ప్రొఫెసర్ జైశంకర్ 90వ జయంతి వేడుకలు
Hyderabad, Telangana:ప్రొఫెసర్ జైశంకర్ 90వ జయంతి సందర్భంగా ఎల్బీనగర్లోని ప్రొఫెసర్ జైశంకర్ విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు, విశ్వకర్మ పంచ వృత్తి దారుల సంగ నాయకులు, కార్పొరేటర్ భిక్షపతి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమనేత జాతిపిత అని, ప్రభుత్వ శక్తితో జయశంకర్ జయశంకర్ విగ్రహాన్ని ట్యాంక్బండ్పై ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Karimnagar: యాసంగి వడ్లు అమ్ముడుపోలే.. కొత్త పంటకు పెట్టుబడి ఎల్లా? రైతుల ఆవేదన..
Hyderabad, Telangana:Karimnagar Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరి పండించిన అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒకవైపు వానకాలం సీజన్ సమయం ప్రారంభమై రోహిణి కార్తె ప్రవేశించినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం కొనుగోలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. కొత్త పంట సాగుకు నారు పోసే సమయం వచ్చినప్పటికీ.. పాత పంట అమ్ముడుపోక జిల్లాలోని రైతాంగం ఆందోళన చెందుతోంది. నెలలో తరబడి ధాన్యపు కుప్పల ముందే కాపలా కాస్తూ.. కొనుగోలు కేంద్రాల్లోనే అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు.
ఉమ్మడి జ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఐకెపితో పాటు సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చి వారాలు గడుస్తున్నప్పటికీ అధికారులు, మిల్లు యజమానులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తూకాలు వేయడంలో జాప్యంతో పాటు గైడ్లైన్స్ పేరుతో తరుగు తీయడం, బార్కోడ్ తదితర సాంకేతిక కారణాలవల్ల కొనుగోళ్ల ప్రక్రియ తీవ్రంగా ఆలస్యం అవుతోంది. దీనికి తోడు అకాల వర్షాలు కురుస్తుండడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న దాన్యం తడిసి ముద్దవుతోంది.. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు..
ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైంది. జూన్ మొదటి వారంలోనే విత్తనాలు వేసి.. నారుమడులు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.. కానీ గత యాసంగి పంట ఇంకా అమ్ముడుపోకపోవడంతో రైతుల చేతుల్లో చిల్లి గవ్వలేని పరిస్థితి నెలకొంది.. ధాన్యం అమ్ముడైతేనే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయి.. ఆ డబ్బులతోనే విత్తనాలతో పాటు ఎరువులు కొనుగోలు చేసి కొత్త పంటకు పెట్టుబడి పెట్టాలని రైతులు భావిస్తారు. అయితే కొనుగోలు సాగకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు అప్పులు ఇచ్చేందుకు కూడా ముందుకు రాకపోవడం రైతులను ఇరకాటంలో పడేసింది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
జిల్లా యంత్రాంగంతో పాటు మార్కెటింగ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో మిల్లుల కేటాయింపు సమస్యలను పరిష్కరించాలని.. తూకాలను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వర్షాల ముప్పు పొంచి ఉన్నందున యుద్ద ప్రాతిపదికన ధాన్యాన్ని మిల్లులకు తరలించి.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని పల్లెల్లో డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ప్రభుత్వం స్పందించి ఆదుకోకపోతే ఈ ఏడాది వానాకాలం సాగు ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు సైతం హెచ్చరిస్తూ వస్తున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Vaibhav Suryavanshi: భారీగా పెరిగిన వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ..15 ఏళ్ల వయసులో కోట్లు సంపాదిస్తున్నాడు!
Hyderabad, Telangana:Vaibhav Suryavanshi Net Worth: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ప్రస్తుతం ఓ కుర్రాడి పేరు మారుమోగిపోతుంది. అదే వైభవ్ సూర్యవంశీ. వయసు చిన్నదే అయినా, బ్యాటింగ్కు వస్తే చాలు ప్రత్యర్థి బౌలర్ ఎవరనేది చూడకుండా బౌండరీలే లక్ష్యంగా చెలరేగిపోయే ఈ యువ సంచలనం, యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. కేవలం ఆటలోనే కాదు, సంపాదనలోనూ ఈ 15 ఏళ్ల కుర్రాడు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఈ సెన్సేషనల్ ప్లేయర్ నెట్ వర్త్ (ఆస్తుల విలువ) గురించిన ఆసక్తికర విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్లో రూ.1.1 కోట్ల ప్రయాణం!
బిహార్లోని సమస్తిపూర్కు చెందిన వైభవ్ సూర్యవంశీ, 2025లో కేవలం 14 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ (RR) తరఫున ఐపీఎల్ బరిలోకి దిగాడు. ఆ ఏడాది మెగా వేలంలో రాజస్థాన్ ఫ్రాంచైజీ ఏకంగా రూ.1.1 కోట్లు పెట్టి ఈ కుర్రాడిని కొనుగోలు చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, తాను ఆడిన మూడో మ్యాచ్లోనే కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది, తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక ఇటీవల జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి సృష్టించిన విధ్వంసం క్రికెట్ అభిమానులకు పూనకాలు తెప్పించింది.
వైభవ్ సూర్యవంశీ ఆస్తుల వివరాలు..
ప్రస్తుతం వైభవ్ నెట్ వర్త్ సుమారు రూ.7 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఒకవేళ బ్రాండ్ స్పాన్సర్షిప్ ఒప్పందాలను కూడా కలిపితే ఈ మొత్తం రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అతడి ఆదాయ వనరుల వివరాలు ఇలా ఉన్నాయి. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ నుండి ప్రతి సీజన్కు రూ.1.1 కోట్ల శాలరీ లభిస్తుంది. అలాగే ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్కు రూ.7.5 లక్షల చొప్పున లభిస్తుంది. ఇప్పటివరకు 22 మ్యాచ్లు ఆడిన వైభవ్, మ్యాచ్ ఫీజుల రూపంలోనే దాదాపు రూ. 1.65 కోట్లు సంపాదించాడు.
అలాగే వైభవ్ సూర్యవంశీకి ముంబైలో రూ.3 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్మెంట్, అలాగే బిహార్లోని స్వస్థలంలో రూ.60 లక్షల విలువైన సొంత ఇల్లు ఉన్నాయి. వీటితో పాటు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనల ద్వారా వచ్చిన బహుమతులు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ క్యాష్ ప్రైజ్లు అదనం.
అమాంతం పెరిగిన బ్రాండ్ వాల్యూ!
వైభవ్ సూర్యవంశీ మైదానంలో చూపిస్తున్న అగ్రెసివ్ బ్యాటింగ్ శైలి కార్పొరేట్ కంపెనీలను ఎంతగానో ఆకర్షిస్తోంది. దీంతో అతడి బ్రాండ్ ఎండార్స్మెంట్లు, స్పాన్సర్షిప్ డీల్స్ విలువ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఉన్న క్రేజ్ దృష్ట్యా మున్ముందు ఈ యువ ఆటగాడి బ్రాండ్ వాల్యూ మరిన్ని కోట్లకు చేరడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తానికి 15 ఏళ్ల వయసులోనే అటు ఆటతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను, ఇటు సంపాదనతో కోట్ల రూపాయలను గెలుచుకుంటూ వైభవ్ సూర్యవంశీ ఇండియన్ క్రికెట్లో మోస్ట్ వాంటెడ్ యంగ్ స్టార్గా దూసుకుపోతున్నాడు.
Also Read: హైదరాబాద్ Vs రాజస్థాన్ ఎలిమినేటర్ పోరు..ఈ మ్యాచ్లో ఓడితే ఇంటికే! గెలుపు ఎవరిది?
Also Read: హేమమాలిని చేతికి ధర్మేంద్ర 'పద్మవిభూషణ్' అవార్డు..వెక్కివెక్కి ఏడ్చిన కుటుంబం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th Pay Commission latest update: ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లేనా.. 8వ వేతన సంఘంలో భారీ జీతాల పెంపు కష్టమేనా? కేంద్రం ప్లాన్ ఇదే..!!
Lakshmapur, Telangana:8th Pay Commission latest update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సుల పెంపునకు సంబంధించి ఉద్యోగల సంఘాలకు, వేతన సంఘం సభ్యులకు మధ్య సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పెంపు అమలు జీతాల మార్పులపై స్పష్టత కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తుండగా ఈ వరుస సమావేశాలు వారి ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లయ్యిందని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఉద్యోగ సంఘాలు చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించకపోవచ్చన్న వార్తలు వస్తుండటంతో.. ఈ సారి భారీ వేతన పెంపుపై వారి ఆశలు సన్నగిల్లుతున్నాయి.
8వ వేతన సంఘం కోసం కార్మిక సంఘాలు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లలో ఒకటి ఫిట్ మెంట్ ఫ్యాక్టర్. దీన్ని 3.83కి పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న జీవన వ్యయాల కారణంగా ప్రజల కొనుగోలు శక్తి నిరంతరం క్షీణిస్తుంది. దాన్ని భర్తీ చేసేందుకు ఈ మార్పులు అవసరమని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నారు. అయితే ఈ ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ అమలు అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే 7వ వేతన సంఘం 2.57 ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను అమలు చేసింది. ఈ సారి భారీ పెరుగుదల అవకాశం లేనట్లే అని తెలుస్తోంది. అందువల్ల భారీ వేతన పెంపును ఆశిస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశే ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి?
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒక ఉద్యోగి వేతనాన్ని సవరించడానికి ముందున్న బేసిక్ పే ను కొత్తగా సవరించిన మూల వేతన నిర్మాణంలోకి మార్చడానికి కేంద్ర వేతన సంఘం ఉపయోగించే ఒక గుణకం. దీనికి ఉపయోగించే ప్రధాన సూత్రం.. ప్రస్తుత ప్రాథమిక వేతనం x ఫిట్మెంట్ ఫ్యాక్టర్ = కొత్త ప్రాథమిక వేతనం ఇది. ఉదాహరణకు 7వ కేంద్ర వేతన సంఘం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను అమలు చేసింది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస మూల వేతనం 6వ వేతన సంఘం కింద ఉన్న రూ. 7,000 నుండి రూ. 18,000కు పెరిగింది.
కాబట్టి లెక్క ప్రకారం - రూ. 7,000x2.57= రూ. 18,000
Also Read: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్అలర్ట్.. Pension డబ్బులు రావాలంటే Form 10C తప్పనిసరి
6వ, 7వ వేతన సంఘాల సమయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అంతకుముందు వేతన సంఘాలు వేతన హేతుబద్ధీకరణ, డిఏ విలీనాలు, అవసరాల ఆధారిత వేతన గణనలతో సహా జీతాలను సవరించడానికి మరింత సంక్లిష్టమైన విధానాలను అనుసరించాయి. ఎందుకంటే జీతాలలో ఏదైనా ఆకస్మిక పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వేతన స్కేళ్లను సవరించడానికి పురికొల్పే అవకాశం ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో పెన్షన్, పదవీ విరమణ సంబంధిత ఖర్చులలో భారీ పెరుగుదలకు దారి తీస్తుంది. అందువల్ల..ప్రభుత్వం భారీ పెంపును ఆమోదించడానికి బదులుగా చివరికి సమతుల్య లేదా మితమైన సూత్రాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
కాగా ఇప్పటి వరకు మన దేశంలో 7 వేతన సంఘాలు ఏర్పాటు అయ్యాయి. 1946 జనవరిలో ప్రభుత్వం మొదటి వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ప్రతి 10ఏళ్లకోసారి ఒక కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తోంది. తాజాగా 8వ వేతన సంఘాన్ని నవంబర్ 3, 2025న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Also Read: పీఎం యశస్వి యోజన అంటే ఏంటి? అర్హులెవరు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Rain Alert: ఏపీలో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. ఉరుములు, పిడుగులతో అంతా అల్లకల్లోలం!
Vijayawada, Andhra Pradesh:AP Rain Alert Update: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం వేగంగా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాగల కొన్ని గంటల్లో తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఓ ప్రకటనలో వెల్లడించింది. ముఖ్యంగా కోస్తాంధ్రాలోని నాలుగు ప్రధాన జిల్లాల్లో రాబోయే 3 గంటల వ్యవధిలో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తలు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ప్రఖర్ జైన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. వాతావరణ తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సదరు జిల్లాలకు అధికారులు 'ఆరెంజ్ అలెర్ట్' ప్రకటించారు.
ప్రస్తుత వాతావరణ ఉపగ్రహాల సమాచారం ప్రకారం.. గోదావరి తీర ప్రాంతాలు మరియు పరిసర జిల్లాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి..ఈ నాలుగు జిల్లాల్లోని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ, తీర ప్రాంతాల ప్రజలు రాబోయే కొన్ని గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. వర్షం పడే సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. సాధారణ వర్షపాతంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ వేగంతో వీచే గాలుల వల్ల బలహీనంగా ఉన్న ఇళ్ల కప్పులు, పాత గోడలు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే రోడ్ల పక్కన ఉండే తాత్కాలిక షెడ్లు, ప్రకటనల బోర్డులు (హోర్డింగ్స్) ఊడిపడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలి.
ఈ వాతావరణ మార్పుల్లో అత్యంత ప్రమాదకరమైన అంశం 'పిడుగుపాటు'. ఇటీవలి కాలంలో పిడుగుల వల్ల ప్రాణనష్టం పెరుగుతున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
1) వర్షం ప్రారంభం కాగానే చాలామంది తలదాచుకోవడానికి చెట్ల కిందకు వెళ్తుంటారు. పిడుగులు ఎత్తైన చెట్లపై పడే అవకాశం 90% ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షం, ఉరుములు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడడం మంచిది కాదు.
2) విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండడం మేలు. ఈదురు గాలుల వల్ల విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉంది. అలాగే లోహపు స్తంభాలు పిడుగులను త్వరగా ఆకర్షిస్తాయి. కాబట్టి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద అస్సలు నిలబడకూడదు.
3) వ్యవసాయ పనుల్లో ఉండే రైతులు, కూలీలు, అలాగే పశువుల కాపరులు ఉరుముల శబ్దం వినబడగానే బహిరంగ ప్రదేశాలు, చెరువు గట్లు, పొలాల్లో ఉండకుండా వెంటనే సురక్షితమైన కాంక్రీట్ భవనాల్లోకి వెళ్లాలి.
సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి..
విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ గారు మాట్లాడుతూ.. ప్రాణనష్టాన్ని నివారించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రాకూడదని, టీవీలు, రేడియోలు లేదా అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వాతావరణ అప్డేట్లను గమనిస్తూ ఉండాలని కోరారు. స్థానిక యంత్రాంగం, విపత్తు సహాయక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
Also Read: 'మహానాడు'లో విందు అదిరిపోయే విందు..వెజ్ నుంచి నాన్వెజ్ వరకు ఎన్ని వెరైటీలంటే!
Also Read; తెలంగాణలో 'పెద్ది' రిలీజ్కు లైన్ క్లియర్..ఒకే మాటపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lava Bold N2 5g: చైనా ఫోన్లకు చెక్.. రూ.13 వేలకే Lava Bold N2 5G లాంచ్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే!
Hyderabad, Telangana:Lava Bold N2 5g Teased In India: భారతదేశ ప్రముఖ దేశీ మొబైల్ బ్రాండ్ లావా మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయడానికి సిద్ధమైంది. చైనాకు చెందిన వివోతో పాటు షియోమి, గ్లోబల్ బ్రాండ్ సాంసంగ్ కంపెనీల బడ్జెట్ ఫోన్లకు గట్టి పోటీనిస్తూ.. లావతన బోల్డ్ ఎన్2 5G (Lava Bold N2 5G) ఫోన్ను త్వరలో దేశీ మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. ఎందుకు సంబంధించిన అధికారిక టీజర్ను కంపెనీ ఇటీవలే విడుదల చేసింది. ఈ టీజర్ను బట్టి చూస్తే.. మొబైల్ అద్భుతమైన ఫీచర్లతో, దిమ్మ తిరిగే డిజైన్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..
ఈ Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని డిజైన్.. ఇది గత మోడల్స్ కంటే ఎంతో ప్రత్యేకమైన డిజైన్తో మార్కెట్లోకి విడుదల కాబోతోంది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా ఫీచర్లతో విడుదలవ్వడం విశేషం. దీని వెనక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్తో పాటు అద్భుతమైన ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ను కూడా అందిస్తున్నారు. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో రాబోయే సెకండరీ కెమెరా కూడా కొన్ని రకాల ప్రత్యేకమైన ఫీచర్స్ ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం..
ఈ Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లావా కంపెనీ నో నాన్సెన్స్ ఫోన్ అనే ట్యాగ్ లైన్తో ప్రమోట్ చేస్తూ వస్తోంది. అంటే ఎలాంటి అనవసరమైన యాప్లు, విసిగించే ప్రకటనలు లేకుండా వినియోగదారులకు అద్భుతమైన క్లీన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అనుభూతిని అందిస్తుంది. అదేవిధంగా ఈ మొబైల్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ 6.75 ఇంచుల హెచ్డీ ప్లస్ (HD+) ఎల్సీడీ డిస్ప్లేతో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది 90Hz రీఫ్రెష్ రేట్తో స్మూత్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుంది. అలాగే ఈ మొబైల్ రోజంతా బ్యాటరీ లైఫ్ ని అందించేందుకు ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో అందుబాటులోకి తీసుకురాబోతోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
అదేవిధంగా ఇందులో కంపెనీ ఆక్టా-కోర్ ప్రాసెసర్తో పాటు 4GB ర్యామ్, వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు సెక్యూరిటీ కోసం ఫోన్ సైడ్ ప్యానల్లో ఫింగర్ప్రింట్ స్కానర్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. దీంతోపాటు దుమ్ము, నీటి తుంపరల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ను కలిగి ఉంటుంది. ఈ లావా బోల్డ్ ఎన్2 5G (Lava Bold N2 5G) స్మార్ట్ఫోన్ను కంపెనీ బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ బేస్ వేరియంట్ను కేవలం రూ.13 వేలతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అలాగే ఇది మార్కెట్లోకి విడుదల అయితే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు లావా కంపెనీ ఈ ఫోన్తో పాటు ఉచిత హోం సర్వీసింగ్ కూడా అందిస్తుంది. దీనివల్ల ఇంటి వద్దకే వచ్చి ఉచితంగా మొబైల్ రిపేర్ చేసే సదుపాయం లభిస్తుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahabubnagar: సినిమా ఫక్కీలో ATM దోపిడీ.. గ్యాస్ కట్టర్తో కోసి.. రూ.2.30 లక్షలతో పరార్!
Hyderabad, Telangana:Mahabubnagar ATM Theft Latest News: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సినిమా ఫక్కీలో ఒక భారీ చోరీ జరిగింది.. అర్ధరాత్రి వేళ ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ఒక ATM సెంటర్లోకి చొరబడిన దుండగులు.. ఏకంగా ఏటీఎం మిషన్నే పెగిలించుకొని వాహనంలో ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో దాన్ని గ్యాస్ కట్టర్ తో ముక్కలు చేసి అందులో ఉన్న రూ.2.30 లక్షల నగదుతో అక్కడి నుంచి వారి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకాలం రేపుతోంది..
పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీగా ఉండే తెలంగాణ చౌరస్తా వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM సెంటర్ ను దుండగులు టార్గెట్ చేశారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఒక బొలెరో వాహనంలో నలుగురు నుంచి ఐదుగురు దొంగలు ఇక్కడికి చేరుకున్నారు.. లోపలికి ప్రవేశించగానే ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మొదటగా ఏటీఎం సెంటర్లో ఉన్న పవర్ సప్లై తో పాటు ఇతర కనెక్షన్స్ అన్నిటిని కట్ చేశారు. అనంతరం తాము దొరికిపోకుండా ఉండేందుకు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత క్షణాల వ్యవధిలోనే భారీ ATM మిషన్ను పెకిలించుకొని.. తమ వెంట తెచ్చుకున్న బొలెరో వాహనంలో వేసుకొని అక్కడి నుంచి మెరుపు వేగంతో పరారయ్యారు..
ఏటీఎం మిషన్తో పారిపోయిన దుండగులు.. జిల్లా పరిధిలోని బోయినపల్లి శివారు పొలాల వద్దకు చేరుకున్నారు.. అక్కడ వాహనాన్ని ఆపి.. నిందితులు తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎం మిషన్ ను అతి దారుణంగా రెండు భాగాలుగా కట్ చేశారు.. మిషన్ లోపల ఉన్న నగదు పెట్టేను సులభంగా బయటకు తీశారు. అందులో ఉన్న రూ.2.30 లక్షల నగదును తీసుకొని.. మిగిలిన మిషన్ భాగాలను అక్కడే పడేసి అక్కడి నుంచి పరారయ్యారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ఉదయం విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు.. ఎస్బిఐ బ్యాంక్ అధికారులు ఏటీఎంలో సుమారు 2.30 లక్షల నగదు ఉన్నట్లు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీంతో పాటు డాగ్స్ స్క్వాడ్ కీలక ఆధారాలు సేకరించాయి.. గతంలో దేశవ్యాప్తంగా జరిగిన ఇలాంటి తరహా ఏటీఎం చోరీల శైలిని పరిశీలించిన పోలీసులు.. ఇది అంతరాష్ట్ర దొంగల ముఠా పనిగా అనుమానిస్తున్నారు.. ముఖ్యంగా రాజస్థాన్ లేదా హర్యానా రాష్ట్రాలకు చెందిన మేవాట్ ముఠా ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. నిందితుల కోసం జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేకమైన తనిఖీలను చేపడుతున్నట్లు కూడా తెలుస్తోంది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
EPFO Pension: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్అలర్ట్.. Pension డబ్బులు రావాలంటే Form 10C తప్పనిసరి.. ఎలా అప్లై చేయాలో తెలుసా?
Lakshmapur, Telangana:EPFO Pension: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల పదవీ విరమణ పొదుపును నిర్వహించే భారత ప్రభుత్వ పథకం. ఈ స్కీములో ఉద్యోగి, యజమాని ఇద్దరూ డబ్బును జమ చేస్తారు. ఉద్యోగి తన జీతంలో నుంచి 12శాతం జమ చేస్తే.. అందులో 8.33శాతం యజమాని జమ చేస్తారు. ఇందులోనుంచి కొంత డబ్బు ఈపీఎస్ స్కీములోకి వెళ్తుంది. మిగిలిన డబ్బు పీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. అయితే ఒక ఉద్యోగి ఎక్కువ కాలం అంటే 10ఏళ్ల కంటే ఎక్కువ పనిచేస్తున్నట్లయితే.. రిటర్మైంట్ తర్వాత నెలలవారీ పెన్షన్ కు అర్హులు అవుతారు. ఈ పెన్షన్ వారి సర్వీసు కాలం, జీతం ఆధారంగా నిర్ణయిస్తారు.
ఈపీఎస్ 1995 పెన్షన్ ఎలా నిర్ణయిస్తారు?
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 ప్రకారం పెన్షన్ ఒక సులభమైన సూత్రాన్ని ఉపయోగించి లెక్కిస్తారు. పెన్షన్ కు అర్హత గల జీతం × సర్వీసు కాలం ÷ 70 ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక ఉద్యోగి జీతం రూ. 25,000 ఉందనుకుందాం. అతను 35 సంవత్సరాలు ఉద్యోగం చేసినట్లయితే.. అతని నెలలవారీ పెన్షన్ రూ. 25,000 × 35 ÷ 70 = నెలకు రూ. 12,500 పెన్షన్ అందుకుంటారు. ఒకవేళ సర్వీసు కాలం ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ పెన్షన్ అందుకునే అవకాశం ఉంటుంది.
రిటైర్మెంట్ వాయిదా వేసుకునే ఛాన్స్:
ఈపీఎఫ్ రూల్స్ ప్రకారం మీరు పెన్షన్ వెంటనే తీసుకునే బదులుగా మీరు 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు దానిని వాయిదా వేసుకోవచ్చు. అయితే దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మీరు చెల్లింపును నిలిపివేసి.. ఆ డబ్బుపై 4శాతం వార్షిక వడ్డీ వచ్చేలా కొంత కాలం పాటు ఉంచవచ్చు. అంటే మీకు 60ఏళ్లు వచ్చేంత వరకు. లేదంటే మరో రెండు సంవత్సరాలు పనిచేస్తూ చెల్లింపును కొనసాగించవచ్చు. దీనివల్ల మీ పెన్షన్ మొత్తం పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా మీకు అధిక పదవీ విరమణ పెన్షన్ లభించే ఛాన్స్ ఉంటుంది.
ఫారం 10సీ అంటే ఏమిటి? ఎందుకంత ముఖ్యం?
ఫారం 10C అనేది వివిధ రకాల పెన్షన్ సంబంధిత ప్రయోజనాల కోసం ఉపయోగించే ఒక ముఖ్యమైన ఈపీఎఫ్ఓ ఫారం. దీనిని నింపడం ద్వారా మీరు మీ పెన్షన్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు.అంతేకాదు స్కీమ్ సర్టిఫికేట్ పొందవచ్చు. ఉద్యోగం మానేసినా కూడా ఈపీఎఫ్ సభ్యత్వాన్ని కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. మీరు 10 సంవత్సరాల సర్వీస్ పూర్తికాకముందే ఉద్యోగం మానేసినా లేదా ప్రత్యేక పరిస్థితుల్లో పెన్షన్ ప్రయోజనాలను పొందాలనుకున్నా ఫారం 10C అవసరం ఉంటుంది.
ఫారం 10C ఎవరు అర్హులు?
10 సంవత్సరాల కంటే తక్కువ కాలం సేవ చేసి రిటైర్మెంట్ చేస్తున్నవారు. 58 సంవత్సరాల వయస్సు రాకముందే ఉద్యోగం విడిచిపెట్టినవారు. 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి, 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. 50 నుండి 58 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, తమ పెన్షన్ను విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నవారు. ఒక సభ్యుడు మరణించిన తర్వాత, కుటుంబ సభ్యుడు లేదా నామినీ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. వీళ్లంతా ఫారం 10సీకి అర్హులు అవుతారు.
Also Read: పీఎం యశస్వి యోజన అంటే ఏంటి? అర్హులెవరు?
అవసరమైన పత్రాలు ఏమిటి?
ఫారం 10C నింపేటప్పుడు.. మీరు కొన్ని పత్రాలను అందించాల్సి ఉంటుంది. UAN, ఆధార్, పాన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు, క్యాన్సిల్ చెక్ , పుట్టిన తేదీ, రిటైర్మెంట్ తేదీ, తండ్రి/భర్త పేరు, అడ్రస్, అవసరమైతే డెత్ సర్టిఫికేట్ లేదా వారసత్వ ధృవీకరణ పత్రం, పథకం ధృవీకరణ పత్రం కోసం పిల్లల జనన ధృవీకరణ పత్రాలు, 1 రూపాయి రెవెన్యూ స్టాంప్ అవసరం ఉంటుంది.
పన్ను, వడ్డీ ప్రయోజనాలు:
ఈపీఎఫ్ ప్రస్తుతం 8.25శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ స్కీమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఒక ఉద్యోగి చేసే రూ. 1.5 లక్షల వరకు వార్షిక వాటా, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపుకు అర్హత ఉంటుంది. కార్పొరేట్ వాటాలు కూడా పన్ను రహితంగా ఉంటాయి. రూ. 2.5 లక్షల వరకు వాటాలపై వచ్చే వడ్డీ పన్ను రహితంగా ఉంటుంది.
ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ఈ ప్రక్రియలో ఫారం 10సీ ఒక ముఖ్యమైన భాగమని చెప్పాలి. ఇది మీకు పెన్షన్ లేదా స్కీమ్ సర్టిఫికేట్ పొందేందుకు వీలు కల్పిస్తుంది. భవిష్యత్తులో పెన్షన్ కు సంబంధించిన సమస్యలు రాకుండా.. సరైన సమాచారం పత్రాలతో దీన్ని పూర్తి చేయడం చాలా కీలకమని చెప్పాలి.
Also Read: హైకోర్టు సంచలన తీర్పు.. ఆ ఉద్యోగులకు భారీ పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Maruti Suzuki WagonR: చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు ఎక్కువగా ఈ కారే కొంటున్నారు.. రూ.4.99 లక్షల బడ్జెట్, అదిరిపోయే మైలేజ్..!!
Lakshmapur, Telangana:Maruti Suzuki WagonR: ఇండియన్ ఆటోమొబైల్ రంగంలో ప్రతి ఏడాది కొత్త కొత్త మోడళ్లు మార్కెట్లోకి లాంచ్ అవుతూనే ఉంటాయి. ఫీచర్లు, ధర, డిజైన్, టెక్నాలజీ పరంగా అన్నీ మారుతూనే ఉంటాయి. కానీ కొన్ని కార్లు మాత్రం కాలానికి తగ్గట్లుగా మారుతూ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. దశాబ్దాల పాటు తమ స్థానాన్ని పదిలపర్చుకుంటున్నాయి. అలాంటి కార్లలో ఒకటి మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్. 1999లో భారత ఆటోరంగంలోకి అడుగుపెట్టిన ఈ కారు.. ప్రారంభం నుంచి మంచి ఆదరణ సంపాదించుకుంది. మార్కెట్లో పోటీ పెరిగినా.. తన స్థానం మాత్రం కోల్పోలేదు. అంతేకాదు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధర, తక్కువ మెయింటనెన్స్ ఖర్చు ఈ కారు ప్రధాన బలమని చెప్పాలి. సర్వీస్ నెట్వర్క్, స్పేర్ పార్ట్స్ కూడా అందుబాటులో ఉండటంతో మరింత ప్రజాదరణ పొందుతోంది.
అయితే ఈ కారును చిన్న వ్యాపారులు, చిరుద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు ఈ కారు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఫ్యామిలీ వినియోగానికి కూడా సౌకర్యంగా ఉండటం ఈ కారుకు ఉన్న పెద్ద ప్లాయింట్ అని చెప్పాలి. కాలం మారుతున్నా.. ట్రెండ్ మారుతున్న వ్యాగన్ ఆర్ మాత్రం భారత ఆటో మొబైల్ మార్కెట్లో తన ప్రత్యేక స్థానాన్ని అలాగే పదిలంగా నిలబెట్టుకుంటోంది.
ఈ కారు డిజైన్ సాధారణ హ్యాచ్ బ్యాక్ లతో పోలిస్తే ఎత్తుగా.. బాక్సీ షేప్ లో ఉండటం వల్ల బయటకు చిన్న కారులా కనిపించినా లోపల మాత్రం విశాలంగా ఉంటుంది. ఈ డిజైన్ ప్రదాన ఉద్దేశ్యం కూడా అదే ఎక్కువ స్పేస్ ను తక్కువ పొడవులో అందించడం. ఫ్రంట్ సైడ్ సింపుల్ గా కనిపించినా ప్రాక్టికల్ లుక్ ను ఇచ్చే గ్రిల్, పెద్ద హెడ్ ల్యాంప్స్ తో కలిసి ఒక సాఫ్ట్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ ఫేస్ ఇస్తుంది.
Also Read: కళ్లు చెదిరే డిస్కౌంట్.. సేఫ్ కారు.. ఫ్యామిలికి బెస్ట్.. రేటింగ్ కూడా ఎవర్గ్రీన్.
పవర్..స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. మారుతి సుజుకి వాగన్ఆర్ 998cc, BS6-కంప్లైంట్ ఇంజన్తో పనిచేస్తుంది. ఇది 68 PS పవర్, 90 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ పరంగా, మారుతి సుజుకి వాగన్ఆర్ 21.79 km/l మైలేజీని అందిస్తుంది. ఈ ఇంజన్ వాగన్ఆర్ Lxi, Vxi ట్రిమ్లలో అందుబాటులో ఉంటుంది.కొలతల పరంగా, మారుతి సుజుకి వాగన్ఆర్ 3655 మిమీ పొడవు, 1620 మిమీ వెడల్పు, 16750 మిమీ ఎత్తు, 2435 మిమీ వీల్బేస్, 4.7 మీటర్ల టర్నింగ్ రేడియస్, 1340 కిలోల మొత్తం బరువు, 32 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.
Also Read: లైసెన్స్, రిజిస్ట్రేషన్.. పెట్రోల్ ఖర్చే లేదు.. రూ. 30వేల బడ్జెట్లోనే
బ్రేకింగ్ విధులను ముందువైపు డిస్క్ బ్రేకులు, వెనుకవైపు డ్రమ్ బ్రేకులు నిర్వహిస్తాయి. సస్పెన్షన్ విధులను ముందువైపు కాయిల్ స్ప్రింగ్లతో కూడిన మాక్ఫెర్సన్ స్ట్రీట్, వెనుకవైపు కాయిల్ స్ప్రింగ్లతో కూడిన టార్షన్ బీమ్ నిర్వహిస్తాయి. మైలేజీ విషయానికి వస్తే లీటర్ కు 25కిలోమీటర్ల వరకు ఇస్తుంది. సీఎన్జీ అయితే కిలో గ్రామ్ కు 33 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ కారు 4.98 లక్షల నుంచి 6.38 వరకు అందుబాటులో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chandrayaan: చందమామపై భారీగా మంచు నిల్వలు.. ఇస్రో చంద్రయాన్ డేటాలో సంచలన నిజాలు!
Hyderabad, Telangana:ISROs Chandrayaan Findings Latest News: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లూనార్ మిషన్లో మరో కీలకమైన మైలురాయి నమోదయింది. చందమామపై పరిశోధనలు చేస్తున్న మన శాస్త్రవేత్తలు అంతరిక్ష చరిత్రలోనే అత్యంత అరుదైన, సంచలన ఆధారాలను కనుగొన్నట్లు తెలుస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో ఉన్న భూగర్భంలో భారీగా నీటితో పాటు మంచు నిల్వలు ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ధారించారు.. చంద్రయాన్ టు ఆర్బిటర్ పంపిన తాజా డేటాను విశ్లేషించిన తర్వాత ఈ అద్భుతమైన విషయాన్ని ఇస్రో అధికారికంగా వెల్లడించింది..
చంద్రయాన్ మిషన్..
చంద్రయాన్ మిషన్ లో భాగంగా పంపిన ఆర్బిటర్ విజయవంతంగా చంద్రుడి కక్షలో తిరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో అమర్చిన అత్యాధునిక డ్యూయల్ ఫ్రీక్వెన్ సింథటిక్ అపర్చర్ రాడార్ (DFSAR) ద్వారా శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలాన్ని నిశితంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రుడిపై సూర్యకాంతి అస్సలు పడకుండా.. ఎప్పుడు కారు చీకటిలో ఉండే కొన్ని లోతైన బిలాలను.. ఈ రాడార్స్ స్కాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆ బిలాలు ఉపరితలం కింది భాగంలో భూగర్భంలో కోట్ల సంవత్సరాలుగా గనీభవించిన స్థితిలో నీరుతో పాటు మంచు గడ్డలు ఉన్నట్లు ఈ రాడార్ బలమైన ఆధారాలు సేకరించింది.
ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2..
2019లో ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 2 మిషన్లో ల్యాండర్ సాంకేతిక కారణాల వల్ల చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ కాలేకపోయిన సంగతి మనందరికీ తెలుసు. ఆ సమయంలో ల్యాండర్ విఫలమైనప్పటికీ.. చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టిన ఆర్బిటర్ మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతంగా పనిచేస్తూనే వస్తోంది.. అంతరిక్షంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనప్పటికీ తట్టుకొని నిలబడేలా రూపొందించిన ఈ ఆర్బిటర్.. ఇప్పుడు సరికొత్త డేటాను అందిస్తూ అంతరిక్ష రంగంలో భారత దేశ కీర్తి పతాకాన్ని మరోసారి ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసింది..
Also Read: ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా..! సీఎంగా డీకే శివకుమార్కు లైన్ క్లియర్..!
చంద్రుడిపై మానవ నివాసాలు..
చంద్రుడు పై నీటి జాడలు స్పష్టం అవ్వడం వల్ల రాబోయే రోజుల్లో ఇస్రో చేపట్టబోయే చంద్రయాన్ 4 వంటి ఇతర లూనార్ మిషన్లకు ఇది ఎంతో కీలకంగా మారబోవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసాలను ఏర్పాటు చేయడానికి.. అక్కడి నుంచి ఇతర గ్రహాలకు ప్రయోగాలు చేయడానికి ఈ మంచు నిలువలు తాగునీరుగా.. రాకెట్ ఇంధన తయారీకి ఆక్సిజన్తో పాటు హైడ్రోజన్గా ఎంతగానో ఉపయోగపడతాయని అంతరిక్ష శాస్త్ర నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఇతర దేశాలకు సంబంధించిన నిపుణులు కూడా చందమామపై మంచు నిలువలతో పాటు అక్కడక్కడ నీటి నిల్వలను భారత్ కనుగొనడం వల్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా..! సీఎంగా డీకే శివకుమార్కు లైన్ క్లియర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Budhaditya Rajayoga 2026: బుధాదిత్య రాజయోగం.. ఈ 5 రాశుల వారికి ఇక తిరుగుండదు.. దిమ్మతిరిగే ధన లాభాలు!
Hyderabad, Telangana:Budhaditya Rajayoga 2026 Effect On Zodiac Telugu News: మే 26వ తేదీ మంగళవారం రోజున బుధుడు వృషభ రాశిలో ఉదయించిన సంగతి తెలిసిందే. అయితే, సూర్యుడు కూడా ఇదే రాశిలో ఉండడం వల్ల సూర్య బుధ కలయిక జరిగింది. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. అయితే, ఈ యోగ ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో స్వర్ణ యుగం ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో బుధుడి ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి మేలు జరిగితే.. మరికొన్ని రాశుల వారికి సూర్యుడు ఎఫెక్ట్తో విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి.. అలాగే ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావం కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభాలను కూడా అందించబోతోంది. జీవితంలో మానసిక ప్రశాంతత అందించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించబోతోంది. అయితే, ఈ శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ప్రభావంతో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో.. వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు బుధాదిత్య రాజయోగం ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలబోతున్నాయి.. అనేక పనులు ఈ సమయంలో పూర్తవడమే కాకుండా వాటి నుంచి డబ్బులు కూడా సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వీరు ఆత్మవిశ్వాసం పొంది ఎన్నో రకాల పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు దీనికి కారణంగా సమాజంలో గౌరవం కూడా అంచలంచలుగా పెరుగుతుంది. అలాగే కుటుంబ సంబంధాల్లో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జీవితం ఈ సమయంలో ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా బుధుడు 11వ స్థానంలో ఉదయించడం కారణంగా వీరికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా శుభ పరిస్థితులు ఏర్పడి దీనివల్ల సుఖ భోగాలు పొందబోతున్నారు. అలాగే మీడియా, వ్యాపారం, ఈవెంట్, మేనేజ్మెంట్ మార్కెటింగ్ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో పెద్ద మొత్తంలో ధన లాభాలు కలుగుతాయి. కొత్త వృత్తులు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఆదాయం కూడా సమకూరి జీవితంలో అనుకోని ముందడుగు వేసే అవకాశాలున్నాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి క్రమంగా మెరుగుపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో వృత్తి వ్యాపారాల పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. కుటుంబంలో తండ్రి నుంచి అద్భుతమైన సపోర్టు లభించి పనుల్లో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. అలాగే మీకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జీవితంలో అనుకోని పురోగతి లభించి ఆర్థిక రంగాల్లో ముందడుగు వేస్తారు. ముఖ్యంగా బుధుడు ఉదయించడం కారణంగా జీవితంలో సానుకూలమైన మార్పులను చూడగలుగుతారు.. అలాగే కొన్ని రకాల కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొని మంచి విజయాలు సాధిస్తారు.
కన్య రాశి
కన్య రాశి వారికి బుధుడు జాతకంలో తొమ్మిదవ స్థానంలో ఉదయించడం చాలా అనుకూలంగా మారుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎప్పటినుంచో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ ఈ సమయం అద్భుతమైన పరిష్కారాన్ని అందించబోతోంది. అలాగే చాలా విషయాల్లో పరిస్థితులు వీరికి అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలతో పాటు కెరీర్ పరంగా సానుకూలమైన మార్పులు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి. విదేశీ ప్రయాణాలు చేయడం కారణంగా విశేషమైన ధన లాభాలు పొందుతారు. కెరీర్లో సరైన మార్గాలు ఎంచుకొని అనుకోని విజయాలు సాధించగలుగుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి జాతకంలో ఏడవ స్థానంలో బుధుడు ఉదయించడం కారణంగా వీరికి ఊహించని ధన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉండడంతో ఈ సమయంలో మానసికంగా మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వైవాహిక ఆనందం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. జీవిత భాగస్వామి మీకు సపోర్టివ్గా నిలిచి అన్ని పనుల్లో తోడుంటుంది. అలాగే మీ అత్తమామల నుంచి కూడా కొన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ ఈ సమయంలో కాస్త పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. ఇక్కడ అందించిన సమాచారం కేవలం సాధారణ నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు. అలాగే ఇక్కడ అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vaidhriti Yogam 2026: జూన్ 4 నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగులేదు.. వైధృతి యోగంతో కుబేరులు కాబోతున్నారు!
Hyderabad, Telangana:Vaidhriti Yogam 2026 Effect On Zodiac Telugu: జూన్ నెలలో అత్యంత శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా నెల ప్రారంభంలోనే ఎంతో శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయడంతో వైధృతి యోగం కూడా ఏర్పడబోతోంది. ఈ యోగానికి జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. మనస్సుకు అధిపతిగా వ్యవహరించే చంద్రుడితోపాటు గౌరవానికి అధిపతిగా భావించే సూర్యుడు జూన్ 4వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో ఈ శక్తివంతమైన రాజయోగాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.. వైధృతి యోగం జూన్ 4వ తేదీన ఏర్పడడంతో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మంచి మంచి లాభాలు కలగడమే కాకుండా కుటుంబ జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి ఊహించని ప్రయోజనాలు:
వృషభ రాశి
వైధృతి యోగం ప్రభావంతో వృషభరాశి వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా స్నేహితులతో కొనసాగుతున్న విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి.. ముఖ్యంగా అవివాహితులకు ఈ సమయంలో తప్పకుండా వివాహాలు కూడా జరగబోతున్నాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. భయం ఆందోళన పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా అంచలంచెలుగా పెరుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు సూర్యచంద్ర గ్రహాల ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. పని ప్రదేశాల్లో అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. అనేక కొత్త మార్గాలు తెచ్చుకోవడమే కాకుండా కుటుంబ జీవితం చాలా సంతోషంగా మారుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా మారుతుంది.
సింహరాశి
వైధృతి యోగ ప్రభావంతో సింహ రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సమయాల్లో ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. అలాగే వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు కూడా లభిస్తాయి. అప్పుల నుంచి కూడా ఎంతో సులభంగా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌరవం పెరగడమే కాకుండా అన్ని పనుల్లో ఆందోళన పడకుండా జీవితాన్ని ముందుకు సాగిస్తారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా అన్ని కష్టాలకు పరిష్కారం కూడా లభిస్తుంది. దీంతో పాటు డబ్బుకు ఎలాంటి కోరుతూ ఉండదు. అలాగే కొత్త ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాల్లో గొప్ప పురోగతి కూడా లభించి కొత్త ప్రాజెక్టులు ఎంతో సులభంగా లభించబోతున్నాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Silver Rate Today: బక్రీద్ వేళ తగ్గిన వెండి ధర.. నేడు మే 28వ తేదీ గురువారం ధరలివే..!!
Lakshmapur, Telangana:Silver Rate Today: మిడిల్ ఈస్ట్ లో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులు విలువైన లోహాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. నేడు మే 28వ తేదీ గురువారం వెండి ధర కిలోపై దాదాపు 4000 మేర పతనం అయ్యింది. బంగారం కూడా అదే తరహాలో తగ్గింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం నేడు మార్కెట్ ప్రారంభం అయ్యే ముందు ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ. 3,300 తగ్గి రూ. 2,69,700 కు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో వెండి ఫ్యూచర్స్ ధర 1.89శాతం అంటే రూ. 5111 తగ్గింది. దీంతో కిలోకు రూ. 2,65,517 కు చేరుకుంది. బుధవారం కిలోకు రూ. 2,70,628 వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి 29వ తేదీన వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ. 4,20,048 వద్ద సర్వకాలిక గరిష్ట స్థాయికి చేరుకోవడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధర ఔన్సుకు $74.96 కు పడిపోయింది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం వరకు దీని ధర కిలోకు రూ. 2,60,917 గా ఉంది. గుడ్రిటర్న్స్ ప్రకారం, వెండి ధర కిలోకు రూ. 2,85,000 గా ఉంది.
ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీలో వెండి ధరలు కిలోగ్రాముకు రూ. 3,300 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ. 269,700 కు చేరాయి. గత సెషన్లో వెండి ధర కిలోగ్రాముకు రూ. 273,000 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధరలు దాదాపు 3 శాతం తగ్గి ఔన్సుకు $74.96 కు చేరుకున్నాయి
Also Read: భారీగా తగ్గిన పసిడి ధర.. నేడు మే 28వ తేదీ గురువారం ధరలు ఇవే..!!
విదేశీ మార్కెట్ల నుండి బలహీనమైన సంకేతాలు.. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, బుధవారం ఫ్యూచర్స్ ట్రేడ్లో వెండి ధరలు రూ. 3,876 మేర పదునుగా పడిపోయి, కిలోకు సుమారు రూ. 2.66 లక్షలకు చేరాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో జూలై డెలివరీకి సంబంధించిన వెండి కాంట్రాక్ట్ ధర రూ. 3,876 లేదా 1.43 శాతం తగ్గి కిలోకు రూ. 2,66,752 వద్దకు చేరింది. మంగళవారం, వెండి ధరలు రూ. 6,088 తగ్గి కిలోకు రూ. 2,70,628 వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో, జూలై డెలివరీకి సంబంధించిన కామెక్స్ వెండి ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర సుమారు 2 శాతం తగ్గి ఔన్సుకు $75.35 వద్దకు చేరింది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Rate Today: భారీగా తగ్గిన పసిడి ధర.. నేడు మే 28వ తేదీ గురువారం ధరలు ఇవే..!!
Lakshmapur, Telangana:Gold Rate Today: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలతో బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేడు మే 28వ తేదీ గురువారం మార్కెట్ ప్రారంభం కావడానికి ముందు.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,021 తగ్గి రూ. 1,61,300 కు చేరింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో 24 క్యారెట్ల గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఈరోజు 1.52శాతం అంటే రూ. 2,391 తగ్గి, 10 గ్రాములకు రూ. 1,55,225 కు చేరింది. బుధవారం ట్రేడింగ్ లో 10 గ్రాములకు రూ. 1,57,616 వద్ద ముగిసింది. ఈ సంవత్సరం జనవరి 29వ తేదీన ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,80,779 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $4,461.02 కు పడిపోయింది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ గురువారం ఉదయం నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,072 కి చేరుకుంది. గుడ్రిటర్న్స్ ప్రకారం.. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ. 1,58,440 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ నగరాల్లో బంగారం ధరలు చూసినట్లయితే 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ 1,58,880 పలుకుతుండగా.. 22 క్యారెట్ల జ్యువెల్లరీ బంగారం తులం రూ. 1,45,640 పలుకుతోంది.
అమెరికా, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుము సురక్షిత పెట్టుబడిగా డాలర్కు పెరుగుతున్న డిమాండ్ కారణంగా పెట్టుబడిదారులు బంగారం విషయంలో జాగ్రత్త వహించారు. బలహీనమైన ప్రపంచ ధోరణుల మధ్య, బుధవారం జాతీయ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 తగ్గి రూ.1.61 లక్షలకు చేరింది. 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,100 తగ్గి రూ.1,61,300కు చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి ధర 10 గ్రాములకు రూ.1,62,400గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో, స్పాట్ గోల్డ్ 1.03 శాతం తగ్గి ఔన్సుకు $4,461.02కు చేరింది.
బుధవారం ఫ్యూచర్స్ ట్రేడింగ్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 561 మేర తగ్గి రూ. 1.57 లక్షలకు చేరింది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల వల్ల తలెత్తిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అధిక ఇంధన ధరల కారణంగా వ్యాపారులు అప్రమత్తంగా ఉండటంతో ఇది జరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో, జూన్ డెలివరీ బంగారం ధర రూ. 561 (0.36 శాతం) తగ్గి 10 గ్రాములకు రూ. 1,57,055కి చేరింది. అదేవిధంగా, ఆగస్టు డెలివరీ బంగారం ధర రూ. 521 (0.32 శాతం) తగ్గి 10 గ్రాములకు రూ. 1,60,340కి చేరింది. 5,338 లాట్ల ట్రేడ్ నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా, ఆగస్టు డెలివరీకి సంబంధించిన కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఔన్సుకు $4,518.87కి పడిపోయింది.
అయితే భవిష్యత్తులో బంగారం ధరలు ఏవిధంగా ఉంటాయో మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 2027 చివరి నాటికి బంగారం ధరలు భారీగా తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు ఉక్రెయిన్, గల్ఫ్ లో కొనసాగుతున్న ఘర్షణలు ముగిసినట్లయితే బంగారానికి డిమాండ్ మరింత తగ్గుతుంది. దీంతో ధరలు మరింత పడిపోయే అవకాశం ఉందంటున్నారు. గోల్డ్ మన్ సాక్స్, వరల్డ్ కౌన్సిల్ వంటి ప్రధాన సంస్థలు కూడా 2026లో బంగారం ధరలు మరింత పెరగవచ్చు లేదంటే తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నాయి. దీని ప్రకారం బంగారం ధరల్లో రానున్న రోజుల్లో మార్కెట్ సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
SRH vs RR Highlights: సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర వైఫల్యం.. రాజస్థాన్ భారీ విజయం
Tira, Punjab:RR Won By 47 Runs Against SRH: ఐపీఎల్ ట్రోఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ ఘోరంగా విఫలమై ఐపీఎల్ 2026 టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్లో నెగ్గి క్వాలిఫయర్లోకి అడుగుపెట్టాల్సిన హైదరాబాద్ అనూహ్యంగా ఓటమిపాలైంది. వైభవ్ సూర్యవంశీ పరుగులతో విధ్వంసం సృష్టించగా రాజస్థాన్ రాయల్స్ ట్రోఫీ కోసం మరో ముందడుగు వేసింది. రాజస్థాన్ సాధించిన భారీ స్కోర్ను ఛేదించలేక సన్రైజర్స్ తడబడింది. 47 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం సాధించింది.
రాజస్థాన్ రాయల్స్ విధించిన 244 పరుగుల లక్ష్యాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ పరుగులు చేసి ఓటమిని మూటగట్టుకుంది. స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ రెండో బంతికే డకౌట్ కాగా.. ట్రావిస్ హెడ్ 17 పరుగులకు ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ 33 పరుగులతో రాణించగా.. సమరన్ రవిచంద్రన్ ఒక పరుగుకే వెనుదిరిగాడు.
SARTHAK-PD Scheme: 80కోట్ల మంది పేదలకు మోదీ సర్కార్ భారీ శుభవార్త.. మరో ఐదేళ్లపాటూ కొనసాగిస్తూ..!!
Lakshmapur, Telangana:SARTHAK-PD Scheme: మే 27వ తేదీ బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో సార్థక్ పీడీఎస్ పథకానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. సార్థక్ పీడీఎస్ స్కీమును మరో 5ఏళ్ల పాటూ అంటే 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రి వర్గం రూ. 25,530కోట్ల స్కీముకు ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్ జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలును మరింత బలోపేతం చేయనుంది. ప్రస్తుతం సుమారు 81కోట్ల మంది లబ్దిదారులకు సబ్సిడి ఆహార ధాన్యాలు అందించే ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ నెట్ వర్క్ భారతదేశంలోనే ఉంది. తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయం దాన్ని ఇంకా మెరుగుపరుస్తుంది. దీంతో పేదలకు రేషన్ బియ్యం మరింత మెరుగ్గా లభించనున్నాయి.
కేబినెట్ సమావేశం అనంతరం సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. ఇందులో మూడు కీలక మార్పులు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో గిడ్డంగుల నుండి దుకాణాలకు ఆహార ధాన్యాలను రవాణా చేసేందుకు రాష్ట్ర ఏజెన్సీలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని కేబినెట్ ఒక ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించింది. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గి, మారుమూల ప్రాంతాలకు రేషన్ సకాలంలో అందేలా చూడవచ్చని తెలిపారు.
రెండవ ప్రధాన మార్పు సరసమైన ధరల దుకాణాలకు మద్దతు ఇవ్వడంతోపాటు ప్రభుత్వం రేషన్ దుకాణాలకు కూడా మద్దతు ఇస్తుంది. రేషన్ డీలర్లకు డిజిటల్ పరికరాలు, మెరుగైన నిల్వ సౌకర్యాలు, కార్యాచరణ మద్దతుతో సహాయం అందుతుంది. ఈ ప్రభుత్వ మద్దతు రేషన్ పంపిణీలో అవకతవకలను నివారించడానికి సహాయపడుతుందని తెలిపారు.
ఇక మూడవ మార్పు ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు సంబంధించినది. రేషన్ పంపిణీ కేంద్రాలను ఆటోమేషన్, డిజిటల్ ట్రాకింగ్, ఆన్లైన్ పర్యవేక్షణ, స్మార్ట్ పరికరాలు, పారదర్శక సాధనాలతో సహా సాంకేతికత ఆధారితంగా మార్చనున్నారు. ఇది బ్లాక్ మార్కెటింగ్ను నిరోధిస్తుందని మంత్రి వెల్లడించారు.
Also Read: PM YASHASVI Yojana: పీఎం యశస్వి యోజన అంటే ఏంటి? అర్హులెవరు?.. ఉచిత స్కాలర్షిప్ ఎలా పొందాలి?
సార్థక్ పీడీఎస్ పథకంలో కేంద్ర మంత్రివర్గం పై మూడు ప్రధాన మార్పులు చేసింది. ఆహార ధాన్యాల రవాణా, నిల్వ, పంపిణీకి అయ్యే ఖర్చుల కోసం రాష్ట్ర ఏజెన్సీలకు సహాయం అందించడం దీని లక్ష్యమని పేర్కొంది. ఆహార పంపిణీలో పారదర్శకత, నల్ల మార్కెటింగ్ నివారణకు కూడా మంత్రివర్గం పిలుపునిచ్చింది. 2031 వరకు కొనసాగే రూ.25,530 కోట్ల ఈ పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.ఈ పథకం కింద సుమారు 80 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందుతారని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమం భారతదేశంలో ఉందని కూడా ప్రభుత్వం తెలిపింది.
కేంద్ర కేబినెట్ తీసుకన్న ఈ నిర్ణయం గ్రామీణ, పట్టణ పేద ప్రజలకు ఆహార భద్రతకు హామీ ఇవ్వడంతోపాటు పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన వంటి కార్యక్రమాలను మరింత బలపర్చనుంది. అంతేకాదు రవాణా ఖర్చులు కేంద్రం భరించడం వల్ల రాష్ట్రాల ఆర్థిక భారం తగ్గి, సేవలు మెరుగుపడతాయి. పర్యావరణ ప్రయోజనాలుగా కార్బన్ ఉద్గారాలు తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
