బండ్లగుడా జాగిర్ నూతన మేయర్ మొదటి సమావేశం
Hyderabad, Telangana:రంగారెడ్డి జిల్లా.. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ నూతన మేయర్ లతా ప్రేమ్ గౌడ్ అధ్యక్షతన సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు... ఈ సమావేశంలో కార్పొరేషన్ అభివృద్ధి పనుల కోసం రూ 51.11 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారనీ మేయర్ అన్నారు... ముఖ్యంగా కార్పొరేషన్ లో నీటి ఎద్దడి సమస్య పరిష్కారం కోసం హిమాయత్ సాగర్ ఫిల్టర్ బెడ్లను ఏర్పాటుతో మంచినీటి సమస్యతో పాటు మెరుగైన మాలిక వసతులకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు..हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Kavitha: ఆ విషయం రేవంత్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టి చెప్పగలడా? మాజీ ఎమ్మెల్సీ కవిత నిలదీత
Hyderabad, Telangana:Farmer Discom Proposal: రైతు డిస్కం ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కంలు ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తాము అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టి చెప్పగలరా? తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కవిత నిలదీశారు. ఉచిత విద్యుత్ తీసేయం, మోటార్లకు మీటర్లు పెట్టబోమని ప్రజలకు స్పష్టతనివ్వాలని కోరారు. విద్యుత్ సంస్కరణాల్లో భాగంగా కేంద్రం చేపడుతున్న చర్యలకు రాష్ట్రం వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు.
ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వొద్దు
'రైతులకు సంబంధించి డిస్కం విషయంలో ఈఆర్సీ వారి అభిప్రాయాలు తీసుకోవాలి. రైతులకు నష్టం చేసే ఈ డిస్కం కు ఈఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వొద్దు' అని మాజీ ఎమ్మెల్సీ కవిత కోరారు. తెలంగాణ జాగృతి తరఫున కేసు కూడా వేశామని.. పర్మిషన్ ఇస్తే సుప్రీంకి వెళ్లైనా అడ్డుకుంటామని ప్రకటించారు. దసరా పండుగలోపు పాలమూరు ఎత్తిపోతల పథకంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ప్రారంభించకపోతే తెల్లారి నుంచే పాదయాత్ర చేస్తానని కవిత తెలిపారు.
'రైతు డిస్కం గురించి ఆరు నెలల పాటు రహాస్యంగా ఉంచిన తర్వాత నిన్న చిట్చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 24 గంటల కరెంట్ ఎత్తివేయం, మోటార్లకు మీటర్లు పెట్టమని చెబుతున్నారు. అలా చేస్తే ఎన్నికలకే వెళ్లమని అంటున్నారు. కానీ ఈ మాటను ఆయన ప్రెస్మీట్ ద్వారా చెప్పాలి. లేదంటే తర్వాత నేను అనలేదని మాట మార్చుతారు. బహిరంగ సభల్లో ఇచ్చిన మాటలనే తప్పిన రేవంత్ రెడ్డికి ఇది ఒక లెక్క కాదు. అప్పుడు నమ్మిన ప్రజలు, రాసిన పత్రికలు పూల్స్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది' అని కవిత వివరించారు.
ప్రైవేట్ పరం చేసే కుట్ర
'రైతు డిస్కం ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారు. మిగతా రెండు డిస్కమ్లను ప్రైవేట్ పరం చేస్తే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టతనివ్వాలి' అని మాజీ ఎమ్మెల్సీ కవిత సవాల్ చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో తమకు అనుమానం కలుగుతోందని తెలిపారు. సోలార్ ప్యానెల్స్కు సంబంధించి ఇండియాలో బ్యాటరీలు తయారు చేసే కంపెనీలకు అవకాశం అంటూ కేంద్రం చెబుతోందని చెప్పారు. అలా అయితే ఒక రిలయన్స్, ఒక అదానీ కంపెనీలకు మాత్రమే అవకాశం ఉంటుందని కవిత వివరించారు.
'చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు తయారు చేసే చాలా కంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీలన్నింటికీ చరమగీతం పాడేలా కుట్ర చేస్తున్నారు. కేవలం ఐదు రోజులు సమయం ఇవ్వటంతో చాలా చిన్న కంపెనీలకు నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. చిన్న వ్యాపారులంతా కూడా దీనిపై ధర్నా చేస్తామని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపారులందరికీ అవకాశం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
విద్యుత్ సంస్కరణాల్లో భాగంగా కేంద్రం ఒక్కొక్క జీవో ఇస్తుంటే ప్రైవేటుపరం చేసేందుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కవిత ఆందోళన వ్యక్తం చేశారు. 'రైతు డిస్కమ్కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వవద్దని ఈఆర్సీని కోరుతున్నాం. దీన్ని కచ్చితంగా మేము ఆపి తీరుతాం' అని ప్రకటించారు. ఈ డిస్కమ్కు సంబంధించి వినియోగదారులంతా కూడా రైతులేనని స్పష్టం చేశారు. అందుకే వారి అభిప్రాయాలు తీసుకోవాలని.. మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ పెట్టాలని కోరారు.
సుప్రీంకోర్టు వరకు వెళ్లి అడ్డుకుంటా
ఒక వేళ ఈఆర్సీ పర్మిషన్ ఇచ్చినా సరే సుప్రీంకోర్టు వరకు వెళ్లి దాన్ని అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి స్వచ్చంధ సంస్థ ద్వారా తాము కేసు వేశామని తెలిపారు. 'రైతు భరోసా ఇప్పుడు రెండు ఎకరాలలోపు వారికే ఇచ్చారు. రైతు రుణమాఫీ 30 శాతం మందికి కాలేదు. బోనస్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొంటమని చెప్పి ఇప్పటికీ కొనుగోలు సరిగా చేయటం లేదు' అని రేవంత్ రెడ్డి వైఫల్యాలను కవిత వివరించారు.
రైతు బీమాను యాక్సిడెంటల్ బీమాగా మార్చేసే కుట్ర చేశారని. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేపట్టిన అన్ని చర్యలు రైతులకు వ్యతిరేకంగానే ఉన్నాయని రేవంత్ రెడ్డి రైతులకు చేసిన ద్రోహాన్ని మాజీ ఎమ్మెల్సీ కవిత వివరించారు. 'ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా హైడ్రాను సమర్థిస్తూ వార్తలు రాస్తోంది. బడా వ్యక్తులు చేసే కబ్జాలపై నేను ఇచ్చిన ఫిర్యాదులను హైడ్రా పక్కన పెట్టింది. అంటే పెద్ద వాళ్లను కాపాడుతూ పేద వాళ్లను ఇబ్బంది పెట్టేలా హైడ్రా చర్యలు ఉన్నాయి' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
త్వరలో పాదయాత్ర
పాలమూరు ప్రాజెక్ట్ గురించి మేము అడగగానే ముఖ్యమంత్రి రివ్యూ చేస్తానని చెప్పారు. ఆయన కుమ్మెర అనే గ్రామానికి వెళ్తున్నట్లు తెలిసింది. అదే గ్రామంలో కులవివక్షతో ఒక పసిగుడ్డును చంపేశారు.
రేవంత్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారిని ఆదుకోవాలి' అని కోరారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ ప్రారంభించాలని.. దసరాలోపు ప్రభుత్వం ఆ పని మొదలు పెట్టకపోతే ఆ మరుసటి రోజు నుంచే పాదయాత్ర చేస్తామని కవిత ప్రకటించారు.
Thalliki Vandanam Scheme: 'తల్లికి వందనం' డబ్బు అకౌంట్లో జమ కావాలంటే..ఈసారి అధికారులు ఇవి చెక్ చేస్తారు జాగ్రత్త!
Vijayawada, Andhra Pradesh:Thalliki Vandanam Scheme Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈ ఏడాది అర్హులైన లబ్ధిదారులకు రూ.13,000 జమ చేసేందుకు వీలుగా ప్రభుత్వం డేటా వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. పాఠశాలల నుంచి సేకరించిన విద్యార్థుల ఆధార్, ఇతర వివరాలను ప్రభుత్వం ఇప్పటికే గ్రామ/వార్డు సచివాలయాలకు పంపింది. అక్కడ ఈ వివరాలను హౌస్హోల్డ్ డేటాబేస్ తో సరిపోల్చే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఈ వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే నిధుల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయనుంది.
సచివాలయాల్లో వెరిఫికేషన్ ఎలా?
సచివాలయాల్లోని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఈ పరిశీలన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 'నవశకం లబ్ధిదారుల మేనేజ్మెంట్ పోర్టల్'లో ప్రత్యేక మాడ్యూల్ను అందుబాటులో ఉంచారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ వెరిఫికేషన్ వర్తిస్తుంది. డేటా పరిశీలనలో ఎదురవుతున్న 5 ప్రధాన సమస్యలను పరిష్కరిస్తూ అధికారులు తుది జాబితాను సిద్ధం చేస్తున్నారు.
1) లబ్ధిదారుల జాబితాలో తల్లి అందుబాటులో ఉంటే ఆమెను హౌస్హోల్డ్ డేటాబేస్లో చేర్చుతారు. ఒకవేళ తల్లి లేనిపక్షంలో తండ్రి లేదా సంరక్షకుడి వివరాలను నమోదు చేస్తారు.
2) ఒకవేళ విద్యార్థి, తల్లి వేర్వేరు కుటుంబ ఐడీలలో ఉంటే.. 'మైగ్రేషన్ ఆప్షన్' ద్వారా వారిద్దరినీ ఒకే ఇంటి కిందకు తీసుకువస్తారు.
3) ఒకే తల్లికి నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు డేటాలో చూపిస్తే.. అధికారులు నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. పిల్లలందరూ ఆ తల్లికే జన్మించారా లేదా అనేది వెరిఫై చేసి, సరైన రిమార్కులు నమోదు చేస్తారు.
4) విద్యార్థికి, తల్లికి పొరపాటున ఒకే ఐడీ నంబర్ నమోదై ఉంటే.. ఆ ఐడీని సరైన వ్యక్తికి ట్యాగ్ చేసి, రెండో వ్యక్తికి సంబంధించిన అసలైన ఐడీ వివరాలను సేకరించి అప్డేట్ చేస్తారు.
5) తప్పులు లేని లబ్ధిదారుల జాబితాను రూపొందించడం కోసం హౌస్హోల్డ్ మ్యాపింగ్ను పక్కాగా పూర్తి చేస్తున్నారు.
ఇక్కడ లబ్ధిదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. సచివాలయ ఉద్యోగులు ఈ డేటా వెరిఫికేషన్ను సకాలంలో, ఖచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రక్రియలో ఆలస్యమైతే లేదా తప్పులు దొర్లితే అర్హులైన విద్యార్థులకు 'తల్లికి వందనం' నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. సచివాలయాల్లో ఈ ఐదు రకాల సమస్యల పరిష్కారం పూర్తయిన తర్వాతే ప్రభుత్వం తుది అర్హుల జాబితాను విడుదల చేస్తుంది. ఆ వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అవుతుంది.
Also Read: ఢిల్లీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిళ..కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు..రాహుల్ గాంధీతో భేటీ!
Also Read: భారత్లో ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది? గోల్డ్ రేట్ తగ్గిపోతుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Alcohol Consumption: దేశంలోనే తెలంగాణ నంబర్వన్.. మద్యపానంలో జాతీయ రికార్డు బద్దలు
Wadgaon, Maharashtra:Telangana Liquor: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా భారతీయులు మద్యపానం తగ్గించకుండా మరింత తాగేస్తున్నారు. దేశవ్యాప్తంగా తాగుబోతుల సంఖ్య పెరిగిపోతుండగా.. మద్యపానంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధికంగా తెలంగాణలో మద్యం సేవిస్తున్నారని జాతీయ సర్వేలో వెల్లడైంది. ఇక పొరుగున ఉన్న రాష్ట్రం ఏపీలో తాగుబోతుల సంఖ్య తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా మద్యం సేవించే వారిపై జాతీయ సర్వేలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే సమగ్ర కథనం ఇలా ఉంది.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 ప్రకారం భారతదేశంలో మద్యపానంపై కీలక వివరాలు వెల్లడయ్యాయి. మద్యం సేవించేవారిలో పురుషులు కేవలం 18.9 శాతం మంది మంది మాత్రమే ఉన్నారు. మహిళలు, పురుషులు మద్యం సేవించడంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో దాదాపు సగం మంది పురుషులు మద్యం సేవిస్తుండగా.. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ మహిళలే అత్యధికంగా మద్యం సేవిస్తున్నట్లు జాతీయ సర్వే వెల్లడించింది.
జాతీయ సగటు: దేశంలో 15 సంవత్సరాలు పైబడిన పురుషులలో 18.9 శాతం మంది మద్యం సేవిస్తున్నారు. మహిళలు 1.1 శాతంగా ఉంది.
తెలంగాణ రికార్డు: జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో పురుషుల మద్యం వినియోగం రెట్టింపు కంటే ఎక్కువగా 43.9 శాతం ఉంది. ఇక మహిళల వినియోగం ఆరు రెట్లకు పైగా అంటే 7.1 శాతం ఎక్కువగా ఉంది.
ప్రాంతీయ వ్యత్యాసాలు: దేశవ్యాప్తంగా మద్యం అలవాటు అన్నీ రాష్ట్రాల్లో సమానంగా లేదు. కొన్ని ప్రాంతాలలోనే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు.
తెలంగాణ గణాంకాలు
మద్యం వినియోగం విషంలో తెలంగాణలో అత్యధికంగా పురుషులు తాగుతున్నారు. మద్యపానం అలవాటు పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుందని సర్వే తెలిపింది.
విభాగం గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం మొత్తం రాష్ట్ర సగటు
పురుషులు 46.6% 36.3% 43.9%
మహిళలు 8.6% 2.8% 7.1%
తెలంగాణ గ్రామీణ మహిళలు పట్టణ మహిళలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని సర్వేలోని లెక్కలు చెబుతున్నారు. గత సర్వే (5)తో పోలిస్తే తెలంగాణలో మద్యం వినియోగం స్వల్పంగా పెరిగింది.
అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానం
మద్యపానం సేవించడంలో చిన్న రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆ జాబితాలో దేశంలోనే అరుణాచల్ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అరుణాచల్ ప్రదేశ్లో 50.5 శాతం పురుషులు, 23.2 శాతం మహిళలు మద్యం సేవించే అలవాటు ఉంది. ఆ తర్వాత సిక్కిం రెండో స్థానంలో నిలవగా.. అక్కడ 42.2 శాతం పురుషులు, 19.9 శాతం మహిళలు మద్యం సేవిస్తారు. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళల్లో మద్యం సేవించే అలవాటు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది.
తెలంగాణ తర్వాత ఛత్తీస్గఢ్ మద్యపానం సేవించడంలో రెండో స్థానంలో ఉంది. ఇక్క 38.3 శాతం పురుషులు మద్యం సేవిస్తుండగా.. తర్వాతి స్థానంలో జార్ఖండ్ ఉంది. జార్ఖండ్లో 33.6 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తారు.
ఇతర రాష్ట్రాల్లో మద్యపానం లెక్కలు
హిమాచల్ ప్రదేశ్: 30.2 శాతం
త్రిపుర: 29.5 శాతం
మేఘాలయ: 28.3 శాతం
ఉత్తరాఖండ్: 27.2 శాతం
మహిళల మద్యపానం
7.1 శాతంతో తెలంగాణ మొదటి స్థానం
అరుణాచల్ ప్రదేశ్ : 23.2 శాతం
సిక్కిం : 19.9 శాతం
త్రిపుర : 6.0 శాతం
అస్సాం: 5.8 శాతం
ఛత్తీస్గఢ్: 5.7 శాతం
జార్ఖండ్: 5.5 శాతం
దక్షిణ భారతదేశంలో మద్యపానం
దేశంలోని ప్రధాన ప్రాంతమైన దక్షిణ భారతదేశంలో మద్యం వినియోగంలో భారీ తేడాలు ఉన్నాయి.
పురుషుల వినియోగం
తెలంగాణలో అత్యధికంగా 43.9 శాతం
తమిళనాడుల: 23.5 శాతం
ఆంధ్రప్రదేశ్: 23.3 శాతం
కేరళ: 22.7 శాతం
కర్ణాటక: 15.6 శాతం
మహిళల వినియోగం
తెలంగాణలో 7.1 శాతం
ఆంధ్రప్రదేశ్: 0.6 శాతం
కర్ణాటక: 0.5 శాతం
కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర: 0.3 శాతం
Gold Demand In India: భారత్లో ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది? గోల్డ్ రేట్ తగ్గిపోతుందా?
Hyderabad, Telangana:Gold Demand India News: బంగారం ధర అనేది కేవలం దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ను బట్టి ఆధారపడి ఉండదు. అమెరికా, చైనా, పశ్చిమాసియా దేశాలు, కేంద్ర బ్యాంకులు చేసే బంగారు కొనుగోళ్లు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. అయితే ఈ క్రమంలో ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయకపోతే ఏం జరుగుతందో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో బంగారం కేవలం ఆభరణాలతో అలంకరణే కాకుండా ప్రజల భావోద్వేగాల్లో, పెట్టుబడికి చిహ్నంగా మారింది. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన దేశాల్లో భారత్ ఒకటి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయోద్దని ప్రజలకు సూచించారు. అయితే భారత్ వంటి అధిక బంగారం దిగుమతి చేసుకునే దేశాలు ఏడాది పాటు గోల్డ్ కొనుగోలు తగ్గిస్తే ఏం జరుగుతుందనే విషయంపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రపంచ బంగారు కొనుగోలు, దిగుమతిలో భారత్ ప్రధాన వాటాను కలిగి ఉంది. ప్రతి ఏటా జరిగే పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేస్తారనే విషయం అందరికి తెలిసిందే. ఈ అవసరాల కోసం భారత్ నిత్యం లక్షల టన్నుల బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. ఒకవేళ ఈ డిమాండ్ ఒక ఏడాది పాటు పూర్తిగా పడిపోతే, అది దేశీయ మార్కెట్లో బంగారు అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు.
అయితే బంగారం ధర కేవలం భారతీయ డిమాండ్పై మాత్రమే ఆధారపడి ఉండదు. అమెరికా, చైనా, పశ్చిమాసియా దేశాలు చేసే బంగారు కొనుగోళ్లు, కేంద్ర బ్యాంకులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో భారతదేశంలో డిమాండ్ తగ్గినా.. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర పూర్తిగా తగ్గే అవకాశం లేదు.
అయితే, భారత మార్కెట్పై బంగారు వ్యాపారులు, ఆభరణాల పరిశ్రమ, బంగారు దిగుమతి రంగం తీవ్ర ప్రభావం చూపవచ్చు. వేల కోట్ల రూపాయల విలువైన ఈ పరిశ్రమలో మందగమనం ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపవచ్చు. ఆర్థిక విశ్లేషకుల ప్రకారం, భారతీయులు బంగారం కొనకపోతే స్వల్పకాలంలో ధరలపై ఒత్తిడి ఏర్పడవచ్చు. అయితే ప్రపంచ పెట్టుబడిదారులు, కేంద్ర బ్యాంకుల నుండి డిమాండ్ కొనసాగితే, బంగారం ధరలు మళ్లీ స్థిరపడే అవకాశం ఉంది.
మొత్తం మీద భారతదేశంలో ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిచిపోయినా కూడా, బంగారం ధర పూర్తిగా పడిపోదు. కానీ దేశీయ మార్కెట్, ఆభరణాల పరిశ్రమ, దిగుమతుల రంగంపై దాని ప్రభావం గణనీయంగా ఉంటుంది. బంగారం విలువను నిర్ణయించడంలో ప్రపంచ ఆర్థిక కారకాలు తమ పాత్రను పెంచుకున్నాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ ఇచ్చిన సూచనను పరిశీలిస్తే బంగారం దిగుమతి తగ్గిస్తే రూపాయి విలువపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read: రాత పరీక్ష లేకుండానే నెలకు రూ.1,80,000 జీతం..కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని రోజులే!
Also Read; ఏకంగా 11 రోజులు బ్యాంకులకు సెలవు..ఈ రోజుల్లో బ్యాంకులకు వెళ్లకపోవడమే మంచిది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vaibhav Sooryavanshi Bouncer: వైభవ్ సూర్యవంశీకి తప్పిన ప్రమాదం..గుజరాత్ బౌలర్లపై మాజీ క్రికెటర్ పఠాన్ ఆగ్రహం
Hyderabad, Telangana:Irfan Pathan On Vaibhav Suryavanshi: ఐపీఎల్లో ఇటీవలే జరిగిన క్వాలిఫయిర్-2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఇప్పుడు ఓ పెద్ద వివాదానికి దారి తీసింది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ లక్ష్యంగా బౌలర్లు అవలంభించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గుజరాత్ బౌలర్లో ఒకరు వేసిన బంతి వైభవ్ తలకు తగిలింది. ఇప్పుడా బాల్ తీరు వివాదాస్పదంగా మారింది. ఇదే విషయమై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇదే విషయమై స్పందించారు. యువ ఆటగాడికి 'బాడీలైన్' వ్యూహాలను ఆయన తప్పుబట్టారు. వైభవ్ లాంటి అప్కమింగ్ ఆటగాళ్లకు బాడీలైన్ టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయడం పట్ల పఠాన్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఇర్ఫాన్ పఠాన్ మండిపాటు..
క్వాలిఫయర్-2 మ్యాచ్లో గుజరాత్ బౌలర్లు వైభవ్ సూర్యవంశీ శరీరమే లక్ష్యంగా బౌలింగ్ చేశారు. 14వ ఓవర్లో గుజరాత్ బౌలర్ కగిసో రబాడా వేసిన ఒక వేగవంతమైన బౌన్సర్ వైభవ్ సూర్యవంశీ హెల్మెట్కు బలంగా తాకింది. దీనితో గ్రౌండ్లోనే అతనికి కంకషన్ పరీక్షలు కూడా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాతి ఓవర్లో మహమ్మద్ సిరాజ్ సైతం అదే వ్యూహాన్ని అనుసరించగా, వైభవ్ ఒత్తిడికి లోనవకుండా ఒక సిక్సర్తో సమాధానమిచ్చాడు.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమం 'ఎక్స్'(ట్విట్టర్) ద్వారా స్పందించిన ఇర్ఫాన్ పఠాన్, గుజరాత్ టైటాన్స్ వ్యూహాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. "15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని అడ్డుకోవడానికి ఈ రకమైన బాడీలైన్ బౌలింగ్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అతను పెద్ద ఆటగాళ్లతో పోటీపడుతున్నాడనే మాట నిజమే కావచ్చు, కానీ నాలోని తండ్రి మాత్రం దీనిని ఏమాత్రం అంగీకరించలేకపోతున్నాడు" అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.
గిల్ సెంచరీ విధ్వంసం
ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ బౌలర్లలో రబాడా, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అయితే 215 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ అత్యంత సులువుగా ఛేదించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో (53 బంతుల్లో 104 పరుగులు) జట్టును ముందుండి నడిపించాడు. అతనికి తోడుగా సాయి సుదర్శన్ (32 బంతుల్లో 58 పరుగులు) రాణించడంతో, గుజరాత్ 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో నంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, జోఫ్రా ఆర్చర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
Also Read: ఎట్టకేలకు భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ..ఆసియా క్రీడల్లో సూర్యకుమార్, గిల్కు నో!
Also Read: ఐపీఎల్ ఫైనల్లో పక్కా గెలుపు ఆర్సీబీదే! ఈ లెక్కలు చూస్తే నిజం తెలిసిపోతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kondagattu: కొండగట్టు గిరి ప్రదక్షిణ.. భక్తులంతా 108 సీడ్ బాల్స్ తీసుకురావాలి!
Hyderabad, Telangana:Kondagattu Giri Pradakshina: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిలో వచ్చే నెలలో అత్యంత వైభవంగా నిర్వహించబోతున్న గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సంబంధించి నిర్వాహకులు ఒక వినూత్నమైన, పర్యావరణహితమైన పిలుపునిచ్చారు. ఈ గిరి ప్రదక్షణకు తరలివచ్చే భక్తులందరూ ఆధ్యాత్మిక భక్తి భావనతో పాటు పర్యావరణ స్పృహను చాటుకుంటూ ఒక్కొక్కరు కచ్చితంగా 108 సీడ్స్ బాల్స్ తీసుకురావాలని ఓ స్వామీజీ కోరారు.. ఈ మేరకు కొండగట్టు పరిసరాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన భక్తులందరితో ఘనంగా ప్రతిజ్ఞ చేయించారు..
కొండగట్టు అనగానే స్వామి వారితో పాటు అక్కడ భారీ సంఖ్యలో ఉండే కోతులు అందరికీ గుర్తుకు వస్తూ ఉంటాయి. రోజురోజుకు అడవులు తగ్గిపోవడంతో పాటు కొండలపై సరైన ఆహార వనరులు లేకపోవడం వల్ల ఈ కోతులు ఆహారం కోసం తరచుగా భక్తులపై, స్థానిక గ్రామాలపై పడుతూ ఉన్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సంకల్పంతో ఈ సీడ్స్ బాల్స్ ప్రచారాన్ని చేపట్టారు. భక్తులు తమ ఇళ్ల వద్దనే మట్టితో పాటు పీడ మిశ్రమంతో దానిమ్మ, బొప్పాయి, జామ పండు, సీతాఫలం వంటి తదితర పండ్ల గింజలను ఉపయోగించి ఈ సీడ్స్ బాల్స్ తయారు చేసుకొని తీసుకురావాలని సూచించారు.
గిరి ప్రదక్షణ చేసే సమయంలో భక్తులందరూ తాము తెచ్చిన 108 సీడ్స్ బాల్సును కొండగట్టు చుట్టూ ఉన్న గుట్టతో పాటు ఖాళీ ప్రదేశాలు, అడవి ప్రాంతాల్లో చల్లాలని కోరారు.. రాబోయే వర్షాకాలంలో ఈ విత్తనపు బంతులు నాని.. మొలకెత్తి కొద్ది రోజుల్లోనే పచ్చని పండ్ల వృక్షాలుగా మారుతాయి అని వివరించారు. దీనివల్ల కొండపై పచ్చదనం పెరగడమే కాకుండా భవిష్యత్తులో కోతులకు అడవుల్లోనే పుష్కలంగా ఆహారం లభిస్తుందని.. తద్వారా అవి జనావాసాల్లోకి రాకుండా ఉంటాయని తెలిపారు.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ఈ వినూత్న కార్యక్రమానికి అంజన్న భక్తుల నుంచి ప్రకృతి ప్రేమికుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వచ్చే నెలలో జరిగే గిరి ప్రదక్షిణను విజయవంతం చేయడంతో పాటు కొండగట్టును హరితవనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు తామవంతుగా 108 సీట్స్ బాల్స్ ను తయారుచేసుకు రావాలని నిర్వాహక కమిటీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా కొండపైకి వచ్చే భక్తులు కూడా ఈ బాల్స్ ను తీసుకొని వచ్చి వివిధ ప్రదేశాల్లో చల్లడం మంచిదని వారి తెలిపారు. ఇలా చేయడం వల్ల చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
SSY Calculator: కూతురి పెళ్లి, చదువుల టెన్షన్ ఫ్రీ.. Sukanya Schemeలో రూ.50 లక్షల భారీ ఫండ్ కోసం నెలవారీ ప్లాన్ ఇదిగో..!!
Lakshmapur, Telangana:Sukanya Samriddhi Yojana : మీ కూతురు ఉజ్వల భవిష్యత్తు కోసం కొంత పెట్టుబడి పెట్టాలనుకుంటే.. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కంటే ఉత్తమమైన సేవింగ్స్ స్కీమ్ మరోకటి లేదని చెప్పాలి. ఇతర సేవింగ్స్ సేవింగ్స్ స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ పథకం ఏడాదికి 8.2శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అంతేకాదు ఈ స్కీములోని పెట్టుబడులు పాత ఆదాయపు పన్ను విధానంలోని సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కూతురు పేరు మీద రూ. 50 లక్షల భారీ నిధిని ఎలా కూడబెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన:
సుకన్య సమృద్ధి యోజన నిబంధనల ప్రకారం..ఆడపిల్లకు 10 సంవత్సరాలు నిండక ముందే తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఆమె పేరు మీద అకౌంట్ తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల వరకు పెట్టుబడులను పెట్టవచ్చు. అయితే 21 సంవత్సరాల తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి సుకన్య సమృద్ధి యోజన కనీస వాటా రూ. 250 కాగా, గరిష్టంగా రూ. 1.5 లక్షలు ఉంటుంది.
50 లక్షల రూపాయలు ఎలా డిపాజిట్ చేయాలి?
ఒకవేళ తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజనలో 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ. 50,000 పెట్టుబడి పెడితే.. మొత్తం పెట్టుబడి రూ. 7.5 లక్షలు అవుతుంది. ప్రస్తుత వార్షిక 8.2శాతం వడ్డీ రేటు ప్రకారం, 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ. 23.94 లక్షలకు పైగా పెరగవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో మీరు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడతారు. కానీ మెచ్యూరిటీ కాలం 21ఏళ్లు కాబట్టి.. మీరు పెట్టుబడి పెట్టకుండానే మరో 6ఏళ్ల పాటు చక్రవడ్డీని పొందుతూనే ఉంటారు.
Also Read: ఎండితే 2 కేజీలు, మాడిపోతే 3 కేజీలు .. ఇదేంటో చెప్పగలరా? 99శాతం మంది తప్పు సమాధానమే
అదే సమయంలో, ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ. 1 లక్ష పెట్టుబడితో, 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి = రూ. 15 లక్షలు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం, 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ ఫండ్ రూ. 47 లక్షలకు పైగా పెరుగుతుంది. మీరు ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ. 22.5 లక్షలు అవుతుంది. ప్రస్తుత 8.2శాతం వడ్డీ రేటు ప్రకారం, 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం సుమారుగా రూ. 71 లక్షలకు పెరుగుతుంది.
Also Read: తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు తెచ్చే Top 4 Super Business IDEAS ఇవిగో!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Grah Gochar 2026: జూన్ నెలలో 5 గ్రహాల సంచారం.. ఈ 5 రాశుల వారు కుబేరులవ్వడం ఖాయం!
Hyderabad, Telangana:Grah Gochar Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2026 జూన్ నెల చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ నెలలో అత్యంత ప్రభావవంతమైన ఐదు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా గురు గ్రహంతో పాటు శుక్ర, సూర్య, కుజ, బుధ గ్రహాలు ఈ సమయంలో వాటి గమనాన్ని మార్చుకోబోతున్నాయి. ఈ గ్రహాల సంచారంతో అరుదైన యోగాలు కూడా ఏర్పడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో 12 రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. కానీ ఐదు రాశుల వారికి మేలు జరగబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో అదృష్టం కూడా సహకరించి ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఊహించని మానసిక ప్రశాంతత కూడా లభించబోతోంది..
జూన్ నెలలో ఈ సమయాల్లో సంచారాలు..
జూన్ రెండవ తేదీ తెల్లవారుజామున గురు గ్రహం సంచారం చేయబోతోంది. కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. ఆ తర్వాత జూన్ 8వ తేదీన సాయంత్రం ఐదు గంటల సమయంలో శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇదిలా ఉంటే జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక జూన్ 21 తెల్లవారుజామున 12 గంటలకు అంగారకుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం విశేషం. అలాగే జూన్ 22వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.. ఇలా కొన్ని ప్రధాన గ్రహాలు సంచారం చేస్తాయి. ఇక ఇదే సమయంలో కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం కూడా చేయబోతున్నట్లు సమాచారం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేషరాశి
జూన్ నెల ఈ రాశి వారికి చాలా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అన్ని గ్రహాల సంచారంతో వీరికి అన్నింటిలోనూ అద్భుతమైన విజయాలు సాధించే అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలు పూర్తిగా పరిష్కారం కాబోతున్నాయి. మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా లభిస్తుంది.. దీంతోపాటు శత్రువులు మీకు చాలా దూరంగా ఉండి సమాజంలో అద్భుతమైన పరిచయాలను పొందగలుగుతారు వృత్తి జీవితం మెరుగుపడడమే కాకుండా పెద్దపెద్ద సమస్యలు పరిష్కారమవుతాయి.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు జూన్ నెల గ్రహసంచారాల ప్రభావంతో ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం కాబోతున్నాయి.. ముఖ్యంగా వ్యాపారంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది. ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధించడమే కాకుండా కొత్త బాధ్యతలు పొంది.. విశేషమైన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. వైవాహిక జీవితంలో అద్భుతమైన ఆనందం కూడా లభిస్తుంది మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా పెరిగి ప్రమాదాలకు దూరంగా ఉంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు వ్యాపారాలపరంగా ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. అదేవిధంగా కెరీర్ పరంగా గొప్ప పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బు సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. బ్యాంకు బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది కుటుంబంలో సంతోషం ఊహించని స్థాయిలో పెరిగి విశేషమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా అంతులేని సంతోషం కారణంగా మానసికంగా అద్భుతంగా ముందుకు సాగుతారు ఎలాంటి పెద్ద ప్రమాదాలు ఈ సమయంలో రాకుండా ఉంటాయి..
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఆదాయం ఆకస్మాత్తుగా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీతం ఊహించని స్థాయిలో పెరిగి.. అధికారుల సపోర్టు కూడా పొందగలుగుతారు. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా ఈ సమయంలో వ్యాపారంలో గొప్ప పురోగతి లభించబోతోంది. దీంతోపాటు మానసిక స్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ప్రశాంతత కొనసాగి జీవితాన్ని ముందుకు నడుపుతారు.. అంతేకాకుండా ఇలాంటి ఆందోళన చెందకుండా ఈ సమయంలో ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jupiter Transit 2026: ఈ రాశివారికి గురుబలం రెట్టింపు.. విదేశీ యోగం, ఊహించని ధన లాభాలు!
Hyderabad, Telangana:Jupiter Transit In Cancer Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహ కదలికలు చాలా కీలకమైనవిగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా జూన్ నెల ఎన్నో గ్రహాల కదలికలతో పాటు తిరోగమనం, సంయోగం చేయబోతున్నాయి. దీని కారణంగా జూన్ నెల చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఉంటారు. ఇదే సమయంలో శక్తివంతమైన శుభగ్రహంగా పరిగణించే గురు గ్రహం మిథున రాశిని విడిచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ గ్రహం అక్టోబర్ 31వ తేదీ వరకు అదే రాశిలో కొనసాగడం చాలా విశేషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కర్కాటక రాశిని గురుడు ఉచ్చరాశిగా పరిగణిస్తూ ఉంటాడు. అలాగే సింహ రాశి వారికి జాతకంలో 12వ స్థానంలో ఈ సంచారం జరగబోతోంది. దీని కారణంగా ఎక్కువగా ఈ సమయంలో సింహ రాశి వారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మరికొన్ని రాశుల వారికి కూడా విశేషమైన ధన లాభాలు కలుగుతాయి..
సింహరాశి కెరీర్ పై ప్రభావం..
సింహ రాశి వారికి గురువు జాతకంలో 12వ స్థానంలోకి సంచరించడం కారణంగా వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా సొంత నగరాల్లో కూడా ఉద్యోగాలు సాధించి అన్ని పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి కూడా మంచి మంచి అవకాశాలు లభించబోతున్నాయి. ముఖ్యంగా ఎగుమతి దిగుమతి లేదా విదేశీ వ్యాపార పరిశ్రమల్లో పనిచేస్తున్న వ్యక్తులు అందరికీ ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ముందుకు సాగితే అద్భుతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. వ్యాపారాలు చేస్తున్నవారు కూడా బాధ్యతను శ్రద్ధగా తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తూ ఉన్నారు..
గురు గ్రహం సింహరాశిలో 12వ స్థానంలోకి వెళ్లడం కారణంగా ఈ సింహ రాశి వారి జాతకం ప్రకారం ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మానుకుంటే నీ జీవితంలో రాణించగలుగుతారు.. లేదంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి. దీంతోపాటు చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మీ ఆరోగ్యం పై ఊహించని ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో తప్పకుండా శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా మంచిది లేదంటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఆర్థిక ప్రభావం..
మీరు విదేశాల్లో పనులు చేస్తుంటే తప్పకుండా ఈ సమయంలో ఊహించని ధన లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించి అద్భుతమైన అవకాశాలు కూడా పొందుతారు. అజాగ్రత్తగా లేదా పనుల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కారణంగా ఆర్థికంగా నష్టపోతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా పని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
వ్యక్తిగత జీవితం ఇలానే ఉంటుంది..
ఈ సమయంలో సింహ రాశి వారికి ఎలాంటి సంఘర్షణలకైనా చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది.. ముఖ్యంగా అభిప్రాయ విభేదాలతో పాటు గొడవలకు, వాదనలకు దూరంగా ఉండటం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మర్యాదపూర్వక ప్రవర్తనతో పాటు సంబంధాల మధ్య సమతుల్యతను పాటించడం చాలా మంచిది. ఇతరుల పట్ల శత్రుత్వం పెంచుకోకుండా.. విషయాలను ప్రశాంతంగా పరిష్కరించుకోవడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
GK Quiz: ఎండితే 2 కేజీలు, మాడిపోతే 3 కేజీలు .. ఇదేంటో చెప్పగలరా? 99శాతం మంది తప్పు సమాధానమే చెబుతారు..!!
Lakshmapur, Telangana:GK Quiz: సాధారణంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు.. జనరల్ నాలెడ్జ్ పై కూడా ఫోకస్ పెడతారు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జీకే కూడా ఒక విభాగంగా ఉంటుంది. ఈ కేటగిరిలో రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే జీకేపై పరిజ్నానం పెంచుకున్నట్లయితే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించుకోవచ్చు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాము. దానికి మీరు సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. ఖచ్చితంగా తప్పే చెబుతారు. అయితే ఆ ప్రశ్న ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రశ్న:
పొడిగా ఉన్నప్పుడు 2 కిలోలు.. తడిగా ఉన్నప్పుడు 1 కిలో బరువు ఉండే ఆ వస్తువు ఏమిటి? అదే వస్తువును కాల్చితే, అది 3 కిలోగ్రాములు అవుతుంది?
సమాధానం : సల్ఫర్
Also Read: రక్తం లేని జీవి ఏదో తెలుసా? 99శాతం మందికి తెలియదు..!!
సల్ఫర్ అంటే ఏంటి?
సల్ఫర్ అనేది ఒక పసుపు రంగు రసాయన మూలకం. ఇది అలోహం. సల్ఫర్ గుర్తు S, పరమాణు సంఖ్య 16. ఈ రసాయన గంధకాన్ని కారు బ్యాటరీల తయారీ, ఎరువులు, చమురు శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి, ఖనిజాల వెలికితీతలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సల్ఫర్ అనేది విషపూరితమైన రసాయనం. సల్ఫర్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట లేదా విరేచనాలు కలిగే అవకాశం ఉంటుంది. సల్ఫర్ కణాలు దగ్గుకు కారణం అవుతాయి. ఇది చర్మానికి, కళ్ళకు కూడా చికాకు కలిగించగలదు.
శరీరానికి సల్ఫర్ వల్ల కలిగే హాని ఏంటంటే?
-చర్మం పొడిబారడం, ఎర్రబడటం.. చాలా మందికి మంటగా కూడా అనిపిస్తుంది.
-చర్మం కూడా దురదగా లేదా పొలుసులుగా మారుతుంది.
-దద్దుర్లు లేదా దురద వంటి అసాధారణ అలెర్జీ ప్రతిచర్యలు.
Also Read: నెలకు లక్షల్లో సంపాదన.. Dairy Farming బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి TOP 5 టిప్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dairy Farming Business: నెలకు లక్షల్లో సంపాదన.. Dairy Farming బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి TOP 5 టిప్స్ ఇవిగో..!!
Lakshmapur, Telangana:Dairy Farming Business: నేటికాలం యువత ఉద్యోగాల కంటే వ్యాపారాలపై వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో పశుపోషణకు సంబంధించిన వ్యాపారానికి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. మీరు కూడా పాడిపరిశ్రమను ఏర్పాటు చేయాలనుకుంటే.. ముందుగా దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. గత కొన్నిసంవత్సరాలుగా చాలా మంది ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. మంచి ఆదాయం పొందుతున్నారు. పాలు, పాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వల్ల ఈ వ్యాపారం అభివ్రుద్ధి చెందుతోంది. అయితే ఈ వ్యాపారం ప్రారంభించే ముందు కొన్ని మెళకువలు తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
ఆవులు లేదా గేదెల వంటి పాడి జంతువులను పెంచి మంచి ఆదాయం సంపాదించాలనుకుంటే.. మీకు దాని గురించి మంచి పరిజ్ఞానం ఉండాలి. ఈ వ్యాపారంలోకి ప్రవేశించిన తర్వాత, సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల చాలా మంది పారిశ్రామికవేత్తలు నష్టపోయారు. గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
మంచి జాతిని ఎంచుకోవడం:
పాడి జంతువులను పెంచేటప్పుడు.. వాటి జాతి, ఆరోగ్యం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అనారోగ్యంతో లేదా వ్యాధి సోకిన జంతువులను పెంచకూడదు. ఆవుల పెంపకందారులు గిర్ లేదా సాహివాల్ జాతిని ఎంచుకోవాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గేదెల పెంపకందారులు ముర్రా, సూరతి, మెహసానా లేదా జాఫరాబాది వంటి జాతులు అయితే మంచి ప్రాఫిట్ ఉంటుంది. జంతువులను కొనుగోలు చేసేటప్పుడు, వాటికి గాయాలు లేదా ఇన్ఫెక్షన్ వంటివి ఏమైనా ఉన్నాయా లేదా అనేది జాగ్రత్తగా పరిశీలించాలి.
విశాలమైన షెడ్డు:
జంతువుల కోసం శుభ్రమైన, విశాలమైన, గాలి, వెలుతురు బాగా వచ్చే షెడ్డును నిర్మించాలి. దానిని ఎండ, వానల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. జంతువుల ఆవరణలో శుభ్రమైన, తాజా నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. వాటిని కట్టివేయడంతో పాటు, నడవడానికి కూడా తగినంత స్థలం ఉండటం ముఖ్యం. అనారోగ్యం లేదా ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించడానికి ఆవరణను క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచాలి.
ఖర్చు ఎంత?
పాడి పరిశ్రమను కేవలం రూ. 3 లక్షలతో ప్రారంభించవచ్చు. రూ. 3 లక్షలతో రెండు పశువులు.. ఒక మంచి షెడ్డును ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, మీరు 3-4 పశువులతో కూడా ప్రారంభించవచ్చు. దీనికి సుమారు రూ. 5 లక్షలు ఖర్చవుతుంది. క్రమంగా, మీరు లాభాలు ఆర్జించడం ప్రారంభించిన తర్వాత, పశువుల సంఖ్యను పెంచుకోవచ్చు.
ఆదాయం ఎలా సమకూరుతుంది?
ఉన్నత జాతి ఆవులు, గేదెలు రోజుకు 10 లీటర్ల వరకు పాలను ఇస్తాయి. మూడు జంతువులు ఒకేసారి పాలు ఇస్తే, మీరు రోజుకు 30-35 లీటర్ల పాలను అమ్మి, సగటున రోజుకు రూ. 2,000 సంపాదించవచ్చు. దీని ద్వారా నెలకు రూ. 60,000 ఆదాయం వస్తుంది. జంతువుల నిర్వహణ, దాణా ఖర్చులన్నీ పోనూ ఈ ఆదాయం మిగులుతుంది.
గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు:
పాడి వ్యవసాయం ప్రారంభించిన తర్వాత కూడా, నిర్లక్ష్యం చేసే విషయాలు చాలా ఉంటాయి. చాలా మంది పాడి రైతులు మొదట్లో మంచి ఆదాయం సంపాదిస్తారు కానీ దానిని నిలబెట్టుకోలేక నష్టాలను చవిచూస్తారు. మీరు కూడా అలాంటి పొరపాట్లు చేయకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జంతువులకు టీకాలు వేయించడం:
చాలా మంది రైతులు షెడ్డు నిర్మించిన మొదట్లో శుభ్రంగా ఉంచుతారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాటిని పట్టించుకోవడం మానేస్తారు. ఫలితంగా షెడ్డు ఆవరణలు నీరు, మురికితో నిండి పోతాయి. ఒకవేళ క్రమం తప్పకుండా శుభ్రం చేసినప్పటికీ, వివిధ కాలానుగుణ, అంటువ్యాధుల ప్రమాదం ఉంటుంది. జంతువులలో గొంతువాపు వ్యాధి , ఆంత్రాక్స్ వంటి వ్యాధులు సర్వసాధారణం. ఇన్ఫెక్షన్ను నివారించడానికి, పశువైద్యుడిని సంప్రదించి, క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి.
పాల ప్రాసెసింగ్ ద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోవడం:
మీరు మీ పాడి పరిశ్రమ ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే, కేవలం పాలు అమ్మడం మాత్రమే సరిపోదు. పాలను శుద్ధి చేసి నెయ్యి, మజ్జిగ, వెన్న, కోవా వంటి ఉత్పత్తులను అమ్మండి. ఈ రోజుల్లో పాల ఉత్పత్తులలో కల్తీ జరుగుతోంది. స్వచ్ఛమైన, శుద్ధి చేసిన ఉత్పత్తులను అమ్మడం ద్వారా మంచి లాభాలు వస్తాయి. అయితే, పాల ఉత్పత్తులను అమ్మే ముందు, మార్కెట్లో మంచి నెట్వర్క్ను ఏర్పరచుకుని, వాటిని ప్రజలకు ప్రచారం చేయండి. ఒక్కసారి మీ ఉత్పత్తులను ప్రజలకు చేరువైతే.. మీ బిజినెస్ కు ఢోకా ఉండదని చెప్పాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Palnadu Railway Projects: పల్నాడు జిల్లా అభివృద్ధికి మరో ముందడుగు..ఎంపీ చొరవతో రూ.84 కోట్ల రైల్వే నిర్మాణాలను గ్రీన్ సిగ్నల్!
Sattenapalle, Andhra Pradesh:MP Lavu Srikrishna Devarayalu: నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గ ప్రాంతాల ప్రజలు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. రైల్వే గేట్ల వద్ద నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి మార్గం దొరికింది. నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక చొరవతో కేంద్ర రైల్వే శాఖ రెండు భారీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల (ఫ్లైఓవర్ల) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.84.09 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు తలపెట్టిన ఈ పనులకు సంబంధించిన ఈ-టెండర్ నోటిఫికేషన్ను దక్షిణ మధ్య రైల్వే (గుంటూరు డివిజన్) శనివారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. పెదకూరపాడు, సత్తెనపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలను రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. స్పందించిన రైల్వే శాఖ వెంటనే అనుమతిలిచ్చిందని వెల్లడించారు. పల్నాడు అభివృద్ధికి సహకరించిన రైల్వే అధికారులకు ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
నిర్మించనున్న ROBల వివరాలు..
పెదకూరపాడులోని రైల్వే స్టేషన్ యార్డ్ పరిధిలోని రైల్వే గేటు (LC నంబర్ 27) స్థానంలో 2-లేన్ల ఫ్లైఓవర్ నిర్మిస్తారు. అలాగే సత్తెనపల్లి - రెడ్డిగూడెం.. ఈ రెండు స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే గేటు (LC నంబర్ 40) స్థానంలో మరో ఫ్లైఓవర్ నిర్మిస్తారు.
ఈ రెండు ప్రతిష్టాత్మక బ్రిడ్జిల నిర్మాణ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు నరసరావుపేట ఎంపీ స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే పనులు ప్రారంభించి.. ఏడాదిన్నరలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ బ్రిడ్జిలు అందుబాటులోకి వస్తే రైళ్లు వచ్చే సమయంలో వాహనాలు గంటల కొద్దీ ఆగాల్సిన అవసరం ఉండదు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు, ప్రయాణికులు సురక్షితంగా, వేగంగా వెళ్లేందుకు వీలవుతుంది.
Also Read: MP Lavu Krishna Devarayalu: ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మంచి మనసు ...
Also Read: రాత పరీక్ష లేకుండానే నెలకు రూ.1,80,000 జీతం..కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని రోజులే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dmart Offers: స్కూల్స్ రీపెన్ వేళ డీమార్ట్ భారీ ఆఫర్లు.. తక్కువ ఖర్చుకే ఎక్కువ వస్తువులు
Wadgaon, Maharashtra:Dmart School Shopping Offers: పాఠశాలలు కొన్ని రోజుల్లో తెరచుకోనున్నాయి. వేసవి సెలవులు దాదాపు ముగిసిపోతుండగా.. విద్యా సంవత్సరం కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం షాపింగ్ చేయడం ప్రారంభించారు. అయితే విద్యార్థులకు సంబంధించి తక్కువ ఖర్చుకే ఎక్కువ వస్తువులు పొందాలంటే డీమార్ట్కు వెళ్లాల్సిందే. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా డీమార్ట్ సంస్థ ప్రత్యేకంగా ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు ఒకటి కొంచే ఒకటి ఉచితం అనే పథకం అమలు చేస్తోంది.
Also Read: Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. ఉచిత బస్సుకు మరో కానుక
విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే విద్యార్థులకు సంబంధించిన వస్తువులు కొనాల్సి ఉంది. పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగ్లతోపాటు వారికి బ్యాగ్లు, లంచ్బాక్స్లు, వాటర్ బాటిల్స్ వంటివి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక అంతేకాకుండా పిల్లలకు అందించాల్సిన ఆహార పదార్థాలు కూడా కొన్ని ముందే కొని పెట్టుకోవాల్సి ఉంది. ఇది గమనించిన డీమార్ట్ సంస్థ కొన్ని ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు ప్రత్యేకమైన రాయితీలు అందిస్తోంది. డీమార్ట్ అందిస్తున్న ఆఫర్ల వివరాలు కేటగిరి వారీగా ఇలా ఉన్నాయి.
స్టేషనరీ సామగ్రిపై భారీ డిస్కౌంట్లు
బ్రాండెడ్ లాంగ్బుక్, నోట్ పుస్తకాలపై 15-30 శాతం తగ్గింపు లభిస్తోంది.
పెన్నులు ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు
రూ.139 నుంచి లంచ్ బ్యాగ్లు
రూ.49కు పెన్సిల్ పర్సులు
పిడిలైట్ గ్లూ ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు
Also Read: Tirumala Darshan: తిరుమల దర్శనానికి భారీ రద్దీ.. రేపు కొండపైకి రాకపోవడమే మంచిది
డ్రాయింగ్ ఉపకరణాల ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు
12 ఫోల్డర్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ ఎంఆర్పీ రూ.250 కన్నా రూ.179 మాత్రమే. బుక్ లేబుల్ స్టిక్కర్ రూ.19 ధరకు.
38 సెం.మీ బ్రౌన్ బుక్ కవర్ ఎంఆర్పీ రూ.70 కాస్త రూ.55 మాత్రమే. రూ.400 ధర కలిగిన కాలిక్యులేటర్ రూ.219 మాత్రమే.
అన్ని రకాల కంగారూ ఉత్పత్తులపై 15 శాతం తగ్గింపు. రూ.49 నుంచి కత్తెర
అప్సర ఎరేజర్, షార్ప్నర్ ఎంఆర్పీపై 20 శాతం తగ్గింపు. రూ.290 ధర కలిగిన ఎగ్జిక్యూటివ్ ఫోల్డర్ 12 పాకెట్ ఫైల్ రూ.199 మాత్రమే
రూ.375 ధర కలిగిన జేకే కాపియర్ పేపర్ ఏ4 (21 సెం.మీ * 29.7 సెం.మీ), 70 జీఎస్ఎమ్ 500 షీట్లు రూ.275 ధరకే అందుబాటులో ఉంది. మెటల్ అండ్ మాగ్నెటిక్ పెన్సిల్ బాక్స్ రూ.99 నుంచి ప్రారంభం. స్టడీ టేబుల్ రూ.349 నుంచి ప్రారంభం.
బ్యాగ్లు, లంచ్బాక్స్పై ఆఫర్లు
లంచ్బాక్స్, వాటర్ బాటిల్ కాంబో రూ.169తో ప్రారంభం. లంచ్ బాక్స్ రూ.45 నుంచి ప్రారంభం.
స్కూల్ బ్యాగ్లు రూ.199 నుంచి ప్రారంభం. రూ.399 ధర కలిగిన స్టీల్ ప్లెక్సీ 2 లేయర్ లంచ్ బాక్స్ రూ.99 మాత్రమే లభిస్తోంది.
గొడుగు రూ.329 నుంచి, వర్షపు కోటు (రెయిన్ కోట్) రూ.149 లభిస్తోంది. పాలిమర్ క్రికెట్ బ్యాట్ రూ.229, స్కూల్ షూస్ రూ.179 నుంచి ప్రారంభం.
Also Read: IPL 2026: చాంపియన్ రేసులో గుజరాత్ టైటాన్స్.. వైభవ్ పోరాడినా రాజస్థాన్కు నిరాశ
రోజువారీ అవసరాలు, కిరాణ సామగ్రి
750 గ్రాములు కలిగిన రూ.415 ఉన్న బూస్ట్ రీఫిల్ ప్యాక్ రూ.335కు డీమార్ట్ అందిస్తోంది.
డాబర్ హనీ స్క్వీజీ ప్యాక్ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 400 గ్రాముల రూ.420 ధర కలిగిన హనీ రూ.255కు లభిస్తోంది.
సన్ఫీస్ట్ యిప్పీ మ్యాజిక్ మసాలా న్యూడిల్స్ రూ.120 ఉండగా రూ.77కు మాత్రమే డీమార్ట్లో అందుబాటులో ఉంది.
రూ.280 ధర ఉన్న కిసాన్ మిక్స్ ఫ్రూట్ జామ్ (700 గ్రాములు) రూ.215కు డీమార్ట్ అందిస్తోంది.
రూ.225 ధర కలిగిన నుటెల్లా ఫెర్రెరో (180 గ్రాములు) రూ.190 మాత్రమే లభిస్తోంది.
PM Shram Mandhan Yojana: ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా నెలనెలా Pension.. కేవలం రూ. 55 పెట్టుబడితో ప్రతి నెలా రూ. 3,000 మీ అకౌంట్లోకి..!!
Lakshmapur, Telangana:PM Shram Mandhan Yojana: వయస్సులో ఉన్నప్పుడు బాధ్యతలన్నీ భుజనా మోసినవాళ్లు.. వృద్ధాప్యం తర్వాత తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన చెందుతుంటారు. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగం చేయకుండా రోజువారీ కూలీగా జీవించేవారికి ఈ ఆందోళణ మరింత ఎక్కువగా ఉంటుంది. వీధి వ్యాపారులు, రిక్షాలాగేవాళ్లు, కూలీలు, చిన్న దుకాణదారులు వయస్సు పైబడి, శరీరం సహకరించనప్పుడు తమ ఇంటి ఖర్చులతోపాటు కనీస అవసరాలను తీర్చుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటారు.
అలాంటి వారిని అక్కున చేర్చుకునేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాంధన్ యోజన అనే ఒక అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే.. మీరు ప్రతినెలా కేవలం ఒక చిన్న మొత్తాన్ని అంటే రూ. 55 జమ చేస్తే చాలు.. దానికి బదులుగా 60ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత మీకు నెలకు రూ. 3000 హామీతో కూడిన పెన్షన్ లభిస్తుంది.
2019లో ప్రారంభించిన.. ఈ పథకం ప్రధానంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం తీసుకువచ్చింది. ఈ పథకం సరళమైన సూత్రం ఏమిటంటే, మీరు ఎంత ఎక్కువ డబ్బు జమ చేస్తే, ప్రభుత్వం మీ ఖాతాలో అంత ఎక్కువ జమ చేస్తుంది. ఉదాహరణకు.. మీ వయస్సు ఆధారిత వాయిదా రూ. 100 అయితే, మీరు రూ. 100 చెల్లిస్తారు. ప్రభుత్వం రూ. 100 జతచేస్తుంది. అంటే, ప్రతి నెలా మీ ఖాతాలో రూ. 200 జమ అవుతాయి. మీకు 60 ఏళ్లు నిండినప్పుడు, మీరు ప్రతి నెలా కనీసం రూ. 3,000 పెన్షన్ అందుకోవడం ప్రారంభిస్తారు.
అర్హులు ఎవరు?
ఈ ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందడానికి, ప్రభుత్వం కొన్ని షరతులను పెట్టింది. అవేంటంటే..
వృత్తి: మీరు వీధి వ్యాపారి, రిక్షా లాగేవారు, గృహ సహాయకులు, నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, చిన్న దుకాణదారులు లేదా అటువంటి ఏదైనా అసంఘటిత రంగంలో పనిచేసేవారై ఉండాలి.
వయస్సు: దరఖాస్తుదారుని వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
తక్కువ ఆదాయం: మీ నెలసరి ఆదాయం రూ. 15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
పన్నులు, ఇతర పథకాలు: మీరు ఆదాయపు పన్ను చెల్లించకూడదు. మీరు EPFO, ESIC, లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ వంటి ఏ ఇతర పథకంలోనూ సభ్యులుగా ఉండకూడదు.
Also Read: రక్తం లేని జీవి ఏదో తెలుసా? 99శాతం మందికి తెలియదు..!!
ప్రతి నెలా ఎంత మొత్తం జమ చేయాల్సి ఉంటుంది?
ఈ పథకం కింద మీ జేబు నుండి తీసివేసే మొత్తం మీ వయస్సుపై ఆధారపడి ఉంటుంది. మీకు 18 ఏళ్లు ఉంటే, మీరు నెలకు కేవలం రూ. 55 మాత్రమే జమ చేయాలి. మీరు గరిష్టంగా 40 ఏళ్ల వయస్సులో చేరితే, నెలకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ పథకంలో చేరిన తర్వాత, మీకు 60 ఏళ్లు వచ్చే వరకు మీ నిర్ణీత నెలవారీ వాయిదాను చెల్లిస్తూ ఉండాలి.
ఈ పథకం ఎన్ని ప్రయోజనాలను అందిస్తోంది?
జీవిత భాగస్వామి ప్రయోజనాలు: భార్యాభర్తలిద్దరూ ఈ పథకానికి అర్హులైతే, వారు విడివిడిగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ విధంగా, 60 ఏళ్ల వయస్సు తర్వాత, కుటుంబం నెలకు మొత్తం రూ. 6,000 పింఛను పొందవచ్చు.
కుటుంబ పింఛను: పింఛను ప్రారంభమైన తర్వాత లబ్ధిదారుడు మరణిస్తే, అతని/ఆమె జీవిత భాగస్వామి పింఛనులో సగం అంటే ప్రతి నెలా రూ. 1,500 పొందడం కొనసాగిస్తారు.
స్కీములో నుంచి మధ్యలోనే వైదొలగవచ్చా?
మీరు ఏ కారణం చేతనైనా పథకం నుండి వైదొలగాలనుకుంటే, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను ఏర్పాటు చేసింది. మీరు 10 సంవత్సరాల లోపు పథకం నుండి వైదొలిగితే, మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని వడ్డీతో పాటు మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. అయితే, మీరు పథకం ప్రారంభించిన 10 సంవత్సరాల తర్వాత, 60 ఏళ్ల వయస్సు రాకముందే పథకాన్ని నిలిపివేస్తే, మీ పెన్షన్ ఫండ్పై వచ్చిన అసలు వడ్డీతో పాటు మీ డబ్బు మీకు వాపసు ఇస్తుంది. మీరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక వాయిదా చెల్లించడంలో విఫలమైతే, బకాయి ఉన్న మొత్తాన్ని వడ్డీతో పాటు చెల్లించి, దానిని తర్వాత మళ్లీ ప్రారంభించవచ్చు.
అకౌంట్ ఎలా తీసుకోవాలి?
మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించండి
మీ ఆధార్ కార్డు, మీ బ్యాంకు ఖాతా వివరాలను (పాస్బుక్ లేదా క్యాన్సిల్ చెక్కు వంటివి) మీతో పాటు తీసుకువెళ్లండి.
మొదటి వాయిదా మీ నుండి నగదు రూపంలో తీసుకుంటారు.
తదుపరి వాయిదాల కోసం ఆటో డెబిట్ సౌకర్యం ఉంటుంది.
ఈ పథకంలో పెట్టుబడులు సురక్షితమైనవి, ఎందుకంటే వీటికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంది. అయితే, 60 ఏళ్ల వయస్సు తర్వాత అందే రూ. 3,000 పింఛను మొత్తం స్థిరంగా ఉంటుందని, ద్రవ్యోల్బణంతో పాటు అది పెరగదు.
Also Read: రూ. 500 నోట్లపై ఆర్బీఐ బిగ్ అలర్ట్.. కీలక విషయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Asian Games Cricket: ఎట్టకేలకు భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ..ఆసియా క్రీడల్లో సూర్యకుమార్, గిల్కు నో ఛాన్స్!
Mumbai, Maharashtra:Asian Games Cricket Team India: జపాన్ వేదికగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ను అట్టహాసంగా ప్రారంభించబోతున్నారు. అందుకోసం 30 మంది ఆటగాళ్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమ్ఇండియాను ప్రకటించింది. ఇందులో భాగంగా బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం 30 మందిని ఎంపిక చేయగా..అందులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా చోటుదక్కింది. అయితే టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్ను అందించిన సూర్యకుమార్ యాదవ్, స్టార్ ప్లేర్ శుభ్మన్ గిల్కు చోటు దక్కకపోవడం గమనార్హం.
జపాన్లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. అయితే అదే సమయంలో అనగా సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 17 వరకు స్వదేశంలో వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్ ఉన్న కారంణంగా బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను బరిలో దించేందుకు సన్నద్ధమైంది.
ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో 16 మ్యాచ్ల్లో ఏకంగా 776 పరుగులు సాధించి దుమ్మురేపిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని సెలెక్టర్లు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చేర్చారు. మరోవైపు వెస్టిండీస్ సిరీస్లో వన్డే జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండటంతో అతనికి ఆసియా క్రీడల జాబితాలో చోటు దక్కలేదు. ఇక 2028 టీ20 ప్రపంచకప్, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ రేసులో సూర్యకుమార్ యాదవ్ లేకపోవడంతో, అతడిని ఆసియా క్రీడల జాబితా నుంచి మినహాయించడం గమనార్హం.
కెప్టెన్సీ రేసులో ముగ్గురు ఆటగాళ్లు..
టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆసియా క్రీడల్లో భారత జట్టుకు నాయకత్వం వహించే రేసులో ముగ్గురు ఆటగాళ్లు ముందంజలో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, తిలక్ వర్మ వంటి వారు కెప్టెన్సీ రేసులో పోటీ పడుతున్నారు.
గతంలో గాయపడిన పేసర్ హర్షిత్ రాణా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడనే నమ్మకంతో అతడిని అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలతో పాటు జాబితాలోకి తీసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా పేరు ఈ 30 మందిలో ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ దృష్ట్యా అతనికి విశ్రాంతినిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
అలాగే స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దుబే వంటి వారిలో కేవలం ఇద్దరు మాత్రమే ఆసియా క్రీడల్లో ఎంపికవుతారు. మిగిలిన ఇద్దర్ని వెస్టిండీస్ సిరీస్ కోసం ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఆసియా క్రీడల కోసం బీసీసీఐ రిలీజ్ చేసిన భారత జట్టు జాబితా ఇదే..
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, తిలక్ వర్మ, అర్ష్దీప్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుష్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్, శివం దూబే, విప్రజ్ నిగమ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్.
Also REad: ఐపీఎల్ ఫైనల్లో పక్కా గెలుపు ఆర్సీబీదే! ఈ లెక్కలు చూస్తే నిజం తెలిసిపోతుంది!
Also Read: ఐపీఎల్ ఫైనల్ టికెట్ ధర ఒక్కొక్కటి రూ.2,20,000 మాత్రమే..ఖంగుతిన్న క్రికెట్ ఫ్యాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
