులమని ప్రకటించిన ఆ బృందం, ఈ పేలుడు శిబిరాన్ని "పూర్తిగా ధ్వంసం చేసిందని" భద్రతా సిబ్బందిలో భారీ ప్రాణనష్టం కలిగించిందని ఆరోపించింది.

పాకిస్తానీ పారామిలిటరీ దళాలకు చెందిన 30 మందికి పైగా సభ్యులు మరణించారని, డజన్ల కొద్దీ ఇతరులు తీవ్రంగా గాయపడ్డారని బీఎల్‌ఏ ఇంకా పేర్కొంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అది తెలిపింది. "గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటం, శిథిలాల కింద చిక్కుకున్న సిబ్బందిని దృష్టిలో ఉంచుకుంటే, శత్రువుల ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది" అని బీఎల్‌ఏ ప్రతినిధి పేర్కొన్నారు.

ఆ ప్రకటన ప్రకారం.. కోస్ట్ గార్డ్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత, సాయుధ బీఎల్‌ఏ యూనిట్లు తదుపరి ఆపరేషన్లను ప్రారంభించాయి. ఆత్మాహుతి దాడికి సంబంధించిన వీడియోను బీఎల్‌ఏ విడుదల చేసింది.

ఈ ఆత్మాహుతి దాడికి సంబంధించిన 43-సెకన్ల వీడియోను కూడా బీఎల్‌ఏ మీడియా విభాగం 'హకల్' విడుదల చేసింది. పేలుడుకు కొన్ని క్షణాల ముందు పేలుడు పదార్థాలతో నిండిన ట్రక్కు శిబిరంలోకి ప్రవేశించడం, ఆ తర్వాత భారీ అగ్నిగోళం కనిపించడం ఈ వీడియోలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

బీఎల్‌ఏ చేసిన ప్రాణనష్టం వాదనలను పాకిస్తానీ అధికారులు వెంటనే ధృవీకరించలేదు. ఈ ఘటనపై అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఒక నిషేధిత వేర్పాటువాద సంస్థ. ఇది బలూచిస్తాన్‌లో పాకిస్తానీ భద్రతా దళాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన పలు దాడులకు బాధ్యత వహించింది.

Also Read: చాక్లెట్ దొంగతనం చేశాడని ఉద్యోగి తొలగింపు..చివరికి పోయి ఉద్యోగి కాళ్లు పట్టుకున్నారు

Also Read: టిక్‌టాక్‌‌లో లవర్స్ కిస్సింగ్ వీడియో..పబ్లిక్‌లో దారుణంగా కొరడా దెబ్బలతో శిక్ష!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

భద్ర రాజయోగం ఎఫెక్ట్‌.. ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, వ్యాపారంలో భారీ లాభాలు..

Hyderabad, Telangana:

Bhadra Rajayoga 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ నెలలో ఒక ముఖ్యమైన గ్రహాల మార్పు జరగబోతోంది. ఈ మార్పు కారణంగా అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన భద్ర రాజయోగం ఏర్పడబోతోంది.. జూలై 7వ తేదీ నుంచి బుధ గ్రహం ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడడం కారణంగా ఈ రాజయోగం మొదలవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని బుద్ధి, వాక్చాతుర్యం, విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్‌తో పాటు ఆలోచనలకు కారకుడిగా పరిగణిస్తారు. బుధుడు జూన్ చివరలోనే మిథునరాశిలోకి ప్రవేశించగా.. జూలై 7 నుంచి దీని ప్రభావం మరింత బలంగా మారబోతోంది.. బుధుడు తన సొంత రాశిలో లేదా ఉచ్ఛ రాశిలో మంచి స్థానంలో ఉన్నప్పుడు ఈ భద్ర రాజయోగం ఏర్పడుతుంది. ఈ శుభ యోగం కారణంగా కొన్ని రాశుల వారి కెరీర్, వ్యాపారం, ఆర్థిక స్థితి, నిర్ణయం తీసుకునే సామర్థ్యంపై సానుకూల ప్రభావం పడనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్రింది 3 రాశుల వారు ఈ యోగం వల్ల విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

ఆ అదృష్టాన్ని పొందే రాశుల వారు వీరే..
కర్కాటక రాశి (Cancer)
భద్ర రాజయోగం ప్రభావంతో కర్కాటక రాశి వారికి ఉద్యోగ, ఉపాధి రంగాలలో అద్భుతమైన సానుకూల మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. వీరి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు నిర్ణయాత్మక శక్తి గణనీయంగా పెరుగుతుంది. దీనివల్ల కార్యాలయంలో పైఅధికారుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు, కెరీర్‌లో కొత్త లాభదాయకమైన అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా మారుతుంది..

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ సమయం వ్యాపార పరంగా ఎంతో లాభదాయకంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు (Partnership Businesses) చేసే వారికి భారీ విజయాలు కలిగే అవకాశాలు కూడా కనిసిస్తున్నాయి. మార్కెట్లో ధనుస్సు రాశివారికి సంబంధించిన పరపతి విపరీతంగా పెరుగుతుంది. లాభదాయకమైన ఒప్పందాలు లేదా పెద్ద ప్రాజెక్టులు మీ ముందుకు వచ్చే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణకు ఇది అత్యంత అనుకూలంగా మారుతుంది.

మీన రాశి (Pisces)
మీన రాశి వారికి ఈ భద్ర రాజయోగం వల్ల కుటుంబ, ఆస్తి పరమైన విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఆస్తి వివాదాలు త్వరలోనే పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త వాహనాలు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ఆశించిన పదోన్నతి  లేదా కార్యాలయంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి..

ఈ రంగాల వారికి గోల్డెన్ పీరియడ్!
జ్యోతిష్య నిపుణుల అందించిన సమాచారం ప్రకారం.. ఈ రాజయోగం వల్ల సమాజంలో వ్యక్తుల ఆలోచనా విధానంతో పాటు జ్ఞానం విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మీడియా, జర్నలిజం, రచనా రంగం, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్‌తో పాటు క్రియేటివ్ రంగాలలో ఉన్నవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అద్భుతమైన విజయాలను అందిస్తాయి.

(నోట్‌: ఈ సమాచారం సాధారణ జ్యోతిష్య నమ్మకాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తీసుకు రాసింది మాత్రమే. వ్యక్తిగత జాతక చక్రాలతో పాటు గ్రహాల స్థితులను బట్టి రాశులవారి జీవితాల్లో ఫలితాలు, మార్పులు ఉంటాయి.)

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Liquor Prices: ఇక్కడ 2 లీటర్ల విస్కీ బాటిళ్ల ధరలు చూస్తే షాక్ అవుతారు!

Hyderabad, Telangana:

2 Litre Whisky Bottle Price In Goa Telugu: భారత్‌లోని అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రదేశం, సుందర తీరప్రాంతాల నిలయమైన గోవా అంటే కేవలం బీచ్‌లు, ప్రకృతి అందాలు మాత్రమే కాదు.. మద్యం ప్రియులకు ఇది ఒక స్వర్గం. సాధారణంగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. గోవాలో మద్యం ధరలు చాలా తక్కువగా ఉంటాయి. చాలా మంది మద్యం ప్రియులు సంవత్సరంలో ఒక్కసారైనా గోవాకు వెళ్లాలనుకుంటూ ఉంటారు. అయితే, ప్రస్తుతం అక్కడ లభిస్తున్న 2 లీటర్ల విస్కీ బాటిళ్ల ధరలు మద్యం ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. అందరూ ఎంతగానో ఇష్టపడే బ్రాండ్ల 2 లీటర్ల బాటిళ్లు ఊహించని రీతిలో అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. దీంతో పర్యాటకులు ఎగబడి మరి కొనుగోలు చేస్తున్నారు.

ఏ బ్రాండ్ ఎంత? 
గోవా లిక్కర్ మార్కెట్‌లో లభిస్తున్న కొన్ని ప్రముఖ బ్రాండ్ల 2 లీటర్ల బాటిళ్ల తాజా ధరల వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. బడ్జెట్ బ్రాండ్ల నుంచి ప్రీమియం స్కాచ్ విస్కీల వరకు భారీ ఎక్కువ మోతాదులో లభించే ఈ బాటిళ్ల ధరల వివరాల్లోకి వెళితే.. మెక్‌డొవెల్స్ (McDowell's 2L) ఇక్కడ కేవలం రూ. 880లోపే అందుబాటులో ఉంది. అంతేకాకుండా గోవా స్పెషల్ ఫెని (Goa Special Feni 2L) రూ. 1,000 ధరలో మాత్రమే లభించడం విశేషం. ఇక సిగ్నేచర్ (Signature 2L) రూ. 1,850కే లభిస్తోంది. దీంతో పాటు బ్లెండర్స్ ప్రైడ్ (Blenders Pride 2L) రూ. 1,850 ధరలో మాత్రమే అందుబాటులో ఉంది.  ఇక బ్లెండర్స్ రిజర్వ్ (Blenders Reserve 2L) రూ. 2,100 ధరతో లభిస్తోంది. బ్లాక్ డాగ్ గోల్డ్ స్కాచ్ విస్కీ (Black Dog Gold 2L) రూ.4,900 ధరలో మాత్రమే లభించడం విశేషం..

అరుదైన కలెక్షన్లు.. 
సాధారణ మార్కెట్‌లో చాలా అరుదుగా లభించే  బ్లెండర్స్ రిజర్వ్ (Blenders Reserve) వంటి ప్రీమియం వేరియంట్ 2 లీటర్ల బాటిల్ కూడా గోవాలో కేవలం రూ.2,100లకే అందుబాటులో ఉండడం విశేషం.. అంతేకాకుండా రాయల్ లుక్‌తో పాటు అద్భుతమైన రుచి కలిగిన స్కాచ్ విస్కీ  బ్లాక్ డాగ్ గోల్డ్ (Black Dog Gold) 2 లీటర్ల ప్రీమియం గ్లాస్ బాటిల్ కేవలం రూ. 4,900 లకే లభిస్తోంది. ఈ భారీ గ్లాస్ బాటిల్స్ కేవలం తాగడానికే కాకుండా.. కలెక్షన్లుగా దాచుకోవడానికి కూడా చాలా మంది ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు గోవా సాంప్రదాయ డ్రింక్‌గా భావించే.. స్పెషల్ ఫెని 2 లీటర్ల బాటిల్ వెయ్యి రూపాయలకే లభించడం విశేషం..

Also Read: Goaలో ఇంత చీప్‌గా బీరా, కరోనా, కింగ్‌ఫిషర్ దొరుకుతున్నాయా? 2026 లేటెస్ట్ రేట్లు ఇవే!

ఈ 2 లీటర్ల బాటిళ్ల ధరలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా గోవా వెళ్లాలనుకుంటున్న మందుబాబులు ఈ ధరలను చూసి పండగ చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. దాదాపు సగానికి పైగా ధరలు తక్కువగా ఉండడంతో పాటు మంది ఉద్యోగాలు చేసేవారు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి గోవా వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Also Read: Goaలో ఇంత చీప్‌గా బీరా, కరోనా, కింగ్‌ఫిషర్ దొరుకుతున్నాయా? 2026 లేటెస్ట్ రేట్లు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

0
0
Report
Advertisement

సమసప్తక యోగం ఎఫెక్ట్.. జూలై 4 నుంచి ఈ 5 రాశుల వారికి ఊహించని ధనలాభం, ఇక సువర్ణ కాలమే!

Hyderabad, Telangana:

Venus-Ketu Samasaptaka Yoga 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారాలకు, వాటి కలయికలు మానవ జీవితాలపై, ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇదిలా ఉంటే జూలై 4వ తేదీన శుక్రుడు, కేతువుల కలయిక కారణంగా అత్యంత అరుదైన, శక్తివంతమైన సమసప్తక యోగం ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడిని రాక్షస గురువు అని పిలుస్తారు.. అలాగే రాహు, కేతువులను కూడా కీడు గ్రహాలుగా పరిగణిస్తారు. అందుకే ఈ అద్భుతమైన యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా.. విపరీతమైన ధనలాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా 5 రాశుల వారు ఈ కాలంలో సువర్ణ కాలం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆయా రాశులవారికి ఈ సమయంలో అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు:
మేష రాశి (Aries) 
మేష రాశి వారికి శుక్ర, కేతువుల కలయిక ఐదవ స్థానంలో జరగడం కారణంగా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని శుభ ప్రభావంతో వీరు తప్పకుండా ఉన్నత విద్యను అభ్యసించి.. విద్యార్థులు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం కలగడం కారణంగా కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. తల్లిదండ్రులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి మానసిక బలం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఉద్యోగ రంగంలో మీ సృజనాత్మకతకు పైఅధికారుల నుంచి ప్రత్యేక ప్రశంసలు, పదోన్నతులు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఈ సమసప్తక యోగం నాల్గవ స్థానంలో ఏర్పడింది.. దీని వల్ల వీరి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ లేదా భూములపై పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలంగా మారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే కల నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శుక్రుడి అనుగ్రహంతో మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా.. తల్లితో ఉన్న బంధం మరింత మెరుగుపడుతుంది.

సింహ రాశి (Leo) 
సింహ రాశిలోనే ఈ ప్రత్యేక యోగం ఏర్పడుతుంది.. దీనివల్ల వీరికి సమాజంలో మరింత గుర్తింపు లభిస్తుంది.. వీరికి ఈ సమయంలో తప్పకుండా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి. తెలివితేటలు, నైపుణ్యంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీపై మీరు శ్రద్ధ వహించడానికి, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి ఇది అనుకూలమైన సమయంగా భావించవచ్చు.

తులా రాశి (Libra) 
తులా రాశి వారికి ఈ యోగం పదకొండవ స్థానంగా భావించే.. లాభ స్థానంలో ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో ఊహించని మార్గాల ద్వారా మీకు భారీగా ఆదాయం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు కూడా లభిస్తారు. అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్ల నుంచి ఆశించిన సపోర్ట్ కూడా లభిస్తుంది.. మీ మనస్సులో చాలా కాలంగా నెరవేరని కోరికలు ఈ సమయంలో పూర్తివుతాయి.

కుంభ రాశి (Aquarius) 
కుంభ రాశి వారికి ఏడవ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది.. దీనివల్ల అవివాహితులకు అనుకూలమైన వివాహ సంబంధాలు కుదురుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వివాహితుల జీవితంలో ప్రేమ, పరస్పర అవగాహన, ఆనందం కూడా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు (Partnership Business) చేసే వారికి భారీ లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో లేదా ప్రియమైన వారితో కలిసి ఆహ్లాదకరమైన ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

మీ వంటగదిలోని ఈ 3 వస్తువులతో.. ముఖంపై అవాంఛిత రోమాలకు శాశ్వతంగా చెక్ పెట్టండి!

Hyderabad, Telangana:

DIY Facial Hair Removal: చాలామంది మహిళలు ముఖం మృదువుగా, కాంతివంతంగా కనిపించాలని ఫేషియల్ హెయిర్‌ను తరచూ తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం థ్రెడ్డింగ్, వాక్సింగ్ వంటి పద్ధతులను వాడుతుంటారు.. దీనివల్ల సెలూన్‌లకు వెళ్లి ఖర్చు చేయడమే కాకుండా కొందరిలో చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. కానీ, మన పూర్వీకులు వాడే ఒక చక్కని ఇంటి చిట్కాతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. మన భారతీయ సంప్రదాయ సౌందర్య సాధనాల్లో శనగపిండికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శనగపిండితో పాటు గోధుమపిండి , చక్కెరను కలిపి వాడటం వల్ల ఫేషియల్ హెయిర్ సమస్య క్రమంగా తగ్గుతుంది.

దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. కేవలం వెంట్రుకలను తొలగించడమే కాకుండా ముఖానికి కొత్త కళను, కాంతిని కూడా అందిస్తుంది. సెలూన్‌కు వెళ్లే బదులు 10 రోజులకు ఒకసారి ఇంట్లోనే ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. ఇది ఒక మంచి ఎక్స్‌ఫోలియేటర్‌గా కూడా పనిచేస్తుంది.

ఇంట్లో ఉండే ఈ మూడు వస్తువులు థ్రెడ్డింగ్, వాక్సింగ్‌కు అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇవి సహజమైనవి కాబట్టి ముఖానికి మంచి కాంతిని ఇస్తూ వెంట్రుకలను తొలగిస్తాయి. భారతీయ సంప్రదాయాల్లో వాడే ఈ పద్ధతి వెంట్రుకల మూలాల నుండి వాటిని తొలగించడమే కాకుండా, అవి మళ్ళీ పెరగకుండా ఆలస్యం చేస్తుంది. అంతేకాకుండా చర్మంపై ఉన్న మృతకణాలను (dead skin cells) తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

ఫేషియల్ హెయిర్ మాస్క్ తయారీ విధానం..
ఒక స్పూన్ గోధుమపిండి, ఒక స్పూన్ శనగపిండి, అర చెంచా చక్కెర తీసుకోవాలి. ముందుగా గోధుమపిండిని, శనగపిండిని పెనంపై దోరగా వేయించాలి). పిండి మాడిపోకుండా జాగ్రత్త వహించి, గోల్డెన్ రంగు వచ్చాక చల్లారనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు పోసి అందులో చక్కెరను కరిగించి, వేయించిన పిండిని కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి.

READ Also:   వర్షాకాలంలో వారానికి ఒక్కసారైనా ముఖానికి ఆవిరి పడుతున్నారా? ఈ 7 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే?!

READ Also:   ఒత్తయిన పొడవాటి జుట్టు మీ సొంతం.. ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే హెయిర్ ఫాల్‌కి శాశ్వతంగా బైబై!

ఫేషియల్ మాస్క్ వేసుకునే విధానం..
ఈ మాస్క్ వేసుకునే ముందు ముఖంపై ఉన్న మేకప్ లేదా మాయిశ్చరైజర్‌ను పూర్తిగా తొలగించాలి. శుభ్రమైన ముఖంపై ఈ మాస్క్‌ను అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. అది ఆరిన తర్వాత, మృదువుగా సర్క్యులర్ మోషన్‌లో రుద్దాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బలహీనపడి ఊడిపోతాయి. క్రమం తప్పకుండా వాడటం వల్ల వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది.
సెలూన్ వెళ్లకుండా ప్రత్యామ్నాయం కోరుకునే వారు ఈ పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. ఇది తక్షణమే ఫలితాలను ఇవ్వకపోయినా, సహజంగా వెంట్రుకల పెరుగుదలను ఆలస్యం చేస్తుంది. మంచి ఫలితాల కోసం ప్రతి 10 రోజులకు ఒకసారి ఈ మాస్క్‌ను వాడాలి. అప్పుడు రాను రాను వెంట్రుకలు తగ్గుతాయని మీరు గమనిస్తారు.

అయితే, ఇది తక్షణ ఫలితాల కోసం వాడే ప్రత్యామ్నాయం కాదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి. ముఖంపై ఏదైనా దురద అనిపిస్తే దీనిని వాడకండి. మన భారతీయ సంప్రదాయంలో చిన్న పిల్లలకు కూడా శనగపిండిని వాడుతుంటారు, కాబట్టి ఇది వెంట్రుకల తొలగింపుకు చాలా సురక్షితమైన, మంచి రెమెడీ.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Shadashtak Yog 2026: శుక్ర, శనుల అరుదైన కలయిక.. ఈ 4 రాశుల తలరాతలు మారబోతున్నాయి!

Hyderabad, Telangana:

Shadashtak Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, వాటి కలయికలు, నక్షత్ర సంచారాలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని అరుదైన గ్రహాల స్థితులు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే 2026 జూలై 23, గురువారం ఉదయం 9 గంటల 46 నిమిషాలకు ఒక అత్యంత శక్తివంతమైన, అరుదైన ఖగోళ మార్పు సంభవించబోతోంది. శుక్రుడు, శని గ్రహాలు ఒకదానికొకటి 150 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన, అరుదైన షడష్టక యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారి తలరాతలు పూర్తిగా మారిపోబోతున్నాయి. ముఖ్యంగా 4 రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. కాసుల వర్షం కురవడమే కాకుండా.. ప్రేమ జీవితం కూడా అద్భుతంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్..
మేష రాశి: 
అరుదైన షడష్టక యోగం వల్ల మేష రాశి జాతకులకు గోల్డెన్ డేస్ మొదలు కాబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు, ఊహించని గుర్తింపు లభిస్తుంది.. సమాజంలో మీ వ్యక్తిత్వానికి ప్రత్యేక గౌరవం పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా ధనలాభం కలిగే ఛాన్స్‌ కూడా లభిస్తుంది. ఇక ప్రేమ వ్యవహారాల్లో గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి.. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

కర్కాటక రాశి: 
శుక్ర, శనుల ఈ ప్రత్యేక కలయిక కర్కాటక రాశి వారికి కొత్త వెలుగులను ప్రసాదించబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి.. సానుకూలత మరింత పెరుగుతుంది. జీవితంలోని అనేక సంక్లిష్ట సమస్యలకు సులభమైన పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోతుంది.. వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు విపరీతంగా పెరుగుతాయి. భౌతిక సుఖాలు, విలాసాలు విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

తులా రాశి: 
ఈ షడష్టక యోగం తులా రాశివారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సమయం గోల్డెన్ టైమ్‌గా భావించవచ్చు. అంతేకాకుండా అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశివారికి ఇది అద్భుతమైన సమయంగా మారవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వ్యాపారంలో భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రేమ జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నవారికి పెద్ద పెద్ద డీల్స్ ఫైనల్ అవుతాయి. ముఖ్యంగా ప్రేమ జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మిథున రాశి: 
మిథున రాశి వారికి ఈ యోగం అద్భుతమైన సమయాన్ని తీసుకు రాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో భారీ లాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.. ఇవి భవిష్యత్తులో మీకు ఎంతో సహాయపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కోర్టు కేసులు లేదా వివాదాల నుంచి వీరు తప్పకుండా విజయవంతంగా బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావారణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. అందరి ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యంగా ప్రేమ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది.

(నోట్‌: ఈ సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల అంచనాలు, ఇంటర్నెట్‌లో సమాచారం ఆధారంగా రాయబడింది. దీనిని నమ్మడం అనేది మీ వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.)

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో టేలర్ స్విఫ్ట్ గ్రాండ్ వెడ్డింగ్..మూడేళ్ల ప్రేమాయణానికి శుభం కార్డు..!!

BBhoomi7h ago
Secunderabad, Telangana:

Taylor Swift And Travis Kelce Officially Married:  పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ , ఫుట్‌బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీల అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ జంట న్యూయార్క్‌లోని చారిత్రాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో అధికారికంగా వివాహం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు వారి అంగరంగ వైభవమైన వేడుకకు హాజరయ్యారు. సోషల్ మీడియా నుండి మీడియా వరకు.. ఈ మెగా-వెడ్డింగ్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు. 

వీరి మూడేళ్ల ప్రేమాయణం జూలై 4న న్యూయార్క్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకతో ముగిసింది. ఈ వార్తను టేలర్ స్విఫ్ట్ పబ్లిసిస్ట్ అధికారికంగా ధృవీకరించారు. మాన్‌హాటన్‌లోని ప్రసిద్ధ క్రీడా వేదిక అయిన మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వెలుపల ఒక పెద్ద తెరపై  జస్ట్ మ్యారీడ్  అని ప్రదర్శించగా.. గ్రామీ అవార్డు గెలుచుకున్న కాన్సాస్ సిటీ చీఫ్స్ స్టార్ అయిన టేలర్ స్విఫ్ట్, రాయిటర్స్‌కు పంపిన ఒక ఈమెయిల్‌లో వెంటనే ఈ వివాహాన్ని ధృవీకరించారు.

ఎంతో వైభవంగా  జరిగిన వివాహా వేడుకకు హాలీవుడ్, సంగీత ప్రపంచానికి చెందిన అనేక మంది ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. హాలీవుడ్ హాస్యనటుడు ఆడమ్ శాండ్లర్ ఈ వేడుకను నిర్వహించారని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ ఘనమైన వివాహానికి ముందు, స్విఫ్ట్ స్వస్థలమైన నాష్‌విల్‌లో కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలో వారు రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తమ వివాహం ఎప్పటికీ గుర్తుండిపోయేలా..  ఈ జంట అమెరికాలోని 20 స్థానిక, జాతీయ స్వచ్ఛంద సంస్థలకు భారీ మొత్తంలో విరాళాలు అందించి తమ ఉదారతను ప్రదర్శించారు.  టేలర్ స్విఫ్ట్  అత్యంత సన్నిహితులు, సంగీత పరిశ్రమ ప్రముఖులైన ఎడ్ షీరన్ , సబ్రినా కార్పెంటర్, ఆరోన్ డెస్నర్ ఈ వివాహానికి హాజరయ్యారు. సుమారు 1,000 నుండి 1,200 మంది అతిథుల సమక్షంలో టేలర్, ట్రావిస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.

టేలర్ పెళ్లి బాధ్యతలు తీసుకున్న మార్క్ సీడ్:
ఈ వైభవోపేతమైన వివాహాన్ని రహస్యంగా.. విలాసవంతంగా జరిపించే బాధ్యతను హాలీవుడ్ ప్రఖ్యాత సెలబ్రిటీ వెడ్డింగ్ ప్లానర్ అయిన మార్క్ సీడ్ అతని బృందానికి అప్పగించారు. సోషల్ మీడియా, ప్రచారానికి దూరంగా..  తన వీఐపీ క్లయింట్లు అత్యంత గోప్యతను పాటించడం మార్క్ సీడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. మార్క్ సీడ్ .. హాలీవుడ్ తారల కోసం అత్యద్భుతమైన విలాసవంతమైన వివాహ ఏర్పాట్లు చేయడంలో ఆయన చాలా ఫేమస్ అని చెప్పాలి.

పెళ్లికి సుమారు 50 మిలియన్ డాలర్లు:
న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో జరిగిన ఈ అద్భుతమైన వివాహానికి 50 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేశారు. ఈ భారీ బడ్జెట్‌లో అధిక భాగం వేదికను బుక్ చేసుకోవడానికి, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడానికి, ఆడంబరమైన అలంకరణలకు,  అతిథులకు ఆహారపానీయాలు అందించడానికి వెచ్చించారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌ను అద్దెకు తీసుకోవడానికి, అలాగే అద్భుతమైన వివాహ పెవిలియన్, సెట్‌ను నిర్మించడానికి మాత్రమే సుమారు 28 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా.

2023లో స్నేహంగా ప్రారంభమైన వారి ప్రయాణం, ఆ తర్వాత ప్రేమగా వికసించింది. ఈ జంట 2025 ఆగస్టు 26న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ నిశ్చితార్థాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 సార్లు గ్రామీ అవార్డు విజేత టేలర్ స్విఫ్ట్,  మూడుసార్లు సూపర్ బౌల్ ఛాంపియన్ ట్రావిస్ కెల్సీల వివాహం వారి అభిమానులకు ఒక కల నిజమైన క్షణం అని చెప్పాలి. .

Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో

Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top