Back
Tirupati Rao
Bhadradri Kothagudem507301

పెద్దవాగు ప్రాజెక్ట్ కి భారీగా చేరిన వరద నీరు

TRTirupati RaoJul 15, 2024 08:43:15
Aswaraopeta, Telangana:
గత మూడు రోజులుగా వాతావరణం మేఘావృతమై సన్నని జల్లులు పడటంతో అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి పంచాయితీ పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్ట్ లో సోమవారం జలకల సంతరించుకుంది.ఈ వర్షానికి అశ్వారావుపేట మండలాల్లోని పలు వాగులు,కాలువలు పొంగి పొర్లడంతో పెద్దవాగు ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు చేరింది.రాత్రి నుండి ఇప్పటి వరకు అశ్వారావుపేలో 24.8 మి.మీ,దమ్మపేటలో 20.0 మి.మీ వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
1
Report
Bhadradri Kothagudem507301

టీచర్స్ కావాలంటూ రోడ్డెక్కిన విద్యార్థులు

TRTirupati RaoJul 11, 2024 10:42:11
Aswaraopeta, Telangana:
అశ్వారావుపేట మండల గుమ్మడవల్లి ప్రభుత్వ పాఠశాలలో రెండు వందల మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉండటంతో బుధవారం విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ విద్యాసంవత్సరం వృధా చేయద్దంటూ ఫ్లగ్ కార్డులు పట్టుకుని రోడ్డుపై భైఠాయించారు. మొత్తం పిల్లలు రెండొందలు వరకూ ఉండగా 36 మంది పదవతరగతి విద్యణార్థులున్నారు. తమ పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులను రిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు
0
Report
Bhadradri Kothagudem507301

దొంతికుంటలో దారుణం

TRTirupati RaoJul 11, 2024 10:40:23
Aswaraopeta, Telangana:

అశ్వారావుపేటలో ఓ రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం జరగడంతో ఓ స్నేహితుడు మరొకరిపై ఆయుధంతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఘర్షణ చోటు చేసుకుంది.ఘర్షణ అనంతరం రామాలయం వద్ద ఉన్న తిరుపతయ్య పై ముళ్లగిరి కార్తీక్ అనే యువకుడు కత్తితో విచక్షణ రహితంగా గాయపరిచాడు.

0
Report
Bhadradri Kothagudem507115

సీతారామ ప్రాజెక్టు పూసుకుంట వద్ద నిర్మిస్తున్న పంపు హౌస్ నిర్మాణ పనులను పరిశీలన

TRTirupati RaoJul 10, 2024 12:54:05
Mulakalapalle, Telangana:
సీతారామ ప్రాజెక్టును త్వరితగతన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించే క్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట నియోజకవర్గం లోని ములకలపల్లి మండలంలో మంత్రి ఈ రోజు పర్యటించారు.మంత్రి వెంట అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పాల్గొన్నారు.
1
Report
Advertisement
Bhadradri Kothagudem507306

ఆయిల్ ట్యాంకర్ బోల్తా

TRTirupati RaoJul 05, 2024 07:46:02
Dammapeta, Telangana:

దమ్మపేట- మద్దులగూడెంలోని పోతులమ్మ దేవాలయం వద్ద బోల్తా అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపు అతివేగంతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది.

ట్యాంకర్‌ నుంచి ఆయిల్‌ లీక్‌ కావడాన్ని చూసిన ప్రజలు ఇళ్ల నుంచి బకెట్లు తీసుకుని ట్యాంకర్‌ వద్దకు చేరుకున్నారు. ట్యాంకర్‌లోని ఆయిల్‌ను పట్టుకునేందుకు లారీలు దూసుకెళ్లడంతో స్వల్ప ఘర్షణ కూడా చోటు చేసుకుంది. వంట నూనెల ధరలు మండిపోతుండటంతో దొరికినంత ఆయిల్‌ నింపుకునే ప్రయత్నం చేశారు స్థానికులు.

1
Report
Bhadradri Kothagudem507117

అక్రమ సంబంధం నెపంతో మహిళపై మరో మహిళ కత్తితో దాడి

TRTirupati RaoJul 04, 2024 13:15:02
Manuguru (PT), Telangana:

అక్రమ సంబంధం పేరుతో ఓ మహిళ మరో మహిళపై పదునైన ఆయుధంతో దాడి చేసిన ఘటన చుంచుపల్లిలోని రుద్రంపూర్ నుంచి వెలుగు చూసింది. సింగరేణి ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువతి తన భర్త దుర్గాప్రసాద్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ మరో మహిళ తన వెంట ఆయుధాలు తీసుకొచ్చి విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆ మహిళ పిల్లలు కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు వచ్చేలోపే నిందితురాలు అక్కడి నుంచి పారిపోయింది.

0
Report
Bhadradri Kothagudem507117

మహిళా రైతు ఆవేదన

TRTirupati RaoJul 04, 2024 12:44:31
Manuguru (PT), Telangana:

డ్రైనేజీ నిర్మాణంతో పొలాల్లోని పంటలు నాశనమవుతున్నాయని చంద్రగొండ గ్రామానికి చెందిన మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెయిన్ నిర్మాణ పనులు వెంటనే ఆపకుంటే రైతు దంపతులు ఆత్మహత్యలకు పాల్పడతారని ఆ మహిళ ఆరోపిస్తోంది. గ్రామానికి చెందిన గోదా స్వర్ణ, నాగేశ్వర్‌రావులకు చెందిన రెండెకరాల వరి పొలాల దగ్గర కొత్త డ్రైనేజీ వ్యవస్థను నిర్మించారు, తద్వారా పొలాలకు డ్రైనేజీ నీరు వచ్చేలా చేశారు. డ్రైనేజీ నీరు పొలంలోకి వచ్చేలా ఆనకట్ట కట్టడం వల్ల పొలం దెబ్బతింటుందని, పంటలు పండే పరిస్థితి లేదని ఆ మహిళ చెబుతోంది.

0
Report
Bhadradri Kothagudem507117

ఇల్లందు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి

TRTirupati RaoJul 01, 2024 11:25:08
Manuguru (PT), Telangana:
ఇల్లందు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంది.ఎమ్మెల్యే సమక్షంలోనే జంప్ జిలానీ నేతలు తన్నుకున్నారు. ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరగగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జాని పాషాల మధ్య విభేదాలు బైటపడ్డాయి.జీతాలు రావట్లేదని మున్సిపల్ కార్మికులు 3 రోజులుగా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రశ్నించగా.. చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
0
Report
Bhadradri Kothagudem507117

అశ్వారావుపేట ఎస్సై అదృశ్యం,అపస్మారక స్థితిలో

TRTirupati RaoJul 01, 2024 11:15:26
Manuguru (PT), Telangana:
అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఉదయం బయటకు వెళ్లిన ఎస్సై శ్రీను రాత్రి 10గంటలు అయిన ఇంటికి తిరిగి రాకపోవడంతో ఎస్సై కోసం అశ్వారావుపేట పోలీస్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగ రాత్రి 11గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న ఎస్సై తానే స్వయంగా 108కు ఫోన్ చేశాడు.
0
Report
Bhadradri Kothagudem507117

ములకలపల్లి మండలంలో భారీ వర్షపాతం కొనసాగుతోంది.

TRTirupati RaoJul 01, 2024 09:33:16
Manuguru (PT), Telangana:

ములకలపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాములేరు వాగులో వరద నీరు చేరింది. దీంతో ములకలపల్లి ప్రధాన మార్గం అయిన డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోయింది. రెండు రోజుల నుండి సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీని వల్ల తాళ్ళపాయి గ్రామస్థులు రోడ్డుపై నిరసనకు దిగారు.

0
Report
Bhadradri Kothagudem507117

కొత్తగూడెం, పాల్వంచ కార్పొరేషన్ ఏర్పాటుపై పరిశీలిస్తాం: భట్టి

TRTirupati RaoJun 28, 2024 09:06:03
Manuguru (PT), Telangana:
భద్రాద్రి కొత్తగూడెంలో రూ.124 కోట్లతో నిర్మించనున్న మంచినీటి సరఫరా ప్రాజెక్టుకు మంత్రులు భట్టి, తుమ్మల, కోమటిరెడ్డి, పొంగులేటి, ఎమ్మెల్యే కూనంనేని శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం ప్రజల దాహార్తిని తీర్చేందుకుగాను ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని భట్టి పేర్కొన్నారు. కొత్తగూడెం, పాల్వంచ రెండు పట్టణాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తామన్నారు.
2
Report
Bhadradri Kothagudem507117

సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ రైలు రాన్‌ను మంత్రి ప్రారంభించారు

TRTirupati RaoJun 28, 2024 09:05:34
Manuguru (PT), Telangana:

ఎకరంన్నర ఆయకట్టుకు నీరు అందించాలనే లక్ష్యంతో అశ్వాపురం సీతారాం ప్రాజెక్టు పంప్‌హౌస్‌ తొలి ట్రైలర్‌ రన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఉదయం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అశ్వాపురం మండలం బిజి కొత్తూరులోని సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌కు చేరుకుని పంప్‌హౌస్‌ను ట్రయల్‌ రన్‌ చేసి అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు.

1
Report
Bhadradri Kothagudem507120

ఇల్లందులో రూపాయికే కార్పొరేట్ వైద్యం

TRTirupati RaoJun 25, 2024 08:29:42
Sujathanagar, Telangana:
ప్రతి పేదవాడికి వైద్యం అందాలనేదే ఆయన లక్ష్యం ప్రస్తుత సమాజంలో వైద్యం అత్యంత ఖరీదైందని వైద్యం అందకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించి తన వంతు కర్తవ్యంగా పేదలకు రూపాయికే వైద్యం అందిస్తున్న డాక్టర్ హర్షవర్ధన్.నేడు కార్పొరేట్ వైద్య రంగంలో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులు.. నేటి సమాజంలో ప్రతి పేదవాడికి వైద్యం అందించాలని సహృదయంతో రామచంద్రారెడ్డి స్ఫూర్తితో నేటి యువత డాక్టర్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు
34
Report
Bhadradri Kothagudem507117

మణుగూరును ముంచెత్తిన వరద

TRTirupati RaoJun 24, 2024 10:58:59
Manuguru (PT), Telangana:
మణుగూరు పట్టణంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని కట్టు వాగు, మొట్లవాగులు పొంగిప్రవహించాయి. వాగుల్లో పరద పోటెతటంతో ఐలమ్మనగర్ లోని నివాసాలు ముంపునకు గురయ్యాయి. పలు ఇళ్లల్లోని సామగ్రి తడిచింది. చాకలి ఐలామ్మనగర్ లోని గ్రామస్థులు వస్తుసామగ్రితో వేరే ప్రాంతానికి తరలివెళ్లారు. వాగుల్లోని వ్యర్ధాలు తొలి గించకపోవటంతోనే వరద ముంచెతిందని బాధిత కాలనీల వాసులు వాపోయారు.
1
Report
Sukma494111

పేలుడు పదార్థాలు, నకిలీ నోట్లు స్వాధీనం

TRTirupati RaoJun 23, 2024 13:38:11
Sukma, Chhattisgarh:
ఛత్తీస్గఢ్...నక్సల్స్ శిబిరం లో నకిలీ నోట్ల కట్టల గుట్టు రట్టు చేసిన భద్రతా బలగాలుసుక్మా జిల్లాలోని బెజ్జి పోలీసు స్టేషన్ పరిధిలో గల కొరాజ్‌గూడ అడవుల్లో బయట పడిన నకిలీ కరెన్సీ. భారీ ఎత్తున నకిలీ నోట్లు, ప్రింటర్, పేలుడు పదార్థాలు, తుపాకులు, వైర్‌లెస్ సెట్లు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు
1
Report
Bhadradri Kothagudem507115

మద్యం మత్తులో ఉపాద్యాయుడు,పశువుల కొట్టంలోకి ఈడ్చుకెళ్లిన గ్రామస్తులు

TRTirupati RaoJun 22, 2024 11:02:11
Mulakalapalle, Telangana:
ములకలపల్లి మండలం రాజీవ్ నగర్ ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయుడిగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య ఫుల్ గా మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. గమనించిన విద్యార్థులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. సోయిలేకుండా తాగి బడి ఆవరణలో పడిపోయి దొర్లుతున్న వీరయ్యను స్థానికులు ఈడ్చుకెళ్ళి సమీపంలోని పశువుల కొట్టంలో ఉంచారు. విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలా ఉపాధ్యాయులు మద్యం సేవించి పాఠశాలకు రావడం మూలంగా తమ పిల్లల భవిష్యత్ ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1
Report
East Godavari507111

భద్రాచలం గోదావరిలో ఐదుగురు కుర్రాళ్ళు గల్లంతు

TRTirupati RaoJun 22, 2024 10:49:51
Bhadrachalam, Telangana:
భద్రాచలం స్నానాల రేవు వద్ద ఐదుగురు కుర్రాళ్ళు గల్లంతు.నలుగురు కుర్రాలను కాపాడిన స్థానిక ఫోటోగ్రాఫర్లు.ఈ ఘటనలో కార్తీక్ అనే బాలుడు మృతి.మృతుడు ఖమ్మంకు చెందిన వ్యక్తిగా సమాచారం.బూర్గంపాడు పెళ్ళికి వచ్చి, నేడు గోదారి స్నానానికి భద్రాచలం వచ్చినట్లు తెలుస్తుంది.
1
Report
Bhadradri Kothagudem507101

కొత్తగూడెం నెహ్రూ కాలనీలో గోడపై పాము పిల్ల కనిపించింది.

TRTirupati RaoJun 21, 2024 10:55:33
Laxmidevipally, Telangana:
కొత్తగూడెం నెహ్రు బస్తీలో ఏరియాలో నివాసం ఉంటున్న ఎలక్ట్రిషన్ రాజు అనే ఓ వ్యక్తి ఇంటి గోడలో ఉన్న పాము పిల్లలను గమనించిన కుటుంబ సభ్యులు.. స్నేక్ క్యాచర్ దత్తు బృందానికి సమాచారం ఇచ్చారు.అక్కడికి చేరుకున్న బృందం వారు కొన్ని గంటల పాటు శ్రమించి పెద్ద పాము తో పాటు మొత్తం 32 నాగు పాము పిల్లలను చాకచక్యంగా పట్టుకుని ప్లాస్టిక్ డబ్బాలో బంధించారు.దీంతో కుటుంబ సభ్యులకు పెను ప్రమాదం తప్పింది.
1
Report
Bhadradri Kothagudem507301

ప్రభుత్వ ఉపాధ్యాయుడికి దేహశుద్ధి

TRTirupati RaoJun 19, 2024 10:29:52
Aswaraopeta, Telangana:
అశ్వరావుపేట మండలం నెమలిపేట గిరిజన ప్రాథమిక పాఠశాలలో లావుడియా రాందాస్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు.ఇతను అదే గ్రామంలో ఒక వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని వివాహిత కుటుంబీకులు పాఠశాల విధులకు వచ్చిన రామ్ దాస్ ను చితకబాది గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఒక చెట్టుకు తాళ్లతో కట్టేశారు. ఉపాధ్యాయునితోపాటూ వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నావంటూ ఆ మహిళను కూడా కుటుంబీకులు గ్రామస్తులు చితక బాధారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రామదాసుని విడిపించి అందరినీ స్టేషన్కి తరలించారు.
1
Report
Khammam507157

డ్రైవర్ ‌అతివేగంగా నడపడంతో పెను ప్రమాదం

TRTirupati RaoJun 19, 2024 10:23:57
Paleru, Telangana:
దమ్మపేట మండలం గుర్వాయిగూడెం గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న చెట్టుని ఢీకొట్టి బోల్తా పడింది.దింతో లారీలో ఉన్న రైలు పట్టాలు చెల్లా చెదురుగా పడి లారీ మొత్తం నుజ్జు నుజ్జు కావడంతో లారీ డ్రైవర్,క్లినర్ లారీ కింద భాగంలో ఇరుక్కుపోయారు.సంఘటన స్తలానికి చేరుకున్న పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికి డ్రైవర్ క్లినర్ బయటకు కనిపించకపోడంతో నాలుగు జేసీబీల సాయంతో రెండు గంటల పాటు క్షమించి లారీ డ్రైవర్ ,క్లినర్ ని బయటకు తీశారు.డ్రైవర్ మృతి.
1
Report