icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Snake Viral Video: ఐక్యమత్యమే మహాబలం.. పాముకు చుక్కలు చూపించిన కప్పలు!

Hyderabad, Telangana:

Frogs Attacks A Snake Viral Video: ప్రకృతిలో బలవంతుడిదే లోకం అని అనుకుంటూ ఉంటారు. సాధరణంగా పాము కనిపిస్తే కప్పలు ప్రాణభయంతో పరుగులు తీస్తూ ఉంటాయి. పాము నోటికి చిక్కి ఆహారంగా మారుపోతాయి. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో దీనికి చాలా భిన్నంగా ఉంది. అక్కడ తిరుగుతున్న పామును చూస్తుంటే ఆశ్చర్యం తప్పకుండా వేస్తుంది. అయితే ఒక విష సర్పం పదుల సంఖ్యలో ఉన్న కప్పల మధ్య చిక్కుకొని.. వాటి దాడిని తట్టుకోలేక విలవిలలాడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 

ఒక పాత బాడిలో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. ఆహారం కోసం ఆ బావిలోకి వెళ్లిందో లేక ప్రమాదవశాత్తు పడిందో తెలియదు కానీ.. ఒక ప్రమాదకరమైన పాము బావిలోని నీటిలో చిక్కుకుని ఉండడం మీరు చూడొచ్చు. అయితే, అదే బావిలో అప్పటికే పదుల సంఖ్యలో ఉండడం కూడా మీరు గమనించవచ్చు. సాధారణంగా ఆ ప్రమాదకరమైన పామును చూడగానే చెల్లాచెదురు కావాల్సిన కప్పలు..కానీ ఐక్యమత్యమే మహాబలం అని నిరూపించాయి. 

ఆ పామును చూసి భయపడకుండా.. కప్పలన్నీ ఒక్కసారిగా ఆ సర్పంపై దాడికి దిగాయి.. పాము ఎటు వెళ్లలేక కప్పల మధ్య బందీగా ఉండిపోవాల్సి వచ్చింది.. అంతేకాకుండా కప్పలు గుంపులు గుంపులుగా పాము శరీరంపైకి ఎక్కి దానిని ఉక్కిరిబిక్కిరి చేయడం కూడా మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు.. పాము తనను తాను రక్షించుకోవడానికి కప్పలపై నుంచి అటు ఇటు పాకుతూ వెళ్లడం కూడా మీరు గమనించవచ్చు.

Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్‌ తాగించిన తోటి కోడలు

ఈ వింత మీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది ఈ వీడియోను చూసి కామెంట్స్‌ చేస్తున్నారు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అంటారు.. ఇక్కడ కాలం కలిసి రాక పాము కప్పలకు చిక్కింది.. అంటూ చాలా మంది కామెంట్స్‌ చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా సమూహంగా ఉంటే ఎంతటి శత్రువునైనా ఎదిరించవచ్చు అనడానికి ఈ వీడియోనే నిదర్శనం.. అని మరికొంత మంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. 

Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్‌ తాగించిన తోటి కోడలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Oppo F33 Proపై భారీ లాంచ్ ఆఫర్స్.. రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందే అవకాశం!

Hyderabad, Telangana:

Oppo F33 Pro 5g Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం Oppo భారత మార్కెట్‌లోకి అద్భుతమైన ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ను స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ Oppo F33 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ పేరుతో లాంచ్‌ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ గతంలో విడుదల చేసిన మోడల్స్‌ కంటే చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇది సరికొత్త డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది.. ఈ మొబైల్‌కి సంబంధించిన విక్రయాలు ఈ రోజు నుంచి భారతదేశ వ్యాప్తంతంగా ప్రారంభమయ్యాయి. ఈ మొబైల్‌ ఈ-కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో అధికారిక స్టోర్లలో అందుబాటులో ఉంది.

ఇక ఒప్పో F33 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ భారత మార్కెట్‌లో రెండు ప్రధాన స్టోరేజ్‌ వేరియంట్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999తో అందుబాటులో ఉండగా.. 8GB ర్యామ్‌, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో కూడిన మరో మోడల్‌ రూ.40,999తో లభిస్తోంది. లాంచ్ ఆఫర్లలో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడే కొనుగోలు చేసేవారికి కొన్ని బ్యాంక్‌లకు సంబంధించి క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేస్తే.. రూ. 3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అలాగే నో-కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ మిస్టీ ఫారెస్ట్, ప్యాషన్ రెడ్‌తో పాటు స్టార్రీ బ్లూ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. 

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది 6.57 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న సమయంలో మంచి అనుభూతి కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన భారీ 7,000mAh బ్యాటరీతో లాంచ్‌ అయ్యింది. అంతేకాకుండా దీని తోడు 80W సూపర్ ఊక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. అలాగే ఇది ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు కొన్ని రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తోంది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగంలో అద్భుతమై కెమెరా మాడ్యుల్‌ కూడా లభిస్తోంది. ఇవే కాకుండా ఇందులో 50MP మెయిన్ సెన్సార్ కెమెరాతో పాటు అదనంగా 2MP మోనోక్రోమ్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇక ఫ్రంట్‌ భాగంలో కూడా అద్భుతమైన కెమెరా కూడా లభిస్తోంది. ఇది సెల్ఫీల కోసం ఏకంగా 50MP కెమెరాతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ ఫ్రంట్‌ కెమోరా కూడా అత్యంత అద్భుతమై క్వాలిటీని కలిగి ఉంటుంది. 

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

ఇది లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మాక్స్ ప్రాసెసర్‌పై పని చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.. ఇది మల్టీ టాస్కింగ్‌తో పాటు స్పీడ్ విషయంలో యూజర్లకు ఎంతగానో పని చేస్తుంది..ఇది  IP69K రేటింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంది. కాబట్టి నీరుతో పాటు ధూళి నుంచి రక్షణ కల్పించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇది అద్భుతమైన అత్యాధునిక 5G కనెక్టివిటీతో అందుబాటులోకి వచ్చింది.. భారీ బ్యాటరీతో పాటు అద్భుతమైన సెల్ఫీ కెమెరా కావాలనుకునేవారు వారికి ఈ ఒప్పో F33 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ చాలా బెస్ట్‌..

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

RCB Vs GT Preview 2026: గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్..ఆర్సీబీలోకి విధ్వంసకర బ్యాటర్? ప్లేయింగ్ 11 పై లీక్ న్యూస్!

Bengaluru, Karnataka:

RCB Vs GT Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నేడు (ఏప్రిల్ 24) మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్ జట్టుతో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఆర్సీబీ గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పరాజయం పాలవ్వగా.. గుజరాత్ టైటాన్స్ జట్టు కూడా ముంబై ఇండియన్స్‌పై ఓటమి పాలైంది. 

ఆతిథ్య జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే.. రొమారియో షెపర్డ్, వికెట్ కీపర్ జితేష్ శర్మ ఈ సీజన్‌లో ఇప్పటివరకు వరుసగా కేవలం 39, 52 పరుగులు మాత్రమే చేయగలిగారు. కెప్టెన్ రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, కొంతమేర దేవదత్ పడిక్కల్ మినహా, డిఫెండింగ్ ఛాంపియన్ల మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.

ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. షెపర్డ్ స్థానంలో ఈ యువ ఆటగాడిని ఆర్సీబీ ప్లేయింగ్ 11లోకి తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 ప్రస్తుత సీజన్ కోసం ఆర్సీబీ జట్టు బెథెల్‌ను రూ.2.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఆడిన 97 టీ20 మ్యాచ్‌లలో, బెథెల్ 141.98 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 1843 పరుగులు సాధించాడు.

అలాగే గుజరాత్ టైటాన్స్ జట్టు తమ చివరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో 99 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత, శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని జట్టు కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటోంది. రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, రషీద్ ఖాన్ వంటి ఆటగాళ్లు వరుసగా 49, 67, 28 పరుగులు మాత్రమే చేసి బ్యాటింగ్‌లో రాణించడంలో విఫలమయ్యారు.

వెస్ట్ ఇండీస్ ఆల్-రౌండర్ జాసన్ హోల్డర్‌కు ఈ సీజన్‌లో ఇప్పటివరకు తుది జట్టులో అవకాశం రాలేదు. కానీ గుజరాత్ జట్టు ఫిలిప్స్‌ స్థానంలో అతడిని తుది 12 మందిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో హోల్డర్‌ను రూ.7 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లలో కేవలం 35 పరుగులు మాత్రమే చేసిన ఎం.షారుఖ్ ఖాన్ స్థానంలో యువ కుమార్ కుశాగ్రాను జట్టులోకి తీసుకునేందుకు ఆలోచన చేసే అవకాశం ఉంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్/జాకబ్ బెథెల్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ దర్.

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు అంచనా.. 
శుభమన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్ / కుమార్ కుషాగ్రా, జాసన్ హోల్డర్ / గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అశోక్ శర్మ.

Also Read: Foxconn Pregnant Incident: ఆఫీస్ టాయిలెట్‌లో ప్రసవించిన టీనేజ్ యువతి..వెంటనే బిడ్డ గొంతు కోసి చంపేసింది! కటకటాల్లోకి కసాయి తల్లి!

Also Read: Composite Salary Account: ఉద్యోగులకు ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్..ఉచితంగా రూ.కోటిన్నర..సులభంగా లోన్స్, క్యాష్‌బ్యాక్‌లు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Moto G87: త్వరలో భారత మార్కెట్లోకి మోటో G87.. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్.. ధర ఎంతంటే?

Hyderabad, Telangana:

Moto G87 Specifications Price Leaked: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా ఎప్పటికప్పుడు దిమ్మతిరిగే ఫీచర్స్‌తో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అయితే, ఇవి అత్యంత తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. త్వరలోనే మార్కెట్‌లోకి G సిరీస్‌ నుంచి మరో కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. ఇది మోటో G77  సక్సెసర్‌గా లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ Moto G87 స్మార్ట్‌ఫోన్‌ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు అధికార లాంచ్‌కి ముందే సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మోటో G87 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అద్భుతమై ఆరు వేర్వేరు రంగుల్లో అందుబాటులోకి  రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో షేడెడ్ స్ప్రూస్, ఆర్కిటిక్ సీల్, బ్లాక్ ఆలివ్ కలర్స్‌ చాలా అద్బుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని డిజైన్‌ కూడా చాలా ప్రీమియంగా ఉండబోతున్నట్లు సంచారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ చాలా ప్రత్యేకమైన  మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో విడుదల చేయబోతోంది. అలాగే 8GB ర్యామ్‌తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఆప్షన్‌లో మొదటగా లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన AMOLED డిస్ల్పేతో విడుదల కాబోతోంది. 

ఇది చాలా అద్భుతమైన ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో లాంచ్‌ అయ్యే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వెనక భాగంలో చాలా ప్రత్యేకమైన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో విడుదల కాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 5000mAh భారీ బ్యాటరీతో పాటు 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లాంచ్‌ కాబోతోంది. అలాగే పంచ్-హోల్ డిజైన్‌తో పాటు ప్రత్యేకమైన వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ వంటి అదనపు ఫీచర్లతో లాంచ్‌ లాంచ్‌ కాబోతోంది. 

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

ఈ మోటో G87 స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మొదటగా కేవలం ఒక్క స్టోరేజ్‌ వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 8GB + 256GB వేరియంట్‌లో లాంచ్‌ కాబోతోంది. దీని ధర దాదాపు రూ.44 వేల నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే, దీనిని కంపెనీ కాస్త ఎక్కువ ధరతోనే భారత మార్కెట్‌లోకి విడుదల చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ త్వరలో భారత మార్కెట్‌లోకి కూడా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Venus And Jupiter: రాజయోగం అంటే వీరిదే! ఆ మూడు రాశుల వారికి బంపర్ జాక్‌పాట్..

Hyderabad, Telangana:

Venus And Jupiter Conjunction 2026: జ్యోతిష్య శాస్త్రంలో రెండు గ్రహాలు కలయిక జరిపినప్పుడు యోగాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా రెండు శక్తివంతమైన గ్రహాలు సంయోగం జరిపినప్పుడు ఒక్కొక్క సందర్భంలో రెండు యోగాలు కూడా ఏర్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. అతి త్వరలోనే సంపదకు కారకుడైన శుక్రుడితో పాటు అదృష్టాన్ని ప్రసాదించే బృహస్పతి ఒకే రాశిలో కలయిక జరపబోతున్నాయి. దీని కారణంగా అన్ని రాశులవారిపై ఎంతో శక్తివంతమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా శుక్ర-గురు సంయోగంతో ఈ క్రింది మూడు రాశులవారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఈ సమయంలో తప్పకుండా ఉపశమనం కలుగుతుంది. అయితే, ఏయే రాశులవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందో? అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్:
మేష రాశి (Aries)
మేష రాశివారికి ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా జీవితంలో అద్భుతం జరుగుతుందని జ్యోతష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి పెండింగ్‌లో ఉన్న ప్రతి పని సులభంగా నెరవేరుతుది. అలాగే అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించి..భారీగా డబ్బులు కూడా సంపాదించే ఛాన్స్‌లు ఉన్నాయి. అలాగే పెండింగ్‌లో ఉన్న ప్రతి పని ఎంతో వేగంగా పూర్తవుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు పదోన్నతి (Promotion) లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న చోట ఉద్యోగం పొందుతారు.

మిథున రాశి (Gemini)
మిథున రాశివారికి అదృష్టం ఊహించని స్థాయిలో రెట్టింప అవుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దీని వల్ల డబ్బులు కూడా పెట్టుబడులు పెట్టే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉండి.. డబ్బులు కూడా ఊహించని స్థాయిలో పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు. దీంతో మార్కెట్‌లో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగే సూచనలు ఉన్నాయి. 

సింహ రాశి (Leo)
సింహ రాశివారికి ఈ రెండు రాజయోగాల కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అంతేకాకుండా ఆదాయం కూడా అనుకున్నంత స్థాయిలో పొందే ఛాన్స్‌లు ఉన్నాయి. ఆకస్మిక ధన లాభాలు కూడా తప్పకుండా పొందుతారు. అలాగే ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు ఎన్నో సమస్య నుంచి బయపడతారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Rtc Driver Death: ఆర్టీసీ డ్రైవర్ కన్నుమూత.. తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్.. కీలక నిర్ణయం..

Hyderabad, Telangana:

cm Revanth reddy reacts on narsampet rtc driver shankar goud death tragedy : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా తమ న్యాయపరమైన డిమాండ్లపై వెనక్కు తగ్గెదిలేదని ఆర్టీసీ జాక్ స్పష్టం చేసింది.  వరంగల్ లో నర్సంపేట్ కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ నిన్న పెట్రోల్ పొసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది. వెంటనే శంకర్ గౌడ్ ను ఆస్పత్రికి తరలించారు. నిన్న ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. తొలుత ఆయన అంబులెన్ లొ తీసుకెళ్తున్నప్పుడే చనిపోయారని ప్రచారం జరిగింది. కానీ దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖండించింది.

ఆయనకు ఐసీయూలో  చికిత్స  అందించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శంకర్ గౌడ్ 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని డీఆర్ డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.  దీంతో ఆర్టీసీ జాక్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులుఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకొవద్దరి ప్రభుత్వం స్పష్టం చేసింది.

మంత్రులతో జాక్ నేతలు చర్చలు జరిపి సమస్యల్ని పరిష్కరించుకొవాలన్నారు.  మరోవైపు డ్రైవర్ శంకర్ గౌడ్ కన్నుమూతపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.  శంకర్ గౌడ్ చనిపోవడంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అన్నివిధాలుగా సిద్దంగా ఉందన్నారు.

ఏ సమస్యలకైన చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందన్నారు. అంతే కాకుండా కార్మికులు తొందర పడి తమ జీవితాలను, తమకుటుంబాలలో కన్నీళ్లను మిగిల్చే పనులు చేయోద్దనిన సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.
 మరోవైపు ఈ రోజు తెలంగాణ మంత్రులు, ఆర్టీసీ జాక్ తో చర్చలు జరపనుంది.

Read more: RTC Strike: నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌ మృతి.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ చనిపోయిన శంకర్‌గౌడ్‌!

ఆర్టీసీ డ్రైవర్ కన్నుమూత  వేళ ఈ చర్చలపై తెలంగాన వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరోవైపు డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని , ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Telangana Cabinet Meeting: పీసీ ఘోష్‌ కమిషన్‌పై సంచలన నిర్ణయం.. తెలంగాణ మంత్రివర్గం నిర్ణయాలు ఇవే!

Hyderabad, Telangana:

Telangana Cabinet Meeting: ఉధృతంగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన పీసీ ఘోష్‌ నివేదికపై హైకోర్టులో ఎదురుదెబ్బ.. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులు కూడా పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇద్దరు ఉద్యోగులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం సత్వరమే స్పందించి చర్చలకు పిలవాలని నిర్ణయించింది. ఇక రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన పీసీ ఘోష్‌ కమిషన్‌పై న్యాయ నిపుణులతో చర్చించాలని మంత్రివర్గం తీర్మానం చేసింది.

Also Read: Telangana RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం.. రేపు ప్రభుత్వంతో ఆర్టీసీ సంఘాల చర్చ 

హైదరాబాద్‌లోని సచివాలయంలో గురువారం సాయంత్రం తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై రెండు గంటలపాటు చర్చించింది. ఈ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ఏడు నిర్ణయాలు ఇవే.

==> సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలని.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. సమస్యల పరిష్కారం కోసం అధికారుల కమిటీ వేసినట్లు గుర్తుచేసింది. రేపు ఉప ముఖ్యమంత్రి అధ్వర్యంలో చర్చలకు రావాలని కార్మిక సంఘాలకు మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. 

==> కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రివర్గం చర్చించింది. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే తీర్పునిచ్చిందని మంత్రివర్గంలో చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి 9 నెలలైనా దర్యాప్తు ప్రారంభం కాకపోవడంతో.. ప్రభుత్వం తరఫున మరోసారి సీబీఐని  కోరాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టుకు వెళ్లాలా.. లేదా అనేది నిర్ణయిస్తామని మంత్రివర్గం తెలిపింది.

Also Read: Kaleshwaram Project: మేరుపర్వతం లాంటి కేసీఆర్‌పై ఉమ్మేస్తే.. కాంగ్రెస్‌పైనే పడింది: బీఆర్‌ఎస్‌ పార్టీ

==> రిటైర్మెంట్ వయస్సు పెంపుతోపాటు రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతుండడాన్ని మంత్రివర్గంలో చర్చ జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా వెంటనే వారికి ఇచ్చే బకాయిల చెల్లింపులకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి.. అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అవసరమైతే తమ జీతాలు, ప్రజాప్రతినిధులకు ఇచ్చే జీతాల నుంచి 50 శాతం రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే సర్దుబాటు చేయాలని మంత్రులు ముందుకువచ్చారు. వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు, బాధ్యులైన వారందరినీ పిలిచి చర్చలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వంద రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు దిశగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.  

==> పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు (పీఏసీఎస్‌) నామినేట్ పద్ధతిన పాలకవర్గాల నియామకానికి మంత్రివర్గం ఆమోదం

==> హైదరాబాద్‌లోని గ‌చ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) ప‌ద్ధ‌తిలో అభివృద్ధి చేయాల‌నే ప్ర‌తిపాద‌న‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎక‌రాల్లో 21 ర‌కాల క్రీడా సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంతోపాటు ఔట్ డోర్ స్టేడియం సామ‌ర్థ్యం 20 వేల నుంచి 50 వేల‌కు పెంచాలని నిర్ణయించింది. స్విమ్మింగ్‌పూల్ సామ‌ర్థ్యం పెంపుతో పాటు స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు, క్రీడాకారుల‌కు వ‌స‌తి, శిక్ష‌ణ సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మిగిలిన 12 ఎక‌రాల‌ను డెవ‌ల‌పర్స్‌కు ఇచ్చి క‌మ‌ర్షియ‌ల్ యాక్ట‌విటీస్‌కు అనుమ‌తి, క‌మ‌ర్షియ‌ల్ యాక్ట‌విటీస్‌తో వ‌చ్చే రెవెన్యూను స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ నిర్వ‌హ‌ణ‌, క్రీడాకారుల వ‌స‌తి, శిక్ష‌ణ ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు ఉపయోగించాలని నిర్ణయం.

==> మంథని నియోజకవర్గంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయం. ఈ ప్రాజెక్టుతో మహాదేవ్‌పూర్, కాటారం, మల్హర్ రావు, మహముత్తారం మండలాల్లో దాదాపు 45 వేల ఎకరాలకు, 63 గ్రామాల  ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం

==> శ్రీ‌పాద ఎల్లంప‌ల్లి ప్రాజెక్టు ప‌రిస‌రాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ ప‌రిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. ఇరిగేష‌న్ డిపార్ట్ మెంట్కు  చెందిన 85.10 ఎక‌రాలను మ‌త్స్య శాఖ‌కు కేటాయిస్తూ నిర్ణయం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Telangana RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం.. రేపు ప్రభుత్వంతో ఆర్టీసీ సంఘాల చర్చ

Hyderabad, Telangana:

RTC Employees Strike: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉదృతంగా సాగుతుండడంతో రాజకీయంగానూ తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ సమ్మెలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి.. కార్మికులను చర్చలకు ఆహ్వానించింది. ఎవరూ ప్రాణాలు తీసుకోరాదని.. తాము సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. రేపు ఉప ముఖ్యమంత్రి చర్చిస్తారని.. దీనికి ఆర్టీసీ సంఘాలు రావాలని విజ్ఞప్తి చేశాయి.

Also Read: Kaleshwaram Project: మేరుపర్వతం లాంటి కేసీఆర్‌పై ఉమ్మేస్తే.. కాంగ్రెస్‌పైనే పడింది: బీఆర్‌ఎస్‌ పార్టీ

 

Also Read: Harish Rao: తెలంగాణ హైకోర్టుపై హరీశ్‌ రావు హర్షం.. సత్యమేవ జయతే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Kaleshwaram Project: మేరుపర్వతం లాంటి కేసీఆర్‌పై ఉమ్మేస్తే.. కాంగ్రెస్‌పైనే పడింది: బీఆర్‌ఎస్‌ పార్టీ

Hyderabad, Telangana:

Telangana High Court: 'కాళేశ్వరం కేసు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. మేరుపర్వతం లాంటి కేసీఆర్‌పై ఉమ్మేస్తే, తిరిగి కాంగ్రెస్ నాయకులపైనే పడింది. తెలంగాణ ప్రజానీకాన్ని ఒకతాటిపైకి తెచ్చి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్' అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. '1969లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పుడు తెలంగాణ కోసం 420 మంది అమరులయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌తో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ సాధించిన  నాయకుడు కేసీఆర్' అని వివరించారు.

Also Read: Harish Rao: తెలంగాణ హైకోర్టుపై హరీశ్‌ రావు హర్షం.. సత్యమేవ జయతే!

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సాధించిన తెలంగాణలో రైతులు సంతోషంగా ఉండాలని ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మించారు. సుంకిశాల వాల్, పెద్దవాగు, వట్టెం మునిగిపోయింది, ఎస్ఎల్బీసీ కుంగిపోయి 8 మంది చనిపోయారు. దీనిపై ఎందుకు విచారణ చెయ్యలేదు' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిలదీశారు. 'కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బ్యారేజ్ మేడిగడ్డ.. అందులో రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయి. 8బీ, 8సీ ద్వారా నోటీసులు ఇవ్వకుండా కాళేశ్వరం కేసు విషయంలో విచారణ చేశారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాదు, అన్ని వర్గాల వారు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారు' అని వివరించారు.

Also Read: KCR Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కేసీఆర్‌, హరీశ్‌ రావుకు భారీ ఊరట

'కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చింది. రెండేళ్లకుపైగా అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆర్టిసి కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చెయ్యడం లేదు. బీఆర్ఎస్ పార్టీ హయంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మంత్రివర్గం‌లో నిర్ణయం తీసుకొని వాటిని పరిష్కరించేలా ఆ ఫైల్‌ను గవర్నర్ దగ్గరకు పంపించాం. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది' అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గుర్తుచేశారు. 'వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలో టెంట్ హౌస్ వారికి పోలీస్ హెచ్చరిక జారీ చేస్తూ నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు టెంట్ సామాన్లు ఇవ్వరాదు అని నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్, దీనిపై రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలి' అని డిమాండ్‌ చేశారు. 

Also Read: SRH vs DC Highlights: ఉప్పల్‌లో ఢిల్లీ చిత్తు.. అభిషేక్‌ సెంచరీతో హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయం

'కాళేశ్వరం అంటే 100 కంపోనెట్లు అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఒకటి, మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిపోతే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి లక్ష కోట్ల అవినీతి అంటూ మాపై దుష్ప్రచారం చేశారు. మేడిగడ్డలో కుంగిన రెండు పిల్లర్లను రిపేర్ చేస్తామని ఎల్‌ అండ్‌ టీ ముందుకు వస్తే బెదిరించారు. మేడిగడ్డ కుంగినప్పుడు ఆగమేఘాల మీద వచ్చిన ఎన్‌డీఎస్‌ఏ, ఎస్‌ఎల్‌బీసీ కుంగి 8 మంది చనిపోతే ఎందుకు రాదు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సందేహం వ్యక్తం చేశారు.

'కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి ధాన్యం వచ్చింది. వచ్చిన ధాన్యం చూసి కేంద్రమే ఆశ్చర్యపోయింది. ఆఖరికి వరి మేము కొనలేమని కేంద్రం చెప్పింది. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే వరి సాగు అత్యధికంగా వచ్చిందని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసుకుంది' అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వివరించారు. 'ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది, పరిపాలన మంచిగా చెయ్యమని, బిఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసం కాదు' అని కాంగ్రెస్‌ పార్టీకి హితవు పలికారు.

'కేరళ రాష్ట్రానికి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని అబద్ధాలు ప్రచారం చేశారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి ఎన్డీఏ కూటమి నేతలతో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి అలా చేస్తుంటే తెలంగాణలో ఉండే. నిజమైన కాంగ్రెస్ నాయకులకు సోయి లేదా? రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన నడుస్తుంది' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కేసు విషయంలో హై కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పరిపాలన చేయాలని హితవు పలికారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Foxconn Pregnant Incident: ఆఫీస్ టాయిలెట్‌లో ప్రసవించిన టీనేజ్ యువతి..వెంటనే బిడ్డ గొంతు కోసి చంపేసింది! కటకటాల్లోకి కసాయి తల్లి!

Chapparadahalli, Karnataka:

Foxconn Teenage Pregnancy Incident: మన సమాజంలో చెడ్డ తండ్రి ఉండవచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు అనే నానుడి ఉండేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా మార్చేసే పరిస్థితి వచ్చింది. అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో ఓ దుర్ఘటన ఉదాహరణగా మారింది. ఓ టీనేజ్ యువతి తాను పనిచేసే కంపెనీ టాయిలెట్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన వెంటనే ముక్కపచ్చలారని ఆ బిడ్డను గొంతు కోసి చంపేసింది ఆ మహాతల్లి. ఇంతకీ ఆ సంఘటన ఏంటి? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఉద్యోగినిగా పనిచేస్తున్న ఓ టీనేజ్ యువతి టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. టాయిలెట్‌లో ప్రసవించి, ఆ తర్వాత వెంటనే అప్పుడే పుట్టిన శిశువును చంపేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రసిద్ధ ఆపిల్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ అయిన ఫాక్స్‌కాన్.. బెంగళూరులోని దేవనహళ్లి యూనిట్‌లో ఈ దుర్ఘటన జరగడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

ఫాక్స్ కాన్ ఉద్యోగుల సమాచారం ప్రకారం.. నిందితురాలు రేణుక తన షిఫ్ట్‌లో పనిచేస్తుండగా మధ్యలో టాయిలెట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రసవం ఆకస్మికంగా జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసు నివేదికల ప్రకారం.. ప్రసవించిన తర్వాత ఆ టీనేజర్ పదునైన వస్తువుతో శిశువు గొంతు కోసి, మృతదేహాన్ని ఒక సంచిలో పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే రోజు ఉదయం మరో ఉద్యోగి రెస్ట్‌రూమ్‌లోకి ప్రవేశించి, మృతదేహాన్ని చూసి, వెంటనే ఫ్యాక్టరీ సెక్యూరిటీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఈ సంఘటన బయట పడింది.

ఈ దారుణానికి పాల్పడిన నిందితురాల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతి తన గర్భాన్ని దాచిపెట్టిందా, ఆమె పరిస్థితి గురించి మరెవరికైనా తెలుసా అనే విషయాలతో సహా, అధికారులు సంఘటనల క్రమాన్ని విచారిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. దర్యాప్తులో తేలిన విషయాల ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

Also Read: Moving OYO Scandal: 108 అంబులెన్స్‌లో రొమాన్స్..ఒకే అమ్మాయితో ఇద్దరు అబ్బాయిలు అడ్డంగా దొరికిపోయారు! లైవ్‌లో వీడియో రికార్డు!

Also Read: Composite Salary Account: ఉద్యోగులకు ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్..ఉచితంగా రూ.కోటిన్నర..సులభంగా లోన్స్, క్యాష్‌బ్యాక్‌లు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Composite Salary Account: ఉద్యోగులకు ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్..ఉచితంగా రూ.కోటిన్నర..సులభంగా లోన్స్, క్యాష్‌బ్యాక్‌లు!

Hyderabad, Telangana:

Composite Salary Account Benefits: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్ అందించింది. ఇటీవలే డీఏ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మరో శుభవార్త ఉద్యోగుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఆర్థిక భద్రతతో పాటు సంక్షేమాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీ అనే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో అనగా 2026లో ఈ పథకాన్ని అధికారికంగా బలోపేతం చేశారు. ఇది సాధారణ బ్యాంకింగ్ సేవలతో ఇతర ఇన్సూరెన్స్, లోన్స్‌తో పాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగులకు ఒకే దగ్గర అందించే విధంగా ఈ ప్యాకేజీని రెడీ చేశారు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంతో పాటు ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజ్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. 2026 జనవరి 14న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఇందులో సాధారణ బ్యాంకింగ్ సేవలతో పాటు ఇన్సూరెన్స్, లోన్స్ వంటి వాటితో పాటు అనేక సదుపాయలు ఒకే దగ్గర అందుబాటులో ఉంచేలా ఈ ప్రక్రియ ఉండనుంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకం అన్ని విభాగాల ఉద్యోగులకు (A, B, C, D) పారామిలటరీ, మిలటరీతో పాటు ఇతర భద్రతా దళాల సిబ్బందికి ఇది వర్తించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ కొత్త పథకంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. బ్యాంకింగ్ సౌకర్యాలలో జీరో బ్యాలెన్స్ శాలరీ ఖాతాతో పాటు RTGS, NEFT, IMPS, UPI లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయరు. అలాగే ఉచిత మల్టీ-సిటీ చెక్ బుక్‌లు, లాకర్ అద్దె, డిమాండ్ డ్రాఫ్ట్‌లపై ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. అలాగే మీరు హౌస్, ఎడ్యుకేషన్, వెహికల్, పర్సనల్ వంటి ఏవైనా లోన్స్ తీసుకున్నా.. వాటిపై అతి తక్కువ వడ్డీతో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు లోన్ తీసుకున్న వారికి ప్రాసెసింగ్ ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఇతర ఛార్జీలపై భారీగా తగ్గింపు ఇచ్చే అవకాశం ఉంది.

ఈ పథకంలో నమోదైన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగికి రూ.1.5 కోట్ల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లభిస్తోంది. దీంతో పాటు రూ.2 కోట్ల వరకు విమాన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. ఉద్యోగుల శాశ్వత, పాక్షిక వైకల్యంపై రూ.1.5 కోట్ల బీమా.. అలాగే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రూ.20 లక్షల బీమా వరకు పొందవచ్చు. దీంతో పాటు ఇన్సూరెన్స్‌లపై అదనపు టాప్-అప్ సదుపాయంతో కుటుంబం మొత్తానికి సమగ్ర ఆరోగ్య బీమా సౌకర్యం పొందవచ్చు. డెబిట్ , క్రెడిట్ కార్డులపై మెరుగైన రివార్డ్స్, ఎయిర్‌పోర్ట్ లౌంజ్, క్యాష్‌బ్యాక్ సౌకర్యాలు పొందవచ్చు.

అయితే కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బ్యాంక్-లింక్డ్ ప్యాకేజీ ప్రస్తుతం అమలులో ఉన్న CGEGISను భర్తీ చేయదని సమాచారం. కానీ, ఇదో అదనపు ప్రయోజనంగా ఉద్యోగులకు కలిసొస్తుందని అంటున్నారు. అటు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలతో పాటు ఇటు బ్యాంక్ ఇచ్చే బీమా కవరేజీని కూడా పొందడం లాభంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.

Also Read: Moving OYO Scandal: 108 అంబులెన్స్‌లో రొమాన్స్..ఒకే అమ్మాయితో ఇద్దరు అబ్బాయిలు అడ్డంగా దొరికిపోయారు! లైవ్‌లో వీడియో రికార్డు!

Also Read: Petrol Price Hike: పెట్రోల్, డీజిల్‌ ధరలపై రూ.25 నుంచి రూ.28 పెంపు! కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Moving OYO Scandal: 108 అంబులెన్స్‌లో రొమాన్స్..ఒకే అమ్మాయితో ఇద్దరు అబ్బాయిలు అడ్డంగా దొరికిపోయారు! లైవ్‌లో వీడియో రికార్డు!

Chhatarpur, Madhya Pradesh:

Moving OYO Scandal Video in MP: ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్‌లో లవర్స్ లైంగిక కార్యాకలాపాలు చేస్తున్నారు. ఒకే అంబులెన్స్‌లో ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు అనైతిక కార్యకలాపాలు పాల్పడడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి బాసటగా నిలిచిన 108 అంబులెన్స్‌లో హోటల్‌గా మార్చుకొని రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డారు. 

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాల్సిన అంబులెన్స్, యువతీ యువకులకు లైంగిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఆ రాష్ట్రంలోని ఓ 108 అంబులెన్స్ లవర్స్‌కు 'కదులుతున్న ఓయో' లాగా మారింది. అంబులెన్స్‌లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం పట్ల ఇప్పుడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వైరల్ అయిన వీడియో ప్రకారం.. అంబులెన్స్ లోపల అనుమానాస్పద కార్యకలాపాలు జరగడం స్థానికులు గమనించారు. ఆ వెంటనే అంబులెన్స్‌ను వెంబడించ సాగారు. సుమారు 5 కిలోమీటర్ల దూరం ఆ అంబులెన్స్‌ను వెంబడించిన తర్వాత చివరికి అంబులెన్స్‌ను ఆపారు. ఈ సమయంలో, వాహనం లోపల ఒక యువతి, ఇద్దరు యువకులు కనిపించారు.

అంబులెన్స్‌ను ఆపినప్పుడు అందులో రోగి గానీ, అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆనవాళ్లు గానీ లేవు. పైగా, ఆ అంబులెన్స్‌ను లవర్స్‌కు ఓయో హోటల్ స్పాట్‌గా వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానికులు ప్రశ్నించగా.. లోపల ఉన్నవారు తాము 'కుటుంబ సభ్యులం' అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ, ముఖం కప్పుకుని కూర్చున్న ఆ యువతి దృశ్యాలు, ప్రజల ఆగ్రహాన్ని చూపిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ అంబులెన్స్ సేవను దుర్వినియోగం చేయడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. పోలీసులు ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించి, అధికారిక నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చర్య ఇప్పుడు మొత్తం వైద్య సేవా వ్యవస్థ విశ్వసనీయతపై ప్రశ్నలను లేవనెత్తింది.

Also Read: Petrol Price Hike: పెట్రోల్, డీజిల్‌ ధరలపై రూ.25 నుంచి రూ.28 పెంపు! కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..

Also REad; MI Vs CSK Preview: ముంబై వర్సెస్ చెన్నై..ధోనీ ఆడుతున్నాడా లేదా? ఈరోజు తుదిజట్టులో ధోనీ, రోహిత్ ఉంటారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

OnePlus మాస్టర్‌ప్లాన్.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో OnePlus 16 లీక్!

Hyderabad, Telangana:

OnePlus 16 Leak: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తమ కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ వన్‌ప్లస్ 16 (OnePlus 16) స్మార్ట్‌ఫోన్‌ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఏ స్మార్ట్‌ఫోన్‌లోనూ చూడని అత్యంత శక్తివంతమైన ఫీచర్లు ఈ మొబైల్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గేమింగ్ ప్రియులతో పాటు టెక్ ప్రియులను ఆకట్టుకునేలా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు బ్యాటరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటనకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ ఇటీవలే లీక్‌ అయ్యాయి. అవేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన డిస్ల్పే ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇందులో 6.78 అంగుళాల కస్టమ్ BOE LTPO ప్యానెల్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది ఏకంగా 240Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సంచారం.. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్‌ కేవలం  120Hz, 144Hzకే పరిమితమవ్వగా.. వన్‌ప్లస్ త్వరలో విడుదల చేయబోయే స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 240Hz ఉండడం విశేషం.. దీనివల్ల ఫోన్ వాడే క్రమంలో గేమింగ్ చేసే సమయంలో మంచి స్మూతింగ్‌ను అందిస్తుంది. 

ఈ OnePlus 16 స్మార్ట్‌ఫోన్‌లో పెర్ఫార్మెన్స్ విషయంలోనూ వన్‌ప్లస్ ఎక్కడా తగ్గడం లేనట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ క్వాల్‌కామ్ నుంచి వస్తున్న అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో (Snapdragon 8 Elite Gen 6 Pro) చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మల్టీటాస్కింగ్‌ చేయడంతో పాటు భారీ యాప్‌లను కూడా ఎంతో సులభంగా వినియోగించవచ్చు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

వన్‌ప్లస్ 16లో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వెనక భాగంలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ కెమెరాలతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో అదనంగా మరో కెమెరా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉన్నట్లు సమాచారం.. దీనికి తోడుగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా లభిస్తోంది. అయితే, దీనిని కంపెనీ అక్టోబర్ నెలలో చైనాలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.60 వేలు ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. 

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement
Advertisement
Back to top