Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500012

గోశామహల్: మర్డర్లకు అడ్డగా పాతబస్తీ

Jun 27, 2024 09:07:19
Hyderabad, Telangana
హైదరాబాద్ పాతబస్తీలో లా అండ్ ఆర్డర్ చనిపోయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాతబస్తీలో మర్డర్లు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఉదయం రాత్రి అనే తేడా లేకుండా ఘటనలు జరుగుతున్నాయని వాపోయారు. పోలీసులు దీనికోసం పెట్రోలింగ్ నిర్వహిస్తుంటే వారిపై ఎంఐఎం ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఇటువంటివి అరికట్టాలని డిమాండ్ చేశారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 05, 2026 16:16:04
Hyderabad, Telangana:

23rd Bio Asia Summit: మరో ప్రతిష్టాత్మక సదస్సుకు తెలంగాణ వేదిక కానుంది. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ప్రధానంగా చర్చించడానికి బయో ఆసియా సదస్సు-2026 నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు బయో ఆసియా సదస్సుకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలైంది. కొత్త ఆవిష్కరణలు టెక్ బయోలో సరికొత్త ఆలోచనలకు కీలక వేదిక కానుంది. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఫిబ్రవరి 17, 18వ తేదీల్లో రెండు రోజుల పాటు బయో ఏషియా సదస్సు జరగనుంది.

Also Read: Velama Community: రేవంత్‌ రెడ్డి జాతి వ్యాఖ్యలపై వెలమ సంఘాల సంచలన నిర్ణయం

ఈ సదస్సులో హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్ చేయనుండగా.. 50 దేశాలకు చెందిన మూడు వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌ కేర్ సదస్సుగా ప్రత్యేక గుర్తింపు ఉన్న బయోఏషియా సదస్సును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. టెక్‌బయో అన్‌లీష్డ్: ఏఐ, ఆటోమేషన్ - బయాలజీ రివల్యూషన్ అనే థీమ్‌తో 2026 బయో ఆసియా స‌ద‌స్సు జ‌ర‌గనున్న‌ది.

Also Read: DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. 19 శాతం డీఏ పెంపు

గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, ఆలోచనలకు రాష్ట్రాన్ని వేదిక చేసేందుకు హైదరాబాద్‌లో ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ, ఔషధాలు, హెల్త్ రంగాలకు చెందిన నిపుణులు ఈ బయో ఏషియా సదస్సులో పాల్గొననున్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో వరుసగా రెండు రోజుల పాటు 23వ ఎడిషన్ సదస్సుకు  రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.

లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థల అధిపతులు, సీఈఓలు, ప్రతినిధులు సంబంధిత రంగాల్లో  నిపుణులు, ఆవిష్కర్తలు బయో ఆసియా సదస్సులో జరిగే చర్చలు, సమావేశాల్లో  భాగం కానున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న సరికొత్త  మార్పులు, శాస్త్ర పురోగతి, ఏఐ ప్రభావం ఈ సదస్సులో చర్చించనున్నారు. హెల్త్ కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ తదితర అంశాలను  ఎజెండా అంశాలుగా ప్రతినిధులు చర్చించనున్నారు. 

Also Read: KT Rama Rao: సంస్కారం నేర్చుకోని రేవంత్ రెడ్డి తోక ఎప్పటికీ వంకరే: కేటీఆర్‌

ప్రతిష్టాత్మక బయో ఆసియా సదస్సుతో బయో రంగంలో కొత్త ఆవిష్కరణలు, దేశ విదేశాల సహకారాలు, హెల్త్ కేర్ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై తెలంగాణకు దోహదం చేయనుంది. బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అధునాతన చికిత్స విధానాలు, అత్యాధునిక వైద్యం, ఆరోగ్య సంరక్షణ విధానాలపై ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు చర్చించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

హాజరుకానున్న అతిథులు
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్
భారత ప్రభుత్వ ప్రధాన సలహాదారు (సైన్స్‌) ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్‌ రాజీవ్ సింగ్ రఘువంశీ
ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్
డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ చైర్మన్ సతీష్ రెడ్డి
భారత్ బయోటెక్ ఎండీ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా
లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావా
నోవార్టిస్ ఏషియా పసిఫిక్ రీజియన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీజర్ కాన్సెప్షన్
లిల్లీ ఇండియా ప్రెసిడెంట్ విన్సెల్ టక్కర్ కాంక్లేవ్
అమెజాన్‌ చైర్మన్, సీఈవో రాబర్ట్ ఎ బ్రాడ్‌వే
జీనోమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  ప్రొఫెసర్ పాట్రిక్ టాన్
మెడ్ ట్రానిక్ సీటీవో డాక్టర్ కెన్ వాషింగ్టన్
మిల్టెనీ బయోటెక్ ఎండీ డాక్టర్ బోరిస్ స్టోఫెల్

పాల్గొననున్న కంపెనీలు
డాక్టర్ రెడ్డీస్, జైడస్, బయోకాన్, సిప్లా వంటి భారతీయ ప్రముఖ సంస్థల సీఈఓలు పాల్గొన‌నున్నారు.
నోవార్టిస్, రోష్, నోవో నార్డిస్క్, మెడ్ట్రానిక్, మెర్క్, అస్ట్రాజెనెకా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 05, 2026 13:07:35
Jagtial, Telangana:

Velama Community vs Revanth Reddy: రాజకీయాల్లో అసభ్య పదజాలంతో విరుచుకుపడుతున్న రేవంత్‌ రెడ్డి మరింత దిగజారి సామాజికవర్గాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. సామాజిక వర్గాలను రా అంటూ సంభోదిస్తూ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే తమ సామాజికవర్గంపై రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెలమ సామాజిక వర్గం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టు మాట్లాడాలని రేవంత్‌ రెడ్డికి హితవు పలికారు.

Also Read: DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. 19 శాతం డీఏ పెంపు

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి తన హోదాకు తగ్గట్టుగా మాట్లాడాలని వెలమ సంక్షేమ సంఘం జగిత్యాల అధ్యక్షుడు అయిల్నేని సాగర్ రావు డిమాండ్‌ చేశారు. జగిత్యాలలోని పద్మనాయక కల్యాణ మండపంలో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తూ 'ఎవనిది రా నీ జాతి' అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని వెలమ సంఘం నాయకులు ఖండించారు.

Also Read: KT Rama Rao: సంస్కారం నేర్చుకోని రేవంత్ రెడ్డి తోక ఎప్పటికీ వంకరే: కేటీఆర్‌

రాజకీయాల కోసం సామాజికవర్గంపై రేవంత్‌ రెడ్డి విరుచుకుపడడాన్ని వెలమ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సభలో వెలమ జాతిని కించపరిచేలా మాట్లాడారని అయిల్నేని సాగర్ రావు మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌తో ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలి కానీ ఒక జాతికి సంబంధించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని రేవంత్‌ రెడ్డిని హెచ్చరించారు. జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే న్యాయపరంగా చర్యలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పద్మనాయక సంక్షేమ మండలి సభ్యులు వేణుగోపాల్ రావు, పురుషోత్తం రావు, దివాకర్ రావు, కమలాకర్ రావు, కృష్ణారావు, రవీందర్ రావు, ప్రశాంత్ రావు, అజయ్ రావు, సురేందర్ రావు, అనిల్ రావు, రాంప్రసాద్ రావు, విజయ రంగారావు, గంగారావు తప్పుబట్టారు.

Also Read:Chandrababu: తిరుమల పవిత్రతని తిరిగి నిలబెట్టేలా పని చేస్తాం: సీఎం చంద్రబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 05, 2026 12:30:33
Hyderabad, Telangana:

King Cobra Video News: ప్రకృతిలో ఆహారపు గొలుసులో భాగంగా ఒక  జీవి మరొక జీవిని వెంటాడి ఆహారంగా మలుచుకుని తినడం సాధారణమే. పాములు ఎలుకలను వేటాడితే పాములను డేగలు లేదా ఇతర పక్షులు వేటాడుతూ ఉంటాయి. ఇది ఆహార గొలుసులో భాగమే.. అంతేకాకుండా అప్పుడప్పుడు పాములను ముంగిసలు కూడా ఆహారంగా మలుచుకుంటాయి. ఇలాంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. తరచుగా మనం ముంగిస పాములపై దాడి చేయడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను ముంగిస దాడి చేసిన తర్వాత తీసిన దృశ్యాలు చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

భారీగా దెబ్బతిన్న ఓ నాగుపాము జనాభాసాల మధ్యకు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది.. ఈ వీడియోలో అత్యంత విషపూరితమైన పాము పడగ భాగంలో కేవలం సగమే ఉండడం మీరు చూడొచ్చు.. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ముంగిసతో భీకర పోరాటం చేసిన తర్వాత పాము దెబ్బతిని.. దిక్కుతోచని స్థితిలో స్థానికులకు కనిపించడంతో వారు వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు..

ఆ ముంగిస ప్రమాదకరమైన నాగుపాము తలభాగంలో పదేపదే దాడి చేయడం వల్ల పూర్తిగా పాము తలభాగం దెబ్బతింది. అంతేకాకుండా ఆ పాము పడగ విప్పినప్పటికీ.. అది కేవలం సగమే కనిపిస్తోంది.. మిగతా కన్ను భాగం ఏమాత్రం లేకుండా పోయింది. అలాగే పాము పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది.. అయినప్పటికీ స్నేక్ క్యాచర్ ఆ పాము దగ్గరగా వెళ్తే అది.. భయపెట్టేందుకు బుసలు కొడుతూ పైపైకి రావడం మీరు గమనించవచ్చు.. స్నేక్ క్యాచర్ ఏమాత్రం భయపడకుండా ఆ పాముని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు..

సాధారణంగా కింగ్ కోబ్రాలు కనిపిస్తేనే భయంతో పరుగులు తీసే జనం.. ఈ పాము దయనీయస్థితిలో ఉందని తెలుసుకుని అయ్యో పాపం అని చూడడానికి అక్కడికి భారీ ఎత్తున తరలివచ్చారు.  అలాగే ముంగిస కూడా పదునైన పళ్ళను కలిగి ఉండడం వల్ల దీని తలభాగాన్ని భారీగా గాయం చేసింది. ఈ వీడియోలో పాము బాధతో విలవిలలాడటం మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 05, 2026 12:18:02
Hyderabad, Telangana:

Chaturgrahi Raja Yogam In Maha Shivaratri Zodiac Sign Telugu: ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీన వస్తోంది. ఈ తేదీకి జ్యోతిష్య శాస్త్రం పరంగా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే శని పాలించే కుంభరాశిలో నాలుగు గ్రహాల కలయిక జరుగుతుంది. అయితే, ఇదే రోజు మహాశివరాత్రి కావడం విశేషం. ఈ రోజున కుంభరాశిలో సూర్యుడుతో పాటు శుక్రుడు బుధుడు రాహు సంయోగం జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి మహాశివరాత్రి వేళ చాలా చాలా శుభ ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సంపాదనపరంగా ఊహించని స్థాయిలో కలిసి వస్తుంది. ఆపదల్లో ఉన్నవారికి సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, ఈ మహాశివరాత్రి వేళ ఏ రాశుల వారికి ఆ శివుడి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశుల వారికి లాభాలే లాభాలు:
మేషరాశి 
మేష రాశి వారికి శివుడి అనుగ్రహంతో మహాశివరాత్రి నుంచి అంతా శుభంగానే ఉంటుంది.. వీరికి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా మారుతాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బు సులభంగా పొందుతారు. ఖర్చులు కూడా నియంత్రణలో ఉంటాయి.. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు, వ్యాపారాలపరంగా కూడా రాణించగలుగుతారు. ముఖ్యంగా ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు అద్భుతమైన ప్రణాళికలతో భారీ లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఈ సమయం కలిసి వచ్చి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. సామాజికంగా ప్రతిష్ట కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

కన్య రాశి 
కన్యా రాశి వారికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మకర శివరాత్రి నుంచి ఆస్తులు నుంచి అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వీరు ఇండ్లతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా తెలివితేటలు వినియోగించి పనులు చేయడం వల్ల భారీ ఆర్థిక సంపదను పొందుతాయి. అలాగే వ్యక్తిగత జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కెరీర్ పరంగా కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఆరోగ్యపరంగా చాలా వరకు సంతృప్తి చెందుతారు. 

మకర రాశి 
మకర రాశి వారికి ఆర్థికంగా మహాశివరాత్రి వేల కలిసి రాబోతోంది. కోర్టు సంబంధిత కేసులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పులు ఏదైనా ఖర్చుల బాధతో ఉన్న వ్యక్తులకు కాస్త ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఖర్చులు తగ్గి పొదుపు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఈ సమయంలో బ్యాంకు బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన అన్ని రకాల పనులు సులభంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు ఎంతో సులభంగా తొలగిపోతాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 11:26:32
Hyderabad, Telangana:

Mercury Transit Horoscope: ఫిబ్రవరి నెలలో జరగబోయే గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి సవాళ్లను తీసుకురానుంది. ముఖ్యంగా మేధస్సుకు, వ్యాపారానికి కారకుడైన బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇదే సమయంలో అక్కడ ఇప్పటికే ఉన్న శని, రాహువులతో బుధుడు కలవబోతుండటం వల్ల "త్రిగ్రహ కూటమి" ఏర్పడనుంది.

ఈ గ్రహాల స్థితి మార్పు వల్ల ఈ మూడు రాశుల వారు వచ్చే కొన్ని వారాల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. బుధుడు కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావం ఈ క్రింది రాశులపై ఎక్కువగా ఉండనుందని సూచిస్తున్నారు.

1) కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సంచారం వల్ల మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. ఏ నిర్ణయమైనా తొందరపడి తీసుకోవద్దు. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. అనవసర గొడవలకు దూరంగా ఉండటం మంచిది.

2) మీన రాశి (Pisces)
మీన రాశి వారు ఈ కాలంలో భవిష్యత్తు గురించి అనవసర ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు అదుపు తప్పవచ్చు, కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టండి. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలోనే కొనసాగడం ఉత్తమం. కొత్త ప్రయత్నాలు ఇప్పుడే సత్ఫలితాలను ఇవ్వకపోవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు, నిర్లక్ష్యం చేయకండి.

3) తుల రాశి (Libra)
తులారాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం పెద్ద సవాళ్లను విసరనుంది. అనుకోని ఖర్చుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. చేపట్టిన ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోయే సూచనలు ఉన్నాయి. పై అధికారులతో లేదా సహోద్యోగులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మానసిక ఒత్తిడి పెరగకుండా యోగా లేదా ధ్యానం వంటివి పాటించడం మంచిది.

పరిష్కార మార్గాలు..
గ్రహ దోష నివారణకు జ్యోతిష్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.  ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శని, రాహువుల ప్రభావం తగ్గుతుంది. బుధుడి అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా విద్యా సామాగ్రిని దానం చేయండి. పక్షులకు ఆహారం, నీరు అందించడం శుభప్రదం.

(గమనిక: జ్యోతిష్య శాస్త్రం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రంలోని గ్రహ స్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. దీన్ని అనుసరించ ముందు సంబంధిత నిపుణుడి సలహా, సూచనలు తీసుకోవడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Tirupati Laddu SIT Report: వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ వార్నింగ్.."క్లీన్ చిట్ రాలేదు..భారీగా కల్తీ జరిగింది!"

Also Read: Pakistan Boycott India Match: వరల్డ్‌కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోం..పాక్ ప్రధాని సంచలన ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 05, 2026 10:54:02
Hyderabad, Telangana:

Govt Employees DA Hike: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లు, ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉండడంతోపాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెండింగ్‌ బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇంకా వేతన సవరణ కమిటీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఉద్యోగులకు డీఏ ప్రకటించింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విద్యుత్‌ ఉద్యోగులకు ప్రభుత్వం జనవరి నెలకు సంబంధించి డీఏ విడుదల చేసింది.

Also Read: KT Rama Rao: సంస్కారం నేర్చుకోని రేవంత్ రెడ్డి తోక ఎప్పటికీ వంకరే: కేటీఆర్‌

రాష్ట్రంలో పని చేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిలో జనవరి, జూలై నెలకు సంబంధించి రెండు డీఏలు ప్రకటించే విషయం తెలిసిందే. ఇప్పటికే జూలై డీఏ ప్రకటించగా.. తాజాగా జనవరి 2026 నెలకు సంబంధించిన డీఏను ప్రభుత్వం ప్రకటించింది. 2026 జనవరి 1వ తేదీ నుంచి ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) 1.621 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:Chandrababu: తిరుమల పవిత్రతని తిరిగి నిలబెట్టేలా పని చేస్తాం: సీఎం చంద్రబాబు

డీఏ పెంపుతో దాదాపు 43 వేల మంది ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించనుంది. ప్రస్తుతం విద్యుత్‌ సంస్థల్లో దాదాపు 43 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వారందరికీ లబ్ధి కలగనుంది. గతేడాది జులైలో ఖరారు చేసిన ప్రకారం డీఏ 17.651 శాతం ఉండగా.. తాజాగా సవరించిన డీఏ ప్రకారం 1.621 శాతం పెంచడంతో మొత్తం డీఏ 19.272 శాతానికి చేరుకుంది. ప్రకటించిన డీఏ తక్షణమే అమల్లోకి రానుంది. అంటే ఈ నెల వేతనంతో పెరిగిన డీఏ బకాయియి అందుతాయి. ప్రభుత్వం ప్రకటించిన డీఏతో ఉద్యోగుల కుటుంబాల్లో ఆనందం విరుస్తోంది.

Also Read: Harish Rao: కేసీఆర్ తెలంగాణ తీసుకురాకుంటే రేవంత్‌ రెడ్డి ఆంధ్రా మోచేతి నీళ్లు తాగేవాడు

విద్యుత్‌ ఉద్యోగులకు సరే కానీ సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం డీఏ ప్రకటించలేదు. దసరా సమయంలో ప్రకటించాల్సిన జూలై నెలకు సంబంధించిన డీఏను సంక్రాంతి సమయంలో ప్రభుత్వం ఇచ్చిన విషయం తెలిసిందే. టీచర్లు, ఉద్యోగులకు సంబంధించి డీఏలు ఇప్పటివరకు ఐదు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక వీటితోపాటు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెండింగ్‌ బిల్లులు, పీఆర్‌సీ ప్రభుత్వం బకాయిపడింది. విద్యుత్‌ ఉద్యోగులకు అన్నీ ప్రకటిస్తున్న ప్రభుత్వం ఇతర ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
AMAruna Maharaju
Feb 05, 2026 10:36:31
Hyderabad, Telangana:

Megastar Chiranjeevi New Record: మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్లో లెక్కలేనన్ని రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ అనేక సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించి కలెక్షన్స్ వర్షం కురిపించి రికార్డ్స్ తిరగరాసారు. ఇప్పుడు మరో సరికొత్త రికార్డ్ చిరంజీవి పేరిట నిలిచింది.  

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా.. రీసెంట్‌గా సంక్రాంతికి రిలీజై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మెగా అభిమానులకి, ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. చాలా రోజులు ఈ సినిమా హౌస్ ఫుల్స్‌తో నడిచింది. మెగాస్టార్ మ్యాజిక్ చాన్నాళ్ల తర్వాత కనిపించడంతో ఇంకేముంది కలెక్షన్ల వర్షం కురిసింది. మన శంకర వరప్రసాద్ గారు సినిమా మొదటి రోజే ఏకంగా 84 కోట్ల గ్రాస్ వసూలు చేసి చిరంజీవి కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఏడు రోజుల్లోనే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. సంక్రాంతి సీజన్ తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. దీంతో సంక్రాంతి హిట్ సినిమాలు ఇంకా థియేటర్‌లో నడుస్తున్నాయి.

మన శంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజై 25 రోజులు పూర్తవ్వగా.. తాజాగా ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 375 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో టాలీవుడ్‌లో రీజనల్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా.. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు నిలిచింది. బాహుబలి, పుష్ప.. పలు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజై కలెక్షన్స్ కొల్లగొడితే.. మన శంకర వరప్రసాద్ గారు కేవలం తెలుగులోనే రిలీజై ఏకంగా రూ. 375 కోట్లతో టాలీవుడ్ రీజనల్ రికార్డ్ సెట్ చేసింది.

ఇక మొన్నటి వరకు ఈ రికార్డ్ 303 కోట్లతో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా పేరు మీద ఉండగా.. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు దాన్ని బద్దలు కొట్టింది. ఈ సినిమాకు 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. హిట్ అవ్వాలంటే ఆల్మోస్ట్ 240 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. దానిని మించి 130 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్స్‌కి, నిర్మాతలకు ఫుల్ ప్రాఫిట్స్ వచ్చాయని టాలీవుడ్ సమాచారం.

Also Read: Bharat Taxi App: సామాన్యులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు.. ఇకపై తక్కువ ధరకే ప్రయాణం..!

Also Read: Meena: ఆ స్టార్ హీరోతో పీకల్లోతూ ప్రేమలో మీనా.. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానంటూ షాకింగ్ కామెంట్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 10:15:33
Nunna, Vijayawada, Andhra Pradesh:

Pawan Kalyan Tirupati Laddu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మరోసారి నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ (SIT) తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తప్పు చేసిన వారు భగవంతుడికి క్షమాపణ చెప్పాల్సింది పోయి, బుకాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ లడ్డూ కల్తీ అంశంపై కీలక విషయాలను వెల్లడించారు.

రిపోర్టుల్లో నిజాలు ఏంటి?
నెయ్యి కల్తీపై నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) ఇచ్చిన నివేదికలను పవన్ గుర్తు చేశారు. ఒక రిపోర్టులో చేప నూనె, మరొకటిలో జంతు కొవ్వు (పంది, గొడ్డు కొవ్వు), ఇంకొకటిలో పామాయిల్, కెమికల్స్ కలిసినట్లు స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

"ఎక్కడా సిట్ గానీ, సీబీఐ గానీ వైసీపీకి క్లీన్ చిట్ ఇవ్వలేదు. పాల కొవ్వుతో రావాల్సిన నెయ్యిలో రసాయనాలు ఉన్నాయని రిపోర్టులు చెబుతుంటే, క్లీన్ చిట్ అని ఎలా చెప్పుకుంటారు?" అని పవన్ నిలదీశారు. వైసీపీ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులను పవన్ ఏకిపారేశారు. రామతీర్థం, పిఠాపురం ఘటనలను 'పిచ్చోళ్లు చేశారని' నమ్మబలికారని ఆరోపించారు.

దుర్గగుడిలో వెండి విగ్రహాలు పోతే 'ఇంకోటి కొనుక్కోవచ్చు' అన్న అహంకారపూరిత వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 219 దేవాలయాలను అపవిత్రం చేసిన చరిత్ర వైసీపీదని మండిపడ్డారు. "సాధారణంగా మనుషులపై పగబడతారు, కానీ వైసీపీ వాళ్లు సాక్షాత్తూ భగవంతుడి మీదే పగబట్టారు" అని పవన్ వ్యాఖ్యానించారు.

మార్కెట్‌లో కేజీ నెయ్యి 400 రూపాయలకు పైగా ఉంటే, అంతకంటే తక్కువ ధరకే కొన్నారంటేనే అందులో కల్తీ ఉందనేది సామాన్య గృహిణికి కూడా అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. తిరుమల నుండే అయోధ్యకు లడ్డూలు పంపారని, అక్కడ కూడా ఈ అపచారం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వివేకా హత్యతో పోలిక
వివేకా హత్య విషయంలో 'గుండెపోటు' అని ఎలాగైతే అబద్ధాలు ఆడారో, ఇప్పుడు నెయ్యి కల్తీ విషయంలో కూడా అలాగే అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏడు కొండలు అక్కర్లేదు.. రెండు చాలు అన్న వాళ్లు ఏ స్థాయికైనా దిగజారుతారని పవన్ అన్నారు.

తప్పు చేసిన వారు భగవంతుడి ముందు మోకరిల్లి క్షమాపణ అడగాలని, లేనిపక్షంలో సర్వనాశనం అయిపోతారని పవన్ హెచ్చరించారు. కల్తీకి కారణమైన ప్రతి ఒక్కరినీ బాధ్యుల్ని చేస్తామని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ALso Read: TTD Ghee Testing Lab: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్..టీటీడీ కీలక నిర్ణయం..ఇకపై కల్తీ చేస్తే దొరికిపోతారు!

Also Read: Sachivalayam Employees Promotion: ఏపీలో ఉద్యోగులకు ప్రమోషన్ల పండుగ..'స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు'లో కీలక మార్పులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 05, 2026 09:39:05
Hyderabad, Telangana:

Giant Cobra Snake Video Watch: ఓ గ్రామంలో ఇంటి ముందు ఉండే తులసి కోటలో ఓ భారీ అత్యంత ప్రమాదకరమైన కింగ్‌ కోబ్రా ప్రత్యక్షమవ్వడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తులసి మొక్కల మధ్యలో పాము నిశ్శబ్ధంగా నక్కి ఉండడం చూసిన ఇంటి సభ్యులు వెంటనే స్నేక్‌ క్యాచర్స్‌కి సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకుని రెస్య్కూ ఆపరేషన్‌ చేపట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ఓ ఇంటి ముందు తులసి కోట ముందుగా కనిసిస్తుంది. అయితే దానికే చుట్టుకుని ఓ పెద్ద కింగ్‌ కోబ్రా పాము కనిపించడం మీరు చూడొచ్చు. చాలా శుభప్రదమైన తులసి కోటలో విషపూరీతమైన నాగుపాము కనిపించడంతో ఆ ఇంటి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఆ తులసి కోటలో పాము అత్యంత పొడవుగా.. పడగ విప్పి కనిపిస్తూ ఉండడం మీరు చూడొచ్చు.. అంతేకాకుండా ఈ పాము తులసి మొక్క కొమ్మల మధ్య అటు ఇటూ తిరగడం మీరు గమనించవచ్చు.. అంతేకాకుండా బుసలు కొట్టడం కూడా మీరు క్లియర్‌గా వీడియోలో చూడొచ్చు..

స్థానికుల సమాచారం మేరకు వెంటనే మున్నా స్నేక్ రెస్క్యూయర్ అక్కడికి చేరుకున్నారు. రంగంలోకి దిగిన స్నేక్‌ క్యాచర్‌ బృదం ఆ పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ సమయంలో పాము ఆ స్నేక్‌ క్యాచర్‌పైకి పడగ విప్పి.. బుసలు కొడుతూ దాడి చేసేందుకు కూడా ప్రత్నించింది. అయినప్పటికీ స్నేక్‌ క్యాచర్‌ ఏమాత్రం బయపడకుండా దాదాని ఎంతో సులభంగా నియంత్రించారు. అయితే, ఈ దృశ్యాలను చూడడానికి చాలా మంది అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. 

చివరికి ఆ స్నేక్‌ క్యాచర్‌ ఎంతో ప్రమాదకరమైన పామును ఎలాంటి హాని కలిగించకుండా.. ఎంతో సులభంగా సరక్షితంగా పట్టుకున్నారు. దీనిని పట్టుకుని ప్లాస్టిక్‌ డబ్బాలో బంధించారు. ఆ తర్వాత ఈ పామును సురక్షితమైన ప్రదేశంలో వదిలి పెట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. 

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 08:54:41
Islamabad, Islamabad Capital Territory:

Pakistan Boycott India Match News: టీ20 ప్రపంచకప్‌ 2026లో అత్యంత ఉత్కంఠభరితమైన భారత్-పాక్ పోరుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. టీమ్ ఇండియాపై మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కుండబద్దలు కొట్టారు. బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

ఇస్లామాబాద్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని చెబుతూనే, భారత్‌తో తలపడకూడదనే నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

వివాదానికి అసలు కారణం ఏంటి?
ఈ నిర్ణయం వెనుక బంగ్లాదేశ్ అంశం ప్రధానంగా ఉంది. భారత్‌లో భద్రత సరిగా లేదని సాకు చూపుతూ తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. దీనికి ఐసీసీ నిరాకరించడంతో బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకుంది. వారి స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్‌కు అవకాశం కల్పించింది. బంగ్లాకు సంఘీభావంగా, భారత్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.

ఐసీసీ సీరియస్..పాక్‌కు భారీ నష్టం?
షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న కొలంబో వేదికగా భారత్-పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే పాక్ మొండివైఖరిపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నచ్చిన జట్లతోనే ఆడతామనడం నిబంధనలకు విరుద్ధమని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది.

ఒకవేళ పాక్ గనుక మ్యాచ్ ఆడకపోతే ఆ జట్టుపై ఐసీసీ కఠిన ఆంక్షలు విధించడమే కాకుండా, పాయింట్లను కోత విధించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక వ్యూవర్ షిప్ వచ్చే ఈ మ్యాచ్‌ను బహిష్కరిస్తే పాక్ క్రికెట్ బోర్డు భారీగా ఆదాయాన్ని కోల్పోనుంది.

క్రీడలను రాజకీయాలతో ముడిపెడుతూ పాక్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును ప్రమాదంలో పడేసేలా ఉంది. ఐసీసీ ఒత్తిడికి పాక్ తలొగ్గుతుందా లేక తన పంతాన్ని నెగ్గించుకుంటుందా అనేది చూడాలి.

ALso Read: Sachivalayam Employees Promotion: ఏపీలో ఉద్యోగులకు ప్రమోషన్ల పండుగ..'స్వర్ణ గ్రామం-స్వర్ణ వార్డు'లో కీలక మార్పులు!

Also Read: Vahini Death News: ప్రముఖ నటి మృతి..శోకసంద్రంలో టాలీవుడ్..వైద్యానికి డబ్బు లేక చివరికి ఇలా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 08:09:24
Nunna, Vijayawada, Andhra Pradesh:

Grama Ward Sachivalayam Promotion: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ, ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వారి కెరీర్ ఎదుగుదలకు సంబంధించి కీలక ఉత్తర్వులను సిద్ధం చేస్తోంది.

ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం
సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్హులైన ఉద్యోగులందరికీ ప్రమోషన్లు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనివల్ల వేల మంది ఉద్యోగులకు హోదాతో పాటు వేతన పరంగానూ లబ్ధి చేకూరనుంది.

సచివాలయ వ్యవస్థలో పారదర్శకత, పనితీరును మెరుగుపరచడానికి 'మూడంచెల వ్యవస్థ'ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా బాధ్యతల విభజన, పర్యవేక్షణ మరింత సులభతరం కానుంది.

ఖాళీల భర్తీ, క్రమబద్ధీకరణ
ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా, వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్న సిబ్బంది కొరత తీరడమే కాకుండా, సచివాలయ ఉద్యోగులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి.

'స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు' లక్ష్యంతో సాగుతున్న ఈ సంస్కరణలు సచివాలయ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. త్వరలోనే ఈ ప్రమోషన్లు, బదిలీలకు సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read: New Criminal Law: భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళితే భార్యకు 3 నెలలు జైలు శిక్ష!

Also Read: Vahini Death News: ప్రముఖ నటి మృతి..శోకసంద్రంలో టాలీవుడ్..వైద్యానికి డబ్బు లేక చివరికి ఇలా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 07:16:32
Ghawcqol, Ghazni:

Taliban New Law On Women: ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల స్వేచ్ఛపై తాలిబన్ ప్రభుత్వం మరోసారి ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే విద్య, ఉద్యోగాల విషయంలో అనేక ఆంక్షలు ఎదుర్కొంటున్న అక్కడి మహిళలకు, ఇప్పుడు వ్యక్తిగత ప్రయాణాల విషయంలోనూ కొత్త కఠిన చట్టాన్ని అమలులోకి తెచ్చింది.

సాధారణంగా దంపతుల మధ్య గొడవలు జరిగినప్పుడు లేదా మనస్పర్థలు వచ్చినప్పుడు భార్యలు తమ పుట్టింటికో లేదా బంధువుల ఇంటికో వెళ్లడం సహజం. అయితే ఆఫ్ఘనిస్తాన్‌లో ఇలా చేయడం ఇకపై నేరం కానుంది.

ఏంటీ కొత్త నిబంధన?
తాలిబన్ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఏ మహిళ అయినా తన బంధువుల ఇంటికి వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా తన భర్త నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి. భర్త అనుమతి లేకుండా ఇల్లు దాటి బంధువుల దగ్గరకు వెళ్లినట్లు తేలితే, ఆ మహిళకు 3 నెలల జైలు శిక్ష విధిస్తారు.

ఎందుకు ఈ నిర్ణయం?
కుటుంబ వ్యవస్థను కాపాడటం, సంప్రదాయాలను గౌరవించడం అనే సాకుతో తాలిబన్లు ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారని కొందరు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య వివాదాలు జరిగినప్పుడు మహిళలు ఇల్లు వదిలి వెళ్లడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని వారు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా మహిళల కదలికలపై భర్తలకు పూర్తి నియంత్రణను కట్టబెట్టారని అంటున్నారు.

ఈ అమానవీయ చట్టంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో పార్కులు, జిమ్ములు, విద్యా సంస్థలకు దూరమైన ఆఫ్ఘన్ మహిళల ప్రాథమిక హక్కులను ఈ చట్టం పూర్తిగా కాలరాస్తోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

భర్త వేధింపులకు గురిచేస్తున్నా కూడా అనుమతి లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి కల్పించడం వల్ల మహిళల భద్రత గాలిలో దీపంలా మారుతుందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో రోజురోజుకూ మహిళలపై ఆంక్షలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ కొత్త జైలు శిక్ష నిబంధనతో అక్కడి స్త్రీలు తమ సొంత బంధువులను కలుసుకోవడానికి కూడా భయం నీడలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read: Vahini Death News: ప్రముఖ నటి మృతి..శోకసంద్రంలో టాలీవుడ్..వైద్యానికి డబ్బు లేక చివరికి ఇలా!

Also Read: India US Trade Deal: అమెరికా బెదిరింపులకు భారత్ చెక్..డోభాల్-మార్కో రూబియో భేటీలో సంచలన విషయాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 06:43:56
Vizianagaram, Andhra Pradesh:

Actress Vahini Passed Away: తెలుగు బుల్లితెర, సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న నటి వాహిని (వాసవి అలియాస్ పద్మ) బుధవారం కన్నుమూశారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం ఆమెను చుట్టుముట్టడంతో చివరకు విజయనగరంలోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. నటి వాహిని మరణవార్త పరిశ్రమలో కలకలం రేపింది. ముఖ్యంగా ఆమె ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇబ్బంది పడిన తీరు అందరినీ కలిచివేస్తోంది.

సినీ ప్రస్థానం
1978లో విజయనగరంలో జన్మించిన వాహిని, 'జయ వాహిని' పేరుతో గుర్తింపు పొందారు. తెలుగు, తమిళ భాషల్లో అనేక సీరియల్స్ ద్వారా గృహిణిలకు దగ్గరయ్యారు. 2019లో వచ్చిన 'రఘుపతి వెంకయ్య నాయుడు' చిత్రంలో నరేష్ సరసన నటించారు. ఆమె చివరిగా 'బహిర్భూమి' అనే చిత్రంలో కనిపించారు.

ఆర్థిక కష్టాలు, అనారోగ్యం
వాహిని గత కొంతకాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. చికిత్స కోసం తన వద్ద ఉన్నదంతా ఖర్చైపోవడంతో ఆర్థికంగా తీవ్రంగా చితికిపోయారు. వాహిని దీనస్థితిని చూసి నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా విరాళాలు సేకరించారు. ఇండస్ట్రీలోని పలువురు నటులు ఆర్థిక సహాయం అందించినప్పటికీ, క్యాన్సర్ ముదిరిపోవడంతో పరిస్థితి విషమించింది.

వాహిని మరణవార్తను కరాటే కళ్యాణి ఎమోషనల్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు. "మా ఇళ్లు విజయనగరంలో పక్కపక్కనే ఉండేవి. చిన్నప్పటి నుంచి ఆమె నాకు తెలుసు. నా సోదరిని కాపాడటానికి శాయశక్తులా ప్రయత్నించాను, కానీ ఫలితం లేకపోయింది" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించడంతో, వైద్యులు ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆమెను విజయనగరం తరలించగా, బుధవారం సాయంత్రం ఆమె ప్రాణాలు విడిచారు.

ఒకప్పుడు కెమెరా ముందు నవ్వుతూ కనిపించిన నటి, చివరకు వైద్యానికి కూడా డబ్బు లేని స్థితిలో ప్రాణాలు కోల్పోవడం సినీ రంగంలోని చీకటి కోణాన్ని ప్రతిబింబిస్తోంది. వాహిని మృతికి పలువురు టీవీ నటులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Schools And Colleges: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూల్స్, కాలేజీల్లోనే సదుపాయం.. అది కూడా పూర్తిగా ఉచితం ఫ్రీ!

Also Read: TTD Ghee Testing Lab: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్..టీటీడీ కీలక నిర్ణయం..ఇకపై కల్తీ చేస్తే దొరికిపోతారు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 06:15:50
Nunna, Vijayawada, Andhra Pradesh:

Free Aadhaar Update For Students AP: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఇకపై ఆధార్ వివరాల అప్‌డేట్ కోసం కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. విద్యార్థులు తమ విద్యా సంస్థల్లోనే ఈ సేవలను ఉచితంగా పొందవచ్చు.

చిన్న వయసులో ఆధార్ తీసుకున్న విద్యార్థులు, వయసు పెరిగే కొద్దీ తమ బయోమెట్రిక్ (వేలిముద్రలు, ఐరిస్) వివరాలను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలని నిబంధన ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లోనే ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తోంది.

ఫిబ్రవరి నెల షెడ్యూల్ ఇక్కడే..
ఈ నెలలో రెండు విడతలుగా ఈ ప్రత్యేక క్యాంపులు జరగనున్నాయి.
మొదటి విడత: ఫిబ్రవరి 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు.
రెండో విడత: ఫిబ్రవరి 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు.

బయట ఆధార్ సెంటర్లలో అప్‌డేషన్ కోసం రుసుము వసూలు చేస్తారు. కానీ, 5 నుండి 17 ఏళ్ల వయస్సు గల విద్యార్థులు ఈ స్కూల్ క్యాంపుల్లో ఉచితంగా అప్‌డేట్ చేయించుకోవచ్చు. గ్రామ మరియు వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా స్కూళ్లకు వచ్చి ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆధార్ సెంటర్ల వద్ద గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు, ప్రయాణ ఖర్చులు కూడా తప్పుతాయి.

ఎందుకు అప్‌డేట్ చేయించుకోవాలి?
చిన్నప్పుడు తీసుకున్న ఆధార్‌లోని బయోమెట్రిక్ వివరాలు పెద్దయ్యాక మారతాయి. వీటిని అప్‌డేట్ చేయకపోతే.. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఉన్నత చదువుల అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుల్లో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయి. భవిష్యత్తులో ఆధార్ కార్డు చెల్లుబాటు కాకుండా పోయే అవకాశం ఉంది.

తెలంగాణలోనూ ఇదే సదుపాయం
ఏపీ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం విద్యార్థులు లేదా తల్లిదండ్రులు సంబంధిత మండల విద్యాశాఖాధికారిని (MEO) సంప్రదించవచ్చు.

విద్యార్థుల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ అప్‌డేట్ ద్వారా ప్రభుత్వ పథకాలు, విద్యా సంబంధిత ప్రయోజనాలు పొందడంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు.

Also Read: TTD Ghee Testing Lab: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్..టీటీడీ కీలక నిర్ణయం..ఇకపై కల్తీ చేస్తే దొరికిపోతారు!

Also Read: Jabardasth Bobby Accident: జబర్దస్త్ నటుడు మృతి..రాజమండ్రి బ్రిడ్జిపై ఘోర ప్రమాదం..కన్నీరుమున్నీరైన సుమ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 05, 2026 05:46:25
Hyderabad, Telangana:

India America Trade Deal Latest News: అమెరికా-భారత్‌ల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వెనుక జరిగిన కొన్ని ఆసక్తికరమైన, కీలకమైన పరిణామాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. టారిఫ్‌ల విషయంలో అమెరికా బెదిరింపులకు భారత్ ఏమాత్రం తలొగ్గలేదని, అవసరమైతే ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు వేచి చూస్తామని భారత్ నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది.

భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో, జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ డోభాల్ వ్యవహరించిన తీరు ఇరుదేశాల మధ్య ఒప్పందానికి దారితీసిందని బ్లూమ్‌బర్గ్ తన కథనంలో పేర్కొంది.

బెదిరింపులకు తావులేదు
సెప్టెంబరులో అజిత్ డోభాల్, యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య కీలక సమావేశం జరిగింది. ఆ సమయంలో డోభాల్ కొన్ని కఠినమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

"ట్రంప్ ప్రభుత్వం లేదా ఆయన సలహాదారులు ఇచ్చే టారిఫ్ హెచ్చరికలకు భారత్ భయపడదు. గౌరవప్రదమైన ఒప్పందం కుదరకపోతే, ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి ఉండటానికైనా మేము సిద్ధం" అని డోభాల్ తేల్చిచెప్పారు. ప్రధాని మోదీపై లేదా భారత విధానాలపై బహిరంగంగా విమర్శలు చేయడం ఆపితేనే చర్చలు ముందుకు సాగుతాయని భారత్ స్పష్టం చేసింది.

వెనక్కి తగ్గిన ట్రంప్ యంత్రాంగం
ఈ భేటీ జరిగిన కొద్ది రోజులకే అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. అంతకుముందు భారత్‌ను 'టారిఫ్ కింగ్' అని విమర్శించిన ట్రంప్, ఆ తర్వాత శాంతించారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసలు కురిపించారు. బహిరంగ విమర్శలు తగ్గడంతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్లీ గాడిలో పడ్డాయి, ఇది చివరకు వాణిజ్య ఒప్పందానికి దారితీసింది.

ఈ రహస్య చర్చలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ.. "ప్రైవేటుగా జరిగిన దౌత్యపరమైన చర్చల వివరాలను వెల్లడించలేము" అని పేర్కొంది. అటు భారత ప్రభుత్వం కూడా దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

భారత దౌత్య విజయం
ఒకప్పుడు అమెరికా ఒత్తిడికి ఇతర దేశాలు లొంగిపోయేవి. కానీ, ఈ ఉదంతం ద్వారా భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎంత దృఢంగా ఉందో ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ తన స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే అగ్రరాజ్యంతో సమాన స్థాయిలో చర్చలు జరిపింది.

Also Read: TTD Ghee Testing Lab: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్..టీటీడీ కీలక నిర్ణయం..ఇకపై కల్తీ చేస్తే దొరికిపోతారు!

Also REad: Peddi Postponed: బాబాయ్ కోసం రేసు నుంచి తప్పుకున్న అబ్బాయ్! పెద్ది సినిమా విడుదల వాయిదా..ఎప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top