Back
Bhadradri Kothagudem507115blurImage

మద్యం మత్తులో ఉపాద్యాయుడు,పశువుల కొట్టంలోకి ఈడ్చుకెళ్లిన గ్రామస్తులు

Tirupati Rao
Jun 22, 2024 11:02:11
Mulakalapalle, Telangana
ములకలపల్లి మండలం రాజీవ్ నగర్ ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయుడిగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య ఫుల్ గా మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. గమనించిన విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సోయిలేకుండా తాగి బడి ఆవరణలో పడిపోయి దొర్లుతున్న వీరయ్యను స్థానికులు ఈడ్చుకెళ్ళి సమీపంలోని పశువుల కొట్టంలో ఉంచారు. విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలా ఉపాధ్యాయులు మద్యం సేవించి పాఠశాలకు రావడం మూలంగా తమ పిల్లల భవిష్యత్ ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com