పేలుడు పదార్థాలు, నకిలీ నోట్లు స్వాధీనం
Sukma, Chhattisgarh:ఛత్తీస్గఢ్...నక్సల్స్ శిబిరం లో నకిలీ నోట్ల కట్టల గుట్టు రట్టు చేసిన భద్రతా బలగాలుసుక్మా జిల్లాలోని బెజ్జి పోలీసు స్టేషన్ పరిధిలో గల కొరాజ్గూడ అడవుల్లో బయట పడిన నకిలీ కరెన్సీ. భారీ ఎత్తున నకిలీ నోట్లు, ప్రింటర్, పేలుడు పదార్థాలు, తుపాకులు, వైర్లెస్ సెట్లు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలుहमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Cobra Video: నిద్రిస్తున్న యువకుడి షర్ట్లోకి దూరిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? వీడియో..
Hyderabad, Telangana:King Cobra Rare Viral Video Watch Here: సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలాది వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. వాటిల్లో నవ్వించేలా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తూ భయాందోళన కూడా కలిగిస్తూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.. ఒక యువకుడు అజాగ్రత్తగా చెట్టు కింద పడుకోగా.. అతని షర్టులోకి అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా దూరిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.
షర్టు లోపలికి దూరిన పాము..
వైరల్ అవుతున్న దృశ్యాల వివరాల ప్రకారం.. ఒక యువకుడు చెట్టు నీడన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.. అయితే, అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక భారీ కింగ్ కోబ్రా నెమ్మదిగా అతని శరీరానికి పాకుతూ షర్టు లోపలికి దూరిపోయింది. ఆ యువకుడు నిద్రలేచి చూసేసరికి తన షర్టు లోపల పాము కదలడాన్ని గమనించి.. తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.. చిన్నపాటి పొరపాటు జరిగినా.. కాస్త కదిలినా.. ఆ విష సర్పం కాటేయడం ఖాయం.. దీంతో ఆ యువకుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. కదలకుండా అలాగే శవంలా పడుకొని ఉండిపోయాడు..
రంగంలోకి స్నేక్ క్యాచర్..
ఈ ప్రమాదకరమైన పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఎక్స్పీరియన్స్ కలిగిన స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు. ఆ యువకుడికి ఎటువంటి హాని కలగకుండా.. పామును రెచ్చగొట్టకుండా చాలా నెమ్మదిగా యువకుడి షర్టు బటన్లు విప్పడం ప్రారంభించాడు..
షర్టులో నుంచి ఎలా తీశాడు?
ఆ సమయంలో ఒక్కొక్క క్షణం.. ఎంతో కీలకంగా మారింది. షర్టు విప్పుతున్న క్రమంలో ఆ కింగ్ కోబ్రా ఒక్కసారిగా తన పెద్ద పడగలను విప్పి.. కాటేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.. అక్కడున్న వారంతా కొద్ది దూరం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఆ స్నేక్ క్యాచర్ అత్యంత నైపుణ్యంతో ఆ పాము దృష్టిని మళ్లించి.. దాన్ని షర్టులో నుంచి బయటకు లాగేసాడు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
షర్టులో నుంచి విజయవంతంగా బయటికి తీసిన ఆ ప్రమాదకరమైన నాగుపామును స్నేక్ క్యాచర్ చాకచక్యంగా ఒక కాళీ ప్లాస్టిక్ సీసాలో ఎక్కించి.. దానికి మూతను గట్టి బంధించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ యువకుడు భయంతో వణికిపోతూ.. తనకు పునర్జన్మ ప్రసాదించిన స్నేక్ క్యాచర్కు కృతజ్ఞత తెలిపినట్లు సమాచారం. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
SBI Apprentice 2026: నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త! SBI బ్యాంకులో 7,150 ఉద్యోగాలు..నెలకు జీతం ఎంతంటే?
Hyderabad, Telangana:SBI Apprentice Recruitment 2026: బ్యాంకింగ్ రంగంలో తమ కెరీర్ ను ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సువర్ణ అవకాశాన్ని కల్పించింది. 2026-27 ఏడాదికి గాను దేశవ్యాప్తంగా మొత్తం 7,150 అప్రెంటిస్ (శిక్షణార్థులు) పోస్టుల భర్తీకి ఎస్బీఐ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఎప్పటికే ప్రారంభం అయ్యింది.
ఎస్బీఐ అప్రెంటిస్ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 7,150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందుకోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా.. మే 19 దరఖాస్తు ప్రారంభ తేదీ కాగా, జూన్ 8న దరఖాస్తుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పరీక్షను జులై నెలలో నిర్వహించేందుకు ప్రాథమికంగా వెల్లడించారు.
ఇది ఒక సంవత్సరం కాలం పాటు పరిమితి గల అప్రెంటిషిప్ శిక్షణ కార్యక్రమం మాత్రమే, శాశ్వత ఉద్యోగం కాదు. అయితే ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో ఎస్బీఐతో పాటు ఇతర అనుబంధ సంస్థలు వచ్చే ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.
అర్హతలు, వయోపరిమితి
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పట్టభద్రత ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఏప్రిల్ ఒకటి 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగుల గరిష్ట పరిమితులు సడలింపు ఉంటుంది.
తప్పనిసరి నిబంధనలు
1. అభ్యర్థులు గతంలో ఎక్కడా అప్రెంటిస్షిప్ శిక్షణ పొంది ఉండకూడదు.
2. ఒకే సంవత్సరం కంటే ఎక్కువ పని అనుభవం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు.
3. అభ్యర్థి ఏదైనా ఒక్క రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది.
4. దరఖాస్తు చేసుకునే రాష్ట్ర స్థానిక భాష పై పొట్టు ఉండాలి. స్థానిక భాషలోనూ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ..
ఈ పోస్టులను నియామక ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. అందులో ఒకటి ఆన్లైన్ రాత పరీక్ష కాగా రెండోది స్థానిక భాషా పరీక్ష. వీటిలో ఉత్తీర్ణత పొందిన వారే అప్రెంటిస్షిప్ కి అర్హత సాధిస్తారు.
స్టైఫండ్, విరోచనాలు
ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. ఈ కాలంలో ఎస్బీఐ బ్యాంకింగ్ విధానాలు కస్టమర్ సర్వీస్ అనుభవం లభిస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికేట్ అందజేస్తారు.
ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి
1. మొదటగా అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ NAPS వెబ్సైట్లో తమ పేరు నమోదు చేసుకోవాలి.
2. ఆ తర్వాత ఎస్బిఐ అధికారిక వెబ్సైట్ లో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.
3. హోం పేజీలో ఉన్న కెరియర్స్ విభాగంలోకి వెళ్లి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి.
4. అప్లికేషన్ ఫామ్ లో అడిగిన వివరాలను నింపి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
5. దరఖాస్తు రుసుము చెల్లించి ఫారం ను సబ్మిట్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
6. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే యువతకు ప్రాక్టికల్ నాలెడ్జ్ సాధించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆసక్తి కల అర్హులైన అభ్యర్థులు జూన్ 8లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: రాజకీయాల్లోకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాజీ భార్య..బీజేపీలో చేరనున్న సంగీత!
ALso Read: తెలంగాణ ఏర్పాటుపై పవన్ కల్యాణ్ కీలక పోస్ట్..2009 నాటి వీడియో బయటపెట్టిన జనసేనాని!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: స్కూళ్లు, కాలేజీల వద్దే మత్తు వ్యాపారమా.. కోట్పా చట్టం కరీంనగర్లో అమలు కావడం లేదా?
Karimnagar, Telangana:Illegal Gutka Sale Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యాసంస్థల పరిసరాలు మత్తు పదార్థాల కేంద్రాలుగా మారుతున్నాయి.. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన స్కూళ్లతో పాటు కాలేజీల సమీపంలోనే ప్రమాదకరమైన గుట్కా ప్యాకెట్లతో పాటు సిగరెట్ల విక్రయాలు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. కోట్పా (COTPA) చట్టం ప్రకారం.. విద్యాసంస్థలకు 100 మీటర్ల లోపు ఎలాంటి పొగాకు ఉత్పత్తులతో పాటు ఇతర మత్తు పదార్థాలను విక్రయించకూడదనేది స్పష్టమైన నిషేధం ఉన్నప్పటికీ.. ఇక్కడ వ్యాపారులు ఆ నిబంధనలను తుడిచి పెడుతున్నారు.. కిరాణా దుకాణాలతో పాటు పాండబ్బాలు, చిరుదిండ్ల బండ్ల ముసుగులో మైనర్ విద్యార్థులకు సైతం బహిరంగంగానే సిగిరెట్ల విక్రయిస్తూ వస్తున్నారు. నిషేధిత గుట్కాలను విక్రయిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు.
ఈ విచ్చలవిడి అమ్మకాల వెనక కేవలం పొగాకు ఉత్పత్తులే కాకుండా.. అంతకుమించి పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.. సిగరెట్ల తో పాటు గుట్కా విక్రయాల ముసుగులో విద్యార్థులకు గంజాయితోపాటు ఇతర ప్రమాదకరమైన డ్రగ్స్ సరఫరా అయ్యే అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఆకర్షణీయమైన ప్యాకెట్లలో దొరికే మత్తు పదార్థాలకు అలవాటు పడి.. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు..
పక్కనే ఉన్న వరంగల్ జిల్లాలో పోలీసులు విద్యాసంస్థల సమీపంలో ఉన్న ప్రతి షాపుపై ప్రత్యేకమైన నిఘా ఉంచి.. ఆకస్మిక తనిఖీలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటుండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం అలాంటి ముందస్తు చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక పోలీసులతో పాటు టాస్క్ఫోర్స్ సిబ్బంది కేవలం మీద మీదనే తనిఖీలు చేసి వదిలేస్తున్నారే తప్ప.. శాశ్వత నియంత్రణపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు సైతం మండిపడుతూ వస్తున్నారట..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
కొత్త విద్య సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.. అన్ని పాఠశాలలు, శాలల పరిసర ప్రాంతాలను ఖచ్చితమైన టొబాకో ఫ్రీ జోన్లుగా ప్రకటించడమే కాకుండా.. నిబంధనలు ఉల్లంఘించి దుకాణదారులపై పీడియాక్ టువంటి కఠినమైన చట్టాల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. పోలీసులతోపాటు విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో పనిచేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Refrigerator Deal: లక్ష రూపాయల Haier సైడ్-బై-సైడ్ ఫ్రిజ్ ఇప్పుడు సగం ధరకే.. డోంట్ మిస్!
Hyderabad, Telangana:Haier 602l Side-by-side Convertible Refrigerator Deal: అత్యంత తక్కువ ధరలోనే సైడ్ బై సైడ్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా లక్ష రూపాయలు కలిగిన రిఫ్రిజిరేటర్ కేవలం సగం దరికి కొనుగోలు చేస్తారా? అయితే, ఈ స్టోరీ మీకోసమే.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ Haier బ్రాండ్కి సంబంధించిన ఈ రిఫ్రిజిరేటర్ల పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తూ వస్తోంది.. ఇందులో భాగంగా కొనుగోలు చేస్తే చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..
ముఖ్యంగా Haier 602 L సైడ్ బై సైడ్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ ఫ్లిప్కార్ట్లో అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. HRS-682KS మోడల్ కలిగిన రిఫ్రిజిరేటర్ సగం ధరకే కొనుగోలు చేయాలనుకుంటే.. ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్కార్ట్లో దీనిపై స్పెషల్గా ఫ్లాట్ తగ్గింపుతో పాటు అదనంగా బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అందిస్తుంది. Haier 602 L సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ భారత్ మార్కెట్లో MRP ధర రూ.1,08,800 కాగా.. దీనిని ఇప్పుడే ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేసే వారికి ఏకంగా 43 శాతం వరకు స్పెషల్ ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేస్తే కేవలం రూ.62,400 లోపే పొందవచ్చు.. ఇవే కాకుండా అదనంగా బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి..
ఈ Haier 602 L సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని ఎస్బిఐ బ్యాంకుతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే రూ.6,000 వేల వరకు స్పెషల్ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకుతో పాటు ఫ్లిప్కార్ట్ అనుసంధాన ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగిస్తే రూ.5,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే దీనిపై అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ వినియోగించాలనుకుంటే మీ ఇంట్లో ఎప్పటినుంచో వాడుతున్న పాత రిఫ్రిజిరేటర్ ను తప్పకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా ఫ్లిప్కార్ట్ కు ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాని బ్రాండ్ వ్యాల్యూతో పాటు దాని సామర్ధ్యాన్ని బట్టి గరిష్టంగా రూ.9,000 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.47,400 లోపే పొందవచ్చు..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
Haier 602 L Side by Side Convertible (HRS-682KS) స్మార్ట్ రిఫ్రిజిరేటర్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. పెద్ద ఫ్యామిలీ ఉన్నవారికి ఇది మంచి ఛాయిస్గా భావించవచ్చు. ఇది ప్రీమియం లుక్కుతో పాటు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన అనేక రకాల ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది కన్వర్టిబుల్ స్పేస్తో అందుబాటులోకి వచ్చింది. ఈ రిఫ్రిజిరేటర్ ఫ్రిజ్కి అతిపెద్ద ప్లస్ పాయింట్ కన్వర్టబుల్ స్పేస్.. అవసరాన్ని బట్టి ఫ్రీజర్ భాగాన్ని కూడా పూర్తిగా నార్మల్ ఫ్రిజ్గా మార్చుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ కూరగాయలు, పండ్లు లేదా ఇతర వస్తువులను దాచుకోవడానికి వీలవుతుంది. అంతేకాకుండా ఇన్బిల్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ వల్ల కరెంటు చాలా ఆదా అవుతుంది. దీంతోపాటు శబ్దం తక్కువగా వస్తుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Peddi Kissing Scene: 'పెద్ది' కిస్సింగ్ సీన్ చూశారా? రామ్చరణ్ నటనపై ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:AR Rahman Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ డ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు అత్యున్నతమైన సంగీతం అందించిన ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్.. రామ్ చరణ్ నటనపై చిత్రంలోని కిస్సింగ్ సీన్పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
రామ్ చరణ్ జీవించేసాడు..
"నిజం చెప్పాలంటే సినిమాలో కొన్ని ఎమోషన్ సీన్స్ రాంచరణ్ ఎలా నటిస్తాడు, అని నా మనసులో చిన్న భయం ఉండేది. కానీ సినిమా చూశాక నా సందేహాలని పటాపంచలయ్యాయి. చరణ్ ఈ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన అద్భుతమైన నటనతో ప్రాణం పోశారు" అని ఏఆర్ రెహమాన్ ప్రశంసించారు.
ఇదే క్రమంలో సినిమాలో రామ్చరణ్, జాన్వీకపూర్ల మధ్య వచ్చే కిస్సింగ్ సీన్ గురించి కూడా ఏఆర్ రెహమాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. "సినిమాలో ప్రతి ఫ్రేమ్ లోను చరణ్ చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా కిస్సింగ్ సీన్ ఎంత రియలిస్టిక్ గా ఉందంటే.. ఆ క్షణంలో ఆయన నటించలేదు నిజంగా జీవించినట్లు అనిపించింది. ఈ సినిమా కోసం రాంచరణ్ ఎంతగా రక్తం చెమట చిందించారు తెరపై స్పష్టంగా కనిపిస్తుంది" అని ఏఆర్ రెహమాన్ అన్నారు.
'పెద్ది' సినిమా కథాంశంపై కూడా ఏఆర్ రెహమాన్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో రాంచరణ్ పోషించిన ముఖ్య పాత్ర ఒకేసారి క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్ అనే మూడు విభిన్నమైన క్రీడల్లో రాణిస్తుందని వెల్లడించారు. మన ఆలోచనలకు హద్దులు లేనప్పుడు అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన విశ్లేషించారు.
దర్శకుడు బుచ్చిబాబు సానా మేకింగ్ స్టైల్ను అగ్రదర్శకుడు శంకర్తో పోలుస్తూ ఏఆర్ రెహమాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. శంకర్ దర్శకత్వం వహించిన 'జెంటిల్మెన్', 'భారతీయుడు', 'ఒకే ఒక్కడు' సినిమాల్లో హీరోకు ఎలాంటి బలమైన ఆశయం ఉంటుందో.. 'పెద్ది'లోను అలాంటి పాయింట్ ఉంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ తన గ్రామం కోసం మానవత్వం కోసం పోరాడే ఒక గొప్ప సందేశం ఇందులో ఉంది. శంకర్ సినిమా చూస్తున్నప్పుడు ఎలాంటి హై ఫీలింగ్ కలుగుతుందో పెద్ది చూస్తున్నప్పుడు కూడా తనకు అలాంటి అనుభూతి కలిగిందని రెహమాన్ చిత్ర బృందాన్ని అభినందించాడు.
Also Read: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ హీరో..అతిథులుగా షారుక్, సల్మాన్!
Also Read: రామ్చరణ్ 'పెద్ది' సినిమాని రిజెక్ట్ చేసిన మలయాళీ బ్యూటీ.."నేను చేయను" అని చెప్పిందట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Monsoon 2026: గుడ్న్యూస్! కేరళంను తాకిన నైరుతి రుతుపవనాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
Ayyampuzha, Kerala:South West Monsoon 2026: భారతదేశ వ్యాప్తంగా రైతాంగంతో పాటు సామాన్య ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలోనే ప్రవేశించాల్సిన ఇరుతుపవనాలు గత ఎడాదితో పోలిస్తే ఈసారి కాస్త ఆలస్యంగా దేశంలోకి అడుగుపెట్టేయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆలస్యమైనప్పటికీ వీటి రాకతో దక్షిణాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
కేరళంకు ఆరెంజ్ అలర్ట్
వర్షాలు తీవ్రత దృష్టి ఆ కేరళం రాష్ట్రంలోని మూడు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
తమిళనాడులో భారీ వర్ష సూచన
తమిళనాడులోని దాదాపు 15 జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది.
ఆలస్యంగానైనా నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించడంతో అటు రైతులతో పాటు సాధారణ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రతలు జనాలకు రుతుపవనాల రాక ఉపశమనం లభించింది. ఇవి వేగంగా ముందుకు సాగి రానున్న రోజుల్లో మిగతా రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయి.
ప్రస్తుతం కేరళం రాష్ట్ర తీరాన్ని తాకిన ఈ నైరుతి రుతుపవనాలు రాబోయే రోజుల్లో మరింత బలపడి వేగంగా ముందుకు కదిలి ముందుకు అనుకూల వాతావరణం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా మిగిలిన మధ్య ఉత్తర భారత రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. రుతుపవనాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి వర్గాలు భావిస్తున్నాయి.
Also Read: Monsoon Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం..2-3 రోజుల్లో వానలే వానలు!
Also Read: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ హీరో..అతిథులుగా షారుక్, సల్మాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mercury Venus Conjunction: జూన్ 3 నుంచి ఈ 4 రాశుల వారికి బంపర్ జాక్పాట్.. తిరుగులేని ధనలాభం!
Hyderabad, Telangana:Mercury And Venus Conjunction Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధవారం చంద్రుడు పూర్వాషాడ నక్షత్రం నుంచి గురు రాశి అయిన ధనస్సులోకి ప్రవేశించాడు. అక్కడి నుంచి చంద్రుడు, శుక్రుడు, బుధుల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన సమసప్తక యోగాన్ని ఏర్పాటు చేశాయి. మరోవైపు బుధవారం బుధుడు మిథున రాశిలో సంచారం చేయడం వల్ల ఎంతో శక్తివంతమైన భధ్ర భద్రరాజయోగం కూడా ఏర్పడింది. ఆదనంగా శుక్ర బుధ కలయిక వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది. ఇలా ఎన్నో ప్రధాన రాజయోగాలు ఏర్పడ్డాయి. దీని కారణంగానే జూన్ మూడవ తేదీ నుంచి కొన్ని రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
మేషరాశి
ఎంతో శక్తివంతమైన రాజయోగాల కారణంగా మేష రాశి వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. నాలుగవ స్థానంలో చంద్రుడి సంచారం జరగడం కారణంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. అలాగే కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి అద్భుతమైన లాభాలు పొందుతారు. పాత పరిచయస్తుల నుంచి స్నేహితుల నుంచి మంచి సపోర్టు లభిస్తుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంటే.. మీరు అద్భుతమైన లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేయడం కూడా సాధ్యమవుతుంది. అలాగే అదృష్టం 91శాతం వరకు మీకు అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడు రెండవ స్థానంలో సంచారం చేయడం చాలా శుభప్రదం. వ్యాపారాలతో పాటు ఆఫీసుల్లో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులందరికీ అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే బహుమతులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వినోదంతో పాటు ఆనందాన్ని కూడా సులభంగా ఆస్వాదించే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలనుకునే వ్యక్తులకు ఈ సమయం లాభదాయకంగా ఉండబోతుంది. అలాగే విద్యా రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. శుక్ర, బుధ గ్రహాల సంచారం ప్రేమ వ్యవహారాల్లో కూడా అనుకూలంగా ఉండబోతోంది. అదృష్టం వీరికి ఈ సమయంలో 93 శాతం వరకు తోడుంటుంది.
మిథున రాశి
జూన్ మూడవ తేదీ నుంచి మిథున రాశి వారికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో వాక్చాతుర్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఆర్థికంగా కూడా ఎన్నో రకాల లాభాలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులపై పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు మతపరమైన విషయాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వినోదం పట్ల ముగ్గు చూపి విశేషమైన లాభాలు పొందుతారు. ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. అనుకున్న పనుల్లో విజయాలు సాధించి మంచి గుర్తింపు పొందే అవకాశాలున్నాయి. వీరికి ఈ సమయంలో అదృష్టం 89 శాతం వరకు అనుకూలంగా ఉంటుంది.
కన్యా రాశి
బుధ, శుక్ర గ్రహాల కలయిక కారణంగా కన్య రాశి వారికి కూడా ఈ సమయంలో చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా బంధువులు లేదా స్నేహితుల నుంచి అద్భుతమైన శుభవార్తలు వింటారు. పాత స్నేహితులను కలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే తెలివైన ప్రణాళికలతో మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు కూడా చాలావరకు అనుకూలంగా ఉండి విశేషమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా కొన్ని రకాల కొనుగోలు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు తల్లిదండ్రుల నుంచి ఆశించిన సపోర్టు లభించి కోరికలు నెరవేర్చుకునే అవకాశాలున్నాయి. వీరికి ఈ సమయంలో అదృష్టం 93 శాతం వరకు అనుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rahu Transit 2026: రాహువు కృపతో ఈ 4 రాశుల వారికి దిమ్మతిరిగే ధనలాభం.. ఆ జాబితాలో మీ రాశి ఉందా?
Hyderabad, Telangana:Rahu Transit Impact On Zodiac Telugu News: రాహువు గ్రహం పేరు చెప్తేనే అందరూ గజగజ వనిగిపోతూ ఉంటారు. అంతే కాకుండా దీనిని దురదృష్టాన్ని సూచించే గ్రహంగా కూడా చెప్పుకుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రంలో దీనికి అశుభగ్రహంగా పేరునప్పటికీ.. చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. కొన్నిసార్లు, ఈ గ్రహం వ్యక్తుల జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా సంపదతో పాటు వృత్తి సంబంధాల విషయంలో సానుకూల మార్పులు తీసుకురావడంలో ఈ గ్రహం ముందుంటుంది. జూన్ నెల ప్రారంభం కొందరికి కొత్త నిలనే కాకుండా.. ఈనెల ఆయా రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే నెలగా.. ఎందుకంటే రాహువు గ్రహం శతభిషా నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా పరిష్కారం లభించబోతోంది..
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్..
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. రాహువు ప్రభావంతో చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు ఊబందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు మారాలనుకుంటున్న వ్యక్తులకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్న వ్యక్తులకు కూడా మంచి కాలంగా భావించవచ్చు. అలాగే పెద్ద పెద్ద విషయాల్లో అనేకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే కష్టానికి తగ్గ ఊహించని దానికంటే ఎక్కువగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి..
మిధున రాశి
మిధున రాశి వారికి కూడా రాహువు గ్రహం సంచార ప్రభావంతో కొత్త అవకాశాలకు మార్గం సులభం అవుతుంది. వీరికి కొత్త మార్కెట్ల ద్వారా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. కమ్యూనికేషన్తో పాటు మీడియా రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. డిజిటల్ ప్లాట్ఫామ్స్తో పాటు టెక్నాలజీ రంగాల్లో ఉన్న వారికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు కూడా ఎంతో సులభంగా ముందుకు సాగుతాయి. దీంతోపాటు అనుకున్న పనుల్లో మంచి సక్సెస్ సాధించగలుగుతారు.
తులా రాశి
తులారాశిలో జన్మించిన భక్తులకు కూడా ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి వ్యక్తిగత జీవితం చాలా లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో గౌరవం లభించడమే కాకుండా అనుకున్న పనుల్లో మంచి ఫలితాలు పొంది.. అద్భుతంగా రాణించగలుగుతారు.. అలాగే వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న అపార్ధాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి.. భాగస్వామ్య జీవితంలో మంచి సంబంధాలు ఏర్పడతాయి..
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో ఆత్మవిశ్వాసం అంచెలంచలుగా పెరుగుతుంది. ముఖ్యంగా పనుల్లో ఎలాంటి ప్రయాణం చేసిన మంచి ప్రశంసలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల సపోర్టు నుంచి బోలెడు లాభాలు పొందుతారు. అలాగే కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే జీవితంలో అనుకున్న ధన లాభాలు పొంది.. విజయాలు సాధించగలుగుతారు.. దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 జీ5, టీవీలో ఎలా చూడాలి? ప్లాన్ల ధరలు ఇవే!
Wadgaon, Maharashtra:Zee5 FIFA World Cup 2026 Plans: ఫిఫా ప్రపంచ కప్ 2026పై ప్రసార హక్కులు జీ మీడియా పొందగా.. ఈ మ్యాచ్లు భారతదేశంలో అర్ధరాత్రి ప్రసారం కానున్నాయి. జీ ఎంటైర్టెన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్)కు చెందిన జీ5, యునైట్8 స్పోర్ట్స్లో ఈ మ్యాచ్లు వీక్షించే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్లు ఎలా చూడాలో తెలుసుకుందాం. ఈ మ్యాచ్లు టీవీలు, మొబైల్ ఫోన్లలో చూసేందుకు ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి. ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్ల ప్రసారానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ భారత ప్రసార హక్కులను జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ దక్కించుకుంది. 2030 ఫిఫా ప్రపంచ కప్నకు సంబంధించిన మీడియా హక్కులను కూడా పొందింది. 2026, 2030లో జరిగే పురుషుల ప్రపంచ కప్లను మాత్రమే కాకుండా.. 2027 ఫిఫా మహిళల ప్రపంచ కప్తో సహా 2034 వరకు జరిగే 39 ఫిఫా ఈవెంట్ల విస్తృత ప్యాకేజీ అందిస్తోంది. ఫుట్బాల్కు అతిపెద్ద టోర్నమెంట్ను టెలివిజన్, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీలు, టీటీహెచ్ ప్లాట్ఫారమ్లలో చూడవచ్చు.
ఇక్కడ చూడవచ్చు..
ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లను డిజిటల్గా చూడాలనుకునే ప్రేక్షకులు జీ5 యాప్, వెబ్సైట్లో చూడవచ్చు. స్పోర్ట్స్ స్ట్రీమింగ్ వ్యాపారాన్ని విస్తరించడం, పెయిడ్ సబ్స్క్రైబర్లను పెంచుకోవాలని చూస్తోంది.
ప్లాన్లు
==> జీ5 ఆల్ యాక్సెస్ + స్పోర్ట్స్ (3 నెలలు)
==> రూ.799 (నెలకు రూ.266)
==> జూన్ 11 నుంచి జూలై 19వ తేదీ వరకు జరిగే మొత్తం ప్రపంచ కప్ చూడవచ్చు
==> జీ5 ప్రీమియం వార్షిక ప్లాన్
==> సంవత్సరానికి రూ.1,699 (నెలకు రూ.142)
==> 4కే అల్ట్రా హెచ్డీ స్ట్రీమింగ్
==> డాల్బీ అట్మోస్ ఆడియో
==> ఒకేసారి నాలుగు డివైసెస్లో స్ట్రీమింగ్
==> జీ5 విస్తృతమైన ప్రీమియం వినోద కేటలాగ్కు యాక్సెస్
ఫిఫా ప్రపంచకప్ ప్రత్యేక సబ్స్క్రిప్షన్ను కొనుగోలు చేసే ముందు వీక్షకులు ఇప్పటికే ఉన్న టెలికాం, బ్రాడ్బ్యాండ్ ప్లాన్లను కూడా పరిశీలించుకోవాలి. ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఓటీటీప్లే, టాటా ప్లే బింజ్ వంటి ప్లాట్ఫారమ్లు తరచుగా ఎంపిక చేసిన ప్లాన్లతో జీ5 ప్రీమియం యాక్సెస్ను అందిస్తున్నాయి. అదనపు సబ్స్క్రిప్షన్ ఖర్చులను తగ్గించడంలో లేదా పూర్తిగా తొలగించడంలో ఇది సహాయపడవచ్చు. చాలా మంది వినియోగదారులు మెరుగైన విలువను పొందవచ్చు.
టీవీలో ఫీఫా ప్రపంచ కప్ 2026ను ఎలా చూడాలి
టెలివిజన్ ప్రసారాలను ఇష్టపడే ప్రేక్షకులు జీ కొత్తగా ప్రారంభించిన యునైట్8 స్పోర్ట్స్ నెట్వర్క్లో మ్యాచ్లను చూడవచ్చు. ప్రత్యేక ఇంగ్లీష్, హిందీ ఫీడ్లు మ్యాచ్లు అందిస్తాయి. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత ప్రసార సంస్థ అధికారికంగా నాలుగు క్రీడా ఛానెళ్లను ప్రారంభించింది. ఆ చానళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
యునైట్8 స్పోర్ట్స్ 1
యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డీ
యునైట్8 స్పోర్ట్స్ 2
యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డీ
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఈ ఛానెళ్లు దేశవ్యాప్తంగా 500కు పైగా కేబుల్, డీటీహెచ్ ప్లాట్ఫారమ్లలో ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమవుతాయి. డిష్ టీవీ, టాటా ప్లే, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, సన్ డైరెక్ట్, సిటీ నెట్వర్క్స్, ఇండియన్ కేబుల్ నెట్ కంపెనీ లిమిటెడ్, హిందుజా గ్లోబల్, ఫాస్ట్వే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్), కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ లిమిటెడ్ (కేసీసీఎల్), తమిళగ కేబుల్ టీవీ కమ్యూనికేషన్స్, వికె డిజిటల్, యుసీఎన్ కేబుల్ నెట్వర్క్, టేక్ వన్, శ్రీ సాయి కేబుల్, కల్ కేబుల్, డిగియానా, భీమవరం, అక్సోం వంటి వాటిల్లో కూడా ఆయా చానల్స్ ప్రసారాలు వస్తాయి.
యునైట్8 స్పోర్ట్స్ ఛానల్ ధరలు
జీ రెఫరెన్స్ ఇంటర్కనెక్ట్ ఆఫర్ (ఆర్ఐఓ) ప్రకారం నెలవారీ ఛానల్ ధరలు ఇలా ఉన్నాయి.
యునైట్8 స్పోర్ట్స్ 1 - రూ.7
యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డీ -రూ.9
యునైట్8 స్పోర్ట్స్ 2 — రూ.8
యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డీ - రూ.11
(అన్ని ధరలలో వర్తించే పన్నులు అదనం)
Brs Ktr: మా తెలంగాణకు ఓజీ మా కేసీఆర్.. పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేటీఆర్..
Hyderabad, Telangana:Brs ktr strong counter to ap deputy cm pawan kalyan press meet in telanganaYS Jagan: డీఎస్సీ 2025పై సీబీఐ దర్యాప్తు విచారణ చేయాలి.. లేకుంటే మేమే విచారణ చేస్తాం: వైఎస్ జగన్
Nuzendla, Andhra Pradesh:AP DSC 2025 Recruitment: ఆంధ్రప్రదేశ్లో 2025లో భర్తీ చేసిన టీచర్ ఉద్యోగాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ-2025పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే మేం అధికారంలోకి వచ్చాక తాము విచారణ చేస్తామని ప్రకటించారు. 'డీఎస్సీ–2025లో అంతులేని అక్రమాలు కనిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా జీఓలు ఇవ్వడంతోపాటు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలతో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగింది. వారి తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి న్యాయ పోరాటం చేస్తాం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. 'దీనికోసం లీగల్ ప్యానెల్ ఒకటి ఏర్పాటు చేస్తాం. అన్యాయం జరిగిన డీఎస్సీ అభ్యర్థులు బాధపడొద్దు. ఏ మాత్రం ధైర్యం కోల్పోవద్దు. ఓపిగ్గా ఉండాలి. వారికి ప్రతి అడుగులో అండగా.. తోడుగా ఉంటాం' అని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పలువురు డీఎస్సీ-2025 అభ్యర్థులు మాజీ సీఎం వైఎస్ జగన్తో సమావేశమై డీఎస్సీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. డీఎస్సీ పరీక్ష నిర్వహణ, అభ్యర్థుల ఎంపికలో చోటుచేసుకున్న అనేక అక్రమాలపై మాజీ సీఎం జగన్కు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వైఎస్సార్సీపీ అధినేతకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మాజీ సీఎం వైఎస్గన్ మాట్లాడుతూ.. '1:1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచి అన్నింటిలో సక్సెస్ అయిన అనేక మంది డీఎస్సీ-2025 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయం. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు' అని తెలిపారు.
ఇష్టారాజ్యంగా జీఓలు జారీ చేసి.. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దీంతో ఎందరో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని.. వారి తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. దీనికోసం లీగల్ ప్యానెల్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని, అన్యాయానికి గురైన అభ్యర్థులకు అవసరమైతే అదనపు పోస్టులు ఇస్తామని భరోసా ఇచ్చారు.
Also Read: Telangana Rains: వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. తెలంగాణలోని 18 జిల్లాల్లో భారీ వర్షాలు
తాము ప్రభుత్వ హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే.. 2019లో గాంధీ జయంతి వరకు 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా, ఏ వివాదం రాలేదని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు కేవలం 16 వేల ఉద్యోగాల్లో అక్రమాలు, అవకతవకలు చేయడం ఆశ్చరమేస్తోందని చెప్పారు. 'డీఎస్సీ 2025లో స్పోర్ట్స్ కోటా పేరిట మొదట ఒక జీఓ ఇచ్చారు. ఎలాంటి పరీక్ష అవసరం లేదని, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వారు ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరో జీఓ జారీ చేసి, ఆ కోటాలో కూడా అభ్యర్థులు ఇక నుంచి పరీక్ష రాయాలని, ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలని నిర్దేశించారు. అంటే తమ పని పూర్తి చేయగానే, మళ్లీ నియమావళి మారుస్తూ మరో జీఓ ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.
డీఎస్సీ 2025పై వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అక్రమాలపై విచారణ జరిపిస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. కొంచెం ఓపిక పట్టాలని సూచించారు. 'ఏ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పి.. వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం మీకు అన్యాయం చేశారు. ఆ పని చేయగానే గేట్లు మూసి మరో జీఓ ఇచ్చారు. ఇంత కంటే దగా, మోసం మరోటి ఉంటుందా?' అని ప్రశ్నించారు. 'జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే అతడు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు రాలేదు. కానీ అదే అభ్యర్థి తనకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్లాడు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
Fuel Prices Decrease: కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గుదల?
Wadgaon, Maharashtra:Fuel Prices Likely To Decrease: అనూహ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతోపాటు విమాన ధరలు తగ్గముఖం పట్టనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్తోపాటు గ్యాస్, విమాన ఇంధన ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచింది. ధరల పోటుతో సతమతమవుతున్న ప్రజలకు భారీ ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్, విమాన ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉంది.
వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ సహా విమాన ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్న వేళ భగ్గుమన్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధన ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.10,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రివర్గంలో ఆమోదం పొందిన విషయాన్ని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. నిధులు కేటాయించడంతో విమానయాన సంస్థలకు భారీ ప్రయోజనం సమకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏటీఎఫ్ ధరల స్థిరీకరణకు మద్దతు అందించేందుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రూ.10,000 కోట్లకు మించని బడ్జెట్ మద్దతుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్ మద్దతు, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ద్వారా వడ్డీ లేని అడ్వాన్స్ల రూపంలో చెల్లించనుంది.
కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలు, ఎంఆర్ఓలు, ట్రావెల్ ఏజెన్సీలు, ఆతిథ్య , లాజిస్టిక్స్ రంగాలలో ఉపాధి రక్షణకు తోడ్పాటు లభిస్తుందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ వాతావరణంతో ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని 2.5 రెట్లు పెంచాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తుచేశారు. మార్చి 2026లో ఏవియేషన్ టర్బైన్ ఇంధనాన్ని లీటర్కు రూ.60.5, మే 2026లో లీటర్కు రూ.142కు చేరిందని వివరించారు.
తెలంగాణకు భారీ శుభవార్త
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు భారీ శుభవార్త వినిపించింది. జాతీయ రహదారి (ఎన్హెచ్)-63లోని ఆర్మూర్- జగిత్యాల- మంచిర్యాల రోడ్డును విస్తరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రహదారిని హ్యామ్ పద్ధతిలో అభివృద్ధి చేయనుంది. ఇక జాతీయ రహదారి (ఎన్హెచ్)-563లోని జగిత్యాల- కరీంనగర్ రోడ్డును బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్ఫర్ (టోల్) పద్ధతిలో 4 లేన్ల మేర విస్తరించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పనులు మూడు వర్క్ ప్యాకేజీల కింద మొత్తం 190.76 కిలోమీటర్ల పొడవుతో రూ.7597.16 కోట్ల వ్యయంతో చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
India Vs New Zealand 2026: న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమైన భారత జట్టు..కోహ్లీ, రోహిత్ శర్మతో 5 మ్యాచ్లు..ఎప్పుడంటే?
Hyderabad, Telangana:India Vs New Zealand 2026 Schedule: క్రికెట్ అభిమానులకు పండగే! టీమిండియా ఈ ఏడాది అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు న్యూజిలాండ్లో సుదీర్ఘంగా పర్యటించనుంది. దాదాపు 40 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఇరు జట్లు అన్ని ఫార్మాట్లలో తలపడనున్నాయి. ఇందులో భాగంగా 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ విధంగా కివీస్ పర్యటనలో టీమ్ఇండియా మొత్తంగా 12 మ్యాచ్ల్లో ఆడనుంది.
వందేళ్ల బంధం, చారిత్రాత్మక పర్యటన..
న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోని ఇంత సుదీర్ఘ పర్యటన జరగటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో ఏ దేశ జట్టు కూడా కివీస్ గడ్డపై ఇన్ని మ్యాచ్లు సుదీర్ఘ సిరీస్ ఆడిన సందర్భాలు లేవు. పైగా భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య నెలకొన్న వందేళ్ళ క్రీడా సంబంధాలను ఈ పర్యటన ఒక చారిత్రాత్మక ప్రత్యేకంగా నిలవనుంది.
భారత్ చివరిసారిగా 2019-20 సీజన్లో న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఆడింది. అయితే ఆ సిరీస్ తర్వాత కివీస్ జట్టు రెండుసార్లు భారత్లో పర్యటించింది. ముఖ్యంగా 2024-25 భారత పర్యటనలో కివిస్ జట్టు 3-0 తేడాతో టెస్ట్ సిరీస్ ను క్లీన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి బదులుగా తీర్చుకునేందుకు టీమ్ఇండియా రెడీ అవుతుంది. వన్డే సిరీస్లో భాగంగా టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 5 వన్డేలు ఆడనున్నారు.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ పూర్తి షెడ్యూల్
అక్టోబర్ 22న టీ20 సిరీస్ తో పర్యటన ప్రారంభమై నవంబర్ 4న వన్డే సిరీస్, నవంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ జరగనున్నాయి.
1) టీ20 సిరీస్ షెడ్యూల్ (5 మ్యాచ్లు)
మొదటి టీ20 మ్యాచ్: అక్టోబర్ 22 (క్రైస్ట్చర్చ్)
రెండో టీ20 మ్యాచ్ : అక్టోబర్ 24 (క్రైస్ట్చర్స్)
మూడో టీ20 మ్యాచ్: అక్టోబర్ 27 (వెల్లింగ్టన్)
నాలుగో టీ20 మ్యాచ్: అక్టోబర్ 30 (ఆక్లాండ్)
అయిదో టీ20 మ్యాచ్: నవంబర్ 1 (హామిల్టన్)
2) వన్డే సిరీస్ షెడ్యూల్ (5 మ్యాచ్లు)
తొలి వన్డే మ్యాచ్: నవంబర్ 4 (ఆక్లాండ్)
రెండో వన్డే మ్యాచ్: నవంబర్ 7 (వెల్లింగ్టన్)
మూడో వన్డే మ్యాచ్: నవంబర్ 10 (హామిల్టన్)
నాలుగో వన్డే మ్యాచ్: నవంబర్ 13 (మౌంట్ మాంగనూయి)
అయిదో వన్డే మ్యాచ్: నవంబర్ 15 (మౌంట్ మాంగనూయి)
3) టెస్ట్ సిరీస్ షెడ్యూల్ (2 మ్యాచ్లు)
మొదటి టెస్ట్ నవంబర్ 19 నుండి 23 వరకు వెల్లింగ్టన్ వేదికగా జరగనుంది.
రెండో టెస్ట్ నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్చర్చ్ వేదికగా జరగనుంది.
Also Read: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఇవి గమనించారా? ఆర్సీబీ Vs జీటీ మ్యాచ్లో 5 వింత ఘటనలు!
Also REad: వైభవ్ సూర్యవంశీకి తప్పిన ప్రమాదం..గుజరాత్ బౌలర్లపై మాజీ క్రికెటర్ పఠాన్ ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan Telangana: జనసేనాని పవన్ కళ్యాణ్పై గద్దర్ కూతురు ఘాటు వ్యాఖ్యలు..సీఎం చంద్రబాబు మద్దతు!
Hyderabad, Telangana:Pawan Kalyan Telangana News: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై ప్రజాగాయకుడు గద్దరు కుమార్తె వెన్నెల స్పందించారు. పవన్ నటుడిగా, తన తండ్రి అభిమానిగా గౌరవిస్తానని చెప్తూనే.. తెలంగాణ అస్తిత్వం, ఉద్యమ త్యాగాలను ఆమె బలంగా గుర్తు చేశారు.
"తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరు.. ఈరోజు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీరు" అంటూ ఈ నేలతో తమకున్న విడదీయరా నిబంధాన్ని వెన్నెల స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం కేవలం ఒక ప్రాంత ఉద్యమం కాదని అది కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ పోరాటమని ఆమె పేర్కొన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించినందుకు ఎంతో మందిని ఎన్కౌంటర్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంతోమంది తల్లుల తమ బిడ్డలను కోల్పోయి అసంఖ్యాకమైన త్యాగాలు చేయడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సహకారం ఏందని వెన్నెల గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూనే తెలంగాణ ఉద్యమ చరిత్రను అమరవీరుల బలిదానాలను తక్కువ చేసి చూడద్దని సందేశాన్ని వెన్నెల ఈ సందర్భంగా బలంగా వినిపించారు.
పవన్ కళ్యాణ్కు సీఎం చంద్రబాబు మద్దతు..
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై కొందరు నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు పూర్తి మద్దతుగా నిలిచారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభను పర్యటన అడ్డుకోవాలని చూడడం ఏమాత్రం సరికాదని ఆయన హితవు పలికారు.
ఇతర రాష్ట్రాల్లో తాను కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్టు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను కూడా తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారం చేసినట్లు అలాగే కర్ణాటకకు చెందిన ఉపముఖ్యమంత్రి శివకుమార్ కూడా ఇతర రాష్ట్రాల ప్రచారానికి వెళ్లారని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. "మనం రాష్ట్రాలుగా విడిపోయి ఉండొచ్చు కానీ, తెలుగువారికి మనం అంత కలిసి ఉండాలి. ఒకరు సహకరించుకుంటూ రెండు రాష్ట్రాల అభివృద్ధి చేసుకోవాల"ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
తెలంగాణ నేతలు విమర్శలను తిప్పికొడుతూనే చంద్రబాబు నాయుడు గత విషయాలను గుర్తు చేశారు. "గతంలో ఆంధ్రప్రదేశ్ లోను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీ అని అప్పట్లో వాళ్ళు చెప్పుకున్నారు కదా అని మరి ఇప్పుడు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ని పర్యటన ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నార"ని ఆయన ప్రశ్నించారు.
అమెరికా వంటి దేశాల్లో తెలుగు వారు సెనేటర్లుగా ఎదుగుతున్న తరుణంలో ప్రజలకు సేవ చేయాల్సిన వారు ప్రజల్లో వైషామ్యాలను రెచ్చగొట్టడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న విమర్శలను అర్దరహితమని రాజకీయాల కంటే తెలుగువారి ఐక్యత ముఖ్యమని చంద్రబాబు బలంగా గళం వినిపించారు.
Also Read: తెలంగాణ ఏర్పాటుపై పవన్ కల్యాణ్ కీలక పోస్ట్..2009 నాటి వీడియో బయటపెట్టిన జనసేనాని!
Also Read: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తెలంగాణ ప్రభుత్వం ఝలక్..బహిరంగ సభకు అనుమతి లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Rains: వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. తెలంగాణలోని 18 జిల్లాల్లో భారీ వర్షాలు
Baddipadaga, Telangana:Tomorrow Heavy Rains In Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. వేసవికాలంలో ఎండ వేడిమి.. ఉక్కపోతతో కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోని 18 జిల్లాల్లో నేటి సాయంత్రంతోపాటు రేపు గురువారం భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం ఉండనుందని తెలిపింది.
వర్షాలు పడే జిల్లాలు ఇవే
ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ. ఈ 18 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ అధికారులు 'ఆరెంజ్' అలర్ట్ ప్రకటించారు.
వర్షాకాలం ఈసారి త్వరగానే ప్రారంభమవుతున్నట్టు కనిపిస్తోంది. వేసవికాలం ముగింపునకు రాగా.. నైరుతి రుతుపవనాలు ఈసారి త్వరగా ముందుకు వస్తున్నాయి. రేపటిలోగా కేరళ, తమిళనాడు తీరాలను తాకనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాలపై వర్షం ప్రభావం ఉంటుందని తెలిపింది.
ఈ భారీ వర్షాలతోపాటు బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. మంగళవారం రాత్రి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాత్రంతా ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో ఆ ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. రాబోయే రెండు రోజులు మరిన్ని భారీ వర్షాలు పడనుండడంతో రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ప్రజలకు అధికారులు సూచనలు చేశారు.
నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరబిక్ మహాసముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలలోకి జూన్ 4వ తేదీన నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ద్రోణి 1 పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతం నుంచి ఉత్తర తమిళనాడు వరకు మధ్యప్రదేశ్ విదర్భ తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్రమట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడింది. దీని ప్రభావం ఎల్లుండి కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
వాతావరణ హెచ్చరికలు
==> ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు, 50 నుంచి 60 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
==> ఎల్లుండి శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు 40 నుంచి 50 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
