కార్వాన్: ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టండి
Hyderabad, Telangana:శానిటేషన్ విభాగం సిబ్బందితో కార్వాన్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ స్వామి యాదవ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో మొహరం, బోనాల జాతరను పురస్కరించుకొని ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడ చెత్త లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని తెలిపారు. ఆలయాలు, అశుర్ కానా ల వద్ద ప్రత్యేక శానిటేషన్ పనులు చేపట్టాలని సూచించారు. సిబ్బందికి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Old City Metro: మెట్రో రైలుపై కీలక ప్రకటన.. హైదరాబాద్ పాతబస్తీవాసులకు తెలంగాణ సీఎం తీపి కబురు
Hyderabad, Telangana:Hyderabad Metro Rail: హైదరాబాద్లోని పాతబస్తీ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి భారీ శుభవార్త వినిపించారు. వచ్చే ఎన్నికల వరకు మెట్రో రైలును ప్రారంభిస్తామని ప్రకటించారు. గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రోను పూర్తి చేసి.. వచ్చే ఎన్నికల్లో మెట్రోలో వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందామంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని చంచల్గూడ - సంతోష్నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'గత ప్రభుత్వం (కేసీఆర్) కేవలం కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకుంది. బ్రిడ్జి నిర్మాణానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదు. కానీ మా ప్రభుత్వం నిధులు ఇచ్చి బ్రిడ్జిని పూర్తి చేసింది' అని వెల్లడించారు. 'ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని ఇక్కడ ప్రతీ గల్లీ నాకు తెలుసు. అసదుద్దీన్ అడిగిన ప్రతీ అభివృద్ధి పనులను మంజూరు చేయాలని ఈ వేదికగా అధికారులను ఆదేశిస్తున్నా' అని తెలిపారు. 'ఎమ్మెల్యే బలాల కళాశాల అభివృద్ధి కోసం రూ.20 కోట్లు అడిగారు. దీనికి రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నా' అని ప్రకటించారు. 'నేను నిధులు మంజూరు చేస్తా.. కానీ ఏడాదిన్నరలో అభివృద్ధి పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే' అని స్పష్టం చేశారు.
'విద్య కోసం ఎంత ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ హిందుస్థాన్ కు మద్దతుగా నిలిచి దేశభక్తి చాటుకున్నారు. రాజకీయ సిద్ధాంతాలు వేరు కావచ్చు.. దేశ భక్తి విషయంలో అందరం ఒక్కటే' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'మీరు కేబుల్ బ్రిడ్జి చూడాలంటే దుర్గం చెరువుకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే మేం మీరాలం చెరువులో 3 కి.మీ మేర కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నాం' అని చెప్పారు.
'వచ్చే ఎన్నికల్లోగా గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రోను పూర్తి చేస్తాం. వచ్చే ఎన్నికల్లో మెట్రోలో వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నట్లు తెలిపారు. 'హిందూ, ముస్లిం కలిసి నడిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేస్తామంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నారు' అని వివరించారు.
'మూసీని అభివృద్ధి చేసి నైట్ ఎకానమీని ప్రోత్సహిస్తాం. ఇక్కడి పేద ముస్లింలకు ఉపాధి కల్పించేలా చూస్తాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. నాగోల్ నుంచి ఎల్బీ నగర్- చాంద్రాయణగుట్ట- రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు మెట్రోను విస్తరించబోతున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా మేం అభివృద్ధి చేయాలనుకుంటుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అడుగడుగునా అడ్డుకుంటున్నాయని విమర్శించారు.
'ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత అందిస్తున్నాం. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు… ఎన్నికలు ముగిసాక అభివృద్ధి ఒక్కటే లక్ష్యం. మనందరం కలిసికట్టుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'రూ. 500 కోట్లతో మీరాలం ట్యాంకును అత్యద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం. భూసేకరణ ప్రక్రియ పూర్తి కావచ్చిన నేపథ్యంలో వచ్చే డిసెంబర్లో గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభిస్తాం' అని వెల్లడించారు.
G Chinna Reddy: పదవి తొలగింపుపై చిన్నారెడ్డి తొలి స్పందన.. 'ఒక్క పోటుతో కూల్చేశారు'
Wanaparthy, Telangana:Wanarparthy: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి స్పందించారు. తనకు పదవులపై ఎలాంటి వ్యామోహం లేదని స్పష్టం చేశారు. పదవి ఉన్నా లేకపోయినా తన వ్యక్తిగత గౌరవం తనకు ఉందని ప్రకటించారు. ప్రస్తుతం తన సొంత ఊరిలో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్న ఆయన మారిన రాజకీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో నమ్మకంగా పనిచేసిన తనకు ఒక్క పోటుతో కూల్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తనను పదవి నుంచి తొలగించడంపై జిల్లెల చిన్నారెడ్డి మనస్తాపం చెందారు. పదవి పోయినా తాను ఎలాంటి పదవి కోసం ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని కలవడానికి తాను ఎలాంటి ప్రయత్నం చేయలేదని తెలిపారు. 'నాకు పదవులపై వ్యామోహం లేదు. పదవి ఉన్నా లేకపోయినా వ్యక్తిగతంగా నా గౌరవం నాకు ఉంది' అని తెలిపారు. ప్రణాళిక సంఘం చైర్మన్ పదవికి సంబంధించి కూడా తనకు ఎలాంటి నిర్దిష్టమైన సమయం లేదని పేర్కొన్నారు.
గతంలో పదవిలో ఉన్న సమయంలోనే తాను ప్రోటోకాల్ను వదులుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చిన్నారెడ్డి గుర్తుచేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో తన సీనియారిటీపై కూడా జిల్లెల చిన్నారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ హయాం నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో హనుమంతరావు, తాను సీనియర్ నాయకులుగా ఉన్నామని చెప్పారు. ప్రస్తుతం పదవి, ప్రోటోకాల్ కంటే తన వ్యక్తిగత గౌరవానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. 'నా మనుషులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వెళ్తే మెడ పట్టి బయటకు దొబ్బుతానని మేఘా రెడ్డి అన్నాడు. అయినా భరించా' అని చిన్నారెడ్డి తెలిపారు.
వనపర్తి నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేసిన చిన్నారెడ్డిని అర్ధాంతరంగా పదవి నుంచి తొలగించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదవి నుంచి తొలగించినా కూడా చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2028 ఎన్నికల సమయంలో తన సత్తా ఏమిటో చూపాలనే ఆలోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. చిన్నారెడ్డిని పదవి నుంచి తొలగించడం ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతంలో ఈ చిన్న తప్పు చేసినా ఫలితం దక్కదు!
Hyderabad, Telangana:Krishna Janmashtami Pooja Rules In Telugu: హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. ఆ దేవదేవుడు శ్రీమహావిష్ణువు అష్టమవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా భక్తులంతా ఎంతో భక్తి శ్రద్దలతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ పర్వదినాన బాలకృష్ణుడిని పూజించి.. భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపడుతూ ఉంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాల్గవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది. అయితే మీరు కూడా ఈ పవిత్రమైన రోజున ఉపవాసాలు పాటిస్తూ ఉంటారా? ఈ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి.. ఎలాంటి తప్పులు చేయకూడదు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పవిత్రమైన రోజున వ్రతం చేయడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం లభించడంతోపాటు భక్తులకు అందరికీ కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే, జన్మాష్టమి ఉపవాస దీక్షలో కొన్ని కఠినమైన నియమాలు పాటించడం తప్పనిస.. ముఖ్యంగా సంతానంలో భాగంగా బాబును మాత్రమే కోరుకుంటున్న వారు తప్పకుండా ఈ సమయంలో ప్రత్యేకమైన ఉపవాసాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కఠినమైన నియమాలతో శ్రీకృష్ణుడి పూజను చేయాల్సి ఉంటుంది..
శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున భక్తులందరూ ప్రధానంగా రెండు రకాలుగా ఉపవాసాలు పాటిస్తూ ఉంటారు.. భారతదేశంలోని చాలామంది భక్తులు నిర్జల ఉపవాసం పాటిస్తూ ఉంటారు.. ఇది అత్యంత కఠినమైన వ్రతముగా భావిస్తారు. ఇందులో భక్తులు పగలు రాత్రి అనే తేడా లేకుండా కనీసం మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసాలు ఉంటారు. అర్ధరాత్రి కృష్ణుడి జననం తర్వాత.. స్వామివారికి హారతి ఇచ్చి ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమిస్తారు.. ఇక మరికొంతమంది ఫలహార ఉపవాసం ఉంటారు. వృద్ధులతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా నిర్జీల దీక్ష చేయలేని వారు పలహార ఉపవాసం చేయొచ్చు. ఇందులో పండ్లు, పాలు నీరు మాత్రమే తీసుకుంటూ ఉంటారు..
ముఖ్యంగా పాటించాల్సిన కొన్ని నియమాలు ఇవి..
ఉపవాసాలు ఉన్నవారే కాదు.. ఇంట్లో వారందరూ ఈరోజు తప్పకుండా ఉల్లిపాయతో పాటు వెల్లుల్లి, మాంసాహారం లాంటి తామసిక ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాల్సి ఉంటుంది. కేవలం తాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే శ్రీకృష్ణాష్టమి రోజున వ్రతం ఆచరించేవారు వివాదాలతో పాటు అబద్ధాలకు, కఠినమైన మాటలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మనసును ప్రశాంతంగా ఉంచుకొని రోజంతా శ్రీకృష్ణుడి నామస్మరణ చేయాలి. బ్రహ్మచర్యం పాటించడం కూడా అత్యంత మంచిదని పురాణాలు చెబుతూ వస్తున్నాయి..
Also Read: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అరుదైన నవపంచమి రాజయోగం..
శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడని పురాణాలు తెలుపుతున్నాయి.. కాబట్టి జన్మాష్టమి రోజున నిశీధ కాలంలో పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం.. ఈ సంవత్సరం సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11 గంటల 57 నిమిషాల నుంచి సెప్టెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల 43 నిమిషాలకు నిశీధ కాల ముహూర్తం ఉంది. ఈ సమయంలో శ్రీకృష్ణుడి బ్రహ్మోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలి. బాలకృష్ణుడికి ఇష్టమైన వెన్నతో పాటు పట్టిక బెల్లం, పంచమేవ, పండ్లు, రకరకాల స్వీట్లను నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పూజా అనంతరం హారతిని ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇక ఉపవాస విరమణ విషయానికొస్తే.. కొంతమంది తమ కుటుంబ ఆచారాల ప్రకారం అర్ధరాత్రి పూజ పూర్తయిన వెంటనే ఉపవాసాన్ని విడిచిపెడతారు. మరి కొంతమంది మరిసటి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఉపవాసాన్ని విరమిస్తారు..
Also Read: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అరుదైన నవపంచమి రాజయోగం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
కట్టెల పొయ్యిలో 8 అడుగుల కింగ్ కోబ్రా.. బుసలు కొడుతూ పడగ విప్పిన వీడియో వైరల్!
Hyderabad, Telangana:8-foot Cobra Video Watch: పాము పేరు వింటేనే చాలామందికి ఒంట్లో భయం మొదలవుతూ ఉంటుంది. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన కింగ్ కోబ్రా నేరుగా మన ఇంట్లోని వంట పొయ్యిలో తిష్ట వేసి కూర్చొని ఉంటే? ఊహించడానికి భయంగా ఉంది కదూ.. ఇప్పుడు ఇలాంటి ఘటనకు సంబంధించిన దృశ్యాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. పాత ఇంటి ఆవరణలోని కట్టెల పొయ్యిలో దూరిన ఒక భారీ నాగుపాము వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు కూడా పెడుతున్నారు..
వైరల్ అవుతున్న ఆ వీడియో వివరాల్లోకి వెళితే. ఒక పాత పెంకుటింటి ముందు వంట చేసుకునేందుకు ఏర్పాటు చేసిన సాంప్రదాయ మట్టి కట్టెల పొయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఆ పొయ్యి లోపల అప్పటికే ఒక భారీ 8 నుంచి 9 అడుగులు కలిగిన కింగ్ కోబ్రా నక్కి కూర్చుని ఉండడం మీరు చూడొచ్చు. ఎవరైతే దగ్గరికి వస్తున్నారన్న అలికిడి రాగానే.. అది పోయి పైభాగం నుంచి తలను పైకి లేపి భారీ పడగల విప్పేసింది.. తీవ్ర ఆగ్రహంతో బుసలు కొడుతూ.. క్షణాల్లో ఎవరిపై దాడి చేస్తుందో అన్న రీతిలో ఉగ్రరూపం ప్రదర్శించడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. ఆ పాము పరిమాణంతో పాటు అది నిలబడిన తీరు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం..
ఈ వీడియోను ఎవరి చిత్రీకరించారు? ఎక్కడ జరిగింది? అని విషయంపై స్పష్టమైన సమాచార ఇంకా రాలేకపోయినప్పటికీ.. గ్రామీణ ప్రాంతానికి లేదా అడవికి చాలా దగ్గరగా ఉన్న గ్రామానికి చెందిన దృశ్యాలుగా వీడియో చూసి మీరు భావించవచ్చు. అయితే, ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కొద్ది రోజులకి విపరీతమైన అటెన్షన్ సంపాదించుకుంది. అంతేకాకుండా కొన్ని రోజుల వ్యవధిలోని వేల లైకులు సంపాదించడం విశేషం. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాదిమందికి పైగా చూశారు. అంతేకాకుండా చాలామంది వివిధ రకాల అభిప్రాయాలను కామెంట్లలో వ్యక్తం చేశారు..
Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?
పాత ఇళ్లతో పాటు కట్టెల కుప్పలు, చల్లగా ఉండే చీకటి ప్రదేశాలతో పాటు ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలు పాములకు ఎంతో అనువైన ప్రదేశాలుగా మారుతూ ఉంటాయి.. ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజలు కట్టెల పొయ్యిలో వంట చేసుకునే ముందు.. ఎండు కట్టలను తీసుకునేటప్పుడు కర్రలతో తట్టి పరీక్షించుకోవడం ఎంతో మంచిది.. లేదంటే ఇలాంటి అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాలు దాడి చేసి ప్రాణానికి ముప్పు తెప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఒకవేళ ఇలా అత్యంత పొడవైన ప్రమాదకరమైన పాములు కనిపిస్తే చంపకుండా స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించడం మంచిది..
Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
KTR Padayatra: రేవంత్ రెడ్డి కాస్కో.. పాదయాత్రపై సంచలన ప్రకటన చేసిన కేటీఆర్
Miryalaguda, Telangana:KT Rama Rao: తెలంగాణ రైతులను నిండా ముంచుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తేల్చుకో అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ పాదయాత్రను ప్రకటించారు. రైతుల కోసం తాను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటన చేశారు. తన తండ్రి కేసీఆర్ మాదిరి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయకపోతే వేలాది మంది రైతులతో కలిసి కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించారు.
రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై నిరసనల్లో భాగంగా మిర్యాలగూడలో జరిగిన రైతు ధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. గతంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కోదాడ నుంచి హాలియా వరకు చేపట్టిన పాదయాత్ర స్ఫూర్తితో తాను కూడా పాదయాత్ర చేపడతానని కేటీఆర్ ప్రకటించారు.
'నాగార్జునసాగర్లో 180 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు చుక్క నీరు కూడా విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తోంది' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 2003లో ఇలాంటి పరిస్థితులే ఏర్పడినప్పుడు కేసీఆర్ కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేశారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో నేడు కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరోసారి పాదయాత్ర చేపడతానని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
'సెప్టెంబర్ 14వ తేదీలోపు సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన స్పష్టమైన షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే వేలాది మంది రైతులతో కలిసి పాదయాత్ర చేపడతామని ప్రకటించారు.
Asia Games 2026: గౌతమ్ గంభీర్కు చెక్ పెట్టనున్న బీసీసీఐ..ఆసియా గేమ్స్లో టీమ్ఇండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్!
Mumbai, Maharashtra:Asia Games 2026 VVS Laxman: జపాన్లోని ఐచి-నాగోయా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్ 2026 కోసం భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పేరును అధికారికంగా ఖరారు చేశారు. ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ ఈ టోర్నీకి దూరంగా ఉండటంతో, భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్కు ఈ జపాన్ పర్యటన బాధ్యతలను బీసీసీఐ కట్టబెట్టింది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) అధిపతిగా ఉన్న లక్ష్మణ్, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత శ్రేయస్ సేనకు ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదించిన ప్రతినిధుల అధికారిక జాబితాలో లక్ష్మణ్ పేరును ప్రతిపాదించారు.
సాధారణంగా అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్లలో భారత క్రికెట్ జట్టుతో పాటు భారీ స్థాయిలో సహాయక సిబ్బంది (సపోర్ట్ స్టాఫ్) పయనిస్తుంటారు. అయితే ఆసియా గేమ్స్ నిబంధనలు దీనికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది పరిమితి చాలా కఠినంగా ఉంది. భారత్ తరఫున పురుషుల, మహిళల జట్లకు కలిపి కేవలం 20 మంది సపోర్ట్ స్టాఫ్కు మాత్రమే అధికారికంగా అనుమతి లభించింది. ఈ పరిమిత సిబ్బందితోనే పకడ్బందీ ప్రణాళికలు రచించి, భారత జట్టుకు పతకం అందించాల్సిన పెద్ద బాధ్యత ఇప్పుడు లక్ష్మణ్ బృందం భుజస్కంధాలపై పడింది.
భారత జట్టుకు హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడం లక్ష్మణ్కు ఇదే మొదటిసారి కాదు. గతంలో జింబాబ్వే పర్యటనలో కూడా శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీ20 జట్టుకు ఆయనే ప్రధాన కోచ్గా మార్గదర్శనం చేశారు. అంతేకాకుండా, 2023లో చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని భారత జట్టును విజేతగా నిలిపి, దేశానికి స్వర్ణ పతకాన్ని అందించిన గొప్ప ఘనత కూడా లక్ష్మణ్దే. ఆ అపారమైన అనుభవం జపాన్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఈ జపాన్ పర్యటనలో భారత జట్టుకు కేవలం మైదానంలోనే కాకుండా వెలుపల కూడా పలు రకాల విచిత్రమైన సమస్యలు, వసతుల లేమి ఎదురుకానున్నాయి. ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించే మైదానం ఒకప్పుడు బేస్బాల్ క్రీడా ప్రాంగణం కావడం గమనార్హం. దానిని తాత్కాలికంగా డ్రాప్-ఇన్ పిచ్లను ఏర్పాటు చేసి క్రికెట్ మైదానంగా మార్చారు. ఇక్కడ క్రీడాకారులకు నివాస, డ్రెస్సింగ్ రూమ్ వసతులు అంతగా బాగోలేవని వార్తలు వస్తున్నాయి.
హోటల్ గదులలో ఇద్దరు ఆటగాళ్లు కలిసి ఉంటే, వారి కిట్ బ్యాగులు పెట్టుకోవడానికి కూడా సరైన స్థలం లేని పరిస్థితి నెలకొంది. డ్రెస్సింగ్ రూమ్ నుండి వాష్ రూమ్ వందల మీటర్ల దూరంలో ఉందనే కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటువంటి విచిత్రమైన పరిస్థితులు, అరకొర వసతుల మధ్య కూడా శ్రేయస్ అయ్యర్ సేన పతకమే లక్ష్యంగా ముందడుగు వేయాల్సి ఉంటుంది.
Also Read: 2027 ప్రపంచకప్కు ముందే రోహిత్ శర్మ రిటైర్మెంట్? హిట్మ్యాన్ అంగీకారం..నేడు కీలకభేటీ
Also Read: మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..57 ఏళ్ల నాటి రికార్డు బ్రేక్..సెంచరీ జస్ట్ మిస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రూ. 2000 ఖాతాల్లో పడేది అప్పుడే! పిఎం కిసాన్ 24వ విడతపై కీలక అప్డేట్!
Hyderabad, Telangana:PM Kisan 2026: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పీఎం కిసాన్ నిధి యోజన 24వ విడత అతి త్వరలో విడుదల కానుంది. రూ. 2000 ఎప్పుడు జమ అవుతాయా అని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అక్టోబర్ నెలలో ఈ పిఎం కిసాన్ నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంది.
సెప్టెంబర్ చివరి వారంలో కాకపోయినా, అక్టోబర్ నెలలో నిధులు జమ అవుతాయి. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది రైతులకు రూ. 6000 నేరుగా వారి ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా జమ చేయబడతాయి. వీటిని మూడు విడతలుగా, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. 23వ విడత జూన్ నెలలో విడుదలైనందున, 24వ విడత అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
అయితే, పీఎం కిసాన్ నిధులు పొందాలంటే ముందుగానే ఈ-కేవైసీ పూర్తి చేయాలి. అలాగే ల్యాండ్ రికార్డ్స్ వెరిఫికేషన్ పూర్తయి ఉండాలి. అంతేకాకుండా, మీ బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి. వ్యక్తిగత వివరాలను కూడా అప్డేట్ చేసుకోవాలి.
పీఎం కిసాన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్లో 'ఫార్మర్ కార్నర్' క్లిక్ చేస్తే 'నో యువర్ స్టేటస్' అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా మీ స్టేటస్ను తనిఖీ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా పెండింగ్లో ఉంటే, ఆ సమాచారం కూడా అక్కడ తెలుస్తుంది. కేంద్ర డిప్యూటీ అగ్రికల్చర్ డైరెక్టర్ నేల చౌరాసియా 24వ విడత గురించి అప్డేట్ ఇస్తూ, ఈ నిధులు అక్టోబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. కేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలు పూర్తి చేసుకుంటే, 24వ విడత పీఎం కిసాన్ నిధులు నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయి. కేవైసీ పూర్తి చేయని రైతులకు నిధులు అందడం ఆగిపోయే అవకాశం ఉంది.
Also Read: ఇండియా పోస్ట్లో 23,757 జీడీఎస్ ఉద్యోగాలు..
Also Read: SBI PO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. మీ రోల్ నంబర్ షార్ట్లిస్ట్లో ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Eshwar Sai Madhuri Rathod Audio: మాధురి రాథోడ్తో ఈశ్వర్ సాయి సీక్రెట్ కాల్..సోషల్ మీడియాలో ఆడియో వైరల్!
Hyderabad, Telangana:Eshwar Sai Madhuri Rathod Audio Leak: ప్రముఖ ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి వివాహేతర సంబంధానికి సంబంధించిన ఓ వీడియో గతంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అది ఇప్పుడో పెద్ద వివాదంగా మారింది. తొలుత డ్యాన్సర్ మాధురి రాథోడ్.. ఈశ్వర్ సాయి భార్యపై కేసు పెట్టాలని నిర్ణయించుకోగా.. ఇప్పుడు ఈశ్వర్ సాయిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్లకు సంబంధించిన ఓ పర్సనల్ కాల్ ఆడియో ఇప్పుడు బయటకు వచ్చింది.Konda Surekha: నా ఆత్మగౌరవం కాపాడాలి.. రాహుల్ గాంధీకి రాసిన లేఖ బహిర్గతం చేసిన కొండా సురేఖ
Baddipadaga, Telangana:Konda Surekha vs Revanth Reddy: తనపై చర్యలు తీసుకునేముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మంత్రి కొండా సురేఖ కీలక లేఖలు రాశారు. వాటిలో రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా ఆధారాలు కూడా పొందుపర్చారు. వేటు పడిన అనంతరం కొండా సురేఖ వాటిని విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీకి కూడా కొండా సురేఖ రాశారు. రాహుల్ గాంధీకి రాసిన లేఖతోపాటు పెన్డ్రైవ్లో సాక్ష్యాలు పొందుపర్చారు.
సోనియా గాంధీకి లేఖ రాసిన మరుసటి రోజే ఆగస్టు 23వ తేదీన తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా 6 పేజీల సమగ్ర లేఖ రాశారు. రాష్ట్రంలో బీసీ మహిళా మంత్రినైన తనపై రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న రాజకీయ, పరిపాలనాపరమైన వివక్షపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డితోపాటు సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరు, ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను రాహుల్ గాంధీకి లేఖలో మంత్రి కొండా సురేఖ వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు.
31 ఏళ్ల తన రాజకీయ ప్రస్థానాన్ని, పార్టీ పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని, ఒక బీసీ మహిళా సీనియర్ నాయకురాలిగా తన ఆత్మగౌరవాన్ని కాపాడాలని రాహుల్ గాంధీని కోరారు. ఈ ఆరోపణలన్నింటిపై నిష్పాక్షిక, సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు.
రాహుల్ గాంధీకి రాసిన లేఖలోని కీలక అంశాలు
మంత్రిగా ప్రాధాన్యం కరవు
ప్రభుత్వ ప్రకటనల్లో ఫొటో తొలగించారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటనల్లో నా ఫొటోను ఉద్దేశపూర్వకంగా తొలగించారు. ఇది కనీస గౌరవాన్ని నిరాకరించడమే.
శాఖాపరమైన అధికారాల కత్తిరింపు
యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు, సమ్మక్క-సారలమ్మ ఆలయ నిధులను ఒక్క రోజులోనే ఆర్, బీ శాఖకు బదిలీ చేయడం వంటి అంశాల్లో సంబంధిత మంత్రి అయిన నాకు కనీస సమాచారం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకున్నారు.
మాజీ ఓఎస్డీ టార్గెట్
నా మాజీ ఓఎస్డీ సుమంత్ను ముందస్తు సమాచారం లేకుండా తొలగించి.. అరెస్ట్ చేసేందుకు మంత్రి నివాసమైన నా క్వార్టర్స్కు పోలీసులను పంపడం మంత్రి పదవిని, తన గౌరవాన్ని కించపరచడమే. ప్రస్తుతం అతడిపై ఆధారాలు లేని మరో నాన్-బెయిలబుల్ కేసు మోపుతున్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంపై నిర్లక్ష్యం
పక్క నియోజకవర్గాలకు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ వరంగల్ స్మార్ట్ సిటీ మోడల్ బస్ స్టాండ్, బొండి వాగు విస్తరణ వంటి పనులకు నిధులు విడుదల చేయకుండా తీవ్ర జాప్యం చేస్తూ వివక్ష చూపుతున్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష
సంబంధిత శాఖ మంత్రికి సమాచారం లేకుండా ఎమ్మెల్యే కడియం శ్రీహరి దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించినా పార్టీ అధిష్ఠానం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
పార్టీలో ద్వంద్వ ప్రమాణాలు
జగ్గారెడ్డి టికెట్ విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందని చెప్పిన రేవంత్ రెడ్డి.. పరకాలలో మాత్రం రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు పార్టీలోని బీసీ నాయకత్వాన్ని అణచివేయడమే.
కూతురి వ్యాఖ్యలు – సమన్వయ రాజకీయ దాడులు
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కలత చెందిన తన కుమార్తె సుస్మితా పటేల్ వ్యక్తిగతంగా మాట్లాడితే.. ఆమె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయడం దారుణం. కొన్ని రోజులుగా కొండా కుటుంబాన్ని ఒంటరిని చేసేందుకు పలువురు నాయకులతో సమన్వయ రాజకీయ దాడులు చేయిస్తున్నారు.
School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..వచ్చే వారం వరుసగా 3 రోజులు సెలవులు..ఎందుకంటే?
Vijayawada, Andhra Pradesh:School Holiday Ganesh Chaturthi: తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ సెప్టెంబర్ నెల ఎంతో ఉత్సాహాన్ని తీసుకురాబోతోంది. ఈ నెలలో వరుసగా వస్తున్న పండుగలు, సాధారణ సెలవుల కారణంగా విద్యార్థులకు వరుస హాలిడేలు వచ్చే అవకాశం ఉండటంతో పాఠశాలల్లో పండుగ వాతావరణం ముందుగానే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు రెండూ ఈ సెలవుల పరిధిలోకి రానున్నాయి.
శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలవులతో సందడి
హిందూ మతంలో అత్యంతంగా పూజించే దేవుళ్ళలో ఒకరైన శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినోత్సవాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమిగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ పండుగను భారతదేశం అంతటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ పండుగ సందర్భంగా దేవాలయాలను అందంగా అలంకరిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. భక్తులు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ఉత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకుని రేపు (సెప్టెంబర్ 4) పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ సెలవు విద్యార్థులకు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవడానికి, సాంప్రదాయ, మతపరమైన వివిధ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు కూడా ఈ ప్రభుత్వ సెలవు దినాన్ని పాటిస్తాయి. ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసి ఉంటాయని భావిస్తున్నారు.
ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 5న శనివారం నాడు ఉపాధ్యాయ దినోత్సవం (టీచర్స్ డే) కూడా ఉంది. సాధారణంగా ఈ రోజు జనరల్ హాలిడే కాకపోయినప్పటికీ, చాలా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మరికొన్ని విద్యా సంస్థలు ఈ సందర్భంగా లోకల్ హాలిడేను కూడా ప్రకటిస్తాయి. ఇక ఆ తర్వాతి రోజు సెప్టెంబర్ 6న ఆదివారం కావడంతో సాధారణ సెలవు ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే, శ్రీ కృష్ణ జన్మాష్టమి సెలవుతో ప్రారంభమై ఆదివారం వరకు విద్యార్థులకు వరుసగా సెలవులు లభించే అవకాశం ఉంది.
వచ్చే వారంలో మరో శుభవార్త!
విద్యార్థులకు కేవలం ఈ వారంలోనే కాకుండా, వచ్చే వారం కూడా సెలవుల రూపంలో ఒక పెద్ద శుభవార్త వేచి ఉంది. సెప్టెంబర్ 12న రెండో శనివారం కావడంతో చాలా పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఆ మరుసటి రోజు సెప్టెంబర్ 13న ఎలాగూ ఆదివారం సాధారణ హాలిడే. ఇక ఆ వెంటనే సెప్టెంబర్ 14న సోమవారం నాడు వినాయక చవితి పండుగ రానుంది. ఇలా వరుసగా రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి పండుగ సెలవుల కలయికతో విద్యార్థులకు మరోసారి వరుస సెలవులు రానున్నాయి.
మొత్తంగా ఈ సెప్టెంబర్ నెలలో వరుస సెలవులతో విద్యార్థులకు ఫుల్ జోష్ దక్కనుంది. అయితే, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు లేదా వ్యక్తిగత విద్యా సంస్థలు జారీ చేసే అధికారిక నోటిఫికేషన్లను బట్టి ఈ సెలవుల షెడ్యూల్ మారే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయా పాఠశాలలు జారీ చేసే నోటిఫికేషన్లను గమనించాల్సి ఉంటుంది.
Also Read: మీ వీధిలో వినాయక మండపం పెడుతున్నారా? ఒకే క్లిక్తో పోలీస్ పర్మిషన్..రూ.1 ఖర్చు లేదు!
Also REad: రేపు మాంసం దుకాణాలు బంద్.. కృష్ణాష్టమి నాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆదేశాలు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Konda Surekha: రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశాడు.. కొండా సురేఖ సంచలన ఆరోపణలు
Baddipadaga, Telangana:Konda Surekha Press Meet: తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం.. తీవ్ర చర్యలు తీసుకోవడంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి తనపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. తనను మంత్రివర్గం నుంచి తొలగించడం చాలా బాధాకరం అని చెప్పారు. కారణం చెప్పకుండా తనను తొలగించారని పేర్కొన్నారు. మంత్రి పదవి పోయిందనే బాధ తనకు లేదని.. పదవి ఒక ఆభరణంగా కొండా సురేఖ తెలిపారు.
Konda Surekha: సోనియా గాంధీకి మంత్రి కొండా సురేఖ సంచలన లేఖ.. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు
Baddipadaga, Telangana:Konda Surekha vs Revanth Reddy: తెలంగాణ మంత్రివర్గం నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి లేఖ రాయడంతో తెలంగాణ రాజకీయాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. తనపై వేటు వేయడానికి నిర్ణయం తీసుకోవడంతో కొండా సురేఖ తీవ్రంగా పరిగణించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సంచలన లేఖ రాశారు. ఆ లేఖలో రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ కొండా సురేఖ పలు విషయాలు వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించి మంత్రిగా, బీసీ మహిళా నేతగా తన ఆత్మగౌరవాన్ని కాపాడాలని, న్యాయం చేయాలని కొండా సురేఖ సోనియా గాంధీని కోరారు. ఆ లేఖలో ఏమున్నాయంటే..?
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీకి 10 పేజీల ఘాటైన లేఖ రాశారు. బీసీ మహిళా మంత్రినైన తనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మొదటి నుంచి రాజకీయ, పరిపాలనాపరమైన అణచివేతకు పాల్పడుతున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
లేఖలోని ప్రధాన అంశాలు
మంత్రిత్వ శాఖ అధికారాల తగ్గింపు
సంబంధిత శాఖా మంత్రి అయిన తన ప్రమేయం లేకుండా, తన దృష్టికి కూడా తీసుకురాకుండా సీఎంవో ఆదేశాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. యాదాద్రి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు, సమ్మక్క-సారలమ్మ ఆలయ నిధుల మళ్లింపు వంటి వ్యవహారాల్లో తనను పూర్తిగా పక్కన పెట్టారని పేర్కొన్నారు.
మాజీ ఓఎస్డీ వివాదం – నివాసానికి పోలీసుల రాక
మాజీ ఓఎస్డీ సుమంత్ను సమాచారం ఇవ్వకుండా తొలగించడమే కాకుండా వివాదంలో ఇరికించి అరెస్ట్ చేసేందుకు తాను నివసించే క్వార్టర్స్కు పోలీసులను పంపడం అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంపై వివక్ష
వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారని, స్మార్ట్ సిటీ మోడల్ బస్ స్టాండ్, బొండి వాగు విస్తరణ వంటి అత్యవసర పనులకు నిధులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు.
కడియం శ్రీహరి తీరుపై అభ్యంతరం
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు సమాచారం లేకుండా దేవాదాయ శాఖ హెడ్ ఆఫీసులో సమీక్ష నిర్వహించారని.. అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తుచేశారు.
కూతురు వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసు
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మనస్తాపం చెంది కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనను బాధ్యురాలిని చేస్తూ షోకాజ్ నోటీసు ఇవ్వడం తీవ్ర మానసిక క్షోభకు గురిచేసిందని వాపోయారు.
కొండా కుటుంబంపై కుట్రలు
వరంగల్ జిల్లాలో కొండా కుటుంబాన్ని రాజకీయంగా ఒంటరిని చేసేందుకు తెరవెనుక శక్తులు పని చేస్తున్నాయి. పార్టీ నేతలతో తమపై ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
Ganesh Mandapam Permission: మీ వీధిలో వినాయక మండపం ఏర్పాటు చేస్తున్నారా? ఒక్క క్లిక్తో పోలీస్ పర్మిషన్..రూపాయి ఖర్చు లేదు!
Vijayawada, Andhra Pradesh:Ganesh Mandapam Permission In AP: ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి వేడుకల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు, నిర్వాహకులకు ఇబ్బందులు తొలగించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్సవ మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ఇకపై అధికారుల చుట్టూ, వివిధ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ లోనే అత్యంత సులువుగా అనుమతులు పొందేలా ఒక ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నూతన విధానాన్ని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్కుమార్ గుప్తా గారు అధికారికంగా వెల్లడించారు.
మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు 'www.ganeshutsav.net' అనే సింగిల్ విండో ఈ-పోర్టల్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఉత్సవాల నిర్వహణ కోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. ఇది నిర్వాహకులకు ఎంతో సమయం, శ్రమ, ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగా మారేది. అయితే, ఈ కొత్త విధానంతో కేవలం ఒక్క దరఖాస్తుతోనే అన్ని శాఖల ఆమోదాన్ని ఒకే చోట పొందవచ్చు. దీనివల్ల సాంప్రదాయ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం పూర్తిగా తగ్గిపోతుంది.
ముఖ్యంగా పోలీస్, అగ్నిమాపక (ఫైర్), మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ శాఖల ఉమ్మడి సమన్వయంతో ఈ అనుమతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నారు. దరఖాస్తును పరిశీలించిన అనంతరం అధికారుల ఆమోదంతో క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ అనుమతి పత్రాన్ని నిర్వాహకులు ఆన్లైన్ నుంచే నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ పత్రం వలన తనిఖీల సమయంలో అధికారులకు క్రమబద్ధీకరణ చాలా సులభం అవుతుంది. ఈ ఆన్లైన్ సేవను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. దరఖాస్తు కోసం నిర్వాహకులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు సురక్షితమైన, ప్రశాంతమైన, క్రమబద్ధమైన వాతావరణంలో జరిగేలా చూడటానికే ఈ ఏకీకృత అనుమతి వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చినట్లు పోలీస్ శాఖ తెలిపింది.
నిర్వాహకులందరూ ఈ ఆన్లైన్ వెబ్సైట్ సదుపాయాన్ని ఉపయోగించుకుని, ముందస్తుగానే దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. "సురక్షితమైన, బాధ్యతాయుతమైన వేడుకలు" నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పిలుపునిచ్చింది.
Also Read: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికల సమరం షురూ..అక్టోబరులోగా పోలింగ్ పూర్తి చేయాలని నిర్ణయం..సీట్ల సర్దుబాటు ఎలా?
Vijayawada, Andhra Pradesh:AP Local Body Elections News: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది. అక్టోబర్ నెలాఖరు లోగా స్థానిక ఎన్నికలను ఎలాగైనా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై ఎన్నికల వ్యూహంపై దిశా నిర్దేశం చేయనున్నారు. మరోవైపు, కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సాయంత్రం జరగనుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కీలక చర్చలు జరపనున్నారు.
మంత్రులకు లోకేష్ దిశా నిర్దేశం..
కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్ మంత్రులతో నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో స్థానిక ఎన్నికలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని, అక్టోబర్ నాటికి ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని ఆయన స్పష్టం చేశారు. తొలుత పురపాలికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకుని ఎన్నికలు జరిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అలాగే, అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్ నుండి దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మంత్రులను ఆదేశించారు. విద్యా, వివిధ సంక్షేమ శాఖలను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు చేసే కుట్రలను తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు.
విపక్షాల వ్యూహం..
మరోవైపు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం తమ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లను స్థానిక ఎన్నికలకు సమాయత్తం చేశారు. అయితే, ఎన్నికల నిర్వహణను సదరు ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆపాలని కోరుతూ వైఎస్సార్సీపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతూ, అన్ని స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మంత్రులకు బిగ్ టాస్క్ అప్పగించింది.
Also Read: రేపు మాంసం దుకాణాలు బంద్.. కృష్ణాష్టమి నాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆదేశాలు?
Also Read: విద్యార్థులకు శుభవార్త.. 'తల్లికి వందనం' నిధులు మరోసారి విడుదల..లిస్టు వచ్చేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nitin Gadkari Bike Taxi: "రాష్ట్రాలు బైక్ ట్యాక్సీలకు అనుమతి ఇవ్వాలి" కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..8 కోట్ల మందికి ఉపాధి!
Hyderabad, Telangana:Nitin Gadkari Bike Taxi News: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ ద్విచక్ర వాహనాలను ప్రయాణీకుల రవాణా కోసం (బైక్ ట్యాక్సీలుగా) నడపడానికి అనుమతించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దీనివల్ల దేశంలో దాదాపు 8 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రైవర్ల క్షేమం కోసం 'సురక్ష' పథకాన్ని ప్రారంభించిన ఆయన, ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు నెగటివ్ పాయింట్ల విధానాన్ని మోటార్ వాహనాల చట్టంలోకి తెస్తున్నట్లు వెల్లడించారు.
రవాణా అనేది రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతో, వారి ఆమోదం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ సేవల విస్తరణ ద్వారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 8 కోట్ల మందికి జీవనోపాధి, స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయని గడ్కరీ వివరించారు.
డ్రైవర్లు, ప్రమాదకర వాతావరణంలో పనిచేసే కార్మికుల భద్రతను పెంపొందించడానికి కేంద్రం 'సురక్ష' అనే వినూత్న పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రహదారుల నిర్మాణం, మైనింగ్ పనులలో పాల్గొనే శ్రామికులకు ఉచిత వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ అందజేస్తారు.
తొలుత మహారాష్ట్రలోని నాగ్పూర్-కాంప్టీ ప్రాంతం (NH-44) నుండి చంద్రాపూర్ మైనింగ్ బెల్ట్ వరకు 150 కిలోమీటర్ల మేర దీనిని అమలు చేసి, 10,000 మందికి లబ్ధి చేకూర్చనున్నారు. రహదారి భద్రతకు డ్రైవర్ల శారీరక, మానసిక శ్రేయస్సు ఎంతో కీలకమని, అందుకే వారి కంటి చూపు, ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
మరోవైపు, దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టంలో సవరణలు చేయనుంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు 'నెగటివ్ పాయింట్ల' విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. డ్రైవర్లు చేసే ప్రతి ఉల్లంఘనకు వారి ఖాతా నుండి పాయింట్లు తగ్గిస్తారు. పరిమితి మించితే డ్రైవింగ్ లైసెన్స్ను తాత్కాలికంగా రద్దు చేయడం లేదా పూర్తిగా నిషేధించడం జరుగుతుంది. ఇది నిరంతర నిబంధనల ఉల్లంఘనదారులలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తుందని ఆశిస్తున్నారు.
ఇక నాగ్పూర్లో జరిగిన 'ది ఎకనామిక్ టైమ్స్ - చేంజ్మేకర్స్ ఆఫ్ నాగ్పూర్ -2026' కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, నైతిక విలువలు, విశ్వసనీయత ప్రాముఖ్యతను వివరించారు. వ్యాపార రంగంలో పరిశోధన, అభివృద్ధి (R&D) పై పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఒక వ్యాపారవేత్త తన కర్మాగారం తగలబడినప్పటికీ పట్టుదలతో శ్రమించి ప్రస్తుతం 90 దేశాలకు ఎగుమతి చేస్తున్న స్థాయికి ఎదిగారని గుర్తుచేశారు. "ఒక వ్యక్తి ఓడిపోయినంత మాత్రాన ముగిసిపోడు, పోరాటాన్ని వదిలేసినప్పుడే అంతమవుతాడు" అని మంత్రి స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు.
Also Read: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!
Also Read: "రూ.43,000 కోట్ల అప్పులు తీర్చాను..నా జీవితం తెరిచిన పుస్తకం": Dr.సుభాష్ చంద్ర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
