नूंह जिले में लगातार बारिश से जनजीवन प्रभावित, कब्रिस्तान और घरों में भरा पानी
Nuh Rural, Haryana:नूंह जिले में पिछले कई दिनों से हो रही रुक-रुक कर बारिश से ग्रामीण अंचल में जनजीवन अस्त-व्यस्त हो गया है। बारिश के कारण कब्रिस्तान और घरों में पानी भर गया है जिससे गांव की सड़कें भी पानी से लबालब हो गई हैं। नूंह विधायक ने जब इस स्थिति के बारे में सुना तो वे सुड़का गांव पहुंचे। वहां उन्होंने देखा कि कब्रिस्तान भी बारिश के पानी से भर गया है। इसके अलावा गांव के घरों में भी पानी भर गया है जिससे लोगों की समस्याएं और बढ़ गई हैं।
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
మన విజయం వెనుక ఉన్న టీచర్స్కి గురు పౌర్ణమి శుభాకాంక్షలు!
Hyderabad, Telangana:Happy Guru Purnima Wishes: మన ప్రతి అడుగులోనూ కొండంత ధైర్యాన్ని నింపి.. అద్భుతమైన మార్గంలో నడిపించే మహోన్నత వ్యక్తులు గురువులు.. మనం ఈరోజు సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉన్నామంటే దానికి వెనుక వారి మార్గదర్శకత్వం.. కాబట్టి గురువుల త్యాగాన్ని, ప్రేమను స్మరించుకోవడానికే ప్రతీ సంవత్సరం గురు పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటాం. మీరు కూడా ఇలా మీ గురువులకు విషెష్ పంపండి.టాప్ 10 గురు పౌర్ణమి శుభాకాంక్షలు..
Hyderabad, Telangana:Happy Guru Purnima Wishes: ఈ గురు పౌర్ణమిని.. వ్యాస పౌర్ణమిగా కూడా పిలుస్తూ ఉంటారు. చతుర్వేదాలను విడదీసి లోకానికి అందించిన వేద వ్యాస మహర్షి జన్మించిన రోజు ఇది.. అంతేకాకుండా, ఆయన మహాభారతం, 18 పురాణాలతో పాటు బ్రహ్మసూత్రాలను రచించారు. అందుకే లోకంలో ఉన్న గురువులందరికీ వ్యాస భగవానుడే మొదటి గురువు అని భావిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆయన జన్మదినాన్ని గుర్తుంచుకుని.. మీ గురువులకు కూడా ఇలా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలను పంపండి..
శుభాకాంక్షలు..
అజ్ఞానమనే చీకటిని తరిమే వెలుగు దీపం గురువు..
అద్భుతమైన జ్ఞానపు అమృతాన్ని పంచే దివ్య కల్పతరువు గురువు..
మీ అడుగుజాడల్లో నడవడం మా పూర్వ జన్మ సృకృతం..
మీరు మాకు ఇంతటి జ్ఞానాన్ని అందించడం మహాభాగ్యం..
మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు..
అక్షరానికి ఊపిరి పోసి జీవితాన్ని మలచిన శిల్పి మీరు..
అంధకారంలో వెలుగు చూపే జ్ఞాన భాస్కరుడు మీరు..
మా జీవిత శిల్పానికి రూపాన్ని ఇచ్చిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు..
గురు పౌర్ణమి శుభాకాంక్షలు..
సముద్రమంతా జ్ఞానాన్ని సులభంగా అందించే కరుణాకరులు..
నా కంటి పాపల నన్ను సరిదిద్ది.. నిలిపిన మార్గదర్శకాలు..
మీ పాదపద్మాలకు శతకోటి వందనాలు..
మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు..
వ్యాసభగవానుని దివ్యకరుణ మీ రూపంలో మాకు లభించింది..
మా మనసులోని అజ్ఞానం అనే తపస్సు తొలగిపోయి..
మా బ్రతుకులకు వెలుగు దిశ చూపించిన గురుదేవతలకు మా ప్రత్యేకమైన శుభాకాంక్షలు..
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు..
ఎండల్లో నీడనిచ్చే చెట్టులా.. కష్టాల్లో తోడుండే నీడలా..
విజయాల తీరానికి చేర్చే.. నావలా నిలిచిన మా గురువులందరికీ..
ఈ పవిత్ర పర్వదినాన ప్రత్యేకమైన గురు పౌర్ణమి శుభాకాంక్షలు..
తల్లిదండ్రులు జన్మనిస్తే.. రూపునిచ్చారు మీరు..
లోక జ్ఞానాన్ని నేర్పి.. ధైర్యాన్ని నింపారు మీరు..
మీ రుణం తీర్చుకోలేనిది.. మీ ప్రేమానురాగాలు వెలకట్టలేనివి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు..
కోటి వెన్నెలల కాంతి ఈ గురుపౌర్ణమి శోభ..
మా జీవితాలలో నిండిన జ్ఞానమే మీ దివ్య కృప..
శాశ్వతమైన మార్గదర్శనాన్ని అందించే నా గురువుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..
అలాగే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎదగడానికి కృషి చేసిన ప్రతి ఒక్క గురువుకి.. గురు పౌర్ణమి శుభాకాంక్షలు..
Also Read: అజ్ఞానాన్ని పోగొట్టే.. గురువుల కోసం అద్భుతమైన గురుపౌర్ణమి శుభాకాంక్షలు!
నా విజ్ఞాన వృక్షానికి మీరు పోసిన నీరు అక్షరం..
నా భవిష్యత్ సౌధానికి మీ దీవెనలే మూలాధారం..
ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటూ..
గురుపౌర్ణమి శుభకాంక్షలు..
కంటికి కనిపించే దైవం మీరు..
సంస్కారాలు నేర్పిన ప్రత్యక్ష గురువు మీరు..
మీ సేవలో తరించే భాగ్యాన్ని ఎల్లవేళలా ప్రసాదించండి..
గురుపౌర్ణమి పర్వదిన శుభకాంక్షలు..
జ్ఞాన దీపమై వెలిగిస్తూ.. అజ్ఞానాన్ని తరిమేస్తూ..
శిష్యుల ప్రగతియే తన విజయంగా భావించే ప్రతి మహనీయునికి..
పాదాభివందనాలు తెలుపుకుంటూ..
గురుపౌర్ణమి శుభకాంక్షలు..
Also Read: అజ్ఞానాన్ని పోగొట్టే.. గురువుల కోసం అద్భుతమైన గురుపౌర్ణమి శుభాకాంక్షలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR Press Meet: హైడ్రా రేవంత్ రెడ్డికి వేటకుక్కలా మారింది: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
New Delhi, Delhi:KTR vs Revanth Reddy: ప్రజలు ఇళ్లు కూలుస్తూ విధ్వంసం సృష్టిస్తున్న హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఈ సందర్భంగా హైడ్రాతోపాటు రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా రేవంత్ రెడ్డికి వేట కుక్కలా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక అధికారి 63 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు చరిత్రలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. హైడ్రాను అడ్డు పెట్టుకుని బిల్డర్ల దగ్గర ఆర్ఆర్ టాక్స్ (రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పన్ను) వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? నిలదీశారు. నిజంగానే హైడ్రా మంచి పనులు చేస్తుంటే రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు, కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌసులు ఎందుకు కూలగొట్టడం లేదు? మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.
CM Revanth protected BJP Union Minister's POCSO Accused son for 9Days,
BJP did not take any action on CM Revanth giving AMRUT Contracts to own brother in law,
No Enquiry by BJP on Singareni Scam between Cabinet Ministers,
Telangana knows how BJP + Congress are together against… pic.twitter.com/wW830ozBix
— Dr.Krishank (@Krishank_BRS) July 28, 2026
కేంద్ర మంత్రికి వినతులు
ఢిల్లీ పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ బృందం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిసింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ పార్టీ వినతిపత్రం అందించింది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ ఉంటుంది. అందుకే హైడ్రాను కూడా రేవంత్ వెనకేసుకొస్తున్నాడు. హైడ్రాకు దమ్ముంటే ఎఫ్టీఎల్లో ఉన్న మంత్రుల ఇళ్లు కూలగొట్టాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి హైడ్రాను బ్లాక్మెయిల్ కోసం వాడుకుంటున్నారని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా హైడ్రాను ఎత్తివేసి బంగళాఖాతంలో పడేస్తామని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు.
'హైడ్రా తొమ్మిది తలల విషసర్పంలా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. పేదల ఇళ్లపైనే హైడ్రా చర్యలు తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబాలకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 'రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా, కాంగ్రెస్ హయాంలో అది కోటి ఎకరాలకు చేరింది. భూ వ్యవహారాల్లో అవినీతి, కమీషన్ల కోసం నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారు' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు.
'హైదరాబాద్లో వేలాది ఇళ్లను కూల్చివేసి ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదు. దీంతో రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీస్తున్నారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైడ్రా అనేది రేవంత్ రెడ్డి చేతిలో బ్లాక్మెయిలింగ్.. ఎక్స్టార్షన్ సాధనంగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే హైకోర్టు సూచనలకు అనుగుణంగా హైడ్రా రద్దు చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
RK Roja: తిరుపతిలో మాజీ మంత్రి రోజా భారీ నిరసన
Tirupati, Andhra Pradesh:Former Minister RK Roja Protest In Tirupati Against DSC Watch Full Videoరాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు.. నారా లోకేశ్ రాజీనామా కోసం వైఎస్సార్సీపీ డిమాండ్
Sabbavaram, Andhra Pradesh:YSRCP Massive Protest: మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డీఎస్సీపై సీబీఐతో విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టింది. వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.
డీఎస్సీ వ్యవహారంపై తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
🚨 #NaraLokeshMustResign@naralokesh చేతగానితనంతో ఏపీలో విద్యావ్యవస్థ రెండేళ్లలో సర్వనాశనమైపోయింది
డీఎస్సీ నియామకాల్లో తమకు అనుకూలమైన జీవోని తీసుకొచ్చి.. స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు
ఈ అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఛాలెంజ్లు విసురుతున్నాడు. కానీ… pic.twitter.com/XOjmsSy63r
— YSR Congress Party (@YSRCParty) July 28, 2026
'నారా లోకేష్ కాదు.. నారా లీకేజ్' అంటూ నారా లోకేశ్పై మాజీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ వ్యవహారంలో జరిగిన పరిణామాలకు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహణలో జరిగిన ప్రతి అంశంపై న్యాయపరమైన విచారణ జరపాలని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు రోజా ప్రకటించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అనకాపల్లి జిల్లాలో..
డీఎస్సీపై వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అనకాపల్లిలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. రామచంద్ర థియేటర్ జంక్షన్ నుంచి రింగ్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తమెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేపట్టాలని.. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు.
నారా లోకేష్తో చర్చకు మేము రెడీ.. ఓపెన్ ఛాలెంజ్ విసిరిన వైయస్ఆర్సీపీ నేతలు
ప్లేస్, టైమ్, తేదీ చెప్పు నారా లోకేష్.. లేదా మమ్మల్నే చెప్పమంటావా?
మేము మాత్రమే కాదు.. డీఎస్సీ బాధితులు కూడా ఆ చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు
ఈ ఓపెన్ ఛాలెంజ్ని స్వీకరించే దమ్ము నీకుందా… pic.twitter.com/LrmO3dVvcS
— YSR Congress Party (@YSRCParty) July 28, 2026
మచిలీపట్నంలో..
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ వైఎస్సార్సీపీ నాయకులు నిర్వహించారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ మచిలీపట్నంలో లక్ష్మీ టాకీస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్న నారా లోకేష్ మంత్రి పదవికి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయగా.. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. లోకేశ్తో బహిరంగ చర్చకు మాజీ సీఎం వైఎస్ జగన్ రావాల్సిన అవసరం లేదని.. తాము చాలు అని ప్రకటించారు.
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ హీరో
Dharmavaram, Andhra Pradesh:Cine Actor Bellamkonda Srinivas Visits Tirumala Temple Along With His Wife Watch VideoTirumala: తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ మాజీ మంత్రి
Dharmavaram, Andhra Pradesh:Ambika Krishna And Indrakaran Reddy Visits Tirumala Temple Watch VideoTirumala Devotees: తిరుమలలో గాయకుడు గజల్ శ్రీనివాస్ సందడి
Dharmavaram, Andhra Pradesh:Singer Gazal Srinivas And Other VIPs Rush To Tirumala Temple Watch VideoTirumala: భార్యతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ హీరో, పలువురు ప్రముఖులు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala VIPs Darshan: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు తరలివస్తున్నారు. సాధారణ భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండగా.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్, గాయకుడు గజల్ శ్రీనివాస్, తెలంగాణ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వచ్చారు.
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన సతీమణి కావ్యా రెడ్డితోపాటు నిర్మాత మహేష్ చందుతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో మంగళవారం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అంబిక కృష్ణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబసభ్యులతో తిరుమల విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
కొనసాగుతున్న రద్దీ
తిరుమల ఆలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 27 కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న సోమవారం 80,003 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 32,918 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక ఆదాయం విషయానికి వస్తే రూ.4.59 కోట్లు రాగా.. 4.12 లక్షల లడ్డూల విక్రయాలు జరిగాయి. తిరుమలలో అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తుల సంఖ్య 2.12 లక్షలు అని టీటీడీ అధికారులు వెల్లడించారు.
అక్టోపస్ మాక్ డ్రిల్ విజయవంతం
తిరుమలలోని మాధవ నిలయంలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో అత్యవసర ప్రతిస్పందనపై మాక్ డ్రిల్ నిర్వహించారు. టీటీడీ ఈవో, ఛైర్మన్, సీవీఎస్ఓ అనుమతితో డ్రిల్ చేపట్టారు. మాధవ నిలయంలోకి ఉగ్రవాదులు చొరబడ్డట్లు భావించి అకస్మాత్తుగా డ్రిల్ చేశారు. ఆక్టోపస్, స్థానిక పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేయా.. ఫైర్, మెడికల్, ట్రాఫిక్, ఎస్పీఎఫ్ బృందాలు సమన్వయం అందించారు. డ్రిల్లో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా పాల్గొంది. యాత్రికుల భద్రత, వేగవంతమైన స్పందనపై మాక్ డ్రిల్ విజయవంతంగా జరిగిందని అధికారులు తెలిపారు.
చిరుత సంచారం
తిరుపతిలో మరోసారి చిరుతపులి సంచారం భయాందోళనకు గురి చేసింది. ఉపాధ్యాయనగర్ అటవీ ప్రాంతంలో పిట్ట గోడపై చిరుత కూర్చుని ఉండడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అరుపులు, కేకలు వేస్తూ.. టపాసులు పేల్చి చిరుతను అడవిలోకి తరిమారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Google Pixel ప్రియులకు షాక్.. భారీ ధరతో మార్కెట్లోకి Google Pixel 11 సిరీస్?
Hyderabad, Telangana:Google Pixel 11 Series Price Hike: ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ (Google) త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్న పిక్సెల్ 11 (Pixel 11) సిరీస్ స్మార్ట్ఫోన్ల విషయంలో వినియోగదారులకు కొంత నిరాశ కలిగించే వార్తగా భావించవచ్చు. రాబోయే పిక్సెల్ 11 సిరీస్ ఫోన్ల ధరలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.. స్మార్ట్ఫోన్ తయారీలో అత్యంత కీలకమైన రామ్ (RAM), ఇంటర్నల్ స్టోరేజ్ పరికరాల ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది..
గ్లోబల్ మార్కెట్లో మెమరీ కాంపొనెంట్స్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో.. గూగుల్ హార్డ్వేర్ విభాగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని కంపెనీ ఉన్నతాధికారి ఇటీవలే ఒకరు స్పష్టం చేసిన్నట్లు సమాచారం.. కేవలం గూగుల్ మాత్రమే కాకుండా.. ప్రస్తుతం దాదాపు అన్ని ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయట.. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి నూతన మోడళ్ల ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీ సూచించిన్నట్లు సమాచారం.. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న పిక్సెల్ 10 (Pixel 10) సిరీస్ ఫోన్ల ధరలపై కూడా దీని ప్రభావం పడే ఛాన్స్ ఉందని సమాచారం.
పిక్సెల్ 11 సిరీస్ మోడళ్లు, ఎక్పెక్టెడ్ ధరలు..
ఆగస్టు 12న జరగబోతున్న Made by Google ఈవెంట్లో ఈ సిరీస్ను అధికారికంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ సిరీస్లో మొత్తం నాలుగు మోడళ్లు ఉండే అవకాశం ఉంది. ఇందులోని మొదటి మోడల్ Google Pixel 11 పేరుతో అందుబాటులోకి రాబోతోంది. ఇక మిగిత మోడల్స్ Google Pixel 11 Proతో పాటు Google Pixel 11 Pro XL, Google Pixel 11 Pro Foldతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
యూరోపియన్ మార్కెట్ అంచనాల ప్రకారం.. పిక్సెల్ 11 ప్రారంభ ధర 999 యూరోలు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1,09,200) ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పిక్సెల్ 11 ప్రో ధర 1,199 యూరోలు (సుమారు రూ.1,31,000)తో పాటు పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ ధర 1,399 యూరోలు (సుమారు రూ.1,53,000) వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం..
పిక్సెల్ గ్లో (Pixel Glow)..
ధరలు పెరిగినప్పటికీ.. పిక్సెల్ 11 సిరీస్లో ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను గూగుల్ పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.. ఇందులో ప్రత్యేకంగా Pixel Glow అనే విజువల్ ఎలిమెంట్ను ప్రవేశపెడుతున్నారు. స్మార్ట్ఫోన్కు సంబంధించి వెనక భాగంలో లైట్ స్ట్రిప్కు బదులుగా.. కెమెరా బార్తో కూడిన గుండ్రటి భాగంలో ఫ్లాష్ స్థానంలో ఈ వినూత్న లైటింగ్ ఇంటిగ్రేట్ను అందుబాటులో ఉంచబోతోంది.. గూగుల్ స్టోర్ హోమ్పేజీలో విడుదల చేసిన ప్రోమో క్లిప్లో గోల్డెన్ కలర్ పిక్సెల్ ఫోన్ ఈ పిక్సెల్ గ్లో లైటింగ్తో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Add Zee News as a Preferred Source
Redmi Note 17 సిరీస్ గ్రాండ్ ఎంట్రీ.. ధర, అద్భుతమైన ఫీచర్ల వివరాలు లీక్!
Hyderabad, Telangana:Redmi Note 17 Series: ప్రసిద్ధ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్మీ, త్వరలోనే తన మోస్ట్ ఎవైటెడ్ రెడ్మీ నోట్ 17 (Redmi Note 17) సిరీస్ను భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసేందుకు సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇటీవల చైనా మార్కెట్లో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన ఈ మోడళ్లు, త్వరలోనే గ్లోబల్ మార్కెట్తో పాటు భారతదేశంలోనూ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, లాంచ్కు ముందే ఈ సిరీస్ ధరలు, వేరియంట్ల వివరాలు సోషల్ మీడియాలో భారీగా హల్చల్ చేస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గ్లోబల్ మార్కెట్లో 4 వేరియంట్లు..
లీక్ అయిన వివరాల ప్రకారం.. రెడ్మీ నోట్ 17 సిరీస్లో గ్లోబల్గా మొత్తం నాలుగు మోడళ్లను పరిచయం చేయబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇందులోని మొదటి వేరియంట్ Redmi Note 17తో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ను కలిగి ఉంటుంది. భారత మార్కెట్లో ధర సుమారు దాదాపు రూ.27,000 ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే 6GB ర్యామ్, 256GB మోడల్ ధర రూ.33,000గా ఉండే అవకాశం ఉంది. ఇది బ్లాక్, బ్లూతో పాటు పర్పుల్ రంగుల్లో అందుబాటులోకి రాబోతోంది..
ఇక మరో మోడల్ Redmi Note 17 5G స్మార్ట్ఫోన్.. ఇది 6GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర దాదాపు రూ.44,000 వరకు ఉండవచ్చని సమాచారం. మూడవ మోడల్ Redmi Note 17 Pro 5G స్మార్ట్ఫోన్ 6GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.55,000 గా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చివరి వేరియంట్ Redmi Note 17 Pro Max 5G స్మార్ట్ఫోన్ టాప్ ఎండ్ 8GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.65,000కే లభించే అవకాశం ఉంది.
భారత్లో ధర ఎంత ఉండవచ్చు?
ప్రముఖ టెక్ టిప్స్టర్ల అంచనా ప్రకారం.. భారత మార్కెట్లో రెడ్మీ నోట్ 17 స్మార్ట్ఫోన్ ధర రూ. 30,000ల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీని బేస్ మోడల్ 6GB ర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారతీయ కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా డిజైన్, స్పెసిఫికేషన్లలో కొన్ని స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం.
లీక్ల వివరాల ప్రకారం.. ఈ కొత్త నోట్ సిరీస్లో దాదాపు 8,000mAh లేదా 9,000mAh వరకు భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే ఛాన్స్ ఉంది. దాదాపు 7 అంగుళాల పెద్ద డిస్ప్లేను కూడా కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ ఇది సూపర్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. స్మార్ట్ఫోన్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ నోట్ 17 సిరీస్ అధికారిక లాంచ్ తేదీ మరియు తుది వివరాలపై కంపెనీ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
10,000mAh భారీ బ్యాటరీతో OPPO సరికొత్త సంచలనం.. Oppo A7 Pro Max పూర్తి వివరాలు!
Hyderabad, Telangana:OPPO A7 Pro Max: స్మార్ట్ఫోన్ వినియోగదారులకు పవర్ బ్యాంక్లతో పనిలేకుండా చేసేందుకు ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం Oppo భారీ స్కెచ్ వేసిందని చెప్పొచ్చు. అద్బుతమైన టెక్నాలజీతో, వినియోగదారుల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని Oppo A7 Pro Max పేరుతో ఒక పవర్ఫుల్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఈ ఫోన్కు సంబంధించిన టీజర్ను కంపెనీ అధికారికంగా చైనాలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేబోలో విడుదల చేయడంతో టెక్ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
10,000mAh పవర్ఫుల్ బ్యాటరీ..
ఈ స్మార్ట్ఫోన్కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని 10,000mAh సింగిల్-సెల్ భారీ బ్యాటరీగా భావించవచ్చు.. సాధారణంగా స్మార్ట్ఫోన్లలో 5,000mAh నుంచి 6,000mAh వరకు బ్యాటరీలను చూస్తూ ఉంటాం.. కానీ ఒప్పో ఏకంగా 10,000mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రావడం ఇదే మొదటిసారిగా భావించవచ్చు. నాన్స్టాప్ గేమింగ్ ఆడేవారికి.. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి, హెవీ యూజర్లకు ఇది ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుంది. అంతేకాకుండా ఈ భారీ బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయడానికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది..
అద్భుతమైన డిస్ప్లే, ప్రాసెసర్..
లీక్ అయిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ 6.78 అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది.. ఇది 1.5K రెజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. మల్టీమీడియాతో పాటు గేమింగ్ సమయంలో క్రిస్టల్ క్లియర్ విజువల్స్ను అందిస్తుంది.. గీక్బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. ఈ హ్యాండ్సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 5 (Snapdragon 4 Gen 5) ప్రాసెసర్పై పని చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. కొత్తగా రాబోతున్న ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్తో ఇది రన్ అవుతుంది.
పవర్ఫుల్ 50MP సెల్ఫీ కెమెరా..
కెమెరా విభాగంలో OPPO ప్రత్యేక శ్రద్ధ వహించిన్నట్లు తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చింది. రాత్రివేళల్లో అద్భుతమైన ఫోటోలు తీయడానికి ప్రత్యేకంగా Power Flash బ్రాండింగ్తో కూడిన LED ఫ్లాష్ను కూడా ఇందులో అందించారు. ఇక సెల్ఫీ ప్రియుల కోసం ఫ్రంట్ భాగంలోనూ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించడం విశేషం..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ప్రస్తుతం చైనాలో Oppo A7 Pro Max స్మార్ట్ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి.. త్వరలోనే దీనిని అధికారికంగా గ్లోబల్ మార్కెట్లోకి, భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీమియం ఫీచర్లతో పాటు భారీ బ్యాటరీతో రాబోతున్న ఈ స్మార్ట్ఫోన్ మిడ్-రేంజ్ ధరల విభాగంలో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీని ఇవ్వడం ఖాయమని సమాచారం..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Add Zee News as a Preferred Source
ఉదయాన్నే హై-ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తింటే ఏం జరుగుతుందో తెలుసా? కాలిఫోర్నియా బాదంపై న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కీలక సీక్రెట్స్!
Hyderabad, Telangana:California Almonds Breakfast Benefits: ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్లో కొంతమంది ఫిట్నెస్కు దూరమవుతున్నారు.. అలాగే ఏది దొరికితే అది తినేయాలనే ధోరణి కూడా పెరిగింది. అయితే, ఉదయం బ్రేక్ఫాస్ట్ నుండి రాత్రి డిన్నర్ వరకు సరైన పోషకాలు, ఖనిజాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా మనం ఉదయం తీసుకునే ఆహారం ఆ రోజంతా మన శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే, రానురాను చాలామంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచుకుంటూ ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరైన పోషకాహారంతో రోజును ప్రారంభించడం ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా కడుపు ఖాళీగా ఉండటం వల్ల, రోజంతా అవసరమైన శక్తి లభించాలంటే ప్రోటీన్ అధికంగా ఉండే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ను ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా, ప్రోటీన్ కణజాలాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు.. తద్వారా అతిగా తినకుండా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనివల్ల అనారోగ్యకరమైన ఆహారం తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఆరోగ్యంపై ప్రాధాన్యత చూపడం చాలా ముఖ్యం, లేదంటే తప్పుడు ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. కార్బోహైడ్రేట్లతో పాటు ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఉదయం అల్పాహారంలో చేర్చుకుంటే రోజంతా శక్తి లభిస్తుంది. కండరాల నిర్మాణం కూడా బాగుంటుంది. ఇటువంటి చిన్న మార్పులే దీర్ఘకాలిక ఆరోగ్యానికి దోహదపడతాయని న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి పేర్కొంటున్నారు.
ప్రోటీన్ ప్రధానంగా గింజలు, విత్తనాలు, పాల ఉత్పత్తులు, కొన్ని రకాల పప్పు ధాన్యాలలో పుష్కలంగా ఉంటుంది. బాదం పప్పులో కూడా ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. ముఖ్యంగా కాలిఫోర్నియా బాదంపప్పు ప్రోటీన్తో పాటు ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, మొత్తం 24 రకాల పోషకాలను అందిస్తుంది. ఈ బాదంపప్పును నేరుగా తినవచ్చు, నానబెట్టి తీసుకోవచ్చు లేదా బ్రేక్ఫాస్ట్లో కలిపి స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
Also Read: ఒత్తుగా, పట్టులాంటి జుట్టు కోసం మందార పూల షాంపూ.. సింపుల్ స్టెప్స్లో ఇంట్లోనే తయారు చేసుకోండి!
Also Read: కోడిగుడ్డు ఇలా తింటేనే విటమిన్ డి పూర్తిగా అందుతుందట! డైటీషియన్లు చెప్పే అసలు రహస్యం ఇదే!
బ్రేక్ఫాస్ట్, దీర్ఘకాలిక ఆరోగ్యం గురించి నటి సోహ అలీఖాన్ కూడా మాట్లాడారు. మనం ఉదయం తీసుకునే ఆహారమే రోజంతా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని, కాబట్టి అల్పాహారం సమతుల్యంగా ఉండాలని ఆమె చెప్పారు. కాలిఫోర్నియా బాదంపప్పు పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అది తన బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం పెద్దగా మార్పులు అవసరం లేదని, చిన్నపాటి స్థిరమైన అలవాట్లను పెంపొందించుకుంటే సరిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
అందుకే మనం ప్రతిరోజూ తీసుకునే అల్పాహారం పోషకయుక్తంగా ఉండేలా చూసుకోవాలి. కాలిఫోర్నియా బాదంపప్పును పోహా లేదా ఉప్మాలో కూడా కలిపి తీసుకోవచ్చు. అలాగే పరాటాల్లో కూడా వీటిని చేర్చుకోవడం ద్వారా రోజంతా కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. దీనివల్ల ఆకలి త్వరగా వేయదు, అనవసరంగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా ఉంటారు. రోజంతా కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రోడ్డుపై ఉన్న యువతిని వేధించి వ్యక్తి.. ఆ మహిళ ఇన్స్టాగ్రామ్లో ఏం చేసిందో తెలుసా?
Hyderabad, Telangana:IT రాజధాని బెంగళూరులో మహిళల రక్షణపై మళ్లీ ప్రశ్నలు రేకెత్తించేలా.. ఒక ఊహించని ఘటన వెలుగు చూసింది. నగరంలోని రామమూర్తి నగర్ ప్రాంతంలో క్యాబ్ కోసం వేచి చూస్తున్న ఓ మహిళ పట్ల ఒక వ్యక్తి తీవ్రంగా అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే, ఆ ఆకతాయి చేష్టలకు భయపడిపోకుండా.. ఆ యువతి చూపించిన సమయస్ఫూర్తి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది?
రామమూర్తి నగర్లోని ప్రధాన రహదారిపై ఒక యువతి తన ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి.. ఆమెతో వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు... అంతటితో ఆగకుండా అత్యంత బూతు పదజాలాన్ని ఉపయోగిస్తూ.. ఆమెను మానసికంగా వేధించేందుకు యత్నించాడు.
సదరు యువతి ఆ ఘటనతో కంగారు పడకుండా.. వెంటనే తన స్మార్ట్ఫోన్ తీసి ఆ వ్యక్తి చేస్తున్న చేష్టలను, అసభ్య పదజాలాన్ని రికార్డ్ చేసింది. పోకిరీ ఆకతాయి తనను బెదిరిస్తున్నప్పటికీ.. ధైర్యంగా నిలబడి వీడియోలు తీసింది.
ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్..
తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని, సదరు వ్యక్తి ప్రవర్తనను సమాజానికి తెలియజేసేందుకు బాధితురాలు ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో రక్షణ ఏది? అనే ప్రశ్నిస్తూ ఆ వీడియోను షేర్ చేయడంతో.. అది కొన్ని గంటల్లోనే నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు ఆ యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నగర పోలీసుల దృష్టికి వెళ్లింది.. అధికారులు తక్షణమే స్పందించారు. రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్లో సదరు వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద కేసు (FIR) నమోదు చేశారు. వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి.. అత్యంత వేగంగా అదుపులోకి తీసుకున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల ఇలా వేధింపులకు పాల్పడితే సహించేది లేదని.. నిందితుడిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ తరహా ఘటనలు ఎదురైనప్పుడు మహిళలు భయపడకుండా వెంటనే హెల్ప్లైన్ నంబర్లకు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. మహిళల భద్రతపై ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన శిక్షలతో పాటు సమాజంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం.. యువతను ప్రేరేపిస్తున్న పర్యావరణవేత్త సత్యం దీక్షిత్ స్ఫూర్తిదాయక ప్రయాణం!
Hyderabad, Telangana:World Nature Conservation Day: తన జీవితంలో ఎదురైన అనేక వ్యక్తిగత సంక్షోభాలను , కష్టాలను కూడా పక్కన పెట్టి, కేవలం పర్యావరణ పరిరక్షణ అనే ఉన్నతమైన ధ్యేయంతోనే ఆయన తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ తాము కూడా కృషి చేయాలని కోరుకుంటారు.. కానీ అందులో కేవలం కొంతమంది మాత్రమే ఆ మాటలను ఆచరణలో పెడతారు. అయితే, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సత్యం దీక్షిత్ అసాధారణ జీవిత ప్రయాణం గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేము నిర్వహిస్తున్న ప్రత్యేక సిరీస్ ద్వారా ఈయన అద్భుతమైన కథను మన ముందుకు తీసుకువస్తున్నాం.
సత్యం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెరిగారు. ఆయన తండ్రి జీవనోపాధి కోసం రిక్షా నడిపేవాడు, ఆ తర్వాత సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఎన్నో ఆర్థిక ఇబ్బందులను, కష్టాలను స్వయంగా అనుభవించారు. తన చదువును పూర్తి చేసుకోవడమే కాకుండా, కుటుంబాన్ని పోషించడానికి పాఠశాలల్లో మోమోలు అమ్ముతూ, కళాశాల రోజుల్లో డెలివరీ బాయ్గా కూడా పని చేస్తూ ఎంతో శ్రమించారు. కోవిడ్ మహమ్మారి కాలం సత్యం జీవితంలో ఒక అత్యంత కీలకమైన మలుపుగా నిలిచింది. ఆ క్లిష్ట సమయంలోనే యూపీఎస్సీ పరీక్షలకు ఎలాగైనా సన్నద్ధం కావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన తన నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడమే కాకుండా, అదే సమయంలో పర్యావరణ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా తన కార్యక్రమాలను ప్రారంభించారు. 'మై ఎర్త్.. మై డ్యూటీ' ద్వారా ఆయన అనేక మంది ప్రజలలో మార్పును తీసుకురాగలిగారు.
కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమం, నేడు సుమారు 200 నగరాలకు విస్తరించిన ఒక పెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందింది. వీరు బహిరంగ ప్రదేశాలలో, నది తీర ప్రాంతాలలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, పర్యావరణానికి హాని చేసే పెద్ద ఎత్తున వ్యర్థాలను కూడా సమర్థవంతంగా తొలగిస్తున్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, మతపరమైన ప్రదేశాలలో పేరుకుపోయిన వ్యర్థాలను పునర్వినియోగం చేయడం, సామాజిక భాగస్వామ్యం ద్వారా పౌరులు తమ పరిసరాల పట్ల బాధ్యతగా ఉండేలా ప్రోత్సహించడం వంటి అనేక కీలకమైన పనులను వీరు చేపడుతున్నారు. ఈ విధంగా సత్యం దీక్షిత్ తన ప్రగాఢమైన విశ్వాసంతో సమాజంలోని ఎంతో మందికి గొప్ప స్ఫూర్తినిస్తున్నారు.
Also Read: ట్రైన్లో ఖాళీ సీట్లు ఎలా చూడాలో తెలుసా? IRCTC యాప్లో సులభమైన ప్రాసెస్ ఇదిగో!
Also Read: ఇకపై క్షణాల్లో తత్కాల్ టికెట్ బుకింగ్.. ఐఆర్సీటీసీ తెచ్చిన ఆ 5 కొత్త ఫీచర్లు ఇవే!
ఆయన చేస్తున్న 'నా భూమి - నా కర్తవ్యం' అనే ప్రచారం, సందేశం ఆయన తపనను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ఆయన చేసే పని కేవలం చెత్త సేకరణకు మాత్రమే పరిమితం కాలేదు.. ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చడం, పర్యావరణం పట్ల అవగాహన పెంచడం, ప్రతి పౌరుడు తన పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా వారిని శక్తివంతం చేయడమే ఈ సంఘం ప్రధాన ఉద్దేశ్యం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
