icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Chandrababu: నదీ జలాలపై దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకుసాగాలి: చంద్రబాబు

Salavankuppam, Tamil Nadu:

Southern Zonal Council Meeting: తెలంగాణ, ఏపీ విభజన జరిగి పుష్కర కాలం దాటినా విభజన చట్టంలోని అంశాలు ఇంకా నెరవేరలేదని దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదని గుర్తుచేశారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నదీ జలాల అంశంలో దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.

మహాబలిపురంలో హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. నదీ జలాలపై దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యం. కేంద్రం, రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలి' అని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు ప్రతిపాదన చేశారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ నడపాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి- బెంగళూరు- చెన్నై నగరాలను అనుసంధానించే రవాణా వ్యవస్థ ఉండాలని కోరారు.

'దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలి. దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించాలి. దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలి' సమావేశంలో సీఎం చంద్రబాబు కోరారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు.

'దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉంది. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలి' అని చంద్రబాబు తెలిపారు. 'పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు  కేంద్ర సహకారంతో సాకారం అవుతున్నాయి. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించాం. వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలి. దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలి' అని సీఎం చంద్రబాబు కోరారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కడప జేఎస్‌డబ్ల్యూ రైల్వే లింక్‌కు కేంద్ర అనుమతులు ఇవ్వాలన్నారు.

గోదావరి–కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదన సీఎం చంద్రబాబు చేశారు. గోదావరి–కావేరి అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అని పేర్కొన్నారు. నదీ జలాలపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. గంగా–కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరం అని గుర్తుచేశారు. నదుల అనుసంధానంపై కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం అని ప్రకటించారు.

0
0
Report
Advertisement

YS Jagan DSC Demands: "డీఎస్సీ లీకేజీలపై సీబీఐ విచారణ జరపాలి..లోకేష్‌ రాజీనామా చేయాలి" వైఎస్ జగన్‌ డిమాండ్‌!

Vijayawada, Andhra Pradesh:

YS Jagan Demands CBI Enquiry On DSC: ఆంధ్రప్రదేశ్‌ గతంలో జరిగిన మెగా డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణలో జరిగిన లీకేజీలు, అక్రమాలపై తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్‌.జగన్‌ డిమాండ్ చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్‌సీ (APPSC) అంశాలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను ఆయన మీడియా సమావేశంలో ప్రజల ముందుకు ఉంచారు. 

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తాము లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం గింజుకుంటోంది కానీ, సీబీఐ విచారణకు మాత్రం ముందుకు రావడం లేదని జగన్‌ ఆరోపించారు. 

ఈ అక్రమాలను గట్టిగా లేవనెత్తుతామనే భయంతోనే తమకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని, చివరికి ప్రతిపక్షం లేకుండానే సభను నడుపుతున్నారని జగన్ విమర్శించారు. ప్రత్యర్థి జట్టు లేని చోట, బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీ కొడుకులు ఇద్దరూ బ్యాటింగ్ చేసుకుంటూ తాము అద్భుతంగా చేశామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

డీఎస్సీ లీకేజీలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ తమ ఎమ్మెల్సీలు (MLCలు) నాలుగు రోజుల పాటు శాసనమండలిని స్తంభింపజేసినా ప్రభుత్వం చర్చకు సిద్ధపడలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అలాగే డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడం ద్వారా పారదర్శకతకు పాతరవేసి, లీకేజీలకు స్వయంగా ద్వారాలు తెరిచారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ప్రశ్నల తయారీ అనేది ఎస్సీఈఆర్టీ (SCERT) డైరెక్టర్ బాధ్యత కాగా, పరీక్ష నిర్వహించే బాధ్యత డీఎస్సీ కన్వీనర్‌దని ఆయన అన్నారు. 

అయితే, ఈ రెండింటినీ ఒకే వ్యక్తికి అప్పగించినట్లు లోకేష్‌ స్వయంగా అంగీకరించడమే కాకుండా, అందులో తప్పేముందని దబాయించారని విమర్శించారు. ఈ రెండు వ్యవస్థల మధ్య ఉండాల్సిన కనీస నియంత్రణలను ఎందుకు తొలగించారో.. అలాగే ఒకే వ్యక్తి చేతిలో రెండు కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలడానికి దర్యాప్తు జరగాలని జగన్ డిమాండ్ చేశారు. 

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి 'నవీన్' వివాదం.. 
డీఎస్సీ ప్రశ్నపత్రాలు తయారు చేసే విభాగంలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి 'నవీన్'కు పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని ప్రభుత్వం ఒప్పుకుందని వైఎస్ జగన్‌ తెలిపారు. క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉన్న నవీన్‌కు మొదటి ర్యాంక్ రావడంతో లీకేజీ స్పష్టంగా జరిగిందని, ఇది బయటపడితే గొడవ అవుతుందనే భయంతోనే మెరిట్ లిస్ట్ మార్చి అతనిని పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. మొదటి మెరిట్ లిస్టులో ఉన్న నవీన్ పేరును తొలగించి, రెండవ మెరిట్ లిస్టును ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. 

సీబీఐ దర్యాప్తునకు డిమాండ్..
నవీన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని తండ్రీ కొడుకులు ఇద్దరూ అసెంబ్లీలో, కోర్టులో అధికారుల చేత చెప్పించారని విమర్శించారు. అయితే, అభ్యర్థి ఐడీని బ్లాక్ చేసి, కనీసం కాల్ లెటర్ కూడా పంపనప్పుడు నవీన్ వెరిఫికేషన్‌కు ఎలా రాగలుగుతాడని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఆధారాలతో నవీన్ హైకోర్టులో అఫిడవిట్ కూడా వేశాడని పేర్కొన్నారు. అసెంబ్లీలో వీటికి తండ్రీ కొడుకులు (చంద్రబాబు, లోకేష్) సమాధానం ఎందుకు చెప్పలేదని జగన్ నిలదీస్తూ, ఈ తప్పులన్నింటిపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

Also Read: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కీలక అప్‌డేట్..మరి ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి ఇదే

Also Read: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం.. నదిలో దూకిన ఏఈ కుటుంబం..ముగ్గురు గల్లంతు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Eshwar Sai Madhuri Rathod: ఫోక్ డాన్సర్ల వివాదం.. ఈశ్వర్ సాయి భార్యపై రివర్స్ కేసు పెడుతున్న మాధురి రాథోడ్?

Hyderabad, Telangana:

Eshwar Sai Madhuri Rathod Controversy: ప్రముఖ ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి వివాహేతర సంబంధానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ల అక్రమ సంబంధం వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్‌లకు చేరి, ఇరు వర్గాల మధ్య పరస్పర ఫిర్యాదులు, తీవ్ర ఆరోపణలతో సంచలనం సృష్టిస్తోంది.

అయితే ఈ వివాదం వేములవాడలోని రెడ్డి భవన్‌లో మొదలైంది. ఈశ్వర్ సాయి కోసం అతని భార్య శరణ్య, ఆమె సోదరి కలిసి అక్కడికి వెళ్లగా, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరూ ఒకే ఇంట్లో పట్టుబడ్డారు. ఆ సమయంలో అక్కడ ఒక చిన్నారి కూడా ఉంది. దీనికి సంబంధించిన దృశ్యాలను శరణ్య సోదరి తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేసింది. 

ఇదే విషయమై తాము ప్రశ్నించినందుకు ఈశ్వర్ సాయి, అతని అసిస్టెంట్ తమపై దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మొబైల్ ఫోన్లు లాక్కున్నారని శరణ్య సోదరి ఆరోపించింది. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లోని రాయిదుర్గం పోలీస్ స్టేషన్‌లో శరణ్య సోదరి ఫిర్యాదు చేసింది. 

అయితే, ఇల్లీగల్ అఫైర్ వ్యవహారం తమ పరిధిలోకి రాదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పరస్పర ఇష్టంతో ఉండే సంబంధాలు నేరం కిందకు రావని పోలీసులు స్పష్టం చేశారు. దాడులు లేదా ఫోన్ లాక్కున్న ఘటన వేములవాడలో జరిగింది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేసుకోవాలని రాయిదుర్గం పోలీసులు వారికి సూచించారు.

మరోవైపు ఈ వ్యవహారంలో సదరు మాధురి రాథోడ్ కమ్యూనిటీకి చెందిన వారు ఎదురుదాడికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తను తన స్నేహితుడైన ఈశ్వర్ సాయితో ఉన్న సమయంలో శరణ్య, ఆమె సోదరి అకారణంగా లోపలికి వచ్చి, తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని మాధురి పేర్కొంది. 

అంతేకాకుండా తనను కులం పేరుతో దూషిస్తూ అవమానించారని.. వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసి పరువు తీశారని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై శరణ్య, ఆమె సోదరిపై వేములవాడ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేందుకు మాధురి చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే, మాధురి రాథోడ్ పక్కనే ఉంటూ నటిస్తూ, తన భర్తను వలలో వేసుకుని, లొంగతీసుకుని ఇల్లు చేరకుండా చేస్తోందని ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఇరువర్గాలు చట్టపరమైన చర్యల కోసం సిద్ధమవుతుండటంతో వేములవాడ పోలీసులు వీటిపై దృష్టి సారించారు.

Also Read: నటి మీనా భర్త మృతి వెనుక అసలు నిజం ఇదే..ఇంటర్వ్యూలో చెబుతూ కంటతడి పెట్టిన హీరోయిన్!

Also Read; 'ఇరుముడి' సినిమా ఫస్ట్ రివ్యూ..రవితేజ కంబ్యాక్..థియేటర్లలో అయ్యప్ప శరణుఘోష పక్కా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

AC Side Effects Monsoon: వర్షాకాలంలో కూడా ఏసీ వాడుతున్నారా? అయితే మీరు ఈ సమస్యలు తెచ్చిపెట్టుకున్నట్టే!

Hyderabad, Telangana:

AC Side Effects In Monsoon: వర్షాకాలంలో ఉక్కపోత, తేమ నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఎక్కువ సమయం ఏసీ (AC) గదుల్లోనే గడుపుతుంటారు. అయితే ఏసీ నుండి వచ్చే చల్లని, పొడి గాలి చర్మానికి తీవ్ర హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ చర్మవాధుల నిపుణుల సూచనల ప్రకారం.. ఈ సీజన్లో ఏసీ వాడేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో, వాటిని ఎలా నివారించాలో ఇక్కడ చూద్దాం.

చర్మం పొడిబారడం, ఇన్ఫెక్షన్లు..
బయటి వాతావరణంలోని తేమకు, ఏసీ గదిలోని పొడి గాలికి మధ్య జరిగే నిరంతరం మార్పు వల్ల చర్మం సహజ తేమను కోల్పోతుంది. దీనివల్ల చర్మం పొడిబారి, తీవ్రమైన దురద, చికాకు కలుగుతాయి. గోకడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

చేయకూడని తప్పులు..
1) తక్కువ ఉష్ణోగ్రతలో ఏసీ వాడకం అనగా చాలా మంది ఏసీని 16 లేదా 18 డిగ్రీల వద్ద సెట్ చేస్తుంటారు. అలా కాకుండా ఉష్ణోగ్రతను 25 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం చర్మానికి మంచిది.

2) నేరుగా గాలి తగలకుండా చూసుకోవడం అంటే.. ఏసీ లేదా కార్ వెంట్స్ నుంచి వచ్చే బలమైన గాలి నేరుగా ముఖానికి తగిలేలా ఉంటే చర్మం త్వరగా పొడిబారుతుంది. గాలి పక్కకు వెళ్లేలా వెంట్లను సర్దుబాటు చేసుకోవాలి.

3) తగినంత నీరు తాగకపోవడం అనగా.. రోజంతా ఏసీ ఆఫీసుల్లో ఉండేవారు తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు. ఇది చర్మాన్ని నిర్జీవంగా మారుస్తుంది.

4) మాయిశ్చరైజర్ వాడకపోవడం మంచిది. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి తేలికపాటి మాయిశ్చరైజర్, పెదవులకు లిప్ బామ్ రాసుకోవడం వల్ల చర్మంలో తేమ నిలుస్తుంది.

చర్మ పరిశుభ్రత, ఆహారం..
వర్షాకాలంలో తేమ, చెమట కారణంగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. అందుకే మంచి సబ్బుతో రోజుకు రెండుసార్లు స్నానం చేయడం, ముఖాన్ని శుభ్రమైన నీటితో రోజుకు 2-3 సార్లు కడుక్కోవడం మంచిది. అలాగే పోషకాలున్న పండ్లు, ఆకుకూరలు తింటూ చర్మాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

Also Read: బరువు తగ్గడానికి 'యాపిల్ సైడర్ వెనిగర్' మంచిదా..?

Also Read: Weight Loss Tips: వాకింగ్ Vs రన్నింగ్..ఫాస్ట్‌గా బరువు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Konda Surekha: వివాదాల కేరాఫ్ అడ్రస్‌గా మంత్రి కొండా సురేఖ.. డిఫెన్స్‌లో కాంగ్రెస్!

Hyderabad, Telangana:

Minister Konda Surekha News: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా మంచి గుర్తింపు పొందిన మంత్రి కొండా సురేఖ చుట్టు వివాదాలు వీడకుండా చుట్టూ ముడుతూనే ఉన్నాయి.. తనదైన దూకుడు శైలిలో వార్తల్లో నిలిచే ఆమె.. చేసిన వరుస వ్యాఖ్యలతో పాటు చోటు చేసుకున్న పరిణామాలు ప్రభుత్వానికి.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతూ వస్తున్నాయి.. గత కొద్ది కాలంగా ఒక వివాదం ముగిసేలోపే మరొకటి తెరపైకి వస్తూ ఆమెను రాజకీయంగా సుడిగుండంలోకి నెడుతోంది..

సినీనటి సమంత విడాకుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.. రాజకీయ విమర్శల క్రమంలో సినీ ప్రముఖుల పేర్లను ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఇతర రాజకీయ పార్టీ నాయకులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు న్యాయపరమైన వివాదాలకు కూడా దారి తీసిన సంగతి తెలిసిందే. పరిస్థితి తీవ్రతను గమనించిన ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం కాస్త సర్దుమనిగిపోయింది..

సమంత వివాదం చల్లారుతున్న సమయంలోనే.. మంత్రులు ఫైల్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర ఆగ్రహానికి దారి తీసేలా చేశాయి.. క్యాబినెట్ సహచరులపైనే తీవ్ర ఆరోపణలు చేసినట్లు అవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సంగతి కూడా తెలిసిందే.. ఈ ప్రకటనతో అటు ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శల దాడికి దిగాయి.

 Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?

మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేత కడియం శ్రీహరితో జరిగిన ప్రోటోకాల్ వివాదం కూడా పార్టీ వర్గాల్లో తీవ్రమైన చర్చనీ అంశానికి దారితీసింది.. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో టెండర్ల ప్రక్రియకు సంబంధించిన అంశాలు కూడా అంతర్గత విభేదాలను రచ్చకెక్కించేలా చేశాయి.. ఇలా వరుస వివాదాలతో సతమతమవుతున్న తరుణంలో.. తాజాగా ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు మంత్రి సురేఖకు మరింత తలనొప్పిగా మారేలా చేశాయి.. సొంత పార్టీ నేతలతో సమన్వయం లేకపోవడంతో పాటు దూకుడుగా మాట్లాడే శైలి ఆమెను మరింత డిఫెన్స్లో పడేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. వరుస వివాదాల నేపథ్యంలో అధిష్టానం ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది..

 Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Meena Husband Death: నటి మీనా భర్త మృతి వెనుక అసలు నిజం ఇదే..ఇంటర్వ్యూలో చెబుతూ కంటతడి పెట్టిన హీరోయిన్!

Hyderabad, Telangana:

Meena Husband Death Reason: దక్షిణాది చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన మీనా వ్యక్తిగత జీవితంలో 2022లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆమె భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందడం అప్పట్లో సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంపై రకరకాల పుకార్లు వచ్చినప్పటికీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీనా స్పందిస్తూ తన భర్తను కాపాడుకునేందుకు తాను పడిన వేదనను తలచుకుని తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యారు.

నటి మీనా భర్త విద్యాసాగర్ మృతికి సంబంధించి ఆమె మాట్లాడుతూ.. ఆయనకు ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్‌ప్లాంట్) చేయాల్సి వచ్చిందని తెలిపారు. అప్పట్లో ఈ వైద్య ప్రక్రియ గురించి తమకు అంతగా అవగాహన లేదని, ఆ మెడికల్ ప్రాసెస్ చాలా పెద్దదానిని ఆమె వెల్లడించారు.

వైద్యం కోసం దేశమంతా తిరిగిన వైనం..
భర్తను బతికించుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు ఇలా దేశంలోని పలు ప్రాంతాల్లో బెస్ట్ ట్రీట్‌మెంట్ కోసం శతవిధాలా ప్రయత్నించినట్లు మీనా చెప్పారు. అమెరికా వెళ్లి వైద్యం చేయిద్దామని ఆలోచించినా, అక్కడి డాక్టర్లు కూడా ఇక్కడ ఇస్తున్న చికిత్సనే అక్కడ కూడా ఇస్తారని, ఈ స్థితిలో ప్రయాణం చేయడం క్షేమం కాదని చెప్పడంతో ఇండియాలోనే ఉండాల్సి వచ్చిందన్నారు.

లంగ్స్ మార్పిడి కోసం పలుమార్లు అలెర్ట్స్ వచ్చినా.. మెడికల్ క్రైటీరియా సరిపోకపోవడం, అవయవాలు మ్యాచ్ కాకపోవడంతో మూడు, నాలుగు సార్లు ఆస్పత్రికి వెళ్లి వెనుదిరిగిన సందర్భాలున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని చెప్పారు.

భర్త మరణం తర్వాత తాను కుటుంబంతో కలిసి చాలా కఠినమైన రోజులను ఎదుర్కొన్నానని మీనా పేర్కొన్నారు. ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, తన స్నేహితులు, సినిమాల సాయంతో ఆ విషాద ఛాయల నుంచి క్రమంగా బయటపడుతున్నట్లు ఆమె తెలిపారు.

Also Read: 'ధురంధర్' నటి ఆయేషా ఖాన్ నిశ్చితార్థం..అతడి ఫొటో సీక్రెట్‌గా..సోషల్ మీడియాలో వైరల్!

Also Read: 'చెన్నై లవ్‌స్టోరీ' నుంచి 'జన నాయగన్' వరకు..ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Rare Crime: ఐఫోన్, ప్రియుడి బైక్ కోసం కన్న తాతనే చంపేసిన 13 ఏళ్ల మైనర్ బాలిక..

Hyderabad, Telangana:

Rare Crime In Kerala: లగ్జరీ జీవితంతో పాటు ఖరీదైన స్మార్ట్ ఫోన్లపై పెంచుకున్న ఓ పిచ్చి వ్యామోహం.. ఓ మైనర్ బాలిక ను నేరస్తురాలుగా మార్చేసింది.. చేతిలో ఐఫోన్ ఉండాలని.. ప్రియుడితో కలిసి సూపర్ బైక్ పై చెక్కర్లు కొట్టాలన్న దురాశతో.. పెంచి పెద్ద చేసిన కన్న తాత ప్రాణాలని తీసేసింది 13 ఏళ్ల ఒక బాలిక.. కేరళలోని అలప్పుజ జిల్లాలు వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ గా మారింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు ఏమైందంటే..
అలప్పుజకు సంబంధించిన 60 ఏళ్ల వృద్ధుడు తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కనిపించాడు.. ఇంట్లో బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు మాయం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదటగా దీనిని దొంగతనం కోసం జరిగిన హత్యగా భావించి.. అదే కోణంలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు..

అయితే, ఇంట్లోని పరిస్థితులతో పాటు అనుమానితుల కదలికలను పరిశీలించిన పోలీస్ అధికారులు మనమరాలి ప్రవర్తన పై అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అదే సమయంలో ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. కళ్లు బైర్లు కమ్మి నిజాలు బయటపడి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాయి..

క్రైమ్ సినిమాను తలపించే పథకం..
విచారణలో బాలిక వెల్లడించిన విషయాలను విన్న పోలీసులే ఊహించని స్థాయిలో ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. తనకు కొత్త ఐఫోన్ కావాలని.. తన ప్రియుడికి ఒక సూపర్ బైక్ కొనివ్వాలని ఆమె ముందుగా భావించిందట.. దీనికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవ్వడంతో.. ఇంట్లో ఉండే తాతను అడ్డు తొలగించుకొని.. నగలను దోచుకోవాలని పథకం రచించిందని దర్యాప్తులో తేలింది. 

ఈ కుట్రలో తమ ప్రియుడితో పాటు మరో ఇద్దరు మైనర్ స్నేహితులను భాగస్వాములు చేసింది ఆ మైనర్ నిందితురాలు.. పక్కా ప్రణాళిక ప్రకారం తాత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి ప్రియుడితో పాటు అతని స్నేహితులతో లోపలికి ప్రవేశించిందట.. వృద్ధిడి పై దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపారు.. అనంతరం ఇంట్లో బంగారంతో పాటు నగలను దోచుకుని అక్కడి నుంచి పారిపోయారట.. దోచుకున్న బంగారాన్ని అమ్మి అనుకున్నవన్నీ కొనుగోలు చేసే లోపే పోలీసులు వీరి గుట్టును రట్టు చేసేసారు..

 Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?

పోలీసుల అదుపులో నిందితులు..
హత్యకు పాల్పడిన బాలికతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారట.. వారి వద్ద నుంచి చోరీ చేసిన బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాకుండా నిందితులంతా మైనర్లు కావడంతో వారిని ప్రత్యేకమైన జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు చేసి.. రిమాండ్ హోమ్ కు తరలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు..

 Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Venus Transit: శుక్ర సంచారంతో గోల్డెన్ డేస్.. ఉద్యోగంలో ప్రమోషన్లు, భారీ లాభాలు పొందే లక్కీ రాశులివే!

Hyderabad, Telangana:

Venus Transit In Chitra Nakshatra Effect: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ గ్రహం సంపదతో పాటు ప్రేమ వైభవం విలాసం సౌందర్యానికి కారకుడిగా కూడా భావిస్తారు. ఇదిలా ఉంటే ఆగస్టు 25వ తేదీన 12 గంటల సమయంలో శుక్రుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఒకటే నక్షత్రంలో సంచార దశలో ఉండబోతోంది. ముఖ్యంగా చిత్రా నక్షత్రంలోకి శుద్రుడు ప్రవేశించడం కారణంగా మొత్తం నాలుగు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడబోతోంది. ఈ సమయంలో విపరీతమైన ఆధార మార్గాలు పెరగడమే కాకుండా కొన్ని రాశుల వారికి ఉద్యోగాలపరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పురోగతి కూడా లభిస్తుంది. శుక్రుడి సంచారం కారణంగా ఏయే నాలుగు రాశుల వారికి సమయం అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్ లాభాలు:

మేషరాశి 
చిత్రా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించిన వెంటనే మేషరాశి వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులు కార్యాలయాల్లో మంచి మంచి పనులు చేయగలుగుతారు. కొత్త ప్రాజెక్టుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వనరులు కూడా అంచలంచలుగా పెరుగుతాయి. అంతేకాకుండా డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

వృషభ రాశి 
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా శుక్రుడు సంచార ప్రభావం కొత్త ప్రణాళికలను కూడా విజయవంతం చేస్తుంది. వృత్తిలో గొప్ప పురోగతి లభించడమే కాకుండా మంచి మంచి పదోన్నతులు లభించేలా చేస్తుంది. ముఖ్యంగా ఎప్పటినుంచో మానసిక ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ పరిష్కారం కూడా లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు.  

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు చిత్రా నక్షత్రంలో శుక్రుడు ప్రవేశించడం కారణంగా ఈ సమయం గోల్డెన్ పీరియడ్‌గా మారుతుంది. అంతేకాకుండా కొత్త మార్గాల నుంచి ఆదాయం కూడా విపరీతంగా లభిస్తుంది.. ఈ సమయంలో సంతోషకరమైన రోజు కూడా రావడం ప్రారంభమౌతాయి. వ్యాపారాల్లో భారీ లాభాలు కలగడమే కాకుండా పాత పెట్టుబడిల నుంచి అనుకున్న ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. 

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శుక్రుడి ప్రభావంతో జీవితంలో అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగాలు మారాలని అనుకుంటున్న వ్యక్తులందరికీ మంచి ఆఫర్స్ లభిస్తాయి. ముఖ్యంగా కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.. సమాజంలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు ఊహించని స్థాయిలో మెరుగుపడి.. అద్భుతమైన గౌరవంతో పాటు ఆనందం పొందగలుగుతారు. ముఖ్యంగా కుటుంబంలో మంచి రోజులు రావడం ప్రారంభమవుతాయి.

గమనిక.. ఇక్కడ అందించిన సమాచారం కేవలం అంచనాలతో పాటు జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే. దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

E10 Petrol: వాహనదారులకు బిగ్ రిలీఫ్..పెట్రోల్ బంకుల్లో పాత వాహనాల కోసం మళ్లీ E10 పెట్రోల్ అందుబాటులో!

Hyderabad, Telangana:

E10 Petrol Brings Back: దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్ కలపడంపై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక పునరాలోచనలో పడింది. వాహనాల మైలేజ్, ఇంజిన్ ఆయుష్షు తగ్గిపోతున్నాయంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, పాత వాహనాల కోసం ప్రత్యేకంగా E10 పెట్రోల్ (10 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం)ను మళ్లీ బంకుల్లో అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) అనంత నాగేశ్వరన్ ప్రతిపాదించారు. కొత్త వాహనాలకు మాత్రం E20ని యథావిధిగా కొనసాగించాలని ఆయన సూచించారు.

కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం దేశంలో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ చేసిన E20 పెట్రోల్ అమల్లో ఉంది. అయితే పాత ఇంజిన్లు ఉన్న మోటార్ సైకిళ్లు, కార్ల యజమానులు దీనివల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో E10ని పునరుద్ధరిస్తే ధరలు ఏ విధంగా ఉంటాయనే దానిపై మార్కెట్లో చర్చ నడుస్తోంది.

ధరల అంచనా..
ప్రస్తుత ట్యాక్స్‌లు, పెట్రోల్, ఇథనాల్ బేస్ ధరల ఆధారంగా చూస్తే.. E20తో పోలిస్తే E10లో పెట్రోల్ శాతం (90%) కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీంతో దీని లీటరు ధర సుమారు రూ.103 నుంచి రూ.105 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు.

ఇథనాల్ కలపని ప్రీమియం ఇంధనాలు..
మరోవైపు ఎలాంటి ఇథనాల్ కలపని స్వచ్ఛమైన E0 ప్రీమియం పెట్రోల్ (100 ఆక్టేన్) కూడా కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులో ఉంది. ఇండియన్ ఆయిల్ (XP100), హెచ్‌పీ (Power100), బీపీసీఎల్ (Speed100) వంటి సంస్థలు విక్రయిస్తున్న ఈ ఇంధనాన్ని బ్లెండింగ్ నిబంధనల నుంచి మినహాయించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోని సెలెక్టెడ్ బంకుల్లో ఇది లభిస్తోంది.

పాత వాహనదారులకు ఎదురవుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఈ-10 ఇంధనాన్ని పునరుద్ధరించే ప్రపోజల్‌పై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది అమలైతే పాత మోడల్ వాహనాల డ్రైవర్లకు పెద్ద ఉపశమనం లభించనుంది.

Also Read: స్కూల్ విద్యార్థులపై వీధికుక్కల వరుస దాడులు..ఆ స్కూళ్లకు వరుసగా 4 రోజులు సెలవులు!

Also Read: మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్..మూడో బిడ్డ ప్రసవానికి 365 రోజులు ప్రసూతి సెలవులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Cinema Ticket Prices: తెలంగాణలో సినిమా థియేటర్లలో కొత్త రేట్లు..నిర్మాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

Hyderabad, Telangana:

Telangana Cinema Ticket Prices: తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపు, థియేటర్ల నిర్వహణపై సంచలన జీవోను విడుదల చేసింది. భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ హైక్స్ ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో సంక్షేమ నిధులకు కేటాయింపులతో పాటు, అన్ని రకాల థియేటర్లకు కొత్త కనిష్ఠ, గరిష్ఠ ధరలను ఖరారు చేసింది.

థియేటర్ల వారీగా టికెట్ ధరల వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక ఆదేశాల ప్రకారం.. నాన్-ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియం టికెట్లు రూ.30 నుంచి రూ.70 వరకు.. అలాగే ప్రీమియం రూ.50 నుంచి రూ.100 వరకు నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియం రూ.50 - రూ.150 ఉండగా.. ప్రీమియం రూ.100 - రూ.200 ఉండనుంది. అదే విధంగా స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో రెగ్యులర్/నాన్-ప్రీమియం రూ.100 - రూ.250.. రిక్లయినర్లు రూ.200 - రూ.300 గా ధరలను నిర్ణయించారు.

షోల పెంపు, చిన్న సినిమాలకు ప్రాధాన్యం..
ప్రతి థియేటర్‌లో రోజుకు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతినిచ్చారు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక షో చిన్న సినిమాల ప్రదర్శనకు కేటాయించాలని, పండుగ సీజన్లలో చిన్న/మీడియం బడ్జెట్ చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

ఇతర ముఖ్యమైన మార్గదర్శకాలు..
రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలకు మొదటి 10 రోజులు మాత్రమే టికెట్ ధరల పెంపు వర్తిస్తుంది. అయితే సినీ కార్మిక సంక్షేమ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చే చిత్రాలకే ఈ పెంపు అవకాశం లభిస్తుంది.

మల్టీప్లెక్స్‌లతో సహా అన్ని థియేటర్లలో పేద, మధ్యతరగతి ప్రేక్షకుల కోసం 25 శాతం సీట్లు (నాన్-ప్రీమియం) తప్పనిసరిగా కేటాయించాలి. ఆన్‌లైన్ బుకింగ్స్‌పై ఏసీ థియేటర్లకు రూ.5, నాన్-ఏసీ థియేటర్లకు రూ.3 నిర్వహణ ఛార్జీలు ఉంటాయి. రాబోయే రెండేళ్లలో ఎయిర్ కూల్డ్ థియేటర్లన్నీ ఏసీ థియేటర్లుగా మారాలని స్పష్టం చేశారు.

కార్మికుల సంక్షేమ నిధికి 20% వాటా..
'అఖండ 2', 'ది రాజాసాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు', 'పెద్ది' వంటి భారీ సినిమాలకు టికెట్ ధరల పెంపును అనుమతించిన ప్రభుత్వం.. ఆ హైక్స్ ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 'తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్', 'ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (TGFDC) ఖాతాల్లో జమ చేసి సినీ కార్మికుల సంక్షేమానికి వినియోగించనున్నారు.

Also Read: హైదరాబాద్‌లో మరో దారుణమైన హత్య..లవర్‌ని హత్య చేసి గోనెసంచిలో కుక్కిన ప్రియుడు!

Also Read: Balapur Ganesh Theme: ఈసారి బాలాపూర్ గణేష్‌కు పూరీ జగన్నాథ్ ఆలయం థీమ్..ఎలా ఉండబోతుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

India In WTC Cycle: డబ్ల్యూటీసీ రేసులో భారత్ అసలు సిసలైన పరీక్ష.. ఫైనల్‌కు చేరాలంటే భారత్‌ ఈ మ్యాచ్‌ల్లో గెలవాల్సిందే!

Hyderabad, Telangana:

India In WTC 2027 Cycle: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు అర్హత సాధించేందుకు భారత క్రికెట్ జట్టు కీలకమైన పోరుకు సిద్ధమవుతోంది. శ్రీలంక గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం 53.33 శాతంతో ఐదో స్థానంలో ఉన్న టీమిండియా, ఫైనల్ రేసులో నిలకడగా కొనసాగాలంటే అద్భుత ప్రదర్శన చేయడం తప్పనిసరి కానుంది.

గత రెండు డబ్ల్యూటీసీ సీజన్లలో వరుసగా ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్, రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇప్పుడు ప్రస్తుత సీజన్‌లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. సాధారణంగా 60 శాతానికి పైగా పాయింట్లు సాధించిన జట్లు మాత్రమే ఫైనల్‌కు అర్హత సాధిస్తున్న చరిత్ర ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ తన వ్యూహాలను రచిస్తోంది.

శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తే, భారత్ పాయింట్ల శాతం 57.57కు పెరిగే అవకాశం ఉంది. లంక పర్యటన ముగిసిన తర్వాత భారత్‌కు అసలైన పరీక్ష ఎదురుకానుంది. 

న్యూజిలాండ్ గడ్డపై రెండు టెస్టుల సిరీస్, ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక సిరీస్‌లలో భారత్ తలపడాల్సి ఉంది. మిగిలివున్న మొత్తం 8 టెస్టుల్లో భారత్ కనీసం 6 నుంచి 7 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే టాప్-2 స్థానం ఖాయమవుతుంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా (77.78%), దక్షిణాఫ్రికా (75%), న్యూజిలాండ్ (72.22%) జట్లు పట్టికలో అగ్రభాగంలో ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికాకు రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లతో కఠినమైన మ్యాచ్‌లు ఉండటం భారత్‌కు సానుకూలాంశంగా మారవచ్చు. ఏదేమైనా, రాబోయే కివీస్, ఆసీస్ సిరీస్‌లే టీమిండియా ఫైనల్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.

Also Read: శ్రీలంకతో తొలిటెస్టులో భారత్ ఘన విజయం..10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ మానవ్ సుతార్!

Also Read: టెస్టుల్లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు..రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ రికార్డు బ్రేక్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top