గోశామహల్: మర్డర్లకు అడ్డగా పాతబస్తీ
Hyderabad, Telangana:హైదరాబాద్ పాతబస్తీలో లా అండ్ ఆర్డర్ చనిపోయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాతబస్తీలో మర్డర్లు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఉదయం రాత్రి అనే తేడా లేకుండా ఘటనలు జరుగుతున్నాయని వాపోయారు. పోలీసులు దీనికోసం పెట్రోలింగ్ నిర్వహిస్తుంటే వారిపై ఎంఐఎం ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఇటువంటివి అరికట్టాలని డిమాండ్ చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Supreme Court: మగవాళ్ళు పెళ్లిళ్లు ఎందుకు చేసుకుంటారు? వరకట్నం వేధింపులపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్య..!!
Lakshmapur, Telangana:Supreme Court dowry harassment judgment: వరకట్నం కోసం వేధించి చంపుతున్న హత్యలపై దేశ సర్వోన్నత న్యాయం ఆందోళన వ్యక్తం చేసింది. యువకులు, అమ్మాయిలను వివాహం చేసుకుని.. తీసుకున్న కట్నకానుకలు చాలదు అన్నట్లు మళ్లీ కట్నం తీసుకురావాలంటూ భార్యలను వేధించడం, వారి కుటుంబాలను అవమానించడం వంటి ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేసింది. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించింది. ఛత్తీస్ ఘడ్ కు చెందిన ఓ కుటుంబానికి సంబంధించిన వరకట్న వేధింపులు హత్యకేసు విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్నం ఈ వ్యాఖ్యలు చేశారు.
అధిక వరకట్నం కోసం వధువు కుటుంబాన్ని బిచ్చగాళ్లు అనడంపై తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్నవారి కుటుంబాల్లోనే ఈ వరకట్న వేధింపులు పెరగడంపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఛత్తీస్ గడ్ లో పెళ్లి జరిగిన 3 సంవత్సరాలకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మరణించింది. ఈ కేసును విచారించిన కోర్టు, నిందితులకు వార్నింగ్ వంటి మెసేజ్ వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భయాన్ లతో కూడిన న్యాయస్థానం ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ భర్త కుటుంబ సభ్యుల తీరును తప్పుబట్టింది. సమాజంలో ఇంకా కొనసాగుతున్న ఈ దురాచారాన్ని ప్రశ్నిస్తూ జస్టిస్ నాగరత్న భావోద్వేగ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
2010లో ఛత్తీస్ గఢ్ లో వివాహం జరిగిన 3 సంవత్సరాలకు ఓ మహిళ తన అత్తగారింట్లో ఉరివేసుకుని చనిపోయింది. భర్త అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నంకోసం ఆ మహిళలను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ప్రాసిక్యూషన్ ఆరోపించింది. పెళ్లి జరిగిన 3ఏళ్లకే మరణించడంతో ఇది వరకట్న మరణమేనని ట్రయల్ కోర్టు నిర్ధారించింది. మరణానికి కొన్నిరోజుల ముందు కూడా డబ్బు కోసం వేధించినట్లు బాధిత కుటుంబ సభ్యులు సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈ కేసులో భర్త కుటుంబ సభ్యులకు సెక్షన్ 304 బి , 306 , 498ఏ కింద కోర్టు శిక్ష విధించింది. దీన్ని ఛత్తీస్ ఘడ్ కోర్టు కూడా సమర్థించింది.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ భర్త తమ్ముడు సుప్రీంను ఆశ్రయించారు. తనపై కేవలం సెక్షన్ 498ఏ మాత్రమే ఉదని.. అది కూడా వర్తించదని అతని తరపు న్యాయవాది వాదించారు. కోర్టు ఈ వాదనను కొట్టిపారేసింది. మీ పై కేవలం 498ఏ కింద 3ఏళ్ల శిక్ష మాత్రమే పడినందుకు మీరు సంతోషం వ్యక్తం చేయాలని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. అమ్మాయి కుటుంబాన్ని ఆర్ధికంగా వేధించే తీరును ఎండగడుతూ.. అమ్మాయి తరపు వారు తమ కూతురిని కాపాడుకునేందుకు 60వేలు ఇస్తామని బతిమిలాడితే.. మీరేమో వారిని భిక్షగాళ్లు అని పిలుస్తారా.. చదువుకున్న కుటుంబాల్లో కూడా ఇలా ప్రవర్తించడం ఆందోళనకరమని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అబ్బాయిలు ఎందుకు పెళ్లిళ్లు చేసుకుంటారు.. వరకట్నం పేరుతో వరుడి తరపు వారు వధువుపైనా ఆమె కుటుంబంపై ఒత్తిడి తీసుకువస్తారా. వధువును ఆమె కుటుంబాన్ని పీడించడమే లక్ష్యమా అంటూ చీవాట్లు పెట్టింది. ఇలాంటి కేసుల్లో కఠినమైన సందేశం వెళ్లాల్సిందే అంటూ సుప్రీంకోర్టు సదరు అప్పీల్ ను కొట్టివేసింది.
Also Read: మార్కెట్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ.. నీటిలో నానినా చిరగవు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Pawan Kalyan: 'ప్రొఫెసర్ నాగేశ్వర్ కాలిగోటికి సరిపోడు.. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్!
Mahbubnagar, Telangana:Prof Nageshwar Case: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అని తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావును విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్కు లేదని స్పష్టం చేశారు. నాగేశ్వర్ను అరెస్టు చేస్తే ముందు ప్రొఫెసర్ కన్న ముందు తనను అరెస్టు చేయాలని సవాల్ చేశారు. ఆంధ్రవాళ్లు ఇంకా తెలంగాణలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అమరావతికి వెళ్లిపోవచ్చు కదా అని పవన్ కల్యాణ్కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచించారు.
Also Read: TV Serial Chance: టీవీ సీరియల్ పేరిట డాక్టర్కు కుచ్చుటోపీ.. తీగలాగితే
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం పాత బజార్ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు సీఎస్ఆర్ ఫౌండేషన్ అరబిందో ఫార్మా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య సాగుతున్న వివాదంపై స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ప్రొఫెసర్ నాగేశ్వర్ను విమర్శించే స్థాయి కాదని స్పష్టం చేశారు. ఆయన ఒక పొలిటికల్ ఎనలిస్టు అని.. ఆయనపై కేసులు ఎలా పెడతారని? ప్రశ్నించారు.
Also Read: Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఏం జరిగిందంటే?
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబుతో.. తర్వాత అమిత్ షాతో ఆ తర్వాత వైఎస్ జగనతో కూడా ప్యాకేజీ తీసుకుంటాడేమో అని పవన్ కల్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేయాల్సి వస్తే ఆయన ఇంటి ముందు తానే ముందు వచ్చి అరెస్టు అవుతానని ప్రకటించారు. 'అమరావతికి అన్ని కోట్లు ఎందుకని.. ఆంధ్రవాళ్లు అందరూ హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా. ఇక్కడే తాము 5000 ఎకరాలు ఇస్తామని ఇక్కడే రాజధాని కట్టుకొని ఇక్కడ నుంచి ఏపీ పరిపాలన కొనసాగించండి' అని చంద్రబాబు, పవన్ కల్యాణ్కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచించారు.
కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రాజీనామా చేసినట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజీనామా పర్వం ఏమైనా ఉంటుందా అని మీడియా ప్రశ్నించగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన సమర్థవంతంగా జరుగుతోందని.. రేవంత్ రెడ్డి రాజీనామా అనే అంశం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లేదు అని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. 'ప్రొఫెసర్ నాగేశ్వర్ను విమర్శించే అర్హత పవన్ కల్యాణ్కు లేదు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయండి.. ఆయన ఇంటి ముందు నేను నిలబడతా. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా ముట్టుకోవాలని ఆంధ్ర నుంచి ఎవరైనా వస్తే గో బ్యాక్ ఆంధ్ర ఉద్యమం మొదలైతది' అని హెచ్చరించారు. అయినా మీరంతా ఉండేది హైదరాబాద్లోనే కదా? అన్ని డబ్బులు పెట్టి అమరావతి ఎందుకు కట్టుకుంటున్నారు? అని నిలదీశారు.
Vaibhav Suryavanshi Diet: ఆ వయసులో అంత సిక్సర్ల పవర్ ఎలా సాధ్యం? వైభవ్ సూర్యవంశీ సీక్రెట్ ఫుడ్ మెనూ లీక్..!!
Lakshmapur, Telangana:Vaibhav Suryavanshi Diet Chart: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఒకే ఒక్కడు పరుగుల వరద సృష్టిస్తూ మార్మోగిపోతున్నాడు.. అతనే వైభవ్ సూర్యవంశీ. నిండా 15 ఏళ్లు కూడా నిండని ఈ బీహార్ కుర్రాడు మైదానంలోకి దిగిండంటే... సీనియర్ బౌలర్లు సైతం వణికిపోతున్నారు. గురువారం సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన హై-టెన్షన్ ఎలిమినేటర్ మ్యాచ్లో వైభవ్ మామూలూ విధ్వంసం సృష్టించలేదు. 29 బంతుల్లో 97 పరుగులు బాది దుమ్మురేపాడు. ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 12 సిక్సర్లు ఉన్నాయంటే బుడ్డోడి బ్యాటింగ్ పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టచ్ చేస్తే చాలు బంతి స్టాండ్స్లో నుంచి బస్టాండ్లోకి దూసుకుపోయింది. ఇక ఈ రోజు జరగబోయే కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్లో ఈ చిచ్చరపిడుగు ఏ రేంజ్లో చెలరేగుతాడోనని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ చిన్నోడి చేతుల్లోకి ఇంత పవర్ ఎలా వచ్చింది? టచ్ చేస్తే సిక్స్ ఎలా సాధ్యమవుతోంది? ఇంత చిన్న వయసులోనే అంత అద్భుతమైన ఫిట్నెస్ వెనకున్న ఆ డైట్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం.
ఇష్టమైన ఫుడ్కు త్యాగం .. 15 ఏళ్లకే అంతర్జాతీయ స్థాయికి:
ఒక 15 ఏళ్ల కుర్రాడు అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో ప్లేయర్గా ఎదిగి.. ఈ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తున్నాడంటే దాని వెనుక ఎంతో కఠినమైన శ్రమ, క్రమశిక్షణ ఉంది. సాధారణంగా ఈ వయసులో ఉండే మిగతా టీనేజ్ కుర్రాళ్లు ఎలాంటి టెన్షన్లు లేకుండా ఇష్టమైన ఫుడ్ తింటూ.. గాలి తిరుగులు తిరుగుతూ, స్కూల్ కు వెళ్తూ ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతుంటారు. కానీ సూర్యవంశీ మాత్రం అంతర్జాతీయ క్రికెటర్గా రాణించడం కోసం తన చిన్ననాటి ఇష్టాలను.. ముఖ్యంగా ఫుడ్ విషయంలో ఎన్నో త్యాగాలు చేశాడు.
బీహార్లో అత్యంత పాపులర్ వంటకం లిట్టి చొఖా . అక్కడ దీనిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. వైభవ్కు కూడా ఇదంటే అమితమైన ఇష్టం. కానీ, క్రికెట్కు అవసరమైన అల్టిమేట్ ఫిట్నెస్ కోసం అతడు దానికి పూర్తిగా దూరమయ్యాడు. ఇదే విషయాన్ని ఆయన తండ్రి సంజీవ్ ఒక ఇంటర్వ్యూలో గర్వంగా పంచుకున్నారు. ప్రస్తుతం వైభవ్ ఎంతో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ, రోజూ క్రమం తప్పకుండా జిమ్లో గంటల తరబడి వర్కౌట్స్ చేస్తున్నాడని ఆయన తెలిపారు. అలాగే వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓఝా మాట్లాడుతూ.. వైభవ్కు పిజ్జా అంటే పిచ్చి అని.. కానీ ప్రొఫెషనల్ ప్లేయర్గా ఎదగడం కోసం పిజ్జాను కూడా త్యాగం చేశాడని చెప్పారు. అంతేకాదు.. ఈ యంగ్ సెన్సేషన్ అసలు మటన్ కూడా ముట్టడట.
సిక్సర్ల సునామీకి.. ఆ స్ట్రెంత్ కావాల్సిందే:
ఒక ఇంటర్నేషనల్ క్లాస్ బ్యాట్స్మన్గా క్రీజులో నిలబడాలంటే ఫిట్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా కోర్ స్ట్రెంత్ కాళ్లు, భుజాలు, చేతుల్లో అసాధారణ బలం ఉండాలి. ఆ స్ట్రెంత్ పవర్ఫుల్గా ఉంటేనే భారీ సిక్సర్లు, ఫోర్లు బాదేటప్పుడు బాడీ బ్యాలెన్స్ కోల్పోకుండా పవర్ను జనరేట్ చేయవచ్చు. దీనితో పాటు హ్యాండ్-ఐ కోఆర్డినేషన్ చాలా ముఖ్యం. బౌలర్ వేసే బంతి వేగాన్ని, స్పిన్ను మైక్రో సెకన్లలో అర్థం చేసుకుని షాట్ ఆడటానికి ఇది సహాయపడుతుంది. అలాగే సింగిల్స్, డబుల్స్ కోసం వేగంగా పరిగెత్తే చురుకుదనం, గంటల తరబడి క్రీజులో అలసిపోకుండా నిలబడే స్టామినా కోసం వైభవ్ రోజూ జిమ్ వర్కౌట్స్, నెట్ ప్రాక్టీస్, రన్నింగ్ మరియు స్ట్రెచింగ్ వంటివి కఠినంగా పాటిస్తున్నాడు.
Also Read: ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. పీఎం మోదీ పిలుపుతో క్యూ కడుతున్న టాప్ కంపెనీలు..
ఏంటీ ఈ బుడ్డోడి డైట్ సీక్రెట్?
వైభవ్ తన ఫిట్నెస్ కోసం టాప్ ఇంటర్నేషనల్ అథ్లెట్ల తరహాలోనే హై-ప్రోటీన్ డైట్కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆయన రోజువారీ మెనూలో ఇవి తప్పనిసరిగా ఉంటున్నాయి:
ప్రోటీన్ రిచ్ ఫుడ్స్: కండరాల బలానికి అవసరమైన గుడ్లు, చికెన్, పాలు, పనీర్, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకుంటాడు.
ప్రాసెస్డ్ ఫుడ్స్ కు దూరం : పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే సాంప్రదాయ వంటకాలు, ఆయిలీ ఫుడ్, ప్రాసెస్ చేసిన స్నాక్స్కు బదులుగా బాదం, వాల్నట్స్ వంటి పోషక విలువలున్న నట్స్ను స్నాక్స్గా తీసుకుంటాడు.
క్లీన్ కార్బోహైడ్రేట్స్: బాడీకి అవసరమైన ఎనర్జీ కోసం కార్బ్స్ను పూర్తిగా మానేయకుండా.. తక్కువ మోతాదులో బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమ రొట్టెలు, చిలగడదుంపల వంటి క్లీన్ కార్బ్స్ తీసుకుంటాడు.
ఫ్రూట్స్ , హైడ్రేషన్: బాడీ మెటబాలిజం బాగుండటానికి ప్రతిరోజూ డైట్లో పండ్లను భాగం చేసుకుంటాడు.
మెంటల్ స్ట్రెంత్ వెనుక సీక్రెట్ అదే:
ఈ అద్భుతమైన డైట్ అండ్ వర్కౌట్ ప్లాన్ వల్లే వైభవ్ సూర్యవంశీ మైదానంలో ఎంతటి భారీ ఇన్నింగ్స్లు ఆడినా, కొంచెం కూడా అలసిపోకుండా ఎనర్జిటిక్గా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు. దీనికి తోడు ఆయన నిద్ర విషయంలోనూ, బాడీని హైడ్రేట్గా ఉంచుకోవడానికి తాగే నీటి విషయంలోనూ చాలా ఖచ్చితమైన నియమాలు పాటిస్తాడట. అందుకే గ్రౌండ్లోనే కాదు, మెంటల్గా కూడా వైభవ్ చాలా స్ట్రాంగ్గా ఉంటూ, ఎంతటి మ్యాచ్ ఒత్తిడినైనా చాలా కూల్గా జయిస్తున్నాడని డైట్ నిపుణులు చెప్తున్నారు.
Also Read: మార్కెట్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ.. నీటిలో నానినా చిరగవు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PMAY Urban Yojana: PMAY-అర్బన్ పథకం అంటే ఏమిటి? PM Awas Yojana కింద ఇల్లు కావాలా? అర్హతలు, దరఖాస్తు పూర్తి ప్రాసెస్ ఇదే..!!
Lakshmapur, Telangana:PMAY Urban Yojana: నగరాల్లో నివసిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు శాశ్వత గృహాలను అందించడానికి భారత ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ అనే స్కీమును ప్రవేశపెట్టింది. ఈ పథకం అందరికీ గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో 25 జూన్ 2015న ప్రారంభించింది. దేశంలోని ప్రతి పట్టణ కుటుంబానికి గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో PMAY-అర్బన్ పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని ప్రతి పట్టణ కుటుంబానికి అన్ని ప్రాథమిక సౌకర్యాలతో కూడిన సురక్షితమైన, పటిష్టమైన ఇల్లు ఉండాలన్నది ఈ స్కీము ప్రధాన ఉద్దేశ్యం. నేటికీ.. దేశంలోని అనేక నగరాల్లో లక్షలాది మంది ప్రజలు మురికివాడలలో లేదా అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. అటువంటి కుటుంబాలకు శాశ్వత గృహాలను అందించడంలో ఈ పథకం చాలా కీలకంగా మారింది.
PMAY-అర్బన్ పథకం అర్హులు ఎవరు?
PMAY-అర్బన్ ప్రయోజనాలు కొన్ని షరతులకు లోబడి ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ పథకం ప్రత్యేకంగా ఆర్థికంగా బలహీన వర్గం, అల్ప ఆదాయ వర్గం, మధ్య ఆదాయ వర్గం-1 మధ్య ఆదాయ వర్గం-2, పట్టణ మురికివాడలలో నివసించే ప్రజల కోసం రూపొందించింది. ఈ పథకంలో అత్యంత ముఖ్యమైన నియమం ఏమిటంటే, లబ్ధిదారునికి భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటికే పక్కా ఇల్లు ఉండకూడదు. ఎవరైనా గతంలో ఏదైనా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాన్ని పొంది ఉంటే, వారు కూడా ఈ పథకానికి అర్హులు అవుతారు.
PMAY-అర్బన్ పథకం ప్రధాన అంశాలు
ఈ పథకం ప్రయోజనాలు అవసరమైన ప్రతి ఒక్కరికీ చేరేలా దీనిని వివిధ భాగాలుగా విభజించారు.
1. లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణం:
ఈ పథకం కింద, భూమి ఉండి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేని వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. వారు తమ సొంత ఇళ్లను నిర్మించుకోవచ్చు లేదా మెరుగుపరచుకోవచ్చు.
2. భాగస్వామ్యంలో సరసమైన గృహనిర్మాణం:
ఈ పథకం కింద, ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల, బిల్డర్లతో కలిసి సరసమైన గృహాలను నిర్మిస్తుంది, వాటిలో కొన్ని EWS కుటుంబాల కోసం కేటాయిస్తారు.
3. ఇన్-సిటు స్లమ్ రిహాబిలిటేషన్
ఈ పథకం కింద, మురికివాడలను అదే ప్రదేశంలో పునరాభివృద్ధి చేసి, అక్కడ నివసిస్తున్న ప్రజలకు కొత్త పక్కా ఇళ్లను అందిస్తారు.
4. వడ్డీ రాయితీ పథకం
ఈ పథకం కింద, ప్రభుత్వం గృహ రుణాలపై వడ్డీ రాయితీలను అందించి, ఇల్లు కొనడాన్ని లేదా కట్టుకోవడాన్ని సులభతరం చేస్తుంది. దీనివల్ల ఈఎంఐ భారం గణనీయంగా తగ్గుతుంది.
PMAY-అర్బన్ పథకానికి అర్హత:
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి కొన్ని షరతులు ఉన్నాయి. దరఖాస్తుదారు భారత పౌరుడై ఉండాలి. కుటుంబ ఆదాయం EWS, LIG, లేదా MIG వర్గాల పరిధిలోకి రావాలి. కుటుంబ సభ్యులలో ఎవరికీ సొంత శాశ్వత గృహం ఉండకూడదు. వారు ఇంతకు ముందు మరే ఇతర కేంద్ర గృహ నిర్మాణ పథకం ద్వారా ప్రయోజనం పొంది ఉండకూడదు. మీరు దరఖాస్తు చేస్తున్న నగరంలో నివాసం ఉండటం తప్పనిసరి. ఆధార్ కార్డు ద్వారా గుర్తింపు ధృవీకరణ తప్పనిసరి.
Also Read: ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. పీఎం మోదీ పిలుపుతో క్యూ కడుతున్న టాప్ కంపెనీలు..
PMAY-అర్బన్ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?
-ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
-ముందుగా PMAY-అర్బన్ పోర్టల్కు వెళ్లండి.
-PMAY-U 2.0 కోసం దరఖాస్తు చేసుకోండి అనే ఎంపికను ఎంచుకోండి.
-ఆధార్ OTPతో గుర్తింపును ధృవీకరించండి.
-మీ వ్యక్తిగత సమాచారం, కుటుంబ సమాచారం, ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని పూరించండి.
-బ్యాంకు ఖాతా, రుణ సమాచారాన్ని నమోదు చేయండి (వర్తిస్తే).
-సరైన ప్రణాళికను ఎంచుకోండి.
-అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి.
-ఫారం సమర్పించి, దాని కాపీని డౌన్లోడ్ చేసుకోండి.
Also Read: మార్కెట్లోకి సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ.. నీటిలో నానినా చిరగవు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేని వారు ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు:-
-సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించండి.
-రూ. 25 + GST చెల్లించి దరఖాస్తు ఫారం పొందండి.
-ఫారమ్ను సరిగ్గా పూరించండి.
-అవసరమైన అన్ని పత్రాలను జతచేయండి.
-దీనిని CSCకి సమర్పించండి.
-PMAY-అర్బన్ పథకానికి అవసరమైన పత్రాలు
-దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలు అవసరం:-
ఆధార్ కార్డు
-గుర్తింపు కార్డు (పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి)
-ఆదాయ ధృవీకరణ పత్రం
-చిరునామా రుజువు
-బ్యాంకు పాస్బుక్ మరియు ఖాతా స్టేట్మెంట్
-పాస్పోర్ట్ సైజు ఫోటో
-అఫిడవిట్ (గతంలో పక్కా ఇల్లు లేదని)
-EWS/LIG/MIG సర్టిఫికేట్ (వర్తిస్తే)
-జీతం స్లిప్ లేదా ITR (మధ్యతరగతి వారికి)
PMAY-అర్బన్ స్కీమ్ దరఖాస్తు తర్వాత ప్రక్రియ
దరఖాస్తును సమర్పించిన తర్వాత, సంబంధిత శాఖ ద్వారా మొత్తం సమాచారం ధృవీకరిస్తారు. అర్హులుగా తేలితే, పథకం ప్రకారం లబ్ధిదారునికి సహాయం అందుతుంది. కొన్ని సందర్భాల్లో, రుణంపై వడ్డీ రాయితీని నేరుగా బ్యాంకు ఖాతాకు లేదా రుణ ఖాతాకు బదిలీ చేస్తారు. దరఖాస్తుదారు ఏవైనా సమస్యలను ఎదుర్కొంటే, వారు తమ సమీపంలోని మున్సిపల్ కార్పొరేషన్ లేదా పట్టణ స్థానిక సంస్థ కార్యాలయాన్ని సందర్శించి సహాయం పొందవచ్చు.
PMAY-అర్బన్ పథకం ప్రాముఖ్యత
పీఎంఏవై-అర్బన్ పథకం నగరాల్లో నివసిస్తున్న లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకువచ్చింది. ఈ పథకం కేవలం ఇళ్లను అందించడానికే పరిమితం కాకుండా, ప్రజలకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. శాశ్వత నివాసం ఉండటం భద్రతను పెంచడమే కాకుండా, సామాజిక, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా అందిస్తుంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ అనేది భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ముఖ్యమైన పథకం. ఇది ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించాలనే లక్ష్యాన్ని వేగంగా ముందుకు తీసుకువెళ్తోంది. సులభమైన దరఖాస్తు ప్రక్రియ, వడ్డీ రాయితీలు, ప్రభుత్వ మద్దతుతో, ఈ పథకం లక్షలాది మందికి ఆశాకిరణంగా మారింది. మీరు అర్హులైతే, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని, మీ కలల ఇంటిని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Air India Express Sale: బస్సు టికెట్టు ధరకే విమానం ఎక్కొచ్చు..సగం ధరకే విమానం టికెట్తో ఎయిర్ ఇండియా సరికొత్త ఆఫర్!
Hyderabad, Telangana:Air India Express Sale 2026: టాటా గ్రూప్నకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వేసవి సందర్భంగా ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. 'ఎక్స్ప్రెస్ సేల్' పేరుతో ఏకంగా 50 లక్షల సీట్లను సగం ధరకే (50% తగ్గింపుతో) అందిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని సదరు విమానయాన సంస్థ ప్రకటించింది. ఈ బంపర్ ఆఫర్కు సంబంధించిన పూర్తి వివరాలు, తేదీలు విమానయాన రంగానికి చెందిన మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్స్ప్రెస్ సేల్ వివరాలు..
ఈ ప్రత్యేక సేల్లో భాగంగా కస్టమర్లకు భారీ డిస్కౌంట్లతో పాటు అదనపు ప్రయోజనాలను సంస్థ కల్పిస్తోంది. 'లైట్ ఫేర్స్' (చెక్-ఇన్ బ్యాగేజీ లేని టిక్కెట్లు), 'వాల్యూ ఫేర్స్' బుకింగ్లపై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లను మే 27 నుండి మే 31, 2026 వరకు బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా తెలిపింది. బుక్ చేసుకున్న టిక్కెట్లపై జూన్ 15 నుండి అక్టోబర్ 10, 2026 మధ్య కాలంలో ప్రయాణించవచ్చు.
సేల్లో అదనపు ప్రయోజనాలు..
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికారిక వెబ్సైట్ (airindiaexpress.com) లేదా వారి మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే వినియోగదారులకు 'కన్వీనియన్స్ ఫీజు' (సేవా రుసుము) పూర్తిగా ఉచితంగా వెసులుబాటు కల్పించింది. మే 27న అధికారిక వెబ్సైట్/యాప్ వినియోగదారులకు ముందస్తు యాక్సెస్ లభించగా, మే 28 నుండి అన్ని ప్రధాన ట్రావెల్ పోర్టల్స్లో ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది.
అయితే టాటా నియుపాస్ మెంబర్షిప్ ఉన్న ప్రయాణికులకు ఈ సేల్లో ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. లాగిన్ అయిన సభ్యులకు బిజినెస్ క్లాస్ ఛార్జీలపై 20% తగ్గింపు లభిస్తుంది. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు విశాలమైన లెగ్రూమ్, ఉచిత వేడి భోజనం, అదనపు లగేజీ అనుమతితో పాటు ఇతర సేవలను కల్పిస్తారు. విమాన బుకింగ్లపై అదనంగా రూ.300 వరకు తగ్గింపుతో పాటు 8% వరకు 'NeuCoins' సంపాదించుకోవచ్చు. గౌర్మేయర్ హాట్ మీల్స్, నచ్చిన సీటు ఎంపికతో పాటు అదనపు సామాను (10 కేజీల ఎక్స్ప్రెస్ చెక్-ఇన్ బాగేజ్ + 3 కేజీల క్యారీ-ఆన్ బాగేజ్) వంటి సేవలపై 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇజ్రాయెల్కు సర్వీసుల నిలిపివేత..
పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా అనిశ్చితి కారణంగా ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. టెల్ అవీవ్ - ఢిల్లీ మార్గంలో నడిచే తన విమాన సర్వీసుల నిలిపివేతను జూలై నెలాఖరు (జూలై 31, 2026) వరకు పొడిగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
గతంలో ఈ సర్వీసులను జూన్ ముగింపు వరకే నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, అక్కడ భద్రతా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయాన్ని మరో నెల రోజుల పాటు పొడిగించారు. ఇజ్రాయెల్ విమాన కార్యకలాపాల షెడ్యూల్ సవరణ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ అయినట్లు సంస్థ సీనియర్ అధికారులు వెల్లడించారు.
Also Read: ఉద్యోగులకు అలర్ట్..పీఎఫ్ డబ్బు ఏటీఎం ద్వారా ఎలా విత్డ్రా చేసుకోవాలి?
Also Read: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..కనీస జీతం రూ.69,000కి పెంపు..18 నెలల బకాయిలు అకౌంట్లో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TV Serial Chance: టీవీ సీరియల్ పేరిట డాక్టర్కు కుచ్చుటోపీ.. తీగలాగితే తెలంగాణ, ఆంధ్ర మధ్య జరిగిన సైబర్ నేరం
Visakhapatnam, Andhra Pradesh:Cyber Crime On Serials Chance: సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తి ఓ వైద్యురాలిని నమ్మించాడు.. తనదైన మాటలతో బుట్టలో వేసుకున్నాడు. అనంతరం ఆమె అకౌంట్ల నుంచి విడతల వారీగా డబ్బులు వేయించుకున్నాడు. ఆమెకు సీరియల్స్ ఇష్టం కావడంతో సీరియల్స్లో నటించే అవకాశం కల్పిస్తానని చెప్పి డబ్బులు వేయించుకుని అనంతరం పత్తా లేకుండాపోయాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. ఆమె డబ్బులతో అతడు ఓ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఈ ఉదంతం విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్టణంలో ఓ కార్ల షోరూమ్ ఉంది. ఆ షోరూమ్లో ఓ వ్యక్తి రూ.22 లక్షలు ఖర్చు చేసి కారు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కార్ల షోరూమ్ అకౌంట్ ఫ్రీజ్ అయింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఓ ఏఎస్ఐ కేసు నమోదు చేయకుండా దర్యాప్తు ప్రారంభించాడు. ఆ డబ్బు పంపిన అకౌంట్ నంబర్ ఆధారంగా ఖమ్మంలోని ఓ మహిళా డాక్టర్ను సంప్రదించారు. మీరే నిందితురాలు అని ఏఎస్ఐ నిలదీయగా.. అయ్యో తాను అసలైన బాధితురాలినని చెప్పారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం జరిగింది ఏమిటో తెలుసుకుందాం.
బాధితురాలి కథనంతో..
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెంది ఓ డాక్టర్ భార్యకు సోషల్ మీడియా ద్వారా విశాఖపట్టణంలోని మధురవాడకు చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్ పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త పెరగడంతో ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాడు. ఆమెకు సీరియల్స్ ఇష్టమని గుర్తించి 'మీకు సీరియల్స్లో నటించే అవకాశం ఇస్తా' అని నమ్మబలికాడు. ప్రముఖ ఛానల్లో సీరియల్స్లో ఓ పాత్ర ఇప్పిస్తానని ఆశచూపి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని నిందితుడు ఆమెకు చెప్పాడు.
ఇక్కడే ట్విస్ట్..
అలా ఆమెతో జంబాడ లక్ష్మీ వరప్రసాద్ వరుసగా డబ్బులు పంపించుకున్నాడు. కొద్ది రోజులకు ఆమె అకౌంట్ నుంచి రూ.22 లక్షల డబ్బును విశాఖలోని కార్ల షోరూమ్ ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. దీంతో ఓ ఖరీదైన కారు డాక్టర్ డబ్బులతో కొనుగోలు చేశాడు. అయితే అవకాశం ఇస్తానని చెప్పి నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంతో ఆమె సైబర్ నేరగాడి వలలో చిక్కినట్లు గ్రహించారు. వెంటనే వైద్యుడి భార్య తెలంగాణ సైబర్ సెల్ను ఆశ్రయించారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన పోలీసులు నిందితుడు కొనుగోలు చేసిన కార్ల షోరూమ్ అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేశారు. తమ అకౌంట్ ఫ్రీజ్ కావడంతో కార్ల యజమాని విశాఖలోని కంచరపాలెం పోలీసులను తెలంగాణకు పంపించారు. దీంతో అసలు కథ బయటపడింది. బాధితురాలి కథను తెలుసుకున్న పోలీసులు నిందితుడు జంబాడ లక్ష్మీ వరప్రసాద్ కోసం వెతుకుతున్నారు. ఇటు విశాఖపట్టణం పోలీసులు.. అటు తెలంగాణ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే అతడిని పట్టుకుని కార్ల యజమానితోపాటు తెలంగాణలోని వైద్యుడి భార్యకు కూడా న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
అత్యధికులు విద్యావంతులే
కాగా సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. మోసానికి పోవడానికి రెడీగా ఉన్నామన్నట్టు బాధితుల వ్యవహార శైలి కనిపిస్తోంది. అయితే సైబర్ నేరస్తుల బారిన పడుతున్న వారిలో అత్యధికులు విద్యావంతులే ఉంటుండడం గమనార్హం. ఎంత అవగాహన కల్పిస్తున్నా చాలా సులువుగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. కళ్ల ముందు మోసపోతున్నా తెలియకుండా పోతున్నారు.
Medical Miracle: వైద్యులకే మైండ్ బ్లాక్.. కడుపునొప్పి అని వెళ్తే.. లోపల ఏకంగా 1.3 కిలోల రాయి!
Hyderabad, Telangana:Medical Miracle Latest News: సాధారణంగా కిడ్నీల్లోనో.. మూద్రాశయాంలోనో.. రాళ్లు ఏర్పడడం గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. అవి సాధారణంగా మిల్లీమీటర్లు లేదా కొన్ని సెంటీమీటర్ల పరిమాణంలో.. రవ్వంత సైజులో ఉంటాయని అప్పుడప్పుడు డాక్టర్లు చెబుతూ ఉంటారు. కానీ చైనాలోని వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన ఒక విచిత్రకరమైన, అత్యంత అరుదైన ఘటన వెలుగు చూసింది. ఒక వ్యక్తి మూత్రాశయం నుంచి ఏకంగా 1.3 కిలోల బరువున్న భారీ రాయిని వైద్యుని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. ఈ పరిమాణంలో రాయి ఉండటం చూసి ఆపరేషన్ చేసిన డాక్టర్లే తీవ్ర ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది..
చైనాకు చెందిన 56 ఏళ్ళు వయస్సు కలిగిన చన్ అనే రైతు గత మూడేళ్లుగా తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.. మూత్ర విసర్జన చేసే సమయంలో అతడికి భరించలేని నొప్పి వచ్చేదట.. అయితే అది సాధారణ ఇన్ఫెక్షన్ లేదా చిన్నపాటి సమస్యగా భావించిన చెన్.. ఆసుపత్రికి వెళ్లకుండా స్థానికంగా దొరికే మందులను వాడుతూ కాలం వెళ్ళదీశాడు.. అలా మూడేళ్ల పాటు నరకయాతన అనుభవించేశాడు. ఇటీవలే కాలంలో ఆ నొప్పి మరింత తీవ్రం కావడంతో.. తట్టుకోలేక స్థానిక పెద్ద ఆసుపత్రిని ఆశ్రయించేసాడు..
బాధితుడికి స్కానింగ్తో పాటు ప్రత్యేకమైన ఎక్స్రే నిర్వహించిన వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.. అతడి మూత్రాశయం మొత్తం ఒక పెద్ద భారీ రాయితో నిండి ఉండటాన్ని గమనించారు.. పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో.. నిపుణులైన సర్జన్ల బృందం అత్యవసరంగా ప్రత్యేకమైన సర్జరీ నిర్వహించింది. గంటల పాటు శ్రమించి.. అతని పొట్ట భాగం నుంచి ఆ భారీ రాయిని బయటకు తీశారు.. ఆ బయటికి తీసిన రాయి వింత రంగులో కనిపించడం విశేషం..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఇలా బయటికి తీసిన రాయిని బరువు తూచగా.. ఏకంగా 1.3 కిలోల బరువు ఉన్నట్లు తేలింది.. ఇంత పెద్ద రాయిని కడుపులో పెట్టుకొని మూడేళ్ల పాటు ఎలా భరించాడో అని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ విజయవంతం కావడంతో రైతు చెన్ కోరుకుంటున్నాడని.. ఆ నరకం నుంచి విముక్తి లభించిందని వైద్యులు వెల్లడించారు. నీరు తక్కువగా తాగడంతో పాటు మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల, వివిధ రకాల జీవనశైలి అలవాట్ల వల్ల ఇలాంటి రాళ్లు ఏర్పడతాయని.. నొప్పి వస్తే నిర్లక్ష్యం వహించవద్దని ఈ సందర్భంగా వైద్యులు హెచ్చరిస్తూ వస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Cobra Video: కింగ్ కోబ్రాకు నోటితో నీరు తాగించిన వ్యక్తి.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Man Feeding Water To King Cobra Video Watch: సోషల్ మీడియా వేదికగా నిత్యం అనేక రకాల వింతలతో పాటు విశేషాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వన్యప్రాణులతో పాటు విశేషాలకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఆజాగా అలాంటి కోవాకు చెందిన ఆశ్చర్యం కలిగించే ఒక దృశ్యం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అత్యంత ప్రమాదకరమైన.. ఓకే ఒక కాటుతో ఏనుగును సైతం చంపేయగల సామర్థ్యం కలిగిన కింగ్ కోబ్రా పాముకు, ఒక వ్యక్తి ఏకంగా తన నోటితో నీటిని తాగించాడు.. ఈ షాకింగ్ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ముక్కున వేలేసుకుంటున్నారు..
సాధారణంగా పాము కనిపిస్తేనే.. భయంతో ఆమడ దూరం పారిపోయే రోజులివి.. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విష సర్పంగా పేరుగాంచిన కింగ్ కోబ్రా ఎదురుగా ఉంటే ఎవరైనా ప్రాణభయంతో వనికి పోవాల్సిందే.. కానీ ఈ వీడియోలో ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సాహసం చేసేసాడు.. ఎండ తీవ్రతకు తీవ్ర దాహంతో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ఆ పామును చూసి అతను జాలిపడ్డాడో ఏమో తెలియదు కానీ.. వినూత్నంగా సహాయం చేయాలనుకున్నాడు..
సదర్ వ్యక్తి ముందుగా తన నోట్లోకి.. నీటిని నింపుకున్నాడు.. ఆ తర్వాత నెమ్మదిగా కింగ్ కోబ్రా ముందుకు వెళ్లి.. తన ముఖాన్ని ఆ పాము నోటికి అత్యంత సమీపంలోకి తీసుకెళ్లాడు.. ఆపై తన నోటిలో ఉన్న నీటిని పాము నోటికి ధారగా వదులుతుండగా.. ఆ పాము ఎంతో సాధు జంతువుల ప్రశాంతంగా ఆ నీటిని తాగడం ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూడవచ్చు.. అంతేకాకుండా ఈ వీడియోలో పాము ఎంతో ప్రశాంతంగా ఆ నీటిని తాగడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతూ వస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడున్నవారు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్తో పాటు ఎక్స్ వంటి వేదికలపై పోస్ట్ చేయడంతో ఇది కాస్త విపరీతంగా వైరల్ అయింది.. కేవలం కొన్ని గంటల్లోనే లక్షలాదిమంది ఈ వీడియోను వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియో చూసినవారు.. నిజంగా ఇది నమ్మశక్యం కాని దృశ్యం అని కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. మరి కొంతమంది ఆ వ్యక్తి ధైర్యానికి జోహార్లు అంటూ కామెంట్లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ వీడియో చూసిన కొంతమంది ఇవన్నీ ప్రాణి సంరక్షకులు స్పందిస్తూ వస్తున్నారు.. పాములకు దాహం తీర్చడం మంచిదే అయినప్పటికీ ఇలా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి నోటిలో నోరు పెట్టి దాహం తీర్చడం మరీ అంత మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Cobra Video: ఇంటి ముందు మంచంపై ప్రత్యక్షమైన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!
Hyderabad, Telangana:Cobra Hooding On Cot Viral Video Watch: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నిత్యం ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తుంటే మరికొన్ని వీడియోలు మాత్రం భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒక గ్రామంలో చోటుచేసుకుంది. అత్యంత ప్రమాదకరమైన ఒక కింగ్ కోబ్రా పాము నేరుగాయి ఇంటి బయట ఉన్న ఒక మంచంపై ప్రత్యక్షమైంది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..
సాధారణంగా పాములు పొదల్లోనూ.. అడవి ప్రాంతాల్లోనూ.. నిర్మాణస్య ప్రదేశాల్లోనూ తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ కింగ్ కోబ్రా మాత్రం జనాభాసాల మధ్యకు వచ్చేసింది. ఒక ఇంటి ముందు ఖాళీ స్థలంలో వేసి ఉన్న మంచం పైకి ఎక్కిన ఈ భారీ పాము, అక్కడితో ఆగకుండా సుమారు రెండు నుంచి మూడు అడుగుల ఎత్తుకు పైగా వేచి పడగవిప్పి నిలబడింది. కోపంతో ఊగుతూ.. ఎవరైనా దగ్గరికి వస్తే కాటేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు బుసలు కొడుతూ దర్శనం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది...
ఇంటి ముందు మంచంపై ఇంత పెద్ద పాము పడగవిప్పి ఉండడాన్ని గమనించిన ఆ ఇంటి యజమానులు ఒక్కసారిగా షాక్కు గురై కేకలు వెయ్యడంతో.. చుట్టుపక్కల ఉన్న వారంతా అక్కడికి పరుగులు తీశారు.. అంత ప్రమాదకరమైన పాము ఎదురుగా ఉన్నప్పటికీ.. కొందరు స్థానికులు భయాన్ని పక్కన పెట్టేసి ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్స్ కెమెరాలతో చిత్రీకరించడం మీరు చూడొచ్చు. ఇప్పుడు వీరు పోస్ట్ చేసిన వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియోలను చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
అయితే, అక్కడే ఉన్న కొంతమంది స్నేక్ క్యాచర్స్కి సమాచారం అందించినట్లు తెలుస్తోంది.. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని ఎంతో చాకచక్యంగా ఆ కింగ్ కోబ్రాని బంధించారు. ఆ తర్వాత దాన్ని సురక్షితంగా సమీపంలోని అడవి ప్రాంతంలో వదిలిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్ తో పాటు ఎక్స్ వంటి వేదికలపై మిలియన్ల కొద్ది వ్యూస్తో ట్రెండ్ అవుతుంది. పాము ముందు అలా నిలబడి వీడియోలు తీయడం ప్రమాదకరమంటూ సోషల్ మీడియా వినియోగదారులతో పాటు వన్యప్రాణి సంరక్షకులు కూడా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Peddi Ticket Price Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి..ప్రీమియర్స్లో ఒక్కో టికెట్ రూ.600!
Nunna, Vijayawada, Andhra Pradesh:Peddi Ticket Price Hike In AP: రామ్చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన 'పెద్ది' సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈక్రమంలో సినిమా టికెట్ రేట్లను ఏపీలో పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ముందురోజు నుంచే అనగా జూన్ 3వ తేదీన 'పెద్ది' సినిమా ప్రీమియర్స్ నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ స్పెషల్ ప్రీమియర్స్ కోసం ఒక్కో టికెట్కు జీఎస్టీతో కలిపి రూ.600గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే జూన్ 4వ తేదీ నుంచి రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సహా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్లో టికెట్ ధరపై రూ.125 పెంచుకునేందుకు వీలుగా అనుమతి ఇచ్చింది. దీంతో చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది.AP Rain Alert: రోహిణి కార్తెలో వడగళ్ల వాన..ఒక్కసారిగా మారిన వాతావరణం!
Kakinada, Andhra Pradesh:AP Rain Alert Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల కొన్ని గంటల్లో తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్లు కురుస్తున్నాయి. ఓ పక్క రోహిణి కార్తెలో ఎండలు ఠారెత్తిపోతుంటే..మరోపక్క కాకినాడలో వడగళ్ల వాన బెంబేలెత్తిస్తోంది.Sharmila Rajya Sabha: ఢిల్లీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిళ.. కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు ఖరారు..రాహుల్ గాంధీతో భేటీ!
Vijayawada, Andhra Pradesh:Sharmila Rajya Sabha Seat: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వచ్చిన అత్యవసర పిలుపు మేరకు ఆమె ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో షర్మిల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ వెనుక ఉన్న ప్రధాన కారణాలు, రాజకీయ పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
షర్మిలకు రాజ్యసభ హామీ?
వైఎస్ షర్మిలకు పార్లమెంట్ ఎగువ సభ (రాజ్యసభ)కు పంపే విషయమై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటక నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలోనే షర్మిల పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అయితే కర్ణాటక నుంచి ఖాళీ అవుతున్న స్థానాల్లో.. ఒక స్థానం నుండి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించడం దాదాపు ఖాయమైంది. మిగిలిన రెండు స్థానాలపై ఉత్కంఠ నెలకొనగా.. ఖర్గే కాకుండా మిగిలిన రెండు సీట్లలో, ఒక స్థానాన్ని వైఎస్ షర్మిలకు కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత
ఏపీలో పార్టీ బలోపేతానికి షర్మిల చేస్తున్న ప్రయత్నాలను గుర్తించిన అధిష్ఠానం.. ఆమెకు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో ఏపీ రాజకీయ పరిస్థితులతో పాటు, కర్ణాటక కోటా నుండి ఆమెకు రాజ్యసభ సీటు కేటాయించే విధివిధానాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ అధిష్ఠానం నిర్ణయం అధికారికంగా వెలువడితే, కర్ణాటక నుండి వైఎస్ షర్మిల రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో యాక్టివ్గా లేదు. దాదాపుగా దశాబ్దం తర్వాత కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిళ.. తన తండ్రి బాటలో పార్టీని ముందుకు నడిపే విధంగా ప్రణాళికల రచించింది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూసింది. అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏపీలో పుట్టగతులు లేకపోవడమే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఉనికి చాటుకోవడం సహా డిల్లీ రాజకీయాల్లో కాంగ్రెస్ తరఫున ఏపీ నుంచి ఓ ప్రతినిధి కావాలంటూ షర్మిళను రాజ్యసభకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ప్రయాణికులపై అదనపు భారం..ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపు..ఎప్పటి నుంచి అమలు!
Also Read: తిరుపతిలో బాంబు కలకలం.. ఆధ్యాత్మిక నగరంలో హై-అలెర్ట్..పరుగులు తీసిన భక్తజనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Teachers News: బడి వదిలి గడ్డి కోయాలా? టీచర్లకు విద్యాశాఖ వింత రూల్.. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం!
Hyderabad, Telangana:Teachers Fodder Collection Controversy Latest News: బడికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పి..వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులను విద్యాశాఖ వింత బాధ్యతల్లోకి నెట్టేసింది.. వీధి పశువుల కోసం ఉపాధ్యాయులు గడ్డి సేకరించాలంటూ విద్యాశాఖ జారీ చేసిన వినూత్న ఉత్తర్వులు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారాయి.. ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘాలతో పాటు మేధావుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అయితే ఈ వినూత్న ఉత్తర్వులకు గల కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బరేలీ జిల్లా వ్యాప్తంగా సుమారు 15 బ్లాకులు ఉండగా.. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు ఒక ప్రత్యేకమైన వింత టార్గెట్ ను పెట్టారు. ప్రతి బ్లాక్ నుంచి ఉపాధ్యాయులు కనీసం 100 క్వింటాళ్ల చొప్పున పశుగ్రాసాన్ని సేకరించి స్థానిక గోశాలలకు అందించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సేకరణ ప్రక్రియ పర్యవేక్షించేందుకు ప్రత్యేక నోడల్ అధికారులను కూడా నియమించడం ఆశ్చర్యం కలిగిస్తోంది..
కేవలం టార్గెట్ విధించడమే కాకుండా పశుగ్రాసం సేకరించని ఉపాధ్యాయులపై కఠినమైన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని.. జీతాల్లో కోత విధిస్తామని అధికారులు తొలత జారీ చేసిన ఉత్తర్వుల్లో హెచ్చరించారు. దీంతో ఉపాధ్యాయులు కూడా తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం. ఉదయం పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పాలా? లేక వీధుల వెంట తిరిగి పశువులకు గడ్డి సేకరించాలా? అంటూ ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు..
ఉత్తర్వులపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.. ఉపాధ్యాయులను ఇంతలా దిగజారుస్తారా అంటూ విపక్షాలతో పాటు ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వివాదం ముదరడంతో పాటు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవడంతో విద్యాశాఖ అధికారులు ఎట్టకేలకు దిగివచ్చారు. గడ్డి సేకరణ అనేది ఉపాధ్యాయుల ఇష్టమని.. ఎవరిని బలవంతం చేయడం లేదని అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. స్వచ్ఛందంగా గో సేవ చేయాలనుకునే వారి కోసమే ఈ ఆదేశాలని.. దీనిపై ఎలాంటి ఒత్తిడి లేదని చెబుతూ వివాదాన్ని సర్దుమనిగేలా చేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ విద్యాసంస్థలను ఇలాంటి పనులకు వాడుకోవడం పై ఇంకా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Xiaomi 17T: మార్కెట్లోకి షావోమి కొత్త బాహుబలి ఫోన్.. 6500mAh బ్యాటరీ, లైకా కెమెరాలతో లాంచ్!
Hyderabad, Telangana:Xiaomi 17t Launch News: ప్రముఖ గ్లోబల్ స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi టెక్ ప్రియుల ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. మార్కెట్లోకి తమ సరికొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ఫోన్ Xiaomi 17Tను అధికారికంగా విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లతో పాటు అద్భుతమైన కెమెరా క్వాలిటీ.. గతంలో ఎప్పుడూ లేని భారీ బ్యాటరీ బ్యాకప్తో మార్కెట్లోకి ఘనంగా లాంచ్ అయ్యింది.. దీని డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. అలాగే ఇది వివిధ కలర్ ఆప్షన్స్లో అందుబాటులోకి రావడం విశేషం. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గ్లోబల్ మార్కెట్లో ఈ సరికొత్త షావోమి 17T ను మొదటగా యూరప్లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే, అక్కడ దీని ధర భారత కరెన్సీలో దాదాపు రూ.83 వేల నుంచి ప్రారంభం కాబోతోంది. ఇందులో వివిధ రకాల వేరియంట్స్తో పాటు కలర్ ఆప్షన్ను బట్టి ధరలు ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్ ను జూన్ మొదటి వారంలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..
షావోమి 17T స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది అద్భుతమైన కెమెరా సెటప్తో అందుబాటులోకి రాబోతోంది. ప్రముఖ కెమెరా బ్రాండ్కు సంబంధించిన లైకా భాగస్వామ్యంతో ఈ కెమెరా సెటప్ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ వెనక భాగంలో ఎంతో అద్భుతమైన త్రిపుల్ రైర్ కెమెరా సెటప్ ను అందించారు. ఇందులో OIS టెక్నాలజీ కలిగిన ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ లైట్ ఫ్యూజన్ ప్రధాన కెమెరా అందుబాటులో ఉండబోతోంది. అంతేకాకుండా 5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరా ఉండడం విశేషం. అలాగే అదనంగా చాలా ప్రత్యేకమైన 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా కూడా లభిస్తోంది.
ఫ్రంట్ భాగంలో వీడియో కాలింగ్ కోసం..32 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక సాధారణ ఫ్లాగ్షిప్ ఫోన్లలో బ్యాటరీ చాలా తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ ఇందులో మాత్రం కంపెనీ ఎంతో శక్తివంతమైన 6,500mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీని అందించింది. అలాగే ఇందులో చాలా ప్రత్యేకమైన 67W హైపర్చార్జ్ చార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ఎంతో సులభంగా చార్జ్ అవుతుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
అలాగే ఈ స్మార్ట్ఫోన్లో కంపెనీ చాలా ప్రత్యేకమైన 6.59-ఇంచుల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 120Hz రీఫ్రెష్ రేట్, Dolby Vision, 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో లభిస్తోంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా అద్భుతంగా స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ఇది అత్యంత వేగమైన పనితీరు కలిగిన మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా (Dimensity 8500 Ultra) ప్రాసెసర్ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ (HyperOS 3) పై రన్ అవుతుంది. అలాగే ప్రీమియం లుక్లో కనిపించేందుకు దీని డిజైన్ కూడా పూర్తిగా కంపెనీ మార్చినట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BCCI Bans Sunglasses: ఐపీఎల్లో ఆటగాళ్ల కళ్లద్దాలు నిషేధించిన బీసీసీఐ..ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
Mumbai, Maharashtra:BCCI Bans Smart Sunglasses: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ చివరి దశ ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అవినీతి నిరోధక విభాగం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్లు జరిగే సమయంలో ఆటగాళ్లు, అధికారులు ఉపయోగించే గ్యాడ్జెట్స్పై మరిన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా.. పిచ్, డగౌట్ పరిసరాల్లో 'స్మార్ట్ సన్గ్లాసెస్' వాడకంపై పూర్తిగా నిషేధం విధించింది.
కొత్త నిబంధనలు, వాటి కారణాలు..
స్మార్ట్ సన్గ్లాసెస్పై నిషేధానికి కారణం ఏమిటంటే..ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఆధునిక స్మార్ట్ కళ్లద్దాలలో మొబైల్ డేటా లేదా వై-ఫై నెట్వర్క్ సహాయంతో పనిచేసే ఎన్నో అధునాతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.ఈ అద్దాల ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడం, టెక్స్ట్ మెసేజ్లు పంపడం/స్వీకరించడం, ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడటం వంటివి సులభంగా చేయవచ్చు.
కొన్ని కంపెనీలు ఈ స్మార్ట్ గ్లాసెస్ను ఐపీఎల్ ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్కు మార్కెటింగ్ చేస్తున్న విషయాన్ని బీసీసీఐ గుర్తించింది. ఇవి 'ఆడియో/వీడియో రికార్డింగ్, కమ్యూనికేషన్ పరికరాలు'గా వర్గీకరించబడటం వల్ల.. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి అవినీతి చర్యలకు దారితీసే అవకాశం ఉందని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
PMOA రూల్స్ ఇకపై మరింత కఠినం
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ప్లేయర్స్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా (PMOA) అంటే ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్స్, డగౌట్స్, మ్యాచ్ జరిగే మైదానంలోకి ఎలాంటి కమ్యూనికేషన్ సాధనాలను అనుమతించరు.
మ్యాచ్ జరిగే రోజుల్లో PMOAలోకి ప్రవేశించే ముందు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లతో పాటు ఈ 'స్మార్ట్ గాగుల్స్'ను కూడా సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ (SLO) వద్ద ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి. ఒకవేళ ఈ పరికరాలను డిపాజిట్ చేయకుండా దాచి ఉంచితే, దానిని పీఎంఓఏ ప్రోటోకాల్స్ ఉల్లంఘనగా పరిగణిస్తారు. ఐపీఎల్ 2026 నిబంధనావళి ప్రకారం భారీ జరిమానాలతో పాటు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐపీఎల్ నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత సీజన్లోనే ఒక మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెందిన రోమి భిందర్ టీమ్ డగౌట్లో మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాకు చిక్కారు. దీనిని నిబంధనల ఉల్లంఘనగా భావించిన బీసీసీఐ.. అతనికి రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు గట్టి హెచ్చరిక జారీ చేసింది.
హనీట్రాపింగ్ భయం..కొత్త ఆంక్షలు!
ఈ ఏడాది ఐపీఎల్లో ప్రవర్తనా నియమావళి (కోడ్ ఆఫ్ కండక్ట్) ఉల్లంఘనలు ఎక్కువవుతుండటంతో బీసీసీఐ మరికొన్ని కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. భద్రతా సిబ్బంది ముందస్తు అనుమతి లేకుండా ఆటగాళ్లు రాత్రి సమయాల్లో బయటకు వెళ్లకూడదు. హనీట్రాపింగ్ ముప్పు, ఇతర భద్రతా కారణాల దృష్ట్యా, ఆటగాళ్లు లేదా సహాయక సిబ్బంది బస చేసే హోటల్ గదుల్లోకి వెలుపలి వ్యక్తులను లేదా అతిథులను అనుమతించకూడదని బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Also Read; ఉద్యోగులకు అలర్ట్..పీఎఫ్ డబ్బు ఏటీఎం ద్వారా ఎలా విత్డ్రా చేసుకోవాలి?
Also Read: భారీగా పెరిగిన వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ..15 ఏళ్ల వయసులో కోట్లు సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
