సింగరేణి భవన్ ముందు లెఫ్ట్ పార్టీల ధర్నా
Hyderabad, Telangana:బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నేతలు లకడికాఫుల్ లోని సింగరేణి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబాశివ రావు, ఇతర సీపీఐ నేతలు. బొగ్గు బ్లాక్ లను నేరుగా సింగరేణి కాలారీస్ కు అప్పగించాలని డిమాండ్.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్ వార్తలను ఖండించిన బీసీసీఐ!
Mumbai, Maharashtra:Rohit Sharma Retirement BCCI: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎట్టకేలకు స్పందించింది. ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్ తర్వాత సెలెక్టర్లు రోహిత్ను పక్కన పెట్టాలని చూస్తున్నారని, లార్డ్స్ మైదానంలో జరిగే మ్యాచ్ ఆయనకు చివరిది కానుందంటూ వచ్చిన వార్తలను బీసీసీఐ ఖండించింది.
అయితే, బోర్డు కార్యదర్శి దేవాజిత్ సైకియా ఇచ్చిన వివరణ రోహిత్ అభిమానులకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు రోహిత్ భవిష్యత్తుపై పెద్ద హెచ్చరికగానే కనిపిస్తున్నాయి.
సెలెక్టర్ల చేతుల్లోనే నిర్ణయం!
"రోహిత్ శర్మ జట్టులో ఉన్నంత కాలం భారత్కు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడు" అని సైకియా స్పష్టం చేశారు. పైకి ఇది రోహిత్కు మద్దతుగా నిలిచినట్లు అనిపించినా, ఇందులో ఎంతో వ్యూహాత్మక పదజాలం దాగి ఉంది. రాబోయే వన్డే సిరీస్కు రోహిత్ను ఖచ్చితంగా ఎంపిక చేస్తామని బోర్డు గ్యారెంటీ ఇవ్వలేదు. 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ కీలక భాగస్వామి అని ఎక్కడా ప్రస్తావించలేదు. యువ ఆటగాళ్ల కంటే రోహిత్కే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేయలేదు. అంటే, "జట్టులో ఉన్నంత కాలం" అనే మాట ద్వారా రోహిత్ కెరీర్ పొడిగింపును బోర్డు పూర్తిగా సెలెక్టర్ల నిర్ణయానికే వదిలేసింది.
భారత క్రికెట్లో సీనియర్ ఆటగాళ్ల కెరీర్ ముగింపు దశకు వచ్చినప్పుడు సెలెక్టర్లు ఇలాంటి దౌత్యపరమైన భాషను ఉపయోగించడం కొత్తేమీ కాదు. గతంలో పలువురు దిగ్గజాల విషయంలోనూ ఇదే జరిగింది. చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే విషయానికొస్తే.. 2022లో వీరిని టెస్ట్ జట్టు నుండి తొలగించినప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడి ఫామ్ నిరూపించుకోమన్నారు. వాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు, కానీ ఆ పునరాగమనం ఎంతో కాలం నిలవలేదు. ప్రదర్శన తగ్గగానే ఎలాంటి వీడ్కోలు మ్యాచ్లు లేకుండానే వారిని పక్కన పెట్టేశారు.
అలాగే శిఖర్ ధావన్ రిటైర్మెంట్ కూడా మరింత నిశ్శబ్దంగా సాగింది. సెలెక్టర్లు ఆయనకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు, కానీ యువ ఓపెనర్లకు అవకాశాలిస్తూ ధావన్ను క్రమంగా పక్కన పెట్టేశారు. ఇటీవల షమీ విషయంలోనూ ఫిట్నెస్, ఫామ్ గురించే చర్చ నడిచింది. దేశీయ క్రికెట్లో రాణించినప్పటికీ జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకోవడం ఆయనకు అంత సులువు కాలేదు.
రోహిత్ హోదా వేరు.. కానీ కాలం మారుతోంది!
రోహిత్ శర్మ కేవలం ఒక సాధారణ ఆటగాడు కాదు. ఆధునిక వన్డే క్రికెట్ స్వరూపాన్ని మార్చిన గొప్ప ఓపెనర్, ఐసీసీ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్. అయితే, ఎంతటి ఘనమైన చరిత్ర ఉన్నా వర్తమాన ప్రదర్శనే జట్టులో స్థానాన్ని నిర్దేశిస్తుంది. ప్రస్తుతం జట్టులో స్థానం కోసం యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. భవిష్యత్తు ప్రపంచకప్ కోసం బలమైన జట్టును నిర్మించాలంటే ప్రతి స్థానం ఎంతో కీలకం.
తదుపరి జట్టు ప్రకటనతోనే అసలు క్లారిటీ!
బీసీసీఐ ప్రకటన ప్రకారం లార్డ్స్లో జరిగే మ్యాచ్ రోహిత్కు చివరిది కాకపోవచ్చు. రోహిత్ శర్మ తన అంతర్జాతీయ వీడ్కోలుపై ఎలాంటి ప్రకటన చేయకముందే ఆయనపై బలవంతపు ముగింపును రుద్దకుండా బోర్డు అడ్డుకుంది. కానీ, ఆయనకు కొత్త ఇన్నింగ్స్ వాగ్దానం కూడా లభించలేదు.
రాబోయే వన్డే సిరీస్కు రోహిత్ను ఎంపిక చేస్తారా? లేక 'విశ్రాంతి' పేరుతో రొటేషన్ పాలసీకి పరిమితం చేస్తారా? అనేదే ఇప్పుడు మిగిలి ఉన్న అసలు ప్రశ్న. బీసీసీఐ ఇచ్చే హామీల కంటే, తదుపరి జట్టు ఎంపికే రోహిత్ భవిష్యత్తుకు అసలైన సమాధానం చెప్పనుంది.
Also Read: డోపింగ్ వివాదంలో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్కు షాక్..3 నెలల నిషేధం విధించిన ఐసీసీ!
ALso REad; FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్స్కు రంగం సిద్ధం..ఏ టీమ్కి ట్రోఫీ గెలిచే సత్తా ఉంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Saturday Astrology: శనివారం ఈ పనులు చేస్తే దురదృష్టం వెంటాడుతుందా? ఈ పనులు ఇప్పుడే ఆపేయండి!
Hyderabad, Telangana:Saturday Dos and Don'ts: హిందూ సంప్రదాయంలో శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజును శని దేవునికి అంకితం చేస్తారు. శని దేవుడి అనుగ్రహం కోసం భక్తులు ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తుంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం కొన్ని పనులు చేయడం వల్ల శని దేవుని ఆగ్రహానికి గురై, ఆర్థికంగా, కుటుంబపరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు. శనివారం రోజున అస్సలు చేయకూడని ఆ 5 ముఖ్యమైన పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1) జుట్టు, గోళ్లు కత్తిరించుకోవడం
శనివారం నాడు జుట్టు కత్తిరించడం, గడ్డం గీసుకోవడం లేదా గోళ్లు కత్తిరించుకోవడం వంటి పనులు చేయకూడదని పెద్దలు చెబుతారు. ఇలా చేయడం వల్ల శని దోష ప్రభావం పెరిగి, చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయని, ఆర్థిక నష్టాలు సంభవిస్తాయని జ్యోతిష్య విశ్వాసం.
2) ఇనుప వస్తువులు కొనడం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇనుముకు.. శని గ్రహానికి బలమైన సంబంధం ఉంది. అందుకే శనివారం నాడు ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను ఇంటికి కొనకూడదని పెద్దలు చెబుతుంటారు. ఈ రోజున ఇనుము కొంటే కుటుంబంలో కలహాలు రేగడమే కాకుండా, అనవసరపు ఖర్చులు పెరుగుతాయని నమ్ముతారు.
3) ఉప్పు కొనుగోలు చేయడం
శనివారం రోజున ఉప్పు కొనడం కూడా నిషిద్ధంగా భావిస్తారు. ఈ రోజున ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే అప్పుల పాలు కావాల్సి వస్తుందని, అలాగే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని మత విశ్వాసాలు చెబుతున్నాయి.
4) మాంసాహారం, మద్యం సేవించడం
పవిత్రమైన శనివారం నాడు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఈ రోజున పూర్తిగా సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నియమాలను ఉల్లంఘించి తామసిక ఆహారాలు తీసుకుంటే శని దేవుని ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని సంప్రదాయం సూచిస్తోంది.
5) తూర్పు, ఈశాన్య దిశల్లో ప్రయాణాలు
జ్యోతిష్య సూచనల ప్రకారం శనివారం నాడు తూర్పు, ఈశాన్య దిశల్లో ప్రయాణించడం అంత శుభప్రదం కాదు. ఈ దిశల్లో ప్రయాణించడం వల్ల అనుకున్న పనులు పూర్తికాకపోగా, అనేక ఇబ్బందులు ఎదురవుతాయని విశ్వసిస్తారు. అత్యవసరమైతే తప్ప ఈ దిశల్లో ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిది.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం మత విశ్వాసాలు, జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా సేకరించబడింది మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. భక్తుల నమ్మకం కోసమే ఈ సమాచారం అందించడం జరిగింది.
Also REad: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే ఏమవుతుంది? పుకార్లపై వైద్యుల స్పందన ఇదే!
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్న్యూస్.. భారీ పతనం దిశగా గోల్డ్..ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
బెంచీలు ఎన్నున్నా కూర్చునేది ఒక్కడే.. కోనాపురం స్కూల్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
Hyderabad, Telangana:One Teacher - One Student: సాధారణంగా ఒక పాఠశాల అంటే వందలాది మంది విద్యార్థులతో పాటు పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు, పిల్లలు ఆడుకోవడం గుర్తుకొస్తాయి. కానీ, వరంగల్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా దర్శనమిస్తోంది. అక్కడ ఉండేది ఒకే ఒక్క గురువు.. చదివేది ఒకే ఒక్క శిష్యుడు.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని కోనాపురం ప్రాథమిక పాఠశాలలో ఇప్పుడు ఇదే దృశ్యం ఆవిష్కృతమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే...
వరంగల్ జిల్లా కోనాపురం ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం సోషల్ మీడియాలో, స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పాఠశాలలో జగన్మోహన్ రావు అనే ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తుండగా.. విక్కీపాల్ అనే బాలుడు మాత్రమే విద్యార్థిగా ఉన్నాడు.. ప్రస్తుతం ఈ బుడతడు రెండో తరగతి చదువుతున్నాడు. క్లాస్ రూమ్లో బెంచీలు ఎన్ని ఉన్నా.. కూర్చునేది మాత్రం విక్కీపాల్ ఒక్కడే.. చెప్పేది ఒక్కరే.. వినేది ఒక్కడే అన్నట్లుగా సాగుతోంది అక్కడి విద్యాబోధన..
ఆ ఒక్కడి కోసమే.. అల్పాహారం, మధ్యాహ్న భోజనం..
బడిలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా.. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని వసతులను ఆ ఒక్క విద్యార్థికి యథావిధిగా అందిస్తున్నారు. విక్కీపాల్ కోసం ప్రతిరోజూ ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం రుచికరమైన భోజనాన్ని పాఠశాల సిబ్బంది ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బాలుడికి అది కార్పొరేట్ స్థాయి Personal Attentionగా మారిపోయిందని భావించవచ్చు. ఉపాధ్యాయుడు జగన్మోహన్ రావు కూడా ఆ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కోసం ఎంతో అంకితభావంతో పాఠాలు బోధించడం విశేషం..
ఎందుకీ పరిస్థితి వచ్చింది?
గతంలో ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగానే ఉండేది.. అయితే, ఇటీవల కోనాపురం గ్రామాన్ని వర్ధన్నపేట మున్సిపాలిటీలో విలీనం చేశారు.. దాంతో గ్రామానికి చెందిన దాదాపు 19 మంది విద్యార్థులు మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద స్కూల్లో చేరిపోయారు.. కానీ, విక్కీపాల్ కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల ఆ బాలుడు మాత్రం ఈ పాత బడిని వీడలేదని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం.. విద్యార్థులు ఎవరూ లేకపోతే పాఠశాలను మూసివేయాలి లేదా వేరే స్కూల్లో విలీనం చేయాలి. కానీ, విక్కీపాల్ ఇంకా ఇక్కడే కొనసాగుతుండటంతో.. ఆ ఒక్క బాలుడి విద్యా హక్కును గౌరవిస్తూ.. విద్యాశాఖ ఈ పాఠశాలను, ఉపాధ్యాయుడిని ఇక్కడే కొనసాగిస్తోంది.
ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు లేక మూతపడుతున్న తరుణంలో.. ఒకే ఒక్క విద్యార్థి ఉన్నా.. బాధ్యతగా నడుస్తున్న కోనాపురం బడి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉపాధ్యాయుడి అంకితభావంతో పాటు ఆ బాలుడి చదువు పట్ల ఉన్న ఆసక్తిని స్థానికులు అభినందిస్తున్నారు. గురుశిష్యుల పరమ పవిత్ర బంధానికి ఈ పాఠశాల ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
పుష్య నక్షత్రంలోకి సూర్యుడు, బృహస్పతి.. ఈ రాశుల వారికి అదృష్టం రెట్టింపు!
Hyderabad, Telangana:Sun-jupiter Conjunction In Pushya Nakshatra News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులతో పాటు నక్షత్ర సంచారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇదిలా ఉంటే త్వరలోనే ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన గ్రహాల కలయిక జరగబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దేవగురువు బృహస్పతితో పాటు గ్రహాల రాజుగా భావించే సూర్యుడు ఒకే నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాయి. పుష్య నక్షత్రంలోకి ఈ రెండు గ్రహాల సంచారం జరుగుతుంది. జ్యోతిష్యశాస్త్రంలో పుష్య నక్షత్రాన్ని నక్షత్రాలకే రాజుగా భావిస్తారు. ఈ రెండు ప్రధాన గ్రహాల మహా సంయోగం వల్ల రాబోయే 13 రోజుల పాటు కొన్ని రాశుల వారి అదృష్టం పూర్తిగా మారిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
గురు-సూర్యుల సంచారం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జులై 19న దేవగురువు బృహస్పతి పుష్య నక్షత్రం మూడవ పాదంలోకి సంచారం చేయబోతోంది. దీనికి తర్వాత రోజే.. అంటే జులై 20 ఉదయం 11:33 గంటలకు సూర్య భగవానుడు కూడా ఇదే పుష్య నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు.. బృహస్పతి ఆగస్టు 19 వరకు ఈ నక్షత్రంలోనే సంచార దశలో ఉంటాడు.. కాగా సూర్యుడు ఆగస్టు 3 ఉదయం 10:29 గంటల వరకు ఇందులో కొనసాగుతాడని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని ప్రకారం.. జులై 20 నుంచి ఆగస్టు 3 వరకు ఈ సూర్య-బృహస్పతుల మహా కూటమి అత్యంత ప్రభావంతంగా ఉంటుంది. ఈ ప్రభావంతో ప్రత్యేకంగా కొన్ని రాశుల వారి కెరీర్, ఆర్థిక పరిస్థితి, వ్యక్తిగత జీవితంలో ఊహించని అవకాశాలు కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి అదృష్టం రెట్టింపు కాబోతుందో? అద్భుతమైన ప్రయోజనాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ సూర్య-గురుల కలయిక వల్ల ఆకస్మిక ధనలాభ యోగం కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అస్సలు ఊహించని పనుల నుంచి భారీగా డబ్బు చేతికందే అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలు కూడా ఎంతో సులభంగా వసూలవుతాయి. ఈ సమయంలో లభించిన ధనాన్ని సరైన పద్ధతిలో.. నమ్మకమైన చోట పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో అపారమైన లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలతో పాటు కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కార్యాలయంలో కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారస్తులు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపూర్వమైన లాభాలను, విజయాలను సాధించే అవకాశాలు ఉన్నాయి..
వృశ్చిక రాశి
ఈ సమయంలో వృశ్చిక రాశి వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన అత్యంత ముఖ్యమైన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ఆదాయ వనరులు పెరగడం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త వ్యాపారాలు లేదా నూతన పనులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా భావించవచ్చు.
మీన రాశి
బృహస్పతి ప్రభావంతో ఏర్పడే మహా సంయోగం కారణంగా మీన రాశివారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ 13 రోజుల పాటు ప్రేమ, వివాహం, సంతాన ప్రాప్తి లేదా ఉన్నత విద్యకు సంబంధించి వీరు పెద్ద శుభవార్తలు తప్పకుండా వినే అవకాశాలు కూడా కలుగుతాయి. కుటుంబ, వ్యక్తిగత సంబంధాలలో ఉన్న విభేదాలు తొలగిపోయి.. సాన్నిహిత్యం కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జీవితంలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
హైదరాబాద్లో ఉద్రిక్తత.. యువ సంగ్రామ సభకు వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ అరెస్ట్
Hyderabad, Telangana:BRS Party Yuva Sangrama Sadassu: అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను నిలదీసేందుకు.. యువతకు చేసిన మోసాన్ని వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేసిన యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్లు చేస్తున్నారు. యువ సంగ్రామ సదస్సుకు వెళ్లకుండా మాజీ మంత్రులు, పార్టీ నాయకులను అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్ట్లు ఇలా..
యువ సంగ్రామ సదస్సు హాజరుకాకుండా మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డిని శ్రీనగర్కాలనీలో పోలీసులు గృహనిర్బంధం చేశారు. హైకోర్ట్ అనుమతి ఉన్నా హౌస్ అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు సభకు వెళ్లేందుకు అనుమతించకపోతే తాను తన నివాసంలోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. దీంతో పోలీసులు ఉన్నత అధికారుల ఆదేశాలతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను సభకు వెళ్లేందుకు అనుమతించారు.
హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ “యువ సంగ్రామ సదస్సు”ను అడ్డుకునేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్రలు. యువ సంగ్రామ సదస్సుకు హాజరుకాకుండా మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.
నిరుద్యోగ సమస్యలు, యువత హక్కుల సాధనకై సదస్సుకు… pic.twitter.com/YtrTvbAqJe
— BRS Party (@BRSparty) July 18, 2026
బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం
పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిలల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు తొలుత అనుమతి నిరాకరించినప్పటికీ, హైకోర్టు జోక్యంతో సభ నిర్వహణకు అనుమతి లభించిందని వివరించారు. అయినా కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను సభకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా నాయకులను నిర్బంధించడం రాజ్యాంగ స్ఫూర్తికి, న్యాయస్థానాల పట్ల గౌరవానికి విరుద్ధం అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రకటించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన ప్రభుత్వమే వాటి స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం ప్రతి రాజకీయ పార్టీకి ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు అని గుర్తుచేశారు. ఆ హక్కును పోలీసులు అణిచివేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుద్యోగ యువత తరఫున బీఆర్ఎస్ గళమెత్తితే ఇంత భయమెందుకు రేవంతూ?
యువ సంగ్రామ సదస్సుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని హౌస్ అరెస్ట్ చేసిన అరాచక కాంగ్రెస్ సర్కార్
హైకోర్టు పర్మిషన్ ఉన్నా, మల్కాజిగిరి సీపీ సుమతి గారు స్వయంగా యువ… pic.twitter.com/7aI9CuyShJ
— BRS Party (@BRSparty) July 18, 2026
యువత సమస్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రశ్నించారు. యువత ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేకే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని అణచివేయాలనే ఇటువంటి నిరంకుశ ధోరణిని బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ నాయకులను నిర్బంధించిన ఘటనపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు.
తిరుమలలో సతీసమేతంగా మాజీ మంత్రి హరీశ్ రావు
Tirupati Urban, Andhra Pradesh:Telangana Ex Minister Harish Rao Visits Tirumala Temple Along With Wife Watch Videoభర్త కోసం అన్నా లెజినోవా తిరుమలలో మొక్కులు
Dharmavaram, Andhra Pradesh:Pawan Kalyan Wife Anna Lezhneva Visits To Tirumala Temple Watch Videoతిరుమలలో మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా
Tirupati Urban, Andhra Pradesh:AP Deputy CM Anna Lezhneva Offers Special Poojas In Tirumala Templeతిరుమలలో వైఎస్ జగన్ సోదరి సునీతా రెడ్డి
Dharmavaram, Andhra Pradesh:Former CM YS Jagan Sister YS Sunitha Reddy At Tirumala Temple Watch Videoగురు ఆదిత్య యోగంతో కుబేరులు కాబోతున్న రాశులు ఇవే!
Hyderabad, Telangana:Guru Aditya Yoga July 2026 Latest News: జూలై నెల చివరి వారంలో ఒక అద్భుతమైన గ్రహకూటమి ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జూలై 16న సూర్య గ్రహం మిథున రాశిని విడిచిపెట్టి.. కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది. మరోవైపు, పవిత్రమైన శ్రావణ మాసం కూడా మొదలు కాబోతోంది.. జూలై 25న శని దేవుడు వక్రగతిలో కూడా ప్రయాణించోతున్నాడు.. ఇదే సమయంలో, సూర్యుడికి అత్యంత సమీపంలోకి రావడం వల్ల దేవగురువైన బృహస్పతి అస్తమించడం కూడా విశేషం.. ఈ గ్రహాల కదలికల కారణంగా ఎంతో శక్తివంతమైన గురు ఆదిత్య యోగం అనే అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన యోగం కూడా ఏర్పడబోతోంది..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు..
మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి ఈ చివరి 10 రోజుల్లో తన స్నేహితుల నుంచి ఆశించిన సహాయ, సహకారాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఫ్లాట్ ప్రకారం పనులు ఎంతో సులభంగా పూర్తి చేసి.. అధికారుల సపోర్ట్ను కూడా పొందుతారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పరీక్షలు రాసేవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
సింహ రాశి (Leo)
సింహ రాశివారికి ఈ చివరి 10 రోజుల్లో అదృష్టం పూర్తిగా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా సమాజంలో ఉన్నత స్థానంలోకి ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి మంచి మంచి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. కొత్త ఇడ్లు కొనుగోలు చేసేవారికి ధన లాభాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
ఉద్యోగాలు చేసే ధనుస్సు రాశివారికి కెరీర్ పరంగా అద్భుతమైన పెద్ద శుభవార్తలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫీసులో పైఅధికారులు మీ పనితీరుకు తగ్గ ప్రశంసలు కూడా లభిస్తాయి.. వ్యాపారంలో ఆశించిన లాభాలు సాధించడమే కాకుండా.. పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.
కర్కాటక రాశి (Cancer)
మోస్ట్ పవర్ఫుల్ గురు ఆదిత్య యోగంతో కర్కాటక రాశిలోనే ఏర్పడడం కారణంగా ఈ రాశివారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీలోని బద్ధకాన్ని వదిలిపెట్టి.. ఏకాగ్రతతో కష్టపడి పనిచేస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో మంచి మంచి అద్భుతాను అందిస్తుంది. కార్యాలయంలో పెద్ద అవకాశాలు కూడా సులభంగా లభిస్తాయి.
వృషభ రాశి (Taurus)
శక్తివంతమైన గురు ఆదిత్య యోగంతో జూలై చివరి రోజులు వృషభ రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉంటుంది. వీరు అనుకున్న పనులన్నీ ఎంతో సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా పనులు కూడా ఎంతో సులభంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీలో ఒక రకమైన కొత్త శక్తి కనిపిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సహోద్యోగులందరి సహాయం ముందుకు వెళ్తారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
పెన్షన్ లేదు.. హెల్త్ కార్డు ఊసే లేదు.. విశ్రాంత సీపీఎస్ ఉద్యోగుల వెతలు.. పట్టించుకోని సర్కార్..!!
Secunderabad, Telangana:CPS Retired Employees: రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే వారు తమ పెన్షన్లను కోల్పోయారు. తాజాగా హెల్త్ కార్డును కూడా కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,600 మంది సీపీఎస్ ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. వారికి ప్రాథమిక పెన్షన్ కంటే తక్కువగా.. అంటే 2,000-3,000 రూపాయల కన్నా తక్కువ పెన్షన్ అందుతోందని యూనియన్ నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఓపీఎస్ ఉద్యోగుల పెన్షన్ల నుండి 1.5శాతం ప్రీమియం మినహాయించి వారికి హెల్త్ కార్డులు జారీ చేస్తోంది. సీపీఎస్ ఉద్యోగుల పెన్షన్ల నుండి 1.5శాతం ప్రీమియం మినహాయించడానికి మార్గం లేదు. ఫలితంగా.. వారికి హెల్త్ కార్డులు జారీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అటు పెన్షన్ అందక.. ఇటు హెల్త్ కార్డు లేకుండా తీవ్ర వివక్షకు గురవుతున్నామని సీపీఎస్ విశ్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం వారందరూ పనిచేస్తున్న ఉద్యోగులు కాబట్టి, వారి ప్రాథమిక జీతంలో 1.5శాతం హెల్త్ కార్డుల కోసం మినహాయిస్తున్నారు. భవిష్యత్తులో వీరంతా ఏదొక రోజు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారికి అందే పింఛను చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా, వారు EHS ప్రీమియంలు చెల్లించలేని పరిస్థితులు కూడా నెలకొంటాయి. అంటే.. CPS ఉద్యోగులు ఉద్యోగంలో ఉన్నంత కాలం మాత్రమే హెల్త్ కార్డ్ వర్తిస్తుంది. హెల్త్ కార్డ్ ఉద్దేశ్యం ఏమిటని CPS ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం OPS ఉద్యోగులకు , పింఛనుదారులకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా, మొత్తం ఉద్యోగులలో 70శాతం ఉన్న CPS ఉద్యోగులను ట్రస్ట్ బోర్డులో చేర్చకూడదా? అని ఉపాధి సంఘాల నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. EHS అమలులో తమను భాగస్వాములను చేయనందున, CPS, పదవీ విరమణ చేసిన CPS ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే అవకాశం లేదని వారు ఫిర్యాదు చేస్తున్నారు.
వృద్ధాప్యంలో ఆర్థిక, ఆరోగ్య భద్రత లేదా?
రాష్ట్ర ప్రభుత్వం CPS ఉద్యోగుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసింది. సెప్టెంబర్ 1, 2004 తర్వాత నియమితులైన వారందరూ పదవీ విరమణ తర్వాత పింఛను ప్రయోజనాలను కోల్పోతారు. పర్యవసానంగా, వారికి హెల్త్ కార్డులు వర్తించవు. ప్రభుత్వం వీలైనంత త్వరగా CPSను రద్దు చేసి, పాత పింఛను పథకాన్ని అమలు చేయాలి. అప్పటి వరకు, పదవీ విరమణ చేసిన CPS ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్సను కొనసాగించాలి. EHS ట్రస్ట్ బోర్డులో CPS ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: తెలంగాణ PRCపై ఉద్యోగులు గంపెడాశలు.. ఈసారైనా ప్రభుత్వం కరుణిస్తుందా?
Also Read: ఇది స్కూలా లేక IAS, IPS ల తయారీ కేంద్రమా?
Also Read: సీపీఎస్ రద్దు కోసం జన జాగరణ యాత్ర..ఆగస్టు 23న హైదరాబాద్లో మహా సభ..!!
Also Read: తెలంగాణ ఉపాధ్యాయుడికి అరుదైన గుర్తింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Hydrogen Train Launch: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు జాతికి అంకితం.."భవిష్యత్తు అంతా దీనితోనే!"
jawa, Haryana:PM Modi Hydrogen Train Launch: భారత రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. నేడు అనగా జూలై 17 హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. హర్యానాలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు సర్వీసును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక ఘట్టం అనంతరం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, రాబోయే కాలమంతా హైడ్రోజన్ ఇంధనానిదేనని స్పష్టం చేశారు.ధరణి పోర్టల్పై సిట్ విచారణ.. తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
Hyderabad, Telangana:Dharani Portal: తెలంగాణలో అత్యంత వేగంగా మారుతున్న కీలక రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశమైంది. కీలక అంశాలపై చర్చించిన తెలంగాణ మంత్రిమండలి ధరణి పోర్టల్పై సిట్ విచారణ చేయాలని నిర్ణయించింది. నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రిమండలి అంచనాలు సవరించింది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పురోగతప.. ఎల్నినో ప్రభావం, తాగునీటి భద్రతపై మంత్రిమండలి చర్చ జరిగింది.
హైదరాబాద్లోని సచివాలయంలో గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం కొన్ని గంటల పాటు సాగింది. నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రిమండలి సమీక్ష చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు నిర్మాణంలో ఉన్న ఇతర సాగునీటి ప్రాజెక్టులపై, మెట్రో రైలు రెండో దశ పురోగతిపై, కేంద్రం కమిటీ ఏర్పాటు జాప్యంపై ప్రభుత్వ వైఖరిపై మంత్రిమండలి చర్చ చేసింది. ఎల్-నినో ప్రభావం, తాగునీటి భద్రత చర్యలపై చర్చించింది.
బుల్లెట్ ట్రైన్ భూ సేకరణ, వ్యయ అంశాలపై చర్చ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పురోగతిపై మంత్రిమండలి చర్చ చేసింది. కృష్ణా–గోదావరి జల వివాదం, సుప్రీంకోర్టు వ్యవహారంపై వ్యూహం వంటి పలు కీలక పరిపాలనా, అభివృద్ధి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్ అక్రమాలపై సిటి విచారణ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జగిత్యాల జిల్లా డిగ్రీ కాలేజీలో పలు పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హాన్స్ చెరులో ఇందిరమ్మ ఇళ్ల కోసం భూమి కేటాయింపుకు మంత్రిమండలి నిర్ణయించింది. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పునకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పలు పరిపాలనా, అభివృద్ధి అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
విచారణకు సిద్ధం
ధరణి అక్రమాలపై సిట్ విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ధరణి పోర్టల్పై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. భూ రికార్డుల మార్పులు, అక్రమ మ్యూటేషన్లపై విచారణకు మంత్రిమండలి నిర్ణయించింది. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూముల లావాదేవీలపై దృష్టి సారించింది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైందని ప్రకటించింది.
అవసరమైతే మాజీ అధికారులు, బాధ్యులకు నోటీసులు ఇవ్వాలని.. సాంకేతిక అంశాలపై నిపుణుల సహకారంతో దర్యాప్తు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ధరణి ద్వారా జరిగిన భూ వివాదాలన్నింటిపై వివరాల సేకరణ చేసింది. అక్రమంగా లబ్ధి పొందిన వారిపై కేసుల నమోదుకు అవకాశం. ధరణి పోర్టల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు, పత్రాల పరిశీలన ప్రారంభమైంది. బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భూ పరిపాలనలో పారదర్శకతకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని.. సిట్ విచారణతో ధరణి అక్రమాల అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్..వరల్డ్కప్ చెదిరింది..ఎల్లుండి వన్డేలకు రిటైర్మెంట్!
England:Rohit Sharma Retirement News: భారత్కు ఎన్నో మ్యాచ్ల్లో ఒంటి చెత్తో అద్భుత విజయాలను అందించిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ కల నెరవేరకుండానే కెరీర్ ముగియనున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ లేడని సెలెక్టర్ల నుంచి స్పష్టమైన సమాచారం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జూలై 19న ఇంగ్లాండ్తో లార్డ్స్ మైదానంలో జరగనున్న మూడో వన్డే మ్యాచ్తో రోహిత్ శర్మ టీమిండియా జెర్సీలో చివరిసారిగా కనిపించనున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. రోహిత్ శర్మ భవిష్యత్పై బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ కఠిన నిర్ణయం తీసుకుందని నిపుణులు అంటున్నారు.'తల్లికి వందనం'పై సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఇకపై అంగన్వాడీ సిబ్బందికి వర్తింపు
Nuzendla, Andhra Pradesh:Thalliki Vandanam Scheme: విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించే తల్లికి వందనం పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని మరికొంత మందికి విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీ సిబ్బందికి అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అంగన్వాడీ సిబ్బందికి శుభవార్త ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు తల్లికి వందనం పథకం అమలు చేయనుంది.
అంగన్వాడీలకు 'తల్లికి వందనం' పథకం వర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలకు పథకం అమలు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీల చిరకాల కోరిక నెరవేరిందని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. అర్బన్, రూరల్ అంగన్వాడీ సిబ్బంది అందరికీ తల్లికి వందనం పథకం వర్తించనున్నట్లు తెలిపారు.
అంగన్వాడీల విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తున్నారని మంత్రి సంధ్యారాణి తెలిపారు. జీతాల పెంపు, గ్రాట్యుటీ తర్వాత 'తల్లికి వందనం' వరం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీ సిబ్బందిలో ఆనందం వెల్లివిరుస్తోందని.. సిబ్బంది సేవలకు గుర్తింపుగా 'తల్లికి వందనం' అమలు చేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి వివరించారు. అంగన్వాడీలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని.. అంగన్వాడీ సిబ్బందికి మరింత భరోసా కల్పించే నిర్ణయం ఇది అని ప్రకటించారు.
