नूंह जिले में लगातार बारिश से जनजीवन प्रभावित, कब्रिस्तान और घरों में भरा पानी
नूंह जिले में पिछले कई दिनों से हो रही रुक-रुक कर बारिश से ग्रामीण अंचल में जनजीवन अस्त-व्यस्त हो गया है। बारिश के कारण कब्रिस्तान और घरों में पानी भर गया है जिससे गांव की सड़कें भी पानी से लबालब हो गई हैं। नूंह विधायक ने जब इस स्थिति के बारे में सुना तो वे सुड़का गांव पहुंचे। वहां उन्होंने देखा कि कब्रिस्तान भी बारिश के पानी से भर गया है। इसके अलावा गांव के घरों में भी पानी भर गया है जिससे लोगों की समस्याएं और बढ़ गई हैं।
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Budget 2026 aam aadmi expectations: బడ్జెట్ 2026 సమీపిస్తున్న వేళ.. దేశవ్యాప్తంగా సామాన్యులు, మధ్యతరగతి ఆశతో ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నెలనెలా పెరుగుతున్న EMIల భారం, స్థిరంగా లేని ఉద్యోగ పరిస్థితులు.. వీటన్నింటి మధ్య ప్రభుత్వం ఈసారి నేరుగా తమ జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటుందా అనే ప్రశ్న ప్రజల మనసుల్లో మెదులుతోంది. జీతాలు పెరగకపోయినా ఖర్చులు మాత్రం పెరుగుతున్న ఈ కాలంలో.. బడ్జెట్ 2026 సామాన్యుల జేబుకు ఎంత ఉపశమనం ఇస్తుందన్నదే ఆసక్తి నెలకొంది.
ఈసారి బడ్జెట్లో ప్రధానంగా చర్చకు వచ్చే అంశం ఆదాయపు పన్ను ఉపశమనం. ముఖ్యంగా 30 శాతం పన్ను స్లాబ్పై చాలా కాలంగా మధ్యతరగతి నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ. 24 లక్షలు దాటితేనే నేరుగా 30 శాతం పన్ను వర్తిస్తోంది. ద్రవ్యోల్బణం, పిల్లల విద్య, వైద్య ఖర్చులు, గృహ రుణాలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితి పాతదైందన్న భావన బలంగా వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వం ఈ స్లాబ్ను రూ. 40 నుంచి రూ. 50 లక్షల వరకు పెంచవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇది అమలైతే, మధ్యతరగతిలోని జీతం పొందే వర్గానికి ప్రతి ఏడాది వేల రూపాయల మేర ప్రత్యక్ష లాభం చేకూరుతుంది. వారి చేతిలో మిగిలే డబ్బు పెరిగి, వినియోగం కూడా పెరుగుతుంది.
అదేవిధంగా.. కొత్త పన్ను విధానంలో ప్రామాణిక మినహాయింపును మరింత పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిమితిని రూ. 1 లక్ష వరకు పెంచితే, జీతం పొందే వారికి స్పష్టమైన ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో, సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు పరిమితిని కూడా పెంచవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇవన్నీ కలిసి ఒక సాధారణ కుటుంబానికి సంవత్సరానికి గణనీయమైన పొదుపు అందించగలవు.
మధ్యతరగతికి మరో పెద్ద కల ఏంటంటే.. సొంత ఇల్లు. అయితే పెరిగిన వడ్డీ రేట్లు, ఖరీదైన ఇళ్ల ధరలు ఈ కలను మరింత దూరం చేస్తున్నాయి. బడ్జెట్ 2026లో ప్రభుత్వం సరసమైన గృహనిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త పన్ను విధానంలో స్వీయ నివాస గృహాలపై గృహ రుణ వడ్డీ మినహాయింపును తిరిగి తీసుకురావడం, దాని పరిమితిని పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంటే, అది ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి పెద్ద ఊరట అవుతుంది. తక్కువ, మధ్య ఆదాయ వర్గాలకు వడ్డీ సబ్సిడీ లేదా ప్రత్యేక రుణ పథకాలు ప్రవేశపెడితే, రియల్ ఎస్టేట్ రంగం కూడా చైతన్యం పొందుతుంది.
ఉపాధి సృష్టి కూడా ఈ బడ్జెట్లో కీలక అంశంగా మారనుంది. యువతకు ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలకు మద్దతు.. ఇవి ప్రభుత్వ ప్రాధాన్యాలుగా ఉండే అవకాశముంది. శ్రమాధారిత రంగాలకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, MSMEలకు సులభ రుణాలు అందిస్తే, కొత్త ఉద్యోగాలు ఏర్పడటంతో పాటు స్వయం ఉపాధి కూడా పెరుగుతుంది.
మొత్తానికి.. బడ్జెట్ 2026 సామాన్యులు, మధ్యతరగతి ఆశలను కేంద్రంగా చేసుకుని రూపొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పన్ను ఉపశమనం, గృహనిర్మాణ సౌలభ్యం, ఆరోగ్య భద్రత, ఉపాధి అవకాశాలు.. ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంటే, అది కోట్లాది కుటుంబాల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకురాగలదు. బడ్జెట్ రోజు ఏ నిర్ణయాలు వెలువడతాయో చూడాల్సిందే. కానీ ఆశలు మాత్రం బలంగానే ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Gold Rate Today: అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా బంగారం.. వెండి మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పసిడి ధరలు ఇప్పటికే చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ఇప్పుడు మరోసారి రేట్ల కోతకు అవకాశం ఉందనే అంచనాలు వెలువడటంతో బంగారం, వెండి ధరలు మరింత వేగంగా పైకి దూసుకెళ్తున్నాయి. గత వారం రోజులుగా ఈ రెండు లోహాల ధరలు రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
డిసెంబర్ 27న బంగారం.. వెండి ధరలు మరోసారి భారీగా పెరిగి ఆల్ టైమ్ హైలను తాకాయి. ఫెడ్ వచ్చే ఏడాదిలో కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముందని సంకేతాలు రావడమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డాలర్ బలం తగ్గుతుంది. అలాగే ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడులు కూడా పడిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారంపై డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ను పరిశీలిస్తే.. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,533 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. గత రోజు వరకు ఇది 4,500 డాలర్ల దిగువన ఉండటం గమనార్హం. మరోవైపు వెండి ధర మరింత వేగంగా పెరుగుతూ ఔన్సుకు 79.38 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఈ పెరుగుదల ప్రభావం దేశీయ మార్కెట్పై కూడా శనివారం ఉదయం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం పెద్దగా మార్పులేకుండా రూ. 89.93 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ గణనీయంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 700 పెరిగి ప్రస్తుతం రూ. 1,28,350 వద్ద ఉంది. దీనికి ముందు కూడా వరుసగా కొన్ని రోజులు రూ. 300, రూ. 350, రూ. 1,800, రూ. 2,200 చొప్పున పెరుగుదల నమోదైంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 770 పెరిగి రూ. 1,40,020కు చేరుకుంది. ఇవి దేశీయ మార్కెట్లో నమోదైన అత్యధిక ధరలుగా నిలిచాయి.
బంగారాన్ని మించి వెండి ధరలు మరింత దూకుడుగా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో ఒక్క రోజులోనే వెండి ధర కిలోకు ఏకంగా రూ. 9,000 పెరగడంతో ప్రస్తుతం రూ. 2.54 లక్షల స్థాయికి చేరుకుంది. గత నెల రోజుల గమనిస్తే వెండి ధర దాదాపు రూ. 70 వేల వరకు పెరగడం విశేషం. గత నెల ఇదే సమయంలో కిలో వెండి ధర సుమారు రూ. 1.60 లక్షల వద్ద ఉండగా, ఇప్పుడు రూ. 2.30 లక్షలు దాటడం వెండి వేగాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
బంగారం ధరలు ఇలా ఆకాశాన్ని తాకుతుండటంతో ఆభరణాల కొనుగోలు సామాన్యులకు భారంగా మారింది. గత కొన్ని రోజులుగా బంగారు దుకాణాల్లో కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే పెట్టుబడి కోణంలో చూస్తే బంగారం భవిష్యత్తులో కూడా బలంగా కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు 2026 వరకూ బంగారం ధరల్లో బుల్లిష్ ధోరణి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.
ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం కూడా బంగారం ధర పెరుగుదలకు కీలక కారణంగా మారింది. ట్రెజరీ బాండ్లపై రాబడులు తగ్గడంతో ఇన్వెస్టర్లు ఆ పెట్టుబడుల నుంచి బయటకు వచ్చి బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. భద్రమైన ఆస్తిగా గుర్తింపు పొందిన బంగారం ఇలాంటి అనిశ్చిత కాలాల్లో మరింత ఆకర్షణీయంగా మారుతోంది.
దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధాన నిర్ణయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు వెళ్లవచ్చన్న భయాలు కూడా ఇన్వెస్టర్లను బంగారం వైపు నడిపిస్తున్నాయి. ఈ అన్ని అంశాలు కలసి బంగారం, వెండి ధరలను రోజురోజుకు కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
KCR Assembly Session: కృష్ణా జలాలపై భారీ మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాలపై తీవ్ర అన్యాయం చేస్తుండడంపై ఇటీవల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకటించినట్టు 'ఐ యామ్ ద ఫీల్డ్'లో భాగంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ నాయకుల సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ జాక్పాట్! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం
సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో శుక్రవారం మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ మూడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిం.దే ఈ సందర్బంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నాయకులతో సమావేశమై సభలను ఎప్పుడు? ఎక్కడ? ఏర్పాటు చేయాలనే దానిపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
Also Read: GHMC Gift: హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గిఫ్ట్! ఏమిటో తెలుసా?
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణపై పార్టీ ముఖ్య నాయకులతో గులాబీ బాస్ కేసీఆర్ చర్చించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం బహిరంగ సభలు నిర్వహించే అంశాన్ని సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలోనే 29వ తేదీన శాసనసభకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పార్టీ నాయకులతో కేసీఆర్ పునరుద్ఘాటించారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్.. వారికి కొత్త ఉద్యోగాలు
కాంగ్రెస్ నాటి నుంచీ తెలంగాణకు ఎప్పుడు ద్రోహమేనని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు ఉండదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్దాం.. ఉద్యమాన్ని నిర్మిద్దామని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైనే ఉందని ప్రకటించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని పార్టీ నాయకులకు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహం, అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు చెబుదామని కేసీఆర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
8th Pay Commission latest: 8 వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. వేతనాలు ఎప్పుడు పెరుగుతాయి? సిఫార్సులు ఎప్పుడు అమలవుతాయి? తమకు ఇప్పటివరకు అందుతున్న ముఖ్యమైన పథకాల భవిష్యత్తు ఏమవుతుంది? వంటి ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం, గృహానికి సంబంధించిన పథకాలపై ఉద్యోగులు ఎక్కువగా దృష్టి పెట్టారు.8వ వేతన సంఘం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది కానీ.. ప్రస్తుతం అమలులో ఉన్న కీలక పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS)
CGHS అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లు.. వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన ఆరోగ్య సంరక్షణ పథకం ఇది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వెల్నెస్ సెంటర్లు, ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందిస్తుంది. సాధారణ వైద్య పరీక్షలు.. నిపుణుల సంప్రదింపులు.. ల్యాబ్ టెస్టులు.. చికిత్సలు.. శస్త్రచికిత్సలు.. అవసరమైన మందులు ఈ పథకం కింద కవర్ అవుతాయి.
అంతేకాదు. CGHSలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి గరిష్ట బీమా పరిమితి ఉండదు. ప్యాకేజీ ఆధారిత విధానంలో చికిత్స అందిస్తుంది. లబ్ధిదారులు ఆన్లైన్లో e-CGHS కార్డును సులభంగా పొందవచ్చు. తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండటం వల్ల ఈ పథకం కేంద్ర ఉద్యోగులకు ఎంతో కీలకంగా మారింది.
కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ అడ్వాన్స్ (HBA)
ఇల్లు కొనడం లేదా నిర్మించుకోవడం అనేది ప్రతి ఉద్యోగి కల. ఈ లక్ష్యాన్ని సులభం చేయడానికి కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మార్కెట్ వడ్డీ రేట్లతో పోలిస్తే చాలా తక్కువ వడ్డీకి గృహ రుణాన్ని పొందవచ్చు. ఇల్లు కొనుగోలు చేయడం.. ప్లాట్ నిర్మాణం.. ఇంటి పునరుద్ధరణ లేదా విస్తరణ వంటి అవసరాల కోసం ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు.
Also Read: Copper Price: బంగారం కాదు, వెండి అంతకన్నా కాదు.. మార్కెట్లో ఇప్పుడు ఈ లోహమే కింగ్..!!
HBA కింద ఒక ఉద్యోగి తన ప్రాథమిక జీతం, డియర్నెస్ అలవెన్స్ (DA) కలిపిన మొత్తానికి గరిష్టంగా 34 రెట్లు లేదా గరిష్టంగా రూ. 25 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఈ లోన్ పై వడ్డీ రేటు సాధారణంగా 6 శాతం నుంచి 7.5 శాతం మధ్యలో ఉంటుంది. ఇది బ్యాంకు రుణాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ పథకం ప్రధానంగా శాశ్వత ఉద్యోగులకు వర్తిస్తుంది. అయితే కొన్ని షరతులతో తాత్కాలిక ఉద్యోగులకు కూడా అవకాశం ఉంటుంది. ఈ లోన్ పొందాలంటే ఉద్యోగి కనీసం ఐదు సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు పూర్తి చేసి ఉండాలి. అలాగే.. గతంలో ప్రభుత్వ గృహాన్ని పొందకూడదు లేదా ఇల్లు సంబంధిత ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను ఉపయోగించుకుని ఉండకూడదు.
మొత్తంగా.. CGHS, HBA పథకాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతతో పాటు గృహ భరోసాను అందిస్తున్న కీలక ఆధారాలుగా ఉన్నాయి. 8 వేతన సంఘం సిఫార్సులు వచ్చిన తర్వాత వీటిలో ఏవైనా మార్పులు జరుగుతాయా? అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అప్పటివరకు ఈ పథకాలు ఉద్యోగుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
CEO Gives rs.2,000 Crore in Bonus to Employees: ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం అనేది సాధారణంగా అన్ని కంపెనీల్లో జరిగే వ్యవహారమే. కానీ తాజాగా ఒక సీఈవో తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసింది. తన ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు ఆయన చేసిన త్యాగం తెలిస్తే..మీరు గ్రేట్ సార్ అనక తప్పరు. ఏం చేశారో తెలుసా? ఏకంగా తన కంపెనీని అమ్మేశారు. అందులో వచ్చిన మొత్తంలో భారీ భాగాన్ని ఉద్యోగుల కోసం కేటాయించారు. ఫలితంగా వందలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా కోట్లాది రూపాయలు బోనస్ అందుకున్నారు. ఇది వినేందుకు కలలా అనిపించినా.. జరిగింది మాత్రం నిజమే.
ఈ సంఘటన జరిగింది అమెరికాలోని లూసియానాకు చెందిన ఫైబర్ బాండ్ అనే సంస్థలో. ఈ కంపెనీకి గ్రాహమ్ వాకర్ సీఈవోగా ఉన్నారు. ఆయన తండ్రి క్లాడ్ వాకర్ 1982లో ఈ సంస్థను స్థాపించారు. దశాబ్దాలుగా ఈ కంపెనీతో కలిసిన ఎదిగిన ఉద్యోగులను తమ కుటుంబమని గ్రాహమ్ భావిస్తుండేవారు. అదే భావన ఆయన తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణం అయ్యింది.
అయితే ఇటీవల ఫైబర్ బాండ్ ను ప్రముఖ సంస్థ ఈటన్ సుమారు 1.7 బిలియన్ డాలర్లకు కొన్నది. అయితే ఈ డీల్ పూర్తయ్యే ముందు గ్రాహమ్ వాకర్ ఓ కీలక కండిషన్ పెట్టారు. కంపెనీ అమ్మకపు మొత్తంలో 15 శాతం వాటా.. అంటే దాదాపు రూ. 2,000 కోట్లను.. కంపెనీలో పనిచేస్తున్న 540 మంది ఉద్యోగులకు బోనస్గా కేటాయించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగులు లేకుండా ఈ కంపెనీ ఇంత దూరం రాలేదని ఆయన అభిప్రాయం. ఆశ్చర్యకరంగా.. ఈటన్ సంస్థ కూడా ఆ షరతుకు అంగీకరించింది.
దీంతో వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రతి ఉద్యోగికి సగటున రూ. 4 కోట్ల వరకు బోనస్ అందే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో బోనస్ మొత్తం జమ అవుతుండగా.. కొత్త యాజమాన్యంలో ఉద్యోగంలో కొనసాగితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మొదట ఈ వార్త బయటకు వచ్చినప్పుడు చాలామంది నమ్మలేకపోయారు. ఇది లాటరీ గెలిచినట్లే ఉంది అని ఒక ఉద్యోగి వ్యాఖ్యానించగా.. మరికొందరు ఈ డబ్బుతో తమ అప్పులు తీర్చుకోవచ్చని భావోద్వేగానికి లోనయ్యారు.
1990ల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని తమ జీవితంలో మర్చిపోలేని క్షణంగా అభివర్ణిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఇంతటి గిఫ్ట్ వస్తుందని ఎవరూ ఊహించలేదని వారు చెబుతున్నారు. డిసెంబర్ 31తో గ్రాహమ్ వాకర్ సీఈఓ పదవికి వీడ్కోలు పలకనున్నారు. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఎప్పటికీ ఉద్యోగుల హృదయాల్లో నిలిచిపోతుంది.
ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి బాస్ ప్రతి ఉద్యోగికి కావాలి.. ఇది నిజమైన లీడర్షిప్.. ఉద్యోగులను కుటుంబంలా చూసే వ్యక్తి అంటూ గ్రాహమ్ వాకర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. లాభాలకంటే మనుషుల విలువను ముందు పెట్టిన ఈ కథ ఇప్పుడు ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.
Also Read: Copper Price: బంగారం కాదు, వెండి అంతకన్నా కాదు.. మార్కెట్లో ఇప్పుడు ఈ లోహమే కింగ్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Bangladesh Hindu Killed: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ఇటీవల మైమెన్సింగ్లో దైవదూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని దారుణంగా హత్య చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మైనారిటీలే లక్ష్యంగా దాడులు..
బంగ్లాదేశ్లో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల తీవ్రతను భారత్ ఎత్తిచూపింది. తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై 2,900 కంటే ఎక్కువ హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.
దీపు చంద్ర దాస్ హత్యను ఖండిస్తూ, బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇవి కేవలం మీడియా సృష్టి లేదా రాజకీయ హింస కాదని, ఇవి మైనారిటీలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులని జైస్వాల్ స్పష్టం చేశారు.
పొరుగు దేశంలో నెలకొన్న అస్థిరతపై భారతదేశం తన వైఖరిని స్పష్టంగా వివరించింది. తమ దేశంలోని మైనారిటీల ప్రాణాలకు, ఆస్తులకు, మతపరమైన స్థలాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానిదే అని భారత్ పునరుద్ఘాటించింది. బంగ్లాదేశ్లో ప్రచారంలో ఉన్న తప్పుడు భారత వ్యతిరేక కథనాలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. బంగ్లాదేశ్లో శాంతి, స్థిరత్వం నెలకొనాలని.. అక్కడ స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, అందరినీ కలుపుపోయే ఎన్నికలు జరగాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది.
బంగ్లాదేశ్ ప్రజలతో సంబంధాలు
బిఎన్పి (BNP) నాయకుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్కు తిరిగి రావడంపై స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ప్రజలతో తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని జైస్వాల్ పేర్కొన్నారు. అక్కడి పరిణామాలను భారతదేశం నిశితంగా గమనిస్తోందని ఆయన తెలిపారు.
చివరిగా.. పొరుగు దేశంలో మైనారిటీలపై జరుగుతున్న నిరంతర శత్రుత్వం చాలా ఆందోళనకరమైన విషయమని, తక్షణమే శాంతిభద్రతలను పునరుద్ధరించాలని భారతదేశం బంగ్లాదేశ్కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt employees cover medical treatment scheme upto 10 lakhs: కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన ఆరోగ్య భద్రతా పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆయుష్మాన్ తరహా నగదు రహిత వైద్య సేవలను 2026 నాటికి రాష్ట్రంలోని దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ పథకం ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆసుపత్రుల్లో ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందే అవకాశం ఉంటుంది.
ఈ ప్రతిపాదిత పథకానికి ముఖ్యమంత్రి ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకం అనే పేరు పెట్టారు. ఉద్యోగి సంఘాల సూచనలు, దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఈ పథకాన్ని రూపొందించారు. ఆయుష్మాన్ భారత్ తరహాలోనే రాష్ట్రంలోపల, రాష్ట్రం వెలుపల ఉన్న ప్రైవేట్, ఎంపిక చేసిన ఆసుపత్రులతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. దీని వల్ల ఉద్యోగులు ఎక్కడైనా చికిత్స పొందే సౌలభ్యం కలుగుతుంది.
ఈ పథకం కింద సాధారణ వైద్య చికిత్సలు, OPD సేవలకు రూ.5 లక్షల వరకు ఉచిత కవరేజ్ అందించనున్నారు. తీవ్ర అనారోగ్యాల విషయంలో ఈ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచే ప్రతిపాదన ఉంది. ఈ ప్రయోజనాలు ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు, అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా వర్తించనున్నాయి.
ఈ ఆరోగ్య బీమా పథకానికి అవసరమైన నిధుల్లో ఒక భాగాన్ని ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీతం లేదా పెన్షన్ నుండి నెలకు రూ.250 నుంచి రూ.1,000 వరకు విరాళంగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 2020లో రాష్ట్ర ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అప్పట్లో ఆ పథకం అమలుకు నోచుకోలేదు. ఈసారి మాత్రం స్పష్టమైన విధివిధానాలతో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకం ద్వారా శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులు, బోధనా కేడర్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామ ఉపాధి సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు వంటి విభిన్న విభాగాల ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. వీరి సంఖ్య 15 లక్షలకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఉద్యోగులు వైద్య ఖర్చులను ముందుగా స్వయంగా భరిచి, తర్వాత రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. తీవ్రమైన అనారోగ్యాల సమయంలో ఈ విధానం వారికి భారీ ఆర్థిక భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, నగదు రహిత వైద్య సేవలు ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా మారనున్నాయి. ఉద్యోగి సంఘాలు ఈ పథకాన్ని స్వాగతిస్తున్నాయి. పెన్షనర్లు, ఉద్యోగులు వైద్య ఖర్చుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయాలి అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ ప్రతిపాదన త్వరలో క్యాబినెట్ ముందుకు వెళ్లనుందని, ఆమోదం లభిస్తే 2026లో అమలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Income Tax Slab 2026: బడ్జెట్ సమయం దగ్గరకు వస్తున్న ప్రతిసారీ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ట్యాక్స్ పేయర్స్ మనస్సుల్లో మెదిలే మొదటి ప్రశ్న..ఈసారి ఆదాయపు పన్నులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ముఖ్యంగా జీతంపై ఆధారపడే వేతనజీవులు తమపై ఉన్న పన్ను భారం కొంతైనా తగ్గుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు బడ్జెట్ 2026 విషయంలోనూ ఇదే చర్చ ప్రధానంగా సాగుతోంది. ప్రభుత్వం ఆదాయపు పన్ను స్లాబ్లలో పెద్ద మార్పులు చేస్తుందా? లేక చిన్న సవరణలకే పరిమితమవుతుందా? అన్నదానిపై అంచనాలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో రెండు ఆదాయపు పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. 1. పాత విధానం 2. కొత్త విధానం. ప్రభుత్వం కొత్త పన్ను విధానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ విధానంలో మినహాయింపులు తక్కువగా ఉండగా.. పన్ను రేట్లు క్రమంగా పెరుగుతాయి. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ. 24 లక్షలు దాటిన వారికి నేరుగా 30 శాతం పన్ను వర్తిస్తోంది. ఇక పాత పన్ను విధానంలో వివిధ రకాల మినహాయింపులు, తగ్గింపులు ఉన్నప్పటికీ, స్లాబ్ నిర్మాణం పాతదిగానే కొనసాగుతోంది.
బడ్జెట్ 2026లో సామాన్య పన్ను చెల్లింపుదారుడికి అసలు ఉపశమనం ఎక్కడ లభించగలదనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా 30 శాతం పన్ను స్లాబ్ అంశం ఎక్కువ చర్చకు దారి తీస్తోంది. ద్రవ్యోల్బణం, గృహ రుణ భారం, పిల్లల చదువు ఖర్చులు, వైద్య వ్యయాలు పెరిగిన నేపథ్యంలో రూ. 24 లక్షల పరిమితి ఇప్పటి పరిస్థితులకు సరిపోవడం లేదని మధ్యతరగతి, ఉన్నత-మధ్యతరగతి వర్గాలు భావిస్తున్నాయి. అందుకే 30 శాతం పన్ను స్లాబ్ను రూ. 40 లక్షలు లేదా రూ. 50 లక్షల ఆదాయం నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
అలా జరిగితే రూ. 24 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఆదాయం పొందే వారికి నేరుగా లాభం చేకూరుతుంది. వారి చేతిలో మిగిలే డబ్బు పెరుగుతుంది. వినియోగ సామర్థ్యం మెరుగవుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రోత్సాహకంగా మారవచ్చని నిపుణుల అభిప్రాయం. అయితే, ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సంకేతాలు రాలేదు. ఆశలు ఉన్నప్పటికీ, ఖచ్చితత్వం మాత్రం లేదు.
ఇంకొకవైపు.. కొత్త పన్ను విధానంలో చిన్నచిన్న మార్పులు జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు.. స్టాండర్డ్ డిడక్షన్ను కొంత పెంచడం, ఆరోగ్య బీమా లేదా పదవీ విరమణ పొదుపులకు పరిమిత ప్రయోజనాలు జోడించడం వంటి సవరణలు రావొచ్చని అంచనా. ఇవి పెద్ద సంస్కరణలుగా అనిపించకపోయినా, జీతం పొందే లక్షలాది మందిపై తక్షణ ప్రభావం చూపే అవకాశముంది.
పరిశ్రమల సంఘాలు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. PHDCCI ప్రకారం రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను రేట్లలో ఉపశమనం ఇవ్వడం ద్వారా వినియోగాన్ని పెంచవచ్చని సూచిస్తోంది. డెలాయిట్ అయితే, TDS విధానాన్ని సరళీకృతం చేయడం, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం.. కొత్త పన్ను విధానాన్ని మరింత బలోపేతం చేయడం అవసరమని అంటోంది. ఈవై సంస్థ మాత్రం మూలధన లాభాల పన్ను, ఆదాయపు పన్ను స్లాబ్లు, పాత పన్ను విధానం భవితవ్యంపై మార్పులు రావచ్చని అంచనా వేస్తోంది.
పాత పన్ను విధానంపై గురించి చర్చిస్తే.. ప్రభుత్వం దాన్ని క్రమంగా పక్కకు నెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బడ్జెట్ 2026లో ఒక్కసారిగా దాన్ని రద్దు చేసే అవకాశం తక్కువగానే ఉన్నప్పటికీ, కొత్త మినహాయింపులు లేదా పెద్ద ఉపశమనం వచ్చే ఆశలు కూడా చాలా పరిమితంగానే ఉన్నాయి. అంటే.. పాత విధానంలో కొనసాగుతున్న వారు పెద్ద మార్పులు ఆశించకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.
మొత్తంగా చూస్తే.. బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను స్లాబ్లలో విప్లవాత్మక మార్పులు జరిగే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. అయినప్పటికీ, 30 శాతం పన్ను స్లాబ్పై ప్రభుత్వం పునరాలోచన చేస్తే.. అది మధ్యతరగతికి, లక్షలాది పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరటగా మారుతుంది. ప్రస్తుతం ఆశలు కొనసాగుతున్నాయి. కానీ తుది నిర్ణయం మాత్రం బడ్జెట్ రోజునే స్పష్టమవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Telangana Sankranti Holidays 2026: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. పిండి వంటలు, గాలిపటాలు, సొంతూరి ప్రయాణాలతో సందడి మొదలవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ పండగ సెలవుల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే, ఈసారి తెలంగాణలోని పాఠశాలలకు గత ఏడాది కంటే అదనంగా సెలవులు వచ్చే అవకాశం ఉండటంతో పిల్లలు అప్పుడే ప్లాన్లలో మునిగిపోయారు.
9 రోజుల సెలవుల లెక్క ఇదీ!
సాధారణంగా తెలంగాణలో సంక్రాంతికి తక్కువ రోజులే సెలవులు ఇస్తుంటారు. కానీ, ఈ ఏడాది క్యాలెండర్ కలిసొస్తుండటంతో సెలవుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. జనవరి 10 (రెండో శనివారం), జనవరి 11 (ఆదివారం), జనవరి 12 నుండి 17 వరకు: సంక్రాంతి పండగ సెలవులు (అంచనా) అదే విధంగా జనవరి 18న ఆదివారం కావడం వల్ల సెలవులు వచ్చే అవకాశం ఉంది.
ఇలా వరుసగా శని, ఆదివారాలు తోడవడంతో జనవరి 10 నుండి 18 వరకు వరుసగా 9 రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. తిరిగి జనవరి 19 (సోమవారం) నాడు పాఠశాలలు పునఃప్రారంభం కావచ్చు. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో విద్యాశాఖ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనవరి 10వ తేదీ నుంచి 18 వరకు 9 రోజుల పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. జనవరి 19న అనగా సోమవారం తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయి. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు సెలవులపై స్పష్టత రావాల్సిఉంది.
ప్రయాణాలకు సిద్ధమవుతున్న జనం
ఈసారి లాంగ్ వీకెండ్స్, వరుస సెలవులు ఉండటంతో..అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు కూడా ఈ 9 రోజుల విరామాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు.
గమనిక: ఇవి విద్యాశాఖ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం అంచనాలు మాత్రమే. అధికారిక తేదీల కోసం ప్రభుత్వం విడుదల చేసే జీవో (GO) కోసం వేచి చూడాల్సిందే.
Also Read: Midday Meal Egg: స్కూల్ విద్యార్థులకు షాక్..మధ్యాహ్న భోజనంలో గుడ్లు బంద్! కొండెక్కిన కోడిగుడ్ల ధరలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook