ఈబి5 వీసాతో అమెరికా గ్రీన్ కార్డ్ సులువుగా పొందవచ్చు- మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్
ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని పథకాల్లో పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు మల్లెల ఆదిత్య సోమాజిగూడ, ఎంతో మంది భారతీయులు తమ విలువైన భవిష్యత్తు కోసం అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటున్నారని సూచించారు. ఇలాంటి వారికి ఈబీ5 వీసా ఎంతో అనువుగా ఉంటుందని, ఈ వీసా ద్వారా అమెరికాలో వర్క్ పర్మిట్, నిబంధనలతో కూడిన గ్రీన్ కార్డ్ పొందవచ్చని, వచ్చే ఐదేళ్లలోగా శాశ్వత గ్రీన్ కార్డ్ పొందవచ్చని తెలిపారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
20 foot king cobra rescued video: సోషల్ మీడియాలో కోబ్రాల వీడియోలు ఇటీవల బాగా ట్రెండ్ అవుతున్నాయి. పాములు అంటేనేచాలా మంది భయంతో వణికిపోతారు. పొరపాటున ఎక్కడైన చీకట్లో తాడు కన్పించిన పామని భయపడిపోయే వారు చాలా మంది ఉంటారు. కోబ్రాలే డేంజర్ అంటే కింగ్ కోబ్రాల గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు. అవి చాలా డెంజర్గా ఉంటాయి. వీటి విషంలో సెకనుల వ్యవధిలో మనిషి చనిపోతారు. కింగ్ కోబ్రా విషం ముఖ్యంగా రక్త ప్రసరణ వ్యవస్థ,నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది.
దీంతో కింగ్ కోబ్రా కాటు వేసిన కొద్దిసేపటికి వ్యక్తి ప్రాణాలు కొల్పోతాడు. అడవులు, దట్టమైన కొండలు, చెరువులు మొదలైన ప్రాంతాల్లో ఎక్కువగా కింగ్ కోబ్రాలు ఉంటాయి. అవి ఇతర సర్పాలను తినేస్తాయి. గూడు కట్టుకుని ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఒక భారీ కింగ్ కోబ్రా జనావాసాల్లోకి వచ్చింది. అయితే.. వారు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో వెంటనే అతను రంగంలోకి దిగాడు.
ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది. ప్రస్తుతం భారీ కింగ్ కోబ్రా జనల మధ్యలోకి వచ్చింది. అక్కడి వారు స్నేక్ క్యాచర్ కు చెప్పడంతో చాకచక్యంగా దాన్ని పట్టుకొవడానికి ప్రయత్నించాడు. అప్పుడు అది పలుమార్లు అతనిపై దాడికి యత్నించింది. అతను కింగ్ కోబ్రా కాటు నుంచి తప్పించుకున్నాడు. మొత్తంగా కింగ్ కోబ్రా కొన్ని గంటల పాటుముప్పు తిప్పలు పెట్టింది.
Read more: Snake Video: అరె వావ్... తాడును చుట్టుకుని నాట్యం చేస్తున్న నాగుపాము.. అరుదైన వీడియో...
ఎంతో చాకచక్యంగా ప్రయత్నించి చిరవకు కింగ్ కోబ్రాను మెల్లగా తనతో తెచ్చుకున్న కర్రను ఉపయోగించి తన ఆధీనంలోకి తెచ్చుకుని బందించాడు. ఆ తర్వాత దగ్గరలోని అడవిలో తీసుకెళ్లి వదిలేశాడు. ఈ ఘటనను కొంతమంది వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్గా మారింది.
Actress Madhavi latha shocking comments on Samantha raj nidimoru second marriage: సమంతా రాజ్ నిడిమోరులు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తురులోని ఈషా ఫౌండేషన్ లో డిసెంబర్ 1న భూతశుద్ది క్రతువుతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వేడుక కొద్ది మంత్రి స్నేహితులు, దగ్గరి బంధువుల మధ్యలో సింపుల్గా జరిగింది. గతంలో జరిగిన కర్మలు మరల బాధించకుండా భూతశుద్ది క్రతువులో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లిజరిగిన నాలుగు రోజులకే సామ్ మరల షూటింగ్ కు వెళ్లారు. దీంతో సమంత డెడికేషన్ ను ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. సమంతకు అత్తింటి వారి నుంచి గ్రాండ్ గా వెల్ కమ్ లభించింది. తమకు ఇలాంటి కోడలు రావడం ఎంతో ఆనందంగా ఉందని రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పాపం.. సమంత రెండోపెళ్లి చేసుకున్న ఆనంద కొద్ది కాలం కూడా ఉండనీయకుండా కొంతమంది పనిగట్టుకుని ఆమెను ట్రోల్స్ చేసేపనిలో పడ్డారు. సమంత రాజ్ నిడిమోరును వల్లో వేసుకుందని, శ్యామిలీడేకు డైవర్స్ ఇచ్చేలా సామ్ ఒత్తిడి తీసుకొచ్చిందని కోంత మంది ట్రోల్స్ చేశారు. వారి కాపురంలో నిప్పులు పోసి రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుందని ఎవరికి నచ్చినట్లు వారు ఇష్టమున్నట్లు సమంత రెండో పెళ్లిపై ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా.. దీనిపై నటి, బీజేపీ మహిళ నేత మాధవీలత ఫైర్ అయ్యారు.
సమంత రెండోపెళ్లిపై ట్రోల్స్..
సమంత పెళ్లి చేసుకుంటే కొందరికి ఎందుకంత బాధ?.. ఆమె ఎవరిదో సంసారాన్ని కూల్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఒకరి జీవితాలు చెడగొట్టేవాళ్లు, విడాకులు ఇవ్వకుండానే మరోకరితో రొమాన్స్ లకు దిగే వాళ్లు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నవ్వొస్తుందన్నారు. ట్రోల్స్ చేస్తున్న వారు ఎవరు కూడా పవిత్రతలుకాదు కదా.. అంటూ గట్టిగానే ఇచ్చిపడేశారు.
అదే విధంగా.. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని, రుణాలు తీరిపోతే ఎవ్వరైన సరే విడిపోతారని మాధవీలత వ్యాఖ్యానించారు. “ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా?.. అంటూ మాధవీలత సెటైర్ లు వేశారు. సమంతపై అనవసరంగా విమర్శలు చేయడం తగదని తెల్చిచెప్పారు.
Read more: Prabhas: ప్రభాస్ హైట్తో ఆ విషయంలో చాలా ఇబ్బందిపడ్డా.!. బాంబు పేల్చిన బాలీవుడ్ బ్యూటీ ..
జేసీ ప్రభాకర్ రెడ్డితో గతేడాది ఫైటింగ్..
మరోవైపు మాధవీలత గతంలో తాడిపత్రిలో న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో గతేడాది జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్ పై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. దీంతో మాధవీలత వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా కొన్నిరోజులు రచ్చ నడిచింది. మాధవీలతపై తాడిపత్రిలో కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత రెండో పెళ్లి వ్యాఖ్యలతో మాధవీలత మరోసారి హాట్ టాపిక్ గా మారారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook