బండ్లగుడా జాగిర్ నూతన మేయర్ మొదటి సమావేశం
Hyderabad, Telangana:రంగారెడ్డి జిల్లా.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ నూతన మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు... ఈ సమావేశంలో కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం రూ 51.11 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారనీ మేయర్ అన్నారు... ముఖ్యంగా కార్పొరేషన్ లో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కోసం హిమాయత్ సాగర్ ఫిల్టర్ బెడ్లను ఏర్పాటుతో మంచినీటి సమస్యతో పాటు మెరుగైన మాలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు..हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Realme P4R 5G: రూ.4,999లకే Realme P4R 5G స్మార్ట్ఫోన్.. ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్ ఆఫర్స్!
Hyderabad, Telangana:Realme P4R 5G Launched on Flipkart: బడ్జెట్ ధరలు ప్రీమియం ఫీచర్లను కోరుకునే స్మార్ట్ఫోన్ ప్రియుల కోసం ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్ మీ సరికొత్త మొబైల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత యువతను లక్ష్యంగా చేసుకొని కంపెనీ Realme P4R 5Gను మోడల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మోడల్ ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో ప్రత్యేకమైన ఆఫర్లతో సందడి చేస్తోంది. ముఖ్యంగా లావెంటర్ కలర్తో కూడిన 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చింది..
ప్రస్తుతం Realme P4R 5G మొబైల్ ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart)లో ప్రత్యేక ఆఫర్లతో అందుబాటులో ఉంది. అయితే, దీనికి సంబంధించిన సేల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది అంతలోనే దీనిపై కంపెనీ ప్రత్యేకమైన స్పెషల్ తీసుకుంటే ఆఫర్స్ అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేసే వారికి ఇది అత్యంత చీప్ ధరకు లభిస్తోంది. Realme P4R 5G స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది అత్యంత తక్కువ ధరలోనే ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఇది భారీ 8000mAh టైటాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి తోడు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం. అలాగే గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన బైపాస్ చార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది..
సినిమాలు, గేమింగ్ ప్రియుల కోసం ఈ స్మార్ట్ఫోన్ కంపెనీ అద్భుతమైన 6.8 అంగుళాలు కలిగిన సన్లైట్ డిస్ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అందుబాటులోకి రావడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. అంతేకాకుండా ఫోటోగ్రఫీకి కూడా ఈ స్మార్ట్ఫోన్ ఎంతగానో సహాయపడుతుంది.. ఇందులో వెనక భాగంలో అద్భుతమైన 50 మెగాపిక్సెల్ AI కెమెరాను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పాటు తక్కువ వెలుగులోను అద్భుతమైన పోర్ట్రైట్ షాట్స్ తీసుకునే విధంగా వివిధ రకాల కొత్త కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ఎరైజర్ తో పాటు జాల ప్రత్యేకమైన నెక్స్ట్ ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఫోటో ఎడిటింగ్ మరింత సులభతరం అవుతుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మార్కెట్లో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ ధర MRP రూ.30,999 కాగా.. ఇది ఫ్లిప్కార్ట్లో 32 శాతం వరకు ప్రత్యేకమైన తగ్గింపుతో రూ.20,999 లకే లభించడం విశేషం. అంతేకాకుండా ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి రాగానే దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంకు తోపాటు ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.3 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా అదనంగా దీనిపై కంపెనీ ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్తో పాటు అదనపు బోనస్ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ వినియోగించడానికి తప్పకుండా మీ దగ్గర వినియోగిస్తున్న ఏదైనా బ్రాండ్ కు సంబంధించిన మొబైల్ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాని కండిషన్ను బట్టి, దాని వ్యాల్యూని బట్టి ఏకంగా రూ.16 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ రూ.4,999 లోపే సొంతం చేసుకోవచ్చు..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amazon Offer: సగం ధరకే Aquaguard 9-స్టేజ్ వాటర్ ప్యూరిఫైయర్.. బ్యాంక్ డిస్కౌంట్ కూడా!
Hyderabad, Telangana:Aquaguard Water Purifier Amazon Offer: ప్రస్తుతం చాలామంది బయట ప్యూరిఫైయర్ చేసిన నీరు తాగకుండా ఇంట్లోనే వాటర్ ప్యూరిఫైయర్ పెట్టించుకుంటున్నారు. వీటి నుంచి ఫిల్టర్ చేసిన నీటిని తాగుతున్నారు. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా అనారోగ్య సమస్యల భారిన పడకుండా రక్షిస్తూ ఉంటాయి. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో మంచి ప్యూరిఫైయర్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్ డే సేల్లో భాగంగా.. కొన్ని వాటర్ ప్యూరిఫైయర్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్అందుబాటులో ఉన్నాయి. గతంలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన Aquaguard RO+UV+UF+MC Tech (2X Life) వాటర్ ప్యూరిఫైయర్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్తో లభిస్తుంది. అలాగే ఇది ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇందులో ఉన్న ఫీచర్స్ వివరాలు ఏంటో? ధర పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వాటర్ ప్యూరిఫైయర్ కు సంబంధించిన పూర్తి ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఇది నీటిని 9 విభిన్న దశల్లో శుద్ధి చేస్తుంది. దీనివల్ల నీటిలోని మురికి, కెమికల్స్, బ్యాక్టీరియా తో పాటు వైరస్లు పూర్తిగా తొలగిపోతాయి. దీనివల్ల శరీరం ఎంతో ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా ఈ మీరు పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా ప్రత్యేకమైన RO+UV+UF+MC టెక్నాలజీ అందుబాటులో ఉంది. రివర్స్ ఆస్మోసిస్ సీసంతో పాటు పాదరసం లోహాలు నీటిలోని పురుగులను తొలగించేందుకు సహాయపడతాయి.
అలాగే ఇందులో ఉండే UV నీటిని 20 నిమిషాల పాటు మరిగిస్తే ఎంత శుద్ధిగా మారుతుందో.. అంతటి రక్షణను అందిస్తాయి. అలాగే ఇందులో అల్ట్రా ఫిల్టరేషన్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలతో పాటు ఇసుక రేణువులను సులభంగా వడ కడుతుంది. అంతేకాకుండా మినరల్ చార్జ్.. నీటిని శుద్ధి చేయడమే కాకుండా శరీరానికి అవసరమైన మెగ్నీషియంతో పాటు క్యాల్షియం వంటి పోషకాలను అందించేందుకు సహాయపడుతుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
60 శాతం హైయర్ వాటర్ రికవరీ (Aquasaver Tech) సపోర్ట్ కూడా లభిస్తుంది. సాధారణ ఆర్వో ప్యూరిఫైయర్లతో పోలిస్తే 60 శాతం వరకు నీటిని ఆదా చేస్తుంది. అంటే నేటి వృధా చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో రెండు సంవత్సరాల వరకు ఫిల్టర్ లైఫ్ సపోర్ట్ లభిస్తుంది. సాధన ఫిల్టర్ల కంటే ఇవి రెట్టింపు కాలం వరకు పనిచేస్తూ ఉంటాయి. ఇక ఈ వాటర్ ప్యూరిఫైయర్కు సంబంధించిన పూర్తి ధర వివరాల్లోకి వెళితే.. ఇది MRP ధర రూ.26,500 కాగా ఇప్పుడే దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్లో కొనుగోలు చేసే వారికి.. అదనంగా 58 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపుతో కేవలం.. రూ.10,999 లకే లభిస్తోంది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే అదనంగా రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Xiaomi Mix Fold 5: 200MP కెమెరాతో రాబోతున్న Xiaomi Mix Fold 5 ఫోన్.. సామ్సంగ్కు గట్టి పోటీ!
Hyderabad, Telangana:Xiaomi Mix Fold 5 Leaked: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం Xiaomi మార్కెట్లోకి తమ కొత్త పోల్టబుల్ స్మార్ట్ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. సాంసంగ్తో పాటు వన్ ప్లస్, వివో వంటి బ్రాండ్లకు గట్టి పోటీని ఇస్తూ నెక్స్ట్ జనరేషన్ పోలిడబుల్ ఫోన్ Xiaomi Mix Fold 5 ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ క్రమంలోనే ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన స్పెసిఫికేషన్స్తో పాటు ఫీచర్స్ లీకయ్యాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు, అసలు ఈ మొబైల్లో ఉన్న హైలెట్ ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
200MP కెమెరాతో ఈ మొబైల్..
ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన అత్యంత ప్రధాన విశేషమేంటంటే.. దీని కెమెరా.. ప్రముఖ చైనీస్ మైక్రో బ్లాకింగ్ ప్లాట్ఫామ్ విబోలో ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...షియోమీ మిక్స్ ఫోల్డ్ 5 వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్ ను కలిగి ఉండబోతోంది. ఇందులో కంపెనీ ఎంతో పవర్ఫుల్ 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. పోలిటబుల్ ఫోన్లలో ఇంత భారీ కెమెరా సెన్సార్ ను తీసుకురావడం మొదటిసారిగా భావించవచ్చు. అయితే, ఇందులో అద్భుతమైన అల్ట్రా-క్లియర్, హై-రిజల్యూషన్ ఫోటోగ్రఫీ అనుభూతి కూడా లభిస్తుంది.
అద్భుతమైన డిస్ప్లే..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ ప్రోటో టైపులో 7.5 అంగుళాల నుంచి 7.6 అంగుళాల వరకు ఉండే ఫోల్డబుల్ ఇన్నర్ డిస్ప్లే కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్క్రీన్ లపై సాధారణంగా కనిపించే మడత మార్కులను పూర్తిగా తగ్గించేందుకు సరికొత్త మినిమలైజ్డ్ టెక్నాలజీని ఇందులో వినియోగించినట్లు తెలుస్తోంది. భద్రత కోసం ఫోన్ పక్క భాగంలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల స్పెషల్ ఫీచర్స్ లభించడం విశేషం..
పవర్ఫుల్ బ్యాటరీ..
కొత్త తరం యూజర్ల అవసరాలకు అనుగుణంగా షియోమీ మిక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ఫోన్లో ఎంతో శక్తివంతమైన 6,000 mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పూర్తిగా వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో పాటు అత్యంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన Xring O3 ప్రాసెసర్ను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా గేమ్స్ కోసం ప్రత్యేకమైన చిప్ సెటప్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది..
ధర వివరాలు ఇవే..
గత కొన్ని నీళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ మొబైల్స్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. గతంలో వచ్చిన మిక్స్ ఫోల్డ్ ఫోర్ స్థానంలో రాబోతున్న ఈ సరికొత్త మోడల్ ఆగస్టు నాటికి చైనాలోని లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అనేక కొత్త ఫీచర్ల కారణంగా దీని ధర మునుపటి మోడల్స్ కంటే కాస్త ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని లీకైన వివరాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర రూ.1,31 లక్షతో ప్రారంభం కాబోతోంది. అలాగే ఇది 200MP కెమెరాతో అందుబాటులోకి రావడం కారణంగా సాంసంగ్ బ్రాండ్ తో పాటు వన్ ప్లస్ బ్రాండ్ కు సంబంధించిన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లతో పోటీపడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India-Iran Relations: అమెరికా - ఇరాన్ చర్చలు..భారత్కు భారీ గుడ్న్యూస్! భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
Hyderabad, Telangana:India-Iran Relations News: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా మారుతున్న ఈ సమీకరణాలు భారతదేశానికి వ్యూహాత్మకంగా, ఆర్థికంగా సరికొత్త అవకాశాలను తెచ్చిపెట్టబోతున్నాయి. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన భారత్-ఇరాన్ వాణిజ్య సంబంధాలు మళ్లీ ఊపందుకోవడమే కాకుండా.. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడానికి ఇది ఒక సువర్ణావకాశంగా మారనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్కు చేకూరే ప్రధాన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చౌక ధరకే ముడి చమురు..
భారతదేశం తన దేశీయ ఇంధన అవసరాల కోసం దాదాపు 85 శాతం ముడి చమురును దిగుమతులపైనే ఆధారపడుతోంది. అమెరికా, ఇరాన్ ఒప్పందం సఫలమైతే భారత్కు భారీ ఊరట లభించనుంది. వెనిజులా లేదా అమెరికా నుంచి వచ్చే చమురులో సల్ఫర్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల దానిని క్లీన్ చేయడానికి ఎక్కువ ఖర్చవుతుంది. కానీ ఇరాన్ ముడి చమురు సాధారణ రకానికి చెందినది కావడం వల్ల శుద్ధి ఖర్చులు చాలా తక్కువ.
అలాగే ఇరాన్ నుంచి దిగుమతులు పునఃప్రారంభమైతే రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు గణనీయంగా తగ్గుతాయి. ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. భారత్ దిగుమతి చేసుకునే చమురులో 50 శాతం వివాదాస్పద 'హార్ముజ్ జలసంధి' గుండానే ప్రయాణించాలి. ఇరాన్తో సత్సంబంధాలు ఉంటే ఈ సముద్ర రవాణా మార్గానికి పూర్తి భద్రత లభిస్తుంది.
చాబహార్ పోర్ట్ ప్రాజెక్టుకు పునర్జీవం
భారత్ వ్యూహాత్మకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయ అభివృద్ధికి ఈ ఒప్పందం కీలక చోదక శక్తి కానుంది. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ద్వారా ఈ పోర్ట్ నిర్వహణకు భారత్ 10 ఏళ్ల ఒప్పందం చేసుకుంది. యంత్రాల కోసం 120 మిలియన్ డాలర్ల పెట్టుబడితో పాటు, మౌలిక వసతుల కోసం 250 మిలియన్ డాలర్ల రుణ సదుపాయాన్ని కూడా ప్రకటించింది.
పాకిస్థాన్లో చైనా నిర్మిస్తున్న 'గ్వాదర్' పోర్టుకు చాబహార్ అత్యంత సమీపంలో ఉంటుంది. దీని ద్వారా పశ్చిమాసియాలో చైనా ఆధిక్యానికి భారత్ బ్రేక్ వేయవచ్చు. పాకిస్థాన్తో ఎలాంటి అవసరం లేకుండానే భారత్ నేరుగా మధ్య ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాలకు వాణిజ్యం సాగించడానికి చాబహార్ ఒక వ్యూహాత్మక గేట్వేగా మారుతుంది.
గతంలో అంతర్జాతీయ వేదికలపై (జమ్మూ కాశ్మీర్ వంటి కీలక అంశాల్లో) ఇరాన్ భారత్కు ఎంతో అండగా నిలిచింది. అయితే అమెరికా ఆంక్షల ప్రభావం ఈ బంధంపై తీవ్రంగా పడింది.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కేవలం మానవతా సహాయం, ప్రాథమిక అవసరాల వస్తువులకే వాణిజ్యం పరిమితమైంది. భారత్ నుంచి బాస్మతీ బియ్యం, టీ పొడి, మందులు ఇరాన్కు వెళ్తుండగా.. అక్కడి నుంచి ఎండుద్రాక్ష, రసాయనాలు భారత్కు వస్తున్నాయి.
గతంలో అమెరికా ఒత్తిళ్ల కారణంగా భారత్.. ఇరాన్ విషయంలో కొంత తటస్థ వైఖరిని అవలంబించాల్సి వచ్చింది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన కూడా అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే, ఇప్పుడు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం ముగింపు దశకు చేరడం భారత దౌత్య, ఆర్థిక ప్రయోజనాలకు లభించిన అతిపెద్ద ఊరట. ఆంక్షలు సడలిస్తే చమురు మార్కెట్లో స్థిరత్వం ఏర్పడటంతో పాటు, ఆసియా వ్యాప్తంగా భారత్ తన ఆర్థిక పట్టును మరింత సుస్థిరం చేసుకోగలుగుతుంది.
Also Read: భారత నౌకపై అమెరికా సైన్యం దాడి..ముగ్గురు భారతీయులు
Also Read: అమెరికా దాడిలో ముగ్గురు భారతీయులు ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nitish Kumar Reddy Press Meet: 'అమ్మా.. 5 నిమిషాల్లో కాల్ చేస్తా': లైవ్ ప్రెస్మీట్ మధ్యలో ఆపేసిన నితీశ్ కుమార్ రెడ్డి..తెలుగు వీడియో వైరల్!
Jhikli Barol, Himachal Pradesh:Nitish Kumar Reddy Press Conference: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఎంత బిజీగా ఉన్నా.. అమ్మ పిలుపు కంటే ఏదీ ఎక్కువ కాదని నిరూపించాడు తెలుగు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి. ధర్మశాల వేదికగా అఫ్ఘానిస్థాన్తో జరిగిన తొలి వన్డే అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక ఆసక్తికరమైన, అందమైన ఘటన చోటుచేసుకుంది.
ప్రెస్మీట్ మధ్యలో అమ్మ ఫోన్..!
మ్యాచ్ ముగిసిన తర్వాత నితీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా, ఒక్కసారిగా అతడి మొబైల్ మోగింది. స్క్రీన్పై 'అమ్మ' అని చూడగానే.. చుట్టూ ఉన్న రిపోర్టర్లను క్షమించమని కోరుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. "అమ్మా.. ప్రెస్మీట్లో ఉన్నాను. ఒక 5 నిమిషాల్లో మళ్లీ చేస్తాను" అంటూ పక్కా తెలుగులో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు.
అనంతరం అక్కడున్న విలేకరులకు చిరునవ్వుతో 'సారీ' చెప్పి మళ్లీ ప్రెస్మీట్ను కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
నెటిజన్ల ప్రశంసల జల్లు
ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు క్రికెటర్ నితీశ్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "గ్లోబల్ వేదికపై మన తెలుగు భాషను హైలైట్ చేశాడు, గర్వంగా ఉంది!" అని కొందరు అంటుంటే.. "అమ్మ అంటే అంత ప్రేమ మరి.. ఎంత పెద్ద స్టార్ అయినా అమ్మ తర్వాతే ఎవరైనా" అని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
Mom > Media 📞😂pic.twitter.com/4bqfCZvSKn
— Cricbuzz (@cricbuzz) June 14, 2026
మ్యాచ్ హైలైట్స్
అఫ్ఘానిస్థాన్తో జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వర్షం కారణంగా మ్యాచ్ను 25 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు 194 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలింగ్ దళాన్ని పరిశీలిస్తే.. అరంగేట్రం మ్యాచ్లోనే గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబె తలో 3 వికెట్లతో అదరగొట్టారు. నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
భారత్ చేజింగ్లో 195 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 22.5 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్గా నిలవగా.. కేఎల్ రాహుల్ 39* పరుగులతో అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన శుభ్మన్ గిల్కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
Also Read: ఫుట్బాల్ మ్యాచ్లో హద్దు దాటిన లేడీ ఫ్యాన్..ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా రచ్చ!
ALso REad: ఇక సెలవు..అంతర్జాతీయ క్రికెట్కు కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వీడ్కోలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kriti Sanon Rashmika: హీరోయిన్ రష్మికపై ఎగబడ్డ ఫ్యాన్స్..తెలుగింటి కోడలికి బాడీగార్డ్గా మారిన బాలీవుడ్ బ్యూటీ!
Pimpri-Chinchwad, Pune, Maharashtra:Kriti Sanon Rashmika News: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రధానపాత్రలో.. కృతి సనన్, రష్మిక మందన్న హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం 'కాక్టెయిల్ 2'. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ ముగ్గురు స్టార్లు సినిమా ప్రమోషన్స్ కోసం పూణేలోని ఒక మాల్ను సందర్శించారు. అయితే, ఉత్సాహంగా ప్రారంభమైన ఈ ఫ్యాన్ ఈవెంట్, ఊహించని విధంగా భారీ సంఖ్యలో జనం భద్రతా బారికేడ్లను ఛేదించుకుని లోపలికి రావడంతో గందరగోళంగా మారింది.
ఈ గందరగోళం మధ్య, రష్మిక పట్ల కృతి చూపిన విధానం అందర్ని ఆకట్టుకుంది. రష్మిక పైకి ఫ్యాన్స్ ఎగబడుతున్న నేపథ్యంలో ఆమెను సంరక్షిస్తున్న ఓ బాడీ గార్డు మాదిరిగా ఆమె చేతులను అడ్డుపెట్టి రష్మికను సంరక్షించింది. ఇప్పడు అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. హీరోయిన్ కృతి సనన్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఈవెంట్కు సంబంధించిన ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా, భారీ సంఖ్యలో జనం హీరోయిన్ల వైపు దూసుకురావడం, దీంతో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక ఆ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడటం కనిపించింది. కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. నటీనటులకు దగ్గరయ్యే ప్రయత్నంలో అభిమానులు భద్రతా బారికేడ్లను ఛేదించుకుని రావడంతో ప్రచార కార్యక్రమాన్ని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.
ఆ గందరగోళం మధ్య జనసమూహంలోంచి దారి వెతుక్కుంటూ వెళ్తున్న షాహిద్, స్పష్టంగా అసహనానికి గురైనట్లు కనిపించాడు. మరోవైపు, భద్రతా సిబ్బంది వారిని ప్రాంగణం నుండి బయటకు తీసుకువెళ్తుండగా, కృతి రష్మిక మందన్నను గట్టిగా పట్టుకుని, తోసుకుంటున్న జనసమూహం నుండి ఆమెను కాపాడుతూ కనిపించింది. ఆ నటి ఆద్యంతం అప్రమత్తంగా ఉంటూ, అభిమానుల మధ్య నుంచి రష్మికకు జాగ్రత్తగా మార్గనిర్దేశం చేసింది. ఆమె చేసిన ఈ పని అప్పటి నుండి ఆన్లైన్లో ప్రశంసలు అందుకుంది.
ఒక అభిమాని ఇలా వ్యాఖ్యానించారు. "కృతి రష్మికను కాపాడుతున్న తీరు.. ఒక చెల్లెల్ని అక్క కాపాడుతున్నట్లు ఉంది." మరొకరు కామెంట్ చేస్తూ.. "కృతి రష్మికను కాపాడుతున్న తీరు వారిద్దరి మధ్య ఉన్న సన్నిహితానికి ప్రతిరూపం" అని అన్నారు. అలాగే మరో నెటిజన్లు ఇలా వ్యాఖ్యానించారు. "కృతి రష్మికను కాపాడటం చాలా ఎంతో చూడముచ్చటగా ఉంది." అని ఫ్యాన్స్ కామెంట్ చేశారు.
'కాక్టెయిల్ 2' సినిమా గురించి..
హోమీ అడజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. 2012లో విజయవంతమైన 'కాక్టెయిల్' చిత్రానికి సీక్వెల్గా రూపొందింది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రాయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేట్రలలో విడుదల కానుంది.
Also Read: ఐటెంసాంగ్ ద్వారా భారీగా సంపాదించిన హీరోయిన్ ఈమెనే! ఒక్క పాటకి అన్ని కోట్ల రూపాయలా?
Also Read: మ్యూజిక్ డైరెక్టర్ను బీచ్లో పాతిపెట్టిన అనిల్ రావిపూడి..ఇలా కూడా చేస్తారా గురూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Rains: తెలంగాణలో ఆదివారం కుండపోత వర్షం.. ఈ జిల్లాలకు భారీ అలర్ట్
Baddipadaga, Telangana:Heavy Rain Alert To Hyderabad: వేసవికాలంతో విలవిలలాడిన తెలంగాణపై వరుణుడు కరుణించాడు. వర్షాకాలం ప్రారంభమే వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో పలుమార్లు వర్షం భారీగా పడగా జిల్లాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో వర్షాలు జోరుగా పడుతున్నాయి. ఆదివారం కూడా అంటే జూన్ 14వ తేదీన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్తోపాటు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా పలు జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్ధిపేట, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాలున్నాయని వాతావరణ శాఖ వివరించింది.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడే జిల్లాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండగా.. నాలుగో రోజు కూడా కురవనుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజధాని హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉండగా.. సాయంత్రం వర్షం దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ప్రభుత్వం అప్రమత్తం
కాగా ఇప్పటికే వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం ప్రకటించింది. భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమై అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్లో ఇప్పటికే వర్షాలతో దాదాపు ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో అలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు ప్రభుత్వం ఆదేశించింది.
Telangana: రేపటి నుంచే ప్రభుత్వ బడుల్లో ఉచిత బ్రేక్ఫాస్ట్.. సర్కార్ సరికొత్త కానుక..
Hyderabad, Telangana:Telangana Govt Schools Breakfast Scheme Telugu News: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉచితంగా పోషకాలతో కూడిన అల్పాహారాన్ని అందించే బ్రేక్ ఫాస్ట్ పథకం అమల్లోకి రాబోతోంది విద్యార్థులు ఖాళీ కడుపుతో బడికి రాకూడదనే ఉద్దేశంతో వారి ఆరోగ్యంతో పాటు చదువుపై శ్రద్ధ పెంపొందించేందుకు ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రభుత్వం రేపటి నుంచి అధికారికంగా ప్రారంభించబోతోంది. అయితే ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
తొలి విడతగా 1.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి..
ఈ పథకాన్ని విడతల వారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇందులో భాగంగా మొదటి విడతలో 8 జిల్లాలను ఎంపిక చేశారు రేపటి నుంచి ఈ ఎనిమిది జిల్లాల్లో మొత్తం 1269 ప్రభుత్వ పాఠశాలలతో పాటు 33 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ అల్పాహార పథకం అందుబాటులోకి రాబోతోంది తొలి విడతలోనే దాదాపు 1.44 లక్ష మంది విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం వేడి వేడి బ్రేక్ ఫాస్ట్ అందబోతోంది. రాబోతున్న రోజుల్లో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలకు విస్తరించి.. మొత్తం 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికల సిద్ధం చేస్తోంది..
నోరూరించే మెనూ..
విద్యార్థులకు కేవలం అల్పాహారం అందించడమే కాకుండా అది రుచికరంగా.. అత్యంత పోషక విలువలతో కూడుకున్నదిగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేకమైన మెనూ రూపొందించింది. ప్రతిరోజు ఒకే రకమైన టిఫిన్ కాకుండా విద్యార్థులంతా ఎంతో ఇష్టంగా తినేలా వివిధ రకాల రుచికరమైన టిఫిన్లను అందుబాటులో ఉంచారు. ఈ మెనూలో ప్రధానంగా వేడివేడి దోశతో పాటు పూరీ, బోండా వంటి అల్పాహారాలు ఉండడం విశేషం. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిల్లెట్ ఇడ్లీతో పాటు కూరగాయలతో తయారుచేసిన ఉప్మా ఇతర పోషక పదార్థాలు అందించే టిఫిన్స్ ఉండడం ఈ మెనూ ప్రత్యేకత..
తల్లిదండ్రుల్లో ఆనందం..
ఉదయాన్నే పనులకు వెళ్లే పేద కుటుంబాల తల్లిదండ్రులకు ఈ పథకం పెద్ద ఊరటనివ్వబోతోంది.. పిల్లలకు పొద్దున్నే వంట చేసే సమయం లేక చాలామంది విద్యార్థులు పరిగడుపునె బడులకు వస్తూ ఉంటారు. ఈ పథకం వల్ల విద్యార్థుల్లో పౌష్టిక ఆహార లోపం తగ్గడమే కాకుండా.. బడులలో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పాఠశాలల్లో మంచి టిఫిన్ దొరకతుండడంతో అటు విద్యార్థులతో పాటు ఇటు తల్లిదండ్రులు ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఈ పథకానికి సంబంధించి అధికారులు అన్ని పాఠశాలల్లో ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లను కూడా చేసినట్లు తెలుస్తోంది..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Tuni Girl Missing Case: జల్లెడ పడుతున్న బృందాలు.. అడవుల్లో 9 రోజులు పాపం పసిపాప
Tuni, Andhra Pradesh:Tuni Girl Missing Case Search Operation: దారి తప్పి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన బాలిక ఆచూకీ లభించలేదు. 9 రోజుల పాటు అటవీ ప్రాంతంలోనే బాలిక ఉండిపోయింది. బతికి ఉందో లేదో తెలియదు.. కానీ బతికి ఉంటుందనే ఆశతో పోలీసు బృందాలు.. ఇతర సహాయ బృందాలు అటవీ ప్రాంతాన్నీ జల్లెడ పడుతున్నాయి. నిర్విరామంగా వెతుకుతున్నా ఎంతకీ ఆచూకీ లభించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. బాలిక అదృశం కేసుపై ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోంది.
Also Read: Pawan Kalyan: తుని చిన్నారి అదృశ్యంపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి తొమ్మిది రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ, చిన్న ఆధారం కూడా లభించకపోవడం గమనార్హం. ఉన్న ఒక్కగానొక్క సాక్ష్యం.. కీలక ఆధారమైన పెంపుడు కుక్క చనిపోయింది. దీంతో బాలిక ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. బాలిక అదృశ్యం కేసును సవాల్గా తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఎలాగైనా ఆచూకీ తెలుసుకోవాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Students Jackpot: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్ల ప్రారంభం రోజే అద్భుత పథకం
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తోపాటు హోం మంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రభుత్వం ఒత్తిడి పెంచడంతో బాలిక ఆచూకీ తెలుసుకునేందుకు మరికొన్ని బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. ప్రభుత్వ పెద్దలు సంప్రదింపులు చేస్తుండడంతో కాకినాడ పోలీస్ యంత్రాంగం బాలిక కోసం వెతుకుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అటవీ శాఖ బృందాలను రంగంలోకి దింపాలని సూచించారు. మరోపక్క హోంమంత్రి అనిత ఎస్పీతో మాట్లాడి. కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దింపాలని ఆదేశించడంతో వారు పాప కోసం వెతుకుతున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ ఏమైనా కనుగొంటుందా అని తల్లిదండ్రులతోపాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
హోంమంత్రి సమీక్ష
తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఎప్పటికప్పుడు కాకినాడ జిల్లా ఎస్పీతో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతున్నారు. నిరంతరం సమీక్ష చేస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రతి రోజు బాలిక అదృశ్యం కేసు వివరాలపై ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఆరా తీస్తున్నారు. హోం మంత్రి అనిత ఆదేశాలతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు దిగాయి. ఆదివారం కూడా హోంమంత్రి అనిత అధికారులకు పలు సూచనలు చేశారు. 'చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉంది. ఈ కేసులో అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు' అని హోం మంత్రి అనిత వివరించారు.
తీవ్ర అనుమానాలు
ఈనెల 9వ తేదీన బాలిక అదృశ్యమైన విషయం తెలిసిందే. పెంపుడు కుక్కతోపాటు బాలిక అటవీ ప్రాంతంలోకి వెళ్లి కనిపించకుండాపోయింది. మూడు రోజుల అనంతరం పెంపుడు కుక్క బయటకు రాగా.. బాలిక మాత్రం ఇంతవరకు ఆచూకీ లభించలేదు. బాలికను ఎవరైనా అపహరించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలికను అపహరించి.. హత్య చేసి ఉంటారా? లేదా అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని అనే అనుమానాలు వస్తున్నాయి. కరాటే కల్యాణి ఎంట్రీ ఇచ్చి.. 'బాలికను అమావాస్య రోజు నర బలి ఇచ్చి ఉంటారు' అని వ్యాఖ్యానించడంతో బాలిక అదృశ్యం కేసు తీవ్ర సంచలనం రేపుతోంది.
FIFA World Cup 2026: ఎల్లో కార్డు రద్దు.. FIFA ప్రపంచ కప్ చరిత్రలో మొదటి ఆటగాడు.. ఎవరంటే..??
Secunderabad, Telangana:FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 లో సరికొత్త హిస్టరీ క్రియేట్ అయ్యింది. ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత అరుదైన, మొట్టమొదటి ఘటనకు ఈ మెగా టోర్నీ వేదికైంది. అమెరికా వెటరన్ డిఫెండర్ టిమ్ రీమ్ ఫిఫా వరల్డ్కప్ హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్ రెఫరీ చేసిన ఒక తప్పుడు నిర్ణయం నుంచి వార్ (VAR - Video Assistant Referee) టెక్నాలజీ ద్వారా లబ్ధి పొందిన ప్రపంచపు మొట్టమొదటి ఆటగాడిగా టిమ్ రీమ్ రికార్డుకెక్కాడు.
అసలు ఏం జరిగిందంటే?
గ్రూప్ స్టేజ్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఒక ఫౌల్ జరిగింది. అయితే, ఆ ఫౌల్ చేసింది అమెరికాకు చెందిన వేరే ఆటగాడు అయినప్పటికీ.. మ్యాచ్ రెఫరీ పొరపాటున టిమ్ రీమ్కు ఎల్లో కార్డ్ చూపించాడు. ఫుట్బాల్ భాషలో దీనిని మిస్టేకెన్ ఐడెంటిటీ అంటారు. ఒకవేళ ఆ ఎల్లో కార్డ్ అలాగే ఉండి ఉంటే, అది మ్యాచ్ సమీకరణాలను, సదరు ఆటగాడి తదుపరి మ్యాచ్ల అవకాశాలను దెబ్బతీసేది.
రెఫరీ తప్పుడు నిర్ణయాన్ని గమనించిన వీడియో అసిస్టెంట్ రెఫరీ బృందం వెంటనే రంగంలోకి దిగింది. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా ఒక మిస్టేకెన్ ఐడెంటిటీ చెక్ కోసం వార్ టెక్నాలజీని ఉపయోగించారు. రీప్లేలను నిశితంగా పరిశీలించిన తర్వాత, ఫౌల్ చేసింది టిమ్ రీమ్ కాదని స్పష్టమైంది. దీనితో మైదానంలోని రెఫరీ తన తప్పును సరిదిద్దుకుని, టిమ్ రీమ్కు ఇచ్చిన ఎల్లో కార్డును రద్దు చేశారు.
ఈ ఘటనతో టిమ్ రీమ్ అయాచితంగా హిస్టరీ బుక్స్లోకి ఎక్కాడు. వార్' టెక్నాలజీని కేవలం గోల్స్, రెడ్ కార్డ్స్ లేదా పెనాల్టీల కోసమే కాకుండా.. ఇలాంటి తప్పుడు గుర్తింపులను సరిదిద్దడానికి ఉపయోగించి విజయం సాధించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ అరుదైన ఫుట్బాల్ రికార్డు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. క్రీడల్లో టెక్నాలజీ వాడకం ఎంత పారదర్శకతను తెస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని పలువురు కొనియాడుతున్నారు.
Also Read: ఫిఫా చరిత్రలోనే అమెరికా సంచలనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dwidasha Yoga 2026: జూన్ 14 నుంచి ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ద్విదశ యోగంతో కోటీశ్వర యోగం!
Hyderabad, Telangana:Dwidasha Yoga 2026 Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల ప్రత్యేక కలయిక జరిగినప్పుడు.. ఆ సమయంలోనే శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఏర్పడిన రాజయోగాలు తప్పకుండా మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయి.. ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ద్విదశ యోగం కూడా ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే జూన్ 14వ తేదీన ఈ యోగం ఏర్పడింది. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన యోగంగా పరిగణిస్తారు. చంద్రుడు మేషరాశిని వదిలి.. ఉచ్చరాశిగా భావించే వృషభంలోకి సంచారం చేసినప్పుడు ఈ యోగం ఏర్పడింది.. జూన్ 14వ తేదీన 9 గంటల వరకు అదే రాశిలో చంద్రుడు కొనసాగుతూ ఉంటాడు. ఇదే సమయంలో బుధుడు తన సొంత రాశిగా భావించే మిథునంలోకి ప్రవేశించడం వల్ల, చంద్రుడు బుధులు అరుదైన కలయికతో కొన్ని రాశుల వారికి అదృష్టం ఊహించని స్థాయిలో వరించబోతోంది అంతేకాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారాలు కూడా చాలావరకు లాభసాటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి
చంద్రుడు ఇదే రాశుల ఉండడం కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయం ఒక వరం కంటే ఎక్కువగా భావించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అలాగే పనుల్లో అద్భుతమైన శుభవార్తలు వినే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలతో పాటు గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి
సొంత రాశిలో బుధుడు ఉండడం కారణంగా వీరిపై కూడా ద్విదశ యోగ ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి అలాగే స్థిరమైన ధన ప్రవాహం కూడా లభించి ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు అద్భుతమైన పదోన్నతులు పొంది.. జీతాలు కూడా భారీగా పెంచుకోగలుగుతారు. గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ పరిష్కారం లభించి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది..
కన్య రాశి
చంద్ర-బుధ గ్రహాల సంయోగం కారణంగా కన్య రాశి వారికి మానసిక ప్రశాంతత విపరీతంగా పెరుగుతుంది. కొంతకాలంగా మనసులో ఉన్న మానసిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం తోడు లభించి.. విపరీతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలాలు లభించే అవకాశాలున్నాయి. కార్యాలయంలో అధికారులు మీపై హర్షం కూడా వ్యక్తం చేస్తారు..
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆనందంతో పాటు సానుకూల ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా మనసు కూడా చాలా ఉల్లాసంగా మారుతుంది.. అన్ని విషయాల్లో మీ కుటుంబ సభ్యులతో పాటు ప్రియమైన వారి సపోర్టు లభించి.. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. మానసిక ఉపశమనం లభించడమే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి..
మీన రాశి
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు శని ప్రభావం నడుస్తున్నప్పటికీ చంద్రుడి ప్రభావంతో కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీడియా రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా అనుకున్న పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలనుంచి విముక్తి పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Video: రోప్ జంప్లో ఇన్స్ట్రక్టర్ల ఘోర తప్పిదం.. భద్రతా తాడు కట్టకుండానే యువతిని తోసేయడంతో దుర్మరణం! ఒళ్లు గగుర్పొడిచే వీడియో..
Hyderabad, Telangana:Brazil Woman Dies After Thrown Without Rope Video: సాహస క్రీడలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తుల నిర్లక్ష్యం లేదా నిర్వాహకుల అజాగ్రత్త వల్ల పరిస్థితులు చేయిదాటి ప్రాణనష్టం జరుగుతోంది. రోప్ జంపింగ్ లేదా బంజి జంపింగ్ వంటి క్రీడల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా అది ప్రాణాంతకంగా మారుతోంది. బ్రెజిల్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం కూడా అలాగే జరిగింది. భద్రతా తాడు సరిగ్గా కట్టకపోవడంతో ఒక యువతి సుమారు 100 అడుగుల ఎత్తు నుండి పడి అక్కడికక్కడే మరణించింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. బ్రెజిల్లోని లిమేరలో ఉన్న పోంటే డోస్కోలేటో ట్రైల్ వద్ద రోప్ జంపింగ్ చేయడం చాలా సాధారణం. పర్యాటకులు ఇక్కడ ఎంతో ఆసక్తిగా ఈ సాహసాలు చేస్తుంటారు. శనివారం రోజు 21 ఏళ్ల ఎడ్వర్డా అనే యువతి జంపింగ్ కోసం వచ్చింది. ఆ సమయంలో అక్కడ ముగ్గురు సిబ్బంది ఉన్నారు. కానీ, ఆమెకు సేఫ్టీ తాడు కట్టకుండానే పైనుంచి తోసేశారు. ఈ ఘటన తర్వాత ఇద్దరు ఆర్గనైజర్లు భయంతో అడవిలోకి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు గాలింపు జరిపి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించినందుకు వారిని విచారిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత సంబంధిత అడ్వెంచర్ కంపెనీ తన సోషల్ మీడియా ఖాతాలను కూడా తొలగిస్తోంది.
వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఒక యువతిని పైనుంచి కిందకు తోసేయడం కనిపిస్తుంది. సాధారణంగా బంజీ లేదా రోప్ జంపింగ్ చేసేటప్పుడు రక్షణ తాడు కడతారు. కానీ ఇక్కడ సిబ్బంది ఆమెకు తాడు కట్టకుండానే నిర్లక్ష్యంగా తోసేశారు. దీంతో ఆమె కిందపడి మరణించింది. దీంతో పక్కనే ఉన్న మరికొంత మంది అరుపులు కేకలు వేశారు. పోలీసుల ప్రకారం.. మృతురాలితో పాటు మరో ఇద్దరు కూడా ఆమెతో వచ్చారు. నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నించినా, పోలీసులు వారిని పట్టుకున్నారు. భద్రతా తనిఖీలు సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. గతంలో కూడా ఇక్కడ ఇలాంటి ప్రాణనష్టాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రాకపోకలను నియంత్రించే, నిర్వహించే పూర్తి బాధ్యత మున్సిపాలిటీకి ఉందని ఫెడరల్ ప్రభుత్వం తెలిపింది.
READ ALSO: సిద్దిపేటలో ఘోర ప్రమాదం.. హైవేపై కంట్రోల్ తప్పిన కారు, ఇంటి ముందు కూర్చున్న ముగ్గురు మహిళలు దుర్మరణం!
READ ALSO: రక్షించాల్సిన పోలీసే రాక్షసుడయ్యాడు.. హన్మకొండలో వివాహితపై ఎస్ఐ అత్యాచారం, అసలేం జరిగిందంటే?
JUST IN: 21-year-old dies after workers forget to attach safety rope and push her off 40-meter bridge in São Paulo’s Limeira, Brazil pic.twitter.com/ceqniPJkUs
— Rapid Report (@RapidReport2025) June 13, 2026
సోషల్ మీడియాలో ఇలాంటి వైరల్ వీడియోలు ఎన్నో గతంలో కూడా చూశాం. రోప్ లేదా బంగీ జంప్ల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. సరైన భద్రత చర్యలు లేకపోవడంతో అమాయకులు ఎంజాయ్ చేయడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయి శవాలుగా వెళ్తున్నారు. టూరిస్ట్ ప్రాంతాలలో నిర్వాహకులు నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. కానీ ఏమాత్రం వ్యక్తులు కూడా ఏమరుపాటుగా ఉన్న ప్రాణాలు కోల్పోతున్నారు.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Paddy: వరిలో ఆల్టైమ్ రికార్డు.. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ
Baddipadaga, Telangana:Telangana Paddy Procurement: తెలంగాణ విభజనకు ముందు.. తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంది. విభజనకు ముందు కరువు నేల.. వలస ప్రాంతం.. గంజికి దిక్కు లేని ప్రాంతంగా తెలంగాణ గుర్తింపు పొందింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు అన్నపూర్ణగా మారింది. అన్నీ రంగాల్లో అద్భుతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందుతున్న తెలంగాణ రాష్ట్రం... వ్యవసాయంలో ఆల్టైమ్ రికార్డులు నమోదు చేస్తోంది. పంటల్లో సరికొత్త రికార్డులు సాధిస్తోంది. వరి ఉత్పత్తిలో దేశంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసి నంబర్వన్గా నిలిచింది.
స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తెలంగాణ వ్యవసాయంలో అద్బుతాలు చేస్తోంది. అన్నమో రామచంద్ర అనే స్థాయి నుంచి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఈ ఏడాది కూడా తెలంగాణ వరి ఉత్పత్తిలో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో సాధించని వరి ధాన్యం ఉత్పత్తి తెలంగాణలో జరిగింది. 2025-26 సంవత్సరంలో 150 లక్షల టన్నుల వరిధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం
రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితో వరి కొనుగోళ్లను చకచకా పూర్తి చేసింది. వర్షాకాలం కూడా ప్రారంభమవడంతో వరి సేకరణను వేగం పెంచింది. వరి కొనుగోలు చేసిన అనంతరం రవాణా, నిల్వ, మిల్లింగ్, డబ్బుల చెల్లింపు వరకు ప్రభుత్వం ప్రతి దశలో సమన్వయంతో పనిచేసింది.
రైతుల ఖాతాల్లో రూ.35,537 కోట్లు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 150 లక్షల కోట్ల టన్నుల ధాన్యం సేకరించగా.. దీనికి గాను రైతుల ఖాతాల్లో రూ.35,537 కోట్ల డబ్బును జమ చేసింది. 26.43 లక్షల చెల్లింపులను ప్రభుత్వం చేసింది. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఆలస్యంగా చేయడంతో కొందరు రైతులు ప్రైవేటుగా ధాన్యం అమ్ముకున్నారు. ఆ ధాన్యం కూడా దాదాపు ఒక లక్ష టన్నులకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అంటే 152 లక్షల టన్నుల ధాన్యం తెలంగాణ ఉత్పత్తి చేసి ఉంటుంది. గతంలో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ వరి ఉత్పత్తిలో నంబర్వన్గా ఉండగా.. ఇప్పుడు తెలంగాణ ఆ రెండు రాష్ట్రాలను వెనక్కి నెట్టేసింది.
నీరు, పెట్టుబడి సహాయం
వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రభాగంలో ఉండడానికి కారణం అనుసరించిన వ్యూహాలే. తెలంగాణ ఏర్పడిన తొలి నుంచి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై దృష్టి సారించారు. వ్యవసాయ అభివృద్ధికి అన్నీ చర్యలు తీసుకున్నారు. సాగునీటి పారుదల వ్యవస్థను పునరుద్ధరించడమే కాకుండా పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ స్వరూపాన్ని మార్చేసింది. కృష్ణ, గోదావరి నీళ్లను ఒడిసిపట్టుకోవడమే కాకుండా వాన నీటిని కాపాడుకోవడంతో ఆ నీరంతా పొలాలకు మళ్లింది. దీనికితోడు వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించేలా రైతు బంధు పథకం ప్రవేశపెట్టడం తెలంగాణ వ్యవసాయ గతినే మార్చింది. బీడు బడ్డ భూములు కూడా వ్యవసాయ పొలాలుగా మారాయి. యూరియా, ఎరువులు అందుబాటులో ఉంచడం.. నాణ్యమైన విత్తనాలు అందించడం.. వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో తెలంగాణ వ్యవసాయంలో రారాజుగా నిలుస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసినట్టు వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తే మరిన్ని అద్భుతాలు తెలంగాణ నమోదు చేస్తుంది.
Tuni Girl Missing: తుని చిన్నారి మిస్సింగ్ కేసులో బిగ్ట్విస్ట్.. అపరిచితుడు ఎత్తుకెళ్తుంటే కుక్క అడ్డుకుందా? తండ్రి వెళ్లిన ఆ 15 నిమిషాల్లో ఏం జరిగింది?
Hyderabad, Telangana:What Really Happened in tuni girl missing In 15 Minutes: ఆంధ్రప్రదేశ్ అంతటా సంచలనం సృష్టిస్తున్న తుని చిన్నారి మిస్సింగ్ కేసుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కాకినాడ, తుని అగ్రహారంలో వారం రోజుల క్రితం అదృశ్యమైన జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం సూచించారు. దట్టమైన అడవుల్లో కూడా వెతకడానికి అటవీ శాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ సిబ్బందిని తీసుకుని వెతకాలని ఆదేశించారు. ఈ గాలింపు కోసం సుమారు 400 మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగారు. డ్రోన్ల సహాయంతో, ఇంటి పరిసరాల్లోని 38 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. వారం రోజులు గడిచిపోతున్నందున కేసును మరింత వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఆ 15 నిమిషాల సమయమే అత్యంత కీలకం...
పాపతో పాటు అదృశ్యమైన కుక్క కూడా నిన్న చనిపోవడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఈ నెల 6వ తేదీన ఈ కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత కుక్క తిరిగి వచ్చినప్పుడు దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి కుక్క పాప వద్దకు వెళ్తుందేమో అని అనుకున్నారు.. అయినా ఎటువంటి ఫలితం కనిపించలేదు. నిన్న ఆ కుక్క కూడా చనిపోవడంతో ఒక ఆశ కూడా పోయింది. అయితే, 6వ తేదీ ఉదయం 11:50కి భర్త పాపను భార్యకు ఇచ్చి వెళ్ళాడు. జ్ఞానేశ్వరి మరో పాపను చూస్తూ ఉండటంతో ఆ సమయంలో పాపను గమనించలేకపోయింది. తండ్రి వెళ్ళిన దారిలో ఒక వ్యక్తి పాపను చూసి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా, కుక్క తనను కరవబోయిందని ఒకరు తెలిపారు. కుటుంబ సభ్యులు వెతికినా పాప దొరకలేదు. మధ్యాహ్నం 12:00-12:15 లోపు పాప కనిపించకుండా పోయిందని పోలీసులు చెబుతున్నారు.
Tuni: తుని చిన్నారి ఎక్కడ?.. కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టినా దొరకని ఆచూకీ, వీడని మిస్టరీ!
రక్షించాల్సిన పోలీసే రాక్షసుడయ్యాడు.. హన్మకొండలో వివాహితపై ఎస్ఐ అత్యాచారం, అసలేం జరిగిందంటే?
కుక్క అడ్డుకోలేదా?
ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది? ఆ అపరిచితులు ఎవరు? కిడ్నాప్ చేసే ప్రయత్నంలో కుక్క అడ్డుకోలేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. పాప కనిపించకుండా పోయిన వెంటనే వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఒక రోజు తర్వాత కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చితే అది కొండ ప్రాంతాలకు వెళ్ళి తిరిగి ఇంటికే చేరుకుంటోంది. చివరకు నిన్న ఆ కుక్క చనిపోయింది. కొండ ప్రాంతాల్లో తిరగడం వల్ల దానికి అనారోగ్యం వచ్చిందా? లేక ఎవరైనా విషం పెట్టారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం రంగంలోకి దిగడంతో కేసు త్వరగా పరిష్కారం అవుతుందని అందరూ ఆశపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Earthquake: భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు..!!
Secunderabad, Telangana:Telangana Earthquake: తెలంగాణలో అర్థరాత్రి భూమి కంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామును 2.26 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీని తీవ్రత రెక్టర్ స్కేలుపై 3.8గా నమోదు అయ్యింది. భూప్రకంపనలతో జనాలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, పాల్వంచలో ఈ భూప్రకంపనలు వచ్చాయి. ఆకస్మికంగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది నిద్రిస్తున్న వేళ ప్రకంపనలు గమనించి ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తారు. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నా.. ప్రకంపనలు స్పష్టంగా కనిపించడంతో స్థానికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. అయితే, తీవ్రత 6 కంటే ఎక్కువగా ఉండి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది.
జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలిపింది. తెల్లవారుజామున 2:26 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గురించింది. భూకంప తీవ్రతను రిక్టర్ స్కేల్ లేదా ఆధునిక మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్పై కొలుస్తారు. ఇది ఒక లాగరిథమిక్ స్కేల్. ప్రతి 1 పాయింట్ పెరుగుదలకు, ప్రకంపనల బలం 10 రెట్లు, శక్తి సుమారుగా 31-32 రెట్లు పెరుగుతుంది. 3.8 తీవ్రత గల భూకంపం సురక్షిత పరిధిలోకి వస్తుంది. కానీ భవనాలు కూలిపోవడం లేదా పెద్ద నష్టం జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
3.0 కంటే తక్కువ: చాలా తేలికైనది, చాలా వరకు తెలియదు.
3.0–3.9: స్వల్పం : తరచుగా ప్రకంపనలు అనుభూతి చెందుతాయి, కానీ నష్టం చాలా తక్కువగా లేదా అసలు ఉండదు.
4.0–4.9: స్వల్పం నుండి మధ్యస్థం: కొన్ని బలహీనమైన భవనాలలో పగుళ్లు ఏర్పడవచ్చు.
5.0–5.9: మధ్యస్థం: మంచి భవనాలకు స్వల్ప నష్టం, బలహీనమైన భవనాలకు గణనీయమైన నష్టం.
6.0–6.9: తీవ్రం: విశాలమైన ప్రాంతంలో నష్టం, వందల కిలోమీటర్ల వరకు ప్రభావం.
7.0–7.9: భారీ భూకంపం: తీవ్రమైన నష్టం, వేలాది మరణాలు సంభవించే అవకాశం.
8.0 లేదా అంతకంటే ఎక్కువ: అతి భారీ భూకంపం : తీవ్ర విధ్వంసం, లక్షలాది మంది ప్రభావితం, సునామీ ముప్పు.
భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి?
భూపటలం అనేక టెక్టోనిక్ ప్లేట్లుగా విభజించి ఉంటుంది. ఈ ఫలకాలు ఏడాదికి కొన్ని సెంటీమీటర్ల వేగంతో తిరుగుతాయి. ఈ ఫలకాలు ఢీకొన్నప్పుడు, రాసుకున్నప్పుడు లేదా విడిపోయినప్పుడు, వాటి మధ్య ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి మరీ ఎక్కువైనప్పుడు, ఫలకాలు అకస్మాత్తుగా పక్కకు జరుగుతాయి. ఈ మార్పు వల్ల విడుదలయ్యే శక్తి భూకంప తరంగాల రూపంలో వెలువడుతుంది. వీటినే మనం భూకంపాలుగా చెబుతుంటాము. భారతదేశం ప్రధానంగా ఇండియన్ ప్లేట్పై ఉంది. ఇది యురేషియన్ ప్లేట్తో ఢీకొంటోంది. ఇదే హిమాలయాల ఏర్పాటుకు కారణమవుతోంది. తెలంగాణ వంటి ప్రాంతాలలో భూకంపాలు తక్కువగా సంభవిస్తాయి. , కానీ అప్పుడప్పుడు చిన్నపాటి ప్రకంపనలు సంభవించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
