icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500052
RSRajesh SharmaFollow27 Jun 2024, 07:13 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Election Results 2026: ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అంటే?

Wadgaon, Maharashtra:

TN And WB Election Results: భారతదేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. దాదాపుగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తమిళనాడు, కేరళం, పశ్చిమబెంగాల్‌, పుదుచ్చేరి, అస్సాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చింది. పశ్చిమబెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారాన్ని కైవసం చేసుకోగా.. తమిళనాడులో నటుడు విజయ్‌ స్థాపించిన టీవీకే పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఇక కేరళంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి అధికారాన్ని సొంతం చేసుకుంది.

Also Read: Narendra Modi: ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం: నరేంద్ర మోదీ

పశ్చిమబెంగాల్‌
మొత్తం స్థానాలు: 293, మ్యాజిక్‌ ఫిగర్‌: 148
తృణమూల్‌ కాంగ్రెస్‌: 77
బీజేపీ: 211
కాంగ్రెస్‌: 2
ఇతరులు: 3

తమిళనాడు
మొత్తం సీట్లు : 234, మ్యాజిక్ ఫిగర్ : 118
టీవీకే పార్టీ: 106
డీఎంకే కూటమి: 74
ఏఐడీఎంకే పార్టీ కూటమి: 51

కేరళం
మొత్తం సీట్లు : 140, మ్యాజిక్ ఫిగర్ : 71
యూడీఎఫ్‌: 102
ఎల్‌డీఎఫ్‌: 35
బీజేపీ: 3

Also Read: Pawan Kalyan: టీవీకే విజయ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రశంసలు.. బీజేపీ గెలుపుపై హర్షం

అస్సాం
మొత్తం సీట్లు : 126, మ్యాజిక్ ఫిగర్ : 64
బీజేపీ కూటమి: 102
కాంగ్రెస్‌ కూటమి: 21
ఇతరులు : 3

పుదుచ్చేరి
మొత్తం సీట్లు : 30 మ్యాజిక్ ఫిగర్ : 16
ఎన్నార్‌ కాంగ్రెస్‌, బీజేపీ కూటమి: 18
కాంగ్రెస్‌ కూటమి: 6
టీవీకే కూటమి: 3
ఇతరులు: 3

తమిళనాడులో ఎవరికి ఎన్ని ఓట్లు?
విజయ్‌ టీవీకే పార్టీ: 1.28 కోట్లు
డీఎంకే కూటమి: 1.17 కోట్లు
డీఎంకే పార్టీ ఒంటరిగా సాధించిన ఓట్లు: 83 లక్షలు
ఏఐఏడీఎంకే కూటమి: ఓట్లు 1.08 కోట్లు
ఒంటరిగా ఏఐఏడీఎం సాధించిన ఓట్లు: 77 లక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Narendra Modi: ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం: నరేంద్ర మోదీ

New Delhi, Delhi:

PM Modi Winning Speech: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయంగా తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో ప్రజాశక్తి గెలిచింది. బీజేపీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బెంగాల్‌ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నా' అని ప్రధాని మోదీ తెలిపారు.

Also Read: Pawan Kalyan: టీవీకే విజయ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రశంసలు.. బీజేపీ గెలుపుపై హర్షం

'ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి వంటిదని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఐదు రాష్ట్రాల ప్రజలు రాజ్యాంగాన్ని గెలిపించారు. గంగోత్రి నుంచి గంగాసాగర్‌ వరకు కమలం వికసించింది' అని ప్రధాని మోదీ తెలిపారు. 'బీజేపీ కార్యకర్తల సుదీర్ఘ కల, శ్రమ ఫలించింది. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. నితిన్‌ నబీన్‌ పార్టీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన తొలి ఎన్నిక ఇది. బెంగాల్‌లోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్ ప్రవేశించింది. బెంగాల్‌ ఓటర్లు కొత్త రికార్డు సృష్టించారు' అని నరేంద్ర మోదీ తెలిపారు. హింస రాజకీయాల నుంచి బెంగాల్ ప్రజలు విముక్తి కోరుకున్నారని చెప్పారు. హింస రాజకీయాలకు బెంగాల్ ప్రజలు స్వస్తి చెప్పారని పరోక్షంగా టీఎంసీ పాలనపై విమర్శలు చేశారు.

ఈ ఎన్నికల ఫలితాలతో దేశంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ‍ప్రజలు గుర్తించారని ప్రధాని మోదీ చెప్పారు. ఈ రోజు భారతదేశానికి, బీజేపీకి ఎంతో చారిత్రాత్మకమైన రోజు అని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజలకు నిజమైన భరోసా కల్పించాల్సిన రోజు అని తెలిపారు. బీజేపీ విజయంలో అధ్యక్షుడు నితిన్ నబీన్‌ కీలక పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు. బీజేపీ కార్యకర్తలు చేసిన కృషి, పోరాటాలు లేకుండా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన రికార్డు విజయం సాధ్యమయ్యేది కాదని పార్టీ శ్రేణుల సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. 

'అస్సాం విజయం అభివృద్ధికి, ప్రజల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడానికి ఎన్డీయే కూటమి ఇస్తున్న ప్రాధాన్యాలకు ప్రజల అచంచలమైన మద్దతుకు నిదర్శనం' అని అస్సాం ఫలితాలపై ప్రధాన మోదీ తెలిపారు. అన్ని రకాల ప్రతికూలతలను అధిగమించి అస్సాంలో అభివృద్ధి అజెండా గురించి ప్రజలకు వివరించారని.. దాని ఫలితంగానే మరోసారి విజయం అని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Pawan Kalyan: టీవీకే విజయ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రశంసలు.. బీజేపీ గెలుపుపై హర్షం

Nuzendla, Andhra Pradesh:

Pawan Kalyan Congrats To TVK Vijay: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతదేశ రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పాయి. బీజేపీ భారీ విజయం సాధించగా.. కేరళంలో కాంగ్రెస్‌, తమిళనాడులో టీవీకే పార్టీ విజయ ధుందుబి మోగించాయి. రాజకీయాల్లో సరికొత్త కోణాన్ని చూపిన ఈ ఎన్నికల ఫలితాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. టీవీకే విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: SRH vs KKR: సన్‌రైజర్స్‌ విజయ యాత్రకు బ్రేక్‌.. ఊపిరి పీల్చుకున్న కలకత్తా నైట్‌రైడర్స్‌

'ఓటర్ల చైతన్యం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలలో మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారు. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారు. ఆ మార్పును తమ తీర్పు ద్వారా బలంగా చెప్పారు' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పవన్‌ కల్యాణ్‌ ప్రకటన విడుదల చేశారు.

Also Read: Heavy Rain: నల్లగొండలో దంచికొట్టిన వాన బీభత్సం.. నేలకూలిన చెట్లు

అస్సోం, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్న బీజేపీని అగ్ర నాయకత్వం అకుంఠిత దీక్ష సర్వదా శ్లాఘనీయం. పశ్చిమ బెంగాల్‌వాసుల నమ్మకాన్ని ప్రోది చేసుకోడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది' అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 'నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్దేశకత్వంలో రాష్ట్రంలో బీజేపీ పాలన ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే పశ్చిమ బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందనే గట్టి విశ్వాసంతో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు' అని వివరించారు.

Also Read: Tamil Nadu Results: తమిళనాడులో హోరాహోరీ.. రేపటి ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ

ఈ సందర్భంగా నరేంద్ర మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్, సువేందు అధికారికి విజయంలో భాగస్వాములైన బీజేపీ నాయకత్వానికి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అభినందనలు తెలిపారు. అస్సాం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి మరోమారు విజయాన్ని దక్కించుకున్న హిమంత బిశ్వశర్మకు, పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమికి విజయాన్ని మళ్లీ అందించిన రంగసామిని అభినందించారు. 'తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజలు మార్పును స్పష్టంగా కోరుకున్నారు. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి అధిక  స్థానాలను అందించి సింహభాగం ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే చక్కటి విజయాన్ని సాధించిన విజయ్‌ను మనసారా అభినందిస్తున్నా' అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 'ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి పోరాటం బలమైనదే. కేరళంలో కూడా మార్పునే మెజారిటీ ఓటర్లు కోరుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన యూడీఎఫ్‌ నాయకత్వానికి అభినందనలు. ఈ ఎన్నికల పోరాటంలో నిలిచి గెలిచిన విజేతలందరికీ పేరుపేరునా శుభాభినందనలు' అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Lucky Zodiac Signs: జూన్ 29 వరకు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ధనవర్షం ఖాయం!

Hyderabad, Telangana:

Astrology Predictions May-June 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దాదాపు 60 రోజుల తర్వాత పలు గ్రహాలు అద్భుతమైన మార్పులు చేయబోతున్నాయి. ముఖ్యంగా మే 2 నుంచి ప్రారంభమై జూన్ 29 వరకు అద్భుతమైన కాలం కొనసాగబోతోంది. ఈ సమయం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా మారబోతోంది. ముఖ్యంగా సూర్యుడు, అంగారకుడితో బుధుడు కలయిక జరపడం వల్ల ఆయా రాశులవారికి చాలా బాగుంటుంది. అలాగే ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన బుధాదిత్య, మంగళాదిత్య రాజయోగాలు కూడా ఏర్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభించి.. ఆయా రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అంతేకాకుండా ఐదు రాశులవారికి ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది. 

ఈ రాశులవారికి అంతా శుభం..
మేష రాశి
శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల మేష రాశివారికి కెరీర్‌ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు ఈ సమయంలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. పాత బాకీల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా లభిస్తాయి.

వృషభ రాశి
ఈ సమయంలో ఏర్పడే బుధాదిత్య, మంగళాదిత్య రాజయోగాల ప్రభావంతో వృషభ రాశివారికి సువర్ణ అవకాశంగా మారుతుంది. అలాగే గురు గ్రహం ప్రభావంతో తండ్రి నుంచి భారీ మొత్తంలో ఆస్తులు కూడా పొందుతారు. దీంతో పాటు వివాహాలు కానివారికి ఈ సమయంలో మంచి మంచి పెళ్లి సంబంధాలు కూడా వస్తాయి. అలాగే సమాజంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది.

సింహ రాశి
సింహ రాశివారికి పరిపాలన, రాజకీయ రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా మారుతుంది. అంతేకాకుండా పదోన్నతులు లభించడమే కాకుండా.. అధికార బలంతో శత్రువులపై ఊహించని విజయాలు కూడా సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. 

తుల రాశి
బుధాదిత్య, మంగళాదిత్య రాజయోగాల ఎఫెక్ట్‌తో వృత్తిపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన ఫలితాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి జీవితంలో కొత్త జీవిత భాగస్వామి పరిచయం కూడా అవుతుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Samsung Galaxy S27: సామ్‌సంగ్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. 6 ఏళ్ల తర్వాత మారనున్న గెలాక్సీ S27 డిజైన్!

Hyderabad, Telangana:

Samsung Galaxy S27 Design Leaks: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సామ్‌సంగ్ కంపెనీ ప్రతి ఏడాది అద్భుతమైన మొబైల్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గెలాక్సీ S డిజైన్‌లో త్వరలోనే కొన్ని కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆరు సంవత్సరాల తర్వాత సాంసంగ్‌ కంపెనీ త్వరలో రాబోయే గెలాక్సీ S27 సిరీస్‌తో అద్భుతమైన మార్పులు చేయబోతున్నట్లు వార్తలు వస్తాయి. అంతేకాకుండా ఈ సిరీస్‌కి సంబంధించిన కొన్ని ఫోటోస్‌ కూడా ఇటీవలే సోషల్ మీడియాల్లో లీక్‌ అయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ సీరీస్‌ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గెలాక్సీ S27 సిరీస్‌లో అత్యంత కీలకమైన వెనక భాగంలో ఊహించని మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఫ్లోటింగ్ లెన్స్ బైబై చెబుతూ..సామ్‌సంగ్ ఈసారి హారిజాంటల్ కెమెరా ఐలాండ్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చూడడానికి అచ్చం.. గూగుల్ పిక్సెల్ (Google Pixel) ఫోన్ల కెమెరా మాడ్యూల్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ డిజైన్ మార్పు ఫోన్‌కు మరింత గుర్తింపు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

మాగ్నెటిక్ యాక్సెసరీస్ (Magnetic Accessories) సదుపాయాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి డిజైన్‌లో మార్పులు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ టెక్నాలజీని మరింత అద్భుతంగా మెరుగుపరిచేందుకు ఈ డిజైన్‌ను తీసుకు రాబోతోంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో మాగ్నెటిక్ కాయిల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. లీకైన కాన్సెప్ట్ చిత్రాల్లో కెమెరా ఐలాండ్‌లో మూడు కెమెరా సెన్సార్లు ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా అల్ట్రా  మోడల్స్‌లో నాలుగు కెమెరాలు ఉండే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

ఒకవేళ సామ్‌సంగ్ కంపెనీ ఇదే డిజైన్‌ను ఫైనల్ చేస్తే.. నాలుగు కెమెరాలను ఆ ఐలాండ్‌లో ఎలా పెడతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, కంపెనీ దీనిపై ఇప్పటికీ ఎలాంటి అధికారక ప్రకటన కూడా చేయలేదు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటనతో పాటు ఇతర అన్ని వివరాలను కూడా వెల్లడించే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ డిజైన్‌ సిరీస్‌ విడుదలైతే.. అద్భుతంగా సక్సెస్‌ అవుతుంది. 

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Car Deals: రూ.6 లక్షలకే టాటా ఆల్ట్రోజ్? కార్లు కొనుగోలుకు ఇదే బెస్ట్ ఛాన్స్!

Hyderabad, Telangana:

Best Second-Hand Car Deals Latest News: సెకండ్ హ్యాండ్ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో లభించి మల్టీ నేషనల్ బ్రాండ్‌ కార్లు ఢిల్లీలో అత్యంత చీప్‌ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని రోహిణిలో ఉన్న కొన్ని సెకండ్‌ హ్యాండ్‌ మోటర్ షోరూమ్స్‌లో సగం ధరలకే లభిస్తున్నాయి. కాబట్టి చాలా మంది మిడిల్‌ క్లాస్‌ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇక్కడ ఏయే కార్లపై ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రోహిణిలో ఉన్న కారు షోరూమ్స్‌లో చిన్న తరహా హ్యాచ్‌బ్యాక్ కార్ల నుంచి ప్రీమియం SUVల వరకు అన్ని రకాల కార్లు అత్యంత చౌకవ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాటా హారియర్, హోండా అమేజ్, టయోటా గ్లాంజా వంటి ప్రముఖ బ్రాండ్లను సంబంధించిన కార్లు ఇక్కడ సగం కంపెనీ తక్కువ ధరలో అందుబాటులో ఉండడం విశేషం.. ఇక్కడున్న సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌లో 2020 మోడల్ టాటా హారియర్ ఎక్స్‌టి మాన్యువల్ డీజిల్ కార్లను కేవలం రూ. 8.5 లక్షలకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా 2023 మోడల్ టాటా ఆల్ట్రోజ్ కారును రూ. 6.5 లక్షలకే అందుబాటులో ఉన్నాయి. 

అయితే, ఇక్కడ కార్లను అత్యంత చీప్‌ ధరలకే అందించడమే కాకుండా పలు రకాల అదనపు సౌకర్యాలు కూడా సంస్థ అందిస్తూ వస్తోంది. ఇక్కడ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలనుకునేవారికి ప్యాన్ ఇండియా లోన్ సపోర్ట్‌ కూడా అందిస్తున్నారు. అలాగే కార్ల కొనుగోలు తర్వాత చేయాల్సిన ఆర్సీ (RC) ట్రాన్స్‌ఫర్ బాధ్యతను కూడా వారే తీసుకుని అన్ని క్లీయర్‌గా కొనుగోలు చేసేవారికి సర్వీసులు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రతి వాహనానికి సంబంధించిన అప్‌డేటెడ్ సర్వీస్ రికార్డులను అందించడం విశేషం..

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలనుకునేవారు.. ఈ కార్లను నేరుగా వీడియో కాల్‌ ద్వారా పరిశీలించే సదుపాయం కూడా అందిస్తున్నారు. అలాగే ఇక్కడ కార్లను కొనుగోలు చేసినవారికి ప్రత్యేకమైన Transportation సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు వివిధ సదుపాయాలను కూడా అందిస్తున్నారు. కాబట్టి చీప్‌ ధరల్లోనే మంచి కార్లను కొనుగోలు చేయాలనుకునేవారు రోహిణి సెక్టార్ 6, బి-2373 వద్ద ఉన్న షోరూమ్స్‌ను సందర్శించవచ్చు..

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Chalisa Yoga: ఒకేసారి చాలీసా యోగం, బుధాదిత్య యోగం.. ఈ రాశులవారికి ఇక పండగే!

Hyderabad, Telangana:

Mercury-Venus Conjunction Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో రెండు గ్రహాల కలయికకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాల కలయికను సంయోగంగా పిలుస్తారు. ఇదిలా ఉంటే మే 4వ తేదిన బుధతో పాటు శుక్ర గ్రహాల కలయికతో అరుదైన యోగం ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన చాలీసా యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది..

బుధ, శుక్ర గ్రహాల కలయికతో అరుదైన చాలీసా యోగంతో పాటు బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ఆయా రాశులవారికి అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా నాలుగు రాశుల్లో జన్మించివారికి జీవితంలో అద్భుతమైన సంపాదన కూడా లభిస్తోంది. ఈ కింది రాశులవారికి తెలివితేటలు, సంభాషణ నైపుణ్యాలతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాల పరంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన మార్పులు కూడా లభిస్తాయి. అయితే, ఈసమయం నాలుగు రాశులవారికి స్వర్ణయుగంలా మారుతుంది. 

మేష రాశి
చాలీసా యోగంతో మేష రాశివారికి ఈ సమయంలో అనేక రకాల ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో అనుకున్న అద్భుతమైన లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

మిథున రాశి
బుధ గ్రహ ప్రభావంతో మిథున రాశివారికి అనుకోని ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు కూడా సాధిస్తారు. అలాగే పనుల్లో నైపుణ్యం కూడా పెరుగుతుంది. ఉద్యోగాల్లో పురోగతికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

సింహ రాశి
బుధుడి ప్రభావంతో సింహ రాశివారికి గౌరవంతో పాటు సామాజంలో హోదా కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల విస్తరణకు కూడా అవకాశాలు కనిపిస్తున్నారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయం చాలా అద్బుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

తులారాశి
తులారాశి వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా జీవితంలో ఆనందంతో పాటు సౌకర్యం కూడా పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో శాంతి కూడా నెలకొంటుంది. దీంతో పాటు వైవాహిక జీవితంలో సంబంధాలు కూడా రెట్టింపు అవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Heavy Rain: నల్లగొండలో దంచికొట్టిన వాన బీభత్సం.. నేలకూలిన చెట్లు

Nalgonda, Telangana:

Heavy Rain In Nalgonda District: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాలుల బీభత్సం సృష్టించింది. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నిడమనూర్ మండలం బంకాపురం గ్రామంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో రాములు అనే వ్యక్తి ఇంటి పై రేకులు ఎగిరిపోయాయి. అనుముల మండలం అంగడి బజార్‌లో ఈదురుగాలులతో విద్యుత్ స్తంభం కూలిపోయింది. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై ఆరబోసుకున్న వడ్లు తడిచి ముద్దయ్యాయి. తిరుమలగిరి (సాగర్), పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో ఆకాశం మేఘావృతమై స్వల్ప జల్లులు కురిశాయి. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. వాతావరణం చల్లబడటంతో రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Tamil Nadu Results: తమిళనాడులో హోరాహోరీ.. రేపటి ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ

ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల భారీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కొన్ని రోజులుగా ఎండలకు ఇబ్బందిపడ్డ ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోగా.. పలు చోట్ల చెట్లు, మామిడి చెట్లు కూలిపోగా.. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోదాడ, యాదాద్రి జిల్లాలో బలమైన గాలులకు మామిడి పంట దెబ్బతింది. కాతకు వచ్చిన మామిడి కాయలు కిందపడ్డాయి.

Also Read: PV Sindhu: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ఒలింపిక్‌ స్టార్‌ పీవీ సింధు ప్రశంసలు

హలియాలో బీభత్సం
హాలియాలోని వజ్రతేజ రైస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓపెన్ ఏరియాలో గాలివాన బీభత్సం సృష్టించింది. రైస్‌ మిల్లులో నిలిపి ఉంచిన ధాన్యంతో కూడిన లారీలపై పట్టాలు ఎగిరిపోయాయి. దీంతో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు కవర్ల కోసం పరుగులు పెట్టారు. పంట చేతికొచ్చే తరుణంలో ప్రకృతి ప్రకోపంతో దిక్కుతోచని స్థితిలో రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Tamil Nadu Results: తమిళనాడులో హోరాహోరీ.. రేపటి ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ

Nagalapuram, Tamil Nadu:

TN Election Results: దక్షిణాది ప్రాంతంలో కీలకమైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ద్రవిడ సంస్కృతి.. ద్రవిడ వ్యతిరేక కూటముల మధ్య యుద్ధం అనేలా తమిళ ఎన్నికలు ఎప్పుడూ ఉంటాయి. తమిళనాడులో ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి కోల్పోతుందనే సంప్రదాయం ఉంది. ఎన్నికలకు ఎన్నికలకు ప్రభుత్వం మారుతుందనే సంప్రదాయానికి ఈసారి బ్రేక్‌ పడనుందా? డీఎంకే మరోసారి అధికారం చేపట్టనుందా? తొలిసారి రాజకీయ పార్టీతో ఎన్నికల్లో నిలిచిన విజయ్‌ ఏ మేరకు ప్రభావం చూపనున్నారనేది రేపు తేలనుంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. మే 4వ తేదీన అంటే రేపు వెలువడనున్న ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఫలితాలకు ముందే చెన్నై రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉండటంతో అగ్ర నాయకుల్లో టెన్షన్ మొదలైంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

హంగ్ వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో నటుడు, టీవీకే విజయ్ అప్రమత్తమయ్యారు. తన పార్టీ అభ్యర్థులు చేజారకుండా మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు సమాచారం. గెలిచిన అభ్యర్థులు నేరుగా అక్కడికే చేరుకోవాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. తమిళనాడు గద్దె ఎవరిదనే విషయంలో సర్వే సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు ఎలా ఉన్నా మళ్లీ అధికారంలోకి వచ్చేది డీఎంకే పార్టీ అని స్పష్టమవుతోంది.

ఎగ్జిట్‌ పోల్స్‌లో యాక్సిస్ మై ఇండియా విడుదల చేసిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 98-120 సీట్లు వస్తాయని వెల్లడించింది. కింగ్ మేకర్ కాదు కింగ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మెజారిటీ సంస్థలు మాత్రం డీఎంకే  కూటమికే పట్టం కట్టాయి. విజయ్ పార్టీ పది సీట్లు కూడా దాటదని జోస్యం చెప్పాయి. మొత్తం 234 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 118. యాక్సిస్ మై ఇండియా అంచనా నిజమైతే విజయ్ అధికారం చేపట్టడం ఖాయం. ఒకవేళ హంగ్ ఏర్పడితే మాత్రం తమిళ రాజకీయం మరెన్నో మలుపులు తిరిగే అవకాశం ఉంది.

ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ ముగిసినప్పటి నుంచి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. డీఎంకే కూటమి 92-100 సీట్లు, ఏఐఏడీఎంకే కూటమి 22-32 సీట్లు సాధిస్తాయని అంచనాలు వెలువడుతున్న తరుణంలో అభ్యర్థుల కొనుగోలు  జరగకుండా పార్టీలు రిసార్ట్ పాలిటిక్స్‌కు తెరలేపాయి. మరి తమిళనాడు ఓటరు నాడీ ఎటువైపు ఉంది? దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం అద్భుతాలు సృష్టిస్తుందా? లేక స్టాలిన్ తన పీఠాన్ని నిలబెట్టుకుంటారా? రేపు మధ్యాహ్నం కల్లా ఈ ఉత్కంఠకు తెరపడనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

PV Sindhu: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై ఒలింపిక్‌ స్టార్‌ పీవీ సింధు ప్రశంసలు

Vijayawada, Andhra Pradesh:

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు.. మ్యాజిక్ డ్రెయిన్స్‌తో పల్లెల్లో పారిశుధ్య విప్లవం తెచ్చారని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. గ్రామాల్లో మురుగునీటి సమస్యకు ఇది చక్కటి పరిష్కార మార్గం అని.. సిమెంటు డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం నిర్మాణ వ్యయం ఆదా అయిందని వివరించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలుచేస్తున్నారని ఒలంపిక్ మెడలిస్ట్ పీవీ సింధు తెలిపారు. డిప్యూటీ సీఎం ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ ఛేంజర్ లాంటిదని పీవీ సింధు వివరించారు.

ఉప ముఖ్యమంత్రి 20 నెలల పాలన గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో మ్యాజిక్ డ్రెయిన్స్ లాంటి సరికొత్త విధానాలు అమలు చేయడంపై ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలనా వ్యవహారాలు కొత్తే అయినా పవన్ కల్యాణ్ వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారని చెప్పారు. మన దేశంలో మెజారిటీ శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారని తెలిపారు. అయితే గ్రామాల్లో పారిశుధ్యం పెద్ద సవాలుగా ఉంటుందని పేర్కొన్నారు. సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవనం సాగిస్తూ ఉంటారని పీవీ సింధు పేర్కొన్నారు. 

ఈ సమస్యకు పవన్ కల్యాణ్ మ్యాజిక్ డ్రెయిన్స్ రూపంలో అద్భుత పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఇంకుడు గుంతలతో కూడిన డ్రెయిన్లు ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని క్షణాల్లో మాయం చేస్తాయి. మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని భూగర్భ జలంగా మార్చేస్తాయి. మురుగు నీటి నిల్వ, దుర్వాసన తదితర సమస్యలకు మ్యాజిక్ డ్రెయిన్లు చక్కటి పరిష్కార మార్గం' అని పీవీ సింధు తెలిపారు. సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే మ్యాజిక్ డ్రెయిన్లకు 80 శాతం నిర్మాణ వ్యయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు పారిశుద్ధ్యాన్ని ఈ మ్యాజిక్ డ్రెయిన్లు పెంపొందిస్తాయని చెప్పా. 

'ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించే వెసులుబాటు కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ భవిష్యత్తులోనూ ఇలాంటి ముందు చూపుతో కూడిన వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి. గ్రామీణాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా' అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Rajasthan Royals Sold: నక్క తోక తొక్కిన రాజస్థాన్ రాయల్స్ ఓనర్..రూ.15,660 కోట్లకు ఐపీఎల్ జట్టు అమ్మకం!

Jaipur, Rajasthan:

Rajasthan Royals Sold Price: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇటీవలే ఆదిత్య బిర్లా గ్రూప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో రాజస్థాన్ రాయల్స్ జట్టు చేరింది. ఈ టీమ్‌ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలీయనీర్ లక్ష్మీ నివాస్ మిట్టల్ ముందుకొచ్చారు. ఈ టీమ్‌లోని 75 శాతం వాటాను మిట్టల్ ఫ్యామిలీ సొంతం చేసుకోవడంతో.. ఆ ఫ్రాంచేజీ మేనేజ్‌మెంట్ మిట్టల్ ఫ్యామిలీ సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ జరుగుతుండగానే ఈ అమ్మకం జరగడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్‌లో బాగా రాణిస్తుంది. ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌ల్లో గెలిచిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త యజమానిగా భారత సంతతికి చెందిన బిలియనీర్, స్టీల్ కింగ్‌గా పేరుగాంచిన లక్ష్మీ మిట్టల్ కుటుంబం, రాజస్థాన్ రాయల్స్‌ను సొంతం చేసుకుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో 75 శాతం వాటాను మిట్టల్ ఫ్యామిలీ రూ.15,660 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది.

బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ కుటుంబం, దేశంలో 'వ్యాక్సిన్ కింగ్'గా పేరుగాంచిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదర్ పూనావాలాతో కలిసి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నివేదికల ప్రకారం.. ఐపీఎల్ జట్టు ఒప్పందం పూర్తయిన తర్వాత, రాజస్థాన్ రాయల్స్‌లో మిట్టల్ కుటుంబం సుమారు 75% మెజారిటీ వాటాను కలిగి ఉంటుంది. అయితే ఆదర్ పూనావాలా సుమారు 18% వాటాను కలిగి ఉంటారు. మిట్టల్-పూనావాలా సంయుక్తంగా ఈ ఒప్పందాన్ని పూర్తి చేశారు. మిగిలిన వాటాను ఇతర పెట్టుబడిదారులు కలిగి ఉంటారు.

స్టీల్ కింగ్ బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ ఆర్సెలార్ మిట్టల్ వ్యవస్థాపకుడు. ఆదర్ పూనావాలాతో కలిసి మిట్టల్ కుటుంబం, మనోజ్ బాజ్‌పేయ్, అతని గ్రూప్ నుండి రాజస్థాన్ రాయల్స్‌ను స్వాధీనం చేసుకుని, అందులో నియంత్రణ వాటాను పొందేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ సుమారు $1.65 బిలియన్లు (సుమారు రూ.15,660 కోట్లు) నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ సేల్‌తో రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ బోర్డులో లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనిషా మిట్టల్-భాటియా, అదర్ పూనావాలా, మనోజ్ బాజ్‌పేయ్ చేరనున్నారు. ఆదిత్య మిట్టల్ లక్ష్మీ మిట్టల్ కుమారుడు కాగా, వనిషా మిట్టల్-భాటియా ఆయన కుమార్తె. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదానికి లోబడి, ఈ ఒప్పందం 2026 మూడవ త్రైమాసికంలో అనగా ప్రస్తుత ఐపీఎల్ పూర్తవ్వగానే ఈ డీల్ ఖరారు అవుతుందని భావిస్తున్నారు.

లక్ష్మీ నివాస్ మిట్టల్ ఎవరు?
ఉత్తర రాజస్థాన్‌లోని సదుల్‌పూర్‌లో పుట్టి పెరిగిన లక్ష్మీ మిట్టల్‌ను దేశపు స్టీల్ కింగ్‌గా పిలుస్తారు. భారత సంతతికి చెందిన బిలియనీర్ స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ గతంలో బ్రిటన్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో ఉండేవారు. ఇటీవల, ఆయన యూకేను విడిచిపెట్టాలని నిర్ణయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో లక్ష్మీ మిట్టల్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన నికర ఆస్తి విలువ 28.4 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీ విలువ ప్రకారం రూ.27 లక్షల కోట్ల పైమాటే.

లక్ష్మీ మిట్టల్ 1995లో లండన్‌కు తన నివాసాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే బ్రిటన్‌లోని అత్యంత ప్రముఖ భారతీయ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఎదిగారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పాదక సంస్థ అయిన ఆర్సెలార్ మిట్టల్ ద్వారా ఆయన తన సంపదను నిర్మించుకున్నారు. ఈ కంపెనీలో లక్ష్మీ మిట్టల్, ఆయన కుటుంబానికి సుమారు 40% వాటా ఉంది. 2021లో లక్ష్మీ మిట్టల్ సీఈఓ పాత్రను తన కుమారుడు ఆదిత్య మిట్టల్‌కు అప్పగించారు. కానీ తానే ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

బ్రిటన్‌లోని ఆస్తులతో పాటు, బిలియనీర్ లక్ష్మీ మిట్టల్‌కు దుబాయ్‌లో ఒక భవనం ఉంది. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని సమీప నయా ద్వీపంలో ఒక అభివృద్ధి ప్రాజెక్టులో పెద్ద వాటాను కొనుగోలు చేశారు. అంతేకాకుండా, బిలియనీర్స్ రో అని కూడా పిలువబడే కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్‌లోని ఆయన ఆస్తులు దేశంలోనే అత్యంత ఖరీదైన గృహాలలో ఒకటిగా ఉన్నాయి.

Also REad: PM Kisan 23rd Installment: ఒకే ఇంట్లో ఇద్దరికి రైతు భరోసా ఇస్తారా? ఏడాది రూ.12,000 పొందాలంటే ఏం చేయాలి?

Also REad; Pant 2027 World Cup: రిషబ్‌ పంత్‌కు బీసీసీఐ షాక్..వన్డే ప్రపంచకప్ టీమ్‌ నుంచి పంత్ ఔట్! అతని స్థానంలో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

PM Kisan 23rd Installment: ఒకే ఇంట్లో ఇద్దరికి రైతు భరోసా ఇస్తారా? ఏడాది రూ.12,000 పొందాలంటే ఏం చేయాలి?

Hyderabad, Telangana:

PM Kisan 23rd Installment Update: భారతదేశపు వెన్నెముక అయిన రైతుల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (పీఎం-కిసాన్) పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని కోట్లాది రైతు కుటుంబాలకు ఈ పథకం ఆసరాగా మారింది. ప్రతి ఏడాది రూ.6000 వేల చొప్పున (నెలనెలా రూ.2,000) వరకు రైతుల కుటుంబాల్లో పీఎం కిసాన్ డబ్బును జమ చేస్తున్నారు. అయితే ఈ పథకం ఒకే ఇంట్లో ఉండే తండ్రి, కుమారులకు వర్తిస్తుందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 

పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 22 విడతలను విజయవంతంగా పంపిణీ చేయగా.. రైతులు ఇప్పుడు 23వ విడత డబ్బు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ పథకం ప్రయోజనాలను పొందే విషయంలో ఇంకా చాలా గందరగోళాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఒకే ఇంట్లో నివసించే తండ్రీకొడుకులు ఇద్దరూ ఈ పథకం ప్రయోజనాలను పొందగలరా లేదా అనే ప్రశ్నకు ఇప్పుడు స్పష్టత వచ్చింది.

తండ్రీకొడుకులు ఇద్దరికీ డబ్బు ఎప్పుడు వస్తుంది?
తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ కలిసి డబ్బు సంపాదిస్తున్నా కూడా వారికి కొన్ని సందర్భాల్లో తండ్రీకొడుకులుకీ ఈ పథకం పొందేందుకు అనుమతి ఉంది. కొడుకుకు పెళ్లై.. అతని భార్యతో కలిపి ప్రత్యేకంగా రేషన్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే సదరు లబ్ధిదారునిపై ప్రత్యేక వ్యవసాయ భూమి (పహానీ/అడంగళ్) రిజిస్టర్ అయి ఉండాలి. అప్పుడు కొడుకును కూడా ఒక స్వతంత్ర కుటుంబంగా పరిగణిస్తారు. అటువంటి సందర్భంలో, తండ్రీకొడుకులు ఇద్దరూ చెరో రూ.6,000 చొప్పున ఒక ఏడాదికి  మొత్తం రూ.12,000 పొందేందుకు అర్హులుగా ఉంటారు.

ఈ పథకానికి ఎవరు అర్హులు కారు?
కుటుంబంలో ఎవరైనా ప్రస్తుత లేదా మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయితే, వారికి ఈ ప్రయోజనం లభించదు. అలాగే గత ఆర్థిక సంవత్సర ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు ఈ పథకానికి అనర్హులుగా పరిగణిస్తారు. వీరితో పాటు డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వారు రైతులు ఉన్నప్పటికీ, ఈ పథకాన్ని పొందలేరు. నెలకు రూ.10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఈ జాబితా నుండి మినహాయించబడలేదు. ఉన్నత రాజ్యాంగ పదవులను కలిగి ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తించదు.

కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా పథకానికి చెందిన డబ్బును పొందుతున్నట్లు ప్రభుత్వానికి తెలిస్తే తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ అటువంటి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, ఇప్పటివరకు పొందిన డబ్బు వడ్డీతో సహా తిరిగి వసూలు చేస్తుంది. అందువల్ల, రైతులు ఇ-కెవైసి చేయించుకోవడం, భూమిని ఆధార్‌తో అనుసంధానం చేయడం తప్పనిసరి.

(గమనిక: రైతులు తమ అర్హత, రావాల్సిన డబ్బు వాయిదాలను పరిశీలించేందుకు pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే, వారు ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్ 155261కు ఫోన్ చేయవచ్చు.) 

Also Read: Pant 2027 World Cup: రిషబ్‌ పంత్‌కు బీసీసీఐ షాక్..వన్డే ప్రపంచకప్ టీమ్‌ నుంచి పంత్ ఔట్! అతని స్థానంలో..

Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల ఎగిరి గంతేసే వార్త..డీఏతో పాటు HRA పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top