नूंह जिले में लगातार बारिश से जनजीवन प्रभावित, कब्रिस्तान और घरों में भरा पानी
Nuh Rural, Haryana:नूंह जिले में पिछले कई दिनों से हो रही रुक-रुक कर बारिश से ग्रामीण अंचल में जनजीवन अस्त-व्यस्त हो गया है। बारिश के कारण कब्रिस्तान और घरों में पानी भर गया है जिससे गांव की सड़कें भी पानी से लबालब हो गई हैं। नूंह विधायक ने जब इस स्थिति के बारे में सुना तो वे सुड़का गांव पहुंचे। वहां उन्होंने देखा कि कब्रिस्तान भी बारिश के पानी से भर गया है। इसके अलावा गांव के घरों में भी पानी भर गया है जिससे लोगों की समस्याएं और बढ़ गई हैं।
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
MI Vs CSK Match: ఐపీఎల్ నుంచి తప్పుకోనున్న తొలి టీమ్ ముంబై..CSK జట్టుపై చిత్తుగా ఓడింది!
Chennai, Tamil Nadu:MI Vs CSK Match 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నేడు జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై తమ చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఘన విజయం సాధించింది. అయితే ఈ లీగ్లో ముంబై ఇండియన్స్కు ఇది ఏడో పరాజయం కావడం గమనార్హం. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నట్లే పరిస్థితి కనిపిస్తుంది. వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ టీమ్ అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.
ప్రస్తుత లీగ్లో ఆడిన 9 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ జట్టు 2 సార్లు గెలుపొందగా.. 7సార్లు ఓటమిని చవిచూసింది. దీంతో ఆ టీమ్ ప్లేఆఫ్స్ అర్హత సాధించడం దాదాపుగా అసాధ్యమే అని చెప్పవచ్చు. లీగ్ దశ నుంచి తప్పుకొనే తొలి టీమ్గా ముంబై నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో గెలుపొంది.. 5 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. అయితే సీఎస్కే జట్టు తదుపరి మ్యాచ్ ఫలితాల ద్వారా దాని ప్లేఆఫ్స్ అర్హత సాధించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ సగానికి పైగా మ్యాచ్లు పూర్తవ్వగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ జట్లు ప్లేఆఫ్స్కు వెళ్లాలంటే కనీసం 7 లేదా 8 మ్యాచ్ల్లో కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే 14 లేదా 16 పాయింట్లను సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవైనా రెండు జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం సమానంగా ఉంటే.. వాటి నెట్ రన్రేట్ మెరుగ్గా ఉన్న ఆధారంగా ప్లేఆఫ్స్కు చేరుతాయి. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే 12 పాయింట్లను సాధించినందున, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్లకు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువ.
శనివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బ్యాటింగ్ ఎంచుకోగా.. విల్ జాక్స్ తక్కువ స్కోరుకే అవుటైనా ఫర్వాలేదనిపించేలా ఆరంభాన్ని ఇచ్చాడు. సగం ఆట ముగిసేసరికి, ముంబై జట్టు 180కి పైగా పరుగులు చేస్తుందని అనిపించింది. అయితే, సూపర్ కింగ్స్ పద్ధతిగా పరుగులు చేయడాన్ని నియంత్రించి, ముంబై ఇండియన్స్కు బ్రేకులు వేసింది. దీంతో ముంబై జట్టును 159 పరుగులకే పరిమితం చేసింది.
లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో సంజు సామ్సన్ను 11 పరుగులకే అవుట్ చేసి ముంబై ఇండియన్స్ 'ఎల్లో ఆర్మీ'కి ఆరంభంలోనే దెబ్బకొట్టింది. కానీ, మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఉర్విల్ పటేల్, వేగంగా 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రుతురాజ్ గైక్వాడ్ (67*), కార్తీక్ శర్మ (54*) అజేయంగా 98 పరుగులు జోడించారు. ఇంకా 11 బంతులు, 8 వికెట్లు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్ తమకు ఏమాత్రం కలిసి రాలేదని, ఈ మ్యాచ్లో తమ ప్రదర్శన అన్ని విభాగాల్లోనూ వెనుకబడిందని పాండ్యా అభిప్రాయపడ్డాడు. "ఇది మా సీజన్ కాదు. వారు మాకంటే మెరుగ్గా ఆడారు. మెరుగ్గా బౌలింగ్ చేశారు. మెరుగ్గా ఫీల్డింగ్, బ్యాటింగ్ చేశారు. 180-190 పరుగులు ఒక మంచి స్కోరు అయ్యేది. మాకు కావాల్సిన మూమెంటమ్ లభించలేదు. మొత్తంగా చూస్తే, ఒక బౌలింగ్ యూనిట్గా వారు మాకంటే మెరుగ్గా ఉన్నారు. కానీ ఒక బ్యాటింగ్ యూనిట్గా మేము అంత గొప్పగా రాణించలేకపోయాము. మాకు అందుబాటులో ఉన్న బౌలింగ్ ప్రత్యామ్నాయాలతోనే మేము ముందుకు వెళ్లాము" అని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CM Revanth Reddy Employees: ఉద్యోగులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..
Hyderabad, Telangana:CM Revanth Reddy Telangana Employees: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. తాజాగా ఉద్యోగుల జేఏసీతో చర్చించిన సీఎం.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల కోసం వంద రోజుల్లో రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.Fuel Price Hike: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు? సామాన్యూడి నెత్తిన బాంబు పేల్చనున్న కేంద్రం?
Hyderabad, Telangana:Fuel Price Hike Update: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. దేశంలో ఇటీవలే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయని సమాచారం.Virat Kohli ODI Retirement: వన్డేలకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్! కింగ్ కోహ్లీ స్థానంలో అతనే అసలైన వారసుడు!
Hyderabad, Telangana:Virat Kohli ODI Retirement News: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ అంటే స్పెషల్ బ్రాండ్ ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే, 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ తన రిటైర్మెంట్ను ప్రకటించవచ్చని మరోసారి ఊహాగానాలు పెరుగుతున్నాయి.
ఒకవేళ కోహ్లీ వన్డే క్రికెట్ నుండి తప్పుకుంటే.. టీమ్ ఇండియాలో అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనే ప్రశ్న అందరిలోనూ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం టీమ్ఇండియా వన్డే జట్టులో శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో, కేఎల్ రాహుల్ 5వ స్థానంలో ఉన్నారు. హార్దిక్ పాండ్యా తన 6వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
భారత వన్డే జట్టులో మూడవ స్థానానికి తిలక్ వర్మ బలమైన పోటీదారుడిగా ఉన్నాడు. తిలక్ వర్మ బ్యాటింగ్ శైలి ప్రత్యర్థి బౌలర్లకు బెంబేలెత్తించే విధంగా మారాడు. వన్డే ఫార్మాట్లో టీమ్ఇండియాకు విరాట్ కోహ్లీ ఉత్తమ ఎంపిక అని విశ్లేషకులు భావిస్తున్నారు. తిలక్ వర్మ ఫాస్ట్ బౌలర్లను, కటింగ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో నిష్ణాతుడిగా ఎదుగుతున్నాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్లలో (ODI) మూడవసారి బ్యాటింగ్కు వచ్చే స్థానంలో తిలక్ వర్మ ఎంతో అవసరంగా ఉంటుంది.
ఇంటర్నేషనల్ క్రికెట్ లెక్కల ప్రకారం.. తిలక్ వర్మ టీమ్ఇండియా తరఫున 49 టీ20 మ్యాచ్లలో 1,389 పరుగులు చేశాడు. అతని సగటు 44.81గా నమోదయ్యింది. వాటిలో మొత్తంగా 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల విషయానికొస్తే, తిలక్ వర్మ 5 మ్యాచ్లలో 68 పరుగులు చేశాడు. అందులో ఒక అర్ధ సెంచరీ ఉంది.
మరోవైపు తిలక్ వర్మ తన చివరి వన్డేను 2025 డిసెంబర్ 6న దక్షిణాఫ్రికాతో ఆడాడు. తిలక్ వర్మను వన్డే జట్టుకు ఎక్కువ కాలం దూరంగా ఉంచడం కష్టం. తన నిలకడైన ప్రదర్శనలు, మ్యాచ్ గమనాన్ని మార్చగల సామర్థ్యంతో, రిటైర్ అయిన కోహ్లీకి సరైన ప్రత్యామ్నాయంగా తిలక్ వర్మను పరిగణిస్తున్నారు. 2027 ప్రపంచ కప్ తర్వాత, మిడిల్ ఆర్డర్ బాధ్యతలు తీసుకునే అధికారం టీమ్ ఇండియాకు ఉంది. బీసీసీఐ చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vodafone Idea: సంక్షోభంలో వొడాఫోన్ ఐడియా.. రూ.50 వేల కోట్లు ఎలా సాధ్యం?
Wadgaon, Maharashtra:Vodafone Idea: టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ సంస్థను ఇప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వొడాఫోన్ ఐడియాకు రూ.50,000 కోట్ల సహాయం అవసరం. ఈ కంపెనీ ప్రస్తుత రుణం, స్పెక్ట్రమ్ చెల్లింపులు, మూలధన వ్యయం వంటి భారీగా ఉన్నాయి. కేంద్రం ఇప్పటికే స్పెక్ట్రమ్ బకాయిలలో సుమారు రూ.37,000 కోట్లను ఈక్విటీగా మార్చి దాదాపు 49 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా అవతరించింది. దీని ప్రమోటర్లైన యూకేకు చెందిన వొడాఫోన్ పీఎల్సీ, స్వదేశీ ఆదిత్య బిర్లా గ్రూప్ సుమారు 25.5 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన ప్రభుత్వ, సంస్థాగత పెట్టుబడిదారుల వద్ద ఉంది.
Also Read: Kotha Prabhakar Reddy: దుబ్బాకలో రణరంగంగా మీటింగ్.. మైక్ విసిరిపడేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే
వొడాఫోన్ ఐడియాకు ఈ వారం కేంద్ర ప్రభుత్వం స్థూల ఆదాయం (ఏజీఆర్) సర్దుబాటు సంబంధిత బకాయిలను సుమారు రూ.23,649 కోట్లు తగ్గించింది. అయినా కూడా కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించడానికి, 5జీని పెద్ద ఎత్తున విస్తరించడానికి రానున్న మూడున్నరేళ్లకు సుమారు రూ.45,000 నుంచి రూ.50,000 కోట్ల మూలధనం అవసరం కావచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏజీఆర్ ఉపశమనం కంపెనీ బ్యాలెన్స్ షీట్కు కొంత వెసులుబాటు కల్పిస్తుందని, కానీ మూలధన అవసరాన్ని తీర్చదని కొందరు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read: Govt Employees: 100 రోజుల్లో అన్నింటికి పరిష్కారం.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
వొడాఫోన్ ఐడియా ఇప్పటికీ భారీ రుణభారంతో కొట్టుమిట్టాడుతోంది. దీని మొత్తం అప్పులు అనేక లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రస్తుత బాధ్యతలు అప్పు, స్పెక్ట్రమ్ చెల్లింపులు, మూలధన వ్యయం వంటి వివిధ రూపాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ నిధుల కొరతను అధిగమించడానికి వొడాఫోన్ ఐడియా ఒక పెద్ద ఇన్వెస్టర్ను ఆకర్షించాల్సి ఉంది. మరి ఆ పెట్టుబడి ఆకర్షిస్తుందా? ఎవరు అంతటి భారీ పెట్టుబడి పెడతారనేది ఇప్పుడు కీలక ప్రశ్న.
దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా క్రమంగా క్షీణించింది. ఈ రెండు సంస్థల ఆధిపత్యాన్ని మార్కెట్ ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటోంది. ఫలితంగా సబ్స్క్రైబర్ల వాటా, నెట్వర్క్ నాణ్యతపై వినియోగదారుల అభిప్రాయంలో వొడాఫోన్ ఐడియా వెనుకబడుతోంది. 5జీని ప్రోత్సహించి, మూలధనాన్ని సమీకరించినప్పటికీ అధిక రుణాలు, నెట్వర్క్ అంతరాలతో సతమతమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా భారీ స్థాయి పెట్టుబడి ఎలా ఆకర్షిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కొత్త మూలధనం అందకపోతే ప్రత్యర్థులతో పోలిస్తే వొడాఫోన్ ఐడియా కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉన్నాయి. బకాయిలు తీర్చడం మాత్రమే కాకుండా వృద్ధికి నిధులు సమకూర్చడం అనేదే అసలు పెద్ద సమస్యగా మిగిలిపోయింది. అన్నింటికన్నా ముఖ్యంగా సంక్షోభంలో ఉన్న టెలికాం ఆపరేటర్కు రూ.50,000 కోట్లు ఎవరు రాస్తున్నారు?
ఆయన రంగంలోకి దిగుతారా?
కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాను ఆదుకోవడానికి సజ్జన్ జిందాల్ రంగంలోకి దిగుతారని చర్చ నడుస్తోంది. ఆయనకు చెందిన జేఎస్డబ్ల్యూ గ్రూప్ మౌలిక సదుపాయాలు, టెలికాం సంబంధిత రంగాలలో విస్తరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ను స్థిరీకరించడానికి ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రయత్నంలో భాగంగా.. జిందాల్ నేతృత్వంలోని గ్రూపును పరిశీలిస్తున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
2700 Crore Bank Fraud: రూ.2,700 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడు అరెస్టు..ఆర్థిక మోసగాడ్ని భారత్కు అప్పగించిన యూఏఈ!
Hyderabad, Telangana:2700 Crore Bank Fraud Case: సుమారు రూ.2,700 కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేసిన కేసులో ఇప్పుడు పురోగతి వచ్చింది. కోల్కతాకు చెందిన శ్రీ గణేష్ జ్యువెలరీ హౌస్ లిమిటెడ్ ప్రమోటర్ కమలేష్ పరేఖ్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసింది. 2016లో కోల్కతాలోని సీబీఐ బ్యాంకింగ్ సెక్యూరిటీస్ అండ్ ఫ్రాడ్ బ్రాంచ్ నమోదు చేసిన కేసు ప్రకారం.. ఆ కంపెనీతో పాటు దాని అనుబంధ సంస్థలు అనేక మార్గాల ద్వారా 25 బ్యాంకుల కన్సార్టియం నుంచి దాదాపుగా రూ.2,672 కోట్లు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
2022 డిసెంబర్ 31న ప్రమోటర్ కమలేషన్ పరేఖ్పై అధికారికంగా సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, దర్యాప్తు మొదలైనప్పటి నుంచి అతను పరారీలో ఉండగా.. ఇప్పుడు చాలా ఏళ్లుగా అధికారులు కళ్లుగప్పి తిరుగుతున్నాడు. 2024లో ఇంటర్పోల్ ద్వారా అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయగా.. సభ్య దేశాలలోని చట్ట అమలు సంస్థలకు అతన్ని కావలసిన పరారీలో ఉన్న వ్యక్తిగా గుర్తించారు. ఆ తర్వాత యూఏఈ అధికారులు అతనిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అతనిపై నమోదైన ఆరోపణలను ఎదుర్కొనేందుకు భారతదేశానికి అప్పగించారు.
కమలేష్ పరేఖ్ను భారత్ అప్పగించగా.. అతను స్వదేశానికి వచ్చిన తర్వాత ట్రాన్సిట్ రిమాండ్ కోసం పరేఖ్ను ఈరోజు ఢిల్లీలోని ఒక కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. ఢిల్లీ కోర్టు విచారణలు పూర్తయిన తర్వాత, అతన్ని కోల్కతాకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడ అసలు కేసుపై అధికార పరిధి ఉన్న సంబంధిత కోర్టు ముందు హాజరుపరుస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Janasena Rajya Sabha: జనసేన నుంచి రాజ్యసభ బరిలో టాలీవుడ్ బడా నిర్మాత..పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Chinnakakani, Andhra Pradesh:Janasena Rajya Sabha Candidate: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానురాను మరింత ఆసక్తిగా మారుతున్నాయి. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు పన్నాగాలు పన్నుతున్నారు. అటు కూటమిలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో పాటు ఇటు వైసీపీలోనూ ప్లానింగ్స్ మొదలెడుతున్నారు. ఈ క్రమంలో రాజ్యసభకు నిపుణులను పంపే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
రానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో చెరో సీటు అనే ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి రాజ్యసభ స్థానాల కోసం జనసేన నుంచి రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారిలో ఎవరికి సీటు ఇస్తారనే విషయంపై ఇప్పుడు సందిగ్ధం నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మదిలో ఎవరు ఉన్నారనే విషయంపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
పార్లమెంట్లోని రాజ్యసభలో జనసేన తొలిసారి అడుగుపెట్టబోతోంది. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి లోక్సభకు ఇద్దరు నాయకులు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజ్యసభలో తొలి అడుగు పెట్టేందుకు జనసేన సమీకరణాలను మొదలుపెడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో రెండు టీడీపీకి ఉండగా.. మిగిలిన రెండింటిని జనసేన, బీజేపీ పంచుకోనున్నాయి.
రాజ్యసభకు ఇప్పుటికే ఎంపీగా ఉన్న సానా సతీష్ ఎంపికను మరోసారి పునరుద్ధరిస్తూ ఖరారు చేయగా.. ఇప్పుడు మరోస్థానంలో ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి తమిళనాడు లీడర్ అన్నామలై లేదా మందకృష్ణ మాదిగను ఆ స్థానంలో పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే జనసేన పార్టీ విషయానికొస్తే.. రాజ్యసభ స్థానానికి గానూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అలాగే టాలీవుడ్ నుంచి మరో స్టార్ ప్రొడ్యూసర్ పేరు కూడా జనసేనాని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను నిర్మిస్తున్న ఓ ప్రముఖ నిర్మాతను జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజాలేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.
Also Read: Trump Nobel Prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు నోబెల్ బహుమతి?! 287 మందిలో ఒక్కడిగా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Education: సింగపూర్కి ఏపీ టీచర్స్.. విద్యా ప్రమాణాల్లో విప్లవాత్మక మార్పులు!
Hyderabad, Telangana:AP Government Latest News: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచే లక్ష్యంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఊహించని మార్పులకు శ్రీకారం చుట్టింది.. ఇందులో భాగంగా.. ఏపీ రాష్ట్రంలోని ఉత్తమ టీచర్లకు అద్భుతమైన విదేశీ విద్యా విధానాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా నేరుగా ప్రభుత్వం ఎంపిక చేసిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల బృందం త్వరలో సింగపూర్ పర్యటనకు వెళ్లడానికి సిద్ధమైంది.. ఈ ప్రతిష్టాత్మక పర్యటన ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరగబోతోందని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థను కలిగి సింగపూర్లోని అమలవుతున్న వినూత్న బోధనా పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విద్యార్థుల అభ్యసన శైలిపై ఈ ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయబోతున్నట్లు తెలుస్తోంది..
ఈ టీచర్స్ పర్యటనలో భాగంగా.. ఎంపికైన ఉపాధ్యాయులు సింగపూర్లోని ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించబోతున్నట్లు తెలుస్తోంది. తరగతి గదుల్లో డిజిటల్ బోధనను ఏ విధంగా అమలు చేస్తున్నారు? అనే అంశాలతో పాటు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ఎటువంటి ప్రత్యేకమైన వ్యూహాలను అనుసరిస్తున్నారు? వంటి అంశాలను ఈ టీచర్స్ ప్రత్యక్షంగా పరిశీలించబోతున్నట్లు సంచారం. అంతేకాకుండా అక్కడ నేర్చుకున్న ఉత్తమ పద్ధతులను.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలా అందించాలనే దానిపై వారు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయ్యబోతున్నట్లు కూడా తెలుస్తోంది..
అంతేకాకుండా సింగపూర్ పర్యటన మాత్రమే కాకుండా.. విద్యారంగంలో అగ్రగామిగా ఉన్న ఫిన్లాండ్ దేశానికి కూడా మిగిలిన ఉత్తమ టీచర్స్ను రాష్ట్ర ప్రభుత్వం పంపేందుకు ప్రత్యేకమైన కసరత్తు కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా సిద్ధం చేయడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Huawei Nova 15 Max: ఫోన్ కాదు పవర్ హౌస్.. హువావే నోవా 15 మ్యాక్స్ స్పెసిఫికేషన్లు ఇవే..
Hyderabad, Telangana:Huawei Nova 15 Max Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ హువావే (Huawei) మార్కెట్లోకి కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇది నోవా 15 మ్యాక్స్ (Huawei Nova 15 Max) పేరుతో విడుదల కాబోతోంది. ముఖ్యంగా దీనిని కంపెనీ మే 7న జరిగే ప్రత్యేకమైన లాంచ్ ఈవెంట్లో భాగంగా థాయిలాండ్లోని బ్యాంకాక్లో లాంచ్ చేయబోతోంది. గ్లోబల్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ అత్యంత శక్తివంతమైన 8,500 mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
ప్రస్తుత స్మార్ట్ఫోన్ మార్కెట్లో కేవలం కొన్ని బ్రాండ్లు మాత్రమే.. 7,500 mAh బ్యాటరీతో స్మార్ట్ఫోన్స్ను విడుదల చేశాయి. అయితే, త్వరలోనే విడుదల కాబోయే నోవా 15 మ్యాక్స్ (Huawei Nova 15 Max) స్మార్ట్ఫోన్ 8,500 mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ను అందిస్తుంది. దీంతో పాటు ఇందులో కంపెనీ 40W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది.
ఈ హువావే నోవా 15 మ్యాక్స్ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ స్మార్ట్ఫోన్ను ఫోటోగ్రఫీ ప్రేమికులను ఆకట్టుకునేలా రూపొందించిన్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో చాలా ప్రత్యేకమైన RYYB సెన్సార్స్ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఈ సెన్సార్ సాధారణ సెన్సార్ల కంటే 40 శాతం ఎక్కువ కాంతిని అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా చికటిలో కూడా అద్భుతమైన ఫోటోలను కూడా అందిస్తుంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
ఇక ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళితే... ఇది గత మొబైల్స్ మోడల్స్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ఫోన్ స్కై బ్లూ, అబ్సిడియన్ బ్లాక్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇందులో కంపెనీ 6.8 అంగుళాల డిస్ప్లే కూడా అందిస్తోంది. దీంతో పాటు కిరిన్ 8000 చిప్సెట్ ప్రాసెసర్ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని డిజైన్ యూత్ సెంట్రిక్గా ఉంటుంది. మే 7న జరిగే ఈ గ్లోబల్ ఈవెంట్లో భాగంగా ఈ స్మార్ట్ఫోన్ విడుదల కాబోతోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ravindra Jadeja Kuldeep Yadav: బ్యాట్తో కుల్దీప్ ముఖంపై కొట్టబోయిన జడేజా..ఐపీఎల్ మ్యాచ్లో ఊహించని సంఘటన..
Hyderabad, Telangana:Ravindra Jadeja Kuldeep Yadav Interaction: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర సంఘటన జరిగింది. రాజస్థాన్ టీమ్కు చెందిన రవీంద్ర జడేజా, ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మధ్య ఈ ఘటన జరిగింది. అయితే వీరిద్దరూ కొట్టుకునే స్థాయికి వెళ్లారని చూపరులకు కనిపిస్తుంది. కానీ, అక్కడ జరిగింది అందుకు పూర్తి విరుద్ధం.
రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ధ్రువ్ జూరెల్ అవుటైన తర్వాత 12వ ఓవర్లో జడేజా బ్యాటింగ్కు వచ్చాడు. అదే సమయంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకోవడం కనిపించింది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. కుల్దీప్ తన వైపు రావడం గమనించిన జడేజా, తన టీమ్ఇండియా పార్ట్నర్ను భయపెట్టాలనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా బ్యాట్ ఝుళిపించాడు.
అయితే, కుల్దీప్ ఏమాత్రం చలించకుండా, జడేజా భుజాలపై చేతులు వేసి తేలికగా నెట్టాడు. జడేజా తన బ్యాట్ను అంపైర్తో తనిఖీ చేయించుకోబోతుండగా, కుల్దీప్ అతడిని పట్టుకుని మళ్లీ నెట్టాడు. వారి మధ్య జరిగిన ఈ సరదా వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
OMG 😱 War between Kuldeep Yadav & Ravindra Jadeja 😭#DCvsRR #RRvsDC
Kyle Jamieson #Peddi
Riyan Paragpic.twitter.com/ZZNhckDYMN— Rolex x👑 (@Tfg85743663) May 1, 2026
ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుసగా మూడు ఓటముల పరంపరకు ముగింపు పలికి, ఐపీఎల్లో తమ అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ను పూర్తి చేసింది. జైపూర్లో 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్న క్రమంలో, ఓపెనర్లు కేఎల్ రాహుల్, పతుమ్ నిస్సంకల అర్ధశతకాల చెలరేగిన వేళ రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఢిల్లీ ఘనవిజయం సాధించింది.
పతుమ్ నిస్సంక 33 బంతుల్లో 62 పరుగులతో ఛేజింగ్లో రాజస్థాన్ జట్టుపై అద్భుతమైన ఆరంభాన్ని అందించగా, కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 75 పరుగులు చేసి ఢిల్లీని విజయానికి చేరువ చేశాడు. నిస్సంకతో కలిసి 110 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన సమయంలో రాహుల్ అతనికి సహకరించినప్పటికీ, నిస్సంక అవుటైన తర్వాత డీసీ ఇన్నింగ్స్కు ఎంతో అవసరమైన ఊపునిచ్చాడు. చివరికి, నితీష్ రాణా (33), అశుతోష్ శర్మ (25*), ట్రిస్టన్ స్టబ్స్ (18*) అందించిన విలువైన ఇన్నింగ్స్తో రాణించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ 50 బంతుల్లో 90 పరుగులు చేసి ఫామ్లోకి తిరిగి వచ్చాడు. ఇది ఈ సీజన్లో అతని మొదటి యాభైకి పైగా స్కోరు. అదే సమయంలో, డోనోవన్ ఫెరీరా 14 బంతుల్లో 47 నాటౌట్ పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో, బ్యాటింగ్ ఎంచుకున్న RR జట్టు 225/6 అనే బలమైన స్కోరును నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో 'వేపింగ్' చేస్తూ పట్టుబడి జరిమానాకు గురైన పరాగ్, తొలి రెండు ఓవర్లలోనే యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) అవుటైన తర్వాత, ధృవ్ జురెల్ (42)తో కలిసి ఇన్నింగ్స్ను పటిష్టం చేశాడు.
Also Read: Trump Nobel Prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు నోబెల్ బహుమతి?! 287 మందిలో ఒక్కడిగా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Xiaomi Civi 6: 50MP పెరిస్కోప్ కెమెరా, 1.5K డిస్ప్లేతో షావోమి సివి 6 సిరీస్.. మార్కెట్లోకి ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Xiaomi Civi 6 And Civi 6 Pro Leaks: షావోమి బ్రాండ్కి సంబంధించిన స్మార్ట్ఫోన్స్కి మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్తో అత్యంత శక్తివంతమైన ఫీచర్స్తో విడుదల చేయడం వల్ల చాలా మంది వీటికి ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. షావోమి తన సివి (Civi) సిరీస్లో భాగంగా కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ త్వరలోనే షావోమి సివి 6 (Xiaomi Civi 6)తో పాటు షావోమి సివి 6 ప్రో (Xiaomi Civi 6 Pro) మోడళ్లను మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ రెండు స్మార్ట్ఫోన్స్ అధునాతన సాంకేతికతతో పాటు అద్భుతమైన డిస్ల్పేతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన వివరాల్లోకి వెళితే.. షావోమి సివి 6 స్మార్ట్ఫోన్ 6.59 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 1.5K రిజల్యూషన్తో అందుబాటులోకి రాబోతోంది. ఇది వినియోగదారులకు స్పష్టమైన విజువల్స్ను అందించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా హార్డ్వేర్ పరంగా.. ఇందులో కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్సెట్ ప్రాసెసర్ను అందించిన్నట్లు తెలుస్తోంది.
ఈ సిరీస్లోని ప్రో వేరియంట్ (Xiaomi Civi 6 Pro) మరెన్నో అద్భుతమైన ఫీచర్స్ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ 6.83 అంగుళాల 1.5K డిస్ప్లేతో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందులో కూడా అదే శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్ను అందించేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. అలాగే కెమెరా పరంగా చాలా అద్భుతమైన ఫీచర్స్ను కూడా కలిగి ఉండబోతోంది.. సివి 6 మోడల్లో కంపెనీ ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా అందించడం విశేషం. ఇది 5x జూమ్ సామర్థ్యంతో అందుబాటులోకి రాబోతోంది. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల కొత్త ఫీచర్స్ లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
షావోమి ఈ సివి సిరీస్ను మొదటి చైనా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లు వివో (Vivo), సామ్సంగ్ (Samsung)తో పాటు వన్ప్లస్ (OnePlus) బ్రాండ్ బడ్జెట్ స్మార్ట్ఫోన్స్ దృష్టిలో పెట్టుకుని.. తయారు చేసిన్నట్లు తెలుస్తోంది..తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లను అందించే రేసులో షావోమి ముందు వరుసలో నిలవాలని చూస్తోంది. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫీచర్స్ కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vivo S50t 5G లాంచ్.. 6500mAh బ్యాటరీ, కెమెరాలతో అదరగొడుతున్న కొత్త ఫోన్!
Hyderabad, Telangana:Vivo S50t 5G Launched: స్మార్ట్ఫోన్ మార్కెట్లో తమదైన ముద్ర వేసుకున్న ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ వీవో తాజాగా కొత్తగా ఎస్ సిరీస్ నుంచి అద్భుతమైన మొబైల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ Vivo S50t 5G పేరుతో లాంచ్ చేసింది. ఇది ప్రీమియం కెమెరాతో పాటు భారీ బ్యాటరీతో కస్టమర్స్ను ఆకట్టుకునేలా కంపెనీ రూపొందించింది. అలాగే ఇందులో వీవో ఎన్నో రకాల కొత్త ఫీచర్స్ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్ మోడల్కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Vivo S50t 5G స్మార్ట్ఫోన్ ఫీచర్స్కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది 6.59 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 1.5K రిజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇందులో టెస్ట్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 (Snapdragon 8s Gen 3) చిప్సెట్ ప్రాసెసర్తో లాంచ్ చేయబోతోంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై రన్ అవుతుంది. దీంతో పాటు మల్టీ టాస్కింగ్ చేసేందుకు ఈ మొబైల్ చాలా అద్భుతంగా పని చేస్తుంది.
ఈ స్మార్ట్ఫోన్ వెనక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఫ్రంట్ భాగంలో ఈ స్మార్ట్ఫోన్ అద్భుతమైన కెమెరా సెటప్ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 మెగాపిక్సెల్ పవర్ఫుల్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇది హై-క్వాలిటీ ఫొటోలతో పాటు అద్భుతమైన వీడియోను కూడా రికార్డ్ చేయగలుగుతుంది.
ఈ స్మార్ట్ఫోర్ ప్రధాన ఆకర్శణ ఏంటంటే దాని బ్యాటరీ.. ఇందులో కంపెనీ 6500mAh శక్తివంతమైన బ్యాటరీని అందిస్తోంది. అంతేకాకుండా దీనికి తోడుగా 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. అలాగే తక్కువ సమయంలోనే ఫోన్ ఛార్జింగ్ అయ్యేందుకు అద్భుతమైన టెక్నాలజీని అందిస్తోంది. దీంతో పాటు ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్ప్రింట్ స్కానర్ వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా అందుబాటులో ఉంచిన్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ చైనా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్స్లో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ.48,500 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే రెండవ 16GB RAM + 512GB మోడల్ ధర రూ. 50,000తో లభిస్తోంది. అయితే, ఇప్పటికే ఇది చైనాలో వివో అధికారక వెబ్సైట్లో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, భారత్లో కూడా త్వరలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sun Transit 2026: రోహిణి నక్షత్రంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులకు ఆర్థికంగా తిరుగులేని అదృష్టం!
Hyderabad, Telangana:Sun Transit In Rohini Nakshatra 2026: మే నెలలో అత్యంత ప్రధాన గ్రహంగా పరిగణించే సూర్యుడు కూడా రాశి సంచారం చేయబోతోంది. ఈ సమయంలో సూర్యుడు నక్షత్రం సంచారం చేయబోతోంది. అయితే, చాలా నెలల తర్వాత నక్షత్ర సంచారం చేయడం విశేషం.. సూర్యుడు చంద్రునికి అత్యంత ప్రియమైన రోహిణి నక్షత్రంలోకి సంచారం చేసేందుకు సిద్ధమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రోహిణి నక్షత్రం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది. ముఖ్యంగా ప్రకృతిలో అనేక మార్పులు రాబోతున్నాయి. అయితే, కొన్ని రాశులవారికి మాత్రం ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు కూడా లభించబోతున్నాయి. సూర్యుడి సంచారంతో ఏయే రాశులవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిణి నక్షత్రం అన్ని నక్షత్రాల్లోకి నాలుగవ నక్షత్రంగా చెప్పకుంటారు. ఈ నక్షత్రానికి చంద్రుడితో పాటు బ్రహ్మదేవుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఈ నక్షత్ర చిహ్నం ఎద్దుల బండిగా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇది పెరుగుదలతో పాటు పురోగతి, బరువు మోసే సామర్థ్యానికి సూచికగా భావిస్తారు. ఈ రోహిణి నక్షత్రాన్ని ఆనందంతో పాటు విలాసం, పరిశ్రమ, సంపదకు సూచికగా భావిస్తారు. అయితే, ఈ సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
సింహరాశి:
రోహిణి నక్షత్రంలోకి అన్ని గ్రహాలకు అధిపతిగా వ్యవహరించే సూర్యుడు సంచారం చేయడంతో ఈ సొంత రాశివారికి వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అద్భుతమైన ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఎన్నో రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోయే ఛాన్స్లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభ రాశి:
రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేయడంతో వృషభ రాశివారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా మారుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. అలాగే డబ్బులు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సూర్యుడి ప్రభావంతో దీర్ఘకాలిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా పొదుపు కూడా గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
ధనుస్సు రాశి:
సూర్యుని ప్రభావంతో ధనుస్సు రాశివారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. నిలిచిపోయిన పాత డబ్బులు కూడా తిరిగిపొందుతారు. అలాగే ఈ సమయంలో అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. భవిష్యత్కు తగ్గ డబ్బులు కూడా సంపాదించే ఛాన్స్లు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఆర్థిక ప్రణాళికల్లో కూడా ఊహించని సక్సెస్ సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees: 100 రోజుల్లో అన్నింటికి పరిష్కారం.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
Hyderabad, Telangana:Telangana Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు టీచర్లు, రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు సంబంధించిన అన్నీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. వంద రోజుల్లోపే సమస్యలు, డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. వేతన సవరణ సంఘంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు నెరవేరుస్తామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Pending Traffic Challan: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం
వంద రోజులు
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాలు తమ 45 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారం, ఆర్థికభారంపై ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘ చర్చ జరిగింది. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రితో చర్చించి 100 రోజుల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతినెల ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు మాట ఇచ్చారు. సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండడంతో ఉద్యమ కార్యచరణ వాయిదా వేసుకోవాలని ఉద్యోగులకు డిప్యూటీ సీఎం సూచించారు.
Also Read: Govt Employees: డిప్యూటీ సీఎంతో భేటీ! తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నేడే భారీ శుభవార్త?
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తాజా సమావేశం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంటింజెంట్ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారం చేస్తామని.. వాటితో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం, సత్వరం పరిష్కరించాల్సిన సమస్యలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా చర్చించారు.
Also Read: Sanath Nagar TIMS: హైదరాబాద్లో మరో కొత్త నిమ్స్ తరహా ఆస్పత్రి.. ఎక్కడో తెలుసా?
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని.. అయితే అన్ని సమస్యలను ఏకకాలంలో కాకుండా దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు తెలిపారు. పెన్షనర్ల సమస్యలను వంద రోజులలోనే పరిష్కరిస్తామని ఇప్పటికే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని.. ఉద్యోగుల సమస్యలను కూడా ప్రాధాన్య క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సానుకూలం
ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులపై త్వరలోనే సీఎం తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పీఆర్సీ నివేదికను తెప్పించుకొని అమలు చేస్తామని ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యచరణను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా ఉద్యోగుల సమస్యలపై ప్రజా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా త్వరలోనే ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమై తీపి కబురు చెప్తానని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
కార్యాచరణపై త్వరలో నిర్ణయం
ఈ సమావేశంపై ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు, కాంటిజెంట్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈనెల 5వ తేదీన చేపట్టనున్న కార్యాచరణపై ఉద్యోగ సంఘాల జేఏసీతోపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. సమావేశానికి ఉద్యోగ సంఘాల జేఏసీ భాగస్వామ్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రామకృష్ణ, రాములు, బాణాల రాం రెడ్డి, పెంటయ్య, రమేశ్ పాక, డాక్టర్ నిర్మల, ఎండీ హబీబ్ మియా, మహిపాల్ రెడ్డి, దర్శన్ గౌడ్, భిక్షం, ఉపేందర్ రావు, రాబర్ట్ బ్రూస్, డాక్టర్ సైదులు, బుచ్చయ్య, కుమార స్వామి, హబీబ్ మియా, వెంకటేశం, వివేక్, మమత, క్రాంతి కుమార్, రవి, నరేందర్, స్వామి, దేవిక, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
