ప్రొఫెసర్ జైశంకర్ 90వ జయంతి వేడుకలు
ప్రొఫెసర్ జైశంకర్ 90వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్లోని ప్రొఫెసర్ జైశంకర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు, విశ్వకర్మ పంచ వృత్తి దారుల సంగ నాయకులు, కార్పొరేటర్ భిక్షపతి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమనేత జాతిపిత అని, ప్రభుత్వ శక్తితో జయశంకర్ జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
బిల్డర్ నన్ను మోసం చేశాడు అంటూ హైదర్ నగర్ మేస్త్రీ రాము సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు ఇవ్వాల్సిన రూ.8 లక్షలు ఇవ్వలేదని, మొత్తం నగదు ఇస్తేనే సెల్ టవర్ దిగుతానని పట్టబట్టాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని అతడికి సర్ది చెప్పగా కిందికి దిగాడు।
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రాధికారులతో మరియు వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసి అధికారులతో నల్లచెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని చెరువు అభివృద్ధి కొరకు ఇప్పటికే నిధులు మంజూరైన కారణంగా త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే వర్షాలు పడినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా పైప్లైన్ నిర్మాణం ,రిటర్నింగ్ వాల్స్ చేపట్టి దిగువకు నీరు వెళ్లే విధముగా చూడాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.