గోశామహల్: మర్డర్లకు అడ్డగా పాతబస్తీ
Hyderabad, Telangana:హైదరాబాద్ పాతబస్తీలో లా అండ్ ఆర్డర్ చనిపోయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాతబస్తీలో మర్డర్లు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఉదయం రాత్రి అనే తేడా లేకుండా ఘటనలు జరుగుతున్నాయని వాపోయారు. పోలీసులు దీనికోసం పెట్రోలింగ్ నిర్వహిస్తుంటే వారిపై ఎంఐఎం ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఇటువంటివి అరికట్టాలని డిమాండ్ చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Cobra On Scooter Video: యాక్టివాపై నాగుపాము హల్చల్.. ప్రాణాలకు తెగించి పట్టుకున్న స్నేక్ క్యాచర్.. వీడియో..
Hyderabad, Telangana:Cobra On Scooter Video Watch Here: నేటి కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని వింత వింత ఆశ్చర్యం కలిగించే ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టక మానదు.. నడిరోడ్డుపై ఆగి ఉన్న ఒక యాక్టివా స్కూటీపై భారీ నాగుపాము పడగవిప్పి హల్చల్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ఆ స్కూటీ పైకి పాము ఎలా వచ్చిందనేది అసలు ఎవ్వరికీ తెలీదు. కానీ స్కూటీపై పడక విప్పి నిలబడి నానా హంగామా సృష్టించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..
సాధారణంగా పాములు పొదల్లోనూ.. పచ్చిక మైదానంలోనో.. అడవుల్లోనూ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఘటనలు ఒక వ్యక్తి తన యాక్టివ్ స్కూటీని రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగివచ్చి చూసేసరికి కూటి వెనక భాగంలో ఒక భారీ నాగుపాము బయటికి వచ్చి పడక విప్పి నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. ఈ పాము పరిమాణం.. దాని ఆవేశం చూసి అక్కడున్న వారంతా భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది..
స్కూటీపై పడగ విప్పి నాగుపాము..
రోడ్డుపై వెళ్లే వాహనదారులు స్కూటీపై పడగ విప్పి ఉన్న పామును చూసి ఆశ్చర్యపోయారు. క్షణాల్లో ఈ వార్త స్థానికంగా వ్యాపించడంతో స్థానికులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పాము ఎక్కడ వారిపై దాడి చేస్తుందోనని అందరూ భయాందోళనకు గురై.. ఆ స్కూటీకి దూరంగా నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. అయితే, స్థానికులు వెంటనే స్థానికంగా ఉన్న స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు.. రంగంలోకి దిగిన వారు అత్యంత చాకచక్యంగా ఆపరేషన్ను ప్రారంభించారు..
బుసలు కొడుతూ పాము హల్చల్..
ఆ పాము అత్యంత ప్రమాదకరమైన రీతిలో బుసలు కొడుతూ ఉండడం మీరు చూడొచ్చు. అయితే స్నేక్ క్యాచర్స్ ఎలాగోలా ఆ పామును పట్టుకొని ఒక సంచిలో బంధించి సురక్షితమైన పరిసరాల్లో వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ పామును పట్టుకోవడానికి స్నేక్ క్యాచర్స్ కొన్ని గంటలపాటు శ్రమించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను స్నేక్ క్యాచర్స్ బృందంలోని ఒకరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ తో పాటు వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ వస్తోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
వైరల్ వీడియో..
వర్షాకాలం సమీపిస్తున్న సమయంలో పాములు బయటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. వాహనాలు పార్కు చేసేటప్పుడు తిరిగి స్టార్ట్ చేసే సమయంలో వాటిని తప్పకుండా ఒకటికి రెండుసార్లు పరిశీలించడం చాలా మంచిదని వారంటున్నారు. లేకపోతే అత్యంత ప్రమాదకరమైన వన్యప్రాణులు వాహనాల్లో దూరి మనుషులపై దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్లోని సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చాలామంది ఈ వీడియో చూసి వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్..
Re NEET 2026: నీట్ ఎగ్జామ్ కొత్త తేదీ ప్రకటించిన NTA..పరీక్షకు 15 నిమిషాలు పెంపు!
Hyderabad, Telangana:Re NEET 2026 Date: ఇటీవలే జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ NEET) పేపర్ లీక్ నేపథ్యంలో దాన్ని తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రీ-నీట్ ను 2026 జూన్ 21న నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అయితే ఈసారి పరీక్ష రాసే అభ్యర్థులకు కొంతమేర ఊరట కలిగించారు. పరీక్ష రాసే విద్యార్థులకు 15 నిమిషాలు అదనంగా సమయం ఇస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.Used Cars In Delhi: కేవలం రూ.99 వేలకే మారుతి, టాటా కార్లు.. ఎక్కడో తెలుసుకోండి!
Hyderabad, Telangana:Best Second Hand Car Market Deals 2026: మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎక్కువ సెకండ్ హ్యాండ్ కార్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా అత్యంత తక్కువ ధరల్లో లభించే ఎక్కువ సేఫ్టీ ఫీచర్లు కలిగిన కార్లు అత్యధికంగా కొనుగోలు చేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా చాలామంది ఢిల్లీలోని సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. దీనిని దృష్టిలో పెట్టుకొని అక్కడ నిర్వాహకులు కొన్ని కార్లపై ఎప్పటికప్పుడు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తూ వస్తున్నారు.
ఢిల్లీలో సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్..
ముఖ్యంగా ఢిల్లీలోని డిడిఎ మార్కెట్, సెక్టార్-16, రోహిణి, బై ఎన్.ఎస్, ఏ-బ్లాక్లో అందుబాటులో ఉన్న కొన్ని సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్ మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని అత్యంత తక్కువ ధరలలోనే మంచి మంచి కార్లను విక్రయిస్తూ వస్తున్నాయి. ఇక్కడ కొన్ని బ్రాండ్లకు సంబంధించిన కార్లు సగం ధరలకే లభించడం విశేషం..అంతేకాకుండా ఇక్కడి సెకండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన షోరూమ్స్ లో సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కేవలం రూ.99 వేల నుంచి కార్లు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ మారుతి వ్యాగన్ఆర్ నుంచి లగ్జరీ అన్ని రకాల ఎస్యూవీల వరకు అన్నీ అత్యంత తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా పండగల సందర్భంగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉండడం విశేషం..
సెవెన్ సీటర్స్..
ఇక్కడ సెవెన్ సీటర్ గో ప్లస్ మోడల్ 2017 CNG కారు కేవలం 1,79,000 నుంచే ప్రారంభమవుతుంది. అంతేకాకుండా 2018 మోడల్కి సంబంధించిన రెనాల్ట్ ట్రైబర్ వంటి సెవెన్ సీటర్లు కేవలం రూ. 2.29 లక్షలకే విక్రయిస్తున్నారు. అలాగే ఇవే కాకుండా ఇక్కడ కొన్ని సెవెన్ సీటర్ కార్లు కేవలం మూడు లక్షల లోపే అందుబాటులో ఉన్నాయి..అదేవిధంగా హ్యాచ్బ్యాక్ కార్ల వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని.. మధ్యతరగతి వారి ఫేవరెట్ వ్యాగన్ఆర్ 2017 మోడల్ కార్లు కేవలం ఇక్కడ రెండు లక్షల 50 వేల లోపే విక్రయిస్తున్నారు. అంతేకాకుండా 2019 మోడల్ కు సంబంధించిన స్విఫ్ట్ డిజైర్ కార్ కేవలం నాలుగు లక్షల లోపే విక్రయిస్తూ రావడం విశేషం..
Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
రూ.99 వేలకే కారు..
అదేవిధంగా మారుతి ఆల్టో 2021 మోడల్ కార్లు ఇక్కడ కేవలం నాలుగు లక్షల 29 వేల లోపే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా 2018 మోడల్ టాటా టియాగో కేవలం రెండు లక్షల లోపే అందుబాటులో ఉండడం విశేషం. అలాగే కారు నచ్చి బడ్జెట్ లేని వారి కోసం ఇక్కడ నిర్వాహకులు పెట్రోల్ కారును కేవలం రూ.99 వేలు కట్టిన వారికి విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కార్లు అయితే ఇక్కడ చాలా చీప్ ధరలకే లభిస్తున్నాయి.
Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vemulawada: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..
Vemulawada, Telangana:Vemulawada Farmers Struggle: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల కష్టాలు తీరుతాయని ఆశించిన అన్నదాతకు నిరాశే ఎదురవుతూ వస్తోంది. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారడంతో రైతులు రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని చందుర్తి మండలంలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వ అసమర్థతకు అడ్డం పడుతున్నాయి. అంతేకాకుండా దాన్యం లోడుతో వచ్చిన ట్రాక్టర్లకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..
చందుర్తి మండలంలోని ఓ రైస్ మిల్లు వద్ద ధాన్యం లోడ్లతో వచ్చిన ట్రాక్టర్లు కొన్ని మీటర్ల మీరా నిలిచిపోయాయి. ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతులు రాత్రింబవళ్లు వాహనాల వద్ద ఉండి పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లు యజమానులు లోడు దింపుకోవడంలో జాప్యం చేస్తుండడంతో.. రోడ్డుపై ట్రాక్టర్లను ఉంచడం వల్ల ఆటుగుండా వెళుతున్న వాహనాలు కూడా స్తంభించిపోతున్నాయి.
ఎంతో కష్టపడి పంట పండించడం ఒక ఎత్తు అయితే.. పండిన పంటను అమ్ముకోవడం ఇప్పుడు మాకు మరో యుద్ధంలా మారిందని.. స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వం దాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని చెబుతున్నప్పటికీ.. ఇప్పటికీ కొన్నిచోట్ల ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల గోస వినే నాధుడే కరువయ్యాడని వేములవాడ, చందుర్తి పరిసర ప్రాంతాల్లోని రైతులు వాపోతున్నారు. మిల్లుల వద్ద ఫేమశాతం పేరుతో కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల వద్ద కనీస వసతులు లేవని.. వాన వస్తే ధాన్యం తడిసిపోతుందనే భయం వెంటాడుతోందని రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రణాళిక బద్ధమైన కొనుగోలు జరగడంలేదని.. అధికారుల మధ్య సమన్వయం లోపించిందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.. ఓట్లు వేయించుకునేటప్పుడు ఉన్న శ్రద్ధ.. మా పంటలు కొనేటప్పుడు ఎందుకు లేదు అని రైతులు సైతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి.. రైస్ మిల్లుల వద్ద నిలిచిపోయిన వాహనాల రోడ్లను తక్షణమే దింపుకోవాలని.. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు త్వరితగతిన చెల్లింపు జరపాలని డిమాండ్ చేస్తున్నారు..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Petrol Diesel Price Hike: పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు..లీటర్కు రూ.3 పెంచిన ఆయిల్ కంపెనీలు!
Hyderabad, Telangana:Petrol Diesel Price Hike News: పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రముఖ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. గత అర్ధరాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 పెంపు చేసినట్లు ఓ ప్రకటనలో తెలియజేశాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారీగా ముడిచమురు ధరలు పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు దేశీయంగా ఆ ప్రభావం కనిపిస్తోంది.Delhi Cars: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!
Hyderabad, Telangana:Second Hand Cars Delhi Telugu News: కొత్త కారు కొనాలని కలలు కంటున్నారా? కానీ బడ్జెట్ భయమేస్తోందా? అయితే మీకోసం ఒక అదిరిపోయే అవకాశం ఉంది. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ సమీపంలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్లో మల్టీ నేషనల్ బ్రాండ్లకు తో పాటు భారతదేశానికి బ్రాండ్లకు సంబంధించిన కార్లపై కళ్లు చెదిరే ఆఫర్స్ అందిస్తూ వస్తున్నారు. కేవలం కొన్ని వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగిన అన్రిజిస్టర్డ్ (Unregistered) డెమో కార్లను, సెకండ్ హ్యాండ్ వాహనాల ధరలకే విక్రయిస్తున్నట్లు అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ కార్లు కొనుగోలు చేసే వారికి RCపై నేరుగా ఫస్ట్ ఓనర్ అయ్యే అవకాశం ఉండడం విశేషం. అయితే ఈ మార్కెట్లో ఏ కార్లు అత్యంత చీకు ధరలకు అందుబాటులో ఉన్నాయో? వాడికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా షోరూం నుంచి కారును రోడ్డుపైకి తీసుకురావాలంటే భారీగా పన్నులతో పాటు ఇతర ఖర్చులు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ లభించే అన్ రిజిస్టర్ డెమో కార్లపై వినియోగదారులు రూ.2 లక్షల నుంచి ఏకంగా 5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ లభించే కార్లకు కొన్ని ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని వినియోగిస్తే అత్యంత తక్కువ ధరల్లోనే ఈ అన్ రిజిస్టర్ కార్లు కొనుగోలు చేయొచ్చు..
ఇప్పుడు మార్కెట్లో మహీంద్రా XUV 9 (EV) కార్లకు మంచి డిమాండ్ ఉంది.. అయితే, మార్కెట్లో సుమారు ఈ కారు ధర రూ.33 లక్షల వరకు పలుకుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ఎస్యూవీ ల్లో బాగా సేల్ అవుతున్న కార్లలో ఇది ఒకటి. కానీ ఇక్కడ మార్కెట్లో కేవలం 480 కిలోమీటర్లు తిరిగిన ఈ కారు కేవలం రూ.27 లక్షల్లోపే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎన్నో రకాల ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్ అన్నీ పోను దాదాపు రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు సేవ్ అవుతుంది.. టాటా పంచుతోపాటు ఆల్ట్రోజ్ (CNG) మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కార్లు కేవలం ఇక్కడ 12000 కిలోమీటర్లు తిరిగినవి రూ.8 లక్షల లోపే అందుబాటులో ఉన్నాయి.
Also Read: నాకు ముగ్గురు పిల్లలున్నారు.. వదిలేయండి.. ఢిల్లీ గ్యాంగ్ రే**ప్ బాధితురాలు కన్నీరు..
అలాగే మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న మహీంద్రా థార్ 4x4, 4x2 మోడల్స్ కేవలం రూ.11 లక్షల నుంచే ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా కొన్ని లగ్జరీ కార్లు అయితే అత్యంత చీప్ ధరలకే అందుబాటులో ఉండడం విశేషం. ఇక 2017 మోడల్ హోండా సిటీ రూ.5 లక్షలకే లభిస్తోంది. అంతేకాకుండా బెలినో ఆల్ఫా కేవలం నాలుగు లక్షలకి అందుబాటులో ఉన్నాయి. ఇక ఎంజి ఆస్టర్ ఎలక్ట్రిక్ కార్ పై దాదాపు మూడు లక్షల వరకు భారీ తగ్గింపు అందిస్తున్నారు. ఇక్కడ కేవలం సర్వేస్ రికార్డులో ఉన్న కార్లను మాత్రమే విక్రయిస్తున్నట్లు అక్కడి సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ యజమానులు చెబుతున్నారు. అంతేకాకుండా డబ్బులు లేనివారికి ప్రత్యేకమైన ఫైనాన్స్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు.
Also Read: నాకు ముగ్గురు పిల్లలున్నారు.. వదిలేయండి.. ఢిల్లీ గ్యాంగ్ రే**ప్ బాధితురాలు కన్నీరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Puttaparthi AMCA: రూ.15,803 కోట్లతో పుట్టపర్తిలో డిఫెన్స్ పెట్టుబడి..ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శంఖుస్థాపన!
Puttaparthi, Andhra Pradesh:Puttaparthi AMCA Laying Foundation: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కలిసి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం రాయలసీమ ముఖచిత్రాన్ని, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా భవిష్యత్తును మార్చే దిశగా అడుగులు వేసింది.
రక్షణ శక్తి కేంద్రంగా పుట్టపర్తి
భారతదేశ రక్షణ రంగంలో కొత్త శక్తి కేంద్రంగా పుట్టపర్తి అవతరించబోతోంది. రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ AMCA ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA), DRDO భాగస్వామ్యంతో నిర్మించారు. దీని ద్వారా సుమారు 7,500 మంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కేవలం ఫైటర్ జెట్లే కాకుండా, డ్రోన్ సిటీలోని నిషేధ రక్షణ ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్షిపణులు, హ్యాండ్ గ్రెనెడ్లు, ఆధునిక తుపాకులు, యుద్ధ విమానాల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.
బుల్లెట్ స్పీడ్తో అభివృద్ధి: సీఎం చంద్రబాబు
శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధిని 'బుల్లెట్ స్పీడ్'తో పరుగులు తీయిస్తున్నామని ప్రకటించారు. "అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, వాటిని అందిపుచ్చుకుని ఎదగాల్సిన బాధ్యత యువతది" అని ఆయన అన్నారు. కరువు సీమలో గతంలో తాను తెచ్చిన కియా పరిశ్రమ నేడు 18 లక్షల కార్లను తయారు చేస్తూ, 80 దేశాలకు ఎగుమతి చేస్తోందని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని మారుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
"ఫ్యాక్షన్ Vs ఫైటర్ జెట్": నారా లోకేష్
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు గుప్పించారు. "నాడు కియా కార్లు తెచ్చినా, నేడు ఫైటర్ జెట్లు తెచ్చినా అది చంద్రబాబు వల్లే సాధ్యమైంది. వైసీపీది ఫ్యాక్షన్, క్రిమినల్ బ్యాగ్రౌండ్ అయితే, మనది ఫైటర్ జెట్, కియా బ్యాగ్రౌండ్" అని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 23 నెలల్లోనే 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అంటే ఏమిటో ప్రపంచానికి చూపామని లోకేష్ పేర్కొన్నారు.
పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, ఇప్పుడు పారిశ్రామిక, రక్షణ రంగ హబ్గా మారుతోంది. సత్యసాయి బాబా దర్శనికతతో నిర్మించిన ఎయిర్పోర్టు నేడు పారిశ్రామిక అవసరాలకు ఎంతో ఉపయోగపడుతోంది. మొత్తానికి.. AMCA ప్రాజెక్టు రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలవడం ఖాయమని ప్రభుత్వ వర్గాలకు ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, బీజేపీ రాష్ట్ర నేతలు ఉన్నారు.
Also REad: ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు..నో వెహికల్ డే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
Also Read: నీట్ అభ్యర్ధులకు శుభవార్త..ఫీజు తిరిగి చెల్లింపుతో పాటు 15 నిమిషాలు నిడివి పెంపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Erragadda TIMS: హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ ప్రపంచ స్థాయి వైద్యం అందించారు: కేటీఆర్
Hyderabad, Telangana:KTR At TIMS Hospital: 'హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే నేడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లో ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించేలా టిమ్స్ను ఆలోచించి రూపకల్పన చేశాం' మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు.
Also Read: Bandi Bhageerath: 'మా కూతురిపై కుట్ర చేస్తున్నారు'.. పోక్సో బాధితురాలి తల్లి ఆవేదన
హైదరాబాద్లోని సనత్నగర్ (ఎర్రగడ్డ) టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సనత్నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించాం. అత్యాధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రిని నిర్మించాం. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ను తీసుకువచ్చింది. హైదరాబాద్లో సనత్నగర్, ఎల్బీనగర్, అల్వాల్ ప్రాంతాల్లో టిమ్స్ ఆస్పత్రులను నిర్మించాం' అని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Also Read: PBKS vs MI Highlights: పంజాబ్ను దెబ్బతీసిన ముంబై.. తిలక్వర్మ తుఫాన్ ఇన్నింగ్స్
'వరంగల్లో 2000 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రిని, నిమ్స్ ఆసుపత్రిని కూడా భారీ స్థాయిలో విస్తరించాం. సనత్నగర్ టిమ్స్లో మొత్తం మూడు బ్లాకులు నిర్మించాం. 300 ఐసీయూ బెడ్స్తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశాం. రూ.1,200 కోట్ల వ్యయంతో టిమ్స్ నిర్మాణం చేపట్టాం. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read: Bandi Bhageerath: కొడుకును అప్పగించకుండా బండి సంజయ్ ఎవరిని బెదిరిస్తున్నాడు?
'16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశాం. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సహా అన్ని డయాగ్నస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక వీఐపీ సూట్స్ కూడా ఏర్పాటు చేశాం. కిడ్నీ సంబంధిత వ్యాధులపై ప్రత్యేక పరిశోధనలు జరిగేలా సదుపాయాలు కల్పిస్తున్నాం. దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్ను అభివృద్ధి చేస్తున్నాం' అని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
'ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకాడెమిక్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాం. భారీ ఆడిటోరియం నిర్మాణం కూడా చేపట్టాం. ఒకేసారి వెయ్యి కార్లు పార్క్ చేసేలా ఆధునిక పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం. టిమ్స్ హాస్పిటల్ డిజైన్ దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ వైద్య నిర్మాణాల్లో ఒకటి' అని కేటీఆర్ ప్రకటించారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ ర్యాంప్ నిర్మించామని తెలిపారు. లిఫ్టుల పనితీరును వెంటనే మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో వైద్యం అందించామని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. మిగిలిన నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ఎర్రగడ్డ టిమ్స్ ఆస్పత్రిని ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
Bandi Bhageerath: 'మా కూతురిపై కుట్ర చేస్తున్నారు'.. బండి భగీరథ్, బండి సంజయ్పై బాధితురాలి తల్లి ఆవేదన
Baddipadaga, Telangana:Arrest Bandi Bhageerath: తాగిన మత్తులో అత్యాచారం చేసిన నిందితుడు బండి భగీరథ్, అతడి తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చాలా కుట్ర పన్నుతున్నారని బాధితురాలి తల్లి సంచలన విషయాలు తెలిపారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయం.. బండి భగీరథ్ చేసిన మోసం.. అనంతరం పోక్సో నమోదు.. తర్వాత జరిగిన పరిణామాలపై పూసగుచ్చినట్టు బాధితురాలి తల్లి వివరించారు. ఈ సందర్భంగా పోలీసులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఆమె లేఖ విడుదల చేశారు. తీవ్ర ఆవేదనతో విడుదల చేసిన ఆ లేఖలో కీలక అంశాలు ఉన్నాయి.
Also Read: Bride Death: రాత్రి పెళ్లి భజంత్రీలు తెల్లారి చావు డప్పు.. వివాహమైన తెల్లారి వధువు
'2025 సంవత్సరంలో మా కూతురికి బండి భగీరథ్ పరిచయమయ్యాడు. మొదట స్నేహితుడిలాగా ఉన్నా మా కూతురిని మానసికంగా లోబర్చుకుని, చదువుకోకుండా డిస్టర్బ్ చేశాడని గుర్తించాం. జనవరి 2026లో వారి మధ్య గొడవ జరిగినప్పుడు గతంలో భగీరథ్ తనపై పలు మార్లు లైంగిక దాడి చేశాడని డిసెంబర్ 31వ తేదీన బలవంతంగా మద్యం తాగించి ఒకసారి, మరోసారి ఓ అపార్టుమెంట్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని మా కూతురు చెప్పింది' అని పోక్సో కేసు బాధితురాలి తల్లి సంచలన విషయాలు బయటపెట్టారు.
Also Read: AMCA Project: అనంతపురం జిల్లాకు మరో వరం.. కరువు సీమలో భారీ యుద్ధ విమాన ప్రాజెక్టు
'రాజకీయ శక్తులతో పోరాడడానికి చట్టపరంగా, మానసికంగా సిద్ధమవుతున్న రోజుల్లో ఏప్రిల్ 21వ తేదీ 2026లో తమ కూతురిపై బ్లాక్మెయిల్ కేసు పెట్టారని తెలిసి మా మీద కుట్ర చేస్తున్నారని గ్రహించాం' అని బాధితురాలి తల్లి వివరించారు. 'ఏప్రిల్ 22వ తేదీన సంగప్ప అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించాడు. ఏప్రిల్ 23వ తేదీన సంగప్ప ద్వారా బండి సంజయ్ని కలిశాం. న్యాయం చేస్తారనుకుంటే మా గురించి దారుణంగా మాట్లాడి బెదిరించి పంపించేశారు' అని సంచలన విషయాలు బయటపెట్టారు.
Also Read: AP Govt Teachers: ప్రభుత్వ టీచర్లకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏం ప్రకటించారంటే?
'నా కూతురి కోసం కోట్లాడాలని నిర్ణయించుకుని మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు నా కూతురిని తీసుకుని వెళ్లా. కానీ అక్కడి పోలీసులు ఎంత వేడుకున్నా ఫిర్యాదు తీసుకోకుండా గంటల తరబడి మమ్మల్ని వెయిట్ చేయించారు. ఎన్నో సార్లు బతిమాలిన తరువాత ఎట్టకేలకు బండి భగీరథ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు' అని పోక్సో బాధితురాలి తల్లి లేఖలో వివరించారు.
'మొదట బండి భగీరథ్ మీద బెయిల్ వచ్చేలా సెక్షన్లు పెట్టినా.. మా కుమార్తె స్టేట్మెంట్ రికార్డ్ చేశాక సెక్షన్లు మార్చారు. అయితే మేము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వేచి ఉన్న సమయంలో మా కూతురిపై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ కేసు పెట్టాడని తెలిసింది. మేము స్టేషన్లో ఉన్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్, రిజిస్టర్లో టైమింగ్స్ భద్రపరచాలని, అలా చేస్తే బండి భగీరథ్ ఏ సమయంలో కేసు పెట్టాడో స్పష్టంగా తెలిసి పోతుందని పోలీసులకు విజ్ఞప్తి చేశాం' అని లేఖలో బాధితురాలి తల్లి వెల్లడించారు.
'మీడియా వారిని, సోషల్ మీడియా యూజర్లను చేతులు జోడించి వేడుకుంటున్నా. దయచేసి మా కూతురి ఫొటోలు, ఆమె ఐడెంటిటీ రివీల్ చేయకండి' అని లేఖలో విజ్ఞప్తి చేశారు. 'మరోవైపు ఆమె డేట్ ఆఫ్ బర్త్ గురించి అనేక వాదనలు వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్లలో ఉండే డేటా నా కూతురు అనుభవించిన క్షోభను చెరిపివేయలేదు. పోక్సో కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ పట్ల వేగంగా, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నా కూతురికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నా' అని బాధితురాలి తల్లి ఆవేదన చెందారు.
బాధితురాలి తల్లి లేఖ ద్వారా బండి సంజయ్ ఏవిధంగా తన కుమారుడు బండి భగీరథ్ను రక్షించే ప్రయత్నం చేశాడో అర్థమవుతోంది. ప్రధాన మీడియా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా బాధితురాలిని తప్పుబడుతూ వీడియో చేస్తున్నారో.. దానివలన బాధితురాలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఆ లేఖలో స్పష్టమవుతోంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు దర్యాప్తు, విచారణ అంటూ కాలయాపన చేయకుండా వెంటనే నిందితుడు బండీ భగీరథ్ను అరెస్ట్ చేస్తారో లేదోననే ఉత్కంఠ నెలకొంది.
Re NEET 2026: నీట్ అభ్యర్ధులకు శుభవార్త..ఫీజు తిరిగి చెల్లింపుతో పాటు 15 నిమిషాలు నిడివి పెంపు!
Hyderabad, Telangana:Re NEET 2026 Extra 15 Minutes: ఇటీవలే జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ NEET) పేపర్ లీక్ నేపథ్యంలో దాన్ని తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రీ-నీట్ ను 2026 జూన్ 21న నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అయితే ఈసారి పరీక్ష రాసే అభ్యర్థులకు కొంతమేర ఊరట కలిగించారు. పరీక్ష రాసే విద్యార్థులకు 15 నిమిషాలు అదనంగా సమయం ఇస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం ఇటీవలే లీక్ అయ్యిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరీక్షను రద్దు చేస్తూ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన చేసింది. దీంతో అప్పటివరకు పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యి టైమ్ ధారపోసిన విద్యార్థులు, వారి తల్లీదండ్రుల ఊసూరుమన్నారు. అయితే ఈ పరీక్షను రద్దు చేసినా.. భారతదేశపు అతిపెద్ద వైద్య ప్రవేశ పరీక్షను ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించడంలో విఫలమైనందుకు NTA, భారత ప్రభుత్వం.. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా.. ఇప్పుడు ఆ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు ప్రణాళికను విడుదల చేశారు.
నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, శుభమ్ ఖైర్నార్, యష్ యాదవ్ అనే నిందితులను CBI కోర్టు ముందు హాజరుపరిచింది. వారిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరారు.
పరీక్షా కేంద్రం ఎంపిక ఎలా!
అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి వీలుగా వారికి ఒక వారం రోజుల సమయం ఇస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తమ నివాసాన్ని మార్చుకున్న విద్యార్థులు, ప్రస్తుతం తాము నివసిస్తున్న నగరంలోనే పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: రజినీకాంత్ 'జైలర్ 2'షూటింగ్లో ప్రమాదం..ఒకరు మృతి, రంగంలోకి దిగిన పోలీసులు!
Also Read: ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు..నో వెహికల్ డే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jailer 2 Crew Death: రజినీకాంత్ 'జైలర్ 2'షూటింగ్లో ప్రమాదం..ఒకరు మృతి, రంగంలోకి దిగిన పోలీసులు!
Chennai, Tamil Nadu:Jailer 2 Crew Death News: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'జైలర్ 2' షూటింగ్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఆ సినిమా కోసం సెట్ వర్క్ జరుగుతున్న క్రమంలో ఆర్ట్ డిపార్ట్మెంట్కు చెందిన కార్తికేయన్ అనే 28 ఏళ్ల టెక్నీషియన్ కరెంట్ షాక్కు గురై మృతిచెందాడు. పనైయూర్లోని ఒక స్టూడియోలో సెట్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ దిగ్భ్రాంతి ఘటనతో షూటింగ్ వెంటనే నిలిపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. మృతుడిని టి.కార్తికేయన్గా గుర్తించారు. ఈయన ఆర్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిలో ఒకరిగా పనిచేస్తున్నారు. ఒక ఇంటిని పోలిన సెట్ నిర్మాణ పనుల్లో కార్తికేయన్ నిమగ్నమై ఉన్నప్పుడు మధ్యాహ్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ కనెక్షన్ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఆయన విద్యుత్ తీగను తాకడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తోటి సిబ్బంది వెంటనే అంబులెన్స్లో సమీప ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటన జరిగిన వెంటనే, కనత్తూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ రాయపేట ఆసుపత్రికి తరలించారు. అధికారికంగా 'ప్రథమ సమాచార నివేదిక' (FIR) నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుండగా, విద్యుత్ లీకేజీకి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వైరింగ్ లోపాల వల్లనా, లేక సెట్లో తగినంత భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనా ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఆర్ట్ డిపార్ట్మెంట్లోని ఓ టెక్నిషియన్ మృతి కారణంగా 'జైలర్ 2' షూటింగ్ను అర్ధాంతరంగా ఆపేశారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే, అంటే మధ్యాహ్నం సుమారు 2:00 గంటల ప్రాంతంలో ప్రధాన నటుడు రజనీకాంత్ సెట్కు చేరుకోవాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'జైలర్ 2', 2023 బ్లాక్బస్టర్ 'జైలర్' చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. ప్యాచ్ వర్క్ కోసం కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తుంది చిత్రబృందం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి తీపికబురు..2 శాతం డీఏ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం!
Also Read: మహిళలకు ప్రభుత్వం శుభవార్త..బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,000 జమ అప్పటి నుంచే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial: కేంద్రీయ విద్యాలయం ఎవరి వల్ల ఆగుతోంది? సంజయ్ కుమార్ కౌంటర్.. అరవింద్ అటాక్!
Hyderabad, Telangana:Jagtial Kendriya Vidyalaya Row Telugu News: జగిత్యాల జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఇప్పుడు రాజకీయాలకు ఒక కీగా మారింది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన పాఠశాల భవనంతో పాటు స్థల వివాదంలో చిక్కుకొని ప్రజాప్రతినిధుల మద్యం మాటల యుద్ధానికి దారితీస్తూ వస్తోంది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య ఈ వివాదం ముదరడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయినట్లు తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఎందుకు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చలిగల్ గ్రామ శివారులో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థల విషయంలో ఏర్పడిన ఓ చిన్న సమస్య వీరిద్దరి మధ్య రణ రంగానికి దారితీసింది. ఈ స్థలాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అడ్డుకుంటున్నారని.. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపిస్తున్నారు. కేంద్రం పాఠశాలను మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే స్థలం కేటాయింపులు జాప్యం చేస్తున్నారని ఆయన బండి పడ్డారు. దీనికి నిరసనగా జగిత్యాలాలు భారీ దీక్ష చేపట్టబోతున్నట్లు ఎంపీ ప్రకటించడం సంచలనంగా మారింది..
ఎంపీ ఆరోపణలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు.. చలిగల్ వాలెంటరీ స్థలం ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉందని.. దానికి సంబంధించిన నిర్ణయాలు మంత్రి స్థాయిలో జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా జిల్లా అభివృద్ధిని పట్టించుకోని ఎంపి.. ఇప్పుడు కేవలం రాజకీయాల కోసమే తనను టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్థల కేటాయింపుకు సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాల్సింది పోయి తనపై బురద జల్లడం సరికాదని ఆయన అన్నారు..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
కేంద్రీయ విద్యాలయం రాకూడదని నేనెందుకు అనుకుంటాను.. ఎంపీ గారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నాపై అసత్య ప్రసారం చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా ప్రతినిధుల మధ్య నడుస్తున్న ఈ వార్ వల్ల అసలు నష్టపోయేది విద్యార్థులేనని అక్కడి మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. భవన నిర్మాణానికి పునాది పడకపోవడంపై యువత సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎంపీ అరవింద్ దీక్షకు సిద్ధమవుతుండడంతో పోలీసులు జగిత్యాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసే యువచనలు ఉన్నట్లు తెలుస్తోంది..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Delhi News: నాకు ముగ్గురు పిల్లలున్నారు.. వదిలేయండి.. ఢిల్లీ గ్యాంగ్ రే**ప్ బాధితురాలు కన్నీరు..
Hyderabad, Telangana:Delhi Gang Rape Telugu News: దేశ రాజధాని లోని మహిళా భద్రత మళ్లీ ప్రశ్నార్ధకంగా మారిపోయింది.. కామాందుల చేతిలో చిక్కిన ఒక బాధితురాలు తన ముగ్గురు పిల్లల కోసం ప్రాధేయపడిన.. వారు ఏమాత్రం కనికరించకుండా దారుణానికి ఒడిగట్టేసారు. హృదయాన్ని తగిలిస్తున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలు కామాందులతో మాట్లాడిన కొన్ని అరుదైన మాటలు వైరల్ గా మారాయి.
నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. వాళ్లు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు.. ప్లీజ్ నన్ను వదిలేయండి అని సదరు మహిళ నిందితులను వేడుకున్న వారు వినిపించుకోలేదు. బాధితురాలి వివరాలకు ప్రకారం.. ఆమెకు నాలుగు, ఆరు, 9 ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు చ చిన్నారి ఆడపిల్లలున్నారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు ఆమెను అడ్డగించి నిర్మాణస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై విచక్షణారహితంగా లైంగిక దాడికి పాల్పడ్డారు..
తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాధితురాలు కన్నీరు మున్నీరవుతూ పోలీసులకు వివరించింది. నన్ను బలవంతంగా తీసుకెళ్లి హత్యాచారం చేశారు.. నేను ఎంతగా వదిలేయమని చెప్పినప్పటికీ వారు కనికరించలేదు. చివరకు ఈ విషయం ఎవరికీ చెప్పనని.. నా పిల్లల కోసం నన్ను వదిలేయమని కాళ్ళ వేళ్ళ పడ్డానని. నా దీన స్థితిని చూసి వారు వదిలిపెట్టారు.. అని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నారు..
నిందితుల నుంచి తప్పించుకున్న బాధితురాలు.. ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా కొంత దూరం వెళ్లిన తర్వాత వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. బాధితురాలు చెప్పిన ఆడవాళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ పుటిజి ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.. నగర నడిబొడ్డున ముగ్గురు పిల్లల తల్లి పై ఇలాంటి అఘాయిత్యం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ కూడా చేస్తున్నాయి..
Also Read: Fact Check: 1967 ఇందిరా గాంధీ బంగారం కొనవద్దని చెప్పారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Gajalakshmi Rajayoga 2026: అరుదైన గజలక్ష్మి రాజయోగం.. ఈ 5 రాశుల వారికి అదృష్టం మాములుగా ఉండదు, ఇక డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Gajalakshmi Rajayoga 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 14, 15, 16 తేదీలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మే 14వ తేదీన అనేక గ్రహాలు ఏకకాలంలోనే సంచారం చేశాయి. అర్ధరాత్రి వేళ చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సూర్యుడితో పాటు కుజ గ్రహాల కలయిక కూడా జరిగింది. మరోవైపు శుక్రుడు గురుడితో కలయిక జరపడం కారణంగా ఎంతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడింది. ఈ సమయంలో మిథున రాశిలో శుక్రుడితో పాటు గురుడి కలయిక జరిగింది. దీని కారణంగా గజలక్ష్మిరాజుయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాజయోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ సమయంలో గురుడు పునర్వాసు నక్షత్రం మూడవ స్థానంలోకి ప్రవేశించాడు. బుధుడు వృషభ రాశిలోకి సంచారం చేశాడు. ఇలా అనేక గ్రహాలు ఈ తేదీల్లో సంచారం చేయడం విశేషం.. దీని కారణంగా మొత్తం ఐదు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
మిథున రాశి
మే 14వ తేదీ నుంచి మిధున రాశి వారికి ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా మిత్రగ్రహమైన శుక్రుడి ప్రవేశంతో ఏర్పడిన గజలక్ష్మి రాజయోగ ప్రభావం వల్ల వీరికి అన్ని రకాల సమస్యలు పరిష్కారం లభించబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం లభించబోతోంది. ఆర్థికంగా ప్రణాళికలు అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ఖర్చులు నియంత్రించుకోగలిగితే జీవితంలో ఊహించని లాభాలు పొందగలుగుతారు. ఇతరులనుంచి మంచి సపోర్టు పొంది.. అనుకోని ధన లాభాలు కూడా పొందుతారు. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి. వీరికి ఆత్మవిశ్వాసం కూడా అంచెలంచెలుగా రెట్టింపు అవుతుంది. సృజనాత్మకత కూడా చాలా వరకు పెరిగి అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.
తులారాశి
గజలక్ష్మి రాజయోగంతో తులారాశి వారికి ఈ సమయం మంచి ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా జీవితంలో వస్తున్న ఆందోళనలు కూడా సులభంగా తొలగిపోతాయి. పనిలోని మీ సామర్థ్యంతో పాటు నైపుణ్యాలు విపరీతంగా పెరుగుతాయి. పై అధికారుల నుంచి మీకు మంచి సపోర్టు లభిస్తుంది. అంతేకాకుండా కొత్త భాగస్వాములు కూడా మీతో పరిచయాలు పెంచుకునే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే పిల్లల గురించి ఆలోచిస్తున్న వ్యక్తులకు ఆందోళన తగ్గి విశేషమైన లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో తప్పకుండా విజయాలు సాధించే అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రేమ జీవితంలో శృంగారభరితమైన సమయం గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించి జీవితంలో అద్భుతమైన ఆనందాన్ని పొందుతారు..
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఏడవ స్థానంలో శుక్ర గురు గ్రహాల కలయిక జరిగింది. దీని కారణంగా విద్యాతో పాటు వృత్తి జీవితంలో అభివృద్ధి లభించబోతోంది. అలాగే మీ పనుల్లో అనుభవంతో పాటు జ్ఞానం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి విజయాలైన ఎంతో సులభంగా సాధించగలుగుతారు. మీ పనికి తగ్గ ప్రశంసలు కూడా దక్కుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ జీవిత భాగస్వామి సపోర్టు లభించి కొన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా కుటుంబ జీవితంలో గౌరవం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఈ సమయంలో ఉద్యోగాలు మారాలని చూస్తున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయక అందిస్తుంది..
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్ర, గురు గ్రహాల కలయిక కారణంగా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఐదవ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఉన్నట్టుండి ఇంట్లో ఆనందం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. పనులన్నీ సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు మీ సహ ఉద్యోగుల నుంచి మంచి సపోర్టు లభించి.. ఎప్పుడూ పొందలేని ఆనందాన్ని కూడా సొంతం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా అదృష్టంతో పాటు జీవితంలో అనుకున్న లాభాలన్నీ పొందగలుగుతారు. అలాగే ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరుతాయి. డబ్బు సంబంధిత సమస్యలకు కూడా చాలావరకు పరిష్కారం లభిస్తుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక: ఇక్కడ అందించిన వార్త కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నుంచి సేకరించి రాసింది మాత్రమే.. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PBKS vs MI Highlights: పంజాబ్ను దెబ్బతీసిన ముంబై.. తిలక్వర్మ తుఫాన్ ఇన్నింగ్స్
mathura, Dharamshala, Himachal Pradesh:Tilak Varma Heroic Batting: ప్లేఆఫ్స్ రేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆరంభంలో అదిరిపోయే మ్యాచ్లతో ఓటమి లేకుండా ఆడిన పంజాబ్ కింగ్స్ సెకండాఫ్లో పరిస్థితి రివర్స్ మారింది. ఇప్పుడు వరుస ఓటములు చవిచూస్తూ ప్లేఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకుంటోంది. తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ను కూడా పంజాబ్ కోల్పోయింది. విజయం కోసం చివరి బంతి వరకు పోరాడినా ఫలితం నిరాశ మిగిల్చింది. తిలక్ వర్మ భారీ ఇన్నింగ్స్తో మ్యాచ్ను గెలిపించి ముంబై జట్టుకు ఊరటనిచ్చాడు. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్పై ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించి విశేషాలు ఇలా ఉన్నాయి.
