గోశామహల్: మర్డర్లకు అడ్డగా పాతబస్తీ
Hyderabad, Telangana:హైదరాబాద్ పాతబస్తీలో లా అండ్ ఆర్డర్ చనిపోయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాతబస్తీలో మర్డర్లు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఉదయం రాత్రి అనే తేడా లేకుండా ఘటనలు జరుగుతున్నాయని వాపోయారు. పోలీసులు దీనికోసం పెట్రోలింగ్ నిర్వహిస్తుంటే వారిపై ఎంఐఎం ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఇటువంటివి అరికట్టాలని డిమాండ్ చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Adluri Laxman Kumar: నాణ్యమైన వైద్య సేవలే ఆరోగ్య సమాజానికి పునాది: మంత్రి అడ్లూరి
Hyderabad, Telangana:Zee Telugu News Doctors Awards: 'సమాజంలో దేవుడి తర్వాత అత్యంత గౌరవం, ప్రాధాన్యం పొందే వృత్తి వైద్య వృత్తి. ప్రాణాలను కాపాడే మహత్తర బాధ్యతను నిర్వర్తిస్తున్న వైద్యులు మానవత్వానికి ప్రతీకలు' అని వైద్యుల సేవలను మంత్రి లక్ష్మణ్ కుమార్ కీర్తించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్య సేవల కోసం వచ్చే పేద ప్రజల పట్ల వైద్యులు మరింత సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు. వైద్యులు ఇచ్చే సరైన సలహా, భరోసా ఒక కుటుంబానికి కొత్త జీవితం ఇస్తుందని చెప్పారు.
హైదరాబాద్లోని రాడిసన్ బ్లూ హోటల్లో జీ తెలుగు న్యూస్ ఉత్తమ వైద్యుల అవార్డు-2026 కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ సంగనభట్ల భరత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులకు అవార్డులు అందించడాన్ని అభినందించారు. 'ఎప్పుడూ సూచనలు ఇస్తూ.. ప్రజల కోసం సలహాలు ఇచ్చే మా ధర్మపురి బిడ్డ జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్కు అభినందనలు. వైద్యులకు అవార్డులు ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం' ప్రశంసించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర దైవ సమానం అని పేర్కొన్నారు. ఫిట్ తెలంగాణ - హెల్తీ తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలే ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రాన్ని 'ఫిట్ తెలంగాణ - హెల్తీ తెలంగాణ'గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పుకొచ్చారు. ప్రతి పౌరుడు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకొని.. సమతుల్య ఆహారం, నిత్య వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని సూచనలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు అనేక వినూత్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకు కూడా మెరుగైన వైద్య సేవలు చేరేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. ఆరోగ్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న వైద్యులను సత్కరించడంతో.. వైద్యుల్లో మరింత సేవాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.
'దేవుడు వైద్యుడిగా గొప్ప అవకాశం ఇచ్చారు. సాధ్యమైనంత వరకు పేద ప్రజలకు ఉత్తమ వైద్యం అందించాలి' అని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు. వైద్య సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సకల ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.
LSG Vs PBKS Match: శ్రేయస్ అయ్యర్ సెంచరీ..ఎట్టకేలకు విజయం సాధించిన పంజాబ్ కింగ్స్..ప్లేఆఫ్స్కు వెళ్తుందా?
Ardonamau, Uttar Pradesh:LSG Vs PBKS Match Today: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నేడు జరిగిన రసవత్తర పోరులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విధ్యంసకర బ్యాటింగ్తో సెంచరీ సాధించిన వేళ.. ఆ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి.. 18 ఓవర్లలోనే మ్యాచ్ను పూర్తి చేసింది. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్పై మరిన్ని కొత్త ఆశలు చిగురించేలా ఉంది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్ చేరుతుందా లేదా అనేది ఐపీఎల్లో జరగబోయే తర్వాతి మ్యాచ్లు డిసైడ్ చేస్తాయి.
Also Read: పంజాబ్ కింగ్స్కు లక్నోతో నేడు చావో రేవో మ్యాచ్..గెలిస్తే ప్లేఆఫ్స్, ఓడితే ఇంటికే!
Also Read: అనిరుధ్తో కావ్యా పాప పెళ్లి ఫిక్స్?! ఐపీఎల్ అవ్వగానే ముహూర్తం! నిజం బయటకొచ్చింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Liquor Price Hike: ముందుబాబులకు మత్తు దిగిపోయే వార్త..భారీగా పెరగనున్న మద్యం ధరలు..ఎంత పెరుగుతుందంటే?
Hyderabad, Telangana:Liquor Price Hike In Telangana: తెలంగాణలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇవ్వబోతోంది. రాష్ట్రంలో మద్యం, బీర్ల ధరలను భారీగా పెంచేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన కొత్త ధరల కసరత్తు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ముడిసరుకుల వ్యయం పెరిగిపోవడంతో ధరలను పెంచాలంటూ మద్యం తయారీ కంపెనీలు (డిస్టిల్లరీలు, బ్రూవరీలు) కొంతకాలంగా ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. దీనిపై అనేక తర్జనభర్జనల తర్వాత, ప్రభుత్వం ధరల పెంపునకే మొగ్గు చూపింది.
జూన్ 2 తర్వాతే..!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 తర్వాత మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక ధరల నిర్ధారణ కమిటీ ఇప్పటికే మార్కెట్ పరిస్థితులపై సమీక్ష జరిపి ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది.
ధరలు పెరుగుదలకు కారణం?
మద్యం ధరలు పెరగడం వెనుక అంతర్జాతీయ కారణాలతో పాటు ముడిసరుకుల కొరత ప్రధానంగా ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల గాజు సీసాల తయారీకి అవసరమైన కమర్షియల్ ఎల్పీజీ (LPG) గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ ధరలు రెట్టింపు కావడంతో మద్యం సీసాల (బాటిల్స్) తయారీ ఖర్చు 15 నుంచి 20 శాతం వరకు పెరిగింది. ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగినందున కనీసం 15 శాతం ధరలను పెంచాలని డిస్టిల్లరీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి.
ఎంత శాతం పెరిగెను..
మద్యం ధరల పెంపు, ఆదాయ వనరులపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. పొరుగు రాష్ట్రాల్లోని ధరలను విశ్లేషించిన ఈ కమిటీ, తెలంగాణలో 25 నుంచి 30 శాతం వరకు ధరలను పెంచవచ్చని ప్రభుత్వానికి సూచించింది. అయితే, ఒకేసారి అంత భారీగా పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మధ్యేమార్గంగా 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే ధరలను పెంచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
గమనిక: ఈ పెంపు వల్ల సాధారణ (ఆర్డినరీ), మీడియం బ్రాండ్లతో పాటు ప్రీమియం బ్రాండ్ల మద్యం, అన్ని రకాల బీర్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. జూన్ మొదటి వారంలోనే దీనిపై స్పష్టమైన క్లారిటీ రానుంది.
Also Read: వడదెబ్బతో రాష్ట్రంలో 34 మంది మృతి..ఒక్కొక్కరికి రూ.4 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం!
Also REad: ఐఫోన్ యూజర్లకు వార్నింగ్.. సైబర్ నేరగాళ్లకు ఈజీగా దొరికేస్తున్నారు..తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kishan Reddy: ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య రంగంగా భారత్ నిలుస్తుంది: కిషన్ రెడ్డి
Hyderabad, Telangana:Zee Telugu News Healthcare Excellence Awards 2026: ప్రపంచ స్థాయి వైద్య మౌలిక సదుపాయాలు, అందుబాటు ధరలలో ఆరోగ్య సంరక్షణ, వ్యాక్సిన్ల తయారీ, డిజిటల్ హెల్త్ టెక్నాలజీలో వేగవంతమైన అభివృద్ధితో హైదరాబాద్ ఒక గ్లోబల్ హెల్త్కేర్, ఫార్మా హబ్గా ఆవిర్భవిస్తోంది' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతు గురించి వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఇతర ముఖ్యమైన కార్యక్రమాలతో పాటు, ఎయిమ్స్ బీబీనగర్ అభివృద్ధి, సనత్నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిని సూపర్-స్పెషాలిటీ కేంద్రంగా తీర్చిదిద్దడం, అలాగే 6 వేలకు పైగా ఆయుష్మాన్ వెల్నెస్ కేంద్రాలు, బస్తీ దవాఖానాల ఏర్పాటు వంటి అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
హైదరాబాద్లోని రాడిసన్ బ్లూ హోటల్లో జీ తెలుగు న్యూస్ ఉత్తమ వైద్యుల అవార్డు-2026 కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హాజరై పలువురు వైద్యులకు అవార్డులు ప్రదానం చేశారు. జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ సంగనభట్ల భరత్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులకు అవార్డులు అందించడాన్ని అభినందించారు. 'కనిపించే ప్రత్యక్ష దేవుడు వైద్యులు. ప్రజలందరూ కూడా వైద్యులను గుర్తిస్తున్నారు. వైద్యం అనేది పవిత్రమైనది. పవిత్రమైన వృతిలో సేవలు అందించే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చారు' అని పేర్కొన్నారు.
'అతిక్లిష్టమైన వృత్తిలో వైద్యం ఒకటి. వైద్య వృత్తి అనేది బాధ్యాయుతమైనది. ప్రజలకు చెప్పేది ఒకటే ఫస్ట్ వైద్యుడు మీరే. తల్లి మొదటి డాక్టర్.. రెండో డాక్టర్ మీకు మీరే. మనకు మనమే డాక్టర్. కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి.. పరిశోధనలు, పరికరాలు వస్తున్నాయి. శరీరాన్ని ఏమాత్రం కష్టపడకుండా సమాజం బాధ్యత తీసుకుంటోంది. శరీరాన్ని శ్రమ పెట్టకుంటే శరీరం ఇబ్బంది పెడుతుంది' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
'యోగాకు ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చారు. యోగా అనేది యుగయుగాలుగా వస్తోంది. 200 దేశాలకు యోగాను విస్తరించాం. యోగాను విదేశాల్లో ప్రజలు చేస్తుంటే భారతదేశంలో చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారా? అని ఆస్పత్రులు ఆలోచించాలి. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వైద్యులు తృప్తిగా ఉండాలి' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 'ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటుచేయాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. కోవిడ్ సమయంలో కేంద్ర మంత్రిగా అన్ని రంగాలను సమన్వయం చేసుకుని వైద్యంపై ప్రత్యేక చొరవ చూపాం. ప్రజలందరిని సమన్వయంగా చేసుకుని కోవిడ్ను విజయవంతంగా ఎదుర్కొన్నాం. అందరి కన్నా ముందు కరోనా వ్యాక్సిన్ను మొదట వైద్యులు, వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం వేయించింది. కరోనా సేవలు అందించిన వైద్యులకు సైనికులతో పూలవర్షం కురిపించాం. వైద్యులు, వైద్య సిబ్బందిపై ఎయిర్ఫోర్స్ ద్వారా పూల వర్షం ప్రధాని మోదీ కురిపించారు' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు.
'కరోనా సమయంలో ధైర్యంగా ఆస్పత్రులను సందర్శించా. కరోనా సేవలో పారా మెడికల్, వైద్య సిబ్బంది అద్భుతంగా సేవలు అందించారు. 387 మెడికల్ కాలేజ్ ఉండగా.. 780 కాలేజ్లు కొత్తగా ఏర్పాటుచేశాం. వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. ఎంబీబీఎస్ 1.50 లక్షల సీట్లు పెంచాం. పీజీ సీట్లు 30 వేల నుంచి 73 వేలకు పీజీ సీట్లు పెంచాం' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 'భారత్ బయోటెక్ కంపెనీని ప్రధాని మోదీ సందర్శించి 6 గంటలు శాస్త్రవేత్తలు, వైద్య సిబ్బందితో సమయం గడిపి వారికి ధైర్యం చెప్పారు. కరోనా వాక్సిన్ తయారీకి పూర్తి తోడుగా ఉన్నామని తెలిపారు. కోవిడ్కు 150 దేశాలకు కూడా వాక్సిన్ను ఎగుమతి చేసిన చరిత్ర భారతదేశానిది. మన వైద్యుల ఘనత. అతి తక్కువ సమయంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య రంగంగా భారతదేశం నిలుస్తుందని విశ్వసిస్తున్నాని తెలిపారు. అమెరికాలో.. ఇంగ్లాండ్, ఆఫ్రికా దేశాలు, యూరప్ దేశాలకు చెందిన వారు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని భారతదేశంలో పొందుతున్నారు' అని కిషన్ రెడ్డి వెల్లడించారు.
iPhone Phishing Link: ఐఫోన్ యూజర్లకు వార్నింగ్.. సైబర్ నేరగాళ్లకు ఈజీగా దొరికేస్తున్నారు..తస్మాత్ జాగ్రత్త!
Hyderabad, Telangana:iPhone Phishing News: ఇటీవల కాలంలో ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఒక సరికొత్త మోసానికి తెరలేపారు. మీ ఐఫోన్ పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా తిరిగి పొందే వినియోగదారులనే టార్గెట్ చేసుకోని సైబర్ నేరగాళ్లు తెగబడుతున్నారు. దీనిపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని I4C (ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్) కు చెందిన నేషనల్ సైబర్క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆపిల్ సపోర్ట్ (Apple Support) పేరుతో వస్తున్న నకిలీ ఎస్ఎంఎస్ల (SMS) పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
సైబర్ నేరగాళ్లు అంచెలంచెలుగా బాధితులను బురిడీ కొట్టించి, వారి ఫోన్లను శాశ్వతంగా దక్కించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే.. ఇటీవల ఐఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన బాధితుల వివరాలను నేరగాళ్లు సేకరిస్తారు. ప్రస్తుతం ఆ ఫోన్ భౌతికంగా దొంగల చేతిలోనే ఉంటుంది.
బాధితుడి మొబైల్కు కేవలం నంబర్లతో కూడిన హెడర్తో ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అది సరిగ్గా ఆపిల్ సపోర్ట్ లేదా "ఫైండ్ మై డివైస్" (Find My Device) నుండి వచ్చినట్లే ఉంటుంది. అందులో "మీ ఫోన్ తాత్కాలికంగా స్విచ్ ఆఫ్ అయింది" అని లేదా "డేటా డిలీట్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ లింక్ క్లిక్ చేయండి" అని భయపెడతారు. ఆ విధంగా బాధితులు ఆ లింక్ క్లిక్ చేయగానే.. ఆపిల్ అధికారిక ఐక్లౌడ్ (iCloud) లాగిన్ పేజీని పోలిన నకిలీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
ఆ నకిలీ పేజీలో బాధితులు తమ ఆపిల్ ఐడీ (Apple ID), పాస్వర్డ్లను ఎంటర్ చేయగానే, దొంగలు వాటిని దొంగిలిస్తారు. ఆ వెంటనే ఆపిల్ నుండి వచ్చే టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేదా ఓటీపీ (OTP)ని కూడా ఆ వెబ్సైట్ ద్వారా నొక్కేస్తారు.
ఐడీ, ఓటీపీ దొరకడమే ఆలస్యం.. నేరగాళ్లు బాధితుడి అసలు ఐక్లౌడ్ ఖాతాలోకి లాగిన్ అయిపోతారు. దొంగిలించిన ఐఫోన్ నుండి బాధితుడి ఆపిల్ ఐడీని పూర్తిగా తొలగిస్తారు (Unlink చేస్తారు). దీనివల్ల ఫోన్లోని "ఫైండ్ మై ఐఫోన్" డిసేబుల్ అయిపోతుంది. సెక్యూరిటీ ఫీచర్లు అన్నీ లాక్ ఓపెన్ అయిపోవడంతో, దొంగలు ఆ ఫోన్ను ఎలాంటి ఇబ్బంది లేకుండా మార్కెట్లో తిరిగి అమ్ముకుంటారు.
ఐఫోన్ యూజర్లకు ముఖ్యమైన సూచనలు..
సైబర్ దాడుల నుండి మీ ఐఫోన్ను, డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ క్రింది సూచనలు తప్పక పాటించండి.
లింక్లపై క్లిక్ చేయవద్దు: ఎస్ఎంఎస్ (ముఖ్యంగా అంతర్జాతీయ నంబర్ల హెడర్స్) ద్వారా వచ్చే ఎలాంటి లింకులను క్లిక్ చేయవద్దు. ఒకవేళ క్లిక్ చేసినా, వివరాలు ఇచ్చే ముందు URL అడ్రస్ను జాగ్రత్తగా పరిశీలించండి.
CEIR పోర్టల్లో బ్లాక్ చేయండి: మీ మొబైల్ పోయిన వెంటనే, దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వ అధికారిక CEIR పోర్టల్ ద్వారా ఫోన్ను బ్లాక్ చేయండి.
ఓటీపీలను షేర్ చేయొద్దు: ధృవీకరణ లేని వెబ్సైట్లలో ఓటీపీలను ఎంటర్ చేయవద్దు. మీ ఓటీపీని ఎవరికీ చెప్పవద్దు.
అధికారిక సర్వీస్ మాత్రమే వాడండి: మీ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేయడానికి కేవలం ఆపిల్ అధికారిక పేజీని మాత్రమే వాడండి. https://www.icloud.com/find
సెక్యూరిటీ సెట్టింగ్స్: ఎల్లప్పుడూ టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఆన్లో ఉంచుకోండి. మీ ఆపిల్ ఐడీకి బలమైన పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఫోన్ సాఫ్ట్వేర్ను అప్డేట్గా ఉంచండి.
గమనిక: ఒకవేళ మీరు ఇలాంటి సైబర్ మోసానికి గురైతే, ఆలస్యం చేయకుండా వెంటనే కేంద్ర ప్రభుత్వ సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయండి లేదా 1930 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేయండి.
Also Read: 2027 నుంచి అమలులోకి కొత్త జీతాలు..భారీగా రానున్న 'అరియర్స్'..8 పే కమిషన్ క్లారిటీ!
Also Read: ఆ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు..భారీగా నిధుల విడుదల..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PEDDI Telangana Exhibitors: రిలీజ్కు ముందు 'పెద్ది' నిర్మాతలకు షాక్..అడ్డం తిరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
Hyderabad, Telangana:PEDDI Telangana Exhibitors News: 'పెద్ది' రిలీజ్కు ముందు నిర్మాతలకు మరో షాక్ తగలనుంది. నిన్న, మొన్నటి వరకు తెలంగాణలోని థియేటర్ ఓనర్లు పర్సంటేజ్ కావాలని పట్టుబట్టారు. అయితే చర్చలు సఫలం అయ్యాక ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా తెలంగాణ చిత్ర పరిశ్రమలో థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు) ఇప్పుడు మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో 'పర్సంటేజ్' (శాతాల) విధానం ప్రకారమే సినిమాలు ఆడిస్తామని, ప్రస్తుతం ఉన్న 'రెంటల్' (అద్దె) విధానాన్ని ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎగ్జిబిటర్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రామ్చరణ్-బుచ్చిబాబు కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం 'పెద్ది'కి కూడా ఇదే నిర్ణయం అమలు అవుతుందని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ, నిర్మాతల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా విడుదల సమయంలోనే మా సమస్యను రెండు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. కానీ, ఏడాది దాటినా ఎలాంటి ముందడుగు పడలేదు. నిర్మాతలు కావాలనే సమయాన్ని వాయిదా వేస్తున్నారు. దాదాపు 120 మంది థియేటర్ల యజమానులు ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నారు. 10, 15 ఏళ్ల క్రితం థియేటర్లకు మంచి ఆదాయం ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా మారింది.
నిర్మాతలకు ఓటీటీ, శాటిలైట్ వంటి దాదాపు 14 రకాలుగా ఆదాయం వస్తోంది. దేశవ్యాప్తంగా థియేటర్లలో పర్సంటేజ్ విధానమే నడుస్తుంటే, ఇక్కడ మాత్రం పాత అద్దె పద్ధతినే రుద్దుతున్నారు. థియేటర్ల ఏసీ, సౌండ్ సిస్టమ్ను బట్టి కాకుండా.. అక్కడ వచ్చే కలెక్షన్లను బట్టి మాత్రమే గ్రేడింగ్ చేయాలని, దానికి తాము సిద్ధమని ప్రకటించారు.
అయితే ఇదే సమావేశంలో తెలంగాణ థియేటర్ ఓనర్లు ఓ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన 'పెద్ది' సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ ధరల పెంపు ఉండే అవకాశం ఉందని.. అయితే తెలంగాణలో మాత్రం ఎలాంటి పెంపుదల వద్దని సీఎం రేవంత్ రెడ్డికి, ఫిల్మ్ ఛాంబర్కు లేఖ రాశామని వారు తెలిపారు. సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచి ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేయోద్దని వారు కోరారు.
ఈ సినిమాపై మాకు ఎలాంటి పగ లేదు. మొదట 'పెద్ది' సినిమాని ఈ గొడవ నుంచి మినహాయించాలనుకున్నాం. కానీ ఈ సినిమాను వదిలేస్తే, ఆ తర్వాత మా సమస్యను ఎవరూ పట్టించుకోరనే భయంతోనే దీన్ని కూడా పర్సంటేజ్ శ్లాబ్లోకి తెచ్చాం. అవసరమైతే ఈ సమస్యను మెగాస్టార్ చిరంజీవి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.
ఈ కీలక సమావేశంలోనే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ను ఎన్నుకున్నారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, సెక్రటరీ శ్రీధర్, సుదర్శన్ థియేటర్ అధినేత బాలగోవింద్ రాజ్, రవీంద్ర గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్ల తాజా నిర్ణయంతో నైజాం (తెలంగాణ) ఏరియాలో 'పెద్ది' సినిమా విడుదల, టికెట్ రేట్ల పెంపుపై ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది.
Also Read: అనిరుధ్తో కావ్యా పాప పెళ్లి ఫిక్స్?! ఐపీఎల్ అవ్వగానే ముహూర్తం! నిజం బయటకొచ్చింది!
Also Read; 'పెద్ది' కోసం భోపాల్లో బిగ్గెస్ట్ ఈవెంట్..శ్రుతిహాసన్ ఐటెంసాంగ్ రిలీజ్ కూడా అప్పుడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Sunstroke Ex-Gratia: వడదెబ్బతో రాష్ట్రంలో 34 మంది మృతి..ఒక్కొక్కరికి రూ.4 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం!
Hyderabad, Telangana:Telangana Sunstroke Death Ex-Gratia: తెలంగాణలో ఎండలు తీవ్రంగా పెరిగాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు తీవ్రమైన వడగాలులు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా ఇప్పటివరకు 34 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే విషయమై తెలంగాణ విపత్త నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో అత్యవసర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా వడదెబ్బ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదుకునేందుకు ఓ కీలక ప్రకటన చేశారు. వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. గతంలో ఈ పరిహారం కేవలం రూ.50 వేలు మాత్రమే ఉండేదని.. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని రూ.4 లక్షలకు పెంచిందని ఆయన గుర్తుచేశారు.
18 జిల్లాలకు రెడ్ అలర్ట్!
ఎండల తీవ్రత భయాందోళనలకు గురవుతోంది. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని 18కి పైగా జిల్లాల్లో పాదరసం 46 డిగ్రీలు దాటడంతో వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ చేసింది. రాజధాని నగరంలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. ఇక్కడ 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
రానున్న రోజుల్లో ఎండలు ముదిరే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జిల్లా కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రాంతాల్లో ప్రజల కోసం చలివేంద్రాలు, మజ్జిగ, ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లను నిరంతరం అందుబాటులో ఉంచాలి. ఎవరైనా వడదెబ్బ గురైతే, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్యం అందించి వైద్య ఆరోగ్య శాఖను సన్నద్ధం చేశారు.
ప్రభుత్వ సూచనలు (గైడ్లైన్స్)
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు స్వయం నియంత్రణ పాటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్పక ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచించారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎండల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి గంటకూ మారుతున్న వాతావరణ హెచ్చరికలను గమనించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Also Read: పల్నాడు ప్రజలకు శుభవార్త..ఫలించిన ఎంపీ కృషి..పిడుగురాళ్లలో ఎంప్లాయిస్ ట్రైన్ స్టాప్!
Also Read: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం..నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 22 మంది మృత్యువాత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TVK Vijay Trisha: హీరోయిన్ త్రిషకు తమిళనాడు సీఎం విజయ్ సర్ప్రైజ్ గిఫ్ట్..ఢిల్లీలో ఊహించని పదవి?!
Nagalapuram, Tamil Nadu:Trisha TVK Rajya Sabha: తమిళనాడు రాజకీయాల్లో నూతన ముఖ్యమంత్రి విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనపై తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న విజయ్.. తాజాగా సినీ నటి త్రిషకు ఒక కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తమిళ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నటి త్రిషకు ఎలాంటి హోదా దక్కబోతుందనే దానిపై రకరకాల అంచనాలు నడుస్తున్నాయి. మొదట్లో విజయ్ రాజీనామా చేసిన 'తిరుచ్చి' అసెంబ్లీ స్థానం నుండి ఆమెను బరిలోకి దింపుతారని భావించినప్పటికీ.. ఇప్పుడు అంతకంటే పెద్ద పదవిని ఆమెకు కట్టబెట్టేందుకు స్క్రిప్ట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తమిళనాడులో ఖాళీ కానున్న ఒక రాజ్యసభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. అన్నా డీఎంకే నేత షణ్ముగం రాజీనామాతో వస్తున్న ఈ సీటును.. తన గెలుపు కోసం తెరవెనుక ఎంతగానో శ్రమించిన త్రిషకు కేటాయించి ఆమెను ఢిల్లీ (పార్లమెంట్)కి పంపాలని విజయ్ యోచిస్తున్నట్లు సమాచారం.
అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఈ రాజ్యసభ స్థానం ఏకగ్రీవంగా టీవీకే కూటమికే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, ఈ సీటును దక్కించుకోవడానికి కూటమిలోని కీలక భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, వీసీకే (VCK) నేతలు విజయ్పై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే మిత్రపక్షాలకు కేబినెట్ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులపై విజయ్ హామీ ఇచ్చినందున.. ఈ ప్రతిష్టాత్మక రాజ్యసభ సీటును మాత్రం తన నమ్మకస్థులకు ఇచ్చుకోవాలని సీఎం భావిస్తున్నారు.
రజనీకాంత్ Vs త్రిష?
ఈ రాజకీయ చదరంగంలో అసలు ట్విస్ట్ బీజేపీ - రజనీకాంత్ వ్యూహం చుట్టూ తిరుగుతోంది. తమిళనాడులో డీఎంకే (స్టాలిన్), అన్నా డీఎంకేలు విజయ్ అడుగులను నిశితంగా గమనిస్తుండగా.. ఇటు బీజేపీ సరికొత్త ప్లాన్ చేస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ను రాజ్యసభకు నామినేట్ చేయడం ద్వారా తమిళనాడులో పట్టు సాధించాలని బీజేపీ భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ బీజేపీ గనుక రజనీకాంత్కు అవకాశం కల్పిస్తే.. దానికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు విజయ్ వ్యూహాత్మకంగా త్రిష పేరును తెరపైకి తెచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ కాంగ్రెస్ కూటమిలో అధికారికంగా చేరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో.. ఈ రాజ్యసభ అభ్యర్థిత్వంపై మిత్రపక్షాలతో తుది విడత చర్చలు జరపనున్నారు. బీజేపీ అడుగులకు అనుగుణంగా తన కౌంటర్ ప్లాన్ను అమలు చేయాలని చూస్తున్న విజయ్.. చివరికి త్రిషను రాజ్యసభకు పంపుతారా? లేదా మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read: అనిరుధ్తో కావ్యా పాప పెళ్లి ఫిక్స్?! ఐపీఎల్ అవ్వగానే ముహూర్తం! నిజం బయటకొచ్చింది!
Also Read: ఆ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు..భారీగా నిధుల విడుదల..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LSG Vs PBKS Preview: పంజాబ్ కింగ్స్కు లక్నోతో నేడు చావో రేవో మ్యాచ్..గెలిస్తే ప్లేఆఫ్స్, ఓడితే డైరెక్ట్ అస్సాం ట్రైన్!
Ardonamau, Uttar Pradesh:LSG Vs PBKS Preview 2026: ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగింపునకు చేరుకున్న వేళ శనివారం లక్నోలోని ఏకానా స్టేడియంలో ఒక ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. వరుసగా ఆరు ఓటములతో ప్లేఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకున్న పంజాబ్ కింగ్స్ (PBKS), లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో తలపడనుంది. పంజాబ్కు ఇది 'డూ ఆర్ డై' మ్యాచ్ కాగా, ఇప్పటికే టోర్నీ నుండి నిష్క్రమించిన లక్నో తన సొంత మైదానంలో గెలిచి సీజన్ను ఘనంగా ముగించాలని చూస్తోంది.
సీజన్ తొలి భాగంలో ఆడిన 7 మ్యాచ్లలో 6 విజయాలతో దూసుకుపోయిన పంజాబ్ కింగ్స్, ఆ తర్వాత ఆటలో పూర్తిగా లయ తప్పింది. ఏప్రిల్ 25న ఢిల్లీ క్యాపిటల్స్పై 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన జట్టు, ఇప్పుడు వరుసగా ఆరు ఓటములతో పాయింట్స్ టేబుల్లో పూర్తిగా వెనుకబడింది. సీజన్ ఆరంభంలో మెరుపులు మెరిపించిన ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ గత కొన్ని మ్యాచ్లుగా విఫలమవుతున్నారు. ప్రియాన్ష్ గత మ్యాచ్లో డకౌట్ కాగా, ప్రభ్సిమ్రన్ నిలకడ కోల్పోయాడు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ఓటమి పరంపరలో కేవలం ఒక్కసారి మాత్రమే 50 పరుగుల మార్కును దాటాడు. మిడిల్ ఆర్డర్ను నిలబెట్టడంలో అతను ఇబ్బంది పడుతున్నాడు. అర్ష్దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రదర్శనలోనూ నిలకడ లోపించింది. ఆల్రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నిలకడగా రాణిస్తుండగా, గత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై శశాంక్ సింగ్ ఆడిన పోరాటపటిమ కలిగిన ఇన్నింగ్స్ జట్టుకు కొద్దిగా ఊరటనిస్తోంది.
పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే?
పంజాబ్ జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే లక్నోపై గెలవడంతో పాటు ఇతర మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. లక్నోపై శనివారం జరగనున్న మ్యాచ్లో పంజాబ్ తప్పకుండా విజయం సాధించాలి. ఆదివారం జరిగే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలి. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ (KKR) నెట్ రన్ రేట్ పరంగా పంజాబ్ను దాటకూడదు. (ప్రస్తుతం కేకేఆర్పై పంజాబ్కు స్వల్ప ఆధిక్యం ఉంది).
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కూడా ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా వైదొలగింది. అయితే ఈ జట్టు తమ హోమ్ గ్రౌండ్ అయిన ఏకానా స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కేలపై విజయం సాధించడం వారి ఆత్మవిశ్వాసాన్నిపెంచేశాయి. గత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్ కేవలం 8.2 ఓవర్లలోనే 109 పరుగులు జోడించి అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. నికోలస్ పూరన్ తిరిగి ఫామ్లోకి వచ్చినా.. కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సీజన్లో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాధించడం గమనార్హం. యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ రాణిస్తున్నాడు. అయితే, మహమ్మద్ షమీ లభ్యతపై ఇంకా స్పష్టత లేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఐడెన్ మార్క్రమ్ ఈ మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండటం లేదు.
ఐపీఎల్ చరిత్రలో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స జట్లు 7 మ్యాచ్లు ఆడగా.. పంజాబ్ 4 విజయాలతో ఆధిక్యంలో ఉండగా.. లక్నో 3 విజయాలతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్లో ఈ లెక్కను సరిచేయాలని లక్నో ప్లాన్ చేస్తుంది.
లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు అంచనా..
మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, షాబాజ్ అహ్మద్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ఆకాష్ సింగ్, ప్రిన్స్ యాదవ్. (ఇంపాక్ట్ ప్లేయర్: దిగ్వేష్)
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు అంచనా..
ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, అర్ష్దీప్ సింగ్. (ఇంపాక్ట్ ప్లేయర్: యుజ్వేంద్ర చాహల్).
Also Read: హైదరాబాద్ Vs బెంగళూరు.. ఉప్పల్ గడ్డపై నేడు చివరి లీగ్ మ్యాచ్! గెలుపు ఎవరికి అవసరం?
Also Read: 'పెద్ది' కోసం భోపాల్లో బిగ్గెస్ట్ ఈవెంట్..శ్రుతిహాసన్ ఐటెంసాంగ్ రిలీజ్ కూడా అప్పుడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Govt Holiday: సెలవులు ఇచ్చేయండి.. సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Amaravathi, Andhra Pradesh:AP Govt Holiday: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు భారీ శుభవార్త. వేసవికాలంలో ఎండలు దంచికొడుతుండడంతో ప్రత్యేక సెలవులను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర వడగాల్పులు వీస్తుండడంతో పలు ప్రాంతాల్లో నిప్పులు చిమ్మినట్టు ఎండ తీవ్రత ఉండడంతో ప్రభుత్వం స్పందిస్తూ.. స్థానికంగా సెలవులు ఇవ్వాలని సూచించింది. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఎండల తీవ్రత అధికమైతే సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు.
Also Read: Vishnu Priya: 'డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటున్నావు'.. ట్రోల్స్పై విష్ణుప్రియ ఆగ్రహం
రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. రాష్ట్రంలో తీవ్రస్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు, వడ గాల్పుల నేపథ్యంలో ప్రజారోగ్యం, వారి భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. తీవ్ర వడగాల్పులపై రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించాలని.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నచోట స్థానికంగా సెలవుల ప్రకటించాలని సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
Also Read: SRH vs RCB Highlights: బెంగళూరు బోల్తా.. ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ బంపర్ విన్
ఎండల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరం హెచ్చరికలు పంపాలని అధికారులకు సూచించారు. ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి స్థానికంగా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు.
తీవ్రస్థాయి ఎల్ నినో కారణంగా వడగాలుల తీవ్రత కూడా గణనీయంగా పెరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా రద్దీగా ఉన్న ప్రాంతాలు, ప్రజలు ఎక్కువగా తిరిగే చోట్ల చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వడగాలుల నుంచి ఎలా రక్షించు కోవాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు కలెక్టర్లు మీడియా సమావేశాలు నిర్వహించాలని.. సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం సమాచారాన్ని చేరవేయాలని దిశానిర్దేశం చేశారు.
ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని.. ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 1,349 హీట్ షెల్టర్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. 446 ట్రాఫిక్ జంక్షన్లలో వాహనదారులు, పోలీసులకు నీడ కల్పించేలా ఏర్పాట్లు చేశామని.. మూగ జీవులు, పక్షులకు కూడా నీటి తొట్టెలు, మట్టి కుండలతో నీటిని ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగానికి సీఎం సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగు నీటి కొరత రాకుండా చూడాలని.. నీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
SRH vs RCB Highlights: బెంగళూరు బోల్తా.. ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ బంపర్ విజయం
Hyderabad, Telangana:SRH Won Beat By 55 Runs RCB: ప్లేఆఫ్స్లోకి చేరిన రెండు జట్ల మధ్య జరిగిన పోరులో సన్రైజర్స్ టాప్ ప్లేస్లోకి వెళ్లేందుకు చేసిన పోరాటం ఫలించలేదు. అయినా కూడా సొంత గడ్డపై అద్భుతమైన విజయంతో బెంగళూరును బోల్తా కొట్టించింది. బ్యాటింగ్.. బౌలింగ్లోనూ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి మ్యాచ్ను సొంతం చేసుకుంది. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, క్లాసెన్ భారీ స్కోర్కు తోడు బౌలర్లు రాణించడంతో సొంత గడ్డ ఉప్పల్ స్టేడియంలో బెంగళూరును 55 పరుగుల తేడాతో ఓడించింది. ఓడినా కూడా బెంగళూరుకు జరిగిన నష్టమేమీ లేదు. టాప్ 1లో కొనసాగుతూ గుజరాత్ టైటాన్స్తో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 పరుగులు చేసి ఊచకోత కోశాడు. 8 ఫోర్లు, 3 సిక్సర్లతో దూకుడుగా ఆడి భారీ స్కోర్ను నమోదు చేశాడు. అభిషేక్ శర్మ 22 బంతుల్లో మెరుపు వేగంతో 56 పరుగులు చేసి.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో మరో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ట్రావిస్ హెడ్ 26 పరుగులకు పరిమితమవగా.. హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో 51 స్కోర్తో.. 2 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. నితీశ్ కుమార్ రెడ్డి 29 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. బెంగళూరు బౌలింగ్పరంగా చూస్తే రసిక్ సలామ్ 2 వికెట్లు తీయగా.. సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా తలా ఒక్కో వికెట్ తీశారు.
Sunrisers Hyderabad: బెంగళూరుకు భారీ లక్ష్యం.. దంచికొట్టిన ఇషాన్, అభిషేక్, క్లాసెన్
Hyderabad, Telangana:Ishan Kishan Slams 79 Runs: సంచలన ప్రదర్శనతో భారీ విజయాలను అందుకుని ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్లో స్థానం పొందిన సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై హైదరాబాద్ బ్యాటర్లు ఊచకోత కోశారు. ఇషాన్ కిషన్ బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించగా.. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ అర్ధ సెంచరీలతో చెలరేగి ఆడారు. సిక్స్లు, ఫోర్లతో పరుగుల వరద పారడంతో ఉప్పల్ స్టేడియం దద్దరిల్లింది. బెంగళూరు జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచి అనూహ్యంగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 280 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ బ్యాట్తో బీభత్సం చేశాడు. 60 బంతుల్లో 90 పరుగులు చేసి కొద్దిలో సెంచరీని మిస్సయ్యాడు. 10 ఫోర్లు, 5 సిక్సర్లతో దూకుడుగా ఆడి భారీ స్కోర్ను నమోదు చేశాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ 22 బంతుల్లో మెరుపు వేగంతో 56 పరుగులు చేశాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాది ఈ సీజన్లో మరో అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. ట్రావిస్ హెడ్ 26 పరుగులకు పరిమితమవగా.. హెన్రిచ్ క్లాసెన్ 24 బంతుల్లో 51 స్కోర్తో.. 2 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి 40 పరుగులతో రాణించాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ దళాన్ని దెబ్బతీసేందుకు బెంగళూరు బౌలర్లు చేసిన ప్రదర్శన ఫలించలేదు. అతి కష్టంగా మూడు వికెట్లు తీశారు. రసిక్ సలామ్, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా తలా ఒక్కో వికెట్ తీశారు.
ఉప్పల్ స్టేడియంలో బ్యాటర్లు చెలరేగి ఆడడంతో ప్రేక్షకులు పండుగ చేసుకున్నారు. ప్లేఆఫ్స్ చేరడంతోపాటు టాప్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుండడంతో ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసింది. కళ్లు చెదిరే షాట్లతో ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు ఉర్రూతలూగారు. సొంతగడ్డపై ఆడుతున్న హైదరాబాద్ జట్టుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
Vishnu Priya: 'డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటున్నావు'.. ట్రోల్స్పై విష్ణుప్రియ తీవ్ర ఆగ్రహం
Hyderabad, Telangana:Vishnu Priya Bhimeneni: 'డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటున్నావు' అంటూ తనపై అసభ్య వ్యాఖ్యలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని బిగ్బాస్ తెలుగు కంటెస్టెంట్, యాంకర్ విష్ణుప్రియ వాపోయారు. సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాడీ షేమింగ్, అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Sara Tendulkar: బాడీ షేమింగ్.. సచిన్ గారాల పట్టీ సారా టెండూల్కర్కు అవమానం
సోషల్ మీడియాలో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేసే ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ దీనికి బాధితురాలిగా మారారు. తనపై సోషల్ మీడియా వేదికగా కొందరు వ్యక్తులు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో దాడి జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ నటి, యాంకర్ విష్ణుప్రియ హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన న్యాయవాదితో కలిసి తనపై జరుగుతున్న దాడి.. ట్రోలింగ్స్పై ఆధారాలతో సహా వివరించారు. సదరు అకౌంట్ల వివరాలను, పోస్టుల స్క్రీన్షాట్లను కూడా ఆమె పోలీసులకు సమర్పించినట్లు తెలిపారు. విష్ణుప్రియ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Save KBR Park: కేబీఆర్ పార్క్ను కాపాడాలి.. పర్యావరణ పరిరక్షణలో అండగా ఉంటాం: కేటీఆర్
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా.. తీవ్ర అభ్యంతరకరంగా ఉన్న పోస్టులు, కామెంట్లు తన దృష్టికి వచ్చాయని విష్ణుప్రియ వివరించారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా.. సమాజంలో తనకున్న గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 'దీనిపై ఎప్పుడో తాను స్పందించాల్సి ఉంది. కానీ చాలా రోజులు ఎదురుచూసి చాలా నిందలు, అవమానాల తర్వాత ఫిర్యాదు చేశా. చాలా నెగిటివ్, బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ పబ్లిసిటీ, తప్పుడు ప్రచారం.. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్లో అసభ్యకర సమాచారం వ్యాప్తి చేస్తుండడంతో వారందరి మీద పోలీసులకు వివరించా' అని విష్ణుప్రియ వెల్లడించారు.
Also Read: GT vs CSK Highlights: టాప్ 2లోకి గుజరాత్ టైటాన్స్.. ఘోర పరాభవంతో చెన్నై ఇంటికి
'మానసికంగా దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. మేము ప్రజలకు వినోదం అందించేందుకు ఈ రంగంలోకి వచ్చాం. ఐదు, పది నిమిషాలు మా కంటెంట్ చూసి ఎంజాయ్ చేయాలని మేం కార్యక్రమాలు చేస్తున్నాం. ఏ సెలబ్రిటీ కూడా ప్రేక్షకులకు హాని కలిగించేలా చేయలేదు' అని విష్ణుప్రియ తెలిపారు. కొన్ని కొన్ని సార్లు తెలియకుండా కొన్ని చేస్తాం. అవి తప్పులైనప్పుడు నిజంగా తప్పులైనప్పుడు నిందించండి, ఖండించండి. తలవంచుకొని ఎన్నైనా మాటలు తీసుకుంటాం' అని విష్ణుప్రియ స్పష్టం చేశారు.
తప్పు కానివి.. వ్యక్తిగత హననం చేస్తూ.. డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది ఇలాంటి వ్యాఖ్యలు కొందరు వాడుతున్నారు. కొంతమంది పెద్ద పెద్ద వాళ్లు.. పెద్ద పెద్ద ఛానల్స్లో మాట్లాడుతున్నారు. 'కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే అసలు వాళ్లు ఏమి లైఫ్లో ఏమీ చేయకుండా.. వేరే వాళ్లని కించపరచడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి వాటిపై ఇంకా ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటా? ఒక్కసారైనా నా కోసం నేను పోరాడాలనుకున్నా. నా కోసమే కాదు, ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎలా పడితే అలా.. ఎవరు పడితే ఎవరు అయినా మాట్లాడుకోకూడదని పోలీసులకు ఫిర్యాదు చేశా' అని విష్ణుప్రియ వివరించారు.
Rajya Sabha Elections: తెలుగుదేశం పార్టీకి జోష్.. పెద్దల సభలో పెరగనున్న బలం
Nuzendla, Andhra Pradesh:TDP Rajya Sabha Seats: దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్లో జోష్ వచ్చింది. 10 రాష్ట్రాల పరిధిలో మొత్తం 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్ నిర్వహించనుండగా.. వాటిలో ఏపీలోని నాలుగు స్థానాలు ఉన్నాయి. జూన్ 1న ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుండగా, జూన్ 8 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు విధించారు. జూన్ 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు.
Also Read: Sara Tendulkar: బాడీ షేమింగ్.. సచిన్ గారాల పట్టీ సారా టెండూల్కర్కు అవమానం
ఈ రాజ్యసభ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ పదవీకాలం జూన్ 26తో ముగియనుంది. ఈ 4 స్థానాలు అధికారంలోని ఎన్డీయే కూటమికి దక్కనున్నాయి. టీడీపీకి రెండు, బీజేపీ, జనసేనకు చెరో ఒకటి దక్కుతుందని సమాచారం. వైఎస్సార్సీపీకి ఎమ్మెల్యేల సంఖ్యా బలం లేకపోవడంతో ఒక్క రాజ్యసభ స్థానం కూడా దక్కదు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలాబలాల ఆధారంగా నాలుగు రాజ్యసభ స్థానాలూ కూడా కూటమికే చెందనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల త్యాగాలు, రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా తమకు ఈ ఎన్నికల్లో కచ్చితంగా అవకాశం ఇవ్వాలని జనసేన, బీజేపీ గట్టిగా కోరుతున్నాయి. జాతీయ స్థాయిలో పెద్దల సభలో తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికి ఇదొక సువర్ణావకాశంగా మిత్రపక్షాలు భావిస్తున్నాయి. ఈ నాలుగు రాజ్యసభ స్థానాల సర్దుబాటుపై కూటమి నాయకులు సమావేశమై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చర్చ జరుగుతోంది.
Also Read: Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు బంపర్ శుభవార్త.. రెండు రోజులు ఏమిటంటే?
తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. రాజ్యసభ స్థానం కోసం పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారింది. పార్టీ కోసం సుదీర్ఘకాలంగా కష్టపడిన సీనియర్ నాయకులు.. గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు, సామాజిక సమీకరణాల రీత్యా ప్రాధాన్యం ఉన్న నాయకులు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని లాబీయింగ్ మొదలుపెట్టారు. ఈసారి ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ రాజ్యసభ ఎన్నికలు ఏపీలోని కూటమి ప్రభుత్వంలో సీట్ల సర్దుబాటుకు పరీక్ష కానుంది. ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు బీజేపీ, జనసేన పట్టుబడుతుండగా.. సొంత పార్టీ నాయకుల ఒత్తిడిని తట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది.
Also Read: Petrol Price: 'మోదీ పిలక ట్రంప్ చేతికి చిక్కింది.. ఇందిరకు ఉన్న తెగువ మోదీకి లేదు
ప్రస్తుతం రాజ్యసభ రేసులో వినిపిస్తున్న పేర్లు ఇవే
సానా సతీష్ కొనసాగింపు
గల్లా జయదేవ్, కంబంపాటి రామ్మోహన్ రావు, కిలారు రాజేష్
బీసీ కోటాలో జంగా కృష్ణమూర్తి
ఎస్సీ సామాజిక వర్గం నుంచి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఏపీ మాదిగ కార్పొరేషన్ రాష్ట్ర చైర్పర్సన్)
Karimnagar: విశ్వవేదికపై తెలుగు కళల వైభవం.. విదేశీ అధినేతలకు ప్రధాని మోదీ అరుదైన కానుకలు!
Hyderabad, Telangana:Global Stage for Indian Art: భారతీయ సంప్రదాయ కళలు, అపార సాంస్కృతిక వైభవానికి ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికలపై మరోసారి అగ్రతాంబూలం అందించడం విశేషం. ఇటీవల ఐదు దేశాల అధికారిక పర్యటనలను సక్సెస్ ఫుల్గా పూర్తి చేసుకుని స్వదేశానికి వచ్చిన ప్రధాని, ఆయా దేశాలకు సంబంధించిన అధినేతలకు మన దేశానికి సంబంధించిన విశిష్ట హస్తకళలను కానుకలుగా సమర్పించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రాలకు చెందిన అరుదైన కొన్ని రకాల హస్తకళాఖండాలను ప్రపంచ దేశాల ప్రతినిధులకు బహుకరించి.. తెలుగు సంస్కృతి గొప్పదనాన్ని విశ్వవ్యాప్తం చేశారు.
మోదీ తన పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి సంబంధించిన ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా UAE రాణికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రపంచ ప్రసిద్ధ సిల్వర్ ఫిలిగ్రీతో తయారు చేసిన అత్యంత అద్భుతమైన జ్యువెలరీ పెట్టెను ప్రధాని కానుకగా అందించారు.. వెండిని సన్నని తీగలుగా తయారు చేసి.. ఎంతో నైపుణ్యంతో, సున్నితంగా అల్లిన ఈ పెట్టె రాణిని ఎంతగానో ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన కరీంనగర్ ఫిలిగ్రీ కళకు అంతర్జాతీయ గుర్తింపు తేవడంలో ప్రధాని తీసుకున్న ఈ చొరవపై తెలంగాణ కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా నార్వే యువరాజుకు ఏపీకి చెందిన సుప్రసిద్ధ కళంకారీ శైలిలో రూపొందించిన ఒక అద్భుతమైన చిత్రపటాన్ని ప్రధాని మోదీ గిఫ్టుగా ఇచ్చారు. పూర్తిగా నాచ్యురల్ రంగులు, కలం ఉపయోగించి వస్త్రాలపై పురాణ గాథలతో పాటు ప్రకృతి అందాలను చిత్రించే ఈ కళాఖండం నార్వే ప్రతినిధులను మంత్రముగ్ధులను చేసిందని సమాచారం.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
అలాగే ఇటలీ పర్యటనలో ఆ దేశ మహిళా పీఎం జార్జియా మెలోనీకి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన అత్యంత విలువైన ముగా సిల్క్ శాలువాను మోదీ కానుకగా అందించారు. కేవలం అస్సాంలో మాత్రమే లభించే ఈ ముగా పట్టు వస్త్రం దాని సహజ సిద్ధమైన మెరుపు, మన్నికకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ఇది చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
