ప్రొఫెసర్ జైశంకర్ 90వ జయంతి వేడుకలు
ప్రొఫెసర్ జైశంకర్ 90వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్లోని ప్రొఫెసర్ జైశంకర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు, విశ్వకర్మ పంచ వృత్తి దారుల సంగ నాయకులు, కార్పొరేటర్ భిక్షపతి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమనేత జాతిపిత అని, ప్రభుత్వ శక్తితో జయశంకర్ జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Warangal: 'దేవాదుల ప్రాజెక్ట్ విజిట్ చేయగానే సీఎం రివ్యూ చేశారు. మేము తట్టిలేపితేనే రేవంత్ రెడ్డి నిద్రలేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెబుతూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. గోదావరి జలాలపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధమని ప్రకటించారు. అయితే మైక్ కట్ చేయొద్దు.. కెమెరా తిప్పొద్దని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీలో చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన రెండేళ్లలో ఒక్క ఎకరా సేకరించలేదని, అదనంగా సాగునీరు అందించలేదని ఆరోపించారు.
వరంగల్లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని బీఆర్ఎస్ పార్టీ బృందంతో కలిపి హరీష్ రావు పరిశీలించారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. మంత్రుల మాటలకు, రేవంత్ రెడ్డి మాటలకు పొంతనలేదని తెలిపారు. ఈ ప్రభుత్వానికి డేట్ లు, డెడ్ లైన్ లు మాత్రమే మారుతున్నాయని ఎద్దేవా చేశారు.
'గోదావరి మీద మాట్లాడదామని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసురుతున్నారు. గోదావరిపై 8 బ్యారేజ్ లు కట్టింది మేము, ఆయన ఏం మాట్లాడుతాడు?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. గోదావరి నీళ్లను పొలాలకు మళ్లించింది మేము, మీరు ఏం చేశారని నిలదీశారు. కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు చాలెంజ్ చేశారు.
'మంత్రి ఉత్తమ్ మాట్లాడుతుంటే వద్దని రేవంత్ రెడ్డి వారించాడు. నీళ్ల మంత్రిని కూడా మాట్లాడనీయని రేవంత్ రెడ్డి మమ్మల్ని మాట్లాడనిస్తాడా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు సందేహం వ్యక్తం చేశారు. 'దేవాదుల 90శాతం పూర్తి చేశాం, 10శాతం మాత్రమే పెండింగ్ ఉంది. త్వరలో దేవాదుల ప్రాజెక్ట్ పూర్తిచేయాలి' అని డిమాండ్ చేశారు. 'వరంగల్ ను హెల్త్ సిటీ చేయాలని కేసీఆర్ పనిచేశారు. పేదల కోసం కేసీఆర్ హెల్త్ సిటీ నిర్మిస్తే, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ కోసం పనిచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం రేవంత్ రెడ్డిది, పేదల కోసం పనిచేసే ఆలోచన కేసీఆర్ ది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిపై నిర్లక్ష్యం మంచిది కాదని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
'కేసీఆర్ కు పేరు వస్తుందని పనులు చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా ఆస్పత్రి ప్రారంభం కావట్లేదు. 2000 పడకల ఆస్పత్రి కలగానే మిగిలిపోయేలా ఉంది. జూన్ లో ప్రారంభిస్తామని చెప్తున్నారు, ఉద్యోగాల కోసం కేబినెట్ అనుమతి కూడా తీసుకోలేదు. వైద్య అధికారులు, సిబ్బంది నియామకమే పూర్తి కాలేదు. కావలసిన వైద్య పరికరాలు కూడా ఇప్పటివరకు తేలేదు. ఓపీ సేవలు ప్రారంభించి, 24 అంతస్తుల ఆస్పత్రిని బస్తీ దవాఖానా చేస్తారా...?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
'రెండేళ్లు ఓపిక పట్టాం. ఇక నిలదీస్తాం, గల్లా పట్టి అడుగుతాం. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే బీ ఆర్ ఎస్ నిరసన దీక్షలకు దిగుతుంది. వరంగల్ ఎంజీఎంలో ఏడాదిన్నరగా గుండె శస్త్ర చికిత్సలు ఆగిపోయాయి. ఎంజీఎంలో 3 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ లు పెట్టాం. ఇప్పుడు ఒక్కటి కూడా పనిచేయట్లేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. 'మేము ఇచ్చిన వాటిని కూడా సరిగా నడపడం చేతకావట్లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాటానికి సిద్ధంగా ఉన్నాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bandi Sanjay Kumar: 'ఎమ్మెల్యేలంతా నారాజ్ లో ఉన్నారు నియోజకవర్గాలకు నిధులివ్వడం లేదు. కాంగ్రెస్ లో ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాన్ని ఇతరులకు ఇవ్వరు సొంత పార్టీ నేతలే ఆ ప్రభుత్వాన్ని కూల్చుతారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గ్యారంటీ లేదు. కాంగ్రెస్ నేతలే అవినీతిమయమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలని బీజేపీ కోరుకోవడం లేదు. ప్రజాస్వామ్యబద్దంగా పాలన కొనసాగించాలని ఆశిస్తోంది' అని బండి సంజయ్ తెలిపారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ల, కౌన్సిలర్ల పరిచయ కార్యక్రమం హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. 'ఇకపై ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయం తథ్యం' అని ధీమా వ్యక్తం చేశారు. 'కాంగ్రెస్ పార్టీలో లొల్లి స్టార్ట్ అయ్యింది. కర్నాటకలో 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాకు మంత్రి పదవులు కావాలని రాహుల్ గాంధీకి లేఖ రాశారు. తెలంగాణలోనూ రెండు జిల్లాల్లో ఎమ్మెల్యేలు కర్నాటక తరహాలో మంత్రి పదవులు కావాలని అసమ్మతి సమావేశాలు పెట్టుకున్నారు. ప్రస్తుత మంత్రులు అవినీతికి పాల్పడుతూ కాంగ్రెస్ ను భ్రష్టు పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు లేఖలు రాసి రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది' అని కాంగ్రెస్ పై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
'2028లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మనందరం పనిచేద్దాం' బీజేపీ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. 'ప్రతి కార్యకర్తకు బీజేపీ కార్యాలయం పవిత్రమైన దేవాలయం. పార్టీ కంటే నేనే గొప్ప అనుకున్న వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారు. బండి సంజయ్ అనే నేను పార్టీలో లేకుంటే నన్ను కక్కులు కూడా దేకవు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు
'కరీంనగర్ లో కార్యకర్తల కష్టం, నాయకుల స్ట్రాటజీతోనే మేయర్ కలను సాకారం చేసుకోగలిగాం. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుమ్కక్కై కుట్రలు చేసినా అధిగమించగలిగాం. ఆ పార్టీలు దిగజారి కుట్రలు చేసినా విజయం సాధించాం. రేవంత్ రెడ్డి కూడా తన స్థాయికి దిగజార్చుకుని బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా కుట్ర చేశారు. ప్రజాతీర్పుకు భిన్నంగా రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్, ఎంఐఎం నేతలు చేసిన కుట్రలపై కొందరు కార్పొరేటర్లే తిరుగుబాటు చేసి స్వచ్ఛందంగా మేయర్ ఎన్నికలో తటస్థంగా నిలిచి సహకరించారు' అని బండి సంజయ్ వివరించారు. కరీంనగర్ మేయర్ గెలుపు ఊత్సాహంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పనిచేద్దామని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని కైవసం చేసుకుందామని చెప్పారు. 'ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసమే రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను మూడు ముక్కలు చేసి అందులో ఒక దానికి ఎంఐఎం పార్టీకి దారాధత్తం చేయాలని చూస్తున్నారు' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
AP Congress Party: 'అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు కూటమి ప్రభుత్వ తీరు ఉంది. తిరుమల పవిత్రతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాన్ని వైఎస్సార్కు చుట్టడం చంద్రబాబుకు భావ్యం కాదు. వైఎస్సార్సీపీ కల్తీ పనులు నాటి వైఎస్సార్ నుంచే అనడం ఎంతమాత్రం సబబు కాదు' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఖండించారు. అసెంబ్లీ వేదికగా వైఎస్సార్పై చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్పై చేసిన వ్యాఖ్యలను సభ రికార్డ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీలో తిరుమల నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ అంశంలో వైఎస్సార్కు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. వైఎస్సార్ 7 కొండలను 2 కొండలు చేయాలని ఏనాడూ అనుకోలేదని.. జరిగిందంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేశారు. అప్పటి ప్రతిపక్షనాయకుడిగా బురద చల్లాలని చూసిందే మీరు అని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతకు పెద్దపీఠ వేసింది ఆనాడు వైఎస్సార్ అని చెప్పారు. 7 కొండలు వెంకటేశ్వరుడివే అని 2007లో శాశ్వత జీఓ ఇచ్చి చరిత్ర సృష్టించారని వైఎస్ షర్మిల గుర్తుచేశారు.
'హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం ఉండకుండా కఠిన నిబంధనలు వైఎస్సార్ అమలు చేశారు. జీవో 746,747 తెచ్చి తిరుమలను దివ్య క్షేత్రంగా మార్చారు. తిరుమల లడ్డూ పవిత్రతకు రక్షణగా నిలబడ్డారు. లడ్డూకు పేటెంట్ రైట్ సాధించింది 2009లో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగానే. వెంకన్న ఆస్తులు అన్యాక్రాంతం అవ్వకుండా ప్రత్యేక చట్టం అమలు చేశారు' అని వైఎస్ షర్మిల వివరించారు. 'తిరుమలలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం పెట్టారు. వెంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం కట్టారు. వేద పండిట్ల కోసం ఆనాడే వైఎస్సార్ ఆయుష్మాన్ భవ పథకం అమలు చేశారు. దళితులకు గోవిందుడు దగ్గరవ్వాలని అమలు చేసిన దళిత గోవిందం ఆనాడు వైఎస్సార్ తీసుకున్న గొప్ప నిర్ణయం' అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు.
'రాష్ట్రంలో మతాలకు అతీతంగా ప్రజలు ఈనాటికి వైఎస్సార్ను దేవుడిగా కొలుస్తున్నారంటే అది ఆయన పాలనకు నిదర్శనం. వైఎస్సార్సీపీ చేసిన అరాచకాలకు వైఎస్సార్కు సంబంధం లేదు. వైఎస్సార్ పాలన సంక్షేమ పాలన. వైసీపీ పాలన దోచుకు తిన్న పాలన' అని వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ లేడని ప్రకటించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముమ్మాటికి కాంగ్రెస్ మనిషి.. కడవరకు కాంగ్రెస్లోనే బతికిన మనిషి అని వైఎస్ షర్మిల చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rahu Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహాన్ని అత్యంత ప్రమాదకరమైన నీడ గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఈ గ్రహాన్ని శనికి నీడ గ్రహంగా కూడా చెప్పుకుంటారు. ఇది 9 గ్రహాల్లో అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. జాతకంలో రాహువు శుభ స్థానంలో ఉంటే ఏమి కోరుకుంటే, అది జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ గ్రహం శుభ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారు పేదవారు కూడా ధనవంతులవుతారు. అంటే అంతటి ప్రత్యేకత వేరే గ్రహానికి దేనికి లేదు. అయితే, రాహువు త్వరలోనే ప్రత్యేకమైన కదలికలు జరపబోతున్నాడు. ముఖ్యంగా ఏప్రిల్ 15వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి మంచి స్థానంలో ఉండబోతున్నాడు. దీని కారణంగా ఆయారాశుల వారికి ఎంతో మేలు జరగబోతోంది. ముఖ్యంగా రాహువు ప్రభావంతో మూడురాశుల వారికి అదృష్టం ఊహించని స్థాయిలో కలిసి రాబోతోంది.
ఈ రాశులవారిపై రాహువు ఎఫెక్ట్:
మిథున రాశి
రాహువు ప్రభావంతో మిథున రాశి వారికి విధిరాత పూర్తిగా మారబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి అదృష్టం విపరీతంగా లభించబోతోంది. దీనివల్ల వీరు ఎన్నో రకాల లాభాలు పొందబోతున్నారు. అలాగే ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వీరు సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంతమంది విదేశాలు వెళ్తారు. ఆర్థిక పరిస్థితులు బాగుండడమే కాకుండా కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కన్య రాశి
కన్య రాశి వారికి రాహువు గ్రహ కదలికలతో జీవితాల్లో అనేక సమస్యల నుంచి ఉపశమనం లభించబోతోంది. అలాగే సవాళ్ల నుంచి కూడా పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎన్నో రకాల ముఖ్యమైన మార్పులు కూడా సంభవిస్తాయి. ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులకు మంచి జరుగుతుంది. అలాగే అదృష్టం కూడా అద్భుతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చులపై తగ్గినప్పటికీ ఆర్థిక అంశాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. కెరీర్లో పెద్దపెద్ద మార్పులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఉద్యోగాలు కూడా మారడం వల్ల కొన్ని రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కుంభరాశి
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహువు ప్రభావంతో పెద్దపెద్ద మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా వీరు తీసుకునే నిర్ణయాలు చాలావరకు బాగుండబోతున్నాయి. శని ప్రభావం వల్ల వస్తున్న సమస్యలు కూడా రాహు ప్రభావం వల్ల కాస్త ఉపశమనం కలగవచ్చు. దీంతోపాటు గత కొన్ని సంవత్సరాలనుంచి ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే గత కొన్ని ఏళ్ల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో కాస్త ఉపశమనం కూడా కరుగుతుంది. ఇక ఈ సమయంలో తప్పకుండా కష్టపడి పని చేసే అంశాలపై దృష్టి పెట్టడం మంచిది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Water From Air Moisture Telugu News: వాతావరణం లో ఉన్న గాలిలోని తేమను వినియోగించి నీరు తయారు చేయవచ్చన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన ఇప్పుడు శాస్త్రీయంగా సహకారమైంది.. గత ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ప్రొఫెసర్ ఓమార్ యాఘీ అభివృద్ధి ఓ యంత్రం ఇప్పుడు గాల్లో నుంచి నీరును తీస్తోంది. వినూత్న సాంకేతికతతో రూపొందించిన యంత్రాన్ని వినియోగించి పొడి గాలి నుంచి రోజుకు 1000 లీటర్లకు పైగా స్వచ్ఛమైన నీటిని ఉత్పత్తి చేయవచ్చని ఆయన చెబుతున్నారు. అయితే ఈ యంత్రానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో? దీనిని ఎలా రూపొందించారో? ఇది ఎలా పని చేస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
2020 సంవత్సరంలో అక్టోబర్ నెలలో డ్యానిష్ విండ్ ఎనర్జీ సంస్థ వెష్టాస్ ప్రతినిధులతో మాట్లాడిన సమయంలో.. విండ్ టర్బైన్ల ద్వారా గాలిలోని తేమను పీల్చుకొని తాగునీటిని తయారు చేయవచ్చని ప్రధాని నరేంద్ర మోదీ వారికి సూచించారు.. అప్పట్లో చాలామంది దీనిపై హేళన కూడా చేశారు. కొన్ని రోజులపాటు ఈ అంశంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ నేడు రెటిక్యులర్ కెమిస్ట్రీ అనే అద్భుతమైన శాస్త్రం ద్వారా అది సాధ్యమని ప్రొఫెసర్ ఒమర్ యాఘీ నిరూపించారు.
ప్రొఫెసర్ ఒమర్ ఇటీవల స్థాపించిన అటోకో అనే సంస్థ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అనే మాలిక్యులర్ స్పాంజీలను తయారు చేసింది. ఇవి గాలిలోని నీటిని సేకరించేందుకు క్రియాశీలక పాత్ర పోషించినట్లు తేలింది. ముఖ్యంగా ఇవి గాల్లోని నీటి అణువులతో పాటు కార్బన్ ను అత్యంత ఖచ్చితత్వంతో బంధిస్తాయి. సాధారణంగా గాలిలోని నీటిని తీయడం కాస్త కష్టంతో పాటు విద్యుత్ ఉపయోగం ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ కొత్త ప్రత్యేకమైన పద్ధతిలో భాగంగా ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా రసాయన ఆకర్షణతో నీటిని సేకరిస్తారు.
ఈ యంత్రం ఎడారి ప్రాంతాల్లో ఉండే 20 శాతం కంటే తక్కువ తేమ ఉన్న గాలి నుంచి కూడా నీటిని సేకరించగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ యంత్రానికి విద్యుత్ గ్రిడ్ లేత పైపుల సహాయం అవసరం లేదు. కేవలం సూర్యరశ్మి ద్వారా వచ్చి వేడిని ఉపయోగించుకొని ఎంతో సులభంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నీటి కష్టాలు పెరుగుతున్న నేపథ్యంలో గాలిలో నుంచి నీటిని ఉత్పత్తి చేసే ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే గేమ్ చేంజర్గా మారుతుంది. గాలిలో ఉన్న నీటి పరిమాణం ప్రపంచంలోని అన్ని నదులలోని నీటి కంటే ఆరు రేట్లు ఎక్కువ.. ఇప్పటికే భారతదేశానికి చెందిన కొన్ని క్లింటెక్ సంస్థలు ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rajasthan Telugu Latest News: సాంప్రదాయ వృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి మెరుగుపరిచే దిశగా ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. పల్లె ప్రాంతాల్లో పశుపోషణను ప్రోత్సహించేందుకు గావ్ గ్వాలా యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గోవులను కాసే వారిని అధికారికంగా నియమించడమే కాకుండా.. వారికి ప్రతి నెల రూ.10 వేల గౌరవ వేతనాన్ని అందించబోతున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో చదువు లేని యువతకు ఇది ఒక గొప్ప ఉపాధిగా మారుతుంది. అంతేకాకుండా ఇప్పటికే ఉన్న పశు కాపారులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది..
ఈ పథకానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. దీనిని రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి మదన్ దిలావర్ అధికారికంగా ప్రకటించారు. పురాతన కాలం నుంచి వస్తున్న సామాజిక గోసంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రతి 70 గోవులకు ఒక గోకాపరి నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకవేళ గ్రామంలో పశువుల సంఖ్య పెరిగితే దానికి అనుగుణంగా ఇద్దరూ లేదో ముగ్గురు కాపర్లను నియమించే అవకాశం ఉందన్నారు. ఎంపికైన ప్రతి గో సంరక్షకుడికి ప్రతినెల పదివేల చొప్పున వేతనం కూడా అందించబోతున్నారు.
ఈ పథకంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ వేతనాలను ప్రభుత్వం నేరుగా తన ఖజానా నుంచి కాకుండా ప్రజా భాగస్వామ్యంతో చెల్లించబోతున్నట్లు తెలిపింది. స్థానిక గ్రామస్తులతో పాటు దాతలు, స్వచ్ఛంద సంస్థల నుంచి సేకరించిన విరాళాల ద్వారా ఈ నిధులను సమకూర్చబోతున్నట్లు తెలిపింది. దీనివల్ల సమాజంలో గోవుల పట్ల బాధ్యత పెరగడమే కాకుండా.. స్థానికంగా చాలామందికి ఉపాధి అందుతుందని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది.
అలాగే ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉండే బీడు భూములతో పాటు ఇతర ప్రభుత్వ భూములను కబ్జాకు గురికాకుండా కూడా కాపాడవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది. పశువు కాపర్లు.. ఆవులకు మేత అందించిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ ప్రదేశాల్లో వాటి విశ్రాంతి కోసం అక్కడే ఉంచుతారు. ఇదిలా ఉంటే మరోవైపు పశువుల సంరక్షణ మెరుగు పడుతుంది. దీంతోపాటు పాల ఉత్పత్తి పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్రంలోని 14 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Motorola Edge 70 Fusion Launch Date In India Telugu: ఇప్పుడు భారత మార్కెట్లో మోటరోలా మొబైల్స్కి ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే చాలా తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్తో అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్స్ బ్రాండ్లలో మోటరోలా కూడా ఒకటి. ఈ కంపెనీ విడుదల చేసే మొబైల్స్ చాలా తక్కువ ధరల్లోనే ప్రీమియం డిజైన్తో అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో లభిస్తూ ఉంటాయి. అయితే, దీనిని గుర్తించిన యువత ఎక్కువగా ఈ బ్రాండ్ కు సంబంధించిన స్మార్ట్ఫోన్స్ను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మోటరోలా కంపెనీ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్స్ను మార్కెట్లోని వినియోగదారులకు పరిచయం చేస్తూనే వస్తోంది. ఇదిలా ఉంటే.. మోటరోలా కంపెనీ అతి త్వరలోనే మరో స్మార్ట్ ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఏంటో? దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మోటరోలా కంపెనీ మార్కెట్లోకి తమ కొత్త ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మొబైల్కు సంబంధించిన కొన్ని వివరాలు ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో ల్యాండింగ్ పేజీలో ప్రత్యక్షమవుతున్నాయి. దీనిని కంపెనీ వచ్చే నెలలోనే విడుదల చేయబోతున్నట్లు కూడా ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే, మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్ చాలా అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. ఇది డిజైన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్కు సంబంధించిన లాంచింగ్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మార్చి రెండవ తేదీన అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా అప్పుడే వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ మొబైల్ మొత్తం నాలుగు రంగుల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాంటోన్ సిల్హౌట్ లెదర్ ఇన్స్పైర్డ్, పాంటోన్ బ్లూ సర్ఫ్ లెదర్ ఇన్స్పైర్డ్ కలర్స్ హైలెట్ అవుతాయి.ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని మొట్టమొదటిసారిగా కంపెనీ OIS సపోర్ట్తో సోనీ LYT-710 50-మెగాపిక్సెల్ కెమెరాతో విడుదల చేయబోతోంది..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
అలాగే ఈ మొబైల్ కెమెరా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉండబోతోంది. ముఖ్యంగా తక్కువ లైటింగ్లో కూడా అద్భుతమైన ఫోటోలను అందించేందుకు స్పెషల్ ఫీచర్స్ కూడా లభిస్తాయి. దీంతోపాటు వీడియోల కోసం కొన్ని రకాల స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఫ్రంట్ భాగంలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఫోర్ కె రికార్డుకు కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీతో లాంచ్ కాబోతోంది. అలాగే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది. దీంతోపాటు మరెన్నో ఫీచర్స్ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్కు సంబంధించిన ధరను మార్చి రెండవ తేదీనే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nirmala Sitharaman Telugu Latest News: గత కొద్ది రోజుల నుంచి బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న మిస్ సేలింగ్ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఖాతాదారులకు వారి అవసరంతో సంబంధం లేకుండా.. బ్యాంకింగ్ సేల్స్ విభాగం బలవంతంగా బీమా పాలసీలను విక్రయించడంపై మంత్రి బ్యాంకర్లను హెచ్చరించారు.. భారత రిజర్వు బ్యాంకు కేంద్ర బోర్డు సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో భాగంగా ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యల వెనక ఏం జరిగి ఉంటుంది? కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై పూర్తి సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలోని అన్ని బ్యాంకులు తమ ప్రధాన విధులను విస్మరిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. చాలా బ్యాంకులు తమకు వచ్చి లాభాల కోసం లేదా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే కమిషన్ల కోసం ఖాతాదారులపై ఒత్తిడి తెస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నట్లు ఆమె మీడియా సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. బ్యాంకులకు వచ్చే సర్వసాధారణ సామాన్యుడికి బీమా పాలసీలు అవసరమా లేదా అనేది చూడకుండా.. వాటిని బలవంతంగా అంటగట్టడం ఏమాత్రం సరికాదు.. ఇలాంటి పద్ధతులను తక్షణమే నిలిపివేయాలని ఆమె మీడియా ముఖంగా స్పష్టం చేశారు.
అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడుతూ బ్యాంకుల ప్రాథమిక బాధ్యతలను గుర్తు చేస్తూ పలు సూచనలు చేశారు.. ప్రజల నుంచి పొదుపును ప్రోత్సహించి డిపాజిట్లను పెంచడంపై బ్యాంకర్లు దృష్టి సాధించాలన్నారు. అంతేకాకుండా అర్హులైన వారికి ముఖ్యంగా చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలకు సకాలంలో రుణాలు అందేలా చూడాలని తెలిపారు. అలాగే వినియోగదారులకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులను నడపాలని సూచించారు.
రుణాల మంజూరు సమయంలోనే కస్టమర్లతో ఇన్సూరెన్స్ పేపర్లపై సంతకాలు చేయించుకోవడం, ఇన్సూరెన్స్ తీసుకుంటేనే లోన్ వస్తుందని బెదిరించడం వంటి చర్యలు చట్ట విరుద్ధమని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ గుర్తు చేశారు. ఇలాంటి అక్రమ విక్రయాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరిస్తుందని.. బ్యాంకులు తమ నైతిక విలువలను కాపాడుకోవాలని ఆమె తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం పెరగాలంటే.. అది కేవలం లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో పని చేయాలని నిర్మల సీతారామన్ బ్యాంకులకు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Maoist Ganapathi Telugu Latest News: భారత మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఒక అత్యంత కీలక అధ్యయనం ముగింపు దశకు చేరుకుందని మనం భావించవచ్చు.. దశాబ్దాల పాటు నిషేధిత మావోయిస్టు పార్టీని నడిపించిన మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి అచూకీని పోలీసులు గుర్తించారు.. గత కొంతకాలంగా ఆయన ఎక్కడ ఉంటున్నారనే దానిపై ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ప్రస్తుతం ఆయన నేపాల్ లో ఉంటున్నట్లు పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. అయితే, గణపతి అక్కడ ఉండడానికి గల కారణాలేంటి? భారతదేశాన్ని వదిలి నేపాల్ వెళ్లిపోవడం వెనక ఉన్న అసలైన రీజన్ ఏంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గణపతి గత కొన్ని ఏళ్ల నుంచి అండర్ గ్రౌండ్ లో పనిచేస్తూ ఉన్నారు. అయితే వయస్సు పెరగడంతో వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.. గత కొద్ది రోజుల నుంచి తీవ్ర అనారోగ్యం కారణంగా గణపతి 2018 లో పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారని, వైద్య సహాయం కోసం నేపాల్ ను ఆశ్రయించారని తెలుస్తోంది. మానవీయ కోణంలో ఆయనను భారత్కు రప్పించి.. తెలంగాణ పోలీసుల ఎదుట నింగి పోయేలా చేసేందుకు ఉన్నత అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. ఈ దిశగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు మధ్యవర్తులతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది..
మరోవైపు బాబు ఈస్ట్ పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఒక్కొక్కరిగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.. తాజాగా అందిన సమాచారం ప్రకారం తెలంగాణ పోలీస్ ఎదుట నలుగురు అత్యంత కీలకమైన రావోయిస్టు నేతలు లొంగిపోవడానికి సిద్ధమయ్యారట.. అందులో తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జి పార్టీ సెంట్రల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.. ఈయనపై కోటి రివార్డు కూడా ఉంది. అలాగే దామోదర్ అలియాస్ బడే చొక్కా రావు తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ.. అంతేకాకుండా సంగ్రామ్ ఆలియాస్ మల్లా రాజిరెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడు, నరసింహారెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడు వీరంతా అతి త్వరలోనే పోలీసుల ముందు లొంగిపోబోతున్నట్లు తెలుస్తోంది.
నక్సిలిజాన్ని తొలగించే దిశగా కేంద్రం చేపడుతున్న ప్రత్యేకమైన ఆపరేషన్లలో భాగంగా వీరంతా లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 2026 సంవత్సరం మార్చి గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయి నేతలు లొంగిపోవడం పార్టీకి కోలుకో లేని దెబ్బగా మారింది.. గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో పాటు అగ్ర నేతల మరణాలు, అంతర్గత విభేదాల వల్ల పార్టీ కేడర్ పూర్తిగా దెబ్బ తింటూ వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా వీరి లొంగుబాటుతో పార్టీ బలహీనంగా మారే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు..
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
HYDRAA Commissioner: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లా పని చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేశారు. 'సున్నం చెరువులో 5 ఎకరాల భూమిని వదిలేసి మళ్లీ ఫెన్సింగ్ వేశారు. కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్లో సర్వే నెంబర్ 29, 30 ప్రభుత్వ భూమిపై అసోసియేషన్ సభ్యులు ఆర్టీఏ పెట్టారు. 2017లో తమ ప్రభుత్వం కోట్ల రూపాయలతో చెరువులకు ఫెన్సింగ్ వేశాం. అల్లాపూర్ డివిజన్లో సున్నం చెరువు రూ.47 లక్షల తో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నివేదికతో ఫెన్సింగ్ వేస్తాం. ఇప్పుడు కమిషనర్ 5 ఎకరాలు వదిలేస్తున్నారు' అని ఆరోపించారు.
Also Read: Russells Viper: తీవ్ర విషపూరితమైన పాము నుంచి కొడుకును రక్షించిన తండ్రి
హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. '2017లో అధికారులు ఇచ్చిన సమాచారం వదిలేసి 2014 ఇచ్చిన దానిని ప్రామాణికం తీసుకోవడం ఏమిటి? సున్నం చెరువుపై పూర్తి విచారణ జరపాలి' అని బీఆర్ఎస్ పార్టీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా మేము భూమిని కాపాడాలని కోరుతుంటే ఏకంగా వదిలిపెడుతున్నారని హైడ్రా కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇంట్లో ఉన్న వారిని బయట పడేసి ఇండ్లు కూల్చారు. చదువుకునే పిల్లలను కూడా వేడుకుంటే వినలేదు. హైదరాబాద్లో ఉన్న టాప్ 10 బిల్డర్ను కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు.. స్పందించారు' అని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.
Also Read: Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. అదనంగా రూ.10 లక్షలు
'సున్నం చెరువు, మైసమ్మ చెరువును పట్టించుకోరు. ఐడీఎల్ను అభివృద్ధి చేస్తే అక్కడ లైట్స్ వెలగవు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై కక్ష సాధింపు చేస్తున్నారు. ఆల్విన్ కాలనీలో ఫెన్సింగ్ వేశారు. ఎవరు కూడా అక్కడ కబ్జా పెట్టలేదు.. అక్కడ పేదలు కూరగాయలు పెట్టుకునే అమ్ముకుంటే ఫెన్సింగ్ వేసి ఇబ్బంది పెట్టారు' అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిని ప్రభుత్వంతో మాట్లాడి ప్రజా వినియోగంలోకి తీసుకొని వచ్చానని గుర్తుచేశారు. ఐదు ఎకరాలు ఉన్న భూమి ఎందుకు వదిలేసి ఫెన్సింగ్ వేశారో ప్రజలకు హైడ్రా కమిషనర్ సమాధానం చెప్పాలని కోరారు.
Also Read: Lack Of 108 Ambulance: ఏపీలో దారుణం.. 108 అంబులెన్స్ లేక ఎడ్లబండిపై భార్య తరలింపు
'ప్రజల కట్టిన డబ్బుతో మీరు జీతం తీసుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. కమిషనర్ తీరుపై సెంట్రల్ విజిలెన్స్తోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం' అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకటించారు. 'అల్లాపూర్లోని ముస్లిం శ్మశానవాటిక విషయంలో కమిషనర్ తానే ఇస్తానని చెప్పడం ఏమిటి? నువ్వు వచ్చి ఇస్తానని చెప్పడానికి నువ్వు ఏమైనా ముఖ్యమంత్రివా?' అని హైడ్రా కమిషనర్ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 'హైదరాబాద్లో 90 శాతం పైగా భూములు భారీగా ఉన్నాయి. హైడ్రా అభివృద్ధికి ఎమ్మెల్యేగా సహకరిస్తా. కానీ పేదల జోలికి వస్తే ఊరుకోను' అని హెచ్చరించారు. సున్నం చెరువు పై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Malavya Yoga Effect On Zodiac Telugu: మార్చి 2026లో అనేక గ్రహాలు కదలికలు చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు అరుదైన నక్షత్రాల్లోకి ప్రవేశించబోతున్నాయి. ఈ సమయంలో శుక్రుడులాంటి అద్భుతమైన గ్రహం కదలికలు జరపడం విశేషం.. ముఖ్యంగా మార్చి రెండవ తేదీన శుక్రుడు కుంభరాశి నుంచి బయలుదేరి.. మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలోనే ఎంతో శుభప్రదమైన మాలవ్య రాజయోగం ఏర్పడబోతోంది. మార్చి 15వ తేదీన సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ సూర్యుడు, శుక్రుడు, శని గ్రహాల కలయిక జరుగుతుంది. ఇక ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన త్రిగ్రహి రాజయోగం ఏర్పడుతుంది. హోలీ సమయంలో ఈ గ్రహ కలయికల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. ఆర్థికంగా ఎంతో మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి ఊహించని రాశి ఫలాలు:
వృషభ రాశి
ముఖ్యంగా శుక్రుడు సంచార ఫలితంగా వృషభ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి శుక్రుడు ఉన్నత స్థానంలో ఉండడం వల్ల ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. మార్చి నెలలో అద్భుతమైన పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు.. ఈ సమయంలో విస్తరణలు కూడా జరుగుతాయి. కొత్త ఆదాయ వనరులు కూడా లభించడంతో.. కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. సన్నిహితుల సపోర్టుతో అన్ని రంగాల్లో బాగా రాణించగలుగుతారు.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అత్తిక స్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. పనుల్లో పాల్గొనే వ్యక్తులకు సృజనాత్మకత కూడా పెరుగుతుంది. గరిష్ట స్థాయిలో లాభాలు కూడా పొందుతారు. పనుల్లో ప్రశంసలు లభించడమే కాకుండా.. సామాజిక హోదా కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది.. పోటీ పరీక్షలు రాయాలనుకుంటున్న వ్యక్తులు ఈ సమయంలో మంచి జ్ఞానంతో.. పరీక్షలు రాసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబంలో శుభ సంఘటనలు ఏర్పడే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించడం వల్ల అనుకున్న విజయాలు కూడా సాధించగలుగుతారు. దీంతోపాటు ఆర్థికంగా చాలా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శుక్రుడు ప్రభావంతో అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే సామర్థ్యం కూడా విపరీతంగా పెరిగి అద్భుతమైన ప్రయోజనాలు ముందే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా గుర్తింపు పొందగలుగుతారు. విదేశీ వ్యాపారాలు చేస్తున్న వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్య పరిస్థితిని కూడా కొంతవరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
March Lucky Zodiac Sign 2026 Telugu: మార్చి నెల ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాబోయే మార్చి నెల చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా మార్చి రెండవ తేదీ నుంచి 5వ తేదీ మధ్య అనేక ప్రధాన గ్రహాలు నక్షత్ర మార్పులతో పాటు రాశి సంచారాలు జరుపుతాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన గ్రహాలు ఈ సమయంలో కదలికలు జరపడం విశేషం..మార్చి రెండున శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.. ఆ తర్వాత మూడో తేదీన కుజుడు శతభిషా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు.. ఆ తర్వాతిరోజే శుక్రుడు మళ్ళీ ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా మార్చి ఐదున సూర్యుడు పూర్వభాద్ర పాద నక్షత్రంలోకి, మార్చి ఐదున సూర్యుడు అదే నక్షత్రంలోకి సంచారం చేస్తాయి. ఈ సమయంలో అనేక గ్రహాలు సంచారం చేయడం కారణంగా.. కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మిథున రాశి
మిధున రాశి వారికి ఈ సమయంలో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గణనీయమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా.. కష్టపడి పనులు చేసే వారికి అద్భుతమైన ప్రశంసలు లభిస్తాయి. అలాగే ఈ సమయంలో బహుమతులు కూడా పొందవచ్చు.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు రెండింటిలోనూ పురోగతి సాధించే అవకాశాలున్నాయి. అలాగే కోపంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ.. కొన్ని రకాల మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తులారాశి
తులారాశి లో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఊహించని విజయాలు కలగడమే కాకుండా.. కెరీర్ పరంగా స్థిరత్వం చాలా వరకు పెరుగుతుంది. ముఖ్యంగా నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇంటర్వ్యూ లేదా పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడమే కాకుండా.. నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆర్థికంగా చాలా వరకు బలం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కొత్త అవకాశాలు లభించడమే కాకుండా.. పదోన్నతులు కూడా తిరిగి పొందుతారు. కొత్త కొత్త బాధ్యతలను పొంది జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం ఎంతో అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ముఖ్యంగా పదోన్నతులకు సంబంధించిన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఆర్థిక పరిస్థితులు బలంగా మారుతాయి. జీవితం మరింత సమతుల్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా అనుకుంటున్న పనులు కూడా చేయగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Russells Viper Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న తన కుమారుడిపైకి అత్యంత విషపూరితమైన పాము రక్తపింజరి దూసుకొచ్చింది. పాము తనపై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. 'నాన్న పాము' అంటూ ఆ కొడుకు ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లి తన నాన్నకు చెప్పాడు. అది చూసి విస్తుపోయిన తండ్రి పాము బారి నుంచి తన కొడుకుతోపాటు తన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆ తండ్రి భావించాడు. సాహసంతో అత్యంత విషపూరితమైన ఆ పాము నుంచి కుటుంబాన్ని కాపాడాడు. ఈ పోరాటంలో రక్తపింజరి చనిపోయింది. హైదరాబాద్లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Lack Of 108 Ambulance: ఏపీలో దారుణం.. 108 అంబులెన్స్ లేక ఎడ్లబండిపై భార్య తరలింపు
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఎర్రబోడ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వాచ్మెన్ రమేశ్ కుటుంబం నివసిస్తోంది. ఉదయం కావడంతో ఇంటి ముందు అతడి మూడేళ్ల కుమారుడు ఆడుకుంటూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అకస్మాత్తుగా అత్యంత విషపూరితమైన రక్తపింజరి అక్కడకు వచ్చింది. ఆటలో లీనమైన ఆ బాలుడు పామును పట్టించుకోలేదు. కానీ బుసలు కొడుతూ ఆ పాము దాడి చేసేందుకు ప్రయత్నించింది.
Also Read: Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. అదనంగా రూ.10 లక్షలు
అప్రమత్తమైన మూడేళ్ల బాలుడు వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయాడు. భయంతో అరుస్తూ తండ్రి రమేశ్ వద్దకు పరుగెత్తాడు. నాన్న పాము వచ్చిందని చెప్పడంతో ఆ కుటుంబం భయాందోళనకు గురయ్యింది. అప్రమత్తమైన వాచ్మెన్ వెంటనే పెద్ద కర్ర తీసుకుని బయటకు వచ్చాడు. కుటుంబాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించి పామును తరిమేందుకు ప్రయత్నించాడు. కర్రతో దాడి చేయడంతో రక్తపింజరి పాము తీవ్రంగా గాయపడి అక్కడే చనిపోయింది.
Also Read: Nara Lokesh: ఇందాపూర్ డెయిరీకి.. హెరిటేజ్కు సంబంధం లేదు: నారా లోకేశ్
పాము చనిపోవడంతో ఆ కుటుంబంతోపాటు అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆటలో లీనమైన కుమారుడిని పాము బారి నుంచి తండ్రి రమేశ్ తప్పించడంతో బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. అయితే తరచూ పాముల సంచారం పెరిగిపోయిందని.. ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉంటున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని పాముల బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనతో చిన్నపిల్లలను ఒంటరిగా బయట ఉండనివ్వొద్దని నిర్ణయం తీసుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mumbai Dharavi Slum Business: ముంబైలో.. ఆకాశహర్మ్యాల నీడలో.. టిన్ షీట్లు.. ఆస్బెస్టాస్ పైకప్పులతో విస్తరించిన ఒక ప్రపంచం ఉంది. బయటివారికి అది మురికివాడ. కొందరికి బతుకుదెరువుకు బాసటగా నిలిచే ప్రదేశం. మరికొందరికి సినిమాలు.. నవలలు సృష్టించిన ఒక ప్రతీక. కానీ ఈ ఇరుకైన వీధుల్లో అడుగు పెట్టిన క్షణం నుంచి ఆ అభిప్రాయాలు ఒక్కొక్కటిగా కూలిపోతాయి. ఎందుకంటే ఇది కేవలం పేదరికం కథ కాదు. ఇది పట్టుదల, ప్రతిభ, వ్యాపార మేధస్సు, అసాధారణ జీవన శక్తి కథ.
ముంబైలో దాదాపుగా 593 పైచిలుకు ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాంతమే ధారవి. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది జనాభా నివసిస్తారు. నిజానికి ఇది ఒకప్పుడు మురికివాడ కాదు. 19వ శతాబ్దానికి ముందు ధారవి ప్రాంతం ఒక పెద్ద పల్లెటూరుగా ఉండేది. చేపలు పట్టుకుని బతికే కోలి కులస్తులు ఇక్కడ ఉండేవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కోలివాడ అని కూడా పిలిచేవారు. 1850 తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ముంబై నగరానికి రావడం మొదలైంది.
ఇలా వచ్చిన నిరుపేదలంతా ధారవిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. తొలి రోజుల్లో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ధారవి ప్రాంతానికి వచ్చి సెటిలయ్యారు. అందుకే ధారవిని చోటా తమిళనాడు అని కూడా అనేవారు. తర్వాతి కాలంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చారు. దీంతో ధారావీ ఒక మినీ ఇండియాగా మారిపోయింది.
ప్రఖ్యాత రచయిత Salman Rushdie.. ధారావిని అర్థం చేసుకోవాలంటే అక్కడ నెలల తరబడి జీవించాల్సిందే అని చెప్పారు. ఆయన చెప్పిన మాటలో సత్యం ఉంది. ఇక్కడి వాస్తవం ఒక రోజు పర్యటనతో కనిపించదు. ఇరుకైన గల్లీలు, తడి గోడలు, మూసుకుపోయిన కాలువలు.. ఇవి ఒక వైపు. మరోవైపు, అదే గల్లీలలో నడుస్తున్న కోట్ల రూపాయల వ్యాపారం. ఇది ఒక కాలువ.. కానీ అది బంగారంతో తయారు చేసింది అని ఇక్కడే జన్మించిన ప్లంబర్ రాజు హనుమంత అంటాడు. అతని మాటల్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే కేవలం 2.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. అంచనాల ప్రకారం వార్షిక టర్నోవర్ రూ. 9,000 కోట్లకు మించి ఉంటుంది.
ధారావిని సిటీ వితిన్ ఎ సిటీ అంటారు. ఎందుకంటే ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఇక్కడే పనిచేసి జీవితాన్ని ముగించే లక్షలాది మంది ఉన్నారు. కానీ ఈ చిన్న నగరం ముంబై మహానగరానికి ఒక గొప్ప శక్తి కేంద్రం. దక్షిణ ముంబైలోని Ballard Estate లేదా Bandra Kurla Complex లో ఒప్పందాలు కుదురుతుంటే, వాటి మూలాలు చాలాసార్లు ధారావి గల్లీల్లోనే మొదలవుతాయి. ఇక్కడ భూమి చవక అని అనుకోవడం పెద్ద పొరపాటు. నివాస గదులు నెలకు రూ. 3,000 నుంచి రూ. 7,000 వరకు ఉంటాయి. కొత్తగా ముంబైకి వచ్చే కార్మికులకు ఇది పెద్ద ఊరటగా అనిపిస్తుంది. ఇక్కడ నివసించాలంటే పోలీస్ వెరిఫికేషన్ అవసరం లేదు. ఎక్కువ ప్రశ్నలు అడిగేవారు ఉండరు. ఒకే షరతు నెలవారీ అద్దె నగదుగా చెల్లించాలి.
కానీ వాణిజ్య దుకాణాల విషయానికి వస్తే పూర్తిగా మారుతుంది. 1,200 నుంచి 1,800 చదరపు అడుగుల షాప్కు నెలకు రూ. 1.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రాథమిక సౌకర్యాలు లేకున్నా, వ్యాపారం బలంగా ఉండటం వల్లే ఈ రేట్లు. ప్రతి అంగుళం భూమి ఇక్కడ విలువైనదిగా మారింది. ధారావి ఆర్థిక హృదయం అంటే తోలు పరిశ్రమ. 19వ శతాబ్దం చివరలో ప్రారంభమైన ఈ వృత్తి ఇప్పటికీ ఇక్కడ ప్రధాన ఆధారం. వేలాది చిన్న వర్క్షాపుల్లో బ్యాగులు, జాకెట్లు, బూట్లు, సాడిల్స్ తయారవుతాయి. ఈ ఉత్పత్తులు యూరప్, అమెరికా మార్కెట్లకు చేరతాయి. ఒక్కో సంచిపై కార్మికుడికి రూ. 200–రూ. 300 లాభం వచ్చినా, భారీ ఉత్పత్తి వల్ల మంచి ఆదాయం వస్తుంది. కొందరు వ్యాపారులు రోజుకు రూ. 20,000 వరకు సంపాదిస్తారు.
తోలు కాన్పూర్, చెన్నై వంటి నగరాల నుంచి వస్తుంది. ఇక్కడి చేతివృత్తులవారు దానిని విలువైన ఉత్పత్తులుగా మారుస్తారు. ప్రభుత్వ మద్దతు, ఆధునిక యంత్రాలు ఉంటే గూచీ, ప్రాడా వంటి బ్రాండ్లకు పోటీ ఇవ్వగలమని స్థానిక శిల్పులు చెబుతారు. కేవలం తోలు మాత్రమే కాదు. కుంహర్వాడ ఆసియాలోనే అతిపెద్ద కుండల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్కు చెందిన కుటుంబాలు తరతరాలుగా ఇక్కడ మట్టి కళను కొనసాగిస్తున్నాయి. దీపాలు, పూలకుండలు, అలంకార వస్తువులు దేశమంతటా సరఫరా అవుతుంటాయి. దీపావళి సమయానికి ఇక్కడ పగలు-రాత్రి తేడా ఉండదు. అయితే ఫర్నేస్ల నుంచి వచ్చే పొగ కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇది ఈ విజయానికి ఉన్న మరో చేదు నిజం వంటిది.
ధారావి వీధుల్లో తెల్లవారుజామునే జీవితం మొదలవుతుంది. ఉదయం 2:30కే ఇడ్లీ, వడ తయారీ ప్రారంభమవుతుంది. 5 గంటలకల్లా వేల కిలోల ఆహారం సిద్ధమై ముంబై అంతటా పంపిణీ అవుతుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి వచ్చిన కుటుంబాలు ఈ ఆహార వ్యాపారాన్ని నడుపుతున్నాయి. ఇది నగరానికి కనిపించని కానీ కీలకమైన ఆర్థిక వ్యవస్థ అని చెప్పాలి. ఇంకా ఒక గొప్ప శక్తి.. రిసైక్లింగ్ పరిశ్రమ. ముంబై చెత్తలో దాదాపు 80శాతం ఇక్కడే పునర్వినియోగం అవుతుంది. రోజుకు వేల టన్నుల వ్యర్థాలు వర్గీకరిస్తారు. ప్లాస్టిక్ను శుభ్రపరచి, కట్ చేసి, ఎండబెట్టి మళ్లీ వినియోగానికి సిద్ధం చేస్తారు. ఇది ప్రమాదకరమైన పని.. పాత సూదులు, గాజు ముక్కలు గాయాలకు కారణమవుతాయి. అయినప్పటికీ లక్షలాది కుటుంబాల జీవనోపాధి దీనిపై ఆధారపడి ఉంది.
ధారావి విస్తీర్ణం బాంద్రా, మాహిమ్, మాతుంగా, సియోన్, కుర్లా, చునాభట్టి, కింగ్స్ సర్కిల్ ప్రాంతాల వరకు వ్యాపించింది. బాంద్రా స్టేషన్ పశ్చిమ వైపు విలాసవంతమైన బంగ్లాలు ఉంటే, తూర్పు వైపు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ధారావి ప్రారంభమవుతుంది. ఒకే నగరంలో రెండు విభిన్న ప్రపంచాలు. ఇప్పుడు పునరాభివృద్ధి ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. కొందరికి ఇది ఆశ. మరికొందరికి భయం. కొత్త భవనాలు నిర్మిస్తే ఉద్యోగాలు, గుర్తింపు కోల్పోతామేమో అన్న ఆందోళన ఉంది. భవనాలు మారవచ్చు, కానీ ధారావి ఆత్మ మారదు.. అని స్థానికులు అంటున్నారు.
ధారావి అంటే మురికివాడ మాత్రమే కాదు. అది శ్రమ, స్వప్నం, ఆత్మగౌరవం. ప్రతి రోజూ ముంబై నగరాన్ని తన భుజాలపై మోసే వేలాది కార్మికుల కథ. బయటివారికి ఇది కాలువలా కనిపించవచ్చు. కానీ లోపలికి వెళ్లి చూడగానే తెలుస్తుంది... ఇది నిజంగా బంగారంతో తయారైన ఒక ప్రపంచం అని.
Also Read: EPFO: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హయ్యర్ పెన్షన్ రీస్టార్ట్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook