తెలుగు జర్నలిస్ట్ ఫోరం యూనియన్ కోసం అడహాక్ కమిటీ ఎన్నిక
Kadapa, Andhra Pradesh:కడప ప్రెస్ క్లబ్లో తెలుగు జర్నలిస్ట్ ఫోరం యూనియన్ ఏర్పాటు కోసం అడహాక్ కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లా కన్వీనర్గా ఉప్పు శ్రీకాంత్, కో-కన్వీనర్గా కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా విభాగానికి బండారు కిషోర్ కుమార్ కన్వీనర్గా, బి.రామచంద్ర కో-కన్వీనర్గా నియమితులయ్యారు. సుధీర్ కుమార్ సలహాదారుగా ఎంపికయ్యారు. యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు త్వరలో ప్రారంభం. జర్నలిస్టుల పిల్లలకు ఫీజులలో 50% రాయితీ కోసం కృషి చేస్తామని శ్రీకాంత్ తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Chandrababu: విశాఖ విశ్వనగరం అన్స్టాపబుల్.. ఎవరూ ఆపలేరు: చంద్రబాబు
Visakhapatnam, Andhra Pradesh:AU Centenary Celebrations: 'రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేను విశాఖ వచ్చా. వందేళ్ల ఏయూ పండుగ ఒక చరిత్ర. రేపు ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మరో చరిత్ర. ఆర్థిక సంస్కరణలు వచ్చాక 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారంటే అది విశాఖ గొప్పతనం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. గూగుల్ కంటే ముందుగానే ఏయూ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్ చేసిందని.. 57 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారంటే రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం అని ప్రకటించారు.
Also Read: Chandrababu: కేంద్రానికి లేఖ.. మొక్కజొన్న రైతులకు అండగా సీఎం చంద్రబాబు
విశాఖపట్టణంలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. 'విశాఖ విశ్వనగరం... గ్లోబల్ సిటీ. ఇది అన్స్టాపబుల్ ఎవరూ ఆపలేరు. వందేళ్ల చరిత్ర ఒక బ్రాండ్. రాష్ట్ర విభజన తర్వాత కేబినెట్ సమావేశం ఏయూలో నిర్వహించాం. అది ఏయూ ప్రత్యేకత' అని వివరించారు. '53 యూనివర్సిటీలు రాష్ట్రంలో ఉండగా.. అన్నింటికీ ఏయూ దిక్సూచి, లీడర్. స్వాతంత్ర్య పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చింది. జైపూర్ రాజ్ విక్రమ దేవ్, గజపతి రాజవంశం, పిఠాపురం రాజవంశం, బొబ్బిలి రాజులు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేశారు. వారిని మనం స్మరించుకోవడం ధర్మం, బాధ్యత' అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: KKR vs LSG Highlights: బంతి బంతికి మలుపు.. సూపర్ ఓవర్లో గట్టెక్కిన కలకత్తా నైట్రైడర్స్
'కట్టమంచి రామలింగారెడ్డి ఏయూకు మొదటి వీసీగా చేసి బలమైన పునాది వేశారు. ఆయన కూడా చిత్తూరు జిల్లా వాసే. నేనూ చిత్తూరు జిల్లా నుంచి వచ్చి వందేళ్ల ఉత్సవంలో పాల్గొన్నా. 2వ వీసీ సర్వేపల్లి రాధాకృష్ణ దేశ రాష్ట్రపతి అయ్యారు. ఈ రోజు మన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తండ్రి సర్వేపల్లి అభిమాని. ఈయనకు రాధాకృష్ణన్ అని పేరు పెట్టారు' అని చంద్రబాబు వివరించారు. 'కేవలం చదువు చెప్పడమే కాదు... తెలుగు వైభవానికి ఏయూ కృషి చేస్తోంది. విద్య, సాహిత్య రంగాల్లో ప్రముఖులను కళా ప్రపూర్ణ అవార్డుతో అభినందిస్తున్నారు' అని తెలిపారు.
'ఎంతోమంది నాయకులను తయారు చేసిన గడ్డ ఏయూ. రాజకీయ ఉద్దండులు ఇక్కడ నుంచి వచ్చారు. వెంకయ్య నాయుడు ఏయూ నుంచే వచ్చారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ప్రపంచంలోని చాలా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా చేస్తున్నారు' అని చంద్రబాబు తెలిపారు. 'న్యాక్ ఏ ప్లస్ ప్లస్ సాధిస్తోంది. ఎన్ఐఆర్ఎఫ్లో 41వ ర్యాంక్, పబ్లిక్ సెక్టార్లో 5వ ర్యాంక్లో ఉంది. యూనివర్సిటీలు నేషనల్ స్ట్రాటజిక్ అసెట్స్ వాటిని కాపాడుకోవాలి' అని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని యూనివర్సిటీల్లో విద్యాశాఖామంత్రి, గవర్నర్ ప్రతిభ ఉన్నవారిని వీసీలుగా ఎంపిక చేస్తున్నారు. రూ.64 కోట్ల విలువైన ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్వర్స్స్ ల్యాబ్ నెట్వర్క్ సెంటర్ ప్రారంభించుకున్నాం. రూ.112 కోట్లతో 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నాం. బాలురు, బాలికల హాస్టల్, కాన్వకేషన్ హాలు, వీసీ భవన్ కు శంకుస్థాపన చేసుకున్నాం' అని వివరించారు.
'యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీతో ఎంఓయూలు చేసుకున్నాం. నాకు 76 ఏళ్లయినా.. నేను 26 ఏళ్ల వ్యక్తిగానే ఆలోచిస్తా. ఒకప్పుడు ఐటీతో ప్రారంభించాం. నాలెడ్జ్ ఎకానమీకీ దోహదం చేశాం. నేడు డేటా సెంటర్, ఏఐ, క్వాంటం తీసుకొచ్చాం' అని చంద్రబాబు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kohli IPL 9000 Runs: మరో 11 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో ఒకేఒక్క మొనగాడు!
Hyderabad, Telangana:Kohli IPL 9000 Runs Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు విరాట్ కోహ్లీ మొదటి నుంచి వెన్నెముకగా నిలిచాడు. ఈ స్టార్ బ్యాటర్ ఇప్పుడు మరో అద్భుతమైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. నేడు అనగా ఏప్రిల్ 27న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరగనున్న మ్యాచ్లో.. ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు ఎవరూ సాధించని ఘనతను కోహ్లీ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతను నేడు జరిగే మ్యాచ్లో కేవలం 11 పరుగులు చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్మన్గా నిలుస్తాడు. ఇప్పటివరకు 274 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన కోహ్లీ, 39.95 సగటుతో 8,989 పరుగులు సాధించాడు. ఇందులో 8 అద్భుతమైన సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్ పరుగుల రేసులో ప్రస్తుతం కోహ్లీకి ఎవరూ సాటిలేరు. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ, 276 మ్యాచ్లలో 7,183 పరుగులు సాధించాడు. అంటే కోహ్లీ, రోహిత్ల మధ్య 1,800 పరుగులకు పైగా భారీగా గ్యాప్ ఉంది. ఈ లీగ్లో ఇప్పటివరకు ఏ ఇతర బ్యాట్స్మెన్ కూడా 8,000 పరుగుల మార్కును దాటకపోవడం కోహ్లీ ఆధిపత్యానికి నిదర్శనం.
ప్రస్తుతం జరుగుతున్న 2026 ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతను కేవలం 7 మ్యాచ్లలోనే 54.57 సగటుతో 328 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. అతను ఇప్పటికే తన బ్యాట్తో 36 ఫోర్లు, 12 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.
ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, నేటి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఇది విరాట్ కోహ్లీ పెరిగిన సొంత మైదానం. ఇక్కడి పిచ్, ఫీల్డ్లోని ప్రతి మూల గురించి అతనికి క్షుణ్ణంగా తెలుసు. గత సీజన్లో ఢిల్లీలో ఆర్సీబీ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేసిన కోహ్లీ, ఈరోజు కూడా జట్టుకు విజయాన్ని అందించేందుకు ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడతానని ధీమాతో ఉన్నాడు.
ఈ మ్యాచ్లో కోహ్లీ రికార్డుకు చేరువలో..
ఐపీఎల్లో 9,000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మన్గా నిలిచే అవకాశం. విరాట్ 274 మ్యాచ్లలో 8,989 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు (8) సాధించాడు. తమ అభిమాన ఆటగాడు ఈ అరుదైన మైలురాయిని చేరుకుని, జట్టును ప్లే-ఆఫ్స్కు చేర్చాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఆశిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chitra Pournami 2026: అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు అత్యంత శుభ ముహూర్తం..ఈ పవిత్ర ఘడియల్లో స్వామి దర్శనం అపూర్వం!
Tiruvannamalai, Tamil Nadu:Chitra Pournami 2026 Girivalam Timings: తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ రద్దీ సహజం. కానీ, ఈసారి రాబోతున్న చిత్ర పౌర్ణమి సందర్భంగా భక్తులు గిరివలయం చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు శుభ ముహుర్తాన్ని పండితులు ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయం వద్ద తగిన ఏర్పాట్లు చేస్తామని.. భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని దేవాలయ పాలకమండలి వెల్లడించింది. అయితే ఎప్పటి కంటే ఈసారి చిత్ర పౌర్ణమికి భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, చిత్ర పౌర్ణమి, కార్తీక దీపం సందర్భంగా కొండపై మహాదీపం వెలిగించే కార్యక్రమాల రోజుల్లో శ్రీ అరుణాచలేశ్వర ఆలయానికి భక్తులు పెద్దఎత్తుల దర్శనానికి రావడం ఆనవాయితీగా వస్తుంది. ఈయా ప్రత్యేక సందర్భాల్లో స్థానిక భక్తులే కాకుండా పక్క రాష్ట్రాలు, విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో తిరువణ్ణామలై ఆలయాన్ని తెల్లవారుజామున తెరుస్తారు. స్వామి వారి అభిషేకం, ఆరాధనలతో ప్రారంభమై.. ఆలయం చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని చుడుతూ భక్తులు తమ మొక్కులను చెల్లిస్తారు.
ఈ క్రమంలో తమిళనాట చిత్తరై మాస పౌర్ణమి మే నెల 1వ తేదీన శుక్రవారం రాబోతోంది. ఆ రోజున ఆలయాన్ని ఉదయాన్నే తెరిచి.. స్వామివారికి పాలు, పన్నీర్, పెరుగు, పంచామృతాలు, యాలకుల నీర, పవిత్ర జలం, తేనె వంటి వివిధ రకాల పూజా ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఈ విశిష్టాభిషేకం తర్వాత స్వామివారిని పుష్పాలతో అలంకరించి, ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
చిత్ర పౌర్ణమి నేపథ్యంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేసేందుకు శుభ ముహూర్తాల వివరాలను పండితులు ప్రకటించారు. ఏప్రిల్ 30 అనగా గురువారం రాత్రి 9.52 గంటలకు ప్రారంభమై.. ఆ తర్వాతి రోజు మే 1 అనగా శుక్రవారం రాత్రి 11.08 గంటల వరకు ఈ శుభకాలం నడుస్తోంది. కాబట్టి, భక్తులు ఈ సమయంలో గిరివలయాన్ని ప్రదక్షిణ చేస్తే మంచిది. అయితే రాబోయే పౌర్ణమికి భక్తులు 30 లక్షల మందికి పైగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని ఆలయ యంత్రాంగం అంచనా వేస్తోంది.
భక్తులు వేలాదిగా తరలిరానున్నానే అంచనా నేపథ్యంలో వారి సౌకర్యార్థ్యం ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పార్కింగ్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. దీంతో పాటు గిరి ప్రదక్షిణలో వైద్య బృందం, అగ్నిమాపక సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు భద్రతా విధుల్లో అందుబాటులో ఉంటారు. అలాగే జిల్లా యంత్రాంగం కూడా భక్తులకు కావాల్సిన ప్రాథమిక అవసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపడుతోంది.
ALso Read: Viral Potato Chips: ఆలూ చిప్స్ స్నాక్స్ లాగా తింటున్నారా? ఈ వైరల్ వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral Potato Chips: ఆలూ చిప్స్ స్నాక్స్ లాగా తింటున్నారా? ఈ వైరల్ వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు..
Hyderabad, Telangana:Viral Potato Chips News: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విచిత్రమైన వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా ఒక అసహ్యకరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే అందులో ఉన్న వ్యక్తి కేవలం అండర్వేర్ ధరించి..విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అది కూడా అతను ఆలూ చిప్స్ తయారీ చేసే ఓ గౌడౌన్లో ఈ వీడియోను రికార్డు చేశారు. స్ట్రీట్ ఫుడ్లో ఆలూ చిప్స్ తినే వారికి హెచ్చరిక అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ఎంతో మంది నెటిజన్లు, ఫుడ్ లవర్స్ నిర్ఘాంతపోయారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో పెద్ద దుమారం రేపుతోంది. ఈ వైరల్ క్లిప్ ఓ ఆలూ చిప్స్ ఫ్యాక్టరీకి చెందినది. ఇందులో బంగాళాదుంప చిప్స్ తయారీ విధానాన్ని చూసి నెటిజన్లకు వికారంగా అనిపిస్తోంది. పరిశుభ్రత ప్రమాణాలను ఉల్లంఘిస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి కేవలం అండర్ వేర్ ధరించి, ఓ పెద్ద ట్యాంకర్లో నిలబడ్డాడు. అయితే ఆ ట్యాంకర్ నీటిలో బంగాళదుంప చిప్స్ స్లైసెస్ కట్ చేసి ఉంచారు. ఆ ట్యాంక్ నిలబడి ఆ వ్యక్తి సిగరెట్ తాగుతూ, వాటిని కాళ్లతో తొక్కుతూ అపరిశుభ్రంగా ప్రవర్తిస్తున్నాడు. అందులోనూ ఆ పని చేస్తూనే ఆ వ్యక్తి కెమెరాను చూసిన నవ్వడం గమనార్హం.
ఈ క్లిప్ ఒక స్థానిక చిప్స్ ఫ్యాక్టరీ నుండి తీసినట్లుగా కనిపిస్తోంది, అక్కడ ఆలూ చిప్స్ను నూనెలో వేయించడానికి ముందు శుభ్రం చేస్తున్నారు. అయితే ఆ ట్యాంక్లోని నీరు ఎంత మురికిగా ఉందంటే, దానిని చూడగానే ప్రజలకు వాంతి వస్తున్నట్లుగా అనిపిస్తోంది.
@fact.flow_india అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ పనికిమాలిన చర్యలను నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. "దీనిని చూడగానే నాకు వాంతి వస్తున్నట్లుగా అనిపిస్తోంది" ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. అలాగే మరొకరు "బహుశా అందుకేనేమో ఈ చిప్స్ ఇంత ఉప్పగా ఉంటున్నాయి" అని వ్యంగ్యంగా అంటున్నారు. "హే, దయచేసి ఆ బ్రాండ్ పేరు కూడా వెల్లడించండి, అప్పుడు ప్రజలు తెలుసుకుని వాటిని కొనడం మానేస్తారు" అని వ్యాఖ్యానించారు. ఇలాంటి మురికి చర్యల పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Chandrababu: కేంద్రానికి లేఖ.. మొక్కజొన్న రైతులకు అండగా సీఎం చంద్రబాబు
Nuzendla, Andhra Pradesh:AP Maize Farmers: ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. మొక్కజొన్న రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరారు. మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని వర్తింప చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో మొక్కజొన్న రైతుల పరిస్థితిని లేఖలో చంద్రబాబు వివరించారు. వెంటనే స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Also Read: KKR vs LSG Highlights: బంతి బంతికి మలుపు.. సూపర్ ఓవర్లో గట్టెక్కిన కలకత్తా నైట్రైడర్స్
మొక్కజొన్న రైతుల సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్కు సోమవారం సీఎం చంద్రబాబు లేఖ రాశారు. 2025-26 రబీ సీజన్లో పండించిన మొక్క జొన్న పంటను కొనుగోలు చేయాలని లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. 'రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనగా ఉన్నారు. మార్కెట్లో మొక్కజొన్న ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1600 నుండి రూ.1700 మధ్య మాత్రమే ఉంది. కనీస మద్దతు ధర రూ.2400 కంటే చాలా తక్కువగా ప్రస్తుత మార్కెట్ ధర ఉంది' అని లేఖలో కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు.
Also Read: KTR: మూడు ఫీట్ల రేవంత్ రెడ్డి.. ఆరున్నర అడుగుల ఉత్తమ్తో తెలంగాణకు ఉపయోగం లేదు: కేటీఆర్
'రాష్ట్రంలో సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకా 14.26 లక్షల మెట్రిక్ టన్నుల పంట కోత దశలో ఉంది. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతులు నష్టపోతారు' అని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు పరిస్థితి వివరించారు. మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పీఎం ఆశా కింద నేరుగా రైతులకు ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలని.. ఆంధ్రప్రదేశ్ను ప్రత్యేకంగా పరిగణించి ధరల వ్యత్యాసంలో 100 శాతం నిధులను కేంద్రమే భరించాలని లేఖలో సీఎం చంద్రబాబు కోరారు. ఈ పథకాన్ని జూన్ 2026 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. నాఫెడ్, ఏపీ మార్క్ఫెడ్ సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు తక్షణమే అనుమతులివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
Also Read: CSK vs GT Highlights: బ్యాటింగ్లో చెన్నై ఘోర విఫలం.. సునాయాసంగా గుజరాత్ విజయం
విద్యుత్ శాఖపై సమీక్ష
అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై సోమవారం సీఎం చంద్రబాబు సమీక్షించారు. వేసవిలో విద్యుత్ సరఫరా, 2026-27 ఏడాదిలో పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను యూనిట్కు రూ.4.60కు తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పాదన పెంచడమే లక్ష్యమని ప్రకటించారు. ఈవీ వాహనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన, పీఎం సూర్య ఘర్, కుసుమ్ పథకాల అమలులో లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Dhoni Re-Entry News: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కు షాక్! ధోనీ చేసిన పెద్ద తప్పు ఇదే! ఇక జట్టులోకి 'తలా' కష్టమే!
Chennai, Tamil Nadu:MS Dhoni IPL 2026 Return: ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ముఖ్యమైన మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యి.. ఇప్పుడు ప్లేఆఫ్స్ చేరుకునే ఆశలు నెమ్మదిగా సన్నగిల్లుతున్నాయి. అయితే జట్టులో కీలకంగా ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి జట్టులోకి రాకపోవడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో రెండు వారాల పాటు దూరంగా ఉంటారని సమాచారం ఇవ్వగా.. ఇప్పుడు జట్టులోకి రావడానికి మరింత సమయాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న తుదిజట్టులో మార్పులకు ధోనీ అనుకూలంగా లేకపోవడమే అందుకు కారణంగా కనిపిస్తోంది.
ఈ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్లు ఆడింది. సీఎస్కే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 4 మ్యాచ్లు, ఇతర వేదికలలో 4 మ్యాచ్లు ఆడింది. చెపాక్ స్టేడియంలో ఆడిన 4 మ్యాచ్లలో CSK కేవలం 2 మాత్రమే గెలిచింది. ప్రత్యర్థి మైదానంలో CSK కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీంతో ఆడిన 8 మ్యాచ్లలో 3 గెలిచి, 5 ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 6 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది.
చెన్నై సూపర్ కింగ్స్ మంచి జట్టు కూర్పు ఉంటే, విజయం ఖాయం. సమస్య ఏమిటంటే.. వారు ఓడిపోయిన అన్ని మ్యాచ్లలోనూ సరైన జట్టుతో రాలేదని ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించారు. కానీ, ఆ తర్వాత మ్యాచ్ల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం గమనార్హం.
ఫాస్ట్ బౌలింగ్ దళంలో ముఖేష్ చౌదరి, అన్షుల్ కంబోజ్, ఓవర్టన్, గుర్జబ్నీత్ సింగ్ ఉండగా.. స్పిన్ బౌలింగ్లో నూర్ అహ్మద్, అఖేల్ హుస్సేన్ జట్టులో నిలిచారు. ఈ 6 మంది బౌలర్లతో మూడో స్థానంలో ఆయుష్ మాత్రే కి బదులుగా సర్ఫరాజ్ ఖాన్ ఆడనున్నాడు. కార్తీక్ శర్మ ఒక్కడే కాస్తంత సాధారణమైన ఎంపిక, అతని స్థానంలో ప్రశాంత్ వీర్ ఆడించాల్సింది.
ఐపీఎల్ వేదికగా నిన్న గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన తప్పులేంటో తెలుసుకుందాం. సర్ఫరాజ్ ఖాన్ను పక్కనపెట్టి ఊర్విల్ పటేల్ను మూడో స్థానంలో, కార్తిక్ శర్మను ఆ తర్వాత ఆడించడం చెన్నై సూపర్ కింగ్స్ చేసిన మొదటి తప్పు. పవర్ప్లేలో వికెట్లు త్వరత్వరగా పడిపోవడంతో, 4వ ఓవర్లో ఒక కీలక ఆటగాడిని బరిలోకి దించడం రెండవ పొరపాటు అయింది. దీని కారణంగా, ముఖేష్ చౌదరిని బౌలింగ్కు తీసుకురాలేకపోయారు. ఒకవేళ ముఖేష్ చౌదరి గనుక బరిలోకి దిగి ఉంటే, అతను పవర్ప్లేలో గుజరాత్ జట్టు టాప్ ఆర్డర్లోని రెండు వికెట్లు తీసి ఉండేవాడు. నిన్న అన్షుల్ కంబోజ్ కూడా బాగా బౌలింగ్ చేశాడన్నది కూడా గమనించాల్సిన విషయం.
సరైన జట్టు కూర్పును ఎంచుకుంటేనే సీఎస్కే తదుపరి మ్యాచ్లలో గెలవకపోవచ్చు. మిగిలిన 6 మ్యాచ్లలోనూ గెలిస్తేనే వారికి ప్లే-ఆఫ్ రౌండ్కు వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల, ప్రస్తుత తుది జట్టులో ఊర్విల్ పటేల్ను మూడో స్థానంలో ఆడించవచ్చు. లేకపోతే, సర్ఫరాజ్ ఖాన్ను కూడా ఆడించవచ్చు.
ధోనీ వస్తాడా?
కార్తిక్ శర్మ స్థానంలో ప్రశాంత్ వీర్ చక్కగా సరిపోతాడు. ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే, ధోనీ ఖచ్చితంగా తుది జట్టులో ఉండాలి. ధోనీ గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్గా ఉన్నాడని వార్తలు సూచిస్తున్నాయి. జట్టు కూర్పును చెడగొట్టకూడదనే ఉద్దేశ్యంతో ధోనీ మ్యాచ్లలో ఆడలేదని, అలాగే సీఎస్కే వరుస గెలుపు ఓటములను బట్టి అతను కేవలం ఒకటి రెండు మ్యాచ్లు మాత్రమే ఆడతాడని వార్తలు వస్తున్నాయి. అయితే, ధోనీ చేస్తున్నది తప్పు.
ధోనీ చేస్తున్నది తప్పు...ఎందుకు?
ధోనీ కచ్చితంగా లోయర్ ఆర్డర్లో గొప్ప ప్రభావాన్ని చూపాడు. ఒకవేళ ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లలో ధోనీ ఉండి ఉంటే, వారు ఖచ్చితంగా లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించేవారు. కానీ అప్పుడు ధోనీ ఫిట్గా లేడు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. రుత్రాజ్ గైక్వాడ్, ఇతర సీఎస్కే ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం కలిగించేందుకు.. సీనియర్ ఆటగాడైన ధోనీని తదుపరి మ్యాచ్లో నేరుగా తుది జట్టులోకి తీసుకోవాలి. మూడో స్థానంలో ఊర్విల్ పటేలా లేదా సర్ఫరాజ్ ఖాన్ను తీసుకునే నిర్ణయాన్ని CSK ఖరారు చేయాలి. బౌలింగ్ లైనప్లో ముఖేష్ చౌదరి లేదా ఆకాష్ మద్వాల్కు చోటు కల్పించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mumbai Indians Captain: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ?! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పోతుందా? అంబానీ నిర్ణయం ఏంటి?
Mumbai, Maharashtra:Mumbai Indians Captain News: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టులో ప్రస్తుతం కెప్టెన్సీ విషయం మరోసారి పెద్ద దుమారాన్ని రేపింది. 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో.. ముంబై యాజమాన్యం ఆకస్మికంగా ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను తొలగించి, గుజరాత్ జట్టు నుండి ట్రేడ్ ద్వారా వచ్చిన హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్గా నియమించింది. ఈ నిర్ణయాన్ని రోహిత్ శర్మ అభిమానులు, ముంబై ఇండియన్స్ అభిమానులు తీవ్రంగా విమర్శించారు. హార్దిక్ పాండ్యా మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతి స్టేడియంలోనూ అభిమానులు అతడిని హేళన చేశారు. ప్రస్తుతం 2026 ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతుండటంతో, కెప్టెన్సీ మార్పుపై వదంతులు సోషల్ మీడియాలో మరోసారి దావానలంలా వ్యాపిస్తున్నాయి.
రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్ అవుతాడా?
"ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యాను ఆకస్మికంగా కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ బాధ్యతను మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించబోతోంది" అని ఇంటర్నెట్లో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది క్రీడా వ్యాఖ్యాతలు కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే, ఈ వార్తలలోని నిజమెంత అని ఆరా తీయగా.. "ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించడానికి ముంబై ఇండియన్స్ యాజమాన్యం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని వెల్లడైంది.
ఈ వదంతులకు కారణం ఏమిటి?
ముంబై ఇండియన్స్ జట్టు అకస్మాత్తుగా రావడానికి ప్రధాన కారణం జట్టులో నెలకొన్న అసంతృప్తి. హార్దిక్ పాండ్యా కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, అతని కొన్ని నిర్ణయాలు తోటి సీనియర్ ఆటగాళ్లకు, జట్టు యాజమాన్యానికి సంతృప్తినివ్వలేదని అంటున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడని, జట్టులోని రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లను గౌరవించడం లేదని కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనిని గమనించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం, హార్దిక్ పాండ్యాను వ్యక్తిగతంగా పిలిచి, సీనియర్ ఆటగాళ్లకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలని, లేకపోతే అతడిని కెప్టెన్సీ నుండి తొలగిస్తామని గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. ఈ హెచ్చరికలే హార్దిక్ను తొలగించారనే పుకార్లుగా మారాయి.
ముంబై ఇండియన్స్ యాజమాన్యం విషయానికొస్తే, వారు హార్దిక్ పాండ్యాను రాబోయే మూడేళ్లపాటు కెప్టెన్గా కొనసాగించాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో జట్టులోకి తీసుకువచ్చి, అతనికి కోట్లాది రూపాయలు చెల్లించారు. అందువల్ల, కొన్ని మ్యాచ్లలో చేసిన కొన్ని పొరపాట్లకు గానీ, సోషల్ మీడియాలో విమర్శలకు గానీ వారు అతడిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించరు. ఈ సీజన్ మొత్తం అతనికి పూర్తి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. సీజన్ ముగింపులో జట్టు ప్రదర్శనను, అతని నాయకత్వ లక్షణాలను మూల్యాంకనం చేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటారని ముంబై వర్గాలు చెబుతున్నాయి.
రోహిత్ శర్మ వైఖరి ఏమిటి?
రోహిత్ శర్మ విషయానికొస్తే, అతను ఈ సమస్యలను అధిగమించాడు. ఒక సాధారణ ఆటగాడిగా, అతను ముంబై జట్టుకు తన వంద శాతం సహకారాన్ని అందించడంపై పూర్తిగా దృష్టి సారించాడు. "జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు. కొన్ని నిర్ణయాలను అంగీకరించాల్సి ఉంటుంది" అని రోహిత్ శర్మ గతంలో తన అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం. అందువల్ల, ఇంటర్నెట్లో ప్రచారంలో ఉన్న వదంతుల ప్రకారం ముంబై ఇండియన్స్ జట్టులో ఆకస్మిక కెప్టెన్సీ మార్పు ఏమీ జరగలేదన్నది ప్రస్తుత వాస్తవం!
ప్రస్తుతం ముంబై జట్టు ఎలా ఉంటందే?
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్, తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, మిచెల్ సాన్ట్నర్, షెర్పైన్ రూథర్ఫోర్డ్, విల్ జాక్వెస్, మయాంక్ మార్కండే, దీపక్ చాహర్, నమన్ కజాన్ అల్లా, నమన్ కజాన్ అల్లా, ర్యాన్ర్ మిన్షెల్ టన్, ర్యాన్ర్ మిన్షెల్ డయర్, క్వింటన్ డి కాక్. రాజ్యవర్ధన్ హంగర్కేకర్, రాజ్బావ, అశ్వనీ కుమార్, డానిష్ మలేవార్, మహ్మద్ ఇజార్, అథర్వ అంగోలేకర్, మయాంక్ రావత్, రఘు శర్మ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KKR vs LSG Highlights: బంతి బంతికి మలుపు.. సూపర్ ఓవర్లో గట్టెక్కిన కలకత్తా నైట్రైడర్స్
Ardonamau, Uttar Pradesh:KKR vs LSG Super Over: ఐపీఎల్ 2026లో ఆదివారం రెండు స్వల్ప స్కోర్ మ్యాచ్లు జరిగినా సాయంత్రం జరిగిన కలకత్తా నైట్రైడర్స్, లక్నో సూపర్ జియాంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం ప్రేక్షకులను నేల మీద ఉండేలా చేయలేదు. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్లో.. బంతి బంతికి ఫలితం తారుమారుతున్న వేళ కలకత్తా నైట్రైడర్స్ అద్భుతం చేసింది. ఈ సీజన్లో సూపర్ ఓవర్కు మరలిన ఈ మ్యాచ్లో కలకత్తా అద్భుత విజయం సొంతం చేసుకుంది. తక్కువ స్కోర్ను బాదినా కాపాడుకునేందుకు కలకత్తా.. గెలిచేందుకు లక్నో తీవ్రంగా పోరాడాయి.
సూపర్ ఓవర్ కొనసాగింది ఇలా..
లక్నో సూపర్ జియాంట్స్
తొలి బంతి: నికోలస్ పూరన్ ఔట్
రెండో బంతి: ఒక పరుగు
మూడో బంతి: మర్క్రమ్ ఔట్
బౌలింగ్: సునీల్ నరైన్
లక్నో సూపర్ జియాంట్స్
తొలి బంతికే రింకూసింగ్ నాలుగు పరుగులు చేసి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు
బౌలింగ్: ప్రిన్స్ యాదవ్
వరుస వైఫల్యాలతో బాధపడుతున్న లక్నో సూపర్ జియాంట్స్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు.. మిడిలార్డర్ విఫలమై జట్టు పరువు పోతున్న సమయంలో రింకూ సింగ్ వచ్చాడు. అందరూ ఔటయిన వేళ మైదానంలో నిలబడి జట్టు పరువు కాపాడాడు. 51 బంతుల్లో 83 పరుగులు చేసిన రింకూ సింగ్.. 7 ఫోర్లు, ఐదు సిక్సర్లు నమోదు చేశాడు. కెప్టెన్ అజింక్యా రహనే 10 ఓవర్లకు ఔటవగా.. టిమ్ సెఫర్ట్ డకౌట్ అయ్యాడు. అంగ్క్రిష్ రఘువంశీ 9 పరుగులు చేయగా.. కామెరూన్ గ్రీన్ అద్భుతంగా ఆడి 34 పరుగులు చేశాడు. రమణ్దీప్, సునీల్ నరైన్ వరుసగా 6,4 పరుగులు చేశారు. కలకత్తాకు లక్నో సూపర్ జియాంట్స్ బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి స్కోర్ బోర్డును భారీగా కట్టడి చేశారు. మొహిసిన్ ఖాన్ నిప్పులు చెరిగేలా బంతులు వేసి ఈ సీజన్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్లు వేసిన మొహిసిన్ 23 పరుగులు మాత్రమే ఇచ్చి బ్యాటర్లపై ప్రతాపం చూపించాడు. జార్జ్ లిండె ఒక వికెట్ పడగొట్టాడు.
KTR: మూడు ఫీట్ల రేవంత్ రెడ్డి.. ఆరున్నర అడుగుల ఉత్తమ్తో తెలంగాణకు ఉపయోగం లేదు: కేటీఆర్
Huzur Nagar, Telangana:Pillutla Raghu Joins In BRS Party: 'మూడు ఫీట్లు ఉన్నోడు కూడా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై మాట్లాడుతున్నాడు' అని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా.. ఎవరు ఏం చేసినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని ప్రకటించారు. ఏవో చిన్న తప్పిదాలతో నల్గొండ జిల్లాలో 11 సీట్లు కోల్పోయాం. కానీ గెలిచిన కాంగ్రెస్ ఏం చేస్తోంది? అని నిలదీశారు. 'కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు కమల్ హాసన్ను మించిన నటులు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు ఏమయ్యాయి?' అని ప్రశ్నించారు.
Also Read: BRS Party Anniversary: రేపు తెలంగాణలో పల్లె పల్లెనా గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్ పిలుపు
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు పిల్లుట్ల రఘు గులాబీ కండువా కప్పుకున్నారు. అతడికి గులాబీ కండువా కప్పి సాదరంగా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం పలికిన అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. '3 నెలల్లో పిల్లలు పుడతారా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా.. 30 నెలలైనా పిల్లలు పుట్టకుంటే ఏమనాలో చెప్పు అని? అని ప్రశ్నించారు. స్కైరూట్ మనం తెచ్చిన కంపెనీ.. దానికి రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Also Read: CSK vs GT Highlights: బ్యాటింగ్లో చెన్నై ఘోర విఫలం.. సునాయాసంగా గుజరాత్ విజయం
'ఆరున్నర అడుగులు ఉన్న ఉత్తమ్ కుమార్తో ఏమీ ఉపయోగం లేదు. 2014కు పూర్వం కాంగ్రెస్ నల్గొండకు ఏం చేసింది? మూసీని దుర్గంధంతో నింపింది. ఫ్లోరోసిస్తో నల్గొండ వెన్నుపూస విరిచేసింది' అని నాటి కాంగ్రెస్ పాపాలను మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. రాంరెడ్డి అనే వ్యక్తి 56 బోర్లు వేస్తే నీరు రాని పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉండేదని గుర్తుచేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వచ్చాక.. రూ.1,800 కోట్లతో యాదాద్రి, మెడికల్ కాలేజీలు, మిర్యాలగూడలో రూ.35 వేల కోట్లతో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్, మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ను దూరం చేశారు' అని నల్లగొండ జిల్లాకు కేసీఆర్ పాలనలో చేసిన ఘనతలను కేటీఆర్ వెల్లడించారు.
'కోదాడలో చివరి మడికి నీరు వస్తుందంటే అది కాళేశ్వరం వల్లే. రేవంత్ రూ.3 లక్షల 70 వేల కోట్ల అప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఢిల్లీకి మూటలు మోయడం తప్ప.. ఏం చేసిండు మరి?' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 'రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు దాన వీర శూర కర్ణ. ఎన్నికలు అయ్యాక కుంభ కర్ణ' అని ఎద్దేవా చేశారు. 'వచ్చే ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు.. కేసీఆర్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించే ఎన్నికలు' అని కేటీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు జలదృశ్యంలో మొదలైన బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం 25 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తుచేశారు. 2023 సాధారణ ఎన్నికల కంటే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలం పెరిగింది అని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
CSK vs GT Highlights: బ్యాటింగ్లో చెన్నై ఘోర విఫలం.. సునాయసంగా గుజరాత్ విజయం
Chennai, Tamil Nadu:Gujarat Titans Won By 8 Wickets: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అతి తక్కువ స్కోర్ నమోదు చేయగా.. బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో సొంత గడ్డపై మరో పరాభవాన్ని ఎదుర్కొంది. తక్కువ స్కోర్ మ్యాచ్ను గుజరాత్ టైటాన్స్ సునాయాసంగా విజయం సాధించింది. సాయి సుదర్శన్ మరోసారి బ్యాట్ ఝుళిపించడంతో గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో తడబడుతున్న ఇరు జట్లు ఒకరిపై ఒకరు పైచేయి సాధించారు. ఈ మ్యాచ్కు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
BRS Party Anniversary: రేపు తెలంగాణలో పల్లె పల్లెనా గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్ పిలుపు
Baddipadaga, Telangana:BRS Party Anniversary Celebrations: పద్నాలుగేళ్లు పోరాటం.. పదేళ్లు అధికారం.. రెండున్నరేళ్లు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రేపు 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నది. పార్టీ ఆవిర్భావ దినం కావడంతో రేపు అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని గులాబీ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి గ్రామం పట్టణం నియోజకవర్గం జిల్లా కేంద్రాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని కోరారు.
Also Read: Sunrisers Hyderabad: వైభవ్ సెంచరీ వృథా.. సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో విజయం
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో ఆదివారం కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఏప్రిల్ 27వ తేదీన హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతుందని తెలిపారు. ఇటీవల జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించిన నేపథ్యంలో ప్రస్తుత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి ప్లీనరీని కేవలం రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం చేసినట్లు వివరణ ఇచ్చారు.
Also Read: RCB vs GT: బెంగళూరు దూకుడుకు తేలిపోయిన సాయి సుదర్శన్ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ మరో ఓటమి
పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లకు మాత్రమే ఆహ్వానం ఉందని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. తెలంగాణ భవన్లో పరిమిత సంఖ్యలోనే ప్రవేశం ఉంటుందని.. ఆహ్వానం ఉన్న వారు మాత్రమే హాజరుకావాలని, మిగిలిన నాయకులు, కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామం, మండలం, పట్టణం, జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉదయాన్నే స్థానిక ప్రాంతాల్లో జెండా పండుగ ముగించుకుని మధ్యాహ్నం 1:30 గంటల వరకు హైదరాబాద్ చేరుకోవాలని దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులకు సూచించారు. హైదరాబాద్లో జరగనున్న పార్టీ ఆవిర్భావ సమావేశంలో ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. కుదిరితే విలేకరుల సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Petrol And Diesel Crisis: పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై ముంబై నుంచే సీఎం చంద్రబాబు రివ్యూ
Mumbai, Maharashtra:AP Petrol And Diesel Crisis: పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు ఎగబడుతున్నారు. పెట్రోల్, డీజిల కొరత కారణంగా ప్రజలు భారీగా చేరుకుని బంక్లపై దాడి చేసే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి తీవ్రంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ముంబై పర్యటనలో ఉన్న చంద్రబాబు ఏపీలోని పరిస్థితిపై సమీక్ష చేశారు.
Also Read: Curry Point: రూ.10కి సాంబార్ ఇవ్వరా? అంటూ కర్రీ పాయింట్పై తల్వార్తో దాడి
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముంబై నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ముంబై నుంచి ఉదయం అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తోపాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సరఫరా ఎలా ఉందనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Also Read: Sunrisers Hyderabad: వైభవ్ సెంచరీ వృథా.. సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో విజయం
రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా.. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. సరఫరా గతం కంటే పెరిగినా కొరత ఏర్పడిందనే భయంతో వినియోగదారులు కొనేందుకు ఎగబడడంతో అకస్మాత్తుగా డిమాండ్ పెరిగిందని అధికారులు తెలిపారు. పెట్రోలియం సంస్థలు శనివారం రోజున 10,345 కి.లీ పెట్రోల్, 14,156 కి.లీ డీజిల్ను డీలర్లకు సరఫరా చేసినట్టు వివరించారు. కొరత ఏర్పడిందనే ఆందోళనతో పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు భారీగా పెరిగాయని అధికారులు తెలిపారు.
Also Read: Drug Overdose: పెళ్లికి ముందే కాబోయే భార్యతో 'కార్యం'.. ఆత్రుతలో వయగ్రా ఎక్కువ తీసుకుని మరణం
సాధారణ రోజుల్లో రోజుకు సుమారు 6330 కిలో లీటర్ల పెట్రోల్ విక్రయాలు ఉంటే.. శనివారం రోజున 8,489 కిలో లీటర్ల అమ్మకాలు జరిగాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. డీజిల్ విషయంలో కూడా సాధారణ అమ్మకాల కంటే శనివారం రోజున ఎక్కువ జరిగాయని తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 9,048 కిలో లీటర్ల డిజీల్ అమ్ముతారని కానీ శనివారం రోజున 10,556 కిలో లీటర్ల డీజిల్ విక్రయించారని వెల్లడించారు.
సాధారణ స్థాయిని మించి అమ్మకాలు జరగడంతో కొన్ని బంకుల్లో నిల్వలు అయిపోతున్నాయని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా సరఫరా పెరిగినా వినియోగదారులు కొన్ని చోట్ల బారులు తీరి పెట్రోల్, డీజిల్ కోసం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆక్వా రంగంలో డ్రమ్లలో కొనుగోళ్లు చేస్తున్నారని.. వారికి పెట్రో ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందని అధికారులు వెల్లడించారు. దీనికి పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు, ఫిషరీష్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై తనకు నివేదిక ఇవ్వాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రం వచ్చిన అనంతరం తిరిగి పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష చేసి.. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చర్యలు తీసుకోనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Python Vs Mongoose Video: భారీ కొండచిలువపై ముంగిసల సర్జికల్ స్ట్రైక్.. చూస్తే ఒళ్లు గగుర్పొడాల్సిందే! వీడియో..
Hyderabad, Telangana:Giant Python Video Watch Here: ప్రకృతిలో మనుగడ కోసం జరిగే పోరాటం ఒక్కొక్కసారి ఊహకందని విధంగా ఉంటుందని మనందరికీ తెలుసు.. సాధారణంగా పాములు చూడగానే ముంగిస దాడి చేయడం మనం తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలో చూశాం.. కానీ ఒక భారీ కొండచిలువను ముంగిసలు గుంపు వేటాడి.. పీక్కుతిన్న అరుదైన ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అంత పెద్ద కొండచిలువ పామును చిన్న ముంగిసల దండు వేటాడిన తీరును చూసి కామెంట్లు కూడా చేస్తున్నారు.
సాధారణంగా కొండచిలువ తన భారీ శరీరంతో ఎంతటి జంతువునైనా సులభంగా మింగేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిందని భావించవచ్చు. అడవి మార్గంలో వెళ్తున్న ఒక భారీ కొండచిలువపై ఒక్కసారిగా ముంగిసల గుంపు దాడికి దిగింది.. ఒకటో రెండో కాదు ఏకంగా పదుల సంఖ్యలో ముంగిసలు ఏకమై ఆ పామును చుట్టుముత్తాయి.. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ కొండచిలువ తన భారీ శరీరంతో ఎదురు దాడికి ప్రయత్నించినప్పటికీ.. ముంగిసల వేగం ముందు అది నిల్వ లేకపోయింది..
ఈ వీడియోలో అత్యంత భయంకరమైన దృశ్యం ఏంటంటే.. ముంగిసలు గుంపుగా చేరి పాము శరీరాన్ని పదునైన పళ్ళతో కొరుకుతూ మాంసాన్ని పీక్కు తినడం.. కొండచిలువ ఎంత ప్రయత్నించినా.. ఆ గుంపు నుంచి తప్పించుకోలేకపోయింది.. ముంగిసలు వ్యూహాత్మకంగా పాము తోక వైపు నుంచి తల వైపు ఒకేసారి దాడి చేస్తూ దానిని నిస్సహాయ స్థితిలో పడేసాయి. ముఖ్యంగా తోక భాగంలో అత్యధికంగా ముంగిసలు దాడి చేయడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ ముంగిసలు ఏమాత్రం వదలకుండా దానిని దాడి చేస్తున్న తీరును చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
Read more: Monkey Video: ముస్లిం వివాహంలో వింత ఘటన.. తోడు పెళ్లికొడుకులా మారిన కోతి.. వీడియో!
ఐకమత్యమే మహాబలం అనడానికి ఈ వీడియో నిదర్శనం.. అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అయితే, ఈ ఘటన ఏదో అడవికి సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు తమ స్మార్ట్ఫోన్స్లో ఈ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటినుంచి ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. సాధారణంగా పాములు ముంగిసలతో పోరాడడం చాలా కష్టం.. అయినప్పటికీ ఈ వీడియోలో కొండచిలువ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వాటితో పోరాడడం చూసి.. సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Read more: Monkey Video: ముస్లిం వివాహంలో వింత ఘటన.. తోడు పెళ్లికొడుకులా మారిన కోతి.. వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Curry Point: రూ.10కి సాంబార్ ఇవ్వరా? అంటూ కర్రీ పాయింట్పై తల్వార్తో దాడి
Miyapur, Telangana:Curry Point Attack: సాయంత్రం పూట హైదరాబాద్లోని ఓ కర్రీ పాయింట్లో కస్టమర్ వచ్చాడు. అక్కడి సిబ్బందిని రూ.10కు కర్రీ ఇవ్వాలని కోరాడు. పది రూపాయలకు కర్రీ ఇవ్వమని తేల్చి చెప్పారు. ఈ విషయంలో సిబ్బందితో వాగ్వాదం చేసిన కస్టమర్.. కొద్దిసేపటికి తల్వార్ తీసుకువచ్చి దాడికి పాల్పడ్డాడు. విచక్షణారహితంగా దాడికి పాల్పడడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ శివారులోని అమీన్పూర్లో చోటుచేసుకుంది.
Also Read: Sunrisers Hyderabad: వైభవ్ సెంచరీ వృథా.. సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో విజయం
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఓం శ్రీ సాయి కర్రీ పాయింట్ ఉంది. అదే ప్రాంతంలోని అంబేద్కర్ కాలనీ కి చెందిన జీవ రత్నం శనివారం రాత్రి వద్ద కర్రీ పాయింట్కు వచ్చాడు. 10 రూపాయలకు సాంబార్ ఇవ్వాలని అడిగాడు. పది రూపాయలకు ఏ కర్రీ ఇవ్వలేమని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతలో బయటకు వెళ్లి వచ్చి తల్వార్ కర్రీ పాయింట్కు వచ్చి దాడి చేశాడు.
Also Read: Drug Overdose: పెళ్లికి ముందే కాబోయే భార్యతో 'కార్యం'.. ఆత్రుతలో వయగ్రా ఎక్కువ తీసుకుని మరణం
దుకాణం షట్టర్ మూసివేసి మరి కర్రీ పాయింట్లో ఉన్న వారిపై తల్వార్తో విచక్షణారహితంగా దాడి చేశాడు. అతడి దాడిలో కర్రీ పాయింట్లో పనిచేసే ఉదయ్ (27) తీవ్ర గాయమైంది. దీంతో కర్రీ పాయింట్లోని సిబ్బంది ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అతడు చికిత్స పొందుతున్నాడు. కర్రీ పాయింట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
24 గంటల్లోనే పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు నివాసితురాలు అఖిల హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఈనెల 23వ తేదీన రాత్రి కేపీహెచ్బీలోని నెక్సస్ మాల్లో తన బ్రేస్లెట్ పోగొట్టుకున్నారు. మరుసటి రోజు మధ్యాహ్నం కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు గంటల్లోనే బ్రేస్లెట్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్రేసలెట్ను అఖిలకు అందజేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Giant Python Video: నడిరోడ్డుపై 15 అడుగుల కొండచిలువ.. వామ్మో ఎలా ఉందో చూడండి..
Hyderabad, Telangana:Giant Python On Highway Viral Video Watch Here: ఆ రోడ్డు ఎప్పుడు వాహనాలతో రద్దీగా ఉంటుంది.. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునే క్రమంలో వేగంగా దూసుకెళ్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి.. అక్కడి పరిస్థితి చూసి డ్రైవర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.. కారణం.. రోడ్డుపై ఏదో పెద్ద ప్రమాదం జరిగిందని కాదు.. ఒక భారీ కొండచిలువ ఎలాంటి భయం లేకుండా రోడ్డు దాటుతుండటమే.. అవును దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
నడి రోడ్డుపై దాదాపు 12 నుంచి 15 అడుగుల పొడవు ఉన్న ఒక భారీ కొండచిలువ అకస్మాత్తుగా ప్రత్యక్షమైంది.. పక్కనే ఉన్న అడవుల నుంచి రోడ్డుపైకి వచ్చి హంగామా సృష్టించింది. ఏమాత్రం తొందరపడకుండా ఆ ప్రమాదకరమైన పాము హైవే దాటడం మొదలుపెట్టింది. దీనిని గమనించిన వాహనదారులు ఒక్కసారిగా షాక్కు గురైపోయారు. కొందరు భయంతో కార్ల అద్దాలు మూసుకగా.. వరి కొందరు ఆశ్చర్యంతో తమ వాహనాలను నిలిపివేసి ఈ దృశ్యాలను తమ స్మార్ట్ ఫోన్స్ లో చిత్రీకరించారు..
ఈ భారీ పైథాన్ రోడ్డుకు అడ్డంగా పడుకోవడంతో రెండు వైపులా వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. కొండచిలువను చూసేందుకు జనం ఎగబడడంతో పాటు ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడంతో కొన్ని మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. సాధారణంగా అడవి ప్రాంతాల్లో కనిపించే ఇలాంటి జీవి.. ఇరా జనాభాసాల మధ్య ఉండే హైవే పైకి రావడం స్థానికంగా ఎంతో కలకలం రేపింది..
Read more: Monkey Video: ముస్లిం వివాహంలో వింత ఘటన.. తోడు పెళ్లికొడుకులా మారిన కోతి.. వీడియో!
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలు స్పందిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఈ వీడియో చూసి కామెంట్లలో స్పందిస్తూ వస్తున్నారు. సాధారణంగా ఇలాంటి పెద్ద పాములు రోడ్లమీదకి రావడం సర్వసాధారణం కాదని కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇక మరికొంతమంది రద్దీగా ఉండే రోడ్లపై ఇలాంటి ప్రమాదకరమైన జీవులు రావడం ఆందోళనకరమని.. ప్రకృతిని మానవాళి నాశనం చేయడం కారణంగానే ఇలాంటి జీవులు రోడ్లపైకి వస్తున్నాయని కామెంట్లలో చెబుతూ వస్తున్నారు. అయితే అక్కడున్న స్థానికులు వెంటనే అడవిశాఖ సిబ్బందికి కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
Read more: Monkey Video: ముస్లిం వివాహంలో వింత ఘటన.. తోడు పెళ్లికొడుకులా మారిన కోతి.. వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
