icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Bandi bhagirath: కీలక ఆధారాలతో ఆ రోజు వస్తా.!. సిట్ పోలీసులకు బండి భగీరథ్ సంచలన లేఖ..

Hyderabad, Telangana:

Bandi Bhagirath responds to Hyderabad police sit notices: కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండీ భగీరథ్ పోక్సో కేసు వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతుంది. ఇప్పటికే దీనిపై బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలను సంధిస్తుంది. మే 8న కేసు నమోదైతే ఇప్పటి వరకు అరెస్ట్ చేయక పోవడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. మంత్రుల కొడుకులకు ఒక న్యాయం, ప్రజలకు మరో న్యాయమా అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు బండి సంజయ్ దేశం వదిలి పారిపోయాడా అంటూ పలు చోట్ల పోస్టర్ లు వెలిశాయి. ఈ క్రమంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసును విచారిస్తోంది. తమ ఎదుట విచారణకు రావాల్సిందిగా భగీరథ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు పోలీసుల ముందు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. అయితే సమయం గడిచినప్పటికీ భగీరథ్.. పోలీసుల విచారణకు హాజరుకాలేదు. ఈ క్రమంలో తాజాగా.. బండి భగీరథ్ సిట్ పోలీసులకు మెయిల్ చేయడం సంచలనంగా మారింది.

ఈ క్రమంలో తాను మే 15న సిట్ పోలీసుల ఎదుట హజరవుతానని ఆ లేఖలో పేర్కొన్నాడు.  కీలక సాక్షాలతో విచారణకు హాజరవుతానంటూ  బండి భగీరథ పేర్కొన్నాడు. తనకు రెండు రోజుల సమయం కావాలని గడువు కోరాడు. అంతే కాకుండా SIT దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని కూడా భగీరత్‌ తన లేఖలో పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ రోజు రాలేకపోయానని లేఖలో పేర్కొన్నాడు.   ఈ లేఖ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ మారింది.

బండి  భగీరథ్ పై పోలీసులు BNS 74,75 తో పాటు సెక్షన్ 5 (i) రెడ్ విత్ 6 కింద కేసులు నమోదు చేశారు. బాధితురాలి నుంచి రెండో సారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. తాజాగా నిందితుడిపై తీవ్రమైన లైంగిక దాడి, ముందుగా ప్లాన్ చేసి లైంగిక చర్యలకు పాల్పడినట్లు సెక్షన్ 5 (i)ను కూడా పోలీసులు జతపరిచారు.

Read more: Kalva kuntla Kavitha: మైనర్ అమ్మాయికే ఎక్కువ నష్టం..!.. బండి భగీరథ్

మరోవైపు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ పిటిషన్‌ వేశారు. ఇక తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై రేపు విచారణ జరగనుంది. హైకోర్టు ఏవిధంగా తీర్పునిస్తుంది.. బండి సంజయ్ కొడుకు ఏవిధమైన ఆధారాలను సిట్ ముందు ఉంచుతారో అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

India Squad: అఫ్ఘానిస్తాన్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. హిట్‌మ్యాన్‌ రీఎంట్రీ, నలుగురికి తొలి ఛాన్స్‌

Wadgaon, Maharashtra:

India Squad For Afghanistan Series: ఐపీఎల్‌ 2026 సీజన్‌ ముగింపు చేరుకోవడంతో భారత జట్టు తదుపరి టోర్నీలపై దృష్టి సారించింది. మెగా టోర్నీ ముగిసిన వారానికే టీమిండియా అఫ్ఘానిస్థాన్‌తో తలపడనుంది. ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌ కోసం అఫ్ఘానిస్థాన్‌ భారత పర్యటనకు రానుంది. ఐపీఎల్‌లో వేర్వేరు జట్ల‌లో ఆడుతున్న టీమిండియా ఆట‌గాళ్లు మ‌ళ్లీ భారత జట్టుగా కనిపించనున్నారు. జూన్‌ 6వ తేదీ నుంచి ఏకైక టెస్టు, 14, 17, 20 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం సమావేశమైన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌కు శుభమన్‌ గిల్‌ సారథ్యం వహించనుండగా.. ఐపీఎల్‌లో సత్తా చాటుతున్న ఆటగాళ్లందరికీ అవకాశం లభించింది.

Also Read: SRH Qualified: చెన్నైకి తీవ్ర నిరాశ.. ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌లోకి హైదరాబాద్

అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ టెస్టు, వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టు జాబితాను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు స్థానం లభిస్తుందా? లేదా అనే ఉత్కంఠ కొనసాగుతుండగా.. కమిటీ సీనియర్‌ ఆటగాడికి చోటు కల్పించింది. అతడితోపాటు హార్దిక్‌ పాండ్యాకు కూడా స్థానం దక్కింది. ఇక ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న రిషబ్‌ పంత్‌ను వన్డేలకు ఎంపిక చేయకపోగా టెస్టుకు ఎంపిక చేయడం గమనార్హం. స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, సీనియర్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు చోటు దక్కలేదు. వీరిద్దరూ ఐపీఎల్‌లో సత్తా చాటలేకపోయారు. బుమ్రా అయితే ఒకటి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడికి జట్టులో స్థానం లభించలేదు.

Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్‌కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!

నలుగురికి ఛాన్స్
ఏకైక టెస్టు మ్యాచ్‌కు గిల్‌ సారథ్యం వహిస్తుండగా.. కేఎల్ రాహుల్ వైస్‌ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. మ‌రోవైపు వ‌న్డేల‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికవగా.. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ త‌ర‌ఫున నిల‌క‌డ‌గా రాణిస్తున్న ప్రిన్స్ యాద‌వ్‌తోపాటు హర్ష్‌ దూబే, గుర్నూర్‌ బ్రార్‌, మానవ్‌ సుతార్‌కు జాతీయ జట్టులో తొలిసారి స్థానం లభించింది. అక్షర్‌ పటేల్‌, ఆకాశ్‌ దీప్‌లకు చోటు లభించకపోగా.. సీనియ్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ ఎంపికపై సెలక్షన్‌ కమిటీ చర్చించలేదని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ప్రకటించారు.

Also Read: Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్‌.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ

భారత వన్డే జట్టు
శుభమన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీశ్‌ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే,

భారత టెస్ట్ జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, గుర్నూర్ దువ్రేల్, గుర్నూర్ దువ్రార్ జురేల్,

మ్యాచ్‌ల వివరాలు
ఏకైక టెస్టు: జూన్‌ 6-10 తేదీల్లో చండీగడ్‌, ముల్లాన్‌పూర్‌
తొలి వన్డే: జూన్‌ 14, ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్‌)
రెండో వన్డే: జూన్‌ 17, లక్నో (ఉత్తరప్రదేశ్‌)
మూడో వన్డే: జూన్‌ 20, చెన్నై (తమిళనాడు)

0
0
Report

Hyderabad Police: పోలీసుల మెరుపు వేగం.. గంటల్లోనే రూ.లక్షా 20 వేల నగదు బ్యాగు స్వాధీనం

Secunderabad, Telangana:

Ramgopalpet Police: హైదరాబాద్‌ పోలీసులు మెరుపు వేగంతో స్పందించి ఒక యువకుడికి సహాయం చేశారు. అతడు పోగొట్టుకున్న డబ్బు ఉన్న బ్యాగ్‌ను సురక్షితంగా అందించారు. ఫిర్యాదు అందిన కొన్ని నిమిషాల్లోనే అతడి బ్యాగును తిరిగి తీసుకువచ్చి ఇచ్చారు. ఈ సంఘటన హైదరాబాద్‌లో జరిగింది. ప్రజలకు హైదరాబాద్‌ ప్రజలు ఎల్లప్పుడూ అండగా.. రక్షణగా నిలుస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇంతకీ అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Also Read: Uppal X Road: ఉప్పల్ క్రాస్ రోడ్డు మూసివేత.. వాహనాల దారి మళ్లింపులు ఇవే!

హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో తన తండ్రికి శస్త్రచికిత్స చేస్తుండడంతో ఖర్చుల కోసం సాయి కుమార్ అనే యువకుడు రూ.1,20,000 నగదుతో ఈనెల 18వ తేదీన నగరానికి వచ్చాడు. తన తండ్రికి ఎలా ఉందోననే కంగారు.. ఆందోళనలో ఉన్న యువకుడు ఆటోలో నగదు బ్యాగుతో వచ్చాడు. అయితే ఆస్పత్రిలోకి కంగారు కంగారుగా వెళ్లిపోవడంతో ఆటోలోనే నగదు బ్యాగ్‌ మరచిపోయాడు. లోపలికి వెళ్లాక నగదు బ్యాగ్‌ గుర్తురావడంతో ఆందోళన చెందాడు. చుట్టుపక్కల ఆటో కోసం వెతికితే ఎలాంటి ప్రయోజనం లేకపోలేదు. దీంతో సాయికుమార్‌ వెంటనే సమీపంలోని రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్‌కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!

తన తండ్రి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి నగదు బ్యాగుతో చేరుకుంటే.. కంగారులో చికిత్స కోసం ఉంచిన రూ.1,20,000 నగదు ఉన్న తన బ్యాగును ఆటోలోనే మర్చిపోయినట్లు ఫిర్యాదుదారుడు సాయికుమార్‌ వివరించాడు. వెంటనే స్పందించిన రాంగోపాల్‌పేట పోలీసులు విచారణ చేపట్టారు. ఆటో కోసం వెతకడం ప్రారంభించి సీసీ ఫుటేజీలు పరిశీలించారు. నగదు కలిగిన బ్యాగును అతి తక్కువ సమయంలోనే సురక్షితంగా రికవరీ చేసి బాధితుడికి అందజేశారు.

Also Read: Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్‌.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ

ఫిర్యాదు అందిన వెంటనే రాంగోపాల్‌పేట ఎస్‌హెచ్‌ఓ (ఎస్‌హెచ్‌ఓ) బి. సురేష్ కుమార్ తక్షణమే స్పందించి కానిస్టేబుళ్లు జి.సురేష్, ఎస్. ప్రమోద్ కుమార్, బి. నరసింహలతో కూడిన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం ఆసుపత్రి పరిసరాల్లోని.. మార్గంలోని (సీసీటీవీ) ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి ఆటో నంబర్‌ను గుర్తించారు. ఆ ఆటో డ్రైవర్‌ను విజయవంతంగా కనిపెట్టి ఆటోలో ఉన్న నగదు బ్యాగ్‌ను తీసుకున్నారు.

పోలీసు బృందం ఆటోను గుర్తించిన వెంటనే ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదుదారుడికి సంబంధించిన బ్యాగును, అందులోని రూ.1,20,000 డబ్బును పైసా కూడా తగ్గకుండా పోలీస్ అధికారుల సమక్షంలో భద్రంగా అప్పగించారు. కష్ట సమయంలో మెరుపు వేగంతో స్పందించి తన తండ్రి వైద్యానికి అవసరమైన నగదును తిరిగి ఇప్పించిన రాంగోపాల్‌పేట పోలీసులకు ఫిర్యాదుదారుడు సాయి కుమార్ ధన్యవాదాలు తెలిపాడు. ఆటో డ్రైవర్ నిజాయితీని రాంగోపాల్‌పేట ఎస్‌హెచ్‌ఓ సురేష్ కుమార్ అభినందించి శాలువాతో సత్కరించారు. 

0
0
Report
Advertisement

Petrol Diesel Price Hike: ముడి చమురు ఎఫెక్ట్.. దేశంలో మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్.. కొత్త ధరలివే..!!

BBhoomi12h ago
Secunderabad, Telangana:

Petrol Diesel Price Hike:  :పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల  ప్రభావం భారత దేశంపై కూడా కనిపిస్తోంది. పెరుగుతున్న చమురు ధరల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మంగళవారం నాడు చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. ఈసారి పెట్రోల్ ధరను లీటరుకు 87 పైసలు, డీజిల్ ధరను లీటరుకు 91 పైసలు పెంచాయి. కొత్త ధరల అమలు నేపథ్యంలో... రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 98.64కు చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ. 91.58గా ఉంది. చమురు కంపెనీలు సోమవారం అర్ధరాత్రి పెట్రోల్ పంప్ ఆపరేటర్లకు కొత్త ధరల సమాచారాన్ని పంపగా.. మంగళవారం ఉదయం ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. నిరంతరం పెరుగుతున్న ధరలు ప్రజల్లో ఆందోళనను పెంచాయి.

4 రోజుల క్రితం కూడా ధరలు పెరిగాయి:

అంతకుముందు నాలుగు రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఆ రోజు.. పెట్రోల్ ధర లీటరుకు రూ. 3.14 పెరిగి లీటరుకు రూ. 97.77కు చేరింది. డీజిల్ ధరలు కూడా రూ. 3.11 పెరిగి లీటరుకు రూ. 90.67కు చేరుకున్నాయి. ఇప్పుడు కేవలం కొద్ది రోజుల్లోనే ఇది రెండవ సారి ధరల పెంపు అని చెప్పాలి. ఈ ధరల పెంపు ప్రభావం ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపింది.

Also Read: ప్రభుత్వ రంగ బ్యాంకు సంచలనం.. FDలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం.. కొత్త రేట్లు ఇవే

సామాన్య ప్రజల జేబులపై ప్రభావం:
పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల సాధారణ ప్రజలను నేరుగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా రోజూ వాహనాల్లో ప్రయాణించేవారు, రవాణా వ్యాపారంలో ఉన్నవారు, చిన్న వ్యాపారాలు ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు.  ఇంధన ధరల పెరుగుదల బస్సు, టాక్సీ, రవాణా ఖర్చులను పెంచుతుంది. ఇది ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే, రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు అంటున్నారు. దీనివల్ల ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని  చెబుతున్నారు. 

Also Read: మిడిల్ క్లాస్ నచ్చిన Top 5 Electric Scooters ఇవే.. 

 

యుద్ధం.. ప్రపంచ మార్కెట్ కారణం: 
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రపంచ ముడి చమురు సరఫరాలను ప్రభావితం చేస్తోంది. దీనివల్ల అంతర్జాతీయ చమురు ధరలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. భారతదేశం తన చమురు అవసరాలలో గణనీయమైన భాగాన్ని విదేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ప్రపంచ మార్కెట్‌లోని మార్పులు దేశంలోని ఇంధన ధరలను నేరుగా ప్రభావితం చేస్తాయి.

ప్రభుత్వం, చమురు కంపెనీలు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి, అధిక పెట్రోల్, డీజిల్ ధరల నుండి ఉపశమనం లభించే ఆశ తక్కువగా కనిపిస్తోంది. పెరుగుతున్న ధరలు గృహ బడ్జెట్‌లపై మరింత భారం మోపుతున్నాయి. దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న కాలంలో మరిన్ని చెడు రోజులను ఎదుర్కొవల్సిన పరిస్థితి ఉందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

0
0
Report

SRH Qualified: చెన్నైకి తీవ్ర నిరాశ.. ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌లోకి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

Chennai, Tamil Nadu:

SRH Qualified To Playoffs: ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌లోకి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు దూసుకెళ్లింది. చెన్నై జట్టుపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చిన హైదరాబాద్‌ అద్భుత విజయం సాధించి ముందడుగు వేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నైను చిత్తు చేసింది. టాప్‌ జట్టుగా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌ అవకాశాలను చేజార్చుకుంది. మొదట తడబడి.. తర్వాత పుంజుకుని అనంతరం మళ్లీ వెనకబడడంతో ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓడిపోయింది.

ప్రత్యర్థి విధించిన 181 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో ఛేదించింది. పవర్‌ప్లేలో తడబడినా.. తర్వాత బ్యాటర్లు పుంజుకోవడంతో మ్యాచ్‌ను సులువుగా హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. ముందడుగు వేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ట్రావిస్‌ హెడ్‌ మరోసారి నిరాశపర్చగా.. అభిషేక్‌ శర్మ (26) తక్కువ పరుగులకు ఔటయ్యాడు. ప్లేఆఫ్స్‌ లక్ష్యంగా ఇషాన్‌ కిషన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ ఆడారు. 26 బంతుల్లో 47 పరుగులు చేసిన క్లాసెన్‌.. ఆరు బౌండరీలు, రెండు సిక్సర్లు బాదాడు. ఇషాన్‌ కిషన్‌ 47 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి 7 బంతుల్లో 11 స్కోర్‌ చేశాడు. సలీల్ అరోరా విన్నింగ్ షాట్లు ఆడాడు.

అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్‌లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (15), ఊర్విల్‌ పటేల్‌ (13) తక్కువ పరుగులకు ఔటయ్యారు. స్టార్‌ ఆటగాడు సంజూ శామ్‌సన్‌ 27 పరుగులు చేయగా.. కార్తీక్‌ శర్మ 32 స్కోర్‌ చేసి సత్తా చాటారు. డెవాల్డ్‌ బ్రేవిస్‌ 27 బంతుల్లో 44 పరుగులు జోడించాడు. శివమ్‌ దూబే (26), ప్రశాంత్‌ వీర్‌ (11) తలా కొంత స్కోర్‌ చేశారు. ప్రత్యర్థి సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పదునైన బౌలింగ్‌ వేసింది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ మూడు వికెట్లు తీయగా.. షకీబ్‌ హుస్సే రెండు వికెట్లు తీశాడు. ప్రఫుల్‌ హింగే, ఈషాన్‌ మలింగ ఒక్కో వికెట్‌ తీశారు.

ఐపీఎల్‌ 2026లో 13 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 విజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. చెన్నై 13 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలు, ఏడు ఓటములతో ప్లేఆఫ్స్‌కు దూరమైంది. కానీ ఈ సీజన్‌లో చెన్నై ప్రదర్శన గొప్పగా ఉంది. మొదట పడిపోవడం.. అనంతరం గొప్పగా పుంజుకుని ప్లేఆఫ్స్‌ రేసులోకి ప్రత్యర్థులను భయపెట్టింది.

0
0
Report

AP Govt Gift: ఉచిత విద్యుత్‌కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!

Nuzendla, Andhra Pradesh:

AP Govt Announces Another Gift: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త వినిపించింది. ఇప్పటికే పలు వర్గాల ప్రజలకు ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేస్తుండగా.. ఆ పథకాన్ని మరింత విస్తరించనుంది. కులవృత్తులకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. కులవృత్తిపై ఆధారపడిన నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చేలా.. వారికి సాంత్వన కలిగించేలా ఉచితంగా విద్యుత్‌ అందించనుంది. హెయిర్‌ సెలూన్లు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత విద్యుత్‌ పథకాన్ని ఎలా పొందాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి, కావాల్సిన పత్రాలేంటి? అనే వివరాలు తెలుసుకుందాం.

Also Read: Matsyakarula Sevalo: సీఎం చంద్రబాబు తీపి కబురు.. రేపు ఒక్కొక్కరికి రూ.20 వేలు విడుదల

రాష్ట్రంలోని బీసీ, ఎంబీసీ వృత్తిదారులకు, బీపీఎస్ కుటుంబాలకు ఉచిత కరెంట్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. బీసీ వర్గాల జీవనోపాధి అభివృద్ధి కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. బీసీ వర్గాలకు చెందిన రజకులు (చాకలి), స్వర్ణకారులు (విశ్వబ్రాహ్మణులు), నాయీ బ్రాహ్మణులు (మంగలి), అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. ఉచిత పథకం పొందే లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది.

Also Read: Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్‌.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ

ఉచిత విద్యుత్ వివరాలు
==> సెలూన్లు (నాయీ బ్రాహ్మణులు): 200 యూనిట్లు ఫ్రీ
==> లాండ్రీ షాపులు (రజకులు): 150 యూనిట్లు ఫ్రీ 
==> గోల్డ్ షాపులు (స్వర్ణకారులు): 100 యూనిట్లు ఫ్రీ
==> గృహాలు (తెల్ల రేషన్ కార్డు): 100 యూనిట్లు ఫ్రీ

Also Read: Manchu Manoj Trust: హీరో మంచు మనోజ్‌ 'మంచి' మనసు.. ఐదుగురి విద్యార్థుల దత్తత

ఉచిత విద్యుత్‌కు దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
అర్హులైన లబ్దిదారులు సంబంధిత పత్రాలతో ఏపీఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) కార్యాలయాన్ని సంప్రదించాలి. అక్కడ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.

==> ఆధార్ కార్డు
==> రేషన్ కార్డు
==> కుల ధృవీకరణ పత్రం
==> ప్రస్తుత కరెంట్ బిల్లు / సర్వీస్ నెంబర్
==> ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికెట్

సర్టిఫికెట్‌ అవసరం లేదు
కొన్ని వర్గాలకు ధ్రువపత్రాలు అవసరం లేదు. అత్యంత వెనుకబడిన వర్గాలైన దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, ముత్యాలమ్మవాండ్లు తదితర 32 ఉప కులాలకు చెందిన వారికి ఎస్టాబ్లిష్‌మెంట్ సర్టిఫికెట్ అవసరం లేదు. అర్హులైన వృత్తిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.

0
0
Report
Advertisement

Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్‌.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ

Tirupati Urban, Andhra Pradesh:

VVIPs Rush To Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో సినీ సందడి నెలకొంది. ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి, ఆయన సతీమణి నిక్కీ గల్రానీ శ్రీవారిని దర్శించుకున్నారు. తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ జంట స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న ఆది పినిశెట్టి దంపతులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి వీఐపీ బ్రేక్ ద్వారా ప్రత్యేక దర్శన భాగ్యాన్ని కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ దంపతులకు వేద ఆశీర్వచనం అందించి.. పట్టువస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందించారు.

Also Read: Matsyakarula Sevalo: సీఎం చంద్రబాబు తీపి కబురు.. రేపు ఒక్కొక్కరి బ్యాంకు అకౌంట్‌లలోకి రూ.20 వేలు విడుదల

దర్శనం అనంతరం ఆలయం వెలుపల నటుడు ఆది పినిశెట్టి మీడియాతో మాట్లాడారు. 'ఈరోజు మా పెళ్లి రోజు. ఈ ప్రత్యేకమైన రోజున స్వామిని దర్శించుకుని.. ఆయన ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే సూపర్ హిట్ చిత్రం మరకతమణికి సీక్వెల్‌గా మరకతమణి పార్ట్-2 చేయబోతున్నా' అని ఆది తెలిపారు. ఆలయం వెలుపల ఆదిని చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.

హోంమంత్రి దర్శనం
తిరుమల వేంకటేశ్వర స్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం హోంమంత్రి వంగలపూడి అనిత తన కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు మంత్రికి స్వామి వారి పట్టు వస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.

Also Read: Manchu Manoj Trust: హీరో మంచు మనోజ్‌ 'మంచి' మనసు.. ఐదుగురి విద్యార్థుల దత్తత

దర్శనానంతరం ఆలయం వెలుపల హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. 'వేంకటేశ్వర స్వామిని కుటుంబసమేతంగా దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని ప్రార్థించా. కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి వైపు వేగంగా దూసుకుపోతోంది. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆ స్వామి వారిని కోరుకున్నా. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీ ప్రగతి పథంలో పయనిస్తుంది' అని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

Also Read: KTR Speech: తెలంగాణ అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్‌ రావాల్సిందే: కేటీఆర్‌

0
0
Report

Matsyakarula Sevalo: సీఎం చంద్రబాబు తీపి కబురు.. రేపు ఒక్కొక్కరికి రూ.20 వేలు విడుదల

Kavali, Andhra Pradesh:

Matsyakarula Sevalo Scheme Amount Release: సముద్రపు వేటపైనే జీవనోపాధిపై ఆధారపడిన మత్య్సకారుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వేటకు విరామం ఇవ్వడంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడే మత్య్సకారులకు ఏపీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ఆర్థిక సహాయం అందించనుంది. గంగపుత్రులకు రెండో ఏడాది కూటమి ప్రభుత్వం మత్య్సకారుల సేవలో పథకం నిధులను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఏపీ ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ కింద ప్రతీ కుటుంబానికి రూ.20 వేలు జమ చేయడంతో 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు లబ్ది జరగనుంది.

Also Read: Manchu Manoj Trust: హీరో మంచు మనోజ్‌ 'మంచి' మనసు.. ఐదుగురి విద్యార్థుల దత్తత

వేట నిషేధ కాలంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా మత్స్యకారులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేయనుంది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో జరిగే  కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మత్య్సకార కుటుంబాలకు నిధులు విడుదల చేయనున్నారు.

Also Read: KTR Speech: తెలంగాణ అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్‌ రావాల్సిందే: కేటీఆర్‌

ప్రతీ ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపలు పిల్లలు పెట్టే సమయంలో వేటకు విరామం ఉండే విషయం తెలిసిందే. వేట నిషేధం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడంతో ఉపాధి కోల్పోతున్నారు. వారి జీవనానికి ఇబ్బంది లేకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. 

వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ ఏడాది లబ్ధిదారు కుటుంబాల సంఖ్య కూడా పెరగ్గా.. రెండేళ్లలో మత్య్సకారుల కుటుంబాలకు రూ.505 కోట్లను ప్రభుత్వం సహాయంగా అందించింది.

Also Read: Uppal X Road: ఉప్పల్ క్రాస్ రోడ్డు మూసివేత.. వాహనాల దారి మళ్లింపులు ఇవే!

బాధిత కుటుంబాలకు భరోసా
మత్య్సకారులకు ఈ సహాయంతోపాటు మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అందిస్తోంది. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు పరిహారం సకాలంలో అందిస్తోంది. 2024-25లో 63 క్లెయిమ్స్‌కు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 పెండింగ్ క్లెయిమ్స్‌కు రూ.5.65 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అం

సీఎం చంద్రబాబు పర్యటన
==> మత్య్సకారుల సేవలో పథకం నిధుల విడుదల కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో జరగనుంది. 
==> ఉదయం 9.30 గంటలకు అమరావతి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరుతారు
==> ఉదయం 10.30 గంటలకు కావలి మండలం తుమ్మలపెంటకు చేరుకుంటారు
==> 10.45 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగం
==> 11.55 నిమిషాలకు మత్య్సకారులకు నిధులు విడుదల చేస్తారు
==> మధ్యాహ్నం 01.15 గంటలకు గ్రామంలోని మత్య్సకార కుటుంబాలతో సమావేశం
==> మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం
==> సాయంత్రం 04.45 గంటలకు తిరిగి అమరావతికి చేరుకుంటారు

0
0
Report

Women Welfare Schemes: మహిళలకు బంపర్ గిఫ్ట్.. అటు ఫ్రీ బస్సు జర్నీ.. ఇటు జూన్ 1నుంచి ప్రతినెలా రూ. 3000 అకౌంట్లో జమ..!!

BBhoomi1d ago
Secunderabad, Telangana:

Annapurna Yojana West Bengal: భారతదేశంలోని రెండు రాష్ట్రాలైన కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరిన వెంటనే మహిళలకు భారీ వరాలు కురిపించాయి.  మహిళలు, సాధారణ ప్రజల కోసం అనేక ప్రధాన సహాయ కార్యక్రమాలను ప్రకటించాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని ఇటీవలి మంత్రివర్గ నిర్ణయాలలో మహిళలు, వృద్ధులు, పేదలను లక్ష్యంగా చేసుకున్న అనేక కొత్త కార్యక్రమాలు ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మహిళలకు రూ. 3,000 ఆర్థిక సహాయం అందించే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం 2026 జూన్ 1 నుంచి అమలులోకి రానుంది. ఈ స్కీము కింద..మహిళలకు ప్రతి నెలా రూ. 3,000 సహాయం అందుతుంది. ఇప్పటికే  లక్ష్మీ భండార్ స్కీము ప్రయోజనాలను పొందుతున్న మహిళలు ఆటోమేటిక్‌గా ఈ పథకం ప్రయోజనాలను పొందుతారు.  లక్ష్మీ భండార్ స్కీమ్ పేరును మార్చుతూ అన్నపూర్ణ యోజన అని పేరు పెట్టారు. అంతేకాదు ఇప్పటి వరకు ఏ పథకంలోనూ పేర్లు లేని మహిళల కోసం ఒక కొత్త పోర్టల్ తెరవనున్నట్లు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. 

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం:
ఇక రాష్ట్రంలోని అన్ని  ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సువేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సౌకర్యం కూడా జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇక కొన్ని పాత పథకాలలో పలు కీలక మార్పులు చేసింది. మతపరమైన కారణాలతో నడుస్తున్న కొన్ని పాత సహాయ పథకాలను క్రమంగా నిలిపివేస్తామని కేబినెట్ నిర్ణయించింది. అయితే.. ఈ నెల వరకు నడుస్తున్న పథకాలు కొనసాగుతాయని వెల్లడించింది.  ఆ తర్వాత వాటిని రద్దు చేయనున్నట్లు ప్రకటించింది.

Also Read: ప్రభుత్వ రంగ బ్యాంకు సంచలనం.. FDలపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం.. కొత్త రేట్లు ఇవే

ఇక కేరళలోని కొత్తగా ఏర్పడిన  యూడీఎఫ్ ప్రభుత్వం కూడా  మహిళలు, సమాజంలోని బలహీన వర్గాల కోసం అనేక పెద్ద నిర్ణయాలు తీసుకుంది. కేరళలో కూడా కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ఈ పథకం 2026 జూన్ 15 నుంచి అమల్లోకి వస్తుంది.  ఆశా , అంగన్‌వాడీ కార్యకర్తలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం ఆరోగ్య, సామాజిక కార్యకర్తలకు కూడా ఉపశమనం కల్పించింది. ఆశా కార్యకర్తలకు ప్రతి నెలా రూ.3,000 అదనపు గౌరవ వేతనం అందించనుంది. ఇక అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు కూడా నెలకు అదనంగా రూ. 1,000 లభిస్తాయి.వీరితోపాటు పాఠశాలలో పనిచేస్తున్న వంటవాళ్లు, ఇతర సిబ్బంది జీతాలను కూడా పెంచారు.

వృద్ధుల కోసం కొత్త శాఖ:
దేశంలోనే తొలిసారిగా వృద్ధుల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వయోవృద్ధుల సంరక్షణ, వారి జీవితాలను మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. రాష్ట్రంలో కొత్త శాసనసభను ప్రారంభించడం కూడా ప్రభుత్వం తీసుకున్న ఇతర ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. ఇక కొన్ని కేసుల దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ఒక నివేదికను కూడా విడుదల చేస్తుంది. ఈ  రెండు రాష్ట్రాల్లోని కొత్త ప్రభుత్వాలు మహిళలకు, సాధారణ ప్రజలకు సహాయాన్ని, సౌకర్యాలను పెంచడంపై ప్రాధాన్యతనిచ్చినట్లు చూడవచ్చు.

Also Read: మిడిల్ క్లాస్ నచ్చిన Top 5 Electric Scooters ఇవే..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Heatwave Alert: ఆ 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్..ప్రాణాంతకంగా మారిన వడగాలులు!

Hyderabad, Telangana:Heatwave Alert AP And Telangana: ఓ పక్క నైరుతి రుతుపవనాలు దేశానికి కూతవేటు దూరంలో ఉన్నాయనే సమాచారంతో ఊపిరి పీల్చుకున్న తెలుగు ప్రజలకు ఇప్పుడు నెత్తిమీద తాటికాయ పడినట్లు అయ్యింది. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ రానున్న వారం రోజుల పాటు మాడు పగిలేలా ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు భానుడు భగభగలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో విపరీతమైన ఎండలు ఉండబోతునున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
0
0
Report

Peddi Trailer: 'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది! క్రికెట్, కుస్తీలో రఫ్ఫాడించిన మెగాపవర్ స్టార్..పక్కా బ్లాక్‌బస్టర్!

Mumbai, Maharashtra:

Peddi Movie Telugu Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది'. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ సినిమాపై అమాంతం అంచనాలను పెంచేశాయి. తాజాగా మే 18న ముంబైలోని జియో స్టూడియోలో 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

ఈ సినిమాలో హీరో పెద్దిగా నటించిన రామ్‌చరణ్ బెల్లం ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్నాడని తెలుస్తోంది. దీంతో పాటు తాను క్రికెట్, కుస్తీలో రాటుదేలిన ఆటగాడిగా కనిపిస్తాడు. కుస్తీలో నేషనల్ గేమ్స్‌లో పాల్గొన్నట్లు సన్నివేశాల్లో కనిపిస్తుంది. గ్రామీణ యువకులకు స్పోర్ట్స్‌లో ఇతనో రోల్‌ మోడల్‌గా కనువిందు చేయనున్నాడు. అయితే లోకల్ రాజకీయాల వల్ల పెద్దికి వచ్చిన కష్టం ఏంటి? అతను ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయానికి ఎందుకు వెళ్లాల్సొచ్చిందని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ ట్రైలర్‌లోని డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 

నిన్న అనగా మే 17న 'పెద్ది' ట్రైలర్ చూసిన ఆనందంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. "పెద్ది ట్రైలర్ చూసాను! జస్ట్ వావ్..అంతే. 3 నిమిషాలు… ప్యూర్ ఫైర్‌ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చిబాబు, ఏఆర్ రెహమాన్.. ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు.. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ఈ ట్రైలర్ ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్.. అన్నీ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి" అని 'పెద్ది' టీమ్‌పై ప్రశంసల వర్షం కురింపించారు.

చిరూ లీక్స్‌కు పని చెప్పి చాలా రోజులు అవుతుందని చిరంజీవి చమత్కరించారు. చాలా రోజుల తర్వాత తన మార్క్ 'పెద్ది' ట్రైలర్‌లోని ఓ డైలాగ్‌ను లీక్ చేశారు. "మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు..." అనే డైలాగ్‌ లీక్ చేసి ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీని మరింత పెంచారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌లోని డైలాగ్ లీక్ చేయడం వల్ల 'పెద్ది' సినిమా డైరెక్టర్‌కు మెగాస్టార్ చిరంజీవి సారీ చెప్పారు. "Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా!" అంటూ ఫన్నీగా పోస్ట్ చేశారు.

బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ 'పెద్ది' సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ కథానాయకుడిగా నటించగా.. ఆయన సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. ఇందులో కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా.. మైత్రీ మూవీస్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా తెరకెక్కించాయి. మే 18న సినిమా ట్రైలర్ విడుదల చేయనుండగా.. జూన్ 4న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. 

Also Read: 'పెద్ది' సినిమా ఫస్ట్ రివ్యూ..చివరి 50 నిమిషాలు ఘోరం..ప్రేక్షకులకు కన్నీళ్లే ఇక!

Also REad: 'పెద్ది'లో చెల్లి కోసం వెళ్లి అక్కను తీసుకొచ్చారట..జాన్వీ కపూర్‌పై డైరెక్టర్ కామెంట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Bakrid Holiday: బక్రీద్ పండగ ఎప్పుడు? మే 27 లేదా మే 28 ప్రభుత్వ సెలవు ఎప్పుడంటే?

Hyderabad, Telangana:

Bakrid Holiday In Telangana: తెలంగాణలో ఆదివారం సాయంత్రం 'జుల్-హిజ్జా 1447 AH' మాసానికి సంబంధించిన నెలవంక కనిపించకపోవడంతో, రాష్ట్రంలో బక్రీద్ (ఈద్ అల్-అధా) పండుగను మే 28న జరుపుకోనున్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మరే ఇతర ప్రాంతంలోనూ నెలవంక కనిపించలేదని 'సదర్ మజ్లిస్-ఎ-ఉలమా-ఎ-దక్కన్' సంస్థ అధికారికంగా ధృవీకరించింది.

ఆ సంస్థ ప్రతినిధి సయ్యద్ హసన్ ఇబ్రహీం హుస్సేని ఖాద్రీ (సజ్జాద్ పాషా) జారీ చేసిన ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం నడుస్తున్న 'జుల్-ఖాదా' మాసం 30 రోజులు పూర్తి చేసుకుంటుంది. దీనివల్ల మే 19 (మంగళవారం) జుల్-హిజ్జా మాసపు మొదటి రోజు అవుతుంది. ఇస్లామిక్ చంద్ర క్యాలెండర్ ప్రకారం జుల్-హిజ్జా పదవ రోజున బక్రీద్ జరుపుకుంటారు. కాబట్టి, పండుగ తేదీ మే 28 (గురువారం)గా ఖరారైంది.

మారనున్న ప్రభుత్వ సెలవు..
తెలంగాణ ప్రభుత్వం తన అధికారిక వార్షిక క్యాలెండర్‌లో బక్రీద్ సెలవును మే 27గా ముందుగానే ప్రకటించింది. అయితే, పండుగ తేదీ ఒక రోజు ముందుకు మారడంతో, ఈ ప్రభుత్వ సెలవును మే 28కి సవరిస్తూ త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, జూన్ 4న వచ్చే 'ఈద్-ఎ-గదీర్' పండుగకు కూడా ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

బక్రీద్ పండుగ సమీపిస్తుండటంతో భాగ్యనగరంలో తాత్కాలిక పశువుల మార్కెట్లు వెలుస్తున్నాయి. ఖుర్బానీ (బలి) ఆచారాల కోసం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి వ్యాపారులు పెద్ద సంఖ్యలో జీవాలను హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ప్రతి ఏటా ఈ సీజన్ లో వేలాది మంది కొనుగోలుదారులతో ఈ మార్కెట్లు కిటకిటలాడుతుంటాయి.

పట్టణ ప్రాంతాలు, ముఖ్యంగా అపార్ట్‌మెంట్లలో నివసించే కుటుంబాల సౌకర్యార్థం నగరంలో వృత్తిపరమైన ఖుర్బానీ సేవలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. జంతువుల సేకరణ, వధ ప్రక్రియ నుండి మాంసాన్ని ప్యాక్ చేసి ఇంటి వద్దకే డెలివరీ చేసే సరికొత్త సౌకర్యాన్ని నగరవాసులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. వార్షిక హజ్ యాత్రకు ఆరంభాన్ని సూచించే ఈ జుల్-హిజ్జా మాసంలో ముస్లింలు ప్రత్యేక నమాజ్‌లు, ఖుర్బానీలతో పాటు బంధుమిత్రుల కలయికలతో భక్తిశ్రద్ధల నడుమ పండుగ వేడుకలకు సిద్ధమవుతున్నారు.

Also Read: పెట్రోల్ కారును CNG ఫిట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇది లాభమా..నష్టమా!

Also Read: ఉద్యోగులకు కీలక అప్‌డేట్..హైదరాబాద్‌లో 8వ పే కమిషన్..నెలకు రూ.69,000 డిమాండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

CNG Car Conversion Cost: పెట్రోల్ కారను CNG ఫిట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఇది లాభమా..నష్టమా!

Hyderabad, Telangana:

CNG Car Conversion Kit Cost: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం ఇప్పుడు భారతదేశంలోనూ కనిపిస్తోంది. ఇటీవలే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు నిరంతరం పెరుగుతున్న క్రమంలో వాహనదారులు తక్కువ ధర గల ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లుతున్నారు. భారతదేశంలో పెట్రోల్ కార్లను CNG (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్)గా మార్చే ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. తక్కువ ఇంధన ఖర్చు, మంచి మైలేజ్ కారణంగా.. చాలా మంది CNG కిట్‌లను తమ కార్లకు ఏర్పాటు చేసుకుంటున్నారు. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సాధారణ పెట్రోల్ కారుకు CNG కిట్‌ను అమర్చడానికి సుమారు రూ.35,000 నుండి రూ.80,000 వరకు ఖర్చు అవుతుంది. కిట్ నాణ్యత, కారు మోడల్, కంపెనీని బట్టి ధర మారుతుంది. ప్రభుత్వ ఆమోదం పొందిన కిట్‌లను మాత్రమే ఉపయోగించాలని రవాణా శాఖ సూచించింది.

CNG వాహనాల ప్రధాన ప్రయోజనం తక్కువ ఇంధన ఖర్చులు కావడం గమనార్హం. పెట్రోల్ CNG చాలా చౌకగా ఉండటం వల్ల కిలోమీటరుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. అదనంగా CNG వాడకం పర్యావరణానికి అనుకూలమైనది. అంతే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇది పర్యావరణ కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా సహకరిస్తుంది.

అయితే CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. ఈ కిట్‌ను ప్రభుత్వ ఆమోదం పొందిన సర్వీస్ సెంటర్‌లో మాత్రమే ఇన్‌స్టాల్ చేయించుకోవాలి. ఆ తర్వాత.. వాహనం RC బుక్‌లో CNG వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరిగా ఉంది. ఈ నియమాలను ఉల్లంఘిస్తే జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఆటోమోటివ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ కారు లేదా ఇతర వాహనాలు ఎక్కువగా వినియోగించే వారికి CNG ఒక మంచి ఎంపిక కావచ్చు. అయితే, బూట్ స్పేస్ తగ్గడం, కొన్ని సార్లు పవర్ తక్కువగా ఉండటం చిన్న సమస్యలే అయినా మైలేజీ పరంగా కారు యజమానులు ఆర్థికంగా తక్కువ ఖర్చు అవుతుంది. అయితే పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో రాబోయే రోజుల్లో CNG కార్లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరిచడం లేదు.)

ALso Read: ఉద్యోగులకు కీలక అప్‌డేట్..హైదరాబాద్‌లో 8వ పే కమిషన్..నెలకు రూ.69,000 డిమాండ్!

Also REad: కేవలం 3 గంటల్లో హైదరాబాద్ టు ముంబయి..హైస్పీడ్ రైలు కారిడార్ డీపీఆర్ సిద్ధం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Deepak Singla Arrest: ఆప్ నేత దీపక్ సింగ్లా అరెస్ట్..బీజేపీ ప్రతికార చర్య అంటున్న ఆమ్ఆద్మీ పార్టీ నేత అతిషీ!

Bandoli, Goa:

Deepak Singla Arrest News: బ్యాంకు మోసం ఆరోపణల కేసుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, గోవా కో-ఇన్‌చార్జ్ దీపక్ సింగ్లా అరెస్టు అయ్యారు. నేడు ఆయన నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముమ్మర సోదాలు నిర్వహించింది. ఆ తర్వాత ఈడీ అధికారులు దీపక్ సింగ్లాను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, గోవా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. అయితే ఈ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని బీజేపీ రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆతిషి తీవ్ర ఆరోపణలు చేశారు.

గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే బీజేపీ ఈ దాడులకు తెగబడిందని ఆతిషి ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "గోవాలో ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) బలం పెరుగుతుండటంతో, బీజేపీ (భారతీయ జనతా పార్టీ) తన నమ్మకమైన అనుచరుడైన ఈడీని రంగంలోకి దించింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి మా గోవా కో-ఇన్‌చార్జ్ దీపక్ సింగ్లా నివాసంతో పాటు పలువురు వాలంటీర్ల ఇళ్లలో సోదాలు చేశారు. ఇది కేవలం మా కార్యకర్తలను భయపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే కాదు.. రాబోయే ఎన్నికల వ్యూహాల కోసం ఆప్ సంస్థాగత డేటా మొత్తాన్ని సేకరించి బీజేపీకి ఇచ్చేందుకే ఈ దాడులు!" అని ఆమె దుయ్యబట్టారు.

బెంగాల్, పంజాబ్ తరహాలోనే కుట్ర!
మరో వీడియో సందేశంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆతిషి గత ఎన్నికల ఉదాహరణలను ప్రస్తావిస్తూ బీజేపీ తీరును తప్పుపట్టారు. గతంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తృణమూల్ కాంగ్రెస్ (TMC)ను దెబ్బతీసేందుకు వారి ఎన్నికల వ్యూహకర్త 'ఐప్యాక్' (I-PAC) సంస్థపై ఈడీని ప్రయోగించి డేటాను దొంగిలించారని ఆరోపించారు. ఎన్నికలు ముగియగానే నిందితులను వదిలేశారని గుర్తుచేశారు.

అదేవిధంగా పంజాబ్‌లోనూ ఆప్ నేతలను టార్గెట్ చేశారని.. బీజేపీలో చేరడానికి నిరాకరించినందుకే పంజాబ్ మంత్రి, ఆప్ నేత సంజీవ్ అరోరాను మే 9న 'హాంప్టన్ స్కై రియల్టీ లిమిటెడ్' కేసు నెపంతో అరెస్ట్ చేశారని, కానీ అదే పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీ అశోక్ మిట్టల్ వంటి వారిపై ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. ఇప్పుడు పంజాబ్ తర్వాత వారి తదుపరి లక్ష్యం గోవానేనని స్పష్టం చేశారు.

రాబోయే ఫిబ్రవరిలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని తెలిసిపోవడంతోనే బీజేపీ ఇదంతా చేస్తోందని ఆప్ నేత ఆతిషి అన్నారు. సింగ్లా నివాసం వద్ద 15 ఈడీ వాహనాలు, 50 మంది అధికారులను మోహరించడాన్ని ఆమె ప్రశ్నించారు.

Also Read: నిన్న బంగారం..నేడు వెండి..సిల్వర్ దిగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్ర ప్రభుత్వం!

Also Read: కేవలం 3 గంటల్లో హైదరాబాద్ టు ముంబయి..హైస్పీడ్ రైలు కారిడార్ డీపీఆర్ సిద్ధం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top