icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

ఇంత తక్కువ ధరకే? Old Monk క్వార్టర్ రూ.60, ఫుల్ బాటిల్ రూ.220 మాత్రమే!

Hyderabad, Telangana:

Goa Liquor Prices: ప్రకృతి అందాలు, అద్భుతమైన బీచ్‌లు, రాత్రిపూట పార్టీలకు కేరాఫ్ అడ్రస్ గోవా.. నిత్యం వేలాది మంది పర్యాటకులతో కిటకిటలాడే ఈ పర్యాటక ప్రాంతం.. తాజాగా మద్యం ప్రియులకు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. గోవాలో మద్యం ధరలు చాలా తక్కువనే అందరికీ సంగతి తెలిసిందే.. అయితే, ప్రస్తుతం అక్కడ విక్రయిస్తున్న బ్రాండ్ల ధరలు వింటే.. ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా సమాచారం ప్రకారం.. గోవాలో లభిస్తున్న కొన్ని లిక్కర్ బ్రాండ్ల ధరల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రూ.30లకే 90ml.. రూ.60కే క్వార్టర్..
సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే.. గోవాలో మాత్రం చాలా చౌకగా లభిస్తున్నాయి. అక్కడ కేవలం రూ.30లకే 90ml బాటిల్ అందుబాటులో ఉండటం విశేషం.. ఇక ఎంతో మందికి ఇష్టమైన ఓల్డ్ మంక్ (Old Monk) బ్రాండ్ క్వార్టర్ బాటిల్ ధర కేవలం రూ.60 మాత్రమేనని అక్కడి వైన్స్‌ షాప్‌ నిర్వాకులు చెబుతున్నారు.

బ్రాండ్ల రేట్ల వివరాలు ఇవే..
గోవా వైన్ షాపుల్లో లభిస్తున్న కొన్ని ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ (Quarter) ధరల వివరాల్లోకి వెళితే.. రాయల్ ఛాలెంజ్ (Royal Challenge) క్వార్టర్ ధర ఇక్కడ కేవలం రూ.95 మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా మ్యాన్స్ నోస్ (Man's Nose) బ్రాండ్ క్వార్టర్ రూ.80 లకే లభింస్తోంది. ఇక ఇంపీరియల్ బ్లూ (Imperial Blue) ధర కేవలం రూ.85కే లభించడం విశేషం.. ఇక అందరూ ఎంతగానో ఇష్టపడే మెక్‌డోవెల్స్ (McDowell's) క్వార్టర్ కూడా రూ.85 లకే విక్రయిస్తున్నారు. దీంతో పాటు ప్రియులు ఇష్టపడే మ్యాజిక్ మూమెంట్స్ బ్లూ (Magic Moments Blue) వోడ్కా క్వార్టర్ ధర రూ.100కే అందుబాటులో ఉంది.

Also Read: Goaలో ఇంత చీప్‌గా బీరా, కరోనా, కింగ్‌ఫిషర్ దొరుకుతున్నాయా? 2026 లేటెస్ట్ రేట్లు ఇవే!

ఫుల్ బాటిల్ రూ.220 మాత్రమే..
ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఓల్డ్ మంక్ ఫుల్ బాటిల్ కేవలం రూ.220 లభిస్తుండటం.. బాటిల్‌పై ఉన్న గరిష్ట రిటైల్ ధర (MRP) ప్రకారం.. ఈ ధరలకే గోవాలో విక్రయిస్తున్నట్లు అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో వందల రూపాయలు పలికే బ్రాండ్లు ఇక్కడ ఇంత తక్కువ ధరలకే లభిస్తుండటంతో పర్యాటకులు ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.. మొత్తానికి గోవా ట్రిప్ ప్లాన్ చేసుకునే వారికి, ముఖ్యంగా అక్కడి నైట్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ధరల వివరాలు ఎంతగానో సహాయపడతాయి. రాబోయే పర్యటక సీజన్‌లో గోవాకు వెళ్లే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

(నోట్: ఈ వార్తను సోషల్ మీడియాలో లభించిన తాజా ధరల సమాచారం ఆధారంగా మాత్రమే అందించబడింది. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.)

Also Read: Goaలో ఇంత చీప్‌గా బీరా, కరోనా, కింగ్‌ఫిషర్ దొరుకుతున్నాయా? 2026 లేటెస్ట్ రేట్లు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

0
0
Report

Prashna Ravan Arrest: డిప్యూటీ సీఎంను దూషించిన కేసులో ప్రశ్న రావణ్‌కు బెయిల్..గంటలోనే మరో ట్విస్ట్ ఇచ్చిన ఏపీ పోలీస్!

Pithapuram, Andhra Pradesh:

Prashna Ravan Arrest News: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటీవలే యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా కోర్టుకు కీలక నిర్ణయం తీసుకుంది. అతనికి బెయిల్ మంజూరు చేస్తూ పిఠాపురం కోర్టు ఆదేశాలు జారీ చేయగా.. ఇక్కడ మరో ట్విస్ట్ వచ్చిపడింది. బెయిల్‌పై రావణ్ విడుదలైన వెంటనే ఇప్పుడు మరో కేసు విషయంలో ఏపీ పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. 

అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా పిrఠాపురంలో యూట్యూబర్ ప్రశ్నపై కేసు నమోదయ్యింది. ఈ కేసులో రిమాండ్ కోసం పిఠాపురం పోలీసులు కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే బెయిల్‌పై బయటకు వద్దామనుకున్న ప్రశ్న రావణ్‌కు వెంటనే మరో ట్విస్ట్ ఎదురైంది. గతంలో కాకినాడ జిల్లా సర్పవరంలో నమోదైన కేసు విషయంలో అతడ్ని సర్పవరం పోలీసులు మరోసారి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

కాకినాడ జిల్లా సర్పవరంలోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సదరు ప్రశ్న రావణ్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జనసేన కార్యకర్తలు కేసు నమోదు చేశారు. 2025లో ఈ కేసు నమోదైనా.. తాజాగా అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. అయితే రావణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే మరోమారు అతడ్ని కోర్టు ముందు హాజరు పరిచి.. రిమాండ్ కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రశ్న రావణ్‌పై ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ అదే నిజమైతే సర్పవరంలో బెయిల్ వచ్చినా.. మరో ప్రాంతం పోలీసులు అరెస్టు చేయడం తప్పనిసరిగా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై యూట్యూబర్ ఛానల్ ప్రశ్న ద్వారా రావణ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అవి మరింతగా శృతిమించినట్లు కనిపిస్తున్నాయి. ప్రశ్న అనే చాటున వ్యక్తిగత దూషణలు చేసిన సంగతి వాస్తవం. అయితే ఇదే విషయమై జనసేన కార్యకర్తలు పలుమార్లు రావణ్‌కు సోషల్ మీడియా ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆ టైమ్‌లో రావణ్‌పై కేసు నమోదు చేసిన అరెస్టు వరకు వెళ్లలేదు. 

అయితే తాజాగా పవన్‌ను దూషించడంతో పిఠాపురం పోలీసులు ఏకంగా హైదరాబాద్ వెళ్లి మరీ ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి పిఠాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించి, కోర్టులో హాజరు పరిచారు. అయితే పోలీసులు రిమాండ్ కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో ప్రశ్న రావణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో హద్దుమీరిన విమర్శలు ఎక్కువయ్యాయని, భావప్రకటన స్వేచ్ఛ అంటే పక్క వాళ్లని దూషించడం కాదని ఆయన తెలిపారు. అలా చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుందని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం, తప్పులను ఎత్తి చూపడం వరకు పర్వాలేదని చెప్పిన ఆయన వ్యక్తిగత దూషణలకు, భౌతిక దాడులకు, మత విద్వేషాలకు దిగితే నిందితులను విడిచిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. 

Also Read: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్..వారంలో రెండు రోజులు సెలవులు..ఎప్పుడంటే?

Also REad: చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తిన వైఎస్ జగన్..రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగమంటూ ఆరోపణ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Flipkart GOAT Sale: రూ.20 వేల Oppo K14x 5G ఫోన్ కేవలం రూ.7,899లకే..

Hyderabad, Telangana:

Oppo K14x 5G Flipkart GOAT Sale: మీరు ఎప్పటి నుంచో 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు ఒక అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వహించబోయే Flipkart GOAT (Greatest Of All Time) సేల్‌లో Oppo బ్రాండ్‌కు సంబంధించిన Oppo K14x 5G స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని ఆఫర్లు ప్రకటించారు. జూలై 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక సేల్‌లో ప్రీమియం ఫీచర్లు కలిగిన ఈ మొబైల్‌ను ఎవరూ ఊహించని అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకునే అద్భుతమైన అవకాశం లభిస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రూ.19,999 ఫోన్.. కేవలం రూ.14 వేలకే!
సాధారణంగా మార్కెట్లో Oppo K14x 5G (64 GB + 4 GB స్టోరేజ్ వేరియంట్) అసలు ధర (MRP) రూ. 19,999తో అందుబాటులో ఉంది.. కానీ, ఈ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా కస్టమర్లకు ఏకంగా రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభించబోతోంది.. అంటే ఎలాంటి అదనపు బ్యాంక్‌ ఆఫర్స్‌ లేకుండానే ఈ ఫోన్ ధర నేరుగా రూ.14,999కే లభిస్తోంది. మిడ్-రేంజ్ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, 5G కనెక్టివిటీ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది పండగ లాంటి వార్తనే చెప్పొచ్చు.

బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో అదనపు డిస్కౌంట్‌..
ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు కస్టమర్లకు మరింత లాభం చేకూర్చేందుకు అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉండడం విశేషం. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఎస్‌బీఐ (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి రూ.1,000 వరకు అదనపు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ ధర మరింత తగ్గి.. బడ్జెట్ ప్రియులకు భారీ ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఎక్స్ఛేంజ్ బోనస్‌తో రూ.7,899లకే మీ సొంతం..
ఈ సేల్‌లో అన్నింటికంటే హైలైట్ ఏమిటంటే.. భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో ఉండటం. ఈ Flipkart GOAT సేల్‌లో  మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం వల్ల దాదాపు రూ.6,100 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఒకవేళ మీరు మీ పాత ఫోన్‌పై పూర్తి ఎక్స్ఛేంజ్ బోనస్‌ పొందితే.. అన్ని ఆఫర్లు అంటే.. ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ కలుపుకొని ఈ ప్రీమియం Oppo K14x 5G ఫోన్‌ను కేవలం రూ.7,899 లోపే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ బోనస్ అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేసే పాత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండీషన్, స్క్రాచెస్‌తో పాటు బ్రాండ్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

పుష్య నక్షత్రంలోకి సూర్యుడు.. ఆగస్టు 3 వరకు ఈ రాశుల జాతకం పూర్తిగా మారిపోతుంది!

Hyderabad, Telangana:

Sun Transit In Pushya Nakshatra 2026: జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడి నక్షత్ర సంచారం అత్యంత కీలకమైనదిగా భావిస్తారు. గౌరవం, కీర్తి, ఆత్మవిశ్వాసానికి కారకుడైన సూర్యుడు 2026 జూలై 20వ తేదీన తన నక్షత్రాన్ని మార్చుకుని అత్యంత పవిత్రమైన  పుష్య నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. జూలై 20 ఉదయం 11:33 గంటలకు మొదలు కాబోతున్న ఈ సూర్య సంచారం.. ఆగస్టు 3 వరకు కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక సూర్యుడి సంచారం వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారి జాతకాలు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి.. ఈ రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. ఊహించని విధంగా ఆదాయం పెరగడమే కాకుండా కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ నక్షత్ర సంచారం అద్భుతమైన సమయాన్ని అందించబోతోంది. వీరి ఆర్థిక స్థితి గతంలో కంటే చాలా వరకు మెరుగుపడుతుంది.. ఉద్యోగస్తులకు ఆఫీసులో అందరి సపోర్ట్‌ కూడా లభిస్తుంది. అంతేకాకుండా, కెరీర్‌లో బంపర్ పురోగతితో పాటు ప్రమోషన్స్‌తో పాటు జీతాలు విపరీతంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జీవితంలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి.. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి..

సింహ రాశి (Leo)
సూర్యుని సంచారం సింహ రాశి వారికి సువర్ణ అవకాశాలను అందిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు హఠాత్తుగా చేతికి అందుతాయి. దీనివల్ల ఆర్థిక సంక్షోభం పూర్తిగా తొలగిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు పెద్ద ప్రాజెక్టులు దక్కడం వల్ల భారీ లాభాలు కలుగుతాయి.. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం.. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం మెరుపడి.. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

వృశ్చిక రాశి (Scorpio)
సూర్యుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జీవితంలో వీరు కొన్నిసానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ధన సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి.. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమవుతాయి.. దీనివల్ల బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల పూర్తి సపోర్ట్‌ లభిస్తుంది.. సమాజంలో మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో ఉన్న మనస్పర్థలు తొలగిపోయి..

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి జాతకులకు ఈ సూర్య గోచారం వల్ల బంపర్ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఘన విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ఆశించిన ఫలితాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో పాటు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం లభింస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల బంధాలు మరింత బలంగా మారుతాయి.. ఆర్థిక కొరత పూర్తిగా తీరిపోతుంది. ఎలాంటి ఆందోళనలు లేకుండా ఈ అదృష్ట సమయంలో ముందుకు సాగడం మంచిది..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

 

0
0
Report

Shani Dev: శని గ్రహ కదలికలు.. ఈ రాశుల వారికి అఖండ ఐశ్వర్యం, ఉద్యోగంలో ప్రమోషన్లు!

Hyderabad, Telangana:

Shani Nakshatra Gochar July 2026: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన, కర్మఫల ప్రదాతగా భావించే శని దేవుడు తన నక్షత్ర సంచారం చేసింది.. జూలై 2, గురువారం రోజున శని నక్షత్ర సంచారం చేశాడు.. ప్రస్తుతం మీన రాశిలో సంచార దశలో ఉన్న.. శని దేవుడి నక్షత్ర మార్పు కారణంగా మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శని గ్రహం అత్యంత నెమ్మదిగా కదులుతుంది కాబట్టి.. ఈ నక్షత్ర మార్పు ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల ఉద్యోగం, వ్యాపారంతో పాటు ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొన్ని రాశులకు అదృష్టం.. 
మేష రాశి:

ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అనవసరపు ఖర్చులను అదుపులో పెట్టుకోవడం మంచిది. అయితే, విదేశీ ప్రయాణాలు లేదా సుదూర ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగం చేస్తున్నవారు తప్పకుండా ఎంతో ఓపికగా ఉండడం చాలా మంచిది.

వృషభ రాశి: 
వృషభ రాశివారికి కూడా ఈ సమయంలో శని అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఆదాయానికి కొత్త మార్గాలు సుగమవుతాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మిత్రుల సహాయంతో లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.

కర్కాటక రాశి: 
శని దేవుడి ఆశీస్సులతో వీరికి అదృష్టం కలిసి రాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆధ్యాత్మికంగా కూడా బోలెడు లాభాలు కలుగుఆయి..

సింహ రాశి: 
జ్యోతిష్యుల ప్రకారం.. ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అకస్మాత్తుగా ఖర్చులు పెరగడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది..

మిథున రాశి: 
శని ప్రభావంతో మిథున రాశివారికి ఉద్యోగ జీవితంలో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది.. అయితే, కార్యాలయంలో ఉన్నతాధికారులతో విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. లేదంటే అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఈ రాశులవారికి ఆర్థిక పురోగతి..
తులా రాశి: 
శని ప్రభావంతో తులా రాశివారికి శత్రువులతో పాటు పోటీదారులపై అద్బుతమైన విజయం సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులు తమ పనితీరుతో ప్రశంసలు లభిస్తాయి.. అయితే, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం ఉంది..

ధనుస్సు రాశి: 
కుటుంబంతో పాటు ఆస్తికి సంబంధించిన విషయాల్లో భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి ఇది శుభ సమయంగా భావించవచ్చు. కుటుంబంలో కాస్త సహనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అందరితో అద్భుతంగా మాట్లాడాల్సి ఉంటుంది..

వృశ్చిక రాశి: 
వృశ్చిక రాశివారికి వివిధ రంగాల్లో ఉన్న వారికి భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ వ్యవహారాల్లో సానుకూల మార్పులు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. వీరు తప్పకుండా సంతానం గురించిన శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి..

మీన రాశి:

శని నక్షత్ర మార్పు ప్రభావంతో మీన రాశి వారికే అత్యధిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుంది.. కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి..

మకర రాశి: 
కమ్యూనికేషన్‌తో పాటు నెట్‌వర్కింగ్ ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చిన్నపాటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

మఘా నక్షత్రంలోకి కేతువు.. ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు, అదృష్టం మామూలుగా లేదు!

Hyderabad, Telangana:

Shukra Ketu Yuti In Leo 2026 Telugu News: జ్యోతిష్య శాస్త్ర పరంగా 2026 జూలై నెలలో ఒక కీలకమైన గ్రహ మార్పు చోటుచేసుకోబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జూలై 4వ తేదీన సంపద, వైభవానికి కారకుడైన శుక్ర గ్రహం తన రాశిని మార్చుకుని కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి సంచారం చేయబోతోంది.. అయితే, అప్పటికే సింహ రాశిలో మాయా గ్రహంగా పరిగణించే కేతువు గ్రహం సంచార దశలో ఉంది.. దీనివల్ల సింహ రాశిలో శుక్ర, కేతువుల అరుదైన కలయిక జరగబోతోంది.

మఘా నక్షత్రంలోకి కేతువు ప్రవేశం..
జూలై 4వ తేదీన మరో ముఖ్యమైన మార్పు కూడా జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కేతువు ఆశ్లేష నక్షత్రాన్ని వదిలిపెట్టి.. తన స్వంత నక్షత్రమైన మఘా నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. కేతువు నీడలోకి శుక్రుడు రావడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని శుభఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.. ముఖ్యంగా 4 రాశుల వారు ఈ గ్రహాల అనుగ్రహంతో జూలై నెల నుంచి ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన పురోగతిని సాధించబోతున్నారు. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మిథున రాశి: 
మిథున రాశి వారికి శుక్ర-కేతువుల కలయిక ఎంతో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి మాటతీరు మెరుగుపడటం వల్ల సమాజంలో వీరికి సంబంధించిన ప్రభావం పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడి.. వ్యాపారాలు విస్తరించేందుకు మార్గాలు సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభసాటిగా మారుతాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరగడం వల్ల కెరీర్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు సులభంగా తీసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు మంచి అవకాశాలు లభిస్తాయి.

మేష రాశి: 
మేష రాశి వారికి ఈ కాలం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీరిలో దాగి ఉన్న సృజనాత్మకత, నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో మీరు వేసిన ప్రణాళికలతో పాటు వ్యూహాలు విజయవంతం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కళలు, రచనలు లేదా సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి సమాజంలో మంచి గుర్తింపుతో పాటు పెద్ద ప్రాజెక్టులు లభిస్తాయి. గతంలో చేసిన పెట్టుబడులు, షేర్ మార్కెట్ లేదా ఇతర వనరుల నుంచి ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు రాశి: 
ధనుస్సు రాశి వారికి అదృష్టం పూర్తిగా కలిసిరాబోతోంది. సుదూర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు, లేదా అక్కడ ఉద్యోగం చేయాలనుకునే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.. వ్యాపారంలో విదేశీ వనరుల నుంచి భారీ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వారసత్వ ఆస్తి లేదా పాత వివాదాల పరిష్కారం వల్ల ఊహించని ఆర్థిక లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

తులా రాశి: 
ఉద్యోగస్తులకు ఈ సమయం ఎంతో సానుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ కష్టానికి తగ్గ సరైన ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నతాధికారులు మీ పనితీరుకు ముగ్ధులవుతారు.. దీనివల్ల పదోన్నతి లేదా జీతాల పెంపు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే చాలా బలోపేతం అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన బకాయిలు చేతికి అందుతాయి. కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. సమాజంలో పేరున్న పెద్దల నుంచి మీకు పూర్తి సపోర్ట్‌ లభిస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు..త్వరలోనే భారీగా పెరగనున్న జీతాలు..ఎంత పెరుగుతాయంటే?

Hyderabad, Telangana:

8th Pay Commission Salary Hike: 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల పెన్షన్ ఎంత పెరుగుతుంది? రూ.18,000 మూల వేతనం పొందుతున్న ఉద్యోగి జీతం రూ.37,800కి పెరుగుతుందని భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టమైన వివరణను ఇప్పుడు తెలుసుకుందాం. 

8వ వేతన సంఘం ఏర్పాటు చేసిన తర్వాత వారి సిఫార్సుల అంశం 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్'పై చర్చలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ విషయంలో కొన్ని కొత్త సమాచారం వెలువడింది. కొత్త మూల వేతనాన్ని నిర్ణయించడంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోవడం గమనార్హం.

8వ వేతన సంఘం సమావేశం జూన్ 22, 23 తేదీలలో ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. ఈ సమావేశం తర్వాత 2.10 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, దీనితో సంతృప్తి చెందని సంఘాలు, అధిక రేటును డిమాండ్ చేస్తున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచితే, అది ఉద్యోగులకు భారీ ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది.

భారతీయ రక్షా మజ్దూర్ సంఘ్ 4.0 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేసింది. నేషనల్ కౌన్సిల్ స్టాఫ్ సైడ్, ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 3.833 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పట్టుబట్టాయి. ఆల్ ఇండియా ఎంపీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంజిత్ సింగ్ పటేల్ మాట్లాడుతూ, "అదనపు వృద్ధి అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, డిసెంబర్ 21 వరకు కేవలం కరువు భత్యం (డీఏ), ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ), రవాణా భత్యాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.10కి చేరవచ్చు" అని అన్నారు.

కనీస ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.10గా నిర్ణయిస్తే, రూ.18,000 మూల వేతనం పొందుతున్న ఉద్యోగి జీతం రూ.37,800కి పెరుగుతుంది. అదేవిధంగా, రూ.19,900 జీతం రూ.41,790కి, రూ.21,000 జీతం రూ.45,570కి, రూ.25,500 జీతం రూ.53,550కి, రూ.29,200 జీతం రూ.61,320కి పెరుగనుందని సమాచారం అందుతోంది.

ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుండి జీతభత్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం పూర్తి చేసిన తర్వాత 8వ వేతన సంఘం ఒక కీలక దశకు చేరుకుంది. ఆన్‌లైన్‌లో సమాచారాన్ని సమర్పించడానికి చివరి గడువు జూన్ 30, 2026 కావడంతో, సవరించిన జీతం, భత్యాలు, పెన్షన్, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌పై సిఫార్సులు సిద్ధం చేయడానికి ముందు, సేకరించిన సమాచారాన్ని పరిశీలించే ప్రక్రియను కమిటీ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వానికి తన సిఫార్సులను సమర్పించడానికి కమిషన్‌కు సుమారు 10 నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరపడం, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన నిర్మాణం, భత్యాలు, ఇతర సేవా సంబంధిత ప్రయోజనాలను సమీక్షించడంపై దృష్టి సారించారు.

Also Read: ముగ్గురు హీరోయిన్లతో హైటెక్ లెవల్ వ్యభిచారం..ముంబైలో చీకటి దందా బట్టబయలు

Also Read: జూలైలో భారీగా సెలవులు..ఏకంగా 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు..ఎందుకంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

బ్యాంక్ ఉద్యోగాల వేటలో ఉన్నారా? IBPS నుంచి 7400 పైగా పోస్టులతో భారీ నోటిఫికేషన్!

Hyderabad, Telangana:

IBPS Po 2026 Notification Out: దేశవ్యాప్తంగా ఇండియన్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ పీఓ నోటిఫికేషన్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదలైంది. బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది బంపర్‌ ఆఫర్‌. ఐబీపీఎస్‌ పీఓ, ఎంటీ, ఎస్‌ఓ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేష్‌ విడుదలైంది. ఇందులో మొత్తం 6,715 ప్రొబెషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, 745 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు ఈరోజు జూలై 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన అర్హత, వయస్సు ఇతర వివరాలు తెలుసుకుందాం. 

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ప్రక్రియ ప్రకారం మొత్తం 11 బ్యాంకులు కలిసి 6,715 ఖాళీలను భర్తీ చేస్తాయి. ఈ ప్రక్రియలో మొదటగా ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. చివరగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

IBPS PO ఎగ్జామ్ డేట్..
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్టు 22, 23 తేదీలలో జరుగుతుంది. ఇక మెయిన్స్ పరీక్ష 2026 అక్టోబర్ 4వ తేదీన నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ పాస్ అయిన వారే మెయిన్స్ పరీక్ష రాయాలి. ఈ రెండు పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. పరీక్షకు 15 రోజుల ముందు అడ్మిట్ కార్డ్స్ కూడా విడుదల చేస్తారు.

ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జీతం రూ.74,000 నుండి రూ. 76,000 మధ్య జీతం ఉంటుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పరీక్షకు అర్హులు. అలాగే, అభ్యర్థి వయస్సు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్ ibps.in ని సందర్శించవచ్చు.

Also Read: SBI PO Notification 2026: బ్యాంక్ ఉద్యోగాల జాతర.. డిగ్రీ పాసైన వారికి గోల్డెన్ ఛాన్స్, రూ.48,000 జీతంతో ఎస్‌బీఐ బ్యాంక్ జాబ్స్‌!

Also Read: రీ-నీట్ రాసే విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎగ్జామ్ టెన్షన్ పోవాలంటే ఎక్స్‌పర్ట్స్ చెబుతున్న ఈ టిప్స్ పాటించండి!

IBPS PO పరీక్ష విధానం..
IBPS ద్వారా ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానంగా ప్రిలిమ్స్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు సమాధానం చెప్పి, వంద మార్కులు కేవలం 60 నిమిషాల్లో పూర్తి చేయాలి.

ఇక IBPS PO మెయిన్స్ పరీక్షను ప్రిలిమ్స్ పాస్ అయిన వారు రాస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, డేటా ఇంటర్‌ప్రెటేషన్ ఉంటాయి. మొత్తం 170 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలసిస్, డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్ ద్వారా అభ్యర్థి ప్రవర్తన, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫైనల్ ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెట్టర్ అందిస్తారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

TGSRTC చరిత్రలోనే తొలిసారి.. ఒకే రోజు 422 ఉద్యోగుల రిటైర్మెంట్!

Hyderabad, Telangana:

Historic Day For TGSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) చరిత్రలో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవలందించిన 422 మంది ఆర్‌టీసీ ఉద్యోగులు మంగళవారం ఒకే రోజు సామూహికంగా ఉద్యోగ విరమణ చేశారు. సంస్థకు తమ జీవితాలను అంకితం చేసిన ఇంత పెద్ద సంఖ్యలో కార్మికులు ఒకేసారి రిటైర్ కావడం ఆర్‌టీసీ వర్గాల్లో ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.

97 డిపోల్లో వీడ్కోలు వేడుకలు..
రాష్ట్రంలోని 11 రీజియన్లు, 97 డిపోల పరిధిలో ఈ పదవీ విరమణలు కొనసాగాయి.. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బందితో పాటు శ్రామికులు, పరిపాలనా విభాగాలకు చెందిన అధికారులు ఇందులో ఉన్నారు. దశాబ్దాల పాటు సంస్థ ఎదుగుదలలో భాగస్వాములైన వీరందరికీ ఆయా డిపోల పరిధిలో అధికారులు, తోటి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది.. పూలమాలలు, శాలువాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా డిపోలన్నీ భావోద్వేగ వాతావరణంతో నిండిపోయిన్నట్లు తెలుస్తోంది.

కరీంనగర్ రీజియన్ నుంచి 38 మంది విరమణ..
ఈ మెగా రిటైర్మెంట్‌లో కరీంనగర్ రీజియన్ కీలక పాత్ర పోషించిందని భావించవచ్చు. కరీంనగర్ రీజియన్ పరిధిలోని 11 డిపోల నుంచి మొత్తం 38 మంది ఉద్యోగులు మంగళవారం తమ విధులకు స్వస్తి పలికారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి, సంస్థ లాభాల బాటలో పయనించడానికి తాము చేసిన కృషిని ఈ సందర్భంగా ఉద్యోగులు గుర్తుచేసుకున్నారు. కరీంనగర్ జోన్ పరిధిలోని వివిధ డిపోలలో వీరికి ఘన సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.

సేవలను కొనియాడిన యాజమాన్యం..
ఒకే రోజు ఇంతమంది ఉద్యోగులు రిటైర్ అవ్వడంతో ఆర్‌టీసీ యాజమాన్యం వారి సేవలను ప్రత్యేకంగా అభినందించింది. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల వైపు నడిపించడానికి, ముఖ్యంగా మహాలక్ష్మి పథకం (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) వంటి భారీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ ఉద్యోగుల పాత్ర మరువలేనిదని అధికారులు కొనియాడారు. రిటైర్ అయిన ఉద్యోగులందరికీ రావలసిన బెనిఫిట్స్, ఇతర సెటిల్మెంట్లను ఎలాంటి ఆలస్యం లేకుండా సకాలంలో అందించేందుకు యాజమాన్యం తగిన చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

కొత్త నియామకాలపై ఆశలు..
ఒకే రోజు 422 మంది ఎక్పీరియన్స్‌ ఉన్న సిబ్బంది విరమణ పొందడంతో ఆయా స్థానాలను భర్తీ చేయడంపై సంస్థ దృష్టి సారించిన్నట్లు తెలుస్తోంది.. ఒకవైపు సుదీర్ఘ సేవలు ముగిసినందుకు సంతోషంగా ఉన్నా.. మరోవైపు తోటి సిబ్బందిని వదిలి వెళ్తున్నందుకు రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా, టీజీఎస్ ఆర్‌టీసీ చరిత్రలో ఈ మంగళవారం ఒక ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోయిందని భావించవచ్చు.. 

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Redmi K90 Ultra: 8550mAh భారీ బ్యాటరీతో Redmi కొత్త ఫోన్ లాంచ్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

Hyderabad, Telangana:

Redmi K90 Ultra Launch News: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి (Redmi) మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని చైనాలో అత్యంత శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది మార్కెట్‌లోకి రెడ్‌మి K90 అల్ట్రా (Redmi K90 Ultra) పేరుతో లాంచ్‌ అయ్యింది. అయితే, కంపెనీ దీనిని మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన రెడ్‌మి K80 అల్ట్రా మోడల్‌కు అప్‌గ్రేడ్‌గా ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే ఇది బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి రావడం విశేషం. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ప్రాసెసర్ వివరాలు..
ఈ రెడ్‌మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో కళ్లు చెదిరే పర్ఫార్మెన్స్ కోసం సరికొత్త  ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ (Snapdragon 8 Elite) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. దీనికి తోడుగా గ్రాఫిక్స్, అద్భుతమైన గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి కంపెనీ చాలా ప్రత్యేకమైన D2 AI గేమింగ్ గ్రాఫిక్స్ చిప్ సెట్‌ను కూడా వినియోగించిన్నట్లు కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో చాలా ప్రత్యేకమైన యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం..

ఆకట్టుకునే డిస్‌ప్లే, అల్ట్రా బ్రైట్‌నెస్..
రెడ్‌మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ 6.83 అంగుళాల అమోలెడ్ (AMOLED) 1.5K డిస్‌ప్లేను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇది 165Hz హై రిఫ్రెష్ రేట్‌తో పాటు 480Hz టచ్ సాంప్లింగ్ రేట్, ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. దీనివల్ల ఎండలో కూడా డిస్‌ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది..

8,550mAh మెగా బ్యాటరీ.. 
ఈ రెడ్‌మి K90 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని శక్తివంతమైన బ్యాటరీగా భావింవచ్చు. ఇందులో కంపెనీ ఏకంగా 8,550mAh భారీ బ్యాటరీని అందించింది.. స్మార్ట్‌ఫోన్ రంగంలోనే ఇది అత్యంత పెద్ద బ్యాటరీలలో ఒకటిగా కంపెనీ చెబుతోంది.. దీనితో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు 22.5W వైర్డ్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా చార్జ్ అవుతుందని కంపెనీ తెలుపుతోంది..

కెమెరా ఫీచర్స్‌..
ఫోన్ వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా సెటప్ కూడా అందుబాటులో ఉంది.. ఇందులో 50 మెగాపిక్సెల్ లైట్ హంటర్ 800 (Light Hunter 800) ప్రధాన కెమెరాతో పాటు అదనంగా చాలా ప్రత్యేకమైన 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో 20 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు..
ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ 5G, Wi-Fi, బ్లూటూత్, GPSతో పాటు BeiDou, NavIC వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తూ వస్తోంది.. అంతేకాకుండా ఇది చాలా తక్కువ బరువు దాదాపు 227 గ్రాములతోనే అందుబాటులోకి రావడం విశేషం.. ఇది ఇప్పుడు బ్లూ, సిల్వర్‌తో పాటు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పలు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.. దీని బేస్‌ వేరియంట్‌ ధర రూ.39,000 నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా హైఎండ్ వేరియంట్‌ ధర రూ.48,800తో లభించనుంది. అయితే, ఇది త్వరలో చైనా మార్కెట్‌లలో లభించబోతోంది. అలాగే త్వరలోనే ఈ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

AP EAPCET Results 2026: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే, ఇలా చెక్ చేసుకోండి!

Hyderabad, Telangana:

AP EAPCET Results Released: లక్షలాది మంది ఏపీ విద్యార్థులు ఈ  AP EAPCET ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు అధికారికంగా ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. మే 12 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించిన AP EAPCET పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx లో పొందుపరిచారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ AP EAPCET పరీక్షల ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదలయ్యాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (X) ద్వారా ఈ ఫలితాలు విడుదలైనట్లు అధికారికంగా తెలియజేశారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ హాల్ టికెట్ నంబర్‌తో నేరుగా ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థుల కోసం ఈ ఫలితాలను ఈరోజు విడుదల చేశారు. గతంలో జూన్ 30న ఈ ఫలితాలను విడుదల చేయాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. జూలై 2వ తేదీన ఫలితాలు విడుదల చేస్తామని కూడా అధికారికంగా తెలిపారు. కానీ ఈరోజు జూలై 1వ తేదీనే ఫలితాలను విడుదల చేశారు.

 

 

మంత్రి లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 1,82,317 మంది, అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో 63,546 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. విజయం సాధించిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తంగా ఫలితాల్లో 71.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

READ ALSO:  నేడే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్ట్ లింక్ ఓపెన్!

READ ALSO:   ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు వాయిదా..! జూలై 2న విడుదల! కారణం ఇదే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

July School Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్..వారంలో రెండు రోజులు సెలవులు..ఎప్పుడంటే?

Hyderabad, Telangana:

July School Holidays 2026: తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు జూలై నెలలో ఊహించిన విధంగా సెలవులు రానున్నాయి. సాధారణంగా జూలైలో ఎలాంటి పండుగలు, ప్రభుత్వ సెలవులు ఉండవు. కేవలం ఆదివారాలు, రెండో శనివారం మాత్రమే సెలవులు ఉన్నాయి. అయితే తాజాగా జూలై నెలలో రెండో శనివారం సెలవును కూడా ఇటీవలే రద్దు చేయగా.. జూలై నెలలో అత్యధికంగా 27 రోజుల పాటు విద్యాసంస్థల పనిదినాలను ప్రభుత్వం ప్రకటించింది. అయినా తాజాగా బంద్ మరి ఇతర సెలవులు నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడనున్నాయి. 

సాధారణంగా జూలై నెల వచ్చిందంటే విద్యార్థులకు ఎలాంటి పండగ హాలిడేలు దొరకవు. కానీ, తెలంగాణలో మాత్రం ఈసారి ఊహించిన విధంగా అదనపు సెలవులు రానున్నాయి. వేరువేరు డిమాండ్లతో బీసీ సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంధువులను పిలుపునివ్వడమే అందుకు కారణంగా తెలుస్తుంది. 

జూలై 2న బీసీ సంఘాల రాష్ట్ర వ్యాప్త బంద్ 
రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు రెండు రోజుల నిరసన కార్యక్రమాలు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా జూన్ 30వ తేదీన తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి, రాస్తారోకోలు నిర్వహించారు. జులై ఒకటిన విద్యా సంస్థలు ఎలాగో నడిచినప్పటికీ.. జూలై 2న అనగా గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు బంద్‌ను ప్రకటించారు. 

జులై 10న వామపక్ష విద్యార్థి సంఘాల బంద్..
బీసీ సంఘాల బంధు ముగిసిన వారం రోజులకే మరో బంద్ తెరపైకి రానుంది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్న పలు సంస్థలు పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు, జులై 10న బంద్‌ను పిలుపునిచ్చాయి. హైదరాబాదులో సమావేశమైన విద్యార్థుల సంఘాల నాయకులు ఈ మేరకు కార్యచరణ రూపొందించి పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. 

జులై 10 శుక్రవారం నాడు విద్యాసంస్థలు స్వచ్చందంగా ఇబ్బందులు పాటించాలని, అవాంఛనీయ పరిస్థితులు రాకుండా యాజమాన్యాలు, తల్లిదండ్రులు సహకరించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు వీకెండ్ కు ముందు మరో అదనపు సెలవు దొరకనుంది. 

జూలైలో మరిన్ని సెలవులు వచ్చే అవకాశం ఉందా? 
బందులతో పార్టీ నెలలో వర్షాల కారణంగా అదనపు సెలవులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఊపొందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫానుగా మరి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. 

గత ఏడాది కూడా భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు వరుసగా అత్యవసర సెలవులు ప్రకటించింది. ఏడాది కూడా అదే పరిస్థితి రిపీట్ అయితే, జులై నెలలో విద్యార్థులకు మరిన్ని సడన్ హాలిడేస్ దొరికే అవకాశం ఉంది.

Also Read: ముగ్గురు హీరోయిన్లతో హైటెక్ లెవల్ వ్యభిచారం..ముంబైలో చీకటి దందా బట్టబయలు

Also Read: "హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లు ఉండొద్దంటే ఆ పని చేయండి"..జబర్దస్త్ నటుడు సంచలన వ్యాఖ్యలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

OnePlus: రూ.20 వేలకే 8,000mAh బ్యాటరీ ఫోన్.. మార్కెట్లో OnePlus N6 అరాచకం!

Hyderabad, Telangana:

OnePlus N6 Launched In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ OnePlus భారతీయ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్తను అందించింది.. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వినియోగదారులను టార్గెట్ చేస్తూ.. సరికొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ఫ్లస్‌ N6 (OnePlus N6) స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్‌ చేసింది.. రూ.25,000 లోపు బడ్జెట్‌లోనే ఏకంగా భారీ 8,000mAh బ్యాటరీతో మొట్టమొదటి OnePlus ఫోన్ ఇదే కావడం విశేషం. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌ వంటి అనేక రకాల కొత్త కొత్త హంగులతో ఈ ఫోన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ధరలు వివరాలు..
భారత మార్కెట్లో వన్‌ప్లస్ N6 రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ కలిగిన వేరియంట్‌ అసలు ధర రూ.22,999 కాగా.. బ్యాంక్ ఆఫర్లతో పాటు ప్రైమ్ డే డిస్కౌంట్లతో కలిపి ఎఫెక్టివ్ ధరతో కేవలం రూ.19,999లోపే సొంతం చేసుకోవచ్చు. ఇక రెండవ వేరియంట్‌ 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర రూ.24,999 కాగా.. ఆఫర్స్‌ వినియోగించి దీనిని కొనుగోలు చేసేవారికి ఇది కేవలం రూ.21,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రెష్ మింట్ (Light Green)తో పాటు మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది.. జూలై 4వ తేదీ రాత్రి 12:00 గంటల నుంచి అమెజాన్ ఇండియా, ఒన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్లలో దీని ఓపెన్ సేల్ మొదలు కాబోతున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది..

3 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌..
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 8,000mAh బ్యాటరీగా కంపెనీ భావిస్తోంది.. ఒకే ఒక్క పూర్తి ఛార్జ్‌తో సాధారణ వినియోగదారులు ఏకంగా మూడు రోజుల పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ను వాడుకోవచ్చని కంపెనీ అధికారంగా ప్రకటించింది. దీనికి తోడు 45W సూపర్‌వూక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. ఇది కేవలం 47 నిమిషాల్లోనే 1 శాతం నుంచి 50 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది.. అంతేకాకుండా, గరిష్టంగా 7 సంవత్సరాల పాటు బ్యాటరీ హెల్త్ 80 శాతం పైనే ఉండేలా 1,600 ఛార్జింగ్ సైకిల్స్ లైఫ్‌తో దీనిని డిజైన్ చేసిన్నట్లు సమాచారం. గేమింగ్ ప్రియుల కోసం నేరుగా పవర్ సోర్స్ నుంచి విద్యుత్ అందించే బై-పాస్ ఛార్జింగ్‌తో పాటు 5W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్లను కూడా అందుబాటులో ఉంచడం విశేషం..

డిస్‌ప్లేతో పాటు అద్భుతమైన ఫీచర్లు..
వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. 6.75-ఇంచుల HD+ LCD డిస్ల్పేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ ఎంతో అద్భుతంగా పని చేస్తుంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వేడిని సులభంగా తగ్గించేందుకు ఇందులో 5,300mm కలిగిన సెగ్మెంట్స్ లార్జెస్ట్ వేపర్ ఛాంబర్ (VC) కూలింగ్ సిస్టమ్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.. మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ (MediaTek Dimensity 6360 Apex) ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్, లేటెస్ట్ ఆక్సిజన్ ఓఎస్ 16 (OxygenOS 16) ఆధారిత ఆండ్రాయిడ్ 16 పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది.. దీనికి 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందిస్తూ వస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

AI ఎన్‌హాన్స్‌డ్ కెమెరా..
అద్భుతమైన ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరాను కూడా అందించింది.. ఇది 60 FPS వేగంతో వీడియో రికార్డింగ్ చేస్తుందని కంపెనీ తెలిపింది.. అలాగే ఫ్రంట్‌ భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది.. అంతేకాకుండా పెర్ఫెక్ట్ షాట్, అన్‌బ్లర్, ఏఐ ఎరేజర్‌తో పాటు రిఫ్లెక్షన్ ఎరేజర్ వంటి అద్భుతమైన ఏఐ (AI) ఫీచర్లు ఇందులో లభించడం విశేషం.. ఇక ప్రొటెక్షన్ విషయానికి వస్తే.. ఇందులో మిలిటరీ గ్రేడ్ (MIL-STD-810) డ్యూరబిలిటీతో పాటు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కోసం IP65 రేటింగ్ కూడా అందించారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top