సైదాపూర్ లో గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన బీర్ల ఐలయ్య
Yadagirigutta, Telangana:యాదగిరిగుట్ట మండలంలోని సైదాపూర్ చెరువులో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య ఆదివారం గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి జలాలను సైదాపూర్ గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఐలయ్యను శాలువాలతో ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
విశాఖ బోటు మత్య్సకారులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ఫ్లాప్: వైఎస్ జగన్
Visakhapatnam, Andhra Pradesh:Visakhapatnam: విశాఖపట్టణం బోటు ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురి కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మత్య్సకారుల కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబుకు కోరారు. విశాఖ బోటు గల్లంతుపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని.. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని తెలిపారు.
జూలై 4వ తేదీన జరిగిన బోటు బోల్తా ప్రమాదంలో గల్లంతైన బాధిత కుటుంబాలను విశాఖపట్టణంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. కుటుంబాలకు ధైర్యం కల్పించిన అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వం స్పందన లేకుంటే మన ప్రభుత్వం వచ్చిన నెలలోపు రూ.కోటి ఆర్థిక సహాయం కల్పిస్తాం. జూలై 5వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు కనీసం నావికాదళం రక్షణ కల్పించలేదు' అని ఆరోపించారు. '114 మంది బాధితులకు మత్స్యకారులు మద్దతు ఇవ్వలేదు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ప్రకటన చేయకపోవడం, ఆర్థిక సహాయం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. కర్రి చిన్న మత్స్యకారుడు 16 గంటల పాటు సముద్రంలో యుద్ధం చేసి ప్రాణాలు కాపాడుకున్నాడని.. ప్రభుత్వం జరిగిన ఘటనను శ్రద్ధగా పని చేసి ఉంటే వారి ఆచూకీ తెలిసేది అని పేర్కొన్నారు.
'జూలై 4వ తేదీ 2.30 నిమిషాలకు సమాచారం అందించిన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఘటన ముందు ఇంటికి వస్తామని సమాచారం చిన్న మేనల్లుడుకు చెప్పాడు. తీవ్రమైన అలలు మధ్యలో బోటు బోల్తా పడింది. బోటు మునిగిపోతున్నది. అదే సమయంలో బోటు కింద ఒక వ్యక్తి అప్పటికే మరణించిన సమాచారం తెలిసింది. సముద్రంలో అలా ఉంటే ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆవేదనతో స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు.
'విశాఖపట్టణం జిల్లాలో అధికారులు, ప్రభుత్వ నాయకులు పట్టించుకోలేదు. తప్పు జరిగింది అని ప్రభుత్వం అంగీకరించే ఎక్కడ అవహేళన వస్తుంది అని 3 మ్యాన్ కమిటీ వేశారు. వారు రిపోర్టర్లో అసత్యంగా రిపోర్టర్ ఇచ్చారు. సమాచారం ఆలస్యంగా వచ్చింది అని 3 మ్యాన్ కమిటీలో తప్పుడు నివేదిక ఇచ్చారు' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. 'ప్రభుత్వంలో పెద్దలు కానీ నాయకులు వారి ఇంటికి వచ్చి పట్టించుకోలేదు. హోంమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మత్స్యకారుల ఇంటికి వచ్చి పరామర్శ చేయలేదు' అని గుర్తుచేశారు. వీడియో కాల్లో పరామర్శలు చేయడం విడ్డూరంగా ఉందని.. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పించలేదని తెలిపారు. రాత్రికి రాత్రి ప్రభుత్వం స్పందన ఉంటే కనీసం ఐదుగురు బతికేవారు అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వివరించారు.
బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తప్పు జరిగింది కాబట్టే త్రీమెన్ కమిటీ వేశారు. త్రీమెన్ కమిటీ నివేదిక అంతా తప్పులతడక. ప్రభుత్వానికి మానవత్వం ఉందా?' అని ప్రశ్నించారు. 'ఘటన జరిగిన వెంటనే ఒక్క అధికారి కూడా రాలేదు. ఉత్తరాంధ్ర మంత్రులు ఒక్కరు కూడా రాలేదు. బాధితులను ఫిషరీస్ మంత్రి కూడా పరామర్శించలేదు. బాధితుల వద్దకు మంత్రులను పంపాలని చంద్రబాబుకు తెలియదా?' అని నిలదీశారు. 'చంద్రబాబు పట్టించుకోలేదు.. హోం మంత్రి పరామర్శించలేదు. రాత్రికి రాత్రే స్పందిస్తే మత్స్యకారులు బతికేవారు. నష్ట పరిహారం కింద అరకొర సాయం చేశారు. బాధితులకు రూ.కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా.. మన ప్రభుత్వం వచ్చాక నెలలోపే ఆదుకుంటాం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
FIFA World Cup 2026: ఫ్రాన్స్ vs స్పెయిన్ సెమీఫైనల్.. ఫైనల్ బెర్త్ కోసం 'యూరోపియన్' యుద్ధం!
Arlington, Texas:FIFA World Cup 2026 Semifinal: ఫిఫా ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. డల్లాస్లోని ప్రతిష్టాత్మక ఏటీ & టీ (AT&T) స్టేడియం మంగళవారం రాత్రి ఒక అద్భుతమైన సమరానికి వేదిక కాబోతోంది. మొదటి సెమీఫైనల్లో రెండు విభిన్న శైలులు కలిగిన యూరోపియన్ దిగ్గజాలు, రెండుసార్లు ఛాంపియన్గా నిలిచిన ఫ్రాన్స్, 2010 విజేత స్పెయిన్ ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి.
కైలియన్ ఎంబాపే సారథ్యంలోని ఫ్రాన్స్ వరుసగా మూడోసారి ప్రపంచ కప్ ఫైనల్లో అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా.. లూయిస్ డి లా ఫ్యూంటె నేతృత్వంలోని స్పానిష్ జట్టు 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ఫైనల్ చేరాలని పట్టుదలతో ఉంది.
డిఫెన్సివ్ కింగ్ స్పెయిన్..
ఈ మ్యాచ్ రెండు భిన్నమైన వ్యూహాల మధ్య జరగబోయే ఆసక్తికర యుద్ధం సాగనుంది. 2010 తర్వాత మొదటిసారి సెమీస్ చేరిన స్పెయిన్ ఈ టోర్నమెంట్లో అసాధారణ రక్షణ తీరును కనబరిచింది. క్వార్టర్ ఫైనల్లో బెల్జియం మాత్రమే వారిపై ఒక గోల్ చేయగలిగింది. ఈ ప్రపంచ కప్లో ఆరు మ్యాచ్ల తర్వాత స్పెయిన్ కేవలం 7 షాట్స్ ఆన్ టార్గెట్ను మాత్రమే ఎదుర్కొంది. 1966 తర్వాత ఒక ప్రపంచ కప్లో ఒక జట్టు ఒక మ్యాచ్కు ఎదుర్కొన్న అత్యల్ప షాట్స్ ఆన్ టార్గెట్ సగటు (1.17) ఇదే కావడం విశేషం.
కౌంటర్ ఎటాక్స్తో ఫ్రాన్స్ విధ్వంసం..
ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెషామ్స్ ఈ మ్యాచ్ ప్రాధాన్యతను వివరిస్తూ.. "స్పెయిన్ బంతిపై అద్భుతమైన పట్టు సాధించి ఒత్తిడి తెస్తుంది. కానీ, మాకూ బంతిని నియంత్రించే సత్తా ఉంది. వారిని అడ్డుకుంటూనే కౌంటర్ ఎటాక్స్లో వేగంగా విరుచుకుపడే నైపుణ్యం మా ఆటగాళ్లకు ఉంది" అని ధీమా వ్యక్తం చేశారు.
ఎంబాపే జోరు.. చౌమేని అందుబాటుపై ఉత్కంఠ
క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై తన 8వ గోల్ సాధించిన కైలియన్ ఎంబాపే ప్రస్తుతం 'గోల్డెన్ బాల్' రేసులో దూసుకుపోతున్నాడు. అలాగే హ్యామ్స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్న కీలక మిడ్ఫీల్డర్ చౌమేని ఈ మ్యాచ్కు అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. అయితే, అతను 100 శాతం కోలుకోకపోయినా జట్టుకు అందుబాటులో ఉంటాడని కోచ్ డెషామ్స్ స్పష్టం చేశారు.
రికార్డులపై కన్నేసిన ఫ్రాన్స్
వరుసగా ఆరు విజయాలతో సెమీస్ చేరిన ఫ్రాన్స్ (లె బ్లూస్), ఈ మ్యాచ్ గెలిస్తే 1934-38లో ఇటలీ తర్వాత ప్రపంచ కప్లో వరుసగా ఏడు విజయాలు సాధించిన రెండో యూరోపియన్ జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. మరోవైపు ప్రపంచ కప్లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 2006 రౌండ్ ఆఫ్ 16లో తలపడినప్పుడు ఫ్రాన్స్ 3-1తో విజయం సాధించింది.
అయితే, అన్ని రకాల పోటీలలో గత 10 మ్యాచ్లను పరిశీలిస్తే స్పెయిన్దే పైచేయిగా ఉంది. ఈ 10 మ్యాచ్లలో స్పెయిన్ 7 విజయాలు సాధించగా, ఫ్రాన్స్ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది (ఒక మ్యాచ్ డ్రా అయింది). గత రెండు మ్యాచ్లలోనూ స్పెయిన్ దే విజయం సాధించడం గమనార్హం. ఫ్రెంచ్ మెరుపు దాడులను స్పెయిన్ డిఫెన్స్ అడ్డుకుంటుందా? లేక ఎంబాపే సేన స్పానిష్ కోటను బద్దలు కొట్టి వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెడుతుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
Also Read: FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్స్కు రంగం సిద్ధం..ఏ టీమ్కి ట్రోఫీ గెలిచే సత్తా ఉంది?
Also Read: ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్స్లో హోరాహోరీ టీమ్స్..ట్రోఫీ గెలిచే సత్తా ఎవరికి ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jr NTR Political Entry: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్..తారక్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన!
Hyderabad, Telangana:Jr NTR Political Entry News: గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ (NTR) రాజకీయ అరంగేట్రం, సేవా కార్యక్రమాల చుట్టూ తిరుగుతున్న వివాదాలపై ఎన్టీఆర్ అధికారిక కార్యాలయం అత్యంత కీలకమైన వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో, అభిమాన సంఘాల పేరుతో జరుగుతున్న ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ ఎన్టీఆర్ ఆఫీస్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
'RAW NTR'తో మాకు ఎలాంటి సంబంధం లేదు!
ఈ ప్రకటనలో ఎన్టీఆర్ కార్యాలయం ప్రధానంగా 'RAW NTR' అనే సంస్థపై కీలక స్పష్టతనిచ్చింది. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి ఎలాంటి ప్రకటనలు చేయడానికి గానీ, కార్యక్రమాలు నిర్వహించడానికి గానీ 'RAW NTR' సంస్థకు ఎటువంటి హక్కులు లేదా అధికారాలు లేవు.
తాజాగా ఎన్టీఆర్ రాజకీయాల ఎంట్రీపై వస్తున్న వార్తలపై 'RAW NTR' అనే సంస్థ స్పందించింది. జూలై 18న నిర్వహించబోతున్న కార్యక్రమం 'ఊరు-వాడ' అనే సేవా కార్యక్రమం మాత్రమే అని తెలిపింది. దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. అయితే ఈ సంస్థతో ఎన్టీఆర్కు లేదా ఆయన కార్యాలయానికి ఎలాంటి అనుబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం నుంచి మరో ప్రకటన వచ్చింది. సదరు RAW NTR అనే సంస్థకు కథానాయకుడు ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ఈ అంశంపై తమ వైపు నుంచి ఇదే చివరి మరియు తుది వివరణ అని ఎన్టీఆర్ కార్యాలయం తేల్చి చెప్పింది.
జులై 18 రాజకీయ ప్రకటన ప్రచారానికి తెర!
ఈ నెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు, ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో ఈ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్టీఆర్కు సంబంధించిన సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన ద్వారా లేదా ఆయనకు సంబంధించిన అధికారిక బృందం ద్వారా మాత్రమే అధికారికంగా వెల్లడవుతాయని ఆఫీస్ వర్గాలు స్పష్టం చేశాయి.
అభిమానులకు, మీడియాకు విజ్ఞప్తి..
"ఎలాంటి ధృవీకరణ లేని సమాచారాన్ని సోషల్ మీడియాలో లేదా ఇతర వేదికలపై ప్రచారం చేయవద్దు. కేవలం ఎన్టీఆర్ అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి" అని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనలో ఈ విధంగా వివరించారు.
Also REad: ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం? జూలై 18న మీటింగ్ అందుకే అంటున్న తారక్ ఫ్యాన్స్!
Also Read: శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల మధ్య గొడవ..రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి..చివరికి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung, వన్ప్లస్లకు చుక్కలే.. 10,000mAh భారీ బ్యాటరీతో Redmi Turbo 6 సిరీస్!
Hyderabad, Telangana:Redmi Turbo 6 Series Leaked: స్మార్ట్ఫోన్ ప్రియులకు Xiaomi సబ్బ్రాండ్ రెడ్మి (Redmi) త్వరలోనే మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. మార్కెట్లోకి పవర్హౌస్గా నిలిచేందుకు రెడ్మి టర్బో 6 (Redmi Turbo 6) సిరీస్ను రంగంలోకి దించేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. ఈ సిరీస్లో భాగంగా రెండు అద్భుతమైన మోడల్స్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రెడ్మి టర్బో 6 (Redmi Turbo 6)తో పాటు రెడ్మి టర్బో 6 మాక్స్ (Redmi Turbo 6 Max) మోడల్స్ మార్కెట్లోకి రాబోతున్నట్లు ప్రముఖ టిప్స్టర్ స్మార్ట్ పికాచు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ వెయిబో (Weibo)లో లీక్ చేశారు. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ఫోన్ సిరీస్లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్స్తో పాటు భారీ బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లీక్ అయిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్లలో ఏకంగా 10,000mAh సామర్థ్యం గల అత్యంత శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పవర్బ్యాంక్లలో మాత్రమే కనిపించే ఈ స్థాయి బ్యాటరీ సామర్థ్యం.. స్మార్ట్ఫోన్లో అందుబాటులోకి రావడం టెక్ రంగంలో పెద్ద సంచలనంగా మారబోతోందని సమాచారం. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు రోజులు బ్యాటరీ బ్యాకప్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రీమియం డిస్ప్లే..
స్క్రీన్ విషయానికి వస్తే.. రెడ్మి టర్బో 6 సిరీస్లో పెద్ద సైజ్ 7 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్లోని ప్రీమియం మోడల్ అయిన రెడ్మి టర్బో 6 మాక్స్ వేరియంట్లో అత్యంత స్పష్టమైన విజువల్స్ అందించేలా 2K డిస్ప్లేను కూడా అందబా. దీనికి తోడు ప్రీమియం లుక్ అండ్ డ్యూరబిలిటీ కోసం మెటల్ ఫ్రేమ్ను కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. సెక్యూరిటీ కోసం ఈ మాక్స్ మోడల్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ను కూడా అందుబాటులో తీసుకు రాబోతోంది.
పవర్ఫుల్ ప్రాసెసర్లు..
ఈ సిరీస్లోని రెండు ఫోన్లలో వేర్వేరు పవర్ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది.. రెడ్మి టర్బో 6 స్మార్ట్ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8600 (MediaTek Dimensity 8600) చిప్సెట్ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. ఈ రెడ్మి టర్బో 6 మాక్స్ స్మార్ట్ఫోన్ ఈ టాప్-ఎండ్ మోడల్లో మరింత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9600s (MediaTek Dimensity 9600s) ప్రాసెసర్ను అందించిన్నట్లు సమాచారం. దీనివల్ల గేమింగ్తో పాటు మల్టీటాస్కింగ్ అత్యంత వేగంగా, ఎలాంటి లాగ్స్ లేకుండా సాగుతుందని సమాచారం.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
గత మోడల్ ట్రాక్ రికార్డ్..
ఇటీవలే మార్కెట్లో విడుదలైన రెడ్మి టర్బో 5 ఫీచర్లను గమనిస్తే.. ఈ స్మార్ట్ఫోన్ 6.59 అంగుళాల 1.5K ఫ్లూయిడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో 120Hz రీఫ్రెష్ రేట్తో పాటు 3500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ను కూడా కలిగి ఉంటుంది. అలాగే 50MP (OIS) సపోర్ట్తో 8MP డ్యూయల్ రీర్ కెమెరాతో అందుబాటులో ఉంది.. ఇందులో ఎంతో శక్తివంతమైన 7,540mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ఇప్పుడు రాబోయే టర్బో 6 అంతకంటే రెట్టింపు పవర్తో 10,000mAh బ్యాటరీతో వస్తుండటంతో మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Sharmila On Polavaram: "పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే 'కిల్లర్'.." ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు!
Vijayawada, Andhra Pradesh:YS Sharmila On Polavaram Project: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం పాలిట చంద్రబాబు ఒక 'కిల్లర్'లా మారారని, ప్రాజెక్టును ఉద్ధరించడం పక్కన పెట్టి.. దగ్గరుండి దానికి ఊపిరి తీస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ మెప్పు కోసమే చంద్రబాబు పోలవరానికి వెన్నుపోటు పొడుస్తూ 'అభినవ కట్టప్ప'లా ప్రవర్తిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎత్తు తగ్గింపు.. ఆత్మహత్య సదృశ్యం!
పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడంపై షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని, బహుళార్థక సాధక ప్రాజెక్టు కాస్తా కేవలం నీటి నిల్వకే పరిమితమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఎత్తు తగ్గిస్తే పోలవరం ఆత్మహత్య సదృశ్యమని తెలిసి కూడా చంద్రబాబు ఈ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.
ఆర్ అండ్ ఆర్ (పునరావాసం) కింద ఇవ్వాల్సిన రూ.32 వేల కోట్ల మిగులు కోసం రాష్ట్ర ప్రాణాధారమైన ప్రాజెక్టును చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పోలవరంపై చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని.. తానే 37 సార్లు సందర్శించానని, 136 సార్లు రివ్యూ చేశానని గొప్పలు చెప్పుకోవడానికున్న శ్రద్ధ, ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి ఎత్తులోనే కట్టాలని కేంద్రాన్ని నిలదీయడంపై లేదని విమర్శించారు. గ్రావిటీ ప్రాజెక్ట్ కాస్తా ఎత్తిపోతల పథకంగా మారుతుంటే కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ముఖ్యమంత్రికి లేకపోవడం రాష్ట్రానికి తీరని అన్యాయమన్నారు.
కాంగ్రెస్ సంధించిన సూటి ప్రశ్నలు..
వచ్చే మార్చి 31 లోపు పోలవరం తొలి దశను పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని ప్రకటిస్తున్న చంద్రబాబు నాయుడికి ఏపీ కాంగ్రెస్ పక్షాన షర్మిల ఐదు సూటి ప్రశ్నలు వేశారు.
రెండో దశపై ఆంతర్యం ఏంటి?
"రెండో దశ పనులకు చాలా డబ్బు కావాలి.. వచ్చే మూడేళ్లలో రెండో దశ పూర్తి చేయడం కష్టం" అన్న మీ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏంటి? ఆర్ అండ్ ఆర్ కింద రెండో దశలో రూ.32 వేల కోట్లు ఇవ్వకుంటే ప్రాజెక్ట్ ప్రయోజనం శూన్యమేనా? ఇంతకాలం మీరు చేసిన హంగామా అంతా చివరకు బూడిదలో పోసిన పన్నీరుగా మిగలాల్సిందేనా?
41.15 మీటర్లతో లాభమేంటి?
డిజైన్ (DPR) ప్రకారం పూర్తి నీటి నిలువ సామర్థ్యం (FRL) 45.72 మీటర్ల ఎత్తులో 194.6 TMC నిల్వ చేస్తేనే 35 లక్షల ఎకరాలకు సాగునీరు, 28 లక్షల మందికి తాగునీరు అందుతుంది. మరి 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయడం ద్వారా సమకూరే ప్రయోజనం ఏంటి? పోలవరం కనీస నీటి నిల్వ సామర్థ్యం (MDDL) అయిన 41.15 మీటర్ల ఎత్తులో కేవలం 119 TMC లకే తొలి దశ పూర్తి చేసి, ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇస్తారు? ఎంతమంది గొంతు తడుపుతారు? అని వైఎస్ షర్మిళా సూటిగా ప్రశ్నిస్తున్నారు.
పోలవరంపై 'శ్వేతపత్రం' విడుదల చేయాలి!
పోలవరం ప్రాజెక్టును కాస్తా 'పోలవరం బ్యారేజ్'గా మారుస్తూ, జాతికి అంకితం ఇస్తామని చెబుతున్న చంద్రబాబు దీనిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మొదటి దశ ద్వారా రాష్ట్ర ప్రజలకు వచ్చే ప్రయోజనాలు ఏంటో స్పష్టంగా చెప్పాలన్నారు.
"కేంద్రంలో మీ మద్దతుతోనే సర్కార్ నడుస్తోంది కదా, మరి రెండో దశ గురించి నోరు ఎందుకు మెదపడం లేదు? కేంద్రం నుండి ఖచ్చితమైన, కాంక్రీట్ హామీ తీసుకుని రాగలమని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా?" అని ఆమె సవాల్ విసిరారు. ప్రాజెక్టు పేరు పోలవరమే అయినా.. దానికి చంద్రబాబు పొడుస్తున్న వెన్నుపోటు తరతరాలకు శాపంగా మారుతుందని షర్మిల హెచ్చరించారు.
Also Read: పల్నాడులో కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాల..100 సీట్ల భర్తీకి NMC గ్రీన్ సిగ్నల్..
Also Read: "సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాను"..నరరూప హంతకుడు రాజ్కుమార్ సూసైడ్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Snake Video: డేంజరస్ స్నేక్ను చుట్టుముట్టిన కుక్కలు.. వీడియో..
Hyderabad, Telangana:Snake Video Watch: తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో కొన్ని కుక్కలు అత్యంత ప్రమాదకరమైన పాముపైకి దాడికి దిగడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. అయితే, ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన్నట్లు తెలుస్తోంది.Moto, OnePlus, iQOO.. రూ.25,000 లోపు అదిరిపోయే ఫీచర్లతో టాప్ స్మార్ట్ఫోన్ ఇదే!
Hyderabad, Telangana:Moto G77 Power Vs OnePlus Nord CE 6 Lite vs iQOO Z10R 5G: ప్రస్తుతం భారతీయ మొబైల్ మార్కెట్లో రూ. 25,000 నుంచి రూ.30,000 లోపు ధర కలిగిన స్మార్ట్ఫోన్ల కేటగిరీలో తీవ్రమైన పోటీ నడుస్తూ వస్తోంది.. ఇటీవల మోటొరోలా భారీ బ్యాటరీ ఫోన్ Moto G77 Powerను విడుదల చేయడంతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న OnePlus Nord CE 6 Lite స్మార్ట్ఫోన్తో పాటు అద్భుతమైన ఫీచర్స్తో దూసుకుపోతున్న iQOO Z10R 5G లతో గట్టి పోటీ నడుస్తోంది. మరి ఈ మూడు స్మార్ట్ఫోన్లలో ఏది బెస్ట్? ఫీచర్స్తో పాటు ధరల పరంగా వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డిస్ప్లే పరంగా ఏది బెస్ట్?
ఈ Moto G77 Power స్మార్ట్ఫోన్ ఎంతో ప్రత్యేకమైన 6.72 ఇంచుల Full HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1,050 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అందుబాటులోకి వచ్చింది.. ఇక OnePlus Nord CE 6 Lite ఫోన్ కూడా 6.72 అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. అయితే, ఇందులో గరిష్టంగా 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా లభిస్తోంది.. కానీ పీక్ బ్రైట్నెస్ 680 నిట్స్ సపోర్ట్తో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇక iQOO Z10R 5G స్మార్ట్ఫోన్ డిస్ప్లే విషయంలో అందరికంటే ముందుందని భావించవచ్చు. ఇందులో 6.77 అంగుళాల Full HD AMOLED క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది.. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు ఏకంగా 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో ప్రీమియం విజువల్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుందని కంపెనీ తెలిపింది..
పవర్ఫుల్ ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్..
ప్రాసెసర్ పరంగా మోటో G77 పవర్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్సెట్ను కలిగి ఉంటుంది. అయితే, వన్ప్లస్ నోర్డ్ CE 6 లైట్తో పాటు ఐకూ Z10R ఫోన్లు రెండూ మోస్ట్ పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్తో అందుబాటులో ఉంది. వన్ప్లస్లో దీని అడ్వాన్స్డ్ Apex వేరియంట్ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికొస్తే.. మోటో, వన్ప్లస్ ఫోన్లు ప్రీమియం ఆండ్రాయిడ్ 16 ఆధారిత UI తో పని చేస్తుందని.. ఐకూ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుందని కంపెనీ తెలిపింది..
కెమెరా వివరాలు..
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం మూడు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాలను కంపెనీలు అందిస్తోంది.. మోటో G77 పవర్లో అద్బుతమైన 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక వన్ప్లస్లో EIS సపోర్ట్తో కూడిన 50MP కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఐకూ ఫోన్ విషయానికొస్తే.. 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీల కోసం మోటో, ఐకూ ఫోన్లలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు అందుబాటులో ఉండగా.. వన్ప్లస్లో కేవలం 8 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే అందుబాటులో ఉండడం విశేషం..
బ్యాటరీ, డిజైన్ వివరాలు..
బ్యాటరీ పరంగా మోటో, వన్ప్లస్ భారీ 7,000mAh బ్యాటరీలతో లభిస్తున్నాయి. ఇక మోటో 30W చార్జింగ్ సపోర్తో.. వన్ప్లస్ 45W ఫాస్ట్ చార్జింగ్ను సపోర్ట్తో అందుబాటులోకి వచ్చాయి.. ఐకూ ఫోన్ 5700mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ చార్జింగ్తో లభిస్తోంది. అయితే, బ్యాటరీ పెద్దదిగా ఉండటం వల్ల మోటో, వన్ప్లస్ బరువు ఎక్కువగా ఉంటాయి. ఐకూ కేవలం 183.5 గ్రాముల బరువుతో పాటు 7.39 mm స్లిమ్ డిజైన్, IP68/IP69 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది.
ధరల వివరాలు..
ఈ Moto G77 Power స్మార్ట్ఫోన్ 8GB ర్యామ్తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999తో అందుబాటులో ఉంది. అలాగే OnePlus Nord CE 6 Lite స్మార్ట్ఫోన్ 6GB ర్యామ్తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 కాగా.. 8GB ర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999తో అందుబాటులో ఉంది. ఇక iQOO Z10R 5G స్మార్ట్ఫోన్ 8GBర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ కలిగిన ధర రూ.22,999, 8GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్తో ధర రూ.24,999తో అందుబాటులో ఉంది. అయితే, అద్భుతమైన AMOLED కర్వ్డ్ డిస్ప్లే, తక్కువ బరువు, బడ్జెట్ ధర కావాలనుకుంటే iQOO Z10R బెస్ట్ ఛాయిస్గా భావించవచ్చు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Astrology: వీరి మనసు కనిపెట్టడం ఎవరి తరం కాదు.. అత్యంత తెలివైన 4 రాశులు వీరే..
Hyderabad, Telangana:Horoscope Telugu News: మానవ స్వభావం అనేది ఒక వింతగా భావిస్తారు. పైకి చాలా అమాయకంగా.. ప్రశాంతంగా కనిపించే వ్యక్తి మనసులో ఎలాంటి వ్యూహాలు, ఆలోచనలు ఉన్నయో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మొత్తం 12 రాశుల వారిలోనూ ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కొందరు తమ మనసులోని మాటను దాచుకోలేరు.. కానీ మరికొందరు తమ భావోద్వేగాలను, ప్రణాళికలను ఎంత రహస్యంగా ఉంచుతారంటే.. ఎదుటివారు వారి మనసును అస్సలు తెలుసుకోలేపోతూ ఉంటారు.
జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాశిచక్రంలో అత్యంత చతురత, వ్యూహాత్మక ఆలోచనలు కలిగిన 4 రాశుల వారు ఉన్నారు. వారు ఏం చేయబోతున్నారో అంచనా వేయడం ఎవరికైనా అసాధ్యం.. ఆ రాశులవారు ఎవరో? వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మకర రాశి (Capricorn)
శని దేవుని ప్రభావం ఉన్న మకర రాశి వారు అత్యంత ప్రాక్టికల్గా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా అద్భుతమైన గోల్స్ను కలిగి ఉంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కానీ ఎప్పుడూ తొందరపడరు. విపరీతమైన ఓర్పుతో తమ లక్ష్యాల కోసం పావులు కదుపుతూ ఉంటారు. వీరు చాలా సాధారణంగా ఉన్నారని మీరు అనుకోవచ్చు.. కానీ సమయం చూసి తమ కెరీర్ లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన కీలకమైన అడుగు వేస్తూ ఉంటారు.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వారు దూరదృష్టి గలవారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు అందరితో కలిసి ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ.. వీరు తమకంటూ ఒక ప్రత్యేక దూరాన్ని పాటిస్తారు. వీరి పరిశీలనా శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఎక్కువగా మాట్లాడకపోయినా.. చుట్టుపక్కల ఉన్నవారి బలహీనతలను, మనస్తత్వాన్ని చాలా వేగంగా పసిగట్టేస్తారు. వీరి మనసును అంచనా వేయడం చాలా కష్టమని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మిథున రాశి (Gemini)
మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి.. బుధగ్రహం బుద్ధికి, వాక్చాతుర్యానికి కారకుడి భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారిలో ఒక రకమైన ద్వంద్వ వ్యక్తిత్వం (Dual Personality) కనిపిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి మాటలు, ప్రవర్తన ఎంత ఆకర్షణీయంగా ఉంటాయంటే.. ప్రజలు వీరిని సులభంగా నమ్మేస్తారు. తమ అవసరానికి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో.. ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో వీరికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.
వృశ్చిక రాశి (Scorpio)
అత్యంత రహస్యమైన రాశుల్లో వృశ్చిక రాశి మొదటి స్థానంలో ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుజుడి ప్రభావం వల్ల వీరు ఎంతో అద్భుతంగా ఆలోచించగలుగుతారు. కానీ తమ వ్యూహాలను ఎప్పుడూ బయటపెట్టరు. వీరి మనసు ఒక అంతుచిక్కని రహస్య సముద్రం లాంటిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. పైకి ఎంతో సాధారణంగా.. ప్రశాంతంగా కనిపిస్తూనే.. లోపల భవిష్యత్తుకు సంబంధించిన పక్కా రోడ్మ్యాప్ సిద్ధం చేసుకుంటారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Mercury Direct 2026: జూలై 24 తర్వాత ఈ రాశుల జాతకం మారిపోతుంది.. అపార ధనలాభం!
Hyderabad, Telangana:Mercury Margi In Gemini 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.. బుధుడిని బుద్ధితో పాటు జ్ఞానం, వ్యాపారం, కమ్యూనికేషన్, వాక్కుకు కారకుడిగా భావిస్తూ ఉంటారు.. జాతకంలో బుధుడు బలంగా ఉంటే.. వారి వ్యాపారం, సంతోషానికి చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఇదిలా ఉంటే.. జూలై 24న పెద్ద గ్రహ సంచారం జరగబోతోంది. గత కొంతకాలంగా వక్రగతిలో నడుస్తున్న బుధుడు.. జూలై 24న తన సొంత రాశి అయిన మిథునరాశిలోకి ప్రవేశించి సక్రమార్గంలోకి కొనసాగుతాడు..
ఏదైనా ఒక గ్రహం వక్రదశను వదిలి నేరుగా సంచారం చేసినప్పుడు.. దాని శుభ ప్రభావం పదింతలు పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మీడియా, రైటింగ్, మార్కెటింగ్, బ్యాంకింగ్తో పాటు విద్యా రంగాలలో ఉన్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని చెబుతున్నారు. గత కొన్ని ఉన్న మానసిక గందరగోళం సులభంగా తొలగిపోతుంది. ఈ బుధుడు సక్రమార్గంలోకి ప్రవేశించడం వల్ల ప్రధానంగా 4 రాశుల వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి జూలై 24 తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది.. బుధుడి అనుగ్రహంతో మీ వ్యక్తిత్వంలో ప్రత్యేకమైన ఆకర్షణ మొదలవుతుంది. ఇది సహోద్యోగులను ఎంతగానో ఆకట్టుకుంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మల్టీనేషనల్ కంపెనీల నుంచి అద్భుతమైన ఆఫర్లు కూడా లభిస్తాయి. పాత పెట్టుబడులతో పాటు పూర్వీకుల ఆస్తి నుంచి ఆకస్మిక ధనలాభం కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మిథున రాశి (Gemini)
బుధుడు తన సొంత రాశి అయిన మిథునరాశిలోనే సక్రమ మార్గంలోకి వెళ్లడం కారణంగా ఈ సమయం అత్యంత సానుకూల ప్రభావం పడుతుంది. విద్యార్థులకు ఇది నిజంగా సువర్ణ కాలంగా భావించవచ్చు. పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ జీవితంలో శాంతితో పాటు సంతోషాలు విపరీతంగా పెరుగుతాయి.. అంతేకాకుండా, ఆదాయానికి కొత్త మార్గాలు కూడా సులభంగా తెరుచుకుంటాయి. దీర్ఘకాలికంగా ఉన్న అప్పుల బాధల నుంచి మిథున రాశి వారు విముక్తి లభిస్తుంది.
మేష రాశి (Aries)
మేష రాశివారికి బుధుడి ప్రత్యేకమైన ప్రభావంతో ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా కాలంగా ఆఫీసుల్లో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. అలాగే ఈ సమయంలో తప్పకుండా ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ముఖ్యమైన ప్రాజెక్టులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం..
కన్యా రాశి (Virgo)
కన్యా రాశికి అధిపతి స్వయంగా బుధుడే కావడం వల్ల.. బుధుడు ప్రభావంతో ఈ రాశి వారికి లాటరీ తగిలినట్లే ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సమయం అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా కొత్త రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ సమయంలో రెట్టింపు లాభాలు కులుగాయి.. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న పాత విభేదాలు తొలగిపోయే ఛాన్స్లు ఉన్నాయి. మార్కెట్లో చిక్కుకుపోయిన డబ్బు అకస్మాత్తుగా లభిస్తుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Guru Asthamayam 2026: జూలై 15 నుంచి గురు అస్తమయం.. ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
Hyderabad, Telangana:Guru Asthamayam 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థాన చలనాలు, వాటి నక్షత్ర సంచారాలకు, శక్తి మార్పులు మానవ జీవితాలపై ఎంతగానో ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాబోయే జూలై 15 నుంచి కర్కాటక రాశిలో దేవగురువు బృహస్పతి అస్తమించబోతున్నాడు. ఇది దాదాపు ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. జ్యోతిష్య ప్రకారం.. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి గురుడికి అత్యంత సమీపంలోకి రావడం వల్ల ఈ గురుడి అస్తమయం జరగబోతోంది..
దీనివల్ల దేవగురువు శుభ ప్రభావం తాత్కాలికంగా చాలా బలహీనపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శాస్త్రాల ప్రకారం.. ఈ సమయంలో వివాహాలు, ఉపనయనాలతో పాటు ముండన సంస్కారాలు వంటి ఎటువంటి శుభ కార్యాలు జరపడం నిశిద్ధం.. ఇదే సమయంలో చాతుర్మాస్యం కూడా ప్రారంభం కాబోతోంది.. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. గురుడి శుభ దృష్టి బలహీనపడటం వల్ల రాబోయే 3 వారాల పాటు 4 ప్రధాన రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సమయం అంత అనుకూలంగా లేదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి అనుకూలంగా ఉండదో.. తీవ్ర దుష్పభావాలు ఎదుర్కొనే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది..
మకర రాశి (Capricorn)
మకర రాశి వారిపై కూడా గురు అస్తమయ కారణంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇప్పటివరకు గురుడి ఏడవ స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు పొందినప్పటికీ.. ఇప్పుడు మీ కెరీర్ పరంగా అనేక సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. మీ వ్యాపార ప్రత్యర్థులు మీ ప్రణాళికలకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించే ఛాన్స్ కూడా ఉంది. తొందరపడి ఉద్యోగం మారే నిర్ణయం తీసుకోవద్దని జ్యోతిష్యలు చెబుతున్నారు. ప్రభుత్వ పనులు లేదా చట్టపరమైన విషయాలలో అజాగ్రత్త పనికి రాదు..
కర్కాటక రాశి (Cancer)
దేవగురువు కర్కాటక రాశిలోనే అస్తమిస్తుండటం వల్ల ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.. గత కొన్ని వారాలుగా వేగంగా సాగుతున్న మీ పనులలో అకస్మాత్తుగా ఆటంకాలు కూడా ఎదురవుతాయి.. మీ ఆర్థిక ప్రణాళికలు నిలిచిపోయే ప్రమాదం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడైనా ప్రత్యేక జాగ్రత్త అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మీ కోపాన్ని నియంత్రించుకోలేనివారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు... ప్రియమైన వారితో విభేదాలు లేదా గొడవలు వచ్చే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ క్లిష్ట సమయంలో తండ్రి లేదా కుటుంబ పెద్దల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మీన రాశి (Pisces)
మీన రాశి వారి జీవితంలో కూడా ఈ సమయంలో సవాళ్ల ఎదురవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది. ఇప్పటివరకు ఐదో స్థానంలో ఉన్న గురుడు ఆ శని ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించాడు.. కానీ ఇప్పుడు గురుడు అస్తమించడం వల్ల శని ప్రతికూల ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ఆశించిన విజయం సాధించాలంటే మునుపటి కంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది.. ఆదాయం సాధారణంగానే ఉన్నప్పటికీ.. వివిధ కారణాల వల్ల ఖర్చులు విపరీంతగా పెరుగుతాయి.. విద్యార్థులు కూడా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలంటే గతంలో కంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
బర్త్డే రైడ్లో దారుణం.. భార్యను సర్వీస్ రివాల్వర్తో కాల్చేసిన పోలీస్! కానీ, అసలు కారణం వేరే!!
Hyderabad, Telangana:Delhi Police Constable Shoots Wife: ఢిల్లీ క్రైమ్ వార్తల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో, సర్వీస్ రివాల్వర్తో భర్త మనీష్ తన భార్య ప్రియాంకను రోడ్డుపైనే చంపినట్లు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున, ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ కలిసి రాత్రి రెండు గంటల సమయంలో బైక్పై బయటకు వెళ్లారు. మార్గమధ్యంలో లాల్ బహుదూర్ శాస్త్రి ఆసుపత్రి వద్ద ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో, ఆమె బైక్ దిగి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. వెంటనే మనీష్ తన సర్వీస్ రివాల్వర్ను తీసి ఆమెను కాల్చి, అక్కడి నుండి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయిన ఆమెను ఒక డెలివరీ బాయ్ వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేవలం చిన్న గొడవకే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడా? లేదా మరేదైనా కారణం ఉందా? అని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే, 2024లో మనీష్ తన భార్యను కట్నం కోసం వేధించినట్లు ఒక లిఖితపూర్వక పత్రం బయటకు వచ్చింది. పగతో కూడిన ప్లాన్ ప్రకారం మనీష్ ఈ హత్య చేసినట్లు బంధువులు చెబుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, స్కూటర్పై వెళ్తుండగా జరిగిన గొడవలో మనీష్ పిస్టల్తో కాల్చి, ప్రియాంక గాయాలతో రోడ్డుపై పడిపోతుండగా అక్కడి నుండి పారిపోయాడు. ఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కళ్యాణ్ పూరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వీరిద్దరూ ఈస్ట్ వినోద్ నగర్లో నివసిస్తున్నారు. వీరి సంసారంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతాయని అందరూ అనుకున్నారు.. కానీ అది ఇంతటి రక్తపాతానికి దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎల్బీఎస్ ఆసుపత్రి సమీపంలో ఇద్దరూ మాట్లాడుకుంటున్న వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. అక్కడ వాగ్వాదం పెరగడంతో నిందితుడు కాల్పులు జరిపి స్కూటర్తో పరారయ్యాడు. కాల్పుల శబ్దం విని స్థానికులు గమనించగా, ఒక ఆటో డ్రైవర్ ఆమెను ఆసుపత్రికి తరలించారు.
మనీష్ యాంటీ ఆటో తెఫ్ట్ స్క్వాడ్లో పనిచేస్తున్నట్లు, ప్రియాంక ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు వివిధ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇరుగుపొరుగు వారు కూడా వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి విచారించిన తర్వాతే అసలు విషయం పూర్తిగా తేలుతుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read more: ఫిరోజాబాద్ సంచలన హత్య కేసులో చారిత్రాత్మక తీర్పు.. కేవలం 40 రోజుల్లోనే మరణశిక్ష!
Read more: ఆరుగురి హత్య కేసులో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు స్థానికుల ధర్నా
హత్యకు గల కారణాల విషయానికి వస్తే, వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని బంధువులు చెబుతున్నారు. ప్రియాంక ఇప్పటికే మహిళా క్రైమ్ బ్రాంచ్లో తన భర్తపై లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అందులో తన అత్తమామలు ,భర్త వరకట్న వేధింపులకు, మానసిక హింసకు గురిచేస్తున్నారని, తన ప్రాణానికి ప్రమాదం ఉన్నందున రక్షణ కల్పించాలని ఆమె కోరింది. 2023 ఫిబ్రవరి 8న వీరి వివాహం జరిగినప్పుడు, అత్తమామలు రూ. 25 లక్షలు ,ఒక పెద్ద కారు కావాలని డిమాండ్ చేశారని ఆమె ఆరోపించింది. మనీష్కు మద్యం అలవాటు ఉందని, అతను తనను శారీరకంగా, మానసికగా వేధించేవాడని, పదేపదే గొంతు నొక్కడానికి ప్రయత్నించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, పెళ్లికి ముందే అతనికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఆమెను పెళ్లి చేసుకుంటానని, తనను తుపాకీతో చంపేస్తానని ఎన్నోమార్లు తలకు గురిపెట్టి మరీ బెదిరించాడని ఆమె రాసింది. ఈ వేధింపుల వల్ల ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్ళినప్పటికీ, తల్లిదండ్రుల ఒత్తిడితో మళ్ళీ అత్తగారి ఇంటికి తిరిగి వచ్చేది. ఇలా మనీష్ ఆమెను మానసిక ,శారీరక హింసకు గురిచేసి, పలుమార్లు హత్యాయత్నం కూడా చేశాడని ప్రియాంక తన ఫిర్యాదులో వివరించింది. ఇంతలోనే ఆమెను కాల్చి పొట్టనబెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Piduguralla Medical College: పల్నాడులో కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాల..100 సీట్ల భర్తీకి NMC గ్రీన్ సిగ్నల్..ఈ ఏడాదే తరగతులు!
Piduguralla, Andhra Pradesh:Piduguralla Medical College News: మెడికల్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా విద్యార్థుల దశాబ్దాల కల ఈనాటికి సాకారమైంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 100 ఎం.బి.బి.ఎస్ సీట్ల భర్తీకి జాతీయ మెడికల్ కమిషన్(NMC) ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం(2026-27) నుంచే ప్రవేశాలు, తరగతులు ప్రారంభం కానున్నాయి. జాతీయ నిబంధనల ప్రకారం.. అనుమతినిచ్చిన 100 సీట్లలో 15 శాతం సీట్లను (AIQ) ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేయనున్నారు.
ఇదే విషయాన్ని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు కూడా ఇప్పటికే తుదిదశకు చేరుకోవడం వల్ల అతిత్వరలోనే తరగతుల ప్రారంభానికి మార్గం సుగమం అయ్యింది. మెడికల్ కాలేజీకి అవసరమైన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఆస్పత్రికి సంబంధించిన వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర టెక్నీషియన్ల ఎంపిక కూడా తుదిదశకు చేరుకుంది.
ఫలించిన పల్నాడు ఎంపీ కృషి..
ఈ చారిత్రాత్మక అనుమతులు సాధించడం వెనుక నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి ఉందని స్థానిక నాయకులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయంలో మెడికల్ కాలేజీ మంజూరు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి, అనుమతుల సాధన వరకు ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఉన్నతాధికారులతో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖతో స్వయంగా సంప్రదింపులు జరిపినట్లు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ కృషి ఫలితమే ఈరోజు అనుమతి (LoP) వచ్చేలా సాధ్యపడిందని నియోజకవర్గ నేతలు అంటున్నారు.
మరోవైపు, మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు తుది దశకు చేరుకోగా.. కళాశాలకు అవసరమైన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆసుపత్రికి అవసరమైన వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర టెక్నీషియన్ల ఎంపిక కూడా జరుగుతోంది.
ALso Read: విజయవాడ భారీ అగ్నిప్రమాదం..ఏడు బస్సులు పూర్తిగా దగ్ధం..రూ.కోట్ల ఆస్తి బూడిద!
Also Read: ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం? జూలై 18న మీటింగ్ అందుకే అంటున్న తారక్ ఫ్యాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jani Master Vs Sekhar Master: శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల మధ్య గొడవ..రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి..చివరికి ఏం జరిగిందంటే?
Hyderabad, Telangana:Chiranjeevi Meets Jani Sekhar Masters: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారానికి తెరపడింది. తమ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలపై జానీ మాస్టర్ స్వయంగా స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన 'ఎక్స్'(ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ రూమర్లను కొట్టిపారేశారు.
నాకు అన్నలాంటి వారు!
తనకు, శేఖర్ మాస్టర్కు మధ్య ఎలాంటి అపార్థాలు లేవని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. "శేఖర్ మాస్టర్ నాకు అన్నలాంటి వారు. మేమిద్దరం ఎప్పటి నుంచో ఒకే కుటుంబంలా కలిసి ఉంటున్నాం. ఒకరికొకరం ఎప్పుడూ అండగా నిలబడ్డాం. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలు, తప్పుడు కథనాలను అభిమానులు ఎవరూ నమ్మవద్ద"ని జానీ మాస్టార్ విజ్ఞప్తి చేశారు.
పెద్దరికం వహించిన మెగాస్టార్ చిరంజీవి
ఈ వివాదంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరును జానీ మాస్టర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకున్న సమయంలో, చిరంజీవి గారు స్వయంగా చొరవ తీసుకున్నారని తెలిపారు. సినిమా షూటింగ్ సెట్స్లో చిరంజీవి గారు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరినీ పిలిపించి మాట్లాడారు. అనంతరం ముగ్గురూ కలిసి కాసేపు సరదాగా ముచ్చటించి, కలిసి భోజనం కూడా చేశారు.
A few misleading videos and false reports have been doing the rounds over the last couple of days….
I want to make this clear… there is absolutely no misunderstanding or conflict between me and Shekar Master Anna. We are one family and we have always stood by each other.… pic.twitter.com/oCOsngCtwI
— Jani Master (@AlwaysJani) July 13, 2026
"చిరంజీవి గారు చూపించిన ప్రేమ, అందించిన మార్గదర్శకత్వం, మద్దతు మాకు ఎంతో విలువైనవి" అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. ఆధారాలు లేని ఇలాంటి అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని జానీ మాస్టర్ సినీ ప్రేమికులను కోరారు. ప్రేమ, పరస్పర గౌరవం, సానుకూల దృక్పథంతో అందరూ కలిసి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read: ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం? జూలై 18న మీటింగ్ అందుకే అంటున్న తారక్ ఫ్యాన్స్!
Also Read: గ్లామర్ డోస్ పెంచిన 'అలేఖ్య చిట్టి పికిల్స్' బ్యూటీ..అందాలతో హీరోయిన్లకు పోటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amavasya 2026: అరుదైన భౌమవతి అమావాస్య.. రేపు ఈ రహస్య పరిహరం పాటిస్తే విశేష ధనయోగంతో పాటు సొంతింటి కల సాకారం.!.
Hyderabad, Telangana:Amavasya date 2026 timing rituals and remedies: సాధారణంగా చాలా మంది అమావాస్య అనగానే చెడుగా భావిస్తారు. కానీ మనం దీపావళి పండగను జరుపుకుంటాం. చెడుపై మంచిసాధించిన విజయంకు గుర్తుగా దీపాలు వెలిగించి పండగ చేసుకుంటాం. అందుకే అమావాస్యను చెడుగా భావించకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే.. మనం జులై 14న అమావాస్యను జరుపుకుంటాం.
ఈసారి మంగళవారం అమావాస్య రావడంను విశేషంగా చెప్తారు. ముఖ్యంగా రాహు, కేతు దోషాలున్న వారికి ఇది చాలా యోగ్యమైన రోజు. అంతే కాకుండా మంగళవారం అమావాస్యతో కూడి రావడంను భౌమవతి అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున కొన్ని పరిహరాలు పాటిస్తే చాలా శక్తివంతంగా అవి యోగిస్తాయని పండితులు చెబుతున్నారు.
భౌమవతి అమావాస్యరోజున ఏంచేయాలంటే..?..
చాలామంది జీవితంలో పూర్వీకుల శాపాల వల్ల బాధలు పడుతారు. పితృదోషాలతో సతమతమౌతారు. దీని వల్ల జీవితంలో ఎదుగుదల ఉండదు. పెళ్లిలో ఆటంకాలు, ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు. డబ్బులు నిలవదు. ఒక వేళ పెళ్లి అయితే సంతానంవిషయలో సమస్యలు వస్తాయి.
ఇలాంటి వారు చనిపోయిన తమ పూర్వీకుల ప్రీతికొరకునదీతీరంలో అమావాస్య రోజున శ్రాద్దకర్మలు చేయాలి. పండితుడ్ని పిలిచి ఆయనతో విధి ప్రకారం పిండ ప్రదానం చేయాలి.ఆ తర్వాత వాటిని నదీలో వదిలేయాలి. యథా శక్తి దాన ధర్మాలు చేయాలి. దశదానాలు ఇచ్చుకొవాలి. ఈవిధంగా చేస్తే పూర్వీకుల శాపాలు దూరమౌతాయి.
ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే..?..
కొంత మంది ఎంత సంపాదించిన ఇంట్లో ధనం నిలవదని బాధపడుతారు. తరచుగా గొడవలు, చికాకులు, వాగ్వాదాలు ఉంటాయి. నెగెటివ్ ఎనర్జీతో సతమతమౌతారు. వీరు ఇంటి ముందు గుమ్మడి కాయను కట్టాలి. దాని మీదపసుపు, కుంకుమ వేయాలి. ఈ విధంగా కట్టిన గుమ్మడికాయను ప్రతి అమావాస్యకు మారుస్తుండాలి. దొడ్డు ఉప్పును తీసుకుని గాజు గ్లాసులో గిన్నెడు వేసి దానిలో 5 రూపాయికాయిన్ లు వేసి చిన్న టీ గ్లాస్ నీళ్లువేసి గుమ్మంకు ఎడమ వైపు ఉంచాలి. ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని లాగేస్తుంది. ఇంట్లో శుభ్రంచేస్తుండగా దొడ్డు ఉప్పు వేసి క్లీన్ చేసుకొవాలి.
ధనంకు రావడానికి, కోరిక కొర్కెలకు రెమిడీలు..
అమావాస్య రోజున ప్రవహించే నది దగ్గరకు వెళ్లి మీరు వాడిన బట్టల్ని ఒక జత తీసుకుని దాన్ని మీ మీద నుంచి మూడు సార్లు తిప్పి ప్రవహించే నదిలో వేసి వెనక్కు చూడకుండా రావాలి.నల్లనువ్వులు, కర్పూరం, ఎండు మిర్చిలను తీసుకుని మీ ఇంటి చుట్టు తిప్పి ప్రవహించే నదిలో వేయాలి.
ఇలా చేస్తే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ పొవడంతో పాటు, ధనం కావాలనుకున్న వారికి డబ్బులు, కొత్త ఇల్లు,పెళ్లి ఇలా ఎవరి మనస్సులో ఏ కోరిక ఉంటుందో అది నెరవేరుతుంది. ( గమనిక - ఈ స్టోరీ కేవలంనమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధార పడి ఉంటుంది. జీతెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rajkumar Suicide Video: "సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాను"..నరరూప హంతకుడు రాజ్కుమార్ సూసైడ్ వీడియో!
Hyderabad, Telangana:Rajkumar Suicide Video News: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో పెను సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 6 హత్యలకు ఒడిగట్టిన కిరాతకుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘాతుకానికి పాల్పడటానికి కొన్ని గంటల ముందే (జూలై 10న సాయంత్రం 4:55 గంటలకు) ఈ వీడియో రికార్డ్ చేసినట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. అసలు రాజ్కుమార్ అంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాల్సి వచ్చింది? ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసులు విడుదల చేసిన వీడియో ప్రకారం.. నిందుతుడు రాజ్ కుమార్ వీడియో రికార్డు చేసుకొని.. తన చావుకు, ఈ ఘాతుకానికి గల కారణాలను రాజ్కుమార్ ఆ సెల్ఫీ వీడియోలో కన్నీళ్లతో వివరించాడు. "నా సంపాదనలో సగం వాళ్ల కోసమే తగలేశా. నా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లాక్కుని నన్ను పూర్తిగా రోడ్డున పడేశారు. ఆ అమ్మాయిని నమ్మి సర్వస్వం కోల్పోయాను. అప్పులపాలై, ఆఖరికి నా కన్న పిల్లలకు రూపాయి భూమి కూడా లేకుండా చేసేశాను. నన్ను ఇంతలా ముంచేసి.. చివరకు నాపైనే కేసు పెట్టి జైలుకు పంపించారు" అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
అసలేం జరిగింది?
తనపై పోక్సో (POCSO) కేసు పెట్టారనే తీవ్ర కక్షతో రాజ్కుమార్ జూలై 10న ఈ మారణహోమానికి తెగబడ్డాడు. మొదట షాబాద్ టౌన్లో సదరు మైనర్ బాలిక తల్లిని, నాయనమ్మను కత్తులతో నరికి చంపాడు. ఆ తర్వాత తన స్వంత భార్యాపిల్లలను కూడా అతి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం మైనర్ బాలికను కారులో కిడ్నాప్ చేసి అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతుకోసి చంపేశాడు.
ఈ ఆరు హత్యల అనంతరం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగానే, అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజ్కుమార్ మృతదేహం లభ్యమైన చోటే ఈ కీలకమైన మొబైల్ ఫోన్ కూడా దొరికింది.
కారులోనే బాలిక.. ముమ్మరంగా దర్యాప్తు
భార్యాపిల్లలను చంపే ఆ భయానక సమయంలో మైనర్ బాలిక కారులోనే ఉందనే ఆందోళనకరమైన విషయం కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. "ప్రస్తుతం నిందితుడి మొబైల్ ఫోన్ను, అందులోని సెల్ఫీ వీడియోను సైన్స్ అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL)కు పంపించాం. పూర్తి సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నాం" అని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.
Also Read: ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం? జూలై 18న మీటింగ్ అందుకే అంటున్న తారక్ ఫ్యాన్స్!
Also Read: సీఎం రేవంత్పై లైవ్ డిబెట్లో అనుచిత వ్యాఖ్యలు..వైసీపీ నేతను అరెస్టు చేసిన TG పోలీస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
