బండ్లగుడా జాగిర్ నూతన మేయర్ మొదటి సమావేశం
Hyderabad, Telangana:రంగారెడ్డి జిల్లా.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ నూతన మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు... ఈ సమావేశంలో కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం రూ 51.11 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారనీ మేయర్ అన్నారు... ముఖ్యంగా కార్పొరేషన్ లో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కోసం హిమాయత్ సాగర్ ఫిల్టర్ బెడ్లను ఏర్పాటుతో మంచినీటి సమస్యతో పాటు మెరుగైన మాలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు..हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Sai Krishna Case: "నా కొడుకుని మేకులు కొట్టి చంపారు..బూడిదైనా ఇవ్వండి!" సాయికృష్ణ తల్లి ఆవేదన!
Vijayawada, Andhra Pradesh:Sai Krishna Case Update: విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు విషయంలో ఆయన తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తన కొడుకును పోలీసులు అత్యంత అమానుషంగా హింసించి చంపేశారని ఆమె ఆరోపించారు. "నా కొడుకు కాళ్లు, చేతుల్లో మేకులు కొట్టి దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు మమ్మల్ని (కుటుంబ సభ్యులను) కూడా చంపాలని చూస్తున్నారు" అంటూ ఆమె భయాందోళనలు వ్యక్తం చేశారు.
ఈ లాకప్ డెత్ వెనుక పెద్దల హస్తం ఉందని విజయలక్ష్మి స్పష్టం చేశారు. పోలీసులు కేవలం నలుగురైదుగురు చిన్న ఉద్యోగులను మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. "నా కొడుకును థర్డ్ డిగ్రీతో విచక్షణారహితంగా హింసించిన అసలు నిందితులు, ఈ లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలు ఇంకా బయటే తిరుగుతున్నారు.వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదు?" అని ఆమె ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు, సూత్రధారులను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు.
బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణ్యం!
తన కొడుకు మృతదేహాన్ని కడసారి చూసుకునే భాగ్యం కూడా కల్పించలేదని, కనీసం అంత్యక్రియల తర్వాత మిగిలిన సాయికృష్ణ బూడిదను (అస్థికలను) కూడా తమకు అప్పగించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "నా కొడుకు బూడిదైనా మాకు ఇవ్వండి.. లేకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా" అంటూ ఆమె తీవ్ర హెచ్చరిక చేశారు.
బాధిత తల్లి విజయలక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు విజయవాడతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. లాకప్ డెత్ కేసులో పోలీసుల వైఫల్యాలను, వైఖరిని ఎండగడుతూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, అసలైన సూత్రధారులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
ALso Read: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!
Also Read: ఇథనాల్ పెట్రోల్తో మీ కారు, బైక్కి ప్రమాదమా? ఇంజిన్ తుప్పు పడుతుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
తులంపై 35వేలు తక్కువ పలుకుతున్న బంగారం ధర.. జులై 5వ తేదీ ధరలివే..!!
Secunderabad, Telangana:Gold Rate Today: ఈరోజు.. ఆదివారం.. జూలై 5వ తేదీన బంగారం ధరలు 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ. 1,47,490 ఉండగా.. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ. 1,36,790 పలుకుతోంది. ఒక కిలోగ్రాము వెండి ధర రూ. 2,36,665 వద్ద ట్రేడ్ అవుతోంది. గత వారం బంగారం ధరలు తీవ్రంగా పడిపోయి, ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగానే బంగారం ధరలు పెరుగుతున్నాయని చెప్పవచ్చు. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం డాలర్ బలహీనపడటమే.. మనం యూఎస్ మార్కెట్ను పరిశీలిస్తే.. ఒక ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 4,165 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదల అని కూడా చెప్పాలి. యూఎస్ డాలర్ విలువ బలపడితే, బంగారం ధరలు తగ్గుతాయి. యూఎస్ డాలర్ విలువ బలహీనపడితే, బంగారం ధరలు కూడా పెరుగుతాయి. ఈ రెండింటి మధ్య బలమైన సంబంధం ఉంది.
బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడి. పెట్టుబడిదారులు తమ లాభాలను కోల్పోకుండా తరచుగా దీనిలో పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు, పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ నష్టాలను నివారించుకోవడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా, యూఎస్ బాండ్ మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, బాండ్ రాబడులు కూడా తగ్గుతాయి. అయినప్పటికీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లించడానికి సుముఖంగా ఉన్నారు. గత వారం బంగారం ధరలు భారీగా పడిపోవడంతో, బంగార ప్రియులకు కొంత ఊరట లభించింది. నగల దుకాణాల్లో కొంత సందడి కనిపించింది. కానీ ఇప్పుడు, ధరలు మళ్లీ పెరుగుతుండటంతో, ప్రజలు బంగారు ఆభరణాలు కొనడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని దుకాణ యజమానులు చెబుతున్నారు.
బంగారం ధరలు భారీగా పెరిగినప్పటి నుంచి, సగటు బంగార ప్రియుడు తన కొనుగోళ్లను తగ్గించుకున్నాడని బంగారు నగల వ్యాపారులు చెబుతున్నారు. అనేక ఆఫర్లు ఉన్నప్పటికీ బేస్ ధర తగ్గకపోవడంతో బంగార ప్రియులు వెనకడుగు వేస్తున్నారని నిపుణులు అంటున్నారు. అయితే, తేలికపాటి బంగారు ఆభరణాల డిజైన్లకు డిమాండ్ పెరిగిందని చెప్పవచ్చు. ప్రస్తుతం, మార్కెట్లో 10 గ్రాముల కంటే తక్కువ బరువున్న బంగారు ఆభరణాలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. వాటిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని నగల దుకాణాల యజమానులు చెబుతున్నారు. మరోవైపు, భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా లేదా తగ్గుతాయా అనే దానిపై చాలా అనిశ్చితి నెలకొని ఉందని చెప్పవచ్చు. అయితే, బంగారం ధరలు పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపైనే ఆధారపడి ఉంటాయి కాబట్టి, ఈ సమయంలో దీనిని అంచనా వేయడం కష్టమని నిపుణులు అంటున్నారు.
Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో
Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Temple: తిరుమల ఆలయానికి వెళ్తున్న భక్తులకు బిగ్ అలర్ట్. రెండు రోజుల పాటు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. తిరుమలలో అత్యంత వైభవంగా జరిగే రెండు వేడుకల సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సిఫారసు లేఖలు కూడా స్వీకరించమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఇంతకీ ఎందుకు? ఎప్పుడు? అనే వివరాలు ఇలా ఉన్నాయి.
జూలై 14వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. జూలై 17వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ రెండు రోజులు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఆణివార ఆస్థానం, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా ఈ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరులకు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. జూలై 13, 16వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించలేమని టీటీడీ అధికారులు వెల్లడించారు. వీటితోపాటు ఆణివారం ఆస్థానం రోజు నిత్యం జరిగే ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు. జూలై 17న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Renault Kwid 2026: రూ.4.53 లక్షలకే సూపర్ గ్రేడ్ కారు..బడ్జెట్లో సూపర్ ఫీచర్స్ ఏంటో తెలుసా?
Hyderabad, Telangana:Renault Kwid 2026 Price: భారతదేశంలోని బడ్జెట్ హ్యాచ్బ్యాక్ విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు రెనాల్ట్ ఇండియా కొత్త 2026 రెనాల్ట్ క్విడ్ను విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.53 లక్షలు నుంచి అందుబాటులో ఉండడం విశేషం. ఇది కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు, సవరించిన వేరియంట్లతో వస్తుంది.
కొత్త రెనాల్ట్ క్విడ్ను ఎవల్యూషన్, క్లైంబర్ అనే రెండు వేరియంట్లలో పరిచయం చేశారు. ఈ రెండు వేరియంట్లు 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్టి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ మునుపటి ఆథెంటిక్, టెక్నో వేరియంట్లను నిలిపివేసి, మోడల్ను సరళీకరించింది.
డిజైన్ పరంగా చూస్తే, కొత్త క్విడ్ బయట 3D రెనాల్ట్ లోగో, కొత్త డ్యూయల్-టోన్ వీల్ కవర్లు, టెయిల్గేట్పై కొత్త స్టైల్ "క్విడ్" బ్యాడ్జ్ను పొందుతుంది. ఇంటీరియర్లో కొత్త కైగర్-స్టైల్ స్టీరింగ్ వీల్, సవరించిన క్యాబిన్, ఆధునిక డిజైన్ ఉన్నాయి.
ఫీచర్ల పరంగా కూడా రెనాల్ట్ అనేక అప్గ్రేడ్లను చేసింది. ఈ కారులో 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే సపోర్ట్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండోస్, మాన్యువల్ ఏసీ ఉన్నాయి. టాప్ క్లైంబర్ వేరియంట్లో భద్రతా ఫీచర్లుగా 6 ఎయిర్బ్యాగ్లు, రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ స్టార్ట్ అసిస్ట్ (AMT మోడళ్లలో), కీలెస్ ఎంట్రీ, EBDతో కూడిన ABS లభిస్తాయి.
ఇంజన్ విభాగంలో ఎలాంటి మార్పు లేదు. ఈ కారుకు మునుపటిలాగే అదే 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ను అమర్చారు. ఇది సుమారు 69 hp పవర్, 92.5 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. రోజువారీ నగర వినియోగానికి ఈ ఇంజన్ తగినంత పనితీరును అందిస్తుందని కంపెనీ పేర్కొంది. మాన్యువల్ వేరియంట్ల కోసం అదనపు ఖర్చుతో రెట్రోఫిట్ CNG కిట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఈ కారులో 8-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే సపోర్ట్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్ విండోస్, మరియు మాన్యువల్ ఏసీ ఉన్నాయి.
దాని ధర, ఫీచర్ల దృష్ట్యా, కొత్త రెనాల్ట్ క్విడ్ మారుతి ఆల్టో కె10, మారుతి ఎస్-ప్రెస్సో, టాటా టియాగో వంటి బడ్జెట్ హ్యాచ్బ్యాక్లతో నేరుగా పోటీపడుతుంది. రెనాల్ట్ కొత్త డిజైన్, భద్రతా అప్గ్రేడ్లు, ఆకర్షణీయమైన ధరలతో మొదటిసారి కారు కొనుగోలు చేసేవారిని ఆకర్షించడంపై దృష్టి సారిస్తోంది.
Also Read; రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..రూ.100లకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్!
ALso Read: టెలిగ్రామ్కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు..15 రోజుల్లో పైరసీ ఆపాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఫుట్బాల్ ప్రపంచకప్లో మరో సంచలనం.. గోల్డెన్ బూట్ రేసులో లియోనిల్ మెస్సీ
Golden Boot Race: ఫుట్బాల్ ఫీవర్ ప్రపంచ దేశాలకు సోకింది. ఫిఫా ప్రపంచకప్ను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తుండగా.. అదే స్థాయిలో ఆటగాళ్లు తమ ప్రదర్శన చేస్తూ సంచలన ఫలితాలు నమోదు చేస్తున్నారు. నరాలు తెగే ఉత్కంఠతో జరుగుతున్న మ్యాచ్లు ప్రేక్షకులకు వినోదం అందిస్తున్నాయి. ఇక అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనిల్ మెస్సీ తన హవాను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో సంచలన ప్రదర్శనలు చేస్తూ మరో రికార్డుకు చేరువయ్యాడు. గోల్డెన్ బూట్ రేసులో మెస్సీ ముందంజలో ఉండగా.. అతడికి పోటీగా ఎంబాపే కూడా వస్తున్నాడు.
2026 ఫుట్బాల్ ప్రపంచ కప్లో గోల్డెన్ బూట్ గెలుచుకునే పోటీ ఇప్పుడు మరింత ఉత్సాహంగా మారుతోంది. ప్రస్తుతం అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఈ రేసులో ముందున్నాడు. మెస్సీ ఇప్పటివరకు 7 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ గెలుచుకోవడానికి ప్రధాన పోటీదారుగా నిలిచాడు. అతడి కంటే ఒకటి తక్కువ చేసిన ఎంబాపే కూడా తాను పోటీలో ఉన్నానని చెబుతున్నాడు. దీంతో గోల్డెన్ బూట్ ఎవరికీ దక్కుతుందనేది ఉత్కంట నెలకొంది.
జూలై 4వ తేదీ ఉదయం 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్లోని రౌండ్ ఆఫ్-32 మ్యాచ్లన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ (రౌండ్ ఆఫ్ 16)పై ఉంది. రౌండ్ ఆఫ్-32లో కేప్ వెర్డేతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా 3-2 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఒక కీలకమైన గోల్ చేశాడు. ఈ గోల్తో మెస్సీ 2026 ఫుట్బాల్ ప్రపంచ కప్లో గోల్డెన్ బూట్ రేసులోకి దూసుకొచ్చాడు. దీంతోపాటు అతడు వరుసగా 8 ప్రపంచకప్ మ్యాచ్లలో కనీసం ఒక గోల్ చేసిన అరుదైన రికార్డును కూడా నెలకొల్పాడు.
లియోనెల్ మెస్సీ తన కెరీర్లో ఎన్నడూ గోల్డెన్ బూట్ గెలుచుకోలేదు. అయితే ఈసారి అది సాధించడానికి అతడికి ఒక సువర్ణావకాశం లభించింది. ఈ ప్రపంచకప్లో ఇప్పటివరకు మొత్తం 7 గోల్స్ చేసిన మెస్సీ అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. కేప్ వెర్డేపై చేసిన గోల్ ప్రపంచ కప్ చరిత్రలో మెస్సీకి 20వ గోల్గా నిలిచింది. ఈ గోల్తో అతడు గోల్డెన్ బూట్ పొందడానికి రేసులోకి వచ్చాడు.
ఎంబాపే గట్టి పోటీ
చిరకాలంగా అందని గోల్డెన్ బూట్ కోసం మెస్సీ ఎదురుచూస్తుండగా.. అయితే ఈసారి తనకు కావాలని ఎంబాపే తీవ్ర పోటీలో నిల్చున్నాడు. గోల్డెన్ బూట్ రేసులో మెస్సీకి అతిపెద్ద ప్రత్యర్థి ఫ్రాన్స్కు చెందిన కైలియన్ ఎంబాపే ఉన్నాడు. ఎంబాపే ఇప్పటివరకు 6 గోల్స్ చేయగా.. నార్వేకు చెందిన ఎర్లింగ్ హాలాండ్, ఇంగ్లాండ్కు చెందిన హ్యారీ కేన్ చెరో 5 గోల్స్తో మూడో స్థానంలో సమంగా ఉన్నారు.
2026 ఫుట్బాల్ ప్రపంచ కప్లో అత్యధిక గోల్స్ చేసినవారు
లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా) - 7 గోల్స్
కైలియన్ ఎంబాపే (ఫ్రాన్స్) – 6 గోల్స్
ఎర్లింగ్ హాలాండ్ (నార్వే) - 5 గోల్స్
హ్యారీ కేన్ (ఇంగ్లాండ్) – 5 గోల్స్
ఈజిప్ట్తో అర్జెంటీనా
రౌండ్ ఆఫ్ -32లో గెలిచిన తర్వాత అర్జెంటీనా ఇప్పుడు ప్రీ-క్వార్టర్ ఫైనల్స్లో ఈజిప్ట్తో తలపడనుంది. రౌండ్ ఆఫ్ 32లో ఆస్ట్రేలియాతో 1-1తో డ్రా చేసుకున్న ఈజిప్ట్, పెనాల్టీ షూటౌట్లో 4-2 తేడాతో విజయం సాధించింది. అర్జెంటీనా, ఈజిప్ట్ జట్ల మధ్య రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ జూలై 7న రాత్రి 9:30 గంటలకు జరగనుంది. మెస్సీ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించి.. జట్టును క్వార్టర్ ఫైనల్స్కు నడిపించగలడా లేదా అనేది ఇప్పుడు చూడాల్సి ఉంది.
Bengaluru Crime News: బెంగళూరులో గ్యాంగ్ రేప్..మత్తు ఇచ్చి యువతిని అత్యాచారం..ఐదుగురు అరెస్టు!
Bengaluru, Karnataka:Bengaluru Rape Case: బెంగళూరులోని మారుతినగర్లో దారుణమైన ఘటన జరిగింది. ఓ ఇంట్లో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఓ యువతి ఫిర్యాదు మేరకు, తలఘట్టపుర పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. దేవనహళ్లికి చెందిన బాధితురాలికి శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు అమరేష్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే సోమశేఖర్ అనే వ్యక్తి, కలబురిగి నుండి తన స్నేహితులు బెంగళూరుకు వచ్చారని, ఆమెను కలవాలనుకుంటున్నారని ఆమెకు చెప్పాడు.
ఆ యువతి సాయంత్రం 7 గంటల సమయంలో బైక్ టాక్సీలో ఆ ప్రదేశానికి చేరుకుంది. నిందితులు ఐదుగురిలో ఇద్దరు ఆమెకు పరిచయస్తులేనని పోలీసులు తెలిపారు. ఈ దాడి జరగడానికి ముందు ఆ బృందం కొంత సమయం కలిసి గడిపి, మద్యం సేవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సమయంలో నిందితులలో ఒకరైన అమరేష్ ఆమెపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనలో మిగిలిన నలుగురు నిందితుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు వారి బారి నుండి తప్పించుకుని, వెంటనే 112 అత్యవసర హెల్ప్లైన్కు కాల్ చేసింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఆమెను రక్షించి, అక్కడే ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయిన వారిలో అమరేష్, సోమశేఖర్ మరో ముగ్గురు ఉన్నారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. తలఘట్టపుర పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను విచారిస్తున్నారు. సీన్ రీక్రియేషన్, ప్రతి అనుమానితుడి పాత్రను బట్టి తదుపరి దర్యాప్తును కొనసాగుతోంది. బాధితురాలి వాంగ్మూలం, వైద్యపరమైన ఆధారాలు, దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తుది అభియోగాలు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు.
Also Read: Mumbai Floods 2026: సముద్రాన్ని తలపిస్తున్న ముంబై..భారీ వరదలతో ఆర్థిక నగరం అల్లకల్లోలం!
Also Read: టెలిగ్రామ్కు మరోసారి కేంద్ర ప్రభుత్వం నోటీసులు..15 రోజుల్లో పైరసీ ఆపాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Siya Goyal: సియా గోయల్ మిడిల్ ఫింగర్ వివాదం.. అసలు నిజం బైటపెట్టిన తండ్రి.. ఏమన్నాడంటే..?
Hyderabad, Telangana:Siya goyal father on Middle finger gesture row: కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు స్పీడ్ ను పెంచారు. ఇటీవల పూణె కోర్టు సైతం మరోసారి సియాకు పోలీసుల కస్టడీకి అనుమతించింది. జులై 16 వరకు సియా, చేతన్ చౌదరీలకు పూణె కోర్టురిమాండ్ విధించింది. ఈ క్రమంలో సియా గోయల్ ఇటీవల పోలీసుల విచారణలో భాగంగా పూణేలోని మార్కెట్ యార్డ్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసానికి తీసుకెళ్లారు అక్కడ ఆమె నేరం జరిగిన రోజున ఆమె ధరించినట్లు ఆరోపించబడిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు.
Praveen Goyal, the father of Siya Goyal, has denied allegations that his daughter made an obscene gesture while in police custody in connection with the Ketan Agarwal murder case.
Rejecting the claims, Praveen Goyal said Siya had sustained an injury to her finger after the door… https://t.co/LB3CzdWqtQ pic.twitter.com/jXI0G0KW2z
— Hate Detector 🔍 (@HateDetectors) July 4, 2026
ఆ తర్వాత బైటకు వచ్చే క్రమంలో సియా తన మధ్య వేలు చూపిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెట్టింట దుమారం చెలరేగింది. సియాకు ఇంత కూడా పశ్చాత్తాపంలేదు.. మిడిల్ ఫింగర్ చూపిస్తు నీచంగా ప్రవర్తించందని తెగ ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై తాజాగా.. సియాగోయల్ తండ్రి ప్రవీణ్ గోయల్ స్పందించాడు.
సియా గోయల్ విచారణకు వచ్చినప్పుడు ఆమె చేతి వేలు కారు డోర్ లో ఇరుక్కుందని చెప్పాడు. ఆమె చేతి వేలికి గాయమైందని చెప్పాడు.వేలికి ప్లాస్టర్ కూడా ఉందని చెప్పాడు. కావాలంటే పోలీసులకు కూడా అడగొచ్చని స్పష్టం చేశాడు. సియా చేతికి గాయమైనట్లు ఒక ఫోటో ను సైతం సియా తండ్రి చూపించాడు.
సియా మధ్య వేలు చూపించిందని ఆరోపణల్లో నిజంలేదని కొట్టిపారేశాడు. ఆమె చేతి వేలు వాచిపోయిందని. గోళ్లు కూడా నీలి రంగులోకి మారిపోయిందని ఆయన అన్నారు. దయచేసి ఫెక్ ప్రచారాలు చేయోద్దని ప్రవీణ్ గోయల్ అసలు విషయం బైటపెట్టాడు.
మరోవైపు పూణే మర్డర్ కేసులో సియా తన స్నేహితురాలితో పెళ్లిపై చేసిన చాట్ బైటకు వచ్చింది. ఈ కేసులో చేతన్ చౌదరీ క్లాస్ మెట్ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొత్తంగా ఈ కేసులో రోజులు గడుస్తున్న కొలది ట్విస్ట్ ల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
రేవంత్ రెడ్డి పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రివర్స్ అయ్యింది: హరీశ్ రావు
Siddipet, Telangana:Telangana Real Estate: కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రివర్స్ అయ్యిందని.. వచ్చేది మన ప్రభుత్వమే అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగం బాగా నడిస్తే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుందని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట అభివృద్ధి వంద కిలోమీటర్ల వేగంతో ప్రగతి పరుగులు పెట్టిస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 'రియల్ ఎస్టేట్ వారందరి తలరాత మారాలి అంటే కేసీఆర్ అనే గీత పెట్టుకోవాలి.. ఆ గీతనే మీ భవిష్యత్ మారుస్తుంది' అని తెలిపారు. సిద్దిపేటకు రేవంత్ రెడ్డి గ్రహణం పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయని వెల్లడించారు.
'రియల్ ఎస్టేట్ రంగం బాగా నడిస్తే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం పెరుగుతుంది. సిమెంట్, స్టీల్, టైల్స్, శానిటరీ, మార్బుల్స్ వంటి అనేక రంగాలకు ఉపాధి లభిస్తుంది. వందలాది వ్యాపారాలు సజావుగా సాగుతాయి' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని, దాని ప్రభావంతో చిన్న వ్యాపారాలు, టీ హోటళ్లు, దుకాణాలు, ఇతర అనుబంధ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఇది ఒక్క సిద్దిపేట పరిస్థితి కాదు. రాష్ట్రం మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోయిన పరిస్థితి. హైదరాబాద్లో చూసినా ఇదే, కరీంనగర్లో చూసినా ఇదే, నల్గొండలో చూసినా ఇదే, మహబూబ్నగర్లో చూసినా ఇదే, నిజామాబాద్లో చూసినా ఇదే పరిస్థితి' అని రియల్ ఎస్టేట్ సంక్షోభాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. 'ఎక్కడ చూసినా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దుకాణాలు నడవడం లేదు. షాపులకు గిరాకీ లేదు. వ్యాపారం పూర్తిగా దెబ్బతింది' అని కాంగ్రెస్ వైఫల్యాన్ని వెల్లడించారు.
హైడ్రా దెబ్బతో వ్యాపారాలు దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు తీర్చడం కాదని.. సమస్యలు తెచ్చి పెడుతుందని ఆరోపించారు. 'సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. నాడు కోటి రూపాలు పలికిన ఎకరం భూమి, నేడు రూ.60 లక్షలకు కొనేవారు లేరు. గతంలో ఎకరం భూమి రూ.10 లక్షల కంటే ఎక్కువ ఉండేది కాదు. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోఇ వచ్చాక భూముల ధరలు పెరిగాయి' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. కుంభకోణాల ప్రభుత్వం పోయి.. పథకాల ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని హరీశ్ రావు తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పారు.
జగిత్యాల KVకి 5 ఎకరాలు సరిపోవు.. 10 ఎకరాలు కేటాయించండి: సీఎంకు ఎంపీ అర్వింద్ లేఖ!
Hyderabad, Telangana:Jagtial Kendriya Vidyalaya: జగిత్యాల జిల్లాలో ప్రతిపాదిత కేంద్రీయ విద్యాలయానికి (కేవీ) కనీసం 10 ఎకరాల భూమిని కేటాయించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్కు ఒక లేఖ రాశారు. చల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర కేబినెట్ 5 ఎకరాల స్థలాన్ని కేటాయించడాన్ని స్వాగతిస్తూనే.. విద్యార్థుల భవిష్యత్తు, మౌలిక వసతుల దృష్ట్యా ఆ స్థలం ఏమాత్రం సరిపోదని ఎంపీ స్పష్టం చేశారు.
భవిష్యత్తు విస్తరణకు ఎలా?
కేంద్రీయ విద్యాలయ సంస్థ (KVS) నిబంధనల ప్రకారం.. మెట్రోయేతర ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కనీసం 10 ఎకరాల స్థలం అవసరమని ఎంపీ అర్వింద్ గుర్తుచేశారు. ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాలు కేవలం ప్రాథమిక తరగతుల గదుల నిర్మాణానికి, కనీస అవసరాలకు మాత్రమే సరిపోతాయని ఆయన లేఖలో రాసిన్నట్లు తెలుస్తోంది.. భవిష్యత్తులో పాఠశాల విస్తరణ, ఆధునిక సైన్స్ ల్యాబ్లు, కంప్యూటర్ రూమ్లు, అధునాతన డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలంటే మరికొంత స్థలం తప్పనిసరి అని లేఖలో పేర్కొన్నారు.
ప్లే గ్రౌండ్స్, హాల్స్ లేకుంటే ఎలా?
విద్యార్థుల మేధో వికాసంతో పాటు శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని.. కానీ 5 ఎకరాల పరిమిత స్థలంలో ఇండోర్, అవుట్డోర్ ప్లే గ్రౌండ్స్, అసెంబ్లీ హాల్స్, ఆడిటోరియంల నిర్మాణానికి వీలుండదని ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించే క్రమంలో నాణ్యమైన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
రాజకీయాలకు తావివ్వకుండా నిర్ణయం తీసుకోవాలి..
విద్యాసంస్థల ఏర్పాటు విషయంలో చిల్లర రాజకీయాలకు తావివ్వకుండా.. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అర్వింద్ డిమాండ్ చేశారు. గతంలోనూ భూమి కేటాయింపు ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయారని.. ఇకనైనా కాలయాపన చేయకుండా స్పందించాలని కోరారు. జగిత్యాల కేంద్రీయ విద్యాలయం ఒక మోడల్ క్యాంపస్గా రూపుదిద్దుకోవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని.. భూ కేటాయింపును 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు పెంచుతూ తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
జగిత్యాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల రచ్చ.. అధికారుల తీరుపై లబ్ధిదారులు ఫైర్!
Hyderabad, Telangana:Jagtial 2BHK Housing Row: జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుల వ్యవహారం తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇండ్ల లబ్ధిదారులు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయానికి భారీగా చేరుకుని ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు చెప్పకుండా.. కండిషన్స్పై గుడ్డిగా సంతకాలు పెట్టించుకుంటున్నారంటూ.. అధికారుల తీరుపై లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
లబ్ధిదారుల సంతకాల సేకరణ..
హౌసింగ్ డిపార్ట్మెంట్ పంపిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా మున్సిపల్ అధికారులు ప్రస్తుతం లబ్ధిదారుల నుంచి సంతకాలను సేకరిస్తున్నారు. అయితే, తాము ఏ పత్రాలపై సంతకాలు పెడుతున్నామో.. ఆ నిబంధనలు ఏంటో తమకు కనీసం వివరించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అవగాహన కల్పించకుండా కేవలం సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేయడంపై వారు మండిపడ్డారు.
అధికారుల తీరుపై మండిపడ్డ బాధితులు..
సాధారణంగా ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరే సమయంలో పారదర్శకత ఉండాలని.. కానీ ఇక్కడ అధికారులు లబ్ధిదారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. నిరక్షరాస్యులైన పేద ప్రజలను గందరగోళానికి గురిచేస్తూ.. భయాందోళనల మధ్య సంతకాలు సేకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ప్రక్రియపై తక్షణమే లబ్ధిదారులందరికీ మున్సిపల్ యంత్రాంగం పూర్తి అవగాహన కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
హౌసింగ్ అధికారులదే బాధ్యత..
కార్యాలయం వద్ద లబ్ధిదారుల ఆందోళన తీవ్రం కావడంతో మున్సిపల్ కమిషనర్ స్పందించారు. గందరగోళాన్ని తగ్గించేందుకు కొంతమంది అధికారులు సంబంధిత అధికారులతో మాట్లాడిన్నట్లు తెలుస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వివరాల సేకరణ, లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా హౌసింగ్ డిపార్ట్మెంట్కు చెందిందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంబంధించిన అన్ని వివరాలు వారి వద్దే ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా అన్ని వివరాలు హౌసింగ్ అధికారులే వివరిస్తారని కొంతమంది మున్సిపల్ అధికారులు తెలిపిన్నట్లు సమాచారం..
ఈ క్రమంలో హౌసింగ్ అధికారులే నేరుగా రంగంలోకి దిగి.. లబ్ధిదారులకు పూర్తి వివరాలు వివరించి.. వారి సందేహాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వివరాల సేకరణ చేపట్టాలని కమిషనర్ సంబంధిత అధికారులకు గట్టిగా సూచించారు. కమిషనర్ హామీతో లబ్ధిదారులు కొంత శాంతించినప్పటికీ.. తమకు న్యాయం జరిగే వరకు అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ ఘటనతోనైనా అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తారో లేదో చూడాలి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
తెలంగాణ, మహారాష్ట్ర బోర్డర్లో కుండపోత వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన పెన్ గంగా, ప్రాణహిత!
Hyderabad, Telangana:Telangana-Maharashtra Border Floods News: గత కొన్ని రోజులుగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఇరు రాష్ట్రాల సరిహద్దులు జలమయమయ్యాయి. సరిహద్దు గుండా ప్రవహించే ప్రాణహిత, పెన్ గంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తూ.. మహోగ్రరూపం దాల్చాయి. భారీగా వస్తున్న వరద నీటితో నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ప్రాంతాల్లో జీవించేవారు బిక్కుబిక్కుమంటూ రోజులు గడపాల్సి వస్తుంది.
కాళేశ్వరం వద్ద ఉరకలేస్తున్న గోదావరి..
ప్రాణహిత నది గంలో ఎన్నడూ లేని విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. ఆ వరద ఉధృతి అంతా దిగువన ఉన్న గోదావరి నదిలోకి చేరుతోంది. ఫలితంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వద్ద గోదావరి నది ఊరకలు వేస్తూ పోటెత్తున్నట్లు తెలుస్తోంది.. త్రివేణి సంగమ క్షేత్రం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
పుష్కర ఘాట్లను ముంచెత్తిన వరద..
సిర్పూర్ నియోజకవర్గంలో వర్షాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని అధికారులు తెలుపుతున్నారు. కౌటాల మండలంలోని ప్రాణహిత నది పుష్కర ఘాట్లను తాకుతూ వరద నీరు చేరింది. ఘాట్లన్నీ దాదాపు మునిగిపోయే స్థితికి చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు, తాటిపెల్లి వద్ద పెన్ గంగా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో ఇరువైపులా ఉన్న రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
అధికారుల తీవ్ర హెచ్చరిక..
మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తోందని.. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేట కోసం నదుల్లోకి వెళ్లకూడదని.. ఎవరూ నదులను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
కొట్టుకుపోయిన ప్రధాన రహదారి..
భారీ వర్షాల ధాటికి సిర్పూర్ మండలంలో తీవ్ర నష్టం వాటిల్లింది. చీలపల్లి వద్ద వరద నీటి ఉధృతికి ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. రోడ్డు కొట్టుకుపోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే పలు గ్రామాలకు నగరాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రాకపోకలు నిలిచిపోవడంతో అత్యవసర వైద్య సేవలు, నిత్యావసరాల కోసం స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
పరిస్థితి రోజు రోజుకి తీవ్రమవుతుండటంతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని.. స్థానిక అధికారుల సూచనలను పాటించాలని కలెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన.. ఆరు రోజుల ఫారెన్ టూర్
Nuzendla, Andhra Pradesh:Nara Lokesh South Korea Tour: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మరోసారి విదేశీ పర్యటన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల కోసం ఆయన విదేశాల్లో పర్యటించనున్నారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కొరియా పర్యటనకు లోకేశ్ సిద్ధమయ్యారు. అధికారిక సమావేశాలతో పాటు పెట్టుబడి చర్చలు చేసేందుకు కొరియాలో నారా లోకేశ్ బృందం పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్ - దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కొరియాలో పర్యటించనున్నారు. ఈనెల 5 నుంచి 11వ తేదీ వరకు ఆరు రోజుల పాటు మంత్రి లోకేష్ దక్షిణ కొరియాను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ కొరియాలో వివిధ మంత్రిత్వశాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ అధికారిక సమావేశాలను నిర్వహిస్తున్నామని దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ (చెన్నయ్) చాంగ్ న్యూన్ కిమ్ తెలిపారు. ఇరుదేశాల నడుమ మరింత సహకారం, సంబంధాల బలోపేతం ఈ పర్యటన కీలక అడుగు కాగలదని భావిస్తున్నట్లు కిమ్ తెలిపారు.
షెడ్యూల్ ఇదే..
==> ఈనెల 5వతేదీన దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశానికి హాజరై అక్కడి భారతీయులు, తెలుగువారిని ఉద్దేశించి నారా లోకేశ్ ప్రసంగించనున్నారు. 6వ తేదీన దక్షిణ కొరియా టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంతోపాటు వివిధ సంస్థలతో పెట్టుబడి చర్చల్లో ఏపీ బృందం పాల్గొననుంది. అనంతరం హ్యోసంగ్ భారీపరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో ఏపీ ప్రభుత్ బృందం సమావేశం కానుంది.
==> 7వతేదీన ఎల్జీ కెమ్ గ్లోబల్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్, ఎల్జీ ఓవర్ సీస్ కంపెనీస్ హెడ్ యున్ జు కోహ్ ఎల్జీ టవర్స్లో ఏర్పాటుచేసిన విందు సమావేశంలో నారా లోకేశ్ పాల్గొననున్నారు. ఎల్జీ అనుబంధ సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి.
==> 8వ తేదీన కొరియన్ మెరైన్ అక్విప్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం
==> 9వతేదీన కొరియన్ పొలిటికల్ ఎఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ మిస్. యుయి-హే సిసిలియా చుంగ్ తో భేటీ అనంతరం కొరియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇన్వెస్టిమెంట్స్ డిప్యూటీ మినిస్టర్ కాంచన్ కాంగ్తో సమావేశం
==> 10వతేదీన వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడి చర్చలతోపాటు కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్న ఏపీ ప్రభుత్వ బృందం. అదేరోజు రాత్రి సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్–2026 విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధులతో రోడ్ షోలో నారా లోకేశ్ పాల్గొననున్నారు.
AP Land Registration: రైతన్నలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త..రూ.100లకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్!
Vijayawada, Andhra Pradesh:AP Land Hereditary Registration: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యజమానులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులకు ఒక అద్భుతమైన ఊరటను ఇచ్చింది. కుటుంబంలో పెద్దలు మరణించిన తర్వాత, వారి వారసత్వ వ్యవసాయ భూములను తమ పేర్ల మీదకు మార్చుకునేందుకు గతంలో ఉన్న అతి సుదీర్ఘమైన ప్రక్రియకు ఏపీ సర్కార్ స్వస్తి పలికింది. ఇకపై కేవలం రూ.100 స్టాంపు డ్యూటీతో వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే సరికొత్త వెసులుబాటును ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.
ఈ కొత్త విధానం ప్రకారం ఆస్తి విలువ సుమారు నామినల్ చార్జీలను నిర్ణయించారు. స్టేషన్ చేయించుకోబోయే వారసత్వ భూమి విలువ గనక రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం వంద రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ భూమి విలువ సుమారు రూ.10 లక్షలకు పైగా ఉంటే కేవలం రూ.1000 చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల సాధారణ, మధ్యతరగతి కుటుంబాలపై రిజిస్ట్రేషన్ ఫీజులు భారం భారీగా తగ్గనుంది.
ఈ నూతన సంస్కరణలో కేవలం తక్కువ ఖర్చు మాత్రమే కాదు, అంతకు మించిన సాంకేతిక సౌలభ్యాన్ని కూడా ప్రభుత్వం జోడించింది. గతంలో రిజిస్ట్రేషన్ పుట్టిన తర్వాత కూడా రెవిన్యూ రికార్డుల్లో పేరు మార్చడానికి (మ్యుటేషన్ కోసం) రైతులు తహసీల్దారు లేదా విలేజి రెవెన్యూ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. లంచాలు, కాలయాపనతో విసిగిపోయేవారు. ఈ ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం ఈ ప్రక్రియకు ఆటోమొటేషన్ విధానాన్ని అనుసంధానం చేసింది.
దీని ప్రకారం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వారసుల మధ్య ఆస్తుల విభజన లేదా బదిలీ డాక్యుమెంటరీ అవ్వగా.. ఆ సమాచారం ఆటోమేటిక్గా రెవిన్యూ శాఖ సాఫ్ట్వేర్ కు బదిలీ అవుతుంది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే, వెనువెంటనే రెవిన్యూ రికార్డుల్లో అంటే అడంగల్/1b ఫారాల్లో కొత్త వారసుల పేర్లు అప్డేట్ అయిపోతాయి.
మొత్తంగా తాతలు, తండ్రులు లేదా తల్లులు మరణాంతరం భూహక్కుల మార్పిడి కోసం కార్యాలయాలు చుట్టూ తిరిగి తిప్పలు తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇది అటు డబ్బును ఇటు అమూల్యమైన కాలాన్ని ఆధారి చేయడమే కాకుండా, రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: AP Gold Mines: ఏపీలో మరో బంగారు గని? లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు!
Also Read: "నీ తొడల సైజ్ ఎంత?".. స్టార్ డైరెక్టర్ అడిగిన ప్రశ్నకు బిత్తరపోయిన మౌనీషా చౌదరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటం.. రేపు కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన
Metpalle, Telangana:Kaleshwaram Project: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మరో పోరాటానికి గులాబీ పార్టీ సిద్ధమైంది. కేసీఆర్ మీద కక్షతోనే కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఎత్తిపోయకపోవడంతో రేపు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన కన్నెపల్లి పంప్హౌస్ను సందర్శించనుండడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లు వెంటనే ఆన్ చేయాల్సిందేనని ఈ పర్యటనతో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పనుంది. వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ వృథాగా పోతున్న గోదావరి జలాలను ఎత్తిపోయాల్సిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దునిద్ర వీడడంపై గులాబీ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి రైతులకు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్ సర్కార్ నీళ్లు ఎత్తిపోయకపోవడాన్ని రేపు బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టనుంది.
కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై రేపు జూలై 5వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ బృందం సందర్శించనుంది. మంథని నియోజకవర్గంలోని కన్నెపల్లి వద్ద వృథాగా పోతున్న జలాలను బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం వలన గోదావరి బేసిన్లో కేవలం 23 శాతం మాత్రమే రిజర్వాయర్లు నిండి ఉండడంతో రైతులకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడనుంది.
ఇంజనీర్ల ఆందోళన
'ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గోదావరిలో 15 వేల క్యూసెక్కులు దాటి ప్రవాహం నమోదవుతోంది. రానున్న రోజుల్లో ప్రవాహాలు 60 వేల క్యూసెక్కులకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మేడిగడ్డ బరాజ్పై ఆధారపడకుండా కన్నెపల్లి (లక్ష్మీ) పంప్హౌజ్ దగ్గర నీటిని మళ్లించి.. పంపింగ్ చేపట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కన్నెపల్లి పంప్హౌజ్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో ప్రస్తుతం లభిస్తున్న ప్రవాహాన్ని వాడుకొని వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు నీరు అందించే మార్గం ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. ఇదే విషయాన్ని చెప్పేందుకు.. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే రేపు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కన్నెపల్లి పంప్హౌజ్ను సందర్శించనుంది. ఈ పర్యటనకు పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలివెళ్లే అవకాశం ఉంది. కన్నెపల్లి పంపుహౌస్ సందర్శనకు బీఆర్ఎస్ పార్టీ వెళ్తుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్రమత్తమైందని తెలుస్తోంది.
