icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Monsoon Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం..2-3 రోజుల్లో వానలే వానలు..

Hyderabad, Telangana:

Monsoon Rain Alert Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారిపోతుంది. నిన్న, మొన్నటి వరకు తీవ్రమైన ఎండలు, వడగాలులతో సతమతమవ్వగా.. ఇప్పుడు వడగళ్లు, అకాల వర్షాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ తీపికబురు అందించింది. రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళం రాష్ట్రాన్ని తాకబోతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వానలు పడే అవకాశం కనిపిస్తోంది.

అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇటు తెలంగాణలో రాబోయే మూడు రోజుల వాతావరణ మార్పులకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ గారు కీలక అప్‌డేట్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇవి అరబిక్ మహాసముద్రం, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకుని తూర్పు విదర్భపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు గుండా దక్షిణ కేరళ వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది.

రాబోయే 3 రోజుల్లో వాతావరణం..
నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయిలోనే (స్థిరంగా) కొనసాగుతాయి. అయితే, రేపటి నుండి తదుపరి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఉక్కపోత, ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.

Also REad: 'తల్లికి వందనం' డబ్బు అకౌంట్లో జమ కావాలంటే..ఈసారి అధికారులు ఇవి చెక్ చేస్తారు!

Also Read: రాత పరీక్ష లేకుండానే నెలకు రూ.1,80,000 జీతం..కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని రోజులే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్‌.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

Baddipadaga, Telangana:

Govt Employees Transfers: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాక్‌ తగిలింది. ఉద్యోగులకు సంబంధించి మరో షాకింగ్‌ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఉద్యోగులు మరో బదిలీలపై కీలక నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 1, 2026 నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు బదిలీలకు ఇచ్చిన వెసులుబాటు ముగియడంతో జూన్ 1, 2026 నుంచి బదిలీలపై తిరిగి నిషేధం అమలులోకి వచ్చింది. జూన్ 1 నుంచి రాబోయే ఆరు నెలల వరకు బదిలీల విషయంలో ఎటువంటి మినహాయింపు ప్రతిపాదనలను అంగీకరించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఆరు నెలల తర్వాత బదిలీల నిషేధాన్ని సడలించాల్సి వస్తే.. తప్పనిసరిగా ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత మంత్రుల ద్వారా సీఎం ఆమోదం పొందాల్సి ఉంటుంది.

మినహాయింపులు
బదిలీలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. నిషేధం అమలులో ఉన్న సమయంలో కొన్ని సందర్భాల్లో బదిలీలు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బదిలీలకు లేదా పోస్టింగ్లకు అనుమతి ఇచ్చింది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చిన సమయంలో ఖాళీగా ఉన్న స్థానాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వవచ్చు. దీనికోసం పని చేస్తున్న ఇతర ఉద్యోగులను మార్చకూడదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

క్రమశిక్షణా చర్యలు
బదిలీలపై విధించిన నిషేధపు ఆజ్ఞల్లో పోస్టుల రద్దు, రివర్షన్లు, డెప్యుటేషన్లు (ఫారిన్ సర్వీస్ మాత్రమే), క్రమశిక్షణా చర్యల కారణంగా జరిగే పోస్టింగ్‌లను ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయవచ్చు. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం సెలవులో ఉండి తిరిగి వచ్చే వారికి ఖాళీగా ఉన్న చోట పోస్టింగ్ ఇవ్వవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అత్యవసర పాలనా అవసరాల దృష్ట్యా బదిలీలు చేయాల్సి వస్తే, ప్రస్తుత స్థానంలో కనీసం ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేసిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
బదిలీలపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా బదిలీలు చేస్తే వారి జీతాల బిల్లులను నిలిపివేయాలని ఆర్థిక శాఖ అధికారులు, పే అండ్ అకౌంట్స్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది

0
0
Report

Jamili Elections: రెండు విడతల్లో జమిలి ఎన్నికలు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడు రానున్నాయి?

Hyderabad, Telangana:

Jamili Elections News: జమిలి ఎన్నికలు నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. 'ఒకే దేశం.. ఒకే ఎన్నిక' నేపథ్యంతో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి కాకుండా.. రెండు దశల్లో జమిలి ఎన్నికలను అమలు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు 2026 వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఆమోదించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కూడా దీనిపై కీలక సిఫారసులు చేయనుంది.

రెండు దశల నమూనా..
దేశం మొత్తాన్ని ఒకేసారి ఎన్నికల పరిధిలోకి తెచ్చేందుకు బదులుగా, రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని సర్దుబాటు చేస్తూ 2029, 2034లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశ (2029)లో దాదాపు 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్‌సభ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండవ దశలో భాగంగా 2034 ఏడాదిలో మిగిలిన రాష్ట్రాలను ఈ దశలోకి తీసుకువచ్చి పూర్తిస్థాయిలో జమిలిని అమలు చేస్తారు.

తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడు?
జమిలి ఎన్నికల విధానం అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో కీలక మార్పులు జరగనున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలతో పాటు ప్రతి సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి, ఏపీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు ఉండకపోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ గడువు 2028తో గడువు ముగుస్తుంది. జమిలి ఎన్నికల్లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల వంటి అసెంబ్లీల గడువు 2029కి పెంచే వరకు పెంచే అవకాశం ఉంది. 

ఇతర రాష్ట్రాల గడువు సర్దుబాటు..
2028లో ఛత్తీస్‌గఢ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం అసెంబ్లీల పదవీకాలాన్ని పొడిగిస్తారు. 2030-31లో గడువు ముగిసే బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల గడువును ఒకటి నుంచి రెండేళ్లు తగ్గించాల్సి వస్తుంది.

ఇప్పటికే రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులతో సంప్రదింపులు జరిపిన జేపీసీ.. 2026 వానకాల సమావేశాల చివరి వారంలో తన నివేదికను సమర్పించనుంది. ఇంతటి భారీ రాజ్యాంగ సంస్కరణకు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. అందువల్ల వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి.. ఆ తర్వాత ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా దీనిని ఆమోదించుకోవాలని కేంద్ర బీజేపీ నాయకత్వం పట్టుదలగా ఉంది.

Also Read: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్..రూ.820 తగ్గిన బంగారం ధర..ఇప్పుడెలా ఉన్నాయంటే?

Also Read; భారత్‌లో ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది? గోల్డ్ రేట్ తగ్గిపోతుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Julie On CM Vijay: "నా బిడ్డ చావుకు సీఎం విజయ్ కారణం" తమిళ స్టార్ నటి సంచలన ఆరోపణలు..ఏం జరిగింది?

Nagalapuram, Tamil Nadu:

Julie Miscarriage Trolls: బిగ్ బాస్ తమిళ ఫేమ్, నటి మరియా జూలియానా (జూలీ) చెన్నై పోలీసులను ఆశ్రయించి సంచలన ఆరోపణలు చేశారు. నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు చెందిన 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీ మద్దతుదారులు, అభిమానులు సోషల్ మీడియాలో తనపై చేసిన తీవ్రమైన ట్రోలింగ్, వ్యక్తిత్వ హననం వల్లే తాను గర్భస్రావానికి గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఏడాది జనవరిలో మహమ్మద్ ఇక్రీమ్‌ను వివాహం చేసుకున్న జూలీ, ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. తనపై జరిగిన సైబర్ దాడి గురించి ఆమె పలు విషయాలను పంచుకున్నారు. "నాకు అప్పుడే పెళ్లయింది. మేము మా మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఆన్‌లైన్ వేధింపులు నన్ను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయి. దాంతో నేను నా బిడ్డను కోల్పోయాను. ఒక మహిళ టీవీకే పార్టీ గురించి మాట్లాడినందుకే, మనస్సాక్షి లేకుండా ఆమె పేరును పాడుచేశారు" అని జూలీ ఆరోపించింది.

తనపై రూ.15 లక్షల కిడ్నీ కుంభకోణం ఆరోపణలు మోపడం వెనుక ఒక పక్కా స్క్రిప్ట్ ఉందని, ఇందులో ఒక టీవీకే మద్దతుదారుడు, ఒక న్యాయవాది ఉన్నారని జూలీ ఆరోపించారు. గత మార్చిలో ఎనిమిది మందిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా, అది క్రిమినల్ కేసు కాదని, సివిల్ పరువు నష్టం కిందకు వస్తుందని తనకు నోటీసు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.

సీఎం విజయ్‌పై విమర్శలు
ఈ ఘటనకు తమిళనాడు సీఎం విజయ్‌నే జూలీ బాధ్యుడిని చేశారు. "నా బిడ్డను కోల్పోవడానికి విజయ్ అన్నే కారణం. ఆయన నేరుగా ఈ పని చేయకపోయినా, తన మద్దతుదారులను వెనక్కి తగ్గమని ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేది" అని ఆమె అన్నారు. అయితే, గత డీఎంకే ప్రభుత్వ హయాంలో (ఎన్నికల సమయంలో) ఈ ఫిర్యాదు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం దీనిపై బాధ్యత వహించాలని జూలీ డిమాండ్ చేశారు.

జూలీ వ్యాఖ్యలపై నటి అంబిక తీవ్ర అభ్యంతరం
జూలీ చేసిన ఆరోపణలను దక్షిణాది సీనియర్ నటి అంబిక సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పదవిని, వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె స్పష్టం చేశారు. "జూలీ, నీకు గర్భస్రావం జరగడం పట్ల నేను చాలా బాధపడుతున్నాను. కానీ నువ్వు ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు చాలా అనైతికమైనవి, అమర్యాదకరమైనవి. నీ వ్యక్తిగత ఆరోగ్య సమస్యకు ముఖ్యమంత్రి ఎలా కారణం అవుతారు? దేశంలో ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి పదవిలో ఉన్నవారి వయస్సుతో సంబంధం లేకుండా ఆ పదవికి మనం కనీస గౌరవం ఇవ్వాలి" అని అంబిక రాసుకొచ్చారు.

మరోవైపు విజయ్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో జూలీ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తోందని వారు మండిపడుతున్నారు. 2017 జల్లికట్టు నిరసనల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జూలీ, ఆ తర్వాత బిగ్ బాస్ తమిళ్ (2017), బిగ్ బాస్ అల్టిమేట్ (2022) లలో కంటెస్టెంట్‌గా పాల్గొని పాపులర్ అయ్యారు. పలు తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించారు.

Also Read: సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై నోరు విప్పిన నాగచైతన్య భార్య..అందరికి ఇచ్చిపడేసింది!

Also Read: స్టార్ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి..ఎట్టకేలకు పెళ్లిపై స్టార్ కమెడియన్ క్లారిటీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో ఫోటోలు లీక్.. ఆ నాలుగు అదిరిపోయే రంగులు చూశారా!

Hyderabad, Telangana:

iPhone 18 Pro Dummy Units Leaked: యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ 18 ప్రో సిరీస్‌కు సంబంధించిన కీలక సమాచారం ఇటీవల లీక్ అయింది.. సెప్టెంబర్‌లో విడుదల కాబోతున్న ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల డమ్మీ యూనిట్ల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. తాజా లీకుల ప్రకారం.. ఈసారి యాపిల్ సంస్థ డిజైన్లు కొన్ని మార్పులు చేయడంతో పాటు.. నాలుగు సరికొత్త ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో ఈ ఫోన్లను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీటికి సంబంధించిన డిజైన్ వివరాలు, ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త రంగులు.. మోనోటోన్ డిజైన్..
ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో ఈసారి డార్క్ చెర్రీ రంగు చాలా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న కాస్మిక ఆరెంజ్ స్థానంలో దీనిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీంతోపాటు లైట్ బ్లూ, డార్క్ గ్రేతో పాటు క్లాసిక్ సిల్వర్ రంగులో ఈ ఫోన్ లభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న డ్యూయల్టోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్‌ను పక్కనపెట్టి.. కెమెరా బంపుతో పాటు వెనక క్లాస్ ఒకే రంగులో ఉండేలా సింగిల్ టౌన్ మోనోటోన్ మ్యాట్ ఫినిషింగ్ తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది..

చాలా చిన్నదిగా డైనమిక్ ఐలాండ్..
డిస్ప్లే పరంగా చూస్తే.. ఐఫోన్ 18 ప్రో 6.3 అంగుళాలు, ప్రో మాక్స్ 6.9 అంగుళాల స్క్రీన్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, స్క్రీన్ పై భాగంలో ఉండే Dynamic Island సైజు యాపిల్ సుమారు 35 శాతం మేరకు తగ్గించినట్లు లీకైన చిత్రాల ద్వారా స్పష్టమవుతుంది. ఇందులో కంపెనీ ఇన్ డిస్ప్లే పేస్ ఐడి సాంకేతికతను వాడటం వల్ల ఈ నాచ్ పరిమాణాన్ని తగ్గించి.. వినియోగదారులకు మరింత ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ను కల్పించినట్లు తెలుస్తోంది..

అద్భుతమైన ప్రాసెసర్ ఫీచర్లు..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులోకి తీసుకురాబోయే కెమెరా టెక్నాలజీ ఈసారి హైలెట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. యాపిల్ మొట్టమొదటిసారిగా వేరియబుల్ అపెంచర్ సిస్టం పరిచయం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనివల్ల తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు. అంతేకాకుండా వెనకవైపు 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇక ముందు భాగంలో  48 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఇక ఈ మొబైల్‌లో అత్యంత అధునాతన 2 నానోమీటర్ (2nm) ప్రాసెస్ ఆధారంగా తయారైన A20 ప్రో చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది గతంలో కంటే 15 శాతం వేగవంతమైన పర్ఫామెన్స్‌తో పాటు.. 30 శాతం మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే క్వాల్‌కామ్ మోడెమ్‌లకు స్వస్తి పలుకుతూ యాపిల్ సొంతంగా తయారుచేసిన C2 మోడెమ్ను ఇందులో వాడనున్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైన శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ని కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో ఈసారి ఎంతో శక్తివంతమైన 5,200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Adluri Laxman: దమ్ముంటే నిరూపించు.. మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కొప్పులకు అడ్లూరి కౌంటర్!

Hyderabad, Telangana:

Minister Adluri Laxman Challenge: క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇసుక రవాణాలో తాము ఒక్క రూపాయి అయినా లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే క్షణాల్లో తమ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు.. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. తనపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఉనికి కోసమే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

నా మంత్రి పదవి నుంచి తప్పుకుంటా..
గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పటికీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్లు మార్పు రాలేదని అడ్డూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. నియోజకవర్గంలో పారదర్శకంగా పాలన సాగుతుంటే ఓర్వలేకనే లేనిపోని అక్రమాలను.. అంటగడుతున్నారని ధ్వజమెత్తారు.. ఇసుక దందాలు నాకు భాగస్వామ్యం ఉందని కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేస్తున్నారు.. దమ్ముంటే, ధైర్యం ఉంటే నాపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలి.. నిరూపిస్తే నా మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని.. మంత్రి స్పష్టం చేశారు..

గత పది ఏళ్ల BRS ప్రభుత్వ హయాంలో పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా.. ముఖ్యంగా ధర్మారం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగిందని మంత్రి ఆరోపించారు.. నాటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే నాడు ఇసుక మాఫియా చెలరేగిపోయిందని.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారని విమర్శించారు.. నాటి అక్రమ ఇసుక రవాణాపై పూర్తిస్థాయి విచారణ జరిపించి.. బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని మంత్రి హెచ్చరించారు..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

ఇప్పటికైనా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై చేస్తున్న తప్పుడు.. నిరాధారమైన ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు. కేవలం వార్తల్లో నిలవడానికి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని.. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.. అంతేకాకుండా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే ముందు వెనక ముందు ఆలోచించి.. కొంతైనా నిజం అనిపిస్తేనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేయాలన్నారు.. ఈ సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతోపాటు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Honor Win Turbo: సంచలనం.. 10,000mAh బ్యాటరీతో Honor Win Turbo విడుదల.. ధర ఎంతంటే?

Hyderabad, Telangana:

Honor Win Turbo Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ Honor టెక్ మార్కెట్లోకి సరికొత్త సంచలనానికి తెరలేపింది.. మొబైల్‌ వినియోగదారులను ఎంతగానో ఇబ్బందికి గురి చేస్తున్న బ్యాటరీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఏకంగా 10,000mAh బ్యాటరీ సామర్థ్యంతో కూడిన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ హానర్ విన్ టర్బో స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ఇది భారీ బ్యాటరీతో పాటు 16 జిబి పవర్ఫుల్ ర్యామ్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇందులో కంపెనీ ఎన్నో రకాల అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Honor Win Turbo మొబైల్‌ను కంపెనీ చైనాలో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇది భారత కరెన్సీలో సుమారు ధర రూ.46,000తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వేస్ వేరియంట్ 12gb ర్యామ్‌తో పాటు 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ.58,800 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ బ్లాక్‌తో పాటు బ్లూ వైట్ కలర్ ఆప్షన్లలో వినియోగదారులకు లభించబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను హానర్ కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కంపెనీ త్వరలోనే వెల్లడించబోతోంది..

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది చాలా ప్రత్యేకమైన 6.79 ఇంచుల 1.5K OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రీఫ్రెష్ రేట్, కంటి రక్షణ కోసం 3840Hz PWM డిమ్మింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8500 రేసింగ్ ఎడిషన్ (Dimensity 8500 Racing Edition) చిప్‌సెట్‌తో  ప్రాసెసర్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 10,000mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ని అందిస్తోంది. అంతేకాకుండా 27W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ద్వారా ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 14 గంటల వరకు నిరంతరం పవర్ను అందిస్తుంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఈ మొబైల్‌ వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు.. ఫ్రంట్ భాగంలో చాలా ప్రత్యేకమైన 16 మెగాపిక్సెల్ కెమెరాను అందిస్తోంది. అలాగే ఇది అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఈ ఫోన్ కేవలం 7.98mm మందం, 216 గ్రాముల బరువుతో ఎంతో స్లిమ్‌గా డిజైన్ చేయడం విశేషం. పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, తిరుగులేని బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఈ ఫోన్  మంచి ఎంపికగా భావించవచ్చు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

IPL 2026 Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఇవి గమనించారా? ఆర్సీబీ Vs జీటీ మ్యాచ్‌లో 5 వింత ఘటనలు!

Ahmedabad, Gujarat:

IPL 2026 Final Match Incidents: ఐపీఎల్ 2026 మహా సంగ్రామం ముగిసింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించి, రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. కింగ్ విరాట్ కోహ్లీ అజేయ ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే, ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆట పరంగానే కాకుండా, మైదానంలో జరిగిన 5 ఆసక్తికర, వింత సంఘటనలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెహ్రా వింత ప్రవర్తన..కెప్టెన్ గిల్ టెన్షన్
సాధారణంగా బౌండరీ లైన్ వద్ద నిలబడి ఆటగాళ్లను ఎంతో యాక్టివ్‌గా నడిపించే గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా, ఈ కీలక ఫైనల్లో మాత్రం భిన్నంగా కనిపించాడు. జట్టు ఓటమి అంచున ఉన్నా ఎలాంటి సలహాలు ఇవ్వకుండా, డగౌట్‌లో కూర్చుని నెయిల్ కట్టర్‌తో ప్రశాంతంగా కాళ్ల గోళ్లు తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్రమైన ఒత్తిడితో మైదానంలోనే చేతి గోళ్లు కొరుక్కుంటూ కనిపించాడు. గురువు నిర్లక్ష్యం, శిష్యుడి టెన్షన్‌కు సంబంధించిన ఈ విజువల్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

కోహ్లీని రెచ్చగొట్టిన సాయి సుదర్శన్..
బెంగళూరు ఇన్నింగ్స్ చేజింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన డ్రామా నడిచింది. ఆర్‌సీబీ వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్నప్పుడు, క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీని మానసికంగా దెబ్బతీయడానికి సాయి సుదర్శన్ స్లెడ్జింగ్‌కు దిగాడు. "నువ్వు ఒక్కసారి అవుటై చూడు, మ్యాచ్ మొత్తం మా చేతుల్లోకి వస్తుంది" అంటూ సవాల్ విసిరాడు. అయితే కోహ్లీ ఎంతో సంయమనంతో నవ్వుతూ.. "నేనేం అవుట్ కాను, చివరి వరకు ఉండి మ్యాచ్ గెలిపిస్తా" అని బదులిచ్చాడు. అన్నట్లుగానే కింగ్ కోహ్లీ అజేయంగా నిలిచి జట్టును విజేతగా నిలిపాడు.

ఐసీసీ ఛైర్మన్ జైషా పక్కన వైభవ్ సూర్యవంశీ..
ఈ ఫైనల్ మ్యాచ్‌లో వీఐపీ స్టాండ్స్‌లో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. ఐసీసీ బాస్ జై షా పక్కన కూర్చుని 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మ్యాచ్‌ను వీక్షించాడు. ఈ సీజన్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి 'ఆరెంజ్ క్యాప్' కైవసం చేసుకున్న వైభవ్, ఆ అవార్డును అందుకోవడానికి ఫైనల్ మ్యాచ్‌కు హాజరయ్యాడు. జై షాతో కలిసి అతడు దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

నాటౌట్ వివాదం.. పాత మ్యాచ్ సెగలు..
గుజరాత్ బ్యాటింగ్ సమయంలో జాకబ్ డఫీ వేసిన బంతికి వాషింగ్టన్ సుందర్ భారీ షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జోర్డన్ క్రాక్స్ గాల్లోకి దూకుతూ అద్భుతమైన డైవ్‌తో క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి నేలకు తాకినట్లు రీప్లేలో స్పష్టమవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇదే గ్రౌండ్‌లో గతంలో రజత్ పాటిదార్ క్యాచ్‌ను జేసన్ హోల్డర్ ఇలాగే పట్టినప్పుడు అవుట్ ఇచ్చారని, ఇప్పుడు సుందర్‌కు ఎందుకు ఇవ్వలేదంటూ అభిమానులు అంపైరింగ్ ప్రమాణాలపై మండిపడుతున్నారు.

గిల్ పట్టిన క్యాచ్..థర్డ్ అంపైర్ ట్విస్ట్!
ఆర్‌సీబీ ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో విరాట్ కోహ్లీ గాల్లోకి కొట్టిన బంతిని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పరుగెత్తుకుంటూ వచ్చి నేలకు అతి దగ్గరగా అందుకున్నాడు. తాము మ్యాచ్‌ను మలుపు తిప్పామని భావించిన గుజరాత్ ప్లేయర్లు సంబరాల్లో మునిగిపోయారు. కోహ్లీ కూడా నిరాశగా వెనుతిరగబోయాడు. కానీ థర్డ్ అంపైర్ జూమ్ చేసి క్షుణంగా పరిశీలించి, బంతి గ్రౌండ్‌కు తాకినట్లు తేల్చడంతో కోహ్లీకి నాటౌట్ లభించింది. ఈ నిర్ణయం గుజరాత్ క్యాంప్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగా.. ఆర్‌సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఒత్తిడిని అధిగమించి, స్లెడ్జింగ్‌లకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన కోహ్లీ ఆర్‌సీబీని ఛాంపియన్‌గా నిలబెట్టగా.. ఈ 5 వింత సంఘటనలు ఐపీఎల్ 2026 ఫైనల్‌ను చరిత్రలో ఒక ప్రత్యేకమైన మ్యాచ్‌గా మార్చేశాయి.

Also Read: వైభవ్ సూర్యవంశీకి తప్పిన ప్రమాదం..గుజరాత్ బౌలర్లపై మాజీ క్రికెటర్ పఠాన్ ఆగ్రహం

Also Read: ఎట్టకేలకు భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ..ఆసియా క్రీడల్లో సూర్యకుమార్, గిల్‌కు నో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Karimnagar News: కరీంనగర్ జిల్లాలో వానాకాలం సాగు ఆలస్యం? ఆకాశం వైపు అన్నదాతల చూపు..

Hyderabad, Telangana:

Karimnagar Kharif Season Delayed Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది వానాకాలం సాగు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.. గత సంవత్సరం మే చివరి వారానికి జిల్లా వ్యాప్తంగా సాగు పనులు ముమ్మరంగా ప్రారంభం కాగా.. ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. రోహిణి కార్తె.. ప్రవేశించినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు.. వాతావరణం లో చోటుచేసుకున్న మార్పులతో పాటు ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణం..

జూన్ నెలలో తక్కువ వర్షపాతమే..
వాతావరణ శాఖతోపాటు వ్యవసాయ అధికారుల అంచనాల ప్రకారం.. జూన్ నెలలోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట.. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో పాటు స్థానికంగా ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గిపోవడంతో తొలకరి జల్లుల కోసం వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.. జూన్ మధ్య నాటికి కానీ ఋతుపవనాలు జిల్లాను తాకే అవకాశం లేదని తెలుస్తోంది..

నిలిచిపోయిన పత్తి మొక్కజొన్న కంది విత్తనాల సాగు..
సాధారణంగా మీ ఆఖరి వారం లేదా జూన్ మొదటి వారంలోనే పడే తొలకరి వర్షానికి జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు పత్తితో పాటు మొక్కజొన్న కంది పంటల విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు.. కానీ ఈ ఏడాది భూమిలో తగినంత తేమ లేకపోవడంతో విత్తనాలు వేసే అవకాశం లేకుండా పోయింది.. తగినంత వర్షాపాతం నమోదై.. భూమి పూర్తిగా నానితే తప్ప విత్తనాలు మొలకెత్తవని.. అందుకే రైతులు తొందరపడి విత్తనాలు వేసి నష్టపోవద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

మరోవైపు.. వర్షాలు ఆలస్యం కావడంతో.. వరి నార్లు పోసే ప్రక్రియ కూడా ఆలస్యం కాబోతోంది. ఇది రాబోయే రోజుల్లో పంట కాలచక్రాన్ని దెబ్బ తీసే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో వైశాయ శాఖ అధికారులు జిల్లా రైతాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు.. తొందరపడి పొడి దుక్కుల్లో విత్తనాలు వేయవద్దని.. కనీసం ఐదు నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతే.. పత్తితోపాటు మొక్కజొన్న విత్తనాలు నాటాలని సలహాలు ఇస్తున్నారు.. జిల్లాలోని రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించబోతున్నట్లు.. ప్రత్యామ్ న్యాయ స్వల్పకాలిక పంట విత్తనాలను కూడా అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Cobra In Puja Room Video: దేవుడి గదిలో శ్రీరాముడి ఫోటో పక్కనే భారీ నాగుపాము.. వీడియో వైరల్..

Hyderabad, Telangana:

 Cobra In Puja Room Viral video Watch: ఒక నాగుపాముకు సంబంధించిన అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఎన్నో పాముల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి.. కానీ దేవుడి గదిలో ప్రత్యక్షమైన ఒక అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక ఇంటిలోని పూజా గదిలో.. సాక్షాత్తు శ్రీరాముడి ఫోటో పక్కనే అత్యంత ప్రమాదకరమైన నాగుపాము పడకవిప్పి కూర్చోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది..

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా శివారు ప్రాంతాల్లో పాములు ఇళ్ళలోకి రావడం చూస్తూ ఉంటాం.. అయితే, ఈ ఘటనలో నాగుపాము నేరుగా ఇంట్లోని దేవుడి గదిలోకి ప్రవేశించింది.. నిత్యం పూజలు చేసే ఆ గదిలో.. శ్రీరాముడి పటాన్ని ఆనుకొని నిలబడింది. ఉదయాన్నే పూజ చేద్దామని వెళ్లిన ఇంటి యజమాని.. అక్కడ మృత్యుల పడక విప్పి బుసలు కొడుతున్న భారీ నాగుపామును చూసి ఒక్కసారిగా షాక్కు గురైయ్యాడు.. ప్రాణ భయంతో గది బయటకు పరుగులు తీసి.. కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు..

పూజా గదిలో నాగుపాము ఉన్నదని కుటుంబ సభ్యులు ఇంటి బయటకు వెళ్లి ఇతరులకు చెప్పడంతో.. ఈ వింతను చూసేందుకు స్థానికులు సైతం భారీగా తరలివచ్చారు. కొందరు భక్తితో దానికి నమస్కరించుకోగా.. మరి కొంతమంది అత్యంత ప్రమాదకరమైన విశ్వసర్పం కావడంతో వెంటనే పాములు పట్టే వారికి సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. ఎంతో చాకచక్యంగా ఆ నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. పూజా సామాగ్రిల మధ్య ఉన్న పాములు ఎలాంటి గాయం లేకుండా.. సురక్షితంగా స్నేక్ స్టిక్ సహాయంతో పట్టుకున్నట్లు సమాచారం..

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

ఆ సమయంలో అక్కడున్న వారు తమ స్మార్ట్‌ఫోన్స్‌లో రికార్డు చేసిన వీడియోలతో పాటు ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతే ఇలా పోస్ట్ చేసిన వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. సాక్షాత్తు ఆ రాముడికి రక్షణగా శేష సర్పం వచ్చినట్లుంది అని కొంతమంది రాముడు భక్తులు కామెంట్లు చేస్తున్నారు.. కానీ వన్యప్రాణి ప్రేమికులు మాత్రం దాన్ని సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలిపెట్టాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ఇలా పూజా గదిలోకి నాగుపాము రావడం ఇదే మొదటిసారిగా భావించవచ్చు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report

Kondagattu: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

Hyderabad, Telangana:

Kondagattu Temple Coconut Scam Telugu: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ సన్నిధిలో మామూళ్ల పర్వం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే సాధారణ భక్తులను ఆసరాగా చేసుకుని కొందరు ఆలయ తాత్కాలిక సిబ్బందితోపాటు వర్కర్లు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టేచోట భక్తులనుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్న వైనం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. ఆలయ అధికారుల తీరును ఎండగడుతోంది.

కొబ్బరికాయ కొట్టాలన్నా పన్ను కట్టాల్సిందే..
సాధారణంగా ఆలయానికి వచ్చే భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తప్పకుండా కొబ్బరికాయలను స్వామివారికి సమర్పించుకుంటారు. అయితే కొండగట్టులో కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఉండే కొంతమంది వర్కర్లు భక్తుల నుంచి ఒక్కొక్క కొబ్బరికాయకు 10 రూపాయల చొప్పున వస్తువులు చేస్తున్నారు.. డబ్బులు ఇవ్వనిదే.. కాయలు కొట్టేది లేదంటూ భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గొడవలు ఎందుకని అడిగినంత ఇచ్చుకుంటున్నారు. కొంతమంది వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టే వారు కూడా వీరికి డబ్బులు వేల సంఖ్యలో సమర్పిస్తున్నట్లు సమాచారం..

కొబ్బరి నీళ్లతో వ్యాపారం..
ఈ దోపిడీ ఇంతటితో ఆగలేదు.. భక్తులు కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చే నీళ్లను వృధా పోనివ్వకుండా.. పట్టుకుంటున్న సదరు సిబ్బంది.. వాటిని తిరిగి భక్తులకే భారీ ధరలకు విక్రయిస్తున్నారు.. ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాస్ కొబ్బరినీళ్లను దాదాపు రూ.20 అమ్ముతుండగా.. లీటర్ బాటిల్ కొబ్బరినీళ్లను ఏకంగా రూ.100 రూపాయల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్వామివారి ప్రసాదంగా భావించే కొబ్బరి నీళ్లను ఇలా బహిరంగంగా బ్లాక్ మార్కెట్ తరహాలో అమ్ముతుండడం గమనార్హం..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

అధికారుల మౌనం.. సోషల్ మీడియా వినియోగదారుల ఘాటు కామెంట్లు..
ఆలయ ప్రాంగణంలో ఎంత బహిరంగంగా భక్తులను దోచుకుంటున్నప్పటికీ.. అక్కడి ఆలయ ఉన్నత అధికారులు కానీ.. ఆలయ సిబ్బంది కానీ పట్టించుకోలేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఆలయ అధికారుల అండదండలతోనే ఈ మామూళ్ల పర్వం సాగుతూ ఉందని భక్తులు ఆరోపిస్తూ వస్తున్నారు.. స్థానికులు తీసిన ఈ దోపిడీకి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతుండడంతో సోషల్ మీడియా వినియోగదారులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.. భక్తిని కూడా వ్యాపారం చేసేసారు.. స్వామి సన్నిధిలో దండుపాల్యం ముఠా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.. ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు స్పందించి.. కొండగట్టులో సాగుతున్న ఈ కొబ్బరి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Ketu Transit 2026: మాఘ నక్షత్రంలోకి కేతువు సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టాల కాలం..

Hyderabad, Telangana:

Ketu Transit In Magha Nakshatra 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో కేతువు గ్రహాన్ని ఛాయాగ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. అంతే కాకుండా దీనిని రహస్యం ఆధ్యాత్మికతకు కారక గ్రహంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ గ్రహం ఎల్లప్పుడూ వక్రగతిలో ఒక రాసి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తుంది. ఇదిలా ఉంటే.. కేతువు గ్రహం మే 31వ తేదీన ఆదివారం తెల్లవారి జామున రెండు గంటల సమయంలో మాగ నక్షత్రంలోని మూడవ దశలోకి సంచారం చేసింది.. ఈ గ్రహం ఆగస్టు రెండవ తేదీ వరకు కూడా ఇదే స్థితిలో కొనసాగుతూ ఉంటుంది. అయితే, కేతువు సంచారం నాలుగు రాశుల వారికి అనేక సవాలను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆయా  రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. దీంతోపాటు దీర్ఘకాలిక సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి.. కాబట్టి ఈ సమయంలో ఏ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మిథున రాశి 
కేతువు స్థానంలో మార్పులు రావడం కారణంగా మిధున రాశి వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.. తప్పుడు మాటలు వివాదాలకు దారి తీయవచ్చు పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారాలు చాలా కష్టంగా మారే అవకాశాలుంటాయి కాబట్టి పెట్టుబడులు పెట్టకపోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి కొంత డబ్బులపరంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే మీ మనస్సు కూడా అశాంతిగా మారవచ్చు.

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కేతువు స్థానంలో మార్పుల కారణంగా మానసికంగా ఊహించని స్థాయిలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అంతేకాకుండా ఊహించని ఆందోళన వంటి సమస్యలు కూడా ఇవ్వవచ్చు అలాగే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదంటే అనేక సమస్యలకు దారి తీయవచ్చు ముఖ్యంగా కుటుంబ జీవితంలో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి.  ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. లేదంటే పనుల మధ్య సమతుల్యత లేకపోవడం కారణంగా ఇతర సమస్యలకు దారి తీయవచ్చు.. సమాజంలో మాట తీరు పట్ల ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కేతువు ప్రభావం ఎంతో ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జీవితంలో అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పనిలో కష్టపడటానికి వెనకాడకండి.. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో కష్టపడితేనే మంచి ఫలితాలు పొందగలుగుతారు. లేదంటే అనేక రకాల సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా పాత ప్రాజెక్టులు ఈ సమయంలో ప్రారంభించడం మంచిది లేదంటే వాటిలో కూడా నష్టాలు కూడా వస్తాయి. ఆస్తి సంబంధిత సమస్యలు ఉన్నవారు తప్పకుండా కొంత వేచి చూడాల్సి ఉంటుంది.

మీన రాశి 
కేతువు సంచార ప్రభావంతో మీన రాశి వారికి ఈ సమయం ఎంతో ఆశుభ్రంగా ఉండబోతుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అధిక ఆందోళన కారణంగా అసౌకర్యాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండకపోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.. జీవితంలో ఆకస్మిత హెచ్చుతగ్గులు కూడా పెరుగుతాయి. ఇప్పటికే శని ప్రభావంతో బాధపడుతున్న ఈ రాశి వారు ఈ సమయంలో మరిన్ని సమస్యల బారిన పడాల్సి వస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Jupiter-venus Conjunction: గురు, శుక్రుల అద్భుత కలయిక.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, అపార ధనలాభం!

Hyderabad, Telangana:

Jupiter-Venus Conjunction Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు గ్రహానికి అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, ఈ గ్రహం మిథున రాశిలోకి సంచార దశలో ఉంది.. జూన్ 2న గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహం అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ స్థానంలోనే ఉంటుంది.. సంపదతో పాటు శ్రేయస్సులకు కారకుడైన శుక్రుడు జూన్ 8న ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జూలై 4వ తేదీన సింహరాశిలోకి వెళ్తాడు. ఫలితంగా జూన్ నెలలో కర్కాటక రాశిలో గురు, శుక్ర గ్రహాల సంయోగం జరుగుతుంది. ఈ సంయోగం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.

ఈ రాశుల వారికి జాక్పాట్..
వృషభ రాశి 
గురు శుక్ర గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశి వారికి రోజు వారి ఆదాయం ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత అనుకూలంగా మారుతాయి. అదృష్టం మీకు తోడు ఉండడం కారణంగా జీవితంలో ఊహించని విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టు లభించే అవకాశాలున్నాయి డబ్బుకు ఈ సమయంలో ఎలాంటి కోరత ఉండదు.. అలాగే సమాజంలో మీకు అద్భుతమైన ప్రశంసలు కూడా లభిస్తాయి. ఈ సమయంలో వివాహ అవకాశాలు కూడా లభిస్తాయి.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడు, గురు గ్రహాల కలయిక కారణంగా ఈ సమయం చాలా బాగుంటుంది. వ్యాపారవేత్తలకు అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. అంతేకాకుండా పెద్ద ప్రాజెక్టులు కూడా లభించి.. విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగాల్లో సమస్యలు కూడా తొలగిపోతాయి. జీతం కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సమాజసేవ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మంచి పనులు చేయడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.

ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా అదృష్టం అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది.. డబ్బు సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఊహించని స్థాయిలో పెరిగి చాలాకాలంగా నిలిచిపోయిన పనులు డబ్బులతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సమస్యలు మీకు అనుకూలంగా మారి వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో అశాంతికి దూరంగా ఉండటం చాలా మంచిది.. మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా లభించి.. ఆందోళన నుంచి సులభంగా విముక్తి లభించబోతోంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మీన రాశి 
జూన్ నెలలో గురు శుక్ర గ్రహాలు కలయిక కారణంగా మీన రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది.. ముఖ్యంగా వ్యాపార రంగాలలో నిమగ్నమైన వారికి మంచి పురోగతి కూడా లభిస్తుంది.. ఉద్యోగాల్లో అద్భుతమైన అవకాశాలు లభించడం కారణంగా మంచి లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఊహించని పురోగతి లభిస్తుంది జీవిత భాగస్వామి మీకు తోడుగా ఉంటాడు. ఫలితంగా పెద్ద ప్రమాదాల నుంచి ఎంతో సులభంగా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు కుదుటపడి విశేషమైన ధన లాభాలు పొందే అవకాశాలున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

IPL Final Highlights: గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమి.. ఐపీఎల్‌ 2026 చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

Ahmedabad, Gujarat:

IPL 2026 Champion RCB: ఐపీఎల్‌ ప్రారంభమైన 18 ఏళ్ల తర్వాత ట్రోఫీ సాధించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండో ట్రోఫీని కూడా ఖాతాలో వేసుకుంది. 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన బెంగళూరు జట్టు ఫైనల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ వీరోచిత పోరాటంతో ఐపీఎల్‌ 2026 ట్రోఫీని ముద్దాడింది. క్వాలిఫయర్‌ తొలి మ్యాచ్‌తోపాటు ఫైనల్‌లోనూ పూర్తిస్థాయిలో వైఫల్యం ప్రదర్శించిన గుజరాత్‌ టైటాన్స్‌ రన్నరప్‌గా నిలిచింది.

Also Read: RCB vs GT Highlights: గుజరాత్‌ టైటాన్స్‌ స్వల్ప స్కోర్‌.. బెంగళూరుదే ఐపీఎల్‌ ట్రోఫీ

సొంతగడ్డపై ఆడిన గుజరాత్‌ టైటాన్స్‌ ఘోరంగా విఫలమైంది. వరుసగా రెండో ట్రోఫీ సాధించాలనే కసితో ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో పరాజయం పొందింది. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌ నమోదు చేయకపోగా.. బౌలర్లు కూడా ఘోరంగా విఫలమవడంతో ట్రోఫీని చేజార్చుకుని గుజరాత్‌ టైటాన్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పూర్అద్భుతంగా బౌలింగ్‌ వేసి ప్రత్యర్థిని తక్కువ పరుగులకు కట్టడి చేశారు. ఆరంభం నుంచి వికెట్లు తీస్తూ బౌలర్లు గుజరాత్‌ నడ్డి విరిచారు. ఫలితంగా 00 ఓవర్‌లలో కుప్పకూలింది. ఈ మ్యాచ్‌ విశేషాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్‌ టైటాన్స్‌ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఛేదించి చాంపియన్‌గా నిలిచింది. విరాట్‌ కోహ్లీ వీరోచిత పోరాటంతో బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్‌ ట్రోఫీని చేజిక్కించుకుంది. క్వాలిఫయర్‌ తొలి మ్యాచ్‌లో ఓడించిన జట్టునే ఫైనల్‌లో ఓడించి బెంగళూరు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఫ్రాంచైజీ టోర్నీకి వీడ్కోలు పలుకుతాడనే కోహ్లీకి ఇది చిరస్మరణీయ విజయంతో అతడికి వీడ్కోలు పలికిందని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Govt Employees: రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం

గుజరాత్ బ్యాటర్లు విఫలం
అహ్మదాబాద్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ప్రత్యర్థి బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో గుజరాత్‌ టైటాన్స్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్‌లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌ నమోదు చేయలేకపోయారు. మంచి జోరులో ఉన్న కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ 8 బంతుల్లో 10 పరుగులు చేసి ఔటవడంతో భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. 12 బంతులు ఆడి 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. టాప్‌ బ్యాటర్లు ఔటవడంతో తీవ్ర నిరాశకు గురయిన వేళ నిశాంత్‌ సింధు కొద్దిగా పోరాడి 18 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. జోస్‌ బట్లర్‌ కొద్దిసేపు గ్రౌండ్‌లో నిలబడి 23 బంతులు ఆడాడు. 20 పరుగులు చేసి సింధు ఔటవగా.. అర్షద్‌ ఖాన్‌ 6 బంతుల్లో 15 పరుగులు చేశాడు. బ్యాటర్లందరూ చేతులెత్తేసిన వేళ వాషింగ్టన్‌ సుంర్‌ గొప్పగా పోరాడి అర్ధ సెంచరీ చేశాడు. 

రెండో ట్రోఫీ కోసం బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్లను భారీ దెబ్బతీశారు. సాధారణ స్కోర్‌ కూడా బ్యాటర్లను చేయకుండా బెంగళూరు బౌలర్లు నియంత్రించారు. జోష్‌ హేజిల్‌వుడ్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి రెండు వికెట్లు తీయగా.. అదే స్థాయిలో బౌలింగ్‌ చేసిన రషీక్‌ సలామ్‌ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్‌ కూడా రెండు వికెట్లతో సత్తా చాటాడు. కృనాల్‌ పాండ్యా ఒక వికెట్‌కు పరిమితమయ్యాడు.

0
0
Report

Govt Employees: రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం

Baddipadaga, Telangana:

Telangana Govt Employees: ఎన్నో హామీలు, ఎన్నో ఆశలు.. ఎన్నో డిమాండ్లు.. ఎన్నో సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలువునా మోసం చేస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు ప్రభుత్వ మాజీ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో అధికారంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ఉద్యోగుల పథకం (నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, హెల్త్ కేర్ ట్రస్ట్) అమలు విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలలో తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు దారితీసింది. ఈ క్రమంలో ఉద్యోగులు, పింఛన్‌దారులు, టీచర్లు ప్రభుత్వానికి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: RCB vs GT Highlights: గుజరాత్‌ టైటాన్స్‌ స్వల్ప స్కోర్‌.. బెంగళూరుదే ఐపీఎల్‌ ట్రోఫీ

ముందస్తు సమాచారం.. స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా ఏకపక్షంగా ఉపాధ్యాయుల బేసిక్ పే నుంచి 1.5 శాతం నిర్బంధంగా జీతాల కోత విధించడాన్ని తప్పుబట్టారు. కొత్త ఆరోగ్య పథకంలో సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రిటైర్డ్ ఉద్యోగులపై ప్రభుత్వం అవలంభిస్తున్న సాంకేతిక వివక్షపై 'కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్' (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత కొత్త ఆరోగ్య పథకం విధానంలోని పలు అన్యాయమైన అంశాలను ఎండగట్టారు.

హెల్త్ కార్డుల మంజూరు, వాటి వినియోగంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయలేదని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం గుర్తుచేసింది. కొత్త ఆరోగ్య పథకం కింద ఏయే కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందుతుందో స్పష్టమైన జాబితా లేదని.. ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి అధికారిక ఒప్పందాలు చేసుకోలేదని తెలిపింది. కనీసం ఉద్యోగుల సమ్మతి (ఆప్షన్) తీసుకోకుండా.. డీడీఓలకు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం హెల్త్ కార్డులు చేతికి రాకముందే.. ముందస్తుగా వేతనాల్లో 1.5 శాతం కోత విధించడం అత్యంత అన్యాయమని ప్రకటించారు.

Also Read: KTR Challenge: దమ్ముంటే రేవంత్‌ రెడ్డి 420 హామీలు అమలు చేయాలి: కేటీఆర్‌

ప్రభుత్వం హెల్త్ కేర్ ట్రస్ట్‌లో తన వంతుగా జమ చేయాల్సిన 1.5 శాతం మ్యాచింగ్ గ్రాంట్ నిధులను ముందస్తుగా జమ చేయలేదని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం తెలిపింది. ఒకపక్క కరువు భత్యాలు (డీఏలు) ఇవ్వకుండా.. కొత్త పీఆర్‌సీ ఊసెత్తకుండా ఇలా జీతాల్లో కోతలు పెట్టడం అక్షేపణీయమని సీపీఎస్‌ ఉద్యోగులు ఖండించారు. కొత్త ఆరోగ్య పథకంతో భవిష్యత్తులో రాష్ట్రంలోని 2.60 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఇప్పటికే రిటైరైన సుమారు 3 వేల మంది తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని 'టీఎస్‌సీపీఎస్‌ఈయూ' ఆవేదన వ్యక్తం చేసింది.

'సాధారణ పాతన పింఛన్‌ పథకం (ఓపీఎస్‌) ఉద్యోగుల తరహాలో సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) నంబర్ ఉండదు. ఈ సాంకేతిక కారణాన్ని చూపుతూ రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులను ఈ ఉచిత ఆరోగ్య పథకానికి దూరం పెట్టడం సరైనది కాదు' అని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం తెలిపింది. సర్వీసులో ఉన్నంత కాలం ప్రతి నెల మూల వేతనం నుంచి 1.5 శాతం నిధులు కట్ చేసి, రిటైర్ అయిన మరుక్షణం నుంచి హెల్త్ స్కీమ్‌ను వర్తింపజేయకపోతే రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా ఏదని సంఘం ప్రశ్నించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గందరగోళ పరిస్థితులను అదుపు చేయాలని, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆసుపత్రులతో అధికారిక ఒప్పందాలు కుదుర్చుకుని.. పూర్తి విధి విధానాలు పారదర్శకంగా ప్రకటించిన తర్వాతే ఉద్యోగుల సమ్మతితో ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. అప్పటివరకు వేతన కోతలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాన్ నంబర్ ద్వారా సీపీఎస్ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల సమగ్ర డేటాలను ఐఎఫ్ఎంఐఎస్ మాడ్యూల్ ద్వారా సేకరించాలని సీపీఎస్‌ ఉద్యోగ సంఘం కోరింది. పీపీఓ నంబర్ లేకపోవడంతో వారి ప్రాన్ ఐడీల ఆధారంగానే వివరాలు అప్‌లోడ్ చేసుకునేలా సాఫ్ట్‌వేర్ వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం వర్తించకపోతే ప్రస్తుతం విధుల్లో ఉన్న సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల నుంచి కూడా ఎలాంటి డబ్బులను హెల్త్ ట్రస్ట్‌కు జమచేయవద్దని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లతోపాటు రిటైర్డ్‌ ఉద్యోగులు స్పష్టం చేశారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top