గోశామహల్: మర్డర్లకు అడ్డగా పాతబస్తీ
Hyderabad, Telangana:హైదరాబాద్ పాతబస్తీలో లా అండ్ ఆర్డర్ చనిపోయిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాతబస్తీలో మర్డర్లు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఉదయం రాత్రి అనే తేడా లేకుండా ఘటనలు జరుగుతున్నాయని వాపోయారు. పోలీసులు దీనికోసం పెట్రోలింగ్ నిర్వహిస్తుంటే వారిపై ఎంఐఎం ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఇటువంటివి అరికట్టాలని డిమాండ్ చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Telangana CM: 'తెలంగాణపై ప్రధాని మోదీ పెద్ద మనసు చూపాలి: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Revanth Reddy Meets Narendra Modi: 'తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలంటే తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ అందించినట్టు సహకారం మీరు అందించాలి' అని ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కోరారు. ఎన్నికలు ముగిసిపోవడంతో రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధిపై అందరం దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: PM Modi Tour Live Updates: తెలంగాణ అభివృద్ధి మేం పెద్దపీట వేస్తున్నాం: ప్రధాని... లైవ్ అప్డేట్స్
హైదరాబాద్ పర్యటకు వచ్చిన ప్రధానమంత్రి హెచ్ఐసీసీలో తెలంగాణకు సంబంధించిన రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానమంత్రికి స్వాగతం పలికి జ్ఞాపిక అందించిన అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇది వికాస ఉత్సవం. తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకం. మీరు వికసిత్ భారత్ ప్రకటించిన సమయంలోనే మేం 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించాం' అని గుర్తుచేశారు.
Also Read: Bandi Bageerath POCSO: రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్ కొడుకు కేసుపై హరీశ్ రావు నిలదీత
'5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లడానికి ప్రధానమంత్రి వచ్చారు. రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై అందరం దృష్టి సారించాలి' అని తెలంగాణ సీఎం తెలిపారు. '2047 నాటికి దేశ ఎకానమీని 30 ట్రిలియన్లకు చేర్చాలని ప్రధానమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ దేశంలో 10 శాతం ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకానమీ చేరుకోవడమే మా లక్ష్యం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
'ఆరోజు మన్మోహన్ సింగ్లాగా ఇప్పుడు మీ సహకారం కావాలి. దేశంలో 6 నగరాలను గ్రోత్ ఇంజిన్లాగా అభివృద్ధి చేయండి. టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వండి' అని ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. 'దేశం అభివృద్ధి చెందుతున్నంత వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందాలనుకుంటుంది. అందుకు మీ సహకారం కావాలి. మచిలీపట్నం పోర్టు వరకు వేగంగా రైల్వే లైన్ వేయండి. పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వండి. మోడీది పెద్దమనసు అని బండి సంజయ్, కిషన్ రెడ్డి అంటారు. తెలంగాణపై కూడా పెద్ద మనసు చూపించండి' రేవంత్ రెడ్డి కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Petrol Diesel Price Hike: మే 15 నుంచి భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.4 నుంచి రూ.5 వరకు పెంపు?
Hyderabad, Telangana:Petrol Diesel Price Hike News: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మే 15 తర్వాత భారీగా పెరుగుతున్నాయని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. చమురు కంపెనీలు ఆయిల్ ధరలను పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయంపై గతంలో కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
ఎందుకంటే ఇప్పటికే నెలకు రూ.30,000 కోట్ల నష్టాల్లో ఉన్న ఈ కంపెనీలు మే 15 నుంచి ధరలను సవరించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఏమాత్రం పెరగనున్నాయి. దీని వల్ల సామాన్యుడిపై భారం ఎంత మోపనున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశ ప్రజలు మరోసారి ఇంధన ధరల పెంపు భయాన్ని ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. నివేదికల ప్రకారం.. చమురు కంపెనీలు మే 15వ తేదీలోగా కొత్త ధరలను సవరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి లభించిన వెంటనే వాటిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇది సామాన్యుడిపై ఎంతో భారం పడనుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఒక్క బ్యారెల్ ముడి చమురు ధర 120 డాలర్ల మార్కును దాటింది . పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, హోర్మూజ్ జలసంధిలో ముడిచమురు రవాణాలో జాప్యం వంటి కారణాలతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలోనూ దీని ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. దీంతో ఇంధన ధరల పెంపు అనివార్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే పెరిగిన ముడిచమురు ధరల నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు ఉత్పత్తి సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఈ కంపెనీలు ప్రతి నెలా సుమారు రూ.30,000 కోట్ల నష్టాలను భరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నష్టాన్ని అరికట్టేందుకు ఇంధన ధరల పెంపు ఉండబోతోందని తెలుస్తోంది.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు రూ.4 నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే గృహ వినియోగం కోసం ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.40 నుంచి రూ.50 వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర ఇప్పటికే భారీగా పెరిగింది. స్థానికంగా ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.993కి చేరింది. దీని ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు చిరుతిండి వ్యాపారస్తులపై తీవ్ర భారం పడుతోంది. అయితే ఇంధన ధరల పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ధరల పెంపు ఉండబోతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ చర్చకు మరింత బలం చేకూరుతోంది.
Also Read: రూ.5000 షాపింగ్తో రూ.2000 బిల్లు కడితే చాలు! డీమార్ట్లో అదిరిపోయే ఆఫర్లు..
Also Read: మహేష్ బాబు మేనకోడలిని చూశారా? హీరోయిన్లనే మించిన అందం..క్యూట్లో క్వీన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party: బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి: బీఆర్ఎస్ పార్టీ
Hyderabad, Telangana:Bandi Bageerath POCSO Case: 'బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేంద్ర సహాయ మంత్రి కొడుకు అని తెలిసినా మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? 13 గంటల పాటు ఓ బాలిక తనకు జరిగిన అన్యాయంపై ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీస్ స్టేషన్లో ఎదురు చూసిందంటే రాష్టంలో పోలీసులు సామాన్యులపై ఎలాంటి వివక్ష ప్రదర్శిస్తున్నారో, పాలక పక్షాలకు కొమ్ము కాస్తున్నారో అర్థం చేసుకోవచ్చు' అని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం అందరికీ సమానమే అనే సూత్రం రాష్ట్రంలో సమాధి అయిందా? అని ప్రశ్నించారు.
Also Read: Bandi Bageerath POCSO: రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్ కొడుకు కేసుపై హరీశ్ రావు నిలదీత
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. మదర్స్ డే రోజు హైదరాబాద్లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ బండి సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పరేడ్ గ్రౌండ్లో ప్రసంగం ప్రారంభించకముందే బండి భగీరథపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరారు.
Also Read: Former DGP Wife Case: మాజీ డీజీపీ భార్య హత్యపై పోలీస్ కమిషనర్ కీలక వ్యాఖ్యలు
'బండి సంజయ్ని బర్తరఫ్ చేయకపోతే మోదీ చేసే ప్రసంగాన్ని ఎవరూ పట్టించుకోరు. రేవంత్ రెడ్డి హామీలకే పరిమితయ్యారు.. హోమ్ మంత్రిగా విఫలమయ్యారు. సామాన్య మహిళకు న్యాయం చేయలేకపోతే రేవంత్ హోం మంత్రిగా పనికి రారు. మహిళల ఆర్తనాదాలను మోడీ, రేవంత్ వినాలి' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డి హితవు పలికారు. 'డీలిమిటేషన్తో కూడిన మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ప్రధాని మోడీ మహిళలకు ప్రతిపక్షాలు అన్యాయం చేశాయని మాట్లాడారు. మహిళల కోసం ఎంతో చేస్తున్నామని సానుభూతి ప్రదర్శించారు. నరేంద్ర మోదీ మాటలకే పరిమితమని మహిళలపై నేరాలు పెరుగుతున్న స్పందించరని బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు విషయంలో రుజువైంది' అని వివరించారు.
'కేంద్ర, రాష్ట్ర హోమ్ మంత్రులు (బండి సంజయ్, రేవంత్ రెడ్డి) కలిసి కేసును తొక్కిపెట్టే ప్రయత్నాలు చేయడం 2 కోట్ల మంది తెలంగాణ మహిళలను అవమానపరచడమే' అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. 'బండి భగీరథ్ గతంలో అనేక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని వీడియో రుజువులు ఉన్నాయి. అవి చూసి కూడా బండి సంజయ్ కొడుకు అమాయకుడని పోలీసులు భావిస్తున్నారా?' అని ప్రశ్నించారు.
'సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కేసులు పెట్టి వేధించి రేవంత్ పోలీసులు ఇంత పెద్ద ఘటనపై నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? కాంగ్రెస్, బీజేపీ నేతలు నేరాలు చేస్తే ఎలాంటి చర్యలు ఉండవా?' అని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి నిలదీశారు. 'బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగితే ఈ కేసు నీరుగారే అవకాశం ఉంది. మహిళలపై మోడీకి ఏ మాత్రం గౌరవం ఉన్నా హైదరాబాద్లో ప్రవేశించక ముందే బండి సంజయ్ను మంత్రివర్గం నుంచి తప్పించాలి' అని డిమాండ్ చేశారు.
‘బేటీ బచావో.. బేటీ పఢావో’ కేవలం నినాదాలకే పరిమితం అయ్యాయి
తెలంగాణలో కావొచ్చు.. దేశంలో కావొచ్చు.. ఆడబిడ్డలకు ప్రధాని మోదీ రక్షణ కల్పించడం లేదు
ప్రభుత్వం మీదే కదా.. బండి సంజయ్ని బర్తరఫ్ చేయండి, కొడుకు భగీరథ్పై చర్యలు తీసుకోండి pic.twitter.com/NocB2VE37z
— PulseNewsBreaking (@pulsenewsbreak) May 10, 2026
'బీజేపీకి ఏ మాత్రం విలువలు ఉన్నా బండి సంజయ్ కొడుకుపై చర్యలు తీసుకోవాలి. పేట్ బషీరాబాద్ పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి' అని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కోరారు. 'ప్రియాంక గాంధి మహిళనే కదా.. సాటి మహిళపై అత్యాచారం జరిగితే స్పందించారా? రేవంత్ రెడ్డిని ఆదేశించే స్థితిలో లేరా? రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీకి తెలంగాణ మహిళలపై జరుగుతున్న నేరాలు పట్టవా?' అని సందేహం వ్యక్తం చేశారు. బీజేపీ కాంగ్రెస్ ఫెవికాల్ బంధం బండి సంజయ్ కొడుకు పోక్సో కేసులో బట్టబయలైందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి బండి కొడుకు భగీరథ్ను పోక్సో కేసు నుంచి రక్షించాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని.. కానీ బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
RCB Vs MI Preview: బెంగళూరు Vs ముంబై..ఈ మ్యాచ్తో ప్లేఆఫ్స్కు వెళ్తారా? అస్సాం ట్రైన్ ఎవరు ఎక్కుతారు?
Atal Nagar-Nava Raipur, Chhattisgarh:RCB Vs MI Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నేడు మరో రసవత్తరపోరు జరగనుంది. ఈరోజు జరగనున్న రెండో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించిన ముఖాముఖి రికార్డు, ప్లేయింగ్ XI, పిచ్ నివేదిక, వాతావరణ పరిస్థితులు వంటి విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీతో పాటు ముంబై జట్టులోని రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ తిరిగి జట్టులో చేరనున్నారని తెలుస్తోంది. పాయింట్ల పట్టిక ప్రకారం చూస్తే, డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఉన్న ఆర్సీబీ జట్టు 10 మ్యాచ్లలో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి 4వ స్థానంలో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన 10 మ్యాచ్లలో కేవలం మూడు విజయాలతో 6 పాయింట్లు మాత్రమే సాధించి 9వ స్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం, ముఖ్యంగా ముంబై జట్టుకు ఇది అత్యంత ముఖ్యమైన మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓడిపోతే వారు ప్లేఆఫ్ రేసు నుండి పూర్తిగా నిష్క్రమించే ప్రమాదం ఉంది. మరోవైపు, ఈ ఐపీఎల్ సీజన్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ముంబై జట్టుపై విజయం సాధించి ప్లేఆఫ్స్ మార్గం సుగమం చేసుకోవాలని ఆర్సీబీ యోచిస్తుంది.
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 35 మ్యాచ్ల్లో తలపడగా.. అందులో ముంబై 19 సార్లు గెలుపొందగా.. ఆర్సీబీ 16 సార్లు విజేతగా నిలిచింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. ఆర్సీబీపై ముంబై జట్టు పైచేయి ఉందని తెలుస్తోంది. కానీ, ఈ సీజన్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించడం గమనార్హం.
ఈ వేదికలోని పిచ్, ముఖ్యంగా రాత్రిపూట జరిగే మ్యాచ్ల్లో బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. నేడు జరగబోయే మ్యాచ్లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే, వేగాన్ని సమర్థవంతంగా మార్చగల పేసర్ ఈ పిచ్పై ఎక్కువ వికెట్లు పడగొట్టే అవకాశం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, సుయాష్ శర్మ, భువనేశ్వర్ కుమార్.
ముంబై ఇండియన్స్ తుదిజట్టు అంచనా..
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రిక్లెటన్, సూర్యకుమార్ యాదవ్, కేశవ్ మహారాజ్, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, అశ్వనీ కుమార్, ట్రెంట్ బౌల్ట్, కార్బిన్ బాష్.
Also Read: Vijay Telugu Speech: తమిళనాడు సీఎం విజయ్ తెలుగు స్పీచ్ అదరగొట్టాడు..సోషల్
Also Read: Avika Gor Bangkok: దేశం వదిలివెళ్లిన తెలుగు హీరోయిన్..అన్నీ బ్యాంకాక్ నుంచే చేస్తుందట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bandi Bageerath POCSO: రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్ కొడుకు కేసుపై హరీశ్ రావు నిలదీత
Baddipadaga, Telangana:Bandi Sai Bageerath POCSO Case: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు దేశవ్యాప్తంగా.. తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బండి భగీరథ్ను రెండు రోజులైనా అరెస్ట్ చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సంఘటనపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ తెలంగాణ పోలీసులను.. బండి సంజయ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.
Also Read: Former DGP Wife Case: మాజీ డీజీపీ భార్య హత్యపై పోలీస్ కమిషనర్ కీలక వ్యాఖ్యలు
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సోపై 'ఎక్స్' వేదికగా హరీశ్ రావు స్పందించారు. 'బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని నిలదీశారు. హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: DC vs KKR Highlights: సెంచరీతో ఢిల్లీని ఫినీష్ చేసిన ఫిన్ అల్లెన్.. కలకత్తా విజయం
'తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందానికి, కుమ్మక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం వేరే ఏమైనా ఉంటుందా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథను అరెస్ట్ చేయాలని.. బండి సంజయ్ రాజీనామా చేయాలని కోరుతూ తెలంగాణలో నిరసనలు ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పొక్సో కేసు నమోదు చేసిన పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను మహిళలు ముట్టడించారు. వెంటనే బండి భగీరథ్పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. కుత్బుల్లాపూర్ నివాసి మైనర్ బాధితురాలికి అండగా ప్రభుత్వం ఉండాలని కోరారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ మహిళలు నినాదాలు చేశారు.
డీజీపీ ఆఫీస్ ముట్టడి
బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని డీజీపీ ఆఫీస్ను బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ముట్టడించారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
బాధితురాలు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. కేసు నమోదు చేయడానికి 8 గంటల సమయం ఎందుకు పట్టింది?
కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితులపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.
హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి @revanth_anumula దీనికి సమాధానం చెప్పాలి.
రాష్ట్రంలో కాంగ్రెస్,…
— Harish Rao Thanneeru (@BRSHarish) May 10, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant Python Video: భారీ కొండచిలువకు సబ్బు పెట్టి స్నానం చేయించిన తండ్రీకూతుళ్లు.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Giant Python Video Watch Here: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు.. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత భారీ సర్పములో ఒకటైన కొండచిలువను పట్టుకోవాలన్నా.. దాని దరిదాపుల్లోకి వెళ్లాలన్న గుండె ధైర్యం ఉండాల్సిందే. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం మీ కళ్ళు బైర్లు కమ్ముకపోవడం ఖాయం.. అంతేకాకుండా మీరు ఆశ్చర్య పోవడం తథ్యం.. ఒక వ్యక్తి ఏకంగా భారీ కొండచిలువకు ఇంట్లో పెంపుడు జంతువుకు చేసినట్లుగా సబ్బు పెట్టి స్నానం చేయిస్తున్నాడు..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక వ్యక్తి తన ఇంటి ముందు ఒక భారీ కొండచిలువను పడుకోబెట్టాడు.. అది ఎంత పొడవు ఉందంటే దానిని చూస్తేనే ఒళ్లంతా పాములు పాకినట్లు అనిపిస్తుంది.. ఆ వ్యక్తి చాలా సాధారణంగా ఒక మగ్గుతో నీళ్లు పోస్తూ.. ఆ పాము శరీరంపై సబ్బు రుద్దుతూ స్నానం చేయిస్తున్నాడు.. అంతటితో ఆగకుండా.. అతని పక్కనే ఉన్న చిన్నారి కూడా ఏమాత్రం భయం లేకుండా ఆ పాముకు ఒక చిన్న జగ్గుతో నీటిని పోయడం మీరు వీడియోలో క్లియర్ గా చూడొచ్చు..
ఆ కొండచిలువ కూడా చిన్నారిని కానీ.. దానికి స్నానం చేయిస్తున్న వ్యక్తిని కానీ ఏమీ అనకుండా చాలా ప్రశాంతంగా ఉండడం గమనార్హం.. సాధారణంగా కొండచిలువలు విషపూరితం కానప్పటికీ.. కవితమ్మ శరీరంలో గట్టిగా చుట్టేసి ఎముకలను విరగొట్టగలుగుతాయి.. అటువంటి క్రూరమైన వన్యప్రాణితో ఒక చిన్నారి ఆడుకోవడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.. అయితే, అక్కడే ఉన్న కొంతమంది దీనిని వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అయిన కొద్దిసేపటికి మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించుకుంది. అంతేకాదు ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆ వ్యక్తి ధైర్యాన్ని మెచ్చుకుంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ధైర్యం కాదు.. ముమ్మాటికి మూర్ఖత్వమే.. పెంపుడు జంతువు ఏదైనా సరే.. అది క్రూరమృగం అన్న విషయం మర్చిపోకూడదు అని కొంతమంది కామెంట్ చేస్తూ వస్తున్నారు.. అలాగే మరికొందరు చిన్నారి ప్రాణాలతో ఆ తండ్రి చెలగాటమాడుతున్నాడు.. ఇలాంటి పనులు అస్సలు ప్రోత్సహించకూడదని కొంతమంది రాస్కొస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Kondagattu: కొండగట్టులో మొదలైన అంజన్న పెద్ద జయంతి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న క్షేత్రం!
Hyderabad, Telangana:Kondagattu Anjanna Pedda Jayanti 2026: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, భక్తుల ఇష్టాదైవం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు నేటి నుంచి అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పురుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరావడంతో అంజన్న క్షేత్రం జైశ్రీరామ్.. జై హనుమాన్ నామస్మరణతో మారు మోగింది.. పెద్ద జయంతి సందర్భంగా ఈ సమయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు.. కాబట్టి ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి కష్టాలు కలగకుండా ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఒక ముఖ్య ఘట్టం ఆవిష్కృతమైంది.. భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించే కార్యక్రమం భక్తుల భక్తి శ్రద్దల మధ్య సాగింది. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ పట్టు వస్త్రాలను తలమీద పెట్టుకొని మంగళ వాయిద్యాలు, డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఒక్క భక్తుడికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు..
ఉత్సవాల ప్రారంభం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకర్షింపచేశాయి.. స్థానిక, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శించిన తీరు అందర్నీ ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. కేసరి సందడి వేషాధారణలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. పెద్ద జయంతి సందర్భంగా 41 రోజుల హనుమాన్ దీక్షను చేపట్టిన మాలదారులు పెద్ద సంఖ్యలో కొండగట్టుకు చేరుకుంటున్నారు..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులతో పాటు పోలీసులు ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రత్యేకమైన క్యూలైన్లలో భక్తులకు మంచినీటితో పాటు మజ్జిగ సౌకర్యాలను కల్పించినట్లు కూడా సమాచారం.. మరో రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. రేపు స్వామివారికి విశేష అభిషేకంతో పాటు ఎల్లుండి పూర్ణ హారతితో ఈ వేడుక ముగుస్తుంది. ఈ ఆధ్యాత్మిక సంబరంతో కొండగట్టు పరిసర ప్రాంతాలని పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CUET UG 2026 Exam Day: రేపటి నుంచి సీఈయూటీ పరీక్షలు.. డ్రెస్ కోడ్ ఏంటి? వేటిని అనుమతిస్తారు? అభ్యర్థులకు కీలక సూచనలు!
Hyderabad, Telangana:CUET UG 2026 Exam Day Rules: దేశవ్యాప్తంగా 48 సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి ఈ కామన్ యూనివర్సిటీ ప్రవేశ (CUET) పరీక్షలు ప్రతి ఏడాది నిర్వహిస్తారు. 2026-27 కు సంబంధించి రేపు 11వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 31వ తేదీ వరకు ఆన్లైన్ విధానాల్లో వివిధ కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటారు.
దీనికి సంబంధించి మొత్తం 37 సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అడ్మిషన్ ప్రమాణాలు, అర్హత, ర్యాంకు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ యూనివర్సిటీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలు తెలుగు, తమిళం, గుజరాతి, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, ఉర్దూ మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు.
సీఈయూటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల డ్రెస్ కోడ్, లోనికి అనుమతించే వస్తువులు ఏంటో తెలుసుకుందాం..
సీఈయూటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమతోపాటు కేవలం ట్రాన్సపరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకువెళ్లాలి. అంతేకాదు పరీక్షకు కనీసం గంట ముందు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
లైట్ దుస్తులను మాత్రమే ధరించాలి. షూస్ వేసుకోకూడదు. కేవలం స్లిప్పర్స్ మాత్రమే అనుమతిస్తారు. విద్యార్థులు తమతో పాటు సీఈయూటీ యూజీ అడ్మిట్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ధ్రువపత్రం కూడా తమతోపాటు తీసుకువెళ్లాలి.
Also Read: రూ.30,000 స్టైపెండ్తో సూపర్ ఛాన్స్.. DRDOలో పెయిడ్ ఇంటర్న్షిప్, అర్హతలు ఇవే!
Also Read: ఉచితంగా ఆన్లైన్ క్లాసులు.. స్వయం ప్లాట్ఫామ్లో ఇంటర్ విద్యార్థుల కోసం సరికొత్త కోర్సులు!
సీఈయూటీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ ఎగ్జామ్ టైమింగ్ షిఫ్ట్ ఏంటో చూసుకోవాలి. 30 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రం గేట్ కూడా క్లోజ్ చేస్తారు. కాబట్టి పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందు వచ్చేలా చూసుకోండి. ఆ తర్వాత పరీక్షకు అనుమతించరు. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డును కూడా ఎగ్జామ్ హాల్ ఎంట్రీ గేట్ వద్ద చూపించాల్సి ఉంటుంది.
పరీక్షా కేంద్రంలో క్రమ సంఖ్య ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. కేవలం వారికి కేటాయించిన సీట్లలో మాత్రమే విద్యార్థులు కూర్చొని పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇక నిషేధించిన గ్యాడ్జెట్స్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తమతోపాటు తీసుకువెళ్లకూడదు. పరీక్ష కేంద్రం లోపలికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
CM Vijay Family: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం.. భార్య, కొడుకు, కూతురు ఎక్కడ?
Nagalapuram, Tamil Nadu:CM Vijay Family Rift: తమిళ చిత్రసీమలో తిరుగులేని కథానాయకుడిగా వెలిగిన విజయ్, రాజకీయాల్లోనూ తన సత్తా చాటారు. భారీ విజయంతో నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త అధ్యాయానికి తెరలేపారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం అభిమానుల కోలాహలం, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన వేళ, ఆయన కుటుంబ సభ్యుల గైర్హాజరీపై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.
ఈ చరిత్రాత్మక ఘట్టంలో ఒక లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. తన తండ్రి రాష్ట్రానికే అధిపతి అవుతున్న తరుణంలో, పక్కనే ఉండి అభినందనలు తెలపాల్సిన కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్య సాషా ఈ వేడుకకు దూరంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఈ పరిస్థితికి కారణం ఏంటి?
సీఎం విజయ్ వ్యక్తిగత జీవితంలో గత కొంతకాలంగా నెలకొన్న పరిణామాలే దీనికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్, ఆయన భార్య సంగీత మధ్య మనస్పర్థలు, విడివిడిగా ఉంటున్నారనే వార్తలు గతంలోనే వచ్చాయి. ప్రస్తుతం సంగీత లండన్లో నివసిస్తుండగా, పిల్లలు ఇద్దరూ ఆమెతోనే ఉంటున్నట్లు సమాచారం.
ముఖ్యంగా కుమారుడు జాసన్ సంజయ్ తన తల్లికి అండగా నిలుస్తున్నారని, అందుకే తండ్రికి సంబంధించిన రాజకీయ పరిణామాలకు దూరంగా ఉంటున్నారని మద్దతు ఇస్తున్నారు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన తండ్రి విజయంపై స్పందించలేదు. కుమార్తె దివ్య సాషా కూడా తండ్రి ప్రమాణ స్వీకారానికి హాజరుకాకపోవడం కుటుంబ సభ్యుల మధ్య గ్యాప్ ఎంత ఉందో స్పష్టం చేస్తోంది.
ఒకవైపు లక్షలాది మంది అభిమానులు 'దళపతి'ని ముఖ్యమంత్రి పీఠంపై చూసి మురిసిపోతుంటే, మరోవైపు తన సొంత పిల్లలు పక్కన లేకపోవడం విజయ్ వ్యక్తిగత జీవితంలో మరో కోణాన్ని ఆవిష్కరిస్తోంది. రాజకీయంగా అత్యున్నత శిఖరానికి చేరుకున్న వేళ, ఈ కుటుంబ పరిణామాలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ తన పాలనతో ప్రజలను ఎలా మెప్పిస్తారో వేచి చూడాలి, అదే సమయంలో ఈ కుటుంబ విభజనలు ఎప్పటికి సర్దుమణుగుతాయో అని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read: ఉద్యోగులకు ఊరట! ఏటీఎం నుంచి PF డబ్బులు విత్డ్రా..తాజాగా అప్డేట్ ఇదే..
Also Read: 5వ తరగతి చదివి ఇండస్ట్రీనే షేక్ చేసిన నటి..కోట్ల రూపాయలు సంపాదిస్తుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: కారు టైర్లో కోబ్రా.. గమనించకపోతే ప్రాణాలు పోయేవే.. వీడియో ఇదే!
Hyderabad, Telangana:Cobra Trapped In Car Video Watch: సాధారణంగా వాహనదారులు తమ కారును రోడ్డుపైకి తీసే ముందు టైర్లలో గాలి ఉందో లేదో చూసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం.. టైర్ల లోపల ఏమైనా ప్రాణహాని కలిగిన జీవులు ఉన్నాయేమోనని కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ప్రమాదకరమైన నాగుపాము కారు చక్రం సందులో దూరి కూర్చున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలోని నెటిజన్లను వణికిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి తన కారును బయటికి తీద్దామని వెళ్లగా.. కారు చక్రం పై భాగంలో ఏదో కదులుతున్నట్లు గమనించాడు.. తీరా దానిని పరిశీలించి చూడగా అక్కడ దాదాపు 5 అడుగుల పొడవైన అత్యంత ప్రమాదకరమైన నాగుపాము చుట్టుకొని ఉండడం కనిపించింది. అది ఎప్పుడు వచ్చిందో? ఎలా లోపలికి దూరిందో తెలియదు కానీ.. టైర్ లో సన్నని సందులో చుట్టుకొని ఉండడం మీరు గమనించవచ్చు..
భయంతో వణికిపోయిన యజమాని వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్కు సమాచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పామును బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ పాము చక్రం లోపల ఉన్న చిన్న రాడ్డు మధ్య గట్టిగా చుట్టుకొని ఉండడంతో బయటికి తీయడం పెద్ద సవాలుగా మారింది.. స్నేక్ క్యాచర్ ఒక కర్ర సహాయంతో దానిని కదిలించే ప్రయత్నం చేయగా.. ఆ నాగుపాము కోపంతో గుసలు కొడుతూ వారి పైకి దాడి చేసే ప్రయత్నం చేసింది. అయితే దీనిని అక్కడే ఉన్న కొంతమంది స్మార్ట్ఫోన్స్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. దాదాపు గంటసేపు శ్రమించిన తర్వాత ఎట్టకేలకు ఆ పామును సురక్షితంగా రెస్క్యూ చేసి అడవిలో వదిలిపెట్టినట్లు తెలుస్తోంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
అయితే, ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ఒకవేళ యజమాని గమనించకుండా కారు స్టార్ట్ చేసి ఉంటే.. ఆ పాము టైర్ వేగానికి చిధ్రమైపోయి ఉండేది.. అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు చలికాలంలో వేడి కోసం పాములు కారు ఇంజనులతో పాటు టైర్ల సందుల్లో చేరుకుంటాయి. కాబట్టి వాహనాలను పరిశీలించి స్టార్ట్ చేసి వెళ్లడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Karimnagar: Pmj జువెలరీ దోపిడీ కేసులో బిగ్ బ్రేకింగ్.. బెంగాల్లో దొరికిన దొంగ!
Karimnagar, Telangana:Karimnagar Pmj Jewellery Robbery Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన కరీంనగర్ పీఎంజే (PMJ) జువెలరీ భారీ దోపిడీ కేసులో ఎట్టకేలకు పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన కరీంనగర్ పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితుల కదలికలను కనిపెట్టారు. చోరీ చేసిన బంగారాన్ని విక్రయించే ప్రయత్నం చేస్తుండగా.. పశ్చిమ బెంగాల్లోని ఒక ప్రధాన నిందితుడిని ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
నిందితుడు పశ్చిమ బెంగాల్లోని ఒక స్థానిక నగల వ్యాపారికి చోరీ చేసిన బంగారాన్ని విక్రయిస్తున్న సమయంలో పోలీసులు మెరుపు దాడిని చేశారు. అతని వద్ద నుంచి కొంతమేర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా దొంగలించిన నగలు అని తెలిసినా కూడా వాటిని కొనుగోలు చేసేందుకు సిద్ధపడిన సదరు వ్యాపారిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిద్దరిని కరీంనగర్ కు తరలించేందుకు ట్రాన్సిట్ రిమాండ్ ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది..
ఈ దోపిడి వెనక ప్రొఫెషనల్ అంతరాష్ట్ర ముఠాహస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.. పక్క ప్లాన్తో షో రూమ్లోకి చొరబడిన దొంగలు సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ కళ్లు కప్పి భారీగా నగలను దోచుకెళ్లారు.. ఈ కేసులో మొత్తం ఆరుగురు పాల్గొన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం చిక్కిన వ్యక్తి నుంచి మిగిలిన 5 నిందితుల వివరాలను పోలీసులు రాబడుతున్నట్లు సమాచారం.. వారు కూడా పశ్చిమ బెంగాల్ లేదా పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
దోపిడి జరిగిన వెంటనే కరీంనగర్ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఎనిమిది ప్రత్యేకమైన బృందాలను రంగంలోకి దించారు. సెల్ ఫోన్ సిగ్నల్తో పాటు హైవే టోల్ గేట్ల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ఆధారంగా నిందితులను వెంబడించారు. పరారీలో ఉన్న మిగిలిన ఐదుగురు దొంగల కోసం పరుగు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. త్వరలోనే పూర్తిస్థాయి నిందితులను పట్టుకొని.. దోపిడికి గురైన మిగిలిన బంగారాన్ని కూడా వీకవరీ చేస్తామని పోలీసు వర్గాలు భీమా వ్యక్తం చేస్తున్నాయి. భారీ దోపిడీ కేసు కొలిక్కి వస్తుండడంతో అటు జ్యువెలరీ యజమానులతో పాటు ఇటు ప్రజలు కూడా ఊపిరిపించుకుంటున్నారు..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: సర్కారు నిర్లక్ష్యం.. శిథిలావస్థలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. పేదలకు అందని వైద్యం!
Karimnagar, Telangana:Karimnagar PHCs Fund Crisis News: రాష్ట్రంలోని పేదల ప్రాథమిక వైద్యానికి వెన్నుముకగా నిలవాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నేడు నిధుల కోరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలలకు అందాల్సిన గ్రాంట్లు నిలిచిపోవడంతో వ్యవస్థ హస్తవ్యస్తంగా తయారయింది. గత రెండేళ్లుగా నిధుల విడుదల లేకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాకుండా రోగులు కూడా తీవ్ర అవస్థల పాలవుతున్నారు. ముఖ్యంగా పేద రోగులు పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల రోజువారి నిర్వహణ.. చిన్నపాటి మరమ్మత్తుల తో పాటు మందుల రవాణా వంటి అవసరాల కోసం ప్రభుత్వం హెల్త్ ఫండ్ విడుదల చేస్తుంది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 15 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు 71 గ్రామీణ పీహెచ్పీ లకు సంబంధించి 2022 సెప్టెంబర్ నుంచి ఈ నిధులు నిలిచిపోయాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.2.87 కోట్ల బకాయాలు పెండింగ్లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
నిధుల కోరత కారణంగా ఆసుపత్రుల్లో కనీస మౌలిక వసతుల కల్పన పూర్తిగా ఆగిపోయింది. అంతేకాకుండా వర్షం పడితే పైకప్పుల నుంచి నీరు కారడమే కాకుండా.. శిథిలావస్థకు చేరిన గోడలకు రంగు వేయడం వంటి పనులు నిలిచిపోయాయి. ఇక పారిశుద్ధ్య కార్మికుల వేతనాలతో పాటు బ్లీచింగ్ పౌడర్ ఇతర శుభ్రత సామాగ్రి కొనుగోలుకు నిధులు లేక ఆస్పత్రులు అశుభ్రంగా మారాయి. దీంతోపాటు పెండింగ్ బిల్లుల కారణంగా కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగిన పరిస్థితులు నెలకొన్నాయి..
ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో.. చేసేదేమీ లేక కొందరు వైద్యాధికారులు తమ సొంత జేబుల నుంచే ఖర్చులు చేస్తున్నారట.. నెలకు రూ.1000 పెట్టి అత్యవసర మరమ్మత్తులు చేయిస్తున్నారు. ప్రభుత్వాన్ని నుంచి రియంబర్స్మెంట్ వస్తుందో రాదో తెలియని పరిస్థితులలో తమ జీవితాల్లో నుంచి ఖర్చులు భరించాల్సి వస్తుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
ప్రభుత్వం ఒకవైపు కార్పొరేట్ వైద్యం అందిస్తామని గొప్పలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పీహెచ్పీలను మాత్రం గాలికి వదిలేసింది.. అని ప్రజాసంఘాలు విమర్శిస్తున్నాయి. నిధుల విడుదలను ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందకుండా పోతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి.. పెండింగ్ లో ఉన్న కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేసి పీహెచ్బీలను ఆదుకోవాలని జిల్లా ప్రజల కోరుతున్నారు..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Moon Transit 2026: ఈ 4 రాశుల వారికి బంపర్ జాక్పాట్.. చంద్రుడి రాకతో అదృష్టం మామూలుగా ఉండదు!
Hyderabad, Telangana:Moon Transit In Ashwini Nakshatra Effect On Zodiac 2026: ఈ ఏడాది మే 14వ తేదీన గురు ప్రదోష వ్రతం వచ్చింది. ఈ ఈ శుభదినం రోజునే చంద్రుడు కేతు ఉగ్రహానికి సంబంధించిన అశ్విని నక్షత్రంలో ప్రవేశించబోతున్నాడు. మే 14 గురువారం రాత్రి 10 గంటలకు చంద్రుడు అశ్వినీ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు మే 15న రాత్రి 8 గంటల వరకు అదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతాడు. దీని కారణంగా ఈ ప్రభావం అన్ని రాశుల వారిపై కొనసాగుతుంది. ముఖ్యంగా చంద్రుడి ప్రభావంతో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో పోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
మేషరాశి
అశ్విని నక్షత్రంలోకి చంద్రుడు సంచారం కారణంగా మేషరాశి వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు ఎంతో సులభంగా పూర్తవుతాయి. అలాగే వృత్తిపరమైన సమస్యల నుంచి చాలావరకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా ఉన్నత అధికారులకు మీరు ఇష్టమైన వ్యక్తిగా మారతారు. అలాగే కొత్త ప్రాజెక్టు లభించడమే కాకుండా కుటుంబంలో శాంతి కూడా నెలకొంటుంది.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ శుభ సమయంలో ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన ధన లాభాలు పొందుతారు. అలాగే డబ్బుకు కూడా కోరత ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఎలాంటి పనులైన చేసే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా పెరుగుతుంది.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు చంద్రుడి సంచారం కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పాత కోరికలు నెరవేరడమే కాకుండా ఉద్యోగాల్లో గొప్ప పురోగతి కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఉద్యోగస్తులకు పదోన్నతులు కూడా లభించబోతున్నాయి. అలాగే జీతం విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు కొత్త క్లైంట్ల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు అశ్వినీ నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశించడం కారణంగా సమాజంలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది. దీంతోపాటు మానసిక సమస్యలు ఊహించని స్థాయిలో తొలగిపోతాయి. వ్యాపారాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లాభాలు చేకూరడమే కాకుండా అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mars Transit 2026: మే 11 నుంచి ఈ 3 రాశుల వారికి కుబేర యోగం.. కుజుడి దయతో కనకవర్షమే!
Hyderabad, Telangana:Mars Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలు ఒక వ్యక్తి విధిరాతతో పాటు జీవితం పై ప్రత్యక్షమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అందుకే జాతకాల్లో గ్రహాలు కీలకంగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మే 11వ తేదీ నుంచి కుజుడు, కేతువు నక్షత్రాల్లోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన సంఘటనగా భావిస్తూ ఉంటారు. కుజుడిని బలంతో పాటు ధైర్యం కార్యాచరణకు అధిపతిగా చెప్పుకుంటూ ఉంటారు. మరోవైపు కేతు ఆకస్మిక మార్పు, కర్మ ఫలాలతో సంబంధం కలిగిన గ్రహంగా పరిగణిస్తారు. ఈ సమయంలో రెండు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా వృత్తి, డబ్బు, ఆస్తులు పరంగా అనేక మార్పులు సంభవించే అవకాశాలున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో కుజుడు అనుకూల స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా.. గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బు కూడా తిరిగి పొందే అవకాశాలను పెంచుతుంది. అలాగే ఇది వృత్తి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా వృత్తిలో పురోగతి లభించడమే కాకుండా మరెన్నో కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా అదృష్టం సహకరించి స్థిరాస్తికి సంబంధించిన ప్రయోజనాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుజుడి శుభప్రభావంతో పాత విభేదాలు లేదా కోర్టు కేసుల నుంచి ఎంతో సులభంగా పరిష్కారం కలుగుతుంది. దీంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఈ సమయాల్లో ఎలాంటి పనులైన ఎంతో సింపుల్గా చేసి విశేషమైన లాభాలు పొందగలుగుతారు.
ఈ రాశుల వారిపై అపారమైన కుజుడి ప్రభావం..
మేష రాశి
మే 11వ తేదీ నుంచి మేషరాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. కుజుడి ప్రభావంతో వీరికి కష్టానికి తగిన ప్రతిఫలాలు లభించబోతున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఈ సమయంలో తప్పకుండా తెరుచుకుంటాయి. అసంపూర్తిగా ఉన్న పనులు సులభంగా పూర్తి కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బులు సంపాదించే అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతారు.
కర్కాటక రాశి
కుజుడి అనుగ్రహం మే 11వ తేదీ నుంచి కర్కాటక రాశి వారికి కూడా ఉంటుంది. కాబట్టి వీరికి అదృష్టం అనుకున్నంత స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.s పదోన్నతులు లభించడమే కాకుండా కొత్త కొత్త బాధ్యతలు పొందగలుగుతారు. వ్యాపారాల్లో ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఎప్పటినుంచో తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
మిథున రాశి
కుజుడి ప్రభావంతో మిధున రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా పెద్ద పెద్ద మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి కష్టానికి తగిన గుర్తింపు లభించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలున్నాయి. అలాగే వీరు కొత్త అవకాశాలు పొందడమే కాకుండా జీవితంలో ఉన్నత స్థితికి ఎదిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా వ్యాపారస్తులకు పరిష్కారం అవుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RR vs GT Highlights: రాజస్థాన్కు మరో ఓటమి.. భారీ విజయంతో ప్లేఆఫ్స్ రేసులోకి గుజరాత్ టైటాన్స్
Jaipur, Rajasthan:IPL 2026 RR vs GT Highlights: ఐపీఎల్ సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్ క్రమంగా డీలా పడిపోతున్నది. వరుస ఓటములను చవిచూస్తున్న రాజస్థాన్ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఏమాత్రం ప్రభావం చూపని రాజస్థాన్ పరాజయం పొంది ప్లేఆఫ్స్ రేసు నుంచి దూరమవుతోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా పుంజుకుని మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా మెరుగైన రన్రేట్తో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. 77 పరుగుల తేడాతో గుజరాత్ నెగ్గిన ఈ మ్యాచ్కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
