icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

షుగర్ పేషంట్లకు గుడ్ న్యూస్.. ఇక నుంచి వారానికి ఒక్కసారి ఇన్సులిన్ తీసుకుంటే చాలు..!!

BBhoomi2m ago
Secunderabad, Telangana:

Diabetes Insulin :  భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 101 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. చాలా మంది మధుమేహ రోగులు ప్రస్తుతం ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. అధిక ధర కారణంగా కొందరు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. 

డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నార్డిస్క్ అటువంటి వారికి తీపి కబురందించింది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నార్డిస్క్ మధుమేహ రోగులకు ఒక శుభవార్తను అందించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి బేసల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ అయిన అవిక్లిని ఇది భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనిని వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. టైప్ 1,  టైప్ 2 డయాబెటిస్ ఉన్న వృద్ధులు కూడా ఈ మందును ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం..  ఇన్సులిన్ వాడే చాలా మంది మధుమేహ రోగులు ప్రతిరోజూ ఇంజెక్షన్లు తీసుకోవలసి వస్తుంది. అయితే.. అవిక్లితో వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల చికిత్సను కొనసాగించే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత బేసల్ ఇన్సులిన్ కంటే ఇది మెరుగ్గా పనిచేస్తుందని, దేశవ్యాప్తంగా 4,500 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఈ ఇంజెక్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నామని నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా తెలిపారు. భారతదేశంలో దీనిని ప్రారంభించడంతో.. ఈ ఔషధం ఇప్పుడు మొత్తం ఏడు దేశాలలో అందుబాటులో ఉందని విక్రాంత్ చెప్పారు.  

Also Read: జనం అడిగారా?..ఆ ఉచిత పథకాలు ఎవరి కోసం? తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..!!

Also Read: ఉచిత వైద్యం ఉద్యోగుల హక్కు.. జీతాల్లో EHS కోతపై తెలంగాణ హైకోర్టు సీరియస్..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

కలెక్టరేట్‌లో హైడ్రామా.. పురుగుల మందు డబ్బాతో మహిళ నిరసన.. అసలేం జరిగింది?

Hyderabad, Telangana:

Jagtial Collectorate: జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన భూమిని సాగు చేసుకోనివ్వకుండా.. కొందరు అడ్డుకుంటున్నారంటూ.. న్యాయం కోసం ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్‌కు చేరుకుని నిరసనకు దిగడం పెద్ద కలకలం రేపింది. అసలు ఏం జరిగి ఉంటుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బాధితురాలి ఆవేదన..
బాధితురాలి కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన నిహారిక అనే మహిళకు అదే గ్రామంలో 30 గుంటల పట్టా భూమి ఉంది.. ఆ భూమిని సాగు చేసుకునేందుకు ఆమె సిద్ధమైంది. అయితే, తన సొంత భూమిని చదును చేసుకునేందుకు ప్రయత్నించగా.. స్థానిక సర్పంచ్ భర్త రవి అడ్డుకుంటున్నట్లు బాధితురాలు ఆరోపించారు. ట్రాక్టర్లను సైతం అడ్డుకుంటూ.. పనులు జరగకుండా నిలిపివేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల పేర్లు చెపుతూ తమను బెదిరింపులకు గురిచేస్తున్నారని..  వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని కన్నీరుమున్నీరయ్యారు.

కలెక్టరేట్‌లో హైడ్రామా.. 
స్థానికంగా అధికారులకు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకపోవడంతో, న్యాయం కోసం చివరి ప్రయత్నంగా నిహారిక జగిత్యాల కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ముందుగా తన సమస్యపై అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగారు.. అధికారులు, పాలకులు స్పందించి.. తనకు న్యాయం చేయకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ.. ఆమె ఆందోళనకు దిగడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

అయితే, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. అత్యంత అప్రమత్తంగా వ్యవహరించిన టౌన్ పోలీసులు.. మహిళ చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాను లాక్కున్నారు. దీంతో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తఈ ఘటనపై జగిత్యాల టౌన్ పోలీసులు తక్షణమే స్పందించారు. బాధితురాలు నిహారిక ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించినట్లు తెలిపారు. వెల్దుర్తి గ్రామంలోని సదరు భూ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సాగు పనులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. న్యాయం చేస్తామని పోలీసులు భరోసా ఇవ్వడంతో బాధితురాలు ఊపిరి పీల్చుకుంది. కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ హైడ్రామా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

కవిత ఆరోపణలపై బీజేపీ ఎంపీ అరవింద్‌ స్పందన.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌

Nizamabad, Telangana:

Nizamabad: 'బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీశ్‌ రావు మీద చేసిన స్వయంగా కేసీఆర్ కుటుంబసభ్యురాలు, ఇంటి మనిషి కవిత చేసిన అవినీతి, క్విడ్ ప్రోకో ఆరోపణల మీద సీబీఐ వెంటనే విచారణ జరిపించాలి' అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కవిత చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని తెలంగాణ ముఖ్యమంత్రిని ఎంపీ అర్వింద్ కోరారు. బీఆర్ఎస్ పార్టీ నిధులు, క్విడ్ ప్రో కో లావాదేవీలు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్‌తో జరిగినట్లు ఆరోపించిన ఒప్పందాలు, ఫీనిక్స్ సంస్థకు రాజకీయ అండ, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రా కాంట్రాక్టర్లకు భూముల కేటాయింపులపై కవిత చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు స్పందించిన బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్వపురి అర్వింద్‌ పత్రిక ప్రకటన విడుదల చేశారు. కవిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ, కేటీఆర్‌, హరీశ్‌ రావులపై విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కవిత చేసిన ఈ ఆరోపణలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవని తెలిపారు. కవిత ఆరోపణలపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్వతంత్ర సీబీఐ దర్యాప్తు జరిపించాలని రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ కోరారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌, ఈ కార్‌ రేసులో కేటీఆర్‌పై రేవంత్‌ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బీజేపీ ఎంపీ అర్వింద్‌ తప్పుబట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సవాల్‌ చేశారు. 'కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద దర్యాప్తును సీబీఐకి అప్పగించడంలో జరిగిన జాప్యం, ఈ-కార్ రేసులో అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలున్నా విచారణ చేపట్టకుండా కేటీఆర్‌ని రక్షించడం, ఫోన్ టాపింగ్ కుంభకోణం బాధ్యులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోపోవడంతో రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ప్రజలు ఇప్పటికే శంకిస్తున్నారు' అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.

ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే వెంటనే కాంగ్రెస్‌ ప్రభుత్వం  ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్వపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. పూర్తి పారదర్శకతతో నిజానిజాలను వెలుగులోకి తీసుకువచ్చి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రిని ఓ ప్రకటనలో అర్వింద్‌ కోరారు.

0
0
Report
Advertisement

Oppo Reno 16 సిరీస్ సేల్ షురూ.. భారీ లాంచ్ ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఇవే!

Hyderabad, Telangana:

Oppo Reno 16 Series Sale Begins: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ  ఒప్పో (Oppo) గత వారం భారత మార్కెట్‌లోకి గ్రాండ్‌గా లాంచ్ చేసిన రెనో 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు ఈ రోజ నుంచి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 16 (Oppo Reno16)తో పాటు ఒప్పో రెనో 16సి (Oppo Reno16c) మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు భారీ బ్యాటరీ, అద్భుతమైన కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌లపై కంపెనీ భారీ లాంచ్ ఆఫర్లను, డిస్కౌంట్లను కూడా ప్రకటించింది.

మార్కెట్లో ఒప్పో రెనో 16 సిరీస్ ధరలు..
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రెండు మోడళ్లలోనూ వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లను ఒప్పో కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఒప్పో రెనో 16 (Oppo Reno 16) సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ బేస్‌ వేరియంట్ ధర రూ.61,999తో అందుబాటులోకి వచ్చింది. ఇక రెండవ వేరియంట్‌ 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్‌తో ధర రూ.67,999తో లభిస్తోంది.

ఇక ఒప్పో రెనో 16సి (Oppo Reno 16c) ధరలకు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ ధర రూ.46,999తో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్‌తో ధర రూ.49,999తో అందుబాటులోకి వచ్చింది. అలాగే చివరి వేరియంట్ 12GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ ధర రూ.55,999తో లభిస్తోంది. అంతేకాకుండా వీటిపై అద్బుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు కూడా లభిస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

లాంచ్ ఆఫర్ల వివరాలు..
ఈ స్మార్ట్‌ఫోన్‌లు జూలై 9 నుంచి ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లైన అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు రిటైల్ స్టోర్లలో కొనుగోలు ప్రారంభమైంది. మొదటి సేల్ సందర్భంగా కస్టమర్ల కోసం కంపెనీ పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ఒప్పో ప్రకటించింది. కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లు లేదా UPI పేమెంట్స్‌ చేసి కొనుగోలు చేసేవారికి 10 శాతం వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎటువంటి అదనపు వడ్డీ లేకుండా 18 నెలల వరకు జీరో డౌన్ పేమెంట్ స్కీమ్‌తో కూడా ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసేవారికి గరిష్టంగా రూ.5,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీతో కలిసేదే లేదు: కవిత

Laxmidevipally, Kothagudem, Telangana:

Kothagudem: బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న రూ.1,400 కోట్ల అవినీతి సొమ్ము అమరవీరుల కుటుంబాలకు పంచాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత డిమాండ్‌ చేశారు. తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లేది లేదని సంచలన ప్రకటన చేశారు. తాను మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీతో భయం లేదంటూనే ఈసీకి వెయ్యికి పైగా కంప్లైంట్స్ ఇచ్చారని బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు.

కొత్తగూడెంలో నిర్వహించిన రెండో విడత బొగ్గుబాయి యాత్రలో భాగంగా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతోపాటు తన పార్టీకి సంబంధించిన వ్యవహారంపై స్పందించారు. 'టీఆర్ఎస్ అనే పేరు నాకు రాకుండా ఉండాలని కుట్రలు చేస్తున్నారు. నా ప్రజా పోరాటాలను ప్రజల్లోకి వెళ్లకుండా కాంగ్రెస్, బీజేపీలతో చేతులు కలుపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక నీతి, నియమం అంటూ ఏమీ లేవా?' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'డబ్బు ఉంటే సోషల్ మీడియా, మీడియాను కొనుగోలు చేసి మా వార్తలు రాకుండా చేయాలని చూస్తున్నారా? పార్టీని జోడెద్దుల మాదిరిగా నడపాల్సిన వాళ్లే అంబోతుల్లాగా సిగ్గు లేని వ్యవహారాలు చేస్తున్నారు' అని మండిపడ్డారు.

'తల్లి, చెల్లె అనే సభ్యత మరిచి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నారు. సభ్యత మరిచి తిడితే ఊరుకునేందుకు ఇది ఆంధ్రా కాదు.. కాళ్లు విరగొట్టి చేతుల్లో పెడతాం బిడ్డా' అని గులాబీ పార్టీ సోషల్‌ మీడియాకు హెచ్చరించారు. తమ పార్టీకి సంబంధించిన వార్తలు రాసే వారికి సిగ్గు వదిలి గుంటనక్క ఫోన్లు చేస్తూ రాయవద్దని చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఒక పార్టీ తన విధానాలు చెప్పుకుంటూ ప్రజా పోరాటాలు చేసుకునే హక్కు లేదా? మేము ఉద్యమకారుల గురించి పోరాటం చేస్తే ఆ వార్తలు రాకుండా ఫోన్లు చేసి అడ్డుకున్నారు. అంటే మీరు ఉద్యమకారులకు అన్యాయం చేస్తే...మేము పోరాటం చేయటం మీకు సమస్యగా మారిందా?' అని బీఆర్‌ఎస్‌ పార్టీని ప్రశ్నించారు.

'అసలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్‌లో ఉన్న రూ.1,400 కోట్లు క్విడ్ ప్రొకో ద్వారా వచ్చినవి కావా? ఆ డబ్బును అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పంచాలి' అని కవిత డిమాండ్ చేశారు. ఒక ఆడబిడ్డ ఒంటరిగా ధైర్యంగా పోరాటం చేస్తే ఇన్ని కుట్రలు చేస్తారా? అని నిలదీశారు. 'ప్రజల కోసం పోరాటం చేయాలంటే ప్రజాబలం, గుండె బలం ఉండాలి. దమ్ముంటే నాతో పాటు ప్రజా సమస్యల పోరాటం విషయంలో పోటీ పడండి' అని బీఆర్‌ఎస్‌ పార్టీకి సవాల్‌ చేశారు.

ఈ సందర్భంగా తన సోదరుడు, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. 'కేటీఆర్‌ తన మిత్రుడు ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్‌కు క్విడ్ ప్రొకో ద్వారా అక్రమ పర్మిషన్లు ఇచ్చారు' అని సంచలన ప్రకటన చేశారు. 'కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో అనకొండ అయిన హరీశ్ రావునే బీఆర్ఎస్ ఇంకా ముందు పెడుతోంది. ఇక ఆ పార్టీ జీవితంలో బాగుపడని స్పష్టమైంది' అని శాపనార్థాలు పెట్టారు. 'చేసిన అవినీతి, పెద్ద ఆయనకు అంటించిన అవినీతి మరకలు చాలవన్నట్లుగా మూడు నెలలు మంత్రి పదవి కావాలంట?' అని మాజీ మంత్రి హరీశ్‌ రావుపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

0
0
Report

Krait In Girl Hostel: గర్ల్స్ హాస్టల్ గదిలో విషాదం.. పడుకున్న నలుగురు విద్యార్థుల్ని కాటేసిన పాము..ఒకరు మృతి!

Lohardaga, Jharkhand:

Krait In Jharkhand Girl Hostel: జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో ఉన్న ఒక రెసిడెన్షియల్ పాఠశాల బాలికల హాస్టల్‌లో ఘోరం చోటు చేసుకుంది. వసతి గృహంలో రాత్రి నిద్రిస్తున్న విద్యార్థినుల గదిలోకి విషపూరితమైన కట్లపాము (krait) ప్రవేశించింది. నిద్రిస్తున్న అమ్మాయిల్లో నలుగురిని ఈ పాము కాటేసింది. అందులో 12 ఏళ్ల బాలిక మృతి చెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఆ గదిలోకి పాము ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఏం జరిగిందంటే?
జార్ఖండ్‌లోని లోహర్‌దగా జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాల గర్ల్స్ హాస్టల్‌లో ఈ ఘోరం జరిగింది. రాత్రి పూట విద్యార్థినులు నిద్రిస్తున్న వేళ అనుకోకుండా కట్లపాము గదిలోకి ప్రవేశించినట్లు సహా విద్యార్థినులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలిక మృతిచెందగా.. మరో ముగ్గురు ఆస్పత్రిలో చేరారని పోలీసులు గురువారం వెల్లడించారు. 

ఈ ఘటన మంగళవారం రాత్రి కురు పోలీస్ స్టేషన్ పరిధిలోని రోచో మహువాటోలిలో ఉన్న 'సన్వాసిర హైయర్ సెకండరీ రెసిడెన్షియల్ స్కూల్'లో జరిగింది. "పాము నలుగురు విద్యార్థినులను కాటేసింది, వారిలో ఒకరు మరణించారు. ఇద్దరు విద్యార్థినులు లోహర్‌దగా సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరొకరిని రాంచీలోని రిమ్స్ (RIMS)కు తరలించారు" అని కురు పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అజిత్ కుమార్ తెలిపారు.

మంగళవారం రాత్రి భోజనం తర్వాత విద్యార్థినులు గ్రౌండ్ ఫ్లోర్‌లోని తమ హాస్టల్ గదికి వెళ్లారని పాఠశాల ప్రతినిధి ఒకరు చెప్పారు. "ఏడుగురు విద్యార్థినులు నిద్రిస్తున్న గదిలోకి 'క్రైట్' (కట్లపాము) పాము ప్రవేశించి, వారిలో ఒకరిని కాటేసింది. ఆమె కేకలు వేయడంతో మిగిలిన వారు నిద్రలేచారు, కానీ అప్పటికే అది మరో ముగ్గురిని కాటేసింది" అని ఆయన పేర్కొన్నారు.

మరణించిన బాలికను స్నేహ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలౌడి నవటోలికి చెందిన వర్ష ఒరాన్‌గా గుర్తించారు. పాము హాస్టల్ గదిలోకి ఎలా వచ్చిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదని పాఠశాల అధికారి తెలిపారు.

Also Read: రైల్వే ప్రయాణికలకు గుడ్‌న్యూస్..ఇకపై కేవలం రూ.200లకే స్లీపింగ్ పాడ్స్‌లో విశ్రాంతి!

ALso Read: వినియోగదారులకు కీలక అలర్ట్.. రూ.100 కరెన్సీ నోట్‌పై ఆర్బీఐ కీలక ప్రకటన..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

ఫ్లిప్‌కార్ట్‌లో Oppo Reno 13 5Gపై రూ.5,000 పైగా తగ్గింపు.. లాస్ట్ ఛాన్స్ మిస్ అవ్వకండి!

Hyderabad, Telangana:

Oppo Reno 13 Discount: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే శుభవార్తను అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న గోట్ సేల్ (GOAT Sale) ఈ రోజుతో ముగుస్తుంది. ఈ సేల్ చివరి రోజున రూ. 35,000 బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో కూడిన ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునే వినియోగదారులకు  ఒప్పో రెనో 13 5G (Oppo Reno 13 5G) స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని రీతిలో భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ లభిస్తున్నాయి. ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు బ్యాంక్ ఆఫర్లన వినియోగించి.. కొనుగోలు చేసేవారికి దాదాపు రూ.5,000 కంటే ఎక్కువ మొత్తంలో భారీ తగ్గంపు లభిస్తోంది..

ధరల వివరాలతో పాటు ప్రత్యేక ఆఫర్లు..
ఒప్పో రెనో 13 5G బేస్ వేరియంట్ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.37,999తో అందుబాటులో ఉంది.. అయితే, ప్రస్తుతం ఈ ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్ రూ.34,999కే పొందవచ్చు. దీనికి అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Flipkart Axis Bank Credit Card)తో కొనుగోలు చేసే వారికి రూ.2,225 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్లన్నింటినీ కలుపుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్ ఎఫెక్టివ్ ప్రైస్ కేవలం రూ.32,774కే లభిస్తుంది.. అంటే లాంచ్ ధరతో పోలిస్తే.. వినియోగదారులు నేరుగా రూ.5,225 వరకు ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం చేస్తే అదనంగా భారీ మొత్తంలో డిస్కౌంట్‌ లభిస్తుంది. 

ఒప్పో రెనో 13 5G ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు...
ఈ ఒప్పో రెనో 13 5G స్మార్ట్‌ఫోన్ ప్రీమియం డిజైన్‌తో పాటు అద్బుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇది 6.59- అంగుళాల 1.5K ఫ్లాట్ OLED కర్వ్‌డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2760×1256 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం.. ఇందులో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది.. అంతేకాకుండా అత్యంత శక్తివంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 (MediaTek Dimensity 8350) చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది.. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ ఓఎస్ 15 (ColorOS 15) ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫోటోగ్రఫీ ప్రియుల కోసం.. బ్యాక్‌ సెటప్‌లో OIS సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.. అంతేకాకుండా సెల్ఫీలతో పాటు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ హై-రెజల్యూషన్ ఫ్రంట్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి. ఈ మొబైల్‌ ఎంతో శక్తవంతమైన 5800mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 80W సూపర్ ఊక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కు IP66 + IP68 + IP69 రేటింగ్స్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.. కనెక్టివిటీ పరంగా 5G, వై-ఫై 6, బ్లూటూత్ 5.4తో పాటు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ సపోర్ట్ లభిస్తాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

OG2 Album Niranjan: పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్‌ కోసం 'ఓజీ' సినిమా నుంచి గిఫ్ట్! ఎస్ఎస్ తమన్ సంచలన నిర్ణయం!

Hyderabad, Telangana:

OG2 Album Dedicates Niranjan: అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ, హనుమకొండకు చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ వార్త పవన్ కళ్యాణ్‌తో పాటు 'ఓజీ' చిత్ర బృందాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తన డైహార్డ్ ఫ్యాన్ మరణంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ నోట్ పంచుకోగా, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'ఓజీ 2' ఆల్బమ్‌ను నిరంజన్‌కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.

చివరి కోరిక తీర్చిన జనసేనాని
అరుదైన వ్యాధితో మంచానికే పరిమితమైన నిరంజన్, తనను కలవడమే చివరి కోరికని తెలపడంతో.. పవన్ కళ్యాణ్ ఇటీవలే స్వయంగా హనుమకొండలోని అతడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆ సమయంలో నిరంజన్‌కు పవన్ ఒక ప్రత్యేకమైన మాట ఇచ్చారు. "మనిద్దరం కలిసి 'ఓజీ' సినిమా చూద్దాం. నేను 'ఓజీ 2' చేస్తే దాంట్లో నువ్వే స్పెషల్ గెస్ట్. నిన్ను కచ్చితంగా మళ్లీ పిలిపిస్తాను. ఇంకోసారి నీకోసం వస్తాను" అయితే, ఆ సినిమా చూసేలోపే నిరంజన్ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచాడు.

'ఓజీ' టీమ్ ఘన నివాళి
మన లీడర్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ప్రకారం.. 'ఓజీ 2' ఆల్బమ్‌ను నిరంజన్‌కు అంకితం ఇస్తున్నట్లు సంగీత దర్శకుడు థమన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. "తన జీవితంలో కొనసాగుతున్న బాధల మధ్య, ఈ రోజున ఆయన ఎంత సంతోషంగా ఉండేవారో.. డియర్ నిరంజన్, నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. మన లీడర్ చెప్పినట్లుగానే, మా ఆల్బమ్‌ను నీకు అంకితం చేస్తాము" అని థమన్ రాసుకొచ్చారు. నిరంజన్ పట్ల చిత్ర యూనిట్ చూపిన ఈ గౌరవానికి పవన్ అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్
నిరంజన్ మరణంపై పవన్ కళ్యాణ్ 'ఎక్స్' (ట్విట్టర్)లో భావోద్వేగంగా స్పందించారు. "కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. అంతటి అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసి, నన్ను చూడగానే అతని ముఖంలో విరిసిన ఆ చిరునవ్వు ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం. అతని శరీరం వ్యాధితో పోరాడినా, మనసు మాత్రం అపారమైన ధైర్యంతో, జీవితం పట్ల ఆశతో నిలిచింది. అలాంటి చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం తీవ్రంగా కలచివేస్తోంది" అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 

నిరంజన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, అతని కుటుంబ సభ్యులకు ఈ తీరని దుఃఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ తన సందేశంలో పేర్కొన్నారు.

Also Read: "ఆ హీరో ముద్దు పెట్టుకుంటూ అక్కడ చేయి పెట్టాడు"..'పోటుగాడు' హీరోయిన్ షాకింగ్ కామెంట్

Also Read: సైలెంట్‌గా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్ స్వాతి.. ఆ డైరెక్టర్‌తో సీక్రెట్ పెళ్లి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

రూ.10.49 లక్షలకే Nissan Tekton SUV లాంచ్.. ఫీచర్లు అదరహో!

Hyderabad, Telangana:

Nissan Tekton Price: భారతీయ మిడ్-సైజ్ SUV మార్కెట్‌లో దూసుకుపోయేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ  నిస్సాన్ ఇండియా సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించింది. ఎంతో కాలంగా కార్ల లవర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త కాంపాక్ట్ SUV నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton)ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి ఈ రోజు విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించిన్నట్లు కంపెనీ అధికారంగా వెల్లడించింది. ఈ మోడల్‌తో నిస్సాన్ సంస్థ భారత మార్కెట్‌లో ఎంతో డిమాండ్‌ ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్‌తో పాటు టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీని ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అద్భుతమైన డిజైన్..
నిస్సాన్ సంస్థ తన గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన పెట్రోల్ SUVను దృష్టిలో పెట్టుకుని ఈ టెక్టాన్‌ను తయారు చేసిన్నట్లు తెలుస్తోంది.. అందుకే దీనిని ఆటోమొబైల్ నిపుణులు బేబీ పెట్రోల్‌గా పిలుస్తున్నాయి. ముందు భాగంలో అప్‌రైట్ ఫాసియా.. ఎల్-షేప్డ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు (LED DRLs)తో పాటు వెడల్పైన గ్రిల్, బోనెట్ కింద కనెక్ట్ చేసిపన లైట్‌బార్ కారుకు రోడ్ ప్రెజెన్స్‌ను, అద్భుతమైన రూపాన్ని అందిస్తాయి.. వెనుక భాగంలో రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, సీ-షేప్డ్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌తో పాటు టెక్టాన్ బ్రాండింగ్ ఆకట్టుకుంటున్నాయి. ఈ SUV 212 mm గ్రాండ్ క్లియరెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది.

లగ్జరీ ఇంటీరియర్..
కారు లోపలి భాగం అద్భుతమైన టెక్నాలజీతో పాటు లగ్జరీతో అందుబాటులోకి వచ్చింది.. గూగుల్ ఇన్‌బిల్ట్ సపోర్ట్‌తో కూడిన 10.1-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా అద్భుతమైన పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్స్‌తో పాటు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్స్‌ లభించబోతున్నాయి. ఇవే కాకుండా 360-డిగ్రీ కెమెరాతో పాటు 48-కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులోకి రావడం విశేషం..

శక్తివంతమైన ఇంజన్..
నిస్సాన్ టెక్టాన్ ప్రధానంగా రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది.. ఇందులో మొదటిది.. 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్.. ఇది 100 PS పవర్‌తో పాటు 160 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వెల్లడించింది. అలాగే ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక రెండవది.. 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్.. ఇది మరింత శక్తివంతమైనదిగా కంపెనీ తెలిపింది. ఇది 163 PS పవర్‌తో పాటు 280 Nm టార్క్‌ను అందిస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్, DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా అందించిన్నట్లు తెలుస్తోంది.

5 స్టార్ రేటింగ్..
నిస్సాన్ టెక్టాన్ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది.. ఇది SUV భారత్ NCAP (BNCAP) క్రాష్ టెస్టింగ్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిందని కంపెనీ తెలిపింది.. ఇందులో బేసిక్ వేరియంట్ నుంచే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్‌తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) సపోర్ట్‌ అందుబాటులో ఉన్నాయి.. అలాగే అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (Level 2 ADAS) ఫీచర్ కూడా టాప్ వేరియంట్లలో అందుబాటులో లభిస్తాయి..

బుకింగ్స్‌.. డెలివరీలు వివరాలు..
రెనాల్ట్-నిస్సాన్ అలయన్స్ RGMP ప్లాట్‌ఫారమ్‌పై తయారైన ఈ కారుకు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జూలై 20 నుంచి కస్టమర్లకు డెలివరీలు ప్రారంభమవుతాయని నిస్సాన్ ఇండియా ప్రకటించింది. క్రెటా, సెల్టోస్, సియెర్రాల డిమాండ్‌ నడుస్తున్న ఈ సమయంలో మిడ్-సైజ్ SUV విభాగంలో నిస్సాన్ టెక్టాన్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సిందే..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

అయ్యే.. కన్నపిల్లలను ఐరన్ రాడ్లతో చితకబాది, వాతలు పెట్టిన కసాయి తల్లిదండ్రులు!

Hyderabad, Telangana:

Huzurnagar Crime News Telugu: కన్నపిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయిన తల్లిదండ్రులు.. పిల్లలకు కాలయముళ్లయ్యారు. నరరూప రాక్షసుల్లా మారి కన్నప్రేమను మరువడమే కాకుండా.. పసిబిడ్డలపై అమానుషంగా ప్రవర్తించారు.. తప్పు చేస్తే మందలించాల్సింది పోయి.. ఉన్మాదుల్లా మారి ఇద్దరు చిన్నారులను ఐరన్ రాడ్లతో చితకబాది.. ఒళ్లంతా వాతలు పెట్టిన హృదయవిదారక ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో వెలుగుచూసింది.

ఒంటినిండా వాతలు.. 
స్థానికులతో పాు పోలీసుల అదించిన సమాచారం ప్రకారం... హుజూర్ నగర్ ప్రాంతానికి చెందిన నకిరికంటి రవి, ఇందు దంపతులకు ధనుష్, రేవంత్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఏమైందో ఏమో కానీ.. ఈ కసాయి తల్లిదండ్రులకు పిల్లలపై తీవ్ర ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోయిన రవి, ఇందు దంపతులు ఇద్దరు పసిపిల్లలను బంధించి తీవ్రంగా కొట్టారు.. అంతటితో వారి కసి తీరలేదు.. ఇనుప రాడ్లను కాల్చి చిన్నారుల శరీరాలపై ఇష్టమొచ్చినట్లు వాతలు పెట్టారు.. తల్లిదండ్రుల ఉన్మాదపు చర్యల కారణంగా ఆ పసివాళ్లు తట్టుకోలేక.. భరించలేని నొప్పితో విలవిలలాడిపోయారు. తీవ్ర గాయాలపాలు కావడంతో పిల్లలిద్దరూ స్పృహతప్పి పడిపోయారు.

చలించిపోయిన స్థానికులు.. 
చిన్నారుల ఆర్తనాదాలతో పాటు వారి పరిస్థితిని గమనించిన స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. పిల్లల ఒంటి నిండా ఉన్న గాయాలతో పాటు ఐరన్ రాడ్ల వాతలను చూసి.. స్థానికుల గుండెలు తరుక్కుపోయాయి. పసిపిల్లలపై ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఆ కసాయి తల్లిదండ్రులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఈ తల్లిదండ్రుల బారి నుంచి ఆ ఇద్దరు చిన్నారులను స్థానికులే చొరవ తీసుకుని సురక్షితంగా రక్షించారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

పోలీస్ స్టేషన్‌కు తరలింపు.. 
బాధిత చిన్నారులను రక్షించిన స్థానికులు వెంటనే.. వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పిల్లల దీనస్థితిని.. ఒంటిపై ఉన్న రక్తం గడ్డకట్టిన గాయాలను చూసి పోలీస్ సిబ్బంది సైతం కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.. వెంటనే చిన్నారులకు ప్రథమ చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కన్నపిల్లలపై ఇంతటి క్రూరత్వానికి కారణమైన నకిరికంటి రవి, ఇందులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. పసి హృదయాలను గాయపరిచిన ఈ ఉన్మాద తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని స్థానికులు సైతం డిమాండ్ చేస్తున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

శని వక్రగతి 2026 ఎఫెక్ట్‌.. జూలై 27 నుంచి ఈ 3 రాశుల వారికి కష్టాలు.. మీ రాశి ఉందా?

Hyderabad, Telangana:

Saturn Retrograde 2026 Effect: జ్యోతిష్యశాస్త్రంలో న్యాయదేవుడిగా, కర్మఫల ప్రదాతగా భావించే శని దేవుడు త్వరలోనే తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి తీవ్రమైన ఇబ్బందులను, సవాళ్లను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. 2026 జూలై 27వ తేదీన శని దేవుడు మీన రాశిలో వక్రగమనాన్ని ప్రారంభించనున్నాడు. ఈ వక్ర స్థితి 2026 డిసెంబర్ 11 వరకు కొనసాగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంటే రాబోయే నాలుగున్నర నెలల పాటు కొన్ని రాశుల వారు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.. డిసెంబర్ 11న శని మళ్లీ సక్రమ మార్గంలోకి వచ్చిన తర్వాతే వీరికి ఉపశమనం లభిస్తుంది.

ఏల్నాటి శని బాధితులకు మరిన్ని సమస్యలు..
సాధారణంగా ఏల్నాటి శని నడుస్తున్న రాశులపై శని వక్రగమనం అత్యంత తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మనందరికీ తెలుసు.. శని వెనక్కి తిరిగినప్పుడు శక్తి ప్రభావం మరింత పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. దీనివల్ల ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రాశుల వారి సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది.. ఈ సమయంలో ముఖ్యంగా మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి (Mesha Rashi) 
మేష రాశి వారికి శని వక్రగమనం వల్ల ఆర్థిక పరంగా.. మానసిక పరంగా తీవ్రమైన ఒత్తిడి వంటి సమస్యలు కూడా వస్తాయి.. మీరు ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులు లేదా పనులలో ఊహించని అడ్డంకులు ఎదురవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఖర్చులు అకస్మాత్తుగా విపరీతంగా పెరుగుతాయి. ఈ నాలుగున్నర నెలల పాటు  ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది.. ఎవరికీ అప్పులు ఇవ్వడం కానీ.. తీసుకోవడం కానీ చేయకపోవడం మంచిది.. లేదంటే భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.

కుంభ రాశి (Kumbha Rashi) 
కుంభ రాశి వారికి ప్రస్తుతం ఏల్నాటి శని రెండో దశ కొనసాగుతోంది. శని వక్రగమనం వల్ల వీరి సమస్యలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పని ప్రదేశంలో వీరికి సహోద్యోగులతో లేదా పైఅధికారులతో తీవ్రమైన వాదోపవాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఈ కాలంలో సమయంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. పాత వ్యాధులు మళ్లీ ఇబ్బంది పెట్టవచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ మాట తీరుపై.. కోపంపై ఖచ్చితమైన నియంత్రణ ఉంచుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

మీన రాశి (Meena Rashi) 
శని దేవుడు మీన రాశిలోనే వక్రగమనంలోకి వెళ్లడం.. అలాగే మీన రాశి వారికి ప్రస్తుతం ఏల్నాటి శని మొదటి దశ నడుస్తుండటంతో ఈ రాశి వారే అందరికంటే ఎక్కువగా ప్రభావితం అవుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. నిరంతరం మానసిక ఆందోళనతో పాటు కుటుంబంలో కలహాలు, గృహ వాతావరణంలో అశాంతి నెలకొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసే పనులలో విపరీతమైన ఆలస్యం జరగడం వల్ల తీవ్ర నిరాశకు లోనవుతారు. ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం దక్కడం లేదనే భావన కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అదృష్టం అస్సలు కలిసిరాకపోవడంతో పాటు బోనస్‌గా అనే సమస్యలు వస్తాయి.. ఈ రాశి వారు ఎంతో ఓపికతో వ్యవహరించాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా శని చాలీసా పఠించడం వల్ల శని దేవుని కీడు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

తండ్రి లేని లోటును భర్తీ చేస్తూ.. ఆటో నడుపుతూ.. నలుగురిని సాకుతున్న యువతి!

Hyderabad, Telangana:

Inspiring Woman Auto Driver News: సమాజంలో ఎంత మార్పు వచ్చినా.. ఆడపిల్లల సామర్థ్యాల పట్ల కొన్ని అపోహలు ఇంకా కొనసాగుతూనే వస్తున్నాయి. కానీ, ఆ అపోహలన్నింటినీ ఏ మాత్రం లెక్కచేయకుండా.. సవాళ్లను ఎదురు నిలించింది ఒక యువతి... కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చడానికి తానే.. ఒక సైన్యమై కదిలింది. ఆటో డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుని.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆటో పట్టి దూసుకుపోతోంది బట్టి సరస్వతి.. ఇంట్లో మగ దిక్కు లేకపోయినా.. తానే ఆ ఇంటికి పెద్ద కొడుకుగా మారి ముగ్గురు ఆడపిల్లల కుటుంబాన్ని సాకుతున్న ఈ యువతి కథ ప్రతి ఒక్కరినీ కదిలిస్తూనే.. కొండంత ధైర్యాన్ని ఇస్తోంది..

కన్నతండ్రి దూరమైనా.. 
మహబూబాబాద్ పట్టణంలోని గాయత్రీ గుట్ట కాలనీకి చెందిన బట్టి సరస్వతి జీవితం మొదటి నుంచి పూలబాట ఏమీ కాదు.. ఆ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు.. వారు ఇంకా లోకం తెలియని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే.. కన్నతండ్రి వారిని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ తల్లి తన ముగ్గురు ఆడపిల్లలను రెక్కల కష్టం చేస్తూ.. సాకుతూ వచ్చింది. కానీ రోజులు గడిచేకొద్దీ ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా పెరిగాయి. ఇంట్లో సంపాదించే.. మగ దిక్కు లేకపోవడం.. కేవలం ఆడపిల్లలే ఉండటంతో సమాజం నుంచి కూడా ఆ కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు, అవహేళనలు ఎదురయ్యాయి.

భిన్నమైన మార్గం.. 
కుటుంబ పరిస్థితులు చూసి సరస్వతి చలించిపోయింది.. ఎలాగైనా తన తల్లికి, సోదరీమణులకు అండగా నిలవాలని నిశ్చయించుకుంది. సాధారణంగా మహిళలు ఎంచుకునే కుట్టుపని, ఇతర కూలి పనులు కాకుండా.. సరస్వతి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది.. తనకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే విపరీతమైన ఆసక్తి.. వేరే పనులు తెలిసినప్పటికీ.. తన మనసుకు నచ్చిన, ఇష్టమైన డ్రైవింగ్ రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకుంది.

సమాజంలో ఒక మహిళ ఆటో నడపడం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని.. పురుషుల సమాజంలో అడుగుపెట్టి ఆటో నడపడం అంత తేలిక కాదు.. కానీ.. వాటన్నింటినీ తన ఆత్మవిశ్వాసంతో అధిగమించి.. ఆటో డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ సాధించింది. మహబూబాబాద్ రోడ్లపై ఆటో నడపడం ప్రారంభించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది.

నేటి తరానికి ఆదర్శం.. 
ప్రస్తుతం సరస్వతి ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడుపుతూ కష్టపడుతోంది.. ముగ్గురు ఆడపిల్లల భారాన్ని.. తల్లి బాధ్యతను తన భుజాలపై వేసుకుని జీవనం సాగిస్తోంది. ఆటో నడపడం వల్ల వచ్చే సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది.. తమ ఇంట్లో మగవారు లేరనే వెలితి వారి అమ్మకు రాకూడదని అనుకుందని.. అందుకే తనే ఆ బాధ్యత తీసుకున్నానని.. ఈ వృత్తి నాకు గౌరవాన్ని, నా కుటుంబానికి తిండిని ఇస్తోందని.. సరస్వతి గర్వంగా చెబుతోంది.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆటో నడుపుతున్న సరస్వతిని చూసి స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఎంతో ఆశ్చర్యపోవడమే కాకుండా.. ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు. తోటి ఆటో కార్మికులు సైతం ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కష్టాలు వచ్చాయని కుంగిపోకుండా.. తండ్రి లేని లోటును భర్తీ చేస్తూ.. స్వయంశక్తితో నిలబడిన బట్టి సరస్వతి నేటి తరానికి.. ముఖ్యంగా ఎంతోమంది యువతులకు ఒక గొప్ప రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు స్పందించి.. ఇలాంటి వీరనారికి మరింత ప్రోత్సాహంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తే.. ఆమె కుటుంబానికి మరింత మేలు జరుగుతుందని స్థానికులు కోరుతున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Deo రాదు.. పరిస్థితి మారదు.. కారిడార్లలో ఉపాధ్యాయుల సర్వీస్ ఫైళ్లు.. సంగారెడ్డి కలెక్టరేట్‌లో విద్యాశాఖ దారుణ పరిస్థితి..!!

BBhoomi5h ago
Secunderabad, Telangana:

Sangareddy Collectorate: సంగారెడ్డి విద్యాశాఖలో పరిస్థితి  ఎక్కడ వేసిన  గొంగడి.. అక్కడే అన్నట్లుగా తయారైంది. ఒకవైపు డీఈఓ కార్యాలయాన్ని పూర్తిగా కలెక్టరేట్ లోకి తరలించడం.. అదే సమయంలో 15 రోజులుగా డీఈఓ సెలవులో ఉండటంతో.. ఫైళ్లన్ని పెండింగ్ లో పడిపోయాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లు అస్సలు కదలడం లేదు. చెక్ పవర్ డీఈఓ కే ఉండటంతో ఎఫ్ఓసీ బాధ్యతలను అడిషనల్ డైరెక్టర్ శంకర్ కు అప్పగించినా.. ఆయన విధులు మొక్కుబడిగానే సాగుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక ఇటు ఉద్యోగులు, అటు ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.

జాయిన్ అయిన పక్షం రోజులకే  సెలవులో డీఈఓ:
సంగారెడ్డి జిల్లా విద్యాధికారిగా రోహిణి జూన్ 3న బాధ్యతలు స్వీకరించారు. ఆమె విధుల్లో చేరిన 20 రోజులకే లాంగ్ లీవ్ పెట్టేశారు. మొదట 15 రోజులు సెలవులో ఉన్నారని కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నా.. సంగారెడ్డిలో పనిచేసేందుకు ఆమె సుముఖంగా లేనట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె సెలవును మరికొన్ని రోజులు పొడిగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఆర్సీవో గా ప్రమోషన్ వస్తుందన్న ఆలోచనతోనే కొన్ని రోజులు సెలవును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే డీఈఓగా పనిచేసిన 20 రోజుల్లోనూ పాత కార్యాలయం వైపు వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపలేదని చర్చ జరుగుతోంది. 

సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న డీఈఓ ఆఫీస్ భవనం పాతబడిపోవడంతో అందులో అడుగుపెట్టేందుకు కూడా రోహిణి సముఖత వ్యక్తం చేయలేదని టాక్. గతంలో హైదరాబాద్ లో పనిచేసిన డీఈఓ  సంగారెడ్డి కార్యాలయం చూడగానే ఇదేం ఆఫీస్.. కూలే స్థితిలో ఉన్న ఈ భవనంలో ఎలా ఉంటున్నారని పలువురు ఉద్యోగులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పాత భవనంలో ఉండేందుకు ఇష్టం లేకే సంగారెడ్డి కలెక్టరేట్ లో ఉన్న సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయం వేదికగానే ఫైళ్లు క్లియర్ చేసినట్లు సిబ్బంది చెబుతున్నారు.

కీలక ఫైళ్లన్నీ కారిడార్ లోనే:
మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న విద్యాశాఖ కార్యాలయాన్ని సంగారెడ్డి కలెక్టరేట్ లోకి తరలించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సెకండ్ ఫ్లోర్ లోని సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయంలోకి డీఈవో కార్యాలయానికి తరలించారు. అయితే ఏళ్ల తరబడి భద్రంగా ఉంచిన కీలక ఫైళ్లు, ఉపాధ్యాయుల సర్వీస్ వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లు, ఆఫీస్ వ్యవహారాల దస్త్రాలు ఎక్కడ పెట్టాలో తెలియక సిబ్బంది.. కార్యాలయం కారిడార్ లోనే ఉంచేశారు. దీంతో కీలక ఫైళ్లు ఉంటాయా.. మాయమౌతాయా అన్న ఆందోళన ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో నెలకొంది. కార్యాలయానికి అవసరమైన స్థలం లేకపోవడంతోనే కారిడార్ లో మూటలు కట్టి.. ఫైళ్లు పెట్టామని సిబ్బంది చెబుతున్నప్పటికీ.. ఎలాంటి భద్రత లేకుండా పడి ఉంటే వాటిని పట్టించుకునే నాథుడు లేరని పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదన్న ఆందోళన పలువురిలో కనిపిస్తోంది.

ఫైళ్లు పెడింగ్ లో.. ఉపాధ్యాయులు ఆందోళనలో..:
డీఈఓ సంతకం చేస్తే గానీ ముందుకు సాగని ఫైళ్లు గత పక్షం రోజులుగా పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్స్ వంటివి పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఉపాధ్యాయుల సర్దుబాటు కూడా జరగకపోవడంతో కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. డీఈఓ పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెలవు పెట్టాలనుకున్న డీఈఓ ఇక్కడికి రాకపోయినా బాగుండేదిగా అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యాశాఖ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: జనం అడిగారా?..ఆ ఉచిత పథకాలు ఎవరి కోసం? తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..!!

Also Read: ఉచిత వైద్యం ఉద్యోగుల హక్కు.. జీతాల్లో EHS కోతపై తెలంగాణ హైకోర్టు సీరియస్..!!

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top