ఈబి5 వీసాతో అమెరికా గ్రీన్ కార్డ్ సులువుగా పొందవచ్చు- మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్
Hyderabad, Telangana:ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని పథకాల్లో పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు మల్లెల ఆదిత్య సోమాజిగూడ, ఎంతో మంది భారతీయులు తమ విలువైన భవిష్యత్తు కోసం అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటున్నారని సూచించారు. ఇలాంటి వారికి ఈబీ5 వీసా ఎంతో అనువుగా ఉంటుందని, ఈ వీసా ద్వారా అమెరికాలో వర్క్ పర్మిట్, నిబంధనలతో కూడిన గ్రీన్ కార్డ్ పొందవచ్చని, వచ్చే ఐదేళ్లలోగా శాశ్వత గ్రీన్ కార్డ్ పొందవచ్చని తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Pant 2027 World Cup: రిషబ్ పంత్కు బీసీసీఐ షాక్..వన్డే ప్రపంచకప్ టీమ్ నుంచి పంత్ ఔట్! అతని స్థానంలో..
Hyderabad, Telangana:Rishabh Pant In 2027 World Cup: ఈ ఏడాది ప్రారంభంలో టీమ్ఇండియా చివరిసారిగా న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడింది. ఆ సిరీస్లో రిషబ్ పంత్ను జట్టులోకి తీసుకున్నారు. కానీ పక్కటెముకల గాయం కారణంగా సిరీస్ ప్రారంభానికి ముందే అతను వైదొలగాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం వన్డే జట్టు నుంచి రిషభ్ పంత్ తన స్థానాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. అతని స్థానంలో సంజూ శాంసన్ లేదా ధ్రువ్ జురెల్ను వికెట్ కీపర్గా పరిశీలించే అవకాశం ఉంది.
ప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో పంత్ ఫామ్తో ఇబ్బంది పడుతున్న క్రమంలో సంజూ శాంసన్ బ్యాటర్గా వికెట్ కీపర్గా రాణిస్తున్నాడు. ఇదే సీజన్లో రెండు సార్లు సెంచరీలు చేసిన శాంసన్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ తర్వాత ప్రధాన కీపర్గా తన స్థానాన్ని పదిల పరుచుకున్నాడు.
భారత్ చివరిసారిగా జనవరిలో న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడింది. ఆ సిరీస్లో పంత్ను జట్టులోకి తీసుకున్నారు, కానీ పక్కటెముకల గాయం కారణంగా సిరీస్ ప్రారంభానికి ముందే అతను వైదొలగాల్సి వచ్చింది, అతని స్థానంలో జూరెల్ను ఎంపిక చేశారు. పంత్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ పంత్ ఇప్పుడు మరోసారి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అతను ఎనిమిది ఇన్నింగ్స్లలో 145.79 స్ట్రైక్ రేట్తో కేవలం 189 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పటి వరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున శాంసన్ ప్రదర్శనలతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అతను ఎనిమిది మ్యాచ్లలో రెండు సెంచరీలతో సహా 304 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచ కప్లో భారత్ విజయం సాధించడంతో అతని అద్భుతమైన ఫామ్ కొనసాగింది. ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్లో అతను 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎంపికయ్యాడు.
మరోవైపు రిషబ్ పంత్ తన చివరి వన్డేను ఆగస్టు 2024లో ఆడాడు. అతను ఈ ఫార్మాట్లో 27 ఇన్నింగ్స్లలో 33.50 సగటుతో 871 పరుగులు రాబట్టాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. శాంసన్ 16 వన్డేలు ఆడి, ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలతో సహా 56.66 అద్భుతమైన సగటుతో 510 పరుగులు సాధించాడు. అతను ఆడిన చివరి వన్డే డిసెంబర్ 2023లో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగింది. అక్కడ అతను 78 పరుగుల విజయంతో పాటు 114 బంతుల్లో 108 పరుగులు చేశాడు.
భారత్ 2027 వన్డే ప్రపంచ కప్ కోసం సన్నాహాలు ప్రారంభించబోతోంది. వన్డే ప్రపంచకప్లో రిషబ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్ ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ఆతిథ్యం ఇవ్వనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
iPhone 18 Pro ఫోన్ ఈ ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. డిజైన్ లీక్!
Hyderabad, Telangana:iPhone 18 Pro Leak: యాపిల్ మొబైల్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.. ఎందుకంటే కంపెనీ ఎప్పుడు ఫ్లాగ్షిప్ రేంజ్లోనే స్మార్ట్ఫోన్స్ను విడుదల చేస్తూ వస్తుంది. ముఖ్యంగా గతంలో విడుదల చేసిన అన్ని స్మార్ట్ ఫోన్స్ అత్యంత బడ్జెట్ లోనే విడుదలయ్యాయి. అయితే, ప్రతి ఏడాది ఈ కంపెనీ కొత్త సిరీస్ ను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని ఇలాగే కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా iPhone 18 సిరీస్ను విడుదల చేయబోతోంది. విడుదలకు ముందే iPhone 18 Pro స్మార్ట్ఫోన్కు సంబంధించిన డిజైన్స్ వివరాలు లీక్ అయ్యాయి. దీన్నిబట్టి చూస్తే ఈసారి విడుదల కాబోయే ఈ మొబైల్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. ముఖ్యంగా డిజైన్ పరంగా చాలా అత్యద్భుతంగా ఉంటుందని లీకైన వివరాలు చెబుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ iPhone 18 Pro స్మార్ట్ఫోన్ సెప్టెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఐఫోన్ 18 ప్రో ఫోన్లో ముందు భాగంలో కనిపించే డైనమిక్ ఐలాండ్ పరిమాణం తగ్గనుండటం ప్రధానాకర్షణగా నిలవనుంది. త్వరలో విడుదల కాబోయే ఈ మొబైల్ ఐలాండ్ కేవలం 25 నుంచి 30 శాతం వరకు చిన్నదిగా కనిపిస్తూ ఉండబోతోంది. దీనికోసం యాపిల్ సంస్థ వినూత్నంగా లేజర్ మైక్రో డ్రిల్లింగ్ టెక్నాలజీని వినియోగించినట్లు సమాచారం. అంతేకాకుండా ఫేస్ ఐడికి సంబంధించిన ఇన్ఫ్రారెడ్ ఇల్యూమినేటర్ను డిస్ప్లే కింది భాగంలో అమర్చబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇవే కాకుండా ఈ మొబైల్లో భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం..
అయితే, డైనమిక్ ఐలాండ్ మార్చడం వల్ల డిస్ప్లే మరింత పెద్దగా కనిపించడమే కాకుండా.. స్క్రీన్ పరిమాణం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.. దీని కారణంగా చూసేవారికి స్క్రీన్ పైభాగం పూర్తిగా ప్రీవియంగా కనిపిస్తుంది. డిజైన్ మార్పులతో పాటు ప్రాసెసింగ్లో కూడా అనేకమార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ ఆపిల్ సొంతంగా తయారు చేసిన A20 చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. మునుపటి మోడల్స్ కంటే మెరుగైన ప్రాసెసింగ్తో పాటు అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వెనక భాగంలో డిజైన్ ఇటీవల విడుదలైన పాత ఐఫోన్ 17 ప్రోకి సమానంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
ఈ యాపిల్ ఐఫోన్ 18 సిరీస్(iPhone 18 Pro)లో భాగంగా కొన్ని రకాల కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, దీనిని సెప్టెంబర్ నెలలో ప్రస్తుత CEO కొనసాగుతున్న టిమ్ కుక్ సారధ్యంలో.. ఈ సిరీస్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇందులో ప్రత్యేకంగా కంపెనీ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనే కొత్త కెమెరా ఫీచర్తో విడుదల చేయబోతోంది. ఈసారి విడుదల కాబోయే యాపిల్ మొబైల్ డిజైన్ పరంగా కాకుండా ఫంక్షనాలిటీ పరంగా కూడా వినియోగదారులను చాలా వరకు ఆకట్టుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అతి త్వరలోనే యాపిల్ కంపెనీ నుంచి ఈ సిరీస్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vemulawada: రాజన్న క్షేత్రంలో అద్భుతం.. వేములవాడలో కొలువుదీరనున్న భారీ శివ విగ్రహం!
Hyderabad, Telangana:Vemulawada Shiva Statue Telugu News: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న క్షేత్రం త్వరలో సరికొత్త ఆధ్యాత్మిక వెలుగులు దిద్దుకోబోతోంది. భక్తుల కొంగుబంగారమైన రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాలు, చేపట్టిన ఆధునీకరణ పనులతో కొత్త రూపును సంతరించుకుంటుంది. ముఖ్యంగా పర్యాటక అభివృద్ధిలో భాగంగా చేపట్టిన మినీ ట్యాంకు బండి పనులు శరవేగంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్న భారీ శివ విగ్రహం పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి..
ఈ విగ్రహం కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాకుండా.. అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా రూపుదిద్దుకుంటోంది. గగనతలం వైపు చూస్తూ.. జటాజూటధారిగా, అత్యంత గంభీరమైన ముద్రలో పరమేశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వడం ఈ దేవాలయానికి తలమానికంగా మారబోతోంది. భక్తుల దృష్టిని ఆకర్షిస్తూ.. ఇప్పటికే ఈ విగ్రహం స్థానికులలో.. యాత్రికులలో భారీ అంచనాలను రేకెత్తించింది.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల వల్ల వేములవాడ క్షేత్రం కేవలం భక్తి కేంద్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందబోతోంది. విగ్రహం చుట్టు విద్యుత్ దీపాలను అలంకరించడమే కాకుండా పచ్చటి లాన్లు, భక్తుల విశ్రాంతి కోసం నిర్మిస్తున్న వాకింగ్ ట్రాకులు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాయి. అంతేకాకుండా సాయంత్రం వేళల్లో ఈ శివ విగ్రహం వద్ద లైటింగ్ ప్రదర్శనలు భక్తులకు మరి ఎంతో కనువిందు చేయబోతున్నాయి.
Also Read: Bandi Sanjay: పక్కా ప్లాన్ ప్రకారం చోరీ.. కరీంనగర్ జ్యువెల్లరీ ఘటనపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
రాబోతున్న కొద్ది రోజుల్లోనే ఈ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుండడంతో వేములవాడకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు సైతం భావిస్తున్నారు. దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆశీస్సులతో పాటు శివ తత్వాన్ని ప్రతిబింబించే ఈ విగ్రహంతో పర్యాటక పరంగా మరింత ఉన్నత స్థానంలో నిలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. క్షేత్ర పరిసరాలను అందంగా తీర్చిదిద్దడమే కాకుండా.. ఇప్పుడు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంపొందించేలా ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు..
Also Read: Bandi Sanjay: పక్కా ప్లాన్ ప్రకారం చోరీ.. కరీంనగర్ జ్యువెల్లరీ ఘటనపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Giant Python Video: కొండచిలువతో సాహసం.. కాళ్లను గట్టిగా చుట్టేసిన పాము.. వీడియో!
Hyderabad, Telangana:Giant Python Wraps Viral Video Watch Now: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి.. మరీ ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టక మానదు.. భారీ కొండచిలువ ఒకటి ఒక వ్యక్తి కాళ్ళను గట్టిగా చుట్టేసి.. అతన్ని ప్రాణాపాయ స్థితిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక వ్యక్తి తన రెండు కాళ్లకు భారీ కొండచిలువ చుట్టుకొని ఉండటాన్ని మీరు క్లియర్ గా చూడొచ్చు.. ఆ పాము తన కండరాల శక్తితో ఆ వ్యక్తిని నలిపేయడానికి ప్రయత్నిస్తుండగా.. అతను ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఒకవైపు పాము తన పట్టును మరింత బిగిస్తుంటే.. మరోవైపు ఆ వ్యక్తి ఏ మాత్రం భయపడకుండా.. చాలా చాకచక్యంగా పాము తలభాగాన్ని పట్టుకొని.. దానిని తన శరీరం నుంచి వేరు చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉండడం మీరు చూడొచ్చు. అతని ముఖంలో కనిపిస్తున్న కంగారుతో పాటు అతడున్న పరిస్థితులు ఎంత ప్రమాదకరమో వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది..
ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. ఒక్క క్షణం ఆలస్యమైనా ప్రాణాలకే ప్రమాదం.. అసలు ఇలాంటి సాహసం ఎందుకు? అంటూ చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయడం మీరు గమనించవచ్చు. వన్యప్రాణులతో పెట్టుకోవడం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. పాములు ఎంత నిశ్శబ్దంగా వేటాడుతాయో.. ఒకసారి పట్టుకుంటే ఎంతటి శక్తిని ఉపయోగించి వేటాడుతాయో అన్నది ఈ వీడియో స్పష్టం చేస్తోంది..
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
కొండచిలువలు చాలా శక్తివంతమైనవి, ప్రమాదకరమైనవి.. ఇవి తన ఆహారాన్ని గట్టిగా చుట్టేసి.. ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు స్వయంగా పాములను పట్టుకోవడానికి లేదా వాటితో ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి ప్రయత్నించడం అస్సలు మంచిది కాదని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతూ ఉన్నారు. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే.. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించడమే కాకుండా.. మీకు దగ్గరగా ఉన్న ఇతరుల సహాయం తీసుకోవడం చాలా మంచిది. ఏ చిన్న పొరపాటు చేసిన అది ప్రాణాలకే ముప్పుగా మారే అవకాశాలున్నాయి..
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: వామ్మె.. ఇంటి బీరువాలో భారీ కింగ్ కోబ్రాలు.. చూస్తేనే వణుకుపుడుతోంది..
Hyderabad, Telangana:Two King Cobras Viral Video Watch: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులతో పాటు పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా నెట్టింట ఒక వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక సాధారణ ఇంటిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో? అసలు ఈ వీడియోలో పాములు ఎలా వచ్చాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా మనం బీరువాను దుస్తులతో పాటు విలాసవంతమైన వస్తువులను దాచుకోవడానికి వినియోగిస్తూ ఉంటాము.. అయితే, ఒక ఇంటి యజమాని తన బీరువాను తెరవగానే ఊహించని దృశ్యాలు కనిపించాయి. బీరువా తెరిచిన వెంటనే అందులో దాగివున్న రెండు భారీ నాగుపాములు పడగ విప్పి దర్శనం ఇవ్వడంతో ఆ ఇంటి యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు సైతం భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
ఈ వీడియోలో ఆ పాములు చాలా ప్రశాంతంగా.. బీరువాలోని దుస్తుల మధ్య సేద తీరుతున్నట్లు మీరు గమనించవచ్చు. యజమాని తలుపులు తీయగానే.. అవి అప్రమత్తమై పడకవిప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మీరు చూడొచ్చు. అదృష్టవశాత్తూ.. యజమాని తక్షణమే అప్రమత్తం అవ్వడంతో పేను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ బీరువాలోకి పాములు ఎలా వచ్చాయని అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు..
ఈ వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తాది. అంతేకాకుండా వారు ఈ వీడియో పై రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. అసలు అవి బీరువాలోకి ఎలా వెళ్లాలి? చూస్తుంటేనే భయమేస్తోంది.. ఇంటి యజమాని ప్రాణాలతో బయటపడటం నిజంగా అదృష్టం అంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది అడవికి దగ్గరగా ఉండేవారు ఇళ్లలో పాములు రాకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు..
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
పాములకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు.. కంగారు పడకుండా వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు ఎండాకాలంలో పాములు చల్లటి, చీకటి ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో బీరువాలతో పాటు బూట్ల స్టాండ్లు, పాత వస్తువులు ఉంచే ప్రదేశాలను తరచుగా శుభ్రం చేసుకోవడం, తనిఖీలు చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు..
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lassi Viral Video: లస్సీలో మూత్రం పోసి విక్రయిస్తున్న బాలుడు.. వైరల్ వీడియో..
Hyderabad, Telangana:Lassi Contamination Viral Video Watch: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఆహార పదార్థాల్లో కల్తీ అనేది కొత్తేమీ కాదు కానీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మాత్రం ప్రజలను తీవ్ర అసహనంతో పాటు భయాందోళనకు గురిచేస్తుంది. ఓ బాలుడు లస్సిలో మూత్రం పోసి.. అదే విషతుల్యమైన డ్రింకును కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. సదరు బాలుడు ఎంతో నిర్లక్ష్యంగా.. లస్సీని సర్వ్ చేస్తున్నాడు.. కస్టమర్లకు ఇచ్చే లస్సి గ్లాసుల్లో అతను మూత్రం కలిపి.. ఏమీ తెలియనట్లుగా.. వారికి సర్వ్ చేస్తున్నాడు.. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ అమానుష్యాన్ని గమనించి.. వెంటనే తమ స్మార్ట్ ఫోన్స్ లో వీడియోను తీయడం ప్రారంభించారు. ఆ పిల్లాడి చేస్తాలను చూసి కంగుతిన్నవారు.. వెంటనే అతన్ని నిలదీసి అడుగుతుండడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. అయితే, ఆ పిల్లాడు ఏమీ తెలియనట్టు.. ఎటువంటి పాశ్చాతాపం లేకుండా అమాయకపు నటన ప్రదర్శించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. అతని నిర్లక్ష్యం చూసి వీడియో తీస్తున్న వారు కూడా షాక్ అయిపోయారు..
వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది క్షణాల్లోని వైరల్ అవ్వడం ప్రారంభమైంది. ఇది చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆహారంతో ఇలా చెలగాట మాడటం ఎంతవరకు మంచిది? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీధి వ్యాపారుల వద్ద దొరికే ఆహార పదార్థాల పట్ల ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని.. ఇలాంటి కల్తీ ఆహారాల వల్ల ఊహించని రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
ఈ ఘటన ఎక్కడ జరిగిందని విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ.. కానీ ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది.. రోడ్డు పక్కన దొరికే ఆహార పదార్థాల నాణ్యత పై ఆహార భద్రత అధికారులు కఠినమైన నిగా ఉంచాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రజల ప్రాణాలతో ఇలాంటివారు చలగాటమాడుతూనే ఉంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలని సోషల్ మీడియా వినియోగదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana: దేవదాయ శాఖలో భారీగా ఈవో పోస్టులు.. 190 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
Karimnagar, Telangana:Telangana Endowment Department Recruitment Telugu News: రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణను మరింత పతిష్టం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలోని సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 190 కార్య నిర్వహణ అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎన్ని ఈవో (EO) పోస్టులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎలా వీరి నియామకాలను చేపట్టబోతోంది? దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రేడ్లలో ఖాళీగా ఉన్న ఈవో పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆలయాల్లో పాలన సౌలభ్యంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ, భక్తులకు మెరుగైన సేవలందించే లక్ష్యంగా ఈ పోస్టుల మంజూరు జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గుడిలను అభివృద్ధి చేసే లక్ష్యంతోనే మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఈ నియామకాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రత్యేకమైన ప్రాధాన్యత లభించింది. జిల్లాకు మొత్తం 2 గ్రేడ్ వన్ EO పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఒకటి కరీంనగర్ పట్టణానికి.. మరొకటి సిరిసిల్ల ప్రాంతానికి కేటాయించినట్లు అధికారులు నోటిఫికేషన్లు క్లుప్తంగా పేర్కొన్నారు. జిల్లాలోని ప్రధాన దేవాలయాల పరిపాలన లో ఈ నియామకాలు కీలక మార్పులు తీసుకురానన్నాయి.. ఆలయ అభివృద్ధికి ఇవి తోడ్పడతాయని స్థానికులతో పాటు ఇతర అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Cooking Oil Prices Hike: సామాన్యుడి జేబుకు మంట.. నిన్న గ్యాస్.. నేడు వంట నూనె.. భారీగా పెరిగిన ధరలు
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అధికారులతో పాటు నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న EO పోస్టుల నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పోస్టులు మంజూరు కావడంతో.. అభ్యర్థులు ఇప్పటినుంచి పోటీ పరీక్షల తయారీలో నివంతం అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ భారీ నియామకాల వల్ల దేవాదాయ శాఖలో పరిపాలనపరమైన ఇబ్బందులు తొలగిపోయి.. వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.. అతి త్వరలోనే సిలబస్తో పాటు వయోపరిమితి, దరఖాస్తు విధానం వంటి వివరాలతో కూడిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Cooking Oil Prices Hike: సామాన్యుడి జేబుకు మంట.. నిన్న గ్యాస్.. నేడు వంట నూనె.. భారీగా పెరిగిన ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల ఎగిరి గంతేసే వార్త..డీఏతో పాటు HRA పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్?!
Hyderabad, Telangana:8th Pay Commission HRA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఇటీవలే శుభవార్త తెలియజేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని భర్తీ చేసేందుకు వీలుగా ఇటీవల కరువు భత్యం (DA) 60 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. మరోవైపు, ప్రభుత్వ ఉద్యోగుల జీవన వ్యయాలు, ఇంటి అద్దెను తీర్చడానికి ఇచ్చే HRAలో వచ్చిన ముఖ్యమైన మార్పులు చేయబోతున్నారు.
8వ వేతన సంఘం అమలు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని ఇటీవల సవరించిన కేంద్ర ప్రభుత్వం డీఏలో 2 శాతం పెంచగా.. దీంతో వారి మొత్తం కరువు భత్యం 60 శాతానికి చేరింది. ఈలోగా కరువు భత్యంతో పాటు ప్రభుత్వం హెచ్ఆర్ఏను కూడా పెంచుతుందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీనికి సమాధానం అవును. ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనల వివరణ ఇక్కడ ఉంది.
ఇటీవలి కాలంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, వారి దృష్టి ప్రధానంగా ఫిట్మెంట్ అంశం, మూల వేతనంపై కేంద్రీకృతమై ఉంది. అయితే, ఉద్యోగి చేతికి అందే నెలసరి వేతనంలో అనేక అలవెన్సులు చేరి ఉంటాయి.
'ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్' (AICPI) ఆధారంగా కరువు భత్యం (DA) ఏడాదికి రెండు సార్లు సవరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం కలిగించి, పెరుగుతున్న జీవన వ్యయాన్ని తట్టుకోవడంలో వారికి సహాయపడటమే దీని లక్ష్యంగా వస్తుంది.
ఇటీవల, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు (రైల్వే, రక్షణ రంగ ఉద్యోగులతో సహా) ఇచ్చే కరువు భత్యం (డీఏ)లో మార్పులను ప్రకటించింది. దీని ప్రకారం.. మూల వేతనంలో డీఏను 58 శాతం నుంచి 60 శాతానికి పెంపుదల చేశారు. ఈ మార్పు 2026 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులు అందుకునే జీతంలో డీఏ, హెచ్ఆర్ఏ అనేవి ప్రధానంగా రెండు ముఖ్యమైన భాగాలు వస్తున్నాయి. డీఏ నేరుగా ఉద్యోగి మూల వేతనంపై ఆధారపడి ఉండగా, హెచ్ఆర్ఏ అనేది ఇంటి అద్దె ఖర్చుగా పరిగణిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. డీఏ ఒక నిర్దిష్ట పరిమితిని (ఉదాహరణకు 50% దాటినప్పుడు) మించినప్పుడు, హెచ్ఆర్ఏ రేటు కూడా పెంచుతారు. కరువు భత్యం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే లభిస్తుండగా.. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కలిపి జీతంగా చెల్లిస్తారు.
Also Read: MI Vs CSK Match: ఐపీఎల్ నుంచి తప్పుకోనున్న తొలి టీమ్ ముంబై..CSK జట్టుపై చిత్తుగా ఓడింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hamsa Mahapurusha Rajayoga: జూన్ 2 నుంచి హంస మహా పురుష రాజయోగం.. ఈ 4 రాశుల వారికి ఇక పండగే!
Hyderabad, Telangana:Hamsa Mahapurusha Rajayoga Effect On Zodiac: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహాన్ని అదృష్టానికి శ్రేయసుకు సూచికగా పరిగణిస్తారు. జూన్ రెండవ తేదీన గ్రహాలకు అధిపతిగా భావించే గురు గ్రహం తన ఉచ్ఛరాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది.. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన హంస మహాపురుష రాజయోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో సుఖసంతోషాలు రావడం ప్రారంభమవుతాయి.. ముఖ్యంగా ఆయా రాశుల వారికి కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయం కొన్ని రాశుల వారికి చాలా లాభదాయకంగా ఉండబోతోంది.
ఈ రాశుల వారికి జాక్పాట్..
కర్కాటక రాశి
గురు గ్రహ సంచార ప్రభావంతో కర్కాటక రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో జీవితంలో పెద్ద పెద్ద మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బులు పొంది.. డబ్బులను గణనీయంగా పొదుపు చేయగలుగుతారు. అంతేకాకుండా కొత్త ఆదాయం మార్గాలు కూడా రావడంతో ఆర్థిక చింతల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొత్త వ్యాపారాలతో పాటు ప్రాజెక్టులను ప్రారంభించాలని చూస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా ఉత్తమంగా ఉండబోతుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వృశ్చిక రాశి
హంస మహా పురుష రాజయోగ ప్రభావంతో వృశ్చిక రాశి వారికి అదృష్టం విపరీతంగా పెరగబోతుంది.. ముఖ్యంగా వీరికి అదృష్టం పూర్తిగా తోడు ఉండబోతోంది కాబట్టి మీరు చేసే ప్రతి పని అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా తండ్రుల నుంచి అద్భుతమైన ఆస్తులతో పాటు ఇతర లగ్జరీ వస్తువులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు అనేక మార్గాల ద్వారా ఈ సమయంలో డబ్బులు అందుకోబోతున్నారు. ఈ సమయంలో పాత పెట్టుబడుల నుంచి చేతికి భారీ మొత్తంలో డబ్బులు రాబోతున్నాయి. ఉద్యోగాల్లో పదోన్నతులతో పాటు జీతాలు పెరిగి కొత్త ఇల్లులు కొనుగోలు చేస్తారు. దీంతోపాటు దీర్ఘకాలంగా ఉన్న అప్పుల భారం తగ్గడంతో మానసికంగా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తులారాశి
ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావం తులారాశి వారికి చాలా బాగుండబోతోంది ముఖ్యంగా వృత్తి జీవితంలో కొత్త మహిళా ఏర్పడబోతోంది. కార్యాలయంలో మీ పనికి అధికారులు అభినందనలు కూడా తెలుపుతారు. అంతేకాకుండా చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో మంచి కంపెనీల నుంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి.. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అలాగే వృత్తి జీవితంలో పెద్ద విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మీన రాశి
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా గురు గ్రహం అధిపతి కావడం వల్ల వీరికి అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి.. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులకు భారీ మొత్తంలో సంపాదనలు లభించబోతున్నాయి.. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అద్భుతమైన లాభాలు పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకున్న వ్యక్తులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంతో పాటు శాంతి కూడా నెలకొంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందడమే కాకుండా సంబంధాల్లో మాధుర్యం కూడా లభించబోతోంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Judge Suicide: తీర్పులు ఇచ్చే చేతులే ప్రాణాలు తీసుకున్నాయి.. జడ్జి అమన్ కుమార్ శర్మ సూసైడ్ మిస్టరీ!
Hyderabad, Telangana:What is Judge Aman Kumar Sharma Suicide Mistery: భార్యాభర్తల మధ్య గొడవలు ప్రస్తుతం తారస్థాయికి చేరుకుంటున్నాయి. అవి ఒకరిని హత్య చేయడమో లేదా తామే ఆత్మహత్య చేసుకోవడమో జరుగుతోంది. మొన్నే బాచుపల్లికి చెందిన వ్యక్తి భార్య ఆగడాలతో హుస్సేన్సాగర్లో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఘటన మరువక ముందే తాజాగా భార్య వేధింపులతో ఓ యువ జడ్జి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తీర్పులిచ్చే చేతులే స్వయానా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. యువ జడ్జి అమన్ కుమార్ శర్మ (30) సూసైడ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే 2 నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలోని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెప్తున్నారు. భార్య కూడా జ్యుడిషియల్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తుంది. 2021 ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ లో చేరిన అమన్ పలు క్రిమినల్, సివిల్ కేసులు విచారించారు. ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ సివిల్ జడ్జిగా కూడా పనిచేశారు. అయితే భార్య భర్తల మధ్య గొడవల కారణంగానే అమన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి ఇతర బంధువులు కూడా చెబుతున్నారు.
ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుంది?
ఢిల్లీలోని గ్రీన్ పార్కులో 30 ఏళ్ల యువ జడ్జ్ ఆత్మహత్య ఘటన మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. ప్రధానంగా మానసిక ఒత్తిడి, వైవాహిక జీవితంలో కలహాల కారణంగానే తను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. ఇంతలోనే శనివారం మధ్యాహ్నం 1:45 గంటలకు ఉన్నటుండి అమన్ బావమరిది శివం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంటి బాత్రూంలో అమన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఘటన అనంతరం నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
ముందు రోజు రాత్రి 10 గంటల సమయంలో అమన్ తన తండ్రితో ఫోన్ చేసి మాట్లాడాడు. తాను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు, వైవాహిక గొడవల వల్ల సతమతమవుతున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో వెంటనే అల్వార్ నుంచి తండ్రి ఢిల్లీకి రాత్రి 12 గంటల సమయంలోనే బయలుదేరారు. కొడుకుని చూసి నచ్చజెప్పాడు. అయితే ఇంట్లో భార్యకే పూర్తి అధికారం ఉందని.. ఆమె ప్రతి మాటకు నేను వినాల్సి వస్తుంది.. లేకపోతే గొడవలు ఎక్కువవుతున్నాయి. ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుందని చెప్పుకు వచ్చాడు. పరిస్థితిని చక్కదిద్దడానికి తండ్రి ప్రయత్నించాడు. కోడలు తనను కూడా ఇంట్లోంచి వెళ్లిపోమని చెప్పింది, లేకపోతే పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయిస్తానని బెదిరించింది. అయితే కోడలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫోన్ చేయగా వారు కూడా నెంబర్ బ్లాక్ చేశారు. వెంటనే భార్య మామను పిలిపించి పరిస్థితిని తెలియజేశాడు. ఇక అతను కూడా నేనేం చేయలేనని వెనతిరిగిపోయాడు. ఇద్దరు మధ్య గొడవ తారస్థాయికి చేరుకుంది.
Also Read: బర్గి డ్యామ్లో ఘోర ప్రమాదం.. 30 మందితో వెళ్తున్న క్రూయిజ్ బోల్తా.. ఏడుగురి మృతదేహాల వెలికితీత!
Also Read: అర్ధరాత్రి హైవోల్టేజ్ డ్రామా.. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ స్ట్రాంగ్ రూమ్ వద్ద మమత రచ్చ! వీడియో
కాసేపటి తర్వాత కూడా అమన్ ఒక గదిలో.. భార్య మరో గదిలో ఉంది. అయినా ఆమె గట్టిగట్టిగా కేకలు వేస్తూ అరుస్తూనే ఉంది. కాసేపటికి తండ్రి అమన్ ఎక్కడ అని అడగ్గా ఆమె నాకు తెలియదని చెప్పింది. వెంటనే మొబైల్ తో యాప్ కాల్ చేశాడు. బాత్రూంలో మోగింది.. డోర్ ఎంతకీ తెరచుకోవడం లేదు. వెంటనే డోర్ పగలగొట్టి చూడగా తన భార్య స్కార్ప్తోనే అమన్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. ఈ కేసు దర్యాప్తులో వైవాహిక కలహాలే కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
MP Dharmapuri Arvind: కేసీఆర్ ను తిట్టించడానికే కవిత కొత్త పార్టీ.. ఎంపీ ధర్మపురి సంజయ్ కీలక వ్యాఖ్యలు..
Hyderabad, Telangana:Mp dharmapuri Arvind fires on kalvakuntla Kavitha over new party paJeevan reddy: రేవంత్ పోవాలే.. కేసీఆర్ రావాలే.. మరోసారి సీఎంను ఏకీపారేసిన జీవన్ రెడ్డి..
Hyderabad, Telangana:Jeevan reddy slams on cm revanth reddy over fake promisesMI Vs CSK Match: ఐపీఎల్ నుంచి తప్పుకోనున్న తొలి టీమ్ ముంబై..CSK జట్టుపై చిత్తుగా ఓడింది!
Chennai, Tamil Nadu:MI Vs CSK Match 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నేడు జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై తమ చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఘన విజయం సాధించింది. అయితే ఈ లీగ్లో ముంబై ఇండియన్స్కు ఇది ఏడో పరాజయం కావడం గమనార్హం. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నట్లే పరిస్థితి కనిపిస్తుంది. వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ టీమ్ అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
ప్రస్తుత లీగ్లో ఆడిన 9 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ జట్టు 2 సార్లు గెలుపొందగా.. 7సార్లు ఓటమిని చవిచూసింది. దీంతో ఆ టీమ్ ప్లేఆఫ్స్ అర్హత సాధించడం దాదాపుగా అసాధ్యమే అని చెప్పవచ్చు. లీగ్ దశ నుంచి తప్పుకొనే తొలి టీమ్గా ముంబై నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో గెలుపొంది.. 5 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. అయితే సీఎస్కే జట్టు తదుపరి మ్యాచ్ ఫలితాల ద్వారా దాని ప్లేఆఫ్స్ అర్హత సాధించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ సగానికి పైగా మ్యాచ్లు పూర్తవ్వగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ జట్లు ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే కనీసం 7 లేదా 8 మ్యాచ్ల్లో కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే 14 లేదా 16 పాయింట్లను సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవైనా రెండు జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం సమానంగా ఉంటే.. వాటి నెట్ రన్రేట్ మెరుగ్గా ఉన్న ఆధారంగా ప్లేఆఫ్స్కు చేరుతాయి. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే 12 పాయింట్లను సాధించినందున, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్లకు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువ.
శనివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బ్యాటింగ్ ఎంచుకోగా.. విల్ జాక్స్ తక్కువ స్కోరుకే అవుటైనా ఫర్వాలేదనిపించేలా ఆరంభాన్ని ఇచ్చాడు. సగం ఆట ముగిసేసరికి, ముంబై జట్టు 180కి పైగా పరుగులు చేస్తుందని అనిపించింది. అయితే, సూపర్ కింగ్స్ పద్ధతిగా పరుగులు చేయడాన్ని నియంత్రించి, ముంబై ఇండియన్స్కు బ్రేకులు వేసింది. దీంతో ముంబై జట్టును 159 పరుగులకే పరిమితం చేసింది.
లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో సంజు సామ్సన్ను 11 పరుగులకే అవుట్ చేసి ముంబై ఇండియన్స్ 'ఎల్లో ఆర్మీ'కి ఆరంభంలోనే దెబ్బకొట్టింది. కానీ, మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఉర్విల్ పటేల్, వేగంగా 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రుతురాజ్ గైక్వాడ్ (67*), కార్తీక్ శర్మ (54*) అజేయంగా 98 పరుగులు జోడించారు. ఇంకా 11 బంతులు, 8 వికెట్లు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్ తమకు ఏమాత్రం కలిసి రాలేదని, ఈ మ్యాచ్లో తమ ప్రదర్శన అన్ని విభాగాల్లోనూ వెనుకబడిందని పాండ్యా అభిప్రాయపడ్డాడు. "ఇది మా సీజన్ కాదు. వారు మాకంటే మెరుగ్గా ఆడారు. మెరుగ్గా బౌలింగ్ చేశారు. మెరుగ్గా ఫీల్డింగ్, బ్యాటింగ్ చేశారు. 180-190 పరుగులు ఒక మంచి స్కోరు అయ్యేది. మాకు కావాల్సిన మూమెంటమ్ లభించలేదు. మొత్తంగా చూస్తే, ఒక బౌలింగ్ యూనిట్గా వారు మాకంటే మెరుగ్గా ఉన్నారు. కానీ ఒక బ్యాటింగ్ యూనిట్గా మేము అంత గొప్పగా రాణించలేకపోయాము. మాకు అందుబాటులో ఉన్న బౌలింగ్ ప్రత్యామ్నాయాలతోనే మేము ముందుకు వెళ్లాము" అని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
