ప్రొఫెసర్ జైశంకర్ 90వ జయంతి వేడుకలు
Hyderabad, Telangana:ప్రొఫెసర్ జైశంకర్ 90వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్లోని ప్రొఫెసర్ జైశంకర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు, విశ్వకర్మ పంచ వృత్తి దారుల సంగ నాయకులు, కార్పొరేటర్ భిక్షపతి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమనేత జాతిపిత అని, ప్రభుత్వ శక్తితో జయశంకర్ జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
విలువైన ఖనిజ నిల్వలు ఎక్కడ ఉన్నాయో మ్యాపింగ్ చేయండి: సీఎం చంద్రబాబు
Amaravathi, Andhra Pradesh:Chandrababu Review: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వలను గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్తో పాటు విలువైన లోహాలు లభ్యమయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని చెప్పారు. రాష్ట్రంలో వెలికితీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైన దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి మ్యాపింగ్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదకు సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మార్కెట్ క్యాపిటలైజేషన్కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీ ద్వారా విలువైన ఖనిజాల మార్కెట్ క్యాపిటలైజేషన్కు అవకాశం ఉందని గుర్తుచేశారు. దీనిపై నిపుణులతో కలిసి అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు.
బీచ్ శాండ్, రేర్ ఎర్త్ మినరల్స్, ముడి ఇనుము, మాంగనీస్, అల్యుమినా లాంటి వివిధ ఖనిజాలకు విలువ జోడింపు ప్రక్రియ ద్వారా గరిష్టంగా రెవెన్యూను ఆర్జించేందుకు ఆస్కారం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఖనిజ ఆదాయం కారణంగానే రెవెన్యూ మిగులు సాధించాయని చెప్పారు. ఖనిజాల వ్యాల్యూ అడిషన్కు సంబంధించి విస్తృతంగా చర్చించి ఓ ప్రత్యేక విధానం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఈ ఖనిజాల విలువ జోడింపు ప్రక్రియ జరిగేలా చూడాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ లాంటి రాష్ట్రాల్లో లభ్యమయ్యే అత్యంత విలువైన రేర్ ఎర్త్ మినరల్స్పై క్లస్టర్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టైటానియం, ఇలమనైట్, మోనజైట్ లాంటి హై వాల్యూ మినరల్స్ నిల్వలు ఏ మేరకు ఉన్నాయనే దానిని గుర్తించాలని సూచించారు. ఎలక్ట్రానిక్స్, మాగ్నెట్స్ సహా విలువైన లోహాలను తయారు చేసేందుకు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీత జరగాలని చెప్పారు. ప్రత్యేకమైన పరికరాల తయారీకి కీలకమైన ఈ లోహాలు అణు ఇంధనం సహా వ్యూహాత్మకంగా దేశానికి కూడా అత్యంత కీలకమని గుర్తుచేశారు. రాష్ట్రంలో జొన్నగిరి సహా చిత్తూరు జిల్లా చిగురుగుంట వద్ద కూడా బంగారం నిల్వలు ఉన్నాయని.. మిగతా బ్లాక్స్పై కూడా అధ్యయనం చేయాలని గనుల శాఖకు సూచనలు ఇచ్చారు.
రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్ ఖనిజాలు సహా ఇతర విలువైన ఖనిజాలను గుర్తించినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూలో 18 శాతం మేర వృద్ధి నమోదైనట్టు తెలిపారు. గనుల తవ్వకాలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం ఆదేశించారు. ఖనిజ సంపద ద్వారా రాష్ట్రానికి గరిష్ట ఆదాయం వచ్చేలా చూడాలని సూచించారు. ఇసుక తవ్వకాలు, సరఫరాపై కూడా పూర్తి స్థాయి నిఘా ఉంచాలని చెప్పారు. ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలతోపాటు శాటిలైట్ చిత్రాల ద్వారా విశ్లేషించడం, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఏర్పాటు చేయాలని వివరించారు. ప్రజల కోసమే ఇసుకపై వెయ్యి కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని వదిలేసి ప్రభుత్వం ఉచితంగా అందిస్తోందని.. ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ దూకుడు.. ఒకేసారి 28 జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జిల నియామకం
Amaravathi, Andhra Pradesh:BJP Appointments: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీ రానున్న రోజుల్లో మరింత బలోపేతం కావాలని.. అత్యధిక స్థానాలు గెలుపొందే వ్యూహం రచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాల వారీగా ఇన్చార్జ్లను బీజేపీ నియమించింది. ఏపీలోని 28 జిల్లాలకు ఇన్ఛార్జిల నియమిస్తూ కాషాయ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడానికి నియమాకాలు చేపట్టినట్లు బీజేపీ తెలిపింది.
సామాజిక సమతూకం
ఆంధ్రప్రదేశ్లో పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేయడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కొత్త జిల్లా ఇన్ఛార్జిలను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, బూత్ కమిటీల బలోపేతం, సంస్థాగత విస్తరణ, సభ్యత్వ నమోదు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, పార్టీ కార్యక్రమాల సమన్వయం వంటి బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జిలు నిర్వహించనున్నారని మాధవ్ వెల్లడించారు. జిల్లా అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, వివిధ మోర్చాల నాయకులతో సమన్వయం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని కొత్త ఇన్చార్జ్లకు సూచించారు. ఇన్చార్జ్ల నియామకంలో పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక సమతూకం పాటించి ఇన్చార్జ్ బాధత్యలు అప్పగించారు.
పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు
పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు ఈ నియామకాలు దోహదపడతాయని పీవీఎన్ మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జిలు స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ సంస్థాగత కార్యక్రమాలను వేగవంతం చేయాలని కొత్త ఇన్చార్జ్లకు సూచించారు. పార్టీ విస్తరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేయడమే ఈ నియామకాల ప్రధాన ఉద్దేశమని ప్రకటించారు.
జిల్లా ఇన్ఛార్జిల వివరాలు
పార్వతీపురం మన్యం: పోలిమేర శ్రీనివాసరావు
అల్లూరి సీతారామరాజు: పుట్ట గంగయ్య
పోలవరం: గాడే శ్రీనివాసరావు
శ్రీకాకుళం: రవీందర్ రెడ్డి మేడపాటి
విజయనగరం: ఎన్. విజయానంద రెడ్డి
విశాఖపట్నం: రెడ్డి పావని
అనకాపల్లి: ఏపీఆర్ చౌదరి
కాకినాడ: ఆకుల శ్రీధర్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ: కరంకి శ్రీనివాస్
తూర్పు గోదావరి: బుద్ధా లక్ష్మీనారాయణ
పశ్చిమ గోదావరి: శ్రీదేవి రేలంగి
ఏలూరు: రామ్ కుమార్ చిలుకూరి
కృష్ణా: భోగిరెడ్డి ఆదిలక్ష్మి
ఎన్టీఆర్: వెంకట సుబ్బారావు నార్ని (తాతాజీ)
గుంటూరు: వైవీఆర్ మోహన్ (దొరబాబు)
పల్నాడు: తొగంటి శ్రీనివాస్ (జిల్లా ఇన్ఛార్జి), ఆవుల నాగేంద్ర కుమార్ యాదవ్ (జిల్లా కో-ఇన్ఛార్జి)
బాపట్ల: గాజుల వెంకయ్య నాయుడు
ప్రకాశం: జి. భరత్ కుమార్
మార్కాపురం: కొక్కెర శ్రీనివాస్ యాదవ్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు: చంద్రశేఖర్ భీమినేని
తిరుపతి: పీవీ కృష్ణారెడ్డి
చిత్తూరు: కేవీ లక్ష్మీనారాయణ రెడ్డి
అన్నమయ్య: టీడీ వరప్రసాద్
కడప: కొల్లా చిట్టిబాబు
శ్రీ సత్యసాయి: కునిగిరి నీలకంఠ
అనంతపురం: బెస్త చంద్రప్ప
కర్నూలు: సందిరెడ్డి శ్రీనివాసులు
నంద్యాల: పీడీ పార్థసారథి (జిల్లా ఇన్ఛార్జి), అంబిలి కాశీ విశ్వనాథ్ (జిల్లా కో-ఇన్ఛార్జి)
యాదాద్రిలో మఠాలకు భూముల కేటాయింపు.. ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సీఎం కీలక ఆదేశాలు
Yadagirigutta, Telangana:Yadadri Temple: తెలంగాణ పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో పలు మఠాలు కొలువుదీరనున్నాయి. ఆలయ నగరిలో వివిధ మఠాలకు భూములు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మఠాలకు భూముల కేటాయింపునకు సంబంధించి స్పష్టమైన విధానం రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూ యాజమాన్యపు హక్కులు దేవస్థానానికే ఉండాలని చెప్పారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష చేశారు. ఆలయం పరిధిలో భూముల కేటాయింపు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని అధికారులకు తెలంగాణ సీఎం స్పష్టం చేశారు. యాదగిరిగుట్టలో హరే రామ హరే కృష్ణ (చారిటబుల్) ఫౌండేషన్ కోసం మార్కెట్ ధర ప్రకారం భూమిని కేటాయించాలని సీఎం సూచించారు.
యాదాద్రి గుట్టపైన అతిథి గృహాల నిర్మాణం కోసం ముందుకు వచ్చే వారి జాబితా రూపొందించాలని.. అతిథి గృహాల నిర్మాణాల్లోనూ టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడ అనుసరించాలని తెలంగాణ సీఎం తెలిపారు. దశల వారీగా అనుమతులు మంజూరు చేయాలని చెప్పారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపుపైన కూడా స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు.
యాదాద్రి ఆలయ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల కోసం భూ సేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని అధికారులకు తెలంగాణ సీఎం ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయం నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను సమగ్రంగా అధ్యయనంచేసి వారంలో నివేదిక ఇవ్వాలని కోరారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేయాలని అధికారులకు చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీలు నరేందర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్, ప్రభుత్వ విప్ ఐలయ్య, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితోపాటు దేవాదాయ, ఆర్థిక శాఖ అధికారులు, లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అధికారులు పాల్గొన్నారు.
వర్షాకాలంలో వేపాకులు తింటే మొటిమలు.. చర్మ సమస్యలు తగ్గుతాయా? నిపుణులు ఏమంటున్నారు?
Hyderabad, Telangana:Does Neem Treats Acne: వేప ఎంతో శక్తివంతమైనది. రక్తాన్ని శుద్ధి చేసే మూలికల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది. వేప చేదుగా ఉన్నప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇందులో డీటాక్సిఫైయింగ్ గుణాలు ఉంటాయని చెబుతారు. అందుకే దీనిని దశాబ్దాలుగా ఔషధాల్లో వాడుతున్నారు. హెల్త్ సైట్ వెబ్సైట్ ప్రత్యేక ఇంటర్వ్యూలో నిపుణుడు షఫియుల్లా హిరేహల్ నూరుద్దీన్ మాట్లాడుతూ, వేపాకు కేవలం ఒక మూలిక మాత్రమే కాదని, ఇందులో అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. వీటిలోని ఔషధ గుణాలను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఈ సీజన్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
టాక్సిన్స్ను బయటకు పంపుతుంది..
చేదుగా ఉండే ఈ వేపాకు మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత, పేరుకుపోయిన టాక్సిన్స్ను బయటకు పంపుతుంది. మెటబాలిక్ టాక్సిన్స్ వల్ల జీర్ణక్రియ మందగించి, ఒత్తిడి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. వేపాకు తీసుకోవడం వల్ల శరీరం సహజంగానే డీటాక్సిఫై అవుతుంది. ముఖ్యంగా ఇది కాలేయాన్ని శుద్ధి చేయడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి క్లీన్ చేసి, వ్యవస్థను సమతుల్యం చేస్తూ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.
వైద్యుల ప్రకారం, వేపలో బయో యాక్టివ్ మాలిక్యుల్స్ ఉంటాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల వాతావరణం మారినప్పుడు చర్మంపై బ్యాక్టీరియా లేదా ఫంగస్ పెరగకుండా ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తూ, రక్తాన్ని శుద్ధి చేసి టాక్సిన్స్ను తొలగిస్తుంది.
వేప సోరియాసిస్ను నివారిస్తుందా?
వర్షాకాలంలో దురద సమస్యలు పెరగడం, కొందరిలో చుండ్రు రావడం వల్ల చర్మ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. అయితే వేప తీసుకోవడం వల్ల ఎగ్జిమా, సోరియాసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండవచ్చు. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తూ చర్మ సమస్యలు రాకుండా చూస్తుంది. వేపలో ఉండే కూలింగ్, మైక్రోబియల్ గుణాలు జుట్టు కుదుళ్లను రక్షించి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
Also Read: బాడీ షేప్ అవుట్ అవుతోందా? హిప్ సెల్యులైట్ మాయం చేసే 7 టిప్స్.. ఆ ఆరో చిట్కాతో సూపర్ రిజల్ట్స్!
Also Read: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే రోజూ ఇవి తినాల్సిందే!
వేప మనం వివిధ రూపాల్లో వాడుతుంటాం. పళ్ళు తోముకునే పేస్ట్ నుండి షాంపూలు, సబ్బులు, బాడీ వాష్ల వరకు వేప లేని ప్రొడక్ట్ ఉండదు. పూర్వీకుల కాలం నుండి వేప పేస్ట్ను చర్మంపై రాసి ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందారు. అంతేకాకుండా, ఇది చుండ్రును తగ్గించి, జుట్టు నల్లగా, బలంగా పెరిగేలా చేస్తుంది. వేపలోని ఔషధ గుణాల వల్ల హెయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గుతుంది. వేపను 'మాస్టర్ ఆఫ్ ప్యూరిఫైయర్' అని పిలుస్తారు.. ఎందుకంటే ఇది శరీరం లోపల ,బయట కూడా ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తూ, చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.(Disclaimer: పాఠకులకు గమనిక: ఈ వ్యాసంలో అందించిన సమాచారం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఆరు గ్యారంటీల్లో కాంగ్రెస్ ఏమిచ్చింది? తెలంగాణను ఏటీఎంలా చేసుకున్న కాంగ్రెస్: నితిన్ నబిన్
Hyderabad, Telangana:Hyderabad: 'తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేకపోయింది. ఈ ప్రజావ్యతిరేక, నిద్రాణ ప్రభుత్వాన్ని ప్రజల ఆశీర్వాదంతో గద్దెదించాల్సిన అవసరం ఉంది' అని గుర్తుచేశారు. 'నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా? మహిళలకు ప్రకటించిన ఆర్థిక సహాయం అందించారా? అని ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద సమాధానం ఉండదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితిలో వారు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోవడం కన్నా ఢిల్లీ దర్బార్ను సంతోషపెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణను ఏటీఎంలా ఉపయోగించి ఢిల్లీలో తమ రాజకీయాలను నడిపిస్తున్నారు' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విమర్శించారు.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న నితిన్ నబిన్ కీలక ప్రసంగం చేశారు. జాతీయ రాజకీయాలు కాకుండా తెలంగాణ రాజకీయాలకు పరిమితమై కీలక వ్యాఖ్యలు చేశారు. 'గ్యారంటీల ప్రయోజనాలు మాత్రం ప్రజలకు అందలేదు. ఈ వాస్తవాన్ని ప్రతి ఇంటికీ.. ప్రతి ప్రజానీకానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉంది' అని పార్టీ నాయకత్వానికి నితిన్ జబిన్ గుర్తుచేశారు. 'జీఎస్టీ సంస్కరణలను అమలు చేసి పన్నుల వ్యవస్థను సరళీకృతం చేశాం. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షల వరకు పెంచి మధ్యతరగతి, సామాన్య ప్రజల జీవితాల్లో ఆర్థిక ఊరట కల్పించే చర్యలు తీసుకున్నాం' అని నితిన్ జబిన్ వెల్లడించారు. కానీ తెలంగాణలో మాత్రం అక్రమ వసూళ్ల ద్వారా ప్రజల కష్టార్జిత ధనాన్ని దోచుకుని ఢిల్లీ దర్బార్కు తరలించే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుండటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.
'తెలంగాణ ప్రజల శ్రమతో సంపాదించిన ఒక్క రూపాయి కూడా అక్రమ వసూళ్లకు బలికాకూడదు. ప్రజలను దోచుకునే ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజల ఆశీర్వాదంతో గద్దె దించేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. వీధి నుంచి అసెంబ్లీ వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ ప్రభుత్వ కౌంట్డౌన్ నేటి నుంచే ప్రారంభమైందని నేను విశ్వసిస్తున్నా' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి రూపాయి ఖర్చుకు, ప్రతి నిర్ణయానికి, ప్రతి అవినీతి వ్యవహారానికి బీజేపీ కార్యకర్తలు ప్రజల తరఫున పూర్తి లెక్క అడగాలని సూచించారు.
'తెలంగాణ యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. ముద్రా యోజన ద్వారా రూ.86,800 కోట్లకు పైగా రుణ సాయాన్ని అందించి యువతను ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతోంది' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలిపారు. పీఎం స్వనిధి యోజన కింద తెలంగాణకు చెందిన సుమారు 7.5 లక్షల మంది వీధి వ్యాపారులు లబ్ధి పొందారని వెల్లడించారు. 'తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిన సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. అధికారాన్ని మేము సేవకు సాధనంగా చూస్తాం. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాసేవే మా ధ్యేయం' అని ప్రకటించారు.
'తెలంగాణలో బీబీనగర్ ఎయిమ్స్ను ఏర్పాటు చేశాం. సమ్మక్క–సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం. రాష్ట్రంలో 23కు పైగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఇచ్చాం' బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ వివరించారు. అవినీతి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అవినీతి అనే స్థాయికి ఆ పార్టీ చేరుకుందని తీవ్ర విమర్శలు చేశారు. దేశ వ్యతిరేక శక్తులకు, దేశాన్ని విభజించే ఆలోచనలకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెడుతోందని తెలిపారు.
'మూసీ రివర్ఫ్రంట్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టులో కాంగ్రెస్ ప్రభుత్వం తన పాత అవినీతి సంప్రదాయాన్నే కొనసాగిస్తోంది. ప్రజాధనాన్ని దోచుకునే మరో అవకాశంగా దానిని మలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల కష్టార్జిత ధనాన్ని ప్రజల సంక్షేమానికి కాకుండా ఇతర రాజకీయ అవసరాలకు వినియోగిస్తే బీజేపీ కార్యకర్తలు ప్రతి రూపాయికి లెక్క అడుగుతారు. తెలంగాణ ప్రజలు కూడా ఆ జవాబుదారీతనాన్ని తప్పకుండా కోరుతారు' అని నితిన్ నబిన్ వివరించారు.
'తెలంగాణలో మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ కుమ్మక్కు కొనసాగుతోందని ప్రజలు గమనిస్తున్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే ఏ ప్రయత్నాన్నైనా బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మత ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లను రద్దు చేసి.. ఆ ప్రయోజనాలను ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటాం' అని నితిన్ నబిన్ హామీ ఇచ్చారు. సమాజంలో ఇంకా అభివృద్ధి ఫలాలు పూర్తిగా అందని వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమే తమ లక్ష్యం అని ప్రకటించారు.
'తెలంగాణలో హిందూ దేవాలయాలు, దేవతల పట్ల అవమానకర ఘటనలు చోటుచేసుకున్నాయి. అయ్యప్ప స్వామి ఆలయంపై జరిగిన దాడి వంటి ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ప్రజల ఆకాంక్షలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తూ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీజేపీ ఎదుగుతుంది' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కుటుంబ పాలన, అవినీతి, హామీల అమలులో వైఫల్యం వంటి రాజకీయాలకు ముగింపు పలకాలంటే మనమంతా మరింత శక్తివంతంగా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
'కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల రాజకీయాల్లో ఉమ్మడి లక్షణాలు మూడు. అవినీతి, కుటుంబ పాలన, హామీల అమలులో వైఫల్యం. అదే సమయంలో వారి రాజకీయాలు బుజ్జగింపు రాజకీయాలపై ఆధారపడితే బీజేపీ రాజకీయాలు ప్రతి పౌరుడిని సంతృప్తిపరిచే సమగ్ర అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయి' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ గుర్తుచేశారు. 'తెలంగాణ ఏ ఆకాంక్షతో ఏర్పడిందో.. ఆ కల ఇంకా పూర్తిగా సాకారం కాలేదు. బీజేపీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాల ఫలితంగానే ఈ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రజలు కన్న ఆ కలలను పూర్తిగా నెరవేర్చే బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదే' అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి బీజేపీ కార్యకర్తలందరూ మరింత పట్టుదలతో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
మోదీ గ్యారంటీ అమలయ్యేది.. కాంగ్రెస్ గ్యారంటీ అంటే ఎప్పటికీ నెరవేరని హామీ: నితిన్ జబిన్
Hyderabad, Telangana:Nitin Nabin Telangana Tour: 'ప్రధానమంత్రి మోదీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ. కాంగ్రెస్ గ్యారంటీ అంటే ఎప్పటికీ నెరవేరని హామీ అనే విషయం దేశ ప్రజలకు బాగా అర్థమైంది' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జతిన్ నబిన్ విమర్శించారు. 'దేశంలో ఏయే రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయో అక్కడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. మేము శంకుస్థాపన చేసిన ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేసి ప్రారంభించే బాధ్యతను కూడా మా ప్రభుత్వాలే నిర్వర్తించాయి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం ప్రజలకు అమలుకు నోచుకోని హామీలు ఇచ్చింది. ఇప్పటిదాకా అమలు చేయలేదు' అని తెలిపారు.
భవిష్యత్తు ఎంతో ఉజ్వలం
హైదరాబాద్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య ప్రసంగం చేశారు. 'తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండబోతోంది. రానున్న కాలం తెలంగాణలో బీజేపీదేననే విశ్వాసం నాకు మరింత బలపడింది' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలిపారు. తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిన అభివృద్ధి చెందిన తెలంగాణను నిర్మించాలనే సంకల్పాన్ని ఈ కార్యవర్గ సమావేశం ద్వారా మనమంతా చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. '1980లో స్థాపించిన బీజేపీ తన తొలి లోక్సభ ఎన్నికల్లో కేవలం ఇద్దరు ఎంపీలను మాత్రమే గెలిపించుకోగలిగింది. ఆ పార్టీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదిగింది. ఈ ఘనత పూర్తిగా బూత్ స్థాయి వరకు నిరంతరం శ్రమిస్తూ కమలాన్ని వికసింపజేసిన ప్రతి కార్యకర్తదే' అని ప్రకటించారు.
ముగ్గురు మహనీయుల ఆశయాలు
'డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్, అటల్ బిహారీ వాజ్పేయి ఈ ముగ్గురు మహనీయుల ఆశయాలను ప్రధాని మోదీ కార్యరూపంలో ముందుకు తీసుకెళ్తున్నారు. 12 సంవత్సరాల్లో మోదీ నాయకత్వంలో అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తికి చేరేలా చేసిన సంకల్పం విజయవంతమైంది. ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ అనే భావనను సాకారం చేశారు' అని నితిన్ నబిన్ తెలిపారు. 'మనం సాధించిన విజయాలతోనే సంతృప్తి చెందే పరిస్థితి లేదు. ఇంకా ఎన్నో సవాళ్లు మన ముందున్నాయి. విజయం సాధించామని భావించి మన గమ్యాన్ని చేరుకున్నామని అనుకోవడం సరికాదు. ఇంకా ఎంతో పోరాటం చేయాల్సి ఉంది' అని పార్టీ శ్రేణులకు జాతీయ అధ్యక్షుడు సూచించారు.
భాగస్వాములు కావాలి
'2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయాలంటే.. ఈ తరానికి చెందిన ప్రతి కార్యకర్త తన సంపూర్ణ శక్తి సామర్థ్యాలను వినియోగించాలి. అంకితభావం, సంకల్పం, నిరంతర కృషితో ముందుకు సాగి అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలి' అని నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. '2014కు ముందు దేశం నిరాశలో, అవినీతిలో కూరుకుపోయింది. యువత తమ భవిష్యత్తు, దేశ భవిష్యత్తుపై ఆందోళన చెందేది. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రధానమంత్రి సమర్థ నాయకత్వంపై దేశ ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది' అని పేర్కొన్నారు.
'పశ్చిమ బెంగాల్ విజయం సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. అక్కడ మా కార్యకర్తలు ఎన్నో హింసలు, వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయలేదు. పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. ఆ అచంచల సంకల్పమే నేడు పశ్చిమ బెంగాల్లో కమలం వికసించడానికి కారణమైంది' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ వివరించారు. 'దేశ మహిళల గౌరవం, ప్రజల ఆత్మగౌరవం గురించి ఆలోచించే మనస్తత్వం కాంగ్రెస్కు లేదు. వారికి అధికారం మాత్రమే ముఖ్యం. అదే కారణంగా ప్రజలు వారిని వరుసగా తిరస్కరిస్తూ అధికారానికి దూరం చేస్తున్నారు' అని విమర్శించారు.
సిద్ధం కావాలి
'తెలంగాణలో ప్రజాసమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతికి వ్యతిరేకంగా మనమంతా ప్రజల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడేందుకు సిద్ధం కావాలి. తెలంగాణలో మార్పు తీసుకురావాలంటే, తెలంగాణ ప్రజల గొంతుకగా నిలవాలంటే వారి సమస్యలతో మమేకం కావాలి. ప్రజల సమస్యలపై పూర్తి శక్తితో ఉద్యమించాలి' అని బీజేపీ నాయకత్వానికి నితిన్ నబిన్ సూచించారు. పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యలపై ఐక్యంగా.. అంకితభావంతో పోరాటం చేస్తే 2028లో తెలంగాణలో విజయం బీజేపీదేననే పూర్తి విశ్వాసం తనకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
'తెలంగాణ అనేది ప్రారంభం నుంచే కమలం వికసించిన రాష్ట్రం. నేడు దేశంలోని 22 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ప్రజాసేవ చేస్తున్నాయంటే.. ప్రధానమంత్రి సమర్థ నాయకత్వమే కారణం. దేశ ప్రజలు ఆ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు' అని నితిన్ నబిన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలనే ఎన్నికల అజెండాగా చేసుకోమని.. మోదీ హయాంలో దేశంలో తీసుకొచ్చిన అభివృద్ధి, మార్పు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలనే ప్రజల ముందుకు తీసుకెళ్తాం అని వివరించారు.
తెలంగాణకు కేంద్రం చేసింది ఇదే
'తెలంగాణ అభివృద్ధికి కూడా ఎన్డీయే ప్రభుత్వం విశేష ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలోని 30 లక్షలకు పైగా రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. 33 లక్షలకు పైగా రైతులు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా సులభ రుణాలను పొందుతున్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు పసుపు సాగు చేసే రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలను కల్పించే దిశగా కీలక అడుగుగా నిలిచింది. తెలంగాణలో 83 లక్షలకు పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీ చేశాం. పేదల ఆర్థిక సాధికారత కోసం రాష్ట్రంలో 1.32 కోట్లకు పైగా జన్ ధన్ బ్యాంకు ఖాతాలు ప్రారంభించాం' అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు వివరించారు.
Bandla Ganesh: దేవుడికి గాయమైతే భక్తుడు ఎలా తట్టుకోగలడు.?... పవన్ కల్యాణ్ సర్జరీపై బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్.. ఏమన్నారంటే..?..
Hyderabad, Telangana:Bandla ganesh emotional post on Pawan kalyan shoulder pain: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా భూజాల నొప్పితో బాధపడుతున్నారు. ఈక్రమంలో ఆయన భుజంలోని రొటెటర్ కఫ్ తో పాటు మరో రెండు కండరాల్లో గాయంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో నిన్న హుటా హుటీన తనసతీమణి అన్నా లెజినోవాతో కలిసి ముంబైలోకి కోకిలాబెన్ ధీరుబాయ్ అంబాని ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో వైద్యులు సర్జరీ అత్యవసరంఅని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ముందుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలకు ప్రాధాన్యతను ఇస్తు సర్జరీ వాయిదా వేసుకున్నారు. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ సర్జరీపై నిర్మాత బండ్ల గణేష్ భావొద్వేగంతో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ భుజం గాయం వెనుకాల సుమారు 15 ఏళ్ల క్రితం ‘గబ్బర్ సింగ్’ షూటింగ్ నాటి పరిస్థితుల్ని మరోసారి పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ కు సర్జరీ తప్పనిసరి వార్తలు తెలిసినప్పటి నుంచి తనకు "నిన్న రాత్రంతా నిద్ర రాలేదని ఎమోషలన్ అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయిందంటూ భావొద్వేగంతో ట్విట్ చేశారు.
చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడని, అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణమని పవన్ కళ్యాణ్ ను కొనియాడారు. ఇప్పటికి గుజరాత్ లో గుర్రం మీద నుంచి పడిపోయినగబ్బర్ సింగ్ నాటి షూటింగ్ సీన్ తన కళ్ల ముందుకన్పిస్తుందని అన్నారు.
వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెపితే.. పవన్ కళ్యాణ్ మాత్రం.. ముందు సినిమా పూర్తి చేద్దామని నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు.. ఇన్ని వందల మంది కష్టపడుతున్నారని అన్న మాటల్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ఇంత మంది సినిమా టీమ్ తన వల్ల మూవీ పోస్ట్ పాన్ కావడం తనకు ఇష్టంలేదని పవన్ కళ్యాణ్ ఆ నొప్పిని భరిస్తునేమూవీ పూర్తి చేశారని బండ్ల గణేష్ మరోసారి భావొద్వేగంకు గురయ్యారు.
ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదని.. జీవితాంతం మర్చిపోలేని ఋణమన్నారు. తన ఆరాధ్య దేవుడికి ఈవిధంగా అయిందని తెలిసి ఒక భక్తుడిగా ఏవిధంగా ప్రశాంతంగా ఉండగలనని భావొద్వేగంగా పోస్ట్ పెట్టాడు.
దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నానని.. మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలన్నారు.
Read more: Pawan kalyan: హుటా హుటీన ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రికి పవన్ కళ్యాణ్.!. అసలేం జరిగిందంటే..?..
తన అభిమాన దేవుడు తెరపైన కాదు.. నిజ జీవితంలో కూడా ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టారని తన అభిమాన హీరో వెంటనే కోలుకొవాలని బండ్ల గణేశ్ ఎమోషనల్ ట్విట్ చేశారు. మరొవైపు జనసేన అభిమానులు,పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సైతం పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
రెండో ఇన్నింగ్స్లో శివాజీ అదుర్స్.. 55 ఏళ్ల వయస్సులో అద్భుత ప్రదర్శన
Nuzendla, Andhra Pradesh:Sivaji Birthdy: తెలుగు సినీ పరిశ్రమలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి ఇప్పుడు భారీ సినిమాలతో బిజీగా ఉన్న నటుడు శివాజీ. సొంటినేని శివాజీ హీరోగా నటించిన అనంతరం కొన్నేళ్ల నుంచి మళ్లీ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. అతడి రెండో ప్రయాణం బిగ్బాస్తో మొదలైంది. బిగ్బాస్లో పల్లవి ప్రశాంత్కు సహకరిస్తూ అతడి గెలుపులో శివాజీ ఉన్నారు. అనంతరం వరుస సినిమాలు, వెబ్సిరీస్లతో బిజీగా ఉన్న శివాజీ నేడు 55వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. నటులుగా మాత్రమే కాదు.. తమ సహజమైన నటన, వ్యక్తిత్వం, కష్టపడి సాధించిన ప్రయాణంతో ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో శివాజీ జీవిస్తున్నారు. 55 ఏళ్ల పైబడిన శివాజీని దారుణంగా అవమానించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అతడికి జీ తెలుగు న్యూస్ శుభాకాంక్షలు చెబుతోంది.
సినిమాలంటే అమితమైన ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శివాజీకి తొలి రోజులు అంత సులభంగా సాగలేదు. అవకాశాల కోసం ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయి. చిన్న చిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన ఒక్కో అవకాశాన్ని తన ప్రతిభతో పెద్ద విజయంగా మార్చుకుంటూ ముందుకు సాగారు. ఏ పాత్ర దొరికినా నూటికి నూరు శాతం న్యాయం చేయాలనే తపనే ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టింది.
నటుడిగా అవకాశాలు వస్తూనే మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రతిభను చాటుకున్నారు. పలువురు యువ హీరోలకు ఆయన అందించిన గాత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. డబ్బింగ్ చెప్పింది తక్కువ సినిమాలకే అయినప్పటికీ.. ఆయన వాయిస్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. భావోద్వేగాలను స్వరంతోనే పలికించే అరుదైన కళ ఆయన సొంతం. ఆ తర్వాత హీరోగా శివాజీ చేసిన ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. భారీ బడ్జెట్ సినిమాలు కాకపోయినా మంచి కథలు, కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యే కథాంశాలు, వినోదంతో కూడిన చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్కెట్ను సృష్టించుకున్నారు. కామెడీ, ప్రేమకథలు, కుటుంబ కథలు, భావోద్వేగ ప్రధాన చిత్రాలు ఇలా ప్రతి జానర్లోనూ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
శివాజీ కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఆయన నటనలో సహజత్వం, డైలాగ్ డెలివరీలో ప్రత్యేక శైలి, ఎలాంటి అతిశయోక్తి లేకుండా పాత్రను జీవించడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే ఆయనను ఇప్పటికీ చాలామంది "న్యాచురల్ పెర్ఫార్మర్"గా గుర్తిస్తారు. అయితే కాలక్రమేణా సినిమాలకు కొంత విరామం ఇచ్చిన శివాజీ, ప్రజా సమస్యలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలిచారు. కొంతకాలం వెండితెరకు దూరంగా ఉన్నా.. ప్రేక్షకులు మాత్రం ఆయనను మరచిపోలేదు.
అలాంటి సమయంలో వచ్చిన బిగ్బాస్ తెలుగు ఆయన జీవితంలో మరో మలుపుగా నిలిచింది. ఆ షోలో ఆయన కేవలం కంటెస్టెంట్గా మాత్రమే కాకుండా.. తన అనుభవం, ఆలోచనా విధానం, ఆటతీరు, వ్యక్తిత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొత్త తరం ప్రేక్షకులకు శివాజీని మరింత దగ్గర చేసింది ఆ షో. అక్కడి నుంచి ఆయన కెరీర్ మళ్లీ ఊపందుకుంది. బిగ్బాస్ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చినా వచ్చిన ప్రతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కథ బలంగా ఉండాలి.. పాత్రకు ప్రాధాన్యం ఉండాలి. ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమా కావాలి అనే ఆలోచనతోనే ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు శివాజీ పేరు కనిపిస్తే ఆ సినిమాలో కచ్చితంగా విషయం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.
సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన చేసిన 'కోర్ట్', 'దండోరా' వంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు అవార్డుల పరంగా కూడా గుర్తింపు పొందాయి. నటుడిగా ఆయనలోని మరో కోణాన్ని ఈ సినిమాలు బయటకు తీసుకొచ్చాయి. పాత్ర ఎంత బలంగా ఉంటే శివాజీ నటన అంత ప్రభావవంతంగా ఉంటుందని మరోసారి నిరూపించాయి. ఓటీటీ ప్రపంచంలోనూ శివాజీ తనదైన ముద్ర వేస్తున్నాడు. '90స్' కిడ్స్ వెబ్ సిరీస్లో ఆయన పోషించిన పాత్ర కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తండ్రి పాత్రలో ఆయన చూపించిన భావోద్వేగాలు ప్రతి ఇంట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు ఆ విజయానికి కొనసాగింపుగా రాబోతున్న 'ఎపిక్' ప్రాజెక్ట్పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న 'లెనిన్' చిత్రంలోనూ శివాజీ ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. వీటితో పాటు మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. సంఖ్య కంటే నాణ్యతను నమ్మే నటుడిగా, మంచి కథలకే ప్రాధాన్యం ఇస్తూ తన రెండో ఇన్నింగ్స్ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మూడు దశాబ్దాలకు చేరువైన సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా.. ప్రతి సారి మరింత బలంగా తిరిగి రావడం శివాజీ ప్రత్యేకత. కాలం మారినా.. ప్రేక్షకుల అభిరుచులు మారినా.. మంచి నటనకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని శివాజీ మరోసారి నిరూపిస్తున్నారు.
ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ శుభవార్త! రెగ్యులరైజ్ ప్రక్రియ ప్రారంభం
Amaravathi, Andhra Pradesh:Contract Employees Regularisation: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు వరుసగా వరాలు ప్రకటిస్తూ వస్తోంది. రిటైర్మెంట్ వయస్సు పెంపు, సీపీఎస్ నుంచి పాత పింఛన్ విధానం వంటి వరాలు కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. భారీగా నిధులు విడుదల
గతంలో న్యాయపరమైన అంశాల కారణంగా నిలిచిపోయిన క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రభుత్వం పునఃప్రారంభించింది. ఈ పరిణామంతో కాంట్రాక్ట్ ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించనుంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చట్టం 21-10-2023లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అర్హులైన ఉద్యోగుల దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించనుంది. అన్ని శాఖల అధిపతులు (హెచ్ఓడీలు), సచివాలయ పరిపాలనా విభాగాలు నిధి పోర్టల్ ద్వారా దరఖాస్తుల పరిశీలన, ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి.
Also Read: ఉద్యోగుల ఫ్రెండ్లీగా ఏపీ ప్రభుత్వం.. సీఎం చంద్రబాబుతో ఉద్యోగ సంఘాలు భేటీ
అధికారులు తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలు
==> ఉద్యోగి అర్హతలను చట్టం, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిశీలించాలి
==> సర్వీస్ రికార్డులు, ఇతర సంబంధిత పత్రాలను పూర్తిగా ధృవీకరించాలి
==> సమర్థ అధికారుల ఆమోదం పొందిన తర్వాత మాత్రమే క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయాలి.
గడువు: 2026 జూలై 31లోపు క్రమబద్ధీకరణ ప్రక్రియను నిధి పోర్టల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది
గమనిక: ఈ ఉత్తర్వులు చట్టంలోని నిబంధనల ప్రకారం అర్హత సాధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి
ఉద్యోగ వర్గాలు అసంతృప్తి
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్ల వరకు పెంచిన విషయం తెలిసిందే. ఇక కొన్ని శాఖల ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం నుంచి పాత పింఛన్ పథకంలోకి మారుస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఉద్యోగ వర్గాలకు సంబంధించిన నిర్ణయాలపై ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. త్వరలో వాటికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల కానున్నాయి. అయితే ప్రభుత్వం చేయాల్సినవి దానికంటే ఇతర తాయిలాలు ప్రకటించడంపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించే కరువు భత్యం, పీఆర్సీ వంటివి ప్రకటించక ఇవన్నీ ప్రకటిస్తే ఏమొస్తుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
రెడ్ హ్యాండెడ్గా ఏఈఈ అరెస్ట్.. రైతు పొలానికి మట్టి తోలుకునేందుకు రూ.2 లక్షల లంచం
Aswaraopeta, Telangana:ACB Operation With Farmer: వ్యవసాయం చేసుకునే రైతు తన పొలానికి చెరువు నుంచి మట్టి తోలుకునేందుకు సాగునీటి ఇంజనీర్ను సంప్రదించగా.. అతడు పెద్ద ఎత్తున లంచం ఆశించాడు. పొలం పనులు చేసుకునే రైతుకు భారీ స్థాయిలో లంచం ఇచ్చుకునే స్తోమత లేదు. దీంతో అతడు వెంటనే అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల ఆదేశాలతో లంచంగా డబ్బులు ఇచ్చాడు. ఆ వెంటనే ఏసీబీ అధికారులు దాడులు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. అయితే ఆ రైతు ఇప్పటికే ఒక అధికారిని ఏసీబీకి పట్టించగా.. తాజాగా రెండో అధికారిని కూడా ఏసీబీకి అప్పగించాడు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏసీబీ వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఈ రోజు అశ్వారావుపేటలో ఇరిగేషన్ ఏఈఈ ఎల్. శ్రీనివాస్ రూ.రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి ఓ రైతు తన పొలానికి మట్టి తోలుకునేందుకు అనుమతి కోరగా.. ఏఈఈ శ్రీనివాస్ రూ.రెండు లక్షలు డిమాండ్ చేశాడు. ఆ డబ్బులు ఇస్తూ రైతు ఏసీబీ అధికారులకు పట్టించాడు.
మట్టి తోలుకునేందుకు
అశ్వారావుపేటలోని ఏఈ తన కార్యాలయంలో రైతు నుంచి రూ.రెండు లక్షల నగదు స్వీకరిస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని బృందం దాడి చేసి ఏఈఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. '2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. దొంతికుంట చెరువు నుంచి రైతు పొలానికి మట్టి తోలుకునేందుకు అనుమతి అడగ్గా ఏఈఈ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు' అని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ వివరించారు.
ఖమ్మం జిల్లాలో ఏసీబీ దాడులు
అవినీతి నిరోధక శాఖ ఖమ్మం జిల్లాలో వరుసగా దాడులు చేస్తుండడంతో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు. ఏ కార్యాలయంలో ఎలాంటి రైడ్స్ అవుతాయా? తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పనులు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు నిజాయతీగా అమలు చేయాల్సి ఉండగా.. కొందరు డబ్బులు ఆశిస్తూ లంచాలకు అలవాటు పడడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో కార్యాలయాలపై ఏసీబీ పంజా విసురుతోంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఏసీబీ దాడులు జరుగుతున్నాయి.
శభాష్ రైతన్న
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల అవినీతిపై ఓ రైతు ఉద్యమం చేస్తున్నట్టు కనిపిస్తోంది. తనకు అడుగడుగునా ప్రభుత్వ ఉద్యోగులు లంచం ఆశిస్తుండడంతో వారికి బుద్ధి చెప్పేందుకు ఏసీబీతో కలిసి భారీ ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆ రైతు ఇద్దరు అధికారులను ఏసీబీకి పట్టించారు. గతంలో విద్యుత్ శాఖ అధికారిని, నేడు ఇరిగేషన్ శాఖ అధికారిని రైతు పట్టించడం విశేషం. మరి ఖమ్మం జిల్లాలో ఏసీబీ దాడులు జరుగుతుండడంతో ఆ జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి అవినీతి లేకుండా పనులు చేసేందుకు సిద్ధమైంది.
విశాఖపట్టణంలో ప్రతిష్టాత్మక సదస్సు.. నవంబర్ 12, 13 తేదీల్లో సీఐఐ కార్యక్రమం
Visakhapatnam, Andhra Pradesh:31st Edition CII Summit: ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్టణం మరో ప్రతిష్టాత్మక సదస్సుకు వేదిక కానుంది. సీఐఐ భాగస్వామ్య సదస్సు నవంబర్లో నిర్వహించనున్నారు. విశాఖపట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ సదస్సు కంటే ముందుగా 5 చోట్ల ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు నిర్వహించాలని తెలిపారు. కొత్త ఆలోచనలకు.. అవకాశాలకు సీఐఐ సదస్సు వేదిక కావాలని సూచించారు. ఎంఓయూలు, పెట్టుబడులతో పాటు నాలెడ్జ్ షేరింగ్ మీద ఎక్కువ దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026పై సోమవారం అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. విశాఖ భాగస్వామ్య సదస్సు గతానికి భిన్నంగా నిర్వహించాలని ఆదేశించారు. నవంబర్ 12, 13వ తేదీల్లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే ఈసారి ప్రాంతీయ స్థాయిలో కూడా సదస్సులు నిర్వహించాలని సూచించారు. Navigating Change: Leadership, Technology, Trust and Trade in a Transforming World థీమ్తో 31వ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు సీఎం వెల్లడించారు.
సీఐఐ సదస్సులో భాగంగా ఎంఓయూలు కుదుర్చుకోవడం, మినిస్టీరియల్ సెషన్స్, ప్లీనరీ, కంట్రీ సెషన్స్, బీ2బీ, బీ2జీ సమావేశాలతో రెండు రోజుల భాగస్వామ్య సదస్సు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన డెలిగేట్స్ను ఆహ్వానించాలని చెప్పారు. భాగస్వామ్య సదస్సు నిర్వహణకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు లేఖలు రాయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
'విశాఖపట్టణంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు సంబంధించి దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలి. జూలై నుంచి సెప్టెంబర్ వరకు దేశవిదేశాల్లో రోడ్ షోలు చేపట్టాలి. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కోయంబత్తూర్, అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో సీఐఐ భాగస్వామ్య సదస్సులకు సంబంధించి రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలి' అని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రధాన భాగస్వామ్య సదస్సుకంటే ముందుగానే విశాఖ, రాజమండ్రి లేదా కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సదస్సుల్లో ఎంఓయూలు కుదర్చుకునే అంశంపై అధికారులు ఎలాంటి ప్రణాళికలు చేపట్టారని సీఎం ప్రశ్నించగా.. ఏయే ప్రాంతాల్లో ఏయే రంగాలకు చెందిన పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఉంటుందో బేరీజు వేసుకుని.. ఆ మేరకు ఆయా ప్రాంతీయ సదస్సుల్లో ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు.
సదస్సుపై సమీక్ష చేసిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'భాగస్వామ్య సదస్సులు అంటే కేవలం పెట్టుబడులు రాబట్టడం, ఎంఓయూలు కుదుర్చుకోవడం అనే భావన పోవాలి. భాగస్వామ్య సదస్సుల్లో వివిధ కీలక అంశాలపై చర్చ జరగాలి. ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి? ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నామనే దానికంటే నాలెడ్జ్ షేరింగ్ ఎంత వరకు చేసుకోగలుగుతున్నామనేది ముఖ్యం' అని తెలిపారు.
'విశాఖలో జరగబోయే 31వ భాగస్వామ్య సదస్సులో జరిగే కార్యక్రమాలపై ప్రజలు చర్చించుకోవాలి. వినూత్నంగా ఆయా రంగాలను ఏ విధంగా అభివృద్ధి సాధించాలనే ఆలోచనలు రేకేత్తించాలి. టెక్నాలజీ సహా వివిధ అంశాల గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఆయా రంగాల్లో ఛాంపియన్ గా నిలిచిన వాళ్లే గ్లోబల్ లీడర్లుగా ఎదుగుతున్నారు. ఫ్యూచరిస్టిక్ రంగాలపై ఎక్కువ దృష్టి సారించాలి' అని అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన నిపుణులు భాగస్వామ్య సదస్సుకు వచ్చేలా చూడాలని.. సీఐఐ గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ను అమరావతిలో ఏర్పాటు చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్
సీఐఐ భాగస్వామ్య సదస్సును వినూత్నంగా నిర్వహించాలని.. ప్రాంతీయ స్థాయిలో భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తే ప్రజలు, యువత, విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరుగుతుంది. కొత్త ఆలోచనలను ప్రజలకు చేరవేయడం.. యువతలోని ఇన్నోవేషన్లను ఆయా రంగాల పారిశ్రామిక పెద్దల దృష్టికి వెళ్లడం అనేది సాధ్యమవుతుంది' అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాంతాల వారీగా నిర్వహించే సదస్సుల్లో స్టార్టప్ కంపెనీలకు, ఇన్నోవేషన్లకు అగ్రభాగం ఉండాలి. ప్రాంతీయ సదస్సుల్లోనూ ఎంఓయూలు కుదుర్చుకునే అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి కార్యక్రమాలు ఏదో ఒక్క చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో జరిగితే... ప్రభుత్వం చేస్తున్న కృషి.. పడుతున్న కష్టం ప్రజలకు అర్థమవుతుంది' అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
రేపు సత్యవేడులో ప్రముఖ కంపెనీ ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే!
Satyavedu, Andhra Pradesh:Chandrababu Tour: ఆంధ్రప్రదేశ్లో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. ఏపీలో మరో కీలక కంపెనీ ప్రారంభానికి సిద్ధం కానుంది. సత్యవేడులో రేపు హీరో కంపెనీ తన జీపీస కేంద్రానికి శంకుస్థాపన చేసుకోనుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తోంది. అంతేకాకుండా రేపు లబ్ధిదారులందరికీ కూడా పింఛన్ పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనేందుకు రేపు తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాల పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మదనపాలెంలో హీరో మోటార్ కార్ప్స్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్-జీపీసీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని మదనపాలెంలో హీరో మోటార్ కార్ప్స్ నూతనంగా ఏర్పాటు చేయనున్న జీపీసీకు భూమిపూజ జరగనుంది. హీరో మోటార్స్కు చెందిన వివిధ తయారీ కేంద్రాలు, డీలర్లకు ద్విచక్ర వాహనాల విడి భాగాలను తయారు చేసి సరఫరా చేసేలా ఆ సంస్థ ఈ సెంటర్ను ఏర్పాటు చేయనుంది.
4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి
రూ.750 కోట్ల పెట్టుబడితో హీరో మోటార్ కార్పోరేషన్ ఈ జీపీసీ 2.0ను సత్యవేడులో నిర్మించనుంది. దీనిద్వారా స్థానికంగా 4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనుండడంతో ఇక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే శ్రీసిటీ సమీపంలో హీరో మోటార్స్ సంస్థ ఏర్పాటుచేసిన అధునాతన ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంట్లో ఏడాదికి 1.5 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి జరుగుతున్న విషయం తెలిసిందే.
స్కాలర్ షిప్
దేశ, విదేశాల్లో ఉన్న మోటార్ సైకిళ్లు, స్కూటెక్లు, ఈవీలకు విడి భాగాలను తయారుచేసేందుకు ఈ జీపీసీను హీరో మోటార్స్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పీ4 కార్యక్రమంలో మార్గదర్శిగా ఉన్న హీరో మోటార్స్ సంస్థ పలువురికి స్కాలర్ షిప్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ద్వారా హీరో మోటార్స్ అందించనున్న బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ పేరుతో హీరోస్ ఆఫ్ టుమారో పేరిట స్కాలర్షిప్లను రేపు సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఇక ఈ కంపెనీకి చెందిన వాహనాలను ఏపీ పోలీస్ శాఖకు కూడా కేటాయించాలని నిర్ణయించారు. ఏపీ పోలీసులు వినియోగించుకునేలా హీరో మోటార్స్ సంస్థ ప్రత్యేకంగా తయారుచేసిన ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలను కూడా సీఎం చంద్రబాబు అందించనున్నారు.
పింఛన్ల పంపిణీ
ఎన్టీఆర్ భరోసా ఫించన్లు జూలై 2026కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పేదల సేవా కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. వృద్ధాప్య, వితంతు సహా వేర్వేరు కేటగిరీలకు చెందిన 62 లక్షల మంది లబ్దిదారులకు రూ.2,750 కోట్ల మేర ఏపీ ప్రభుత్వం పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే. పున్నపువారిపాలెం గ్రామంలో ఓ లబ్దిదారు ఇంటికి వెళ్లి సీఎం చంద్రాబు స్వయంగా పింఛన్ను పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు. రాత్రికి శ్రీసిటీలో ఉన్న అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.
అభిమానుల్లో తీవ్ర ఆందోళన.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అత్యవసర ఆపరేషన్
Mumbai, Maharashtra:Pawan Kalyan Health Update: భుజం కండరాల్లో తీవ్రమైన గాయంతో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కావాల్సిన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అయితే శస్త్రచికిత్స ఇప్పుడు వద్దని పవన్ కల్యాణ్ ససేమిరా అన్నారు.
ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కల్యాణ్కి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సోమవారం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రెండు భుజాలను నిశితంగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్తో పాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తమ పరీక్షల్లో నిర్ధారణ చేశారు. ఈ నొప్పిని తట్టుకోవడానికి తక్షణం శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఇప్పటికిప్పుడు సర్జరీ చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనని పవన్ కల్యాణ్ వైద్యులకు స్పష్టం చేశారు.
తర్వాత శస్త్ర చికిత్స
ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన.. అధికారిక కార్యక్రమాలు పూర్తి చేయాలని, ఆ తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పవన్ కల్యాణ్ కొంతకాలంగా భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బందిపడుతున్నాడు. అంతకుముందు సైనస్తో బాధపడుతున్న పవన్ కల్యాణ్ గతంలో సర్జరీ చేసుకున్న విషయం తెలిసిందే. మరోసారి సర్జరీ చేసుకోవాల్సి ఉండడంతో ఆయన అభిమానులు, జనసేన పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
రీ-అపాయింట్మెంట్
పదవీ విరమణ పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓఎస్డీ కె. వెంకట కృష్ణకు ప్రభుత్వం మళ్లీ నియమించుకుంది. మూడేళ్ల రీ-అపాయింట్మెంట్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న కె. వెంకట కృష్ణకు జూలై 1 నుంచి నియామకం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఓఎస్డీగా ఆయన కొనసాగనున్నారు. మూడేళ్లు లేదా డిప్యూటీ సీఎం పదవీకాలం ముగిసే వరకు ఆయన బాధ్యతల్లో ఉండనున్నారు. చివరి జీతం నుంచి పెన్షన్ మినహాయించి వేతనం చెల్లింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. పదోన్నతులపై ఎలాంటి ప్రభావం ఉండదని జీవో విడుదల చేసింది.
తిరుమలలో వైభవంగా ఏరువాక పౌర్ణమి 'గరుడ సేవ'
Dharmavaram, Andhra Pradesh:Garuda Vehicle Seva Done In Tirumala For Eruvaka Pournami Watch Videoమార్మోగిన గోవింద నామస్మరణ.. తిరుమలలో వైభవంగా ఏరువాక పౌర్ణమి 'గరుడ సేవ'
Tirupati Urban, Andhra Pradesh:Eruvaka Pournami: ప్రతి పౌర్ణమి సందర్భంగా తిరుమల ఆలయంలో నిర్వహించే గరుడ సేవ ఈసారి ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని అత్యంత వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి సన్నిధిలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా.. భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరగ్గా.. పెద్ద ఎత్తున భక్తులు హాజరై తరించారు. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు తన దేవేరులతో కలిసి గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి వేలాదిమంది భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు.
గరుడ వాహన సేవ సందర్భంగా వేద పండితుల వేదఘోషలు, మంగళవాయిద్యాలు 'గోవింద... గోవింద..' నామస్మరణలు మార్మోగాయి. గరుడసేవ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉట్టిపడేలా చేసింది. స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గరుడవాహనంపై ఉన్న మలయప్పస్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని.. సర్వదోషాలు తొలగి శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం.
ప్రతి నెల పౌర్ణమి గరుడసేవకు విశేష ప్రాధాన్యం ఉంది. ఈ క్రమంలో జూలైలో వచ్చిన ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని గరుడ సేవకు టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, తాగునీరు, వైద్యసేవలు, క్యూలైన్ల నిర్వహణ వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా చేపట్టారు. ఉత్సవంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా టీటీడీ అధికారులు, వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తులతో కిక్కిరిసిన తిరుమాడ వీధులు, విద్యుత్ దీపాలంకరణలు, భక్తి గీతాలు, గోవింద నామస్మరణలతో తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వైభవమైన పౌర్ణమి గరుడసేవ మరోసారి భక్తులను ఆధ్యాత్మిక అనుభూతిలో ముంచెత్తింది.
భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 18-24 గంటల సమయం పడుతుంది. రూ.300 శీఘ్రదర్శనానికి 4-5 గంటల సమయం పడుతుండగా.. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటల సమయం పట్టింది. నిన్న స్వామివారిని 91,793 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,221 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. హుండీ ఆదాయం రూ.0 కోట్లు వచ్చింది.మొత్తం విక్రయించిన లడ్డూల సంఖ్య రూ.8 లక్షలు, అన్నప్రసాదాలు 3.13 లక్షల మంది భక్తులు స్వీకరించారు.
On the auspicious Pournami, Sri Malayappa Swamy, accompanied by Sridevi and Bhudevi, blessed devotees on the sacred Garuda Vahanam during Pournami Garuda Seva at Tirumala. Thousands witnessed the divine procession with devotion.#ttd #tirumala #garudaseva #malayappaswamy pic.twitter.com/h00l4hhGn8
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) June 29, 2026
