తారమతిపేట భారీ చోరి కేస్ ఛేదించిన పోలీస్ లు..ఇద్దరు అరెస్ట్,రిమాండ్ కి తరలింపు
Taramatipet, Telangana:అబ్దుల్లా పూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని తరమతిపెట్ గ్రామం లో వారం రోజుల క్రితం జరిగిన భారీ చోరి కేస్ ను ఛేదించారు పోలీస్ లు,వరికుప్పల వెంకటేష్ మరియు బత్తుల గోపి అనే ఇద్దరు దొంగలను తారామతి పేట గ్రామం లో ఘటన సమయం లో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా ఎల్ బి నగర్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీస్ లు స్టేషన్ కి తీసుకుని వచ్చి విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకోగా నిందితులను ఈ రోజు రిమాండ్ కి తరలించినట్లు అబ్దుల్లా పూర్ మెట్టు పోలీస్ లు తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
OPPO A7 Pro ఫోన్ లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్ప్లేతో అదరగొట్టిన కొత్త ఫోన్!
Hyderabad, Telangana:OPPO A7 Pro Price: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ OPPO మార్కెట్లోకి అద్భుతమైన మొబైల్ను విడుదల చేసింది. దీనిని కంపెనీ ఒప్పో A7 ప్రోను చైనా మార్కెట్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఒప్పో నుంచి ఈ కొత్త A-సిరీస్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 మ్యాక్స్ చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్ను కలిగి ఉంది. అయితే, ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ A7 ప్రో స్మార్ట్ఫోన్లో ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాకుండా 45W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ IP69K రేటింగ్ను కలిగి ఉండడం విశేషం.. ఈ ఫోన్లో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. ఒప్పో A7 ప్రో స్మార్ట్ఫోన్ వివిధ రకాల స్టోరేజ్ వేరియంట్స్లో అందుబాటులో ఉంది. దీని మొదటి వేరియంట్ 6GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర భారత కరెన్సీలో రూ.31,000తో లభిస్తోంది. అంతేకాకుండా రెండవ వేరియంట్ 8GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.35,000తో లభిస్తోంది.. ఇది డెసర్ట్ బ్రౌన్, ఎవ్రీ స్టెప్ బ్లాసమ్తో పాటు రైడింగ్ ది వేవ్స్ వంటి కలర్ ఆప్షన్స్లో లభిస్తోంది.. ఇప్పటికే ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ కూడా ప్రారంభమయ్యాయి. ఇది సెప్టెంబర్ 11వ తేదీ నుంచి చైనాలో అందుబాటులోకి రాబోతోంది..
ఒప్పో A7 ప్రో ఫీచర్లు..
ఒప్పో A7 ప్రో స్మార్ట్ఫోన్ 6.57-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని రిజల్యూషన్ 2372x1080 పిక్సెల్స్తో పాటు రిఫ్రెష్ రేట్ 120Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 240Hz, గ్లోబల్ బ్రైట్నెస్ 800 నిట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా పీక్ బ్రైట్నెస్ 1,400 నిట్స్ ఉండడం వల్ల స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ OS 16 పై పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.. A7 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 MAX చిప్సెట్ ప్రాసెసర్ను కూడా కలిగి ఉంటుంది. ఇది IP69K రేటింగ్ లభిస్తోంది.. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. ఇది 45W సూపర్వూక్ ఫ్లాష్ ఛార్జ్కు కూడా సపోర్ట్ చేస్తుంది..
ఇక ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఇందులో కంపెనీ వెనుక భాగంలో ఆటోఫోకస్తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. సెల్ఫీతో పాటు వీడియో కాల్స్ కోసం 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.. కనెక్టివిటీ కోసం ఇందులో 5G, Wi-Fi 5, బ్లూటూత్ 5.4, NFCతో పాటు GPS, QZSS కనెక్టివీ ఒక USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇందులో చాలా రకాల స్పెషల్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
Also Read: Flipkart బంపర్ ఆఫర్.. సగం ధరకే Realme 43-ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Madhuri Rathod: మాధురి రాథోడ్ 'నిమ్మతోట వనములో' పాటతో ఎంత సంపాదనో తెలుసా? రూ.10 లక్షలు పెడితే..16.2 కోట్లతో దూసుకుపోతుంది!
Hyderabad, Telangana:Madhuri Rathod News: గత ఏడాది కాలంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలోని ప్రతి శుభకార్యం, పార్టీలో మారుమోగుతున్న జానపద పాటల్లో 'నిమ్మతోట వనములో' ఒకటి. ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ తన మాస్ డ్యాన్స్ అభినయంతో ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టారు. 'లీడింగ్ బాయ్స్' అందించిన కొరియోగ్రఫీ, లావణ్య రవిందర్ రాసిన ఆకట్టుకునే లిరిక్స్, ప్రభ గాత్రం ఈ పాటను యూట్యూబ్లో సంచలనంగా మార్చాయి.
యూట్యూబ్తో పాటు స్పోటిఫై (Spotify), జియో సావన్ (JioSaavn) వంటి డిజిటల్ మ్యూజిక్ ప్లాట్ఫార్మ్లలో కూడా ఈ ఆడియో వెర్షన్ దద్దరిల్లింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ రూపంలో వైరల్ అవ్వడమే కాకుండా.. విదేశాల్లోని తెలుగు వారు కూడా తమ వేడుకల్లో ఈ పాటను విరివిగా ఉపయోగిస్తున్నారు.
రూ.10 లక్షల ఖర్చు.. లాభం ఎంతంటే?
ఈ పాటకు ఇప్పటివరకు యూట్యూబ్లో ఏకంగా 162 మిలియన్ల (16 కోట్లకు పైగా) వ్యూస్ లభించాయి. దాదాపు రూ. 10 లక్షల లోపు నిర్మాణ వ్యయంతో రూపొందిన ఈ పాట, యూట్యూబ్, ఇతర ఆడియో ప్లాట్ఫార్మ్ల ద్వారా మొత్తం దాదాపు రూ.50 లక్షలకు పైగానే రెవెన్యూ సాధించింది. అంటే పెట్టిన పెట్టుబడికి ఏకంగా నాలుగు రెట్ల లాభాలను తెచ్చిపెట్టింది.
నేపథ్యం, సంచలన వివాదాలు
సగటు మధ్య తరగతి కుటుంబంలో ఏడుగురు పిల్లల్లో ఒకరిగా జన్మించిన మాధురి రాథోడ్, జానపద నృత్యాలు, సోషల్ మీడియా వీడియోల ద్వారా స్వశక్తితో క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే, తనతో పాటు డ్యాన్స్ చేసే తోటి కళాకారుడు ఈశ్వర్ సాయితో వేములవాడలోని రెడ్డి భవన్లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి వచ్చి వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో పెద్ద వివాదం రాజుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఒకవైపు డిజిటల్ ప్లాట్ఫార్మ్లలో కోట్ల వ్యూస్, భారీ సంపాదన సాధిస్తూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో వివాదాల చుట్టూ తిరుగుతుండటంతో మాధురి రాథోడ్ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది.
Also Read: Madhuri Rathod: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయికి మాధురి బిగ్ షాక్!
Also Read: బిగ్బాస్ హౌస్లోకి వెళ్లిన రెండు రోజులకే గోడదూకాలని..20 అడుగుల గోడపైకి ఎక్కి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ganesh Chaturthi 2026: ఆంధ్ర, తెలంగాణలో వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? 14 లేదా 15? పండగ సెలవు ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Vinayaka Chavithi 2026 Timing: భారతీయుల సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి అత్యంత ప్రాముఖ్యమైనది. పార్వతీపరమేశ్వరుల చిన్న కుమారుడైన విఘ్నేశ్వరుడి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జరుపుకొంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితి నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే, ప్రతి ఏటా లాగే ఈసారి కూడా పండుగను ఏ రోజున నిర్వహించుకోవాలి, పూజలకు ఏ సమయం అత్యంత ఉత్తమమైనది అనే విషయాలపై భక్తులలో క్లారిటీ లేక సందేహాలు ఏర్పడ్డాయి
చవితి తిథి వేళలు.. రెండు రోజుల అవకాశం
ఈ ఏడాది వినాయక చవితి తిథి సమయాల వివరాల్లోకి వెళితే.. భాద్రపద శుక్ల పక్ష చవితి తిథి సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం ఉదయం 7:06 గంటలకు (AM) ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15వ తేదీ మంగళవారం ఉదయం 7:44 గంటల (AM) వరకు కొనసాగుతుంది. ఈ విధంగా సుదీర్ఘ తిథి సమయం ఉండటం వల్ల 2026 సంవత్సరంలో వినాయక చవితి పండుగను భక్తులు రెండు రోజుల పాటు జరుపుకునే పవిత్ర అవకాశం లభించింది.
సెప్టెంబర్ 14నే పూజించేందుకు అవకాశం..
అయితే, అత్యధిక శాతం మంది భక్తులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం రోజునే ఈ పవిత్ర పండుగ పూజలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం ఇప్పటి నుంచే వినాయక ప్రతిమలను ఎంతో ఉత్సాహంగా కొనుగోలు చేసి తమ ఇళ్లకు, పూజా మండపాలకు తరలిస్తున్నారు. ఈసారి పండుగ సోమవారం రోజున రావడం భక్తులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే శనివారం, ఆదివారం, సోమవారం కలుపుకొని వరుసగా మూడు రోజుల పాటు సుదీర్ఘమైన సెలవులు లభించాయి.
ఒకవేళ అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 14న పండుగ చేసుకోలేని వారు, సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 7:44 గంటల వరకు తిథి అందుబాటులో ఉన్నందున ఆ రోజు ఉదయం కూడా పూజా కార్యక్రమాలను జరుపుకోవచ్చు.
11 రోజుల పూజలు, నవరాత్రుల ఉత్సవాలు
సాధారణంగా సెప్టెంబర్ 14న వినాయక ప్రతిమలను నిలిపి నాటి నుండి దాదాపు 11 రోజుల పాటు నిత్యం అత్యంత భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ భాద్రపద మాసం మొత్తం గణపతి ఆరాధనకు అంకితం చేస్తారు. ఈ మాసంలో గణేశ్ చతుర్థి రోజు నుండి ప్రారంభించి అనంత చతుర్దశి తిథి వరకు భక్తులు నిరంతరాయంగా గణనాథుడిని పూజిస్తారు.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, పండితుల సూచనల ఆధారంగా పాఠకుల ఆసక్తి మేరకు అందించబడింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు.)
Also Read: ఇళ్లు లేని వాళ్లకు గుడ్న్యూస్..పీఎం ఆవాస్ యోజనతో రూ.2.30 లక్షల కోట్లు మంజూరు?!
Also Read: సెప్టెంబరు 11న అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..BRICS కారణంగా వరుసగా 4 రోజులు బంద్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Awas Yojana 2.0: ఇళ్లు లేని వాళ్లకు గుడ్న్యూస్..పీఎం ఆవాస్ యోజన 2.0 కింద రూ. 2.30 లక్షల కోట్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్!
Vijayawada, Andhra Pradesh:PM Awas Yojana 2.0 News: నగరాలు, పట్టణాల్లో అద్దె ఇళ్లలో లేదా అరకొర వసతులతో నివసిస్తున్న నిరాశ్రయులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు శాశ్వత గృహ వసతి కల్పించడమే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 (PMAY-U 2.0) ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలు కొత్తగా ఇల్లు నిర్మించుకోవడానికి, నిర్మించిన ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా అందుబాటు ధరలలో అద్దె గృహాలను పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.
రూ.10 లక్షల కోట్ల బడ్జెట్..
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నాలుగు ప్రధాన విభాగాల కింద అమలు చేస్తోంది.
1) లబ్ధిదారుల నేతృత్వంలోని గృహ నిర్మాణం: సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు సాయం
2) భాగస్వామ్యంతో అందుబాటు ధరల గృహ నిర్మాణం: డెవలపర్లు లేదా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇళ్ల నిర్మాణం.
3) అందుబాటు ధరల అద్దె గృహ నిర్మాణం: నగరాల్లో తక్కువ అద్దెకే వసతి పొందడం.
4) వడ్డీ రాయితీ పథకం: బ్యాంక్ రుణాలు తీసుకునే వారికి వడ్డీలో మినహాయింపు లేదా రాయితీ.
ఈ మొత్తం ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడిని అంచనా వేయగా, అందులో ప్రభుత్వం రూ.2.30 లక్షల కోట్లను నేరుగా ఆర్థిక సహాయంగా సమకూరుస్తుంది. దీనిద్వారా సుమారు కోటి పట్టణ కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మహిళలకు ప్రాధాన్యత, లబ్ధిదారుల అర్హతలు
ఈ పథకంలో ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS), తక్కువ ఆదాయ వర్గాలు (LIG), మధ్య ఆదాయ వర్గాలు (MIG) చెందిన అర్హులైన కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి. దేశంలో ఎక్కడా సొంతంగా శాశ్వత (పాకా) ఇల్లు లేని పట్టణ నివాసితులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అంతేకాకుండా, గృహ కేటాయింపుల్లో మహిళల పేర్లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, ఆస్తిపై మహిళా యాజమాన్యాన్ని బలోపేతం చేస్తున్నారు.
1.25 కోట్లకు పైగా గృహాల ఆమోదం
ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి 2026 నాటికి 13.61 లక్షల ఇళ్లకు, జూన్ 2026 నాటికి అదనంగా 2.13 లక్షల ఇళ్లకు ఆమోదం లభించింది. ఆగస్టు 2026 నాటికి PMAY-U, PMAY-U 2.0 పథకాల కింద మొత్తం ఆమోదించిన ఇళ్ల సంఖ్య 1.25 కోట్లకు పైగా చేరింది. ప్రస్తుతం రాజస్థాన్ వంటి పలు రాష్ట్రాల్లో సాంకేతిక బృందాల ఏర్పాటు ద్వారా స్థానిక నగర స్థాయిల్లో సర్వే, లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరుగుతోంది. అర్హులైన నివాసితులు తమ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థలు (ULBs) లేదా అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: సెప్టెంబరు 11న అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు..BRICS కారణంగా వరుసగా 4 రోజులు బంద్!
Also REad: School Holidays: ఈవారంలో స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు..విద్యార్థులకు పండగే పండగ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala: అలిపిరిలో మరోసారి చిరుత సంచారం.. తీవ్ర భయాందోళనల్లో తిరుమల భక్తులు ..
Hyderabad, Telangana:Leopard spotted at alipiri steps in Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల కొంగు బంగారం అయిన తిరుమలలో భక్తులరద్దీ విపరీతంగా ఉంది. తిరుమల లోని అన్ని కంపార్ట్ మెంట్ లు భక్తులతో నిండిపోయింది. శిలాతోరణం వరకు భక్తులు దర్శనాల కోసం వేచి ఉంటున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకుఇబ్బందులు లేకుండా టీటీడీ కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తిరుమలలో నడక మార్గంలో ఇటీవల క్రూర జంతువుల సంచారం మాత్రం మరీ ఎక్కువైందని చెప్పుకొవచ్చు.
తరచుగా నడక మార్గంలో చిరుత పులులు, ఏనుగులు, ఎలుగు బంట్లు, పాములు వస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. తాజాగా.. మరోసారి అలిపిరి వద్ద చిరుత కన్పించడంతో భక్తులు చాలా సేపు టెన్షన్ లో ముందుకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు.
తిరుమలలోని అలిపిరి ఏడో మైలు సమీపంలో చిరుతను కొంత మంది భక్తులు చూశారు. వెంటనే అలర్ట్ అయి అక్కడున్న టీటీడీ సిబ్బందికి చెప్పారు. భక్తులు గట్టిగా కేకలు వేయడంతొ చిరుత పొదల్లోకివెళ్లిపోయింది. వెంటనే టీటీడీ విజిలెన్స్ అక్కడకు చేరుకున్నారు. భక్తులను గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచించారు.
చిన్న పిల్లలను మధ్యలో పెట్టుకొవాలన్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని కీలక సూచనలు చేశారు. మరోవైపు బ్రహ్మోత్సవాల వేళ తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిరుత సంచారంతో మరోసారి దీనిపై ఏదైన శాశ్వతంగా చర్యలు తీసుకొవాలని భక్తులు టీటీడీని డిమాండ్ చేస్తున్నారు.
Read more: Tirumala news: తిరుమలలో మరో అపచారం.!. మహాద్వార గోపురంపై విరిగిన కృష్ణస్వామి చెయ్యి.. వీడియో..
ఇటీవల రొబొ శునకాలను టీటీడీ టెస్ట్ చేసింది. దీనిపై పాలక మండలి సమావేశంలో చర్చించి ఈ క్రూర జంతువుల భయాందోళనలు లేకుండా ఒక శాశ్వతమైన పరిష్కారందిశగా అడుగులు వేస్తామని టీటీడీ ఇప్పటికే తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Bigg Boss 10 Ansar: బిగ్బాస్ హౌస్లోకి వెళ్లిన రెండు రోజులకే గోడదూకి పారిపోవాలని..20 అడుగుల గోడపైకి ఎక్కి..చివరికి!
Chembarambakkam, Tamil Nadu:Bigg Boss 10 Ansar Escape: బుల్లితెరపై విజయవంతంగా ప్రసారం అవుతున్న రియాలిటీ షో 'బిగ్బాస్' ఇటీవలే ఐదు ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా లాంఛ్ అయ్యింది. సెప్టెంబరు 6వ తేదీన హిందీలో బిగ్బాస్ 20వ సీజన్ బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ హోస్ట్గా ప్రారంభం అవ్వగా.. ఇటు తెలుగు అక్కినేని నాగార్జున వ్యాఖ్యతగా.. తమిళంలో విజయ్ సేతుపతి హోస్టింగ్లో 10 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది.
అలాగే కన్నడం, మలయాళంలోనూ బిగ్బాస్ కొత్త సీజన్ ప్రారంభమైంది. అయితే తాజాగా ఓ బిగ్బాస్ కంటెస్టెంట్ కేవలం రెండు రోజులకే ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతకీ అతను ఎవరు? ఏం జరిగిందనే విశేషాలను తెలుసుకుందాం.
2017లో తమిళంలో తొలిసారిగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో, 9 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు తాజాగా 10వ సీజన్లోకి అడుగుపెట్టింది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో కూడా సెప్టెంబర్ 6, 2026న ప్రారంభమైంది. ఇందులో మొత్తం 19 మంది కంటెస్టెంట్లు ఉన్నారు.
గోడ దూకిన అన్సర్..
తమిళంలో 'కుక్ విత్ కోమాలి' అనే బుల్లితెర కార్యక్రమంతో పాటు అనేక ఇతర ప్రముఖ టెలివిజన్ షోల ద్వారా భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న అన్సర్.. ఇప్పుడు అదే క్రేజ్తో బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశించాడు. అయితే బిగ్బాస్ షోలోకి ప్రవేశించిన రెండు రోజులకే అతను గోడ దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు.
గతంలో తమిళ బిగ్ బాస్ సీజన్ 1లో, నటుడు భరణి గోడ ఎక్కి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. ఇప్పుడు అన్సర్ కూడా అదే విధంగా బిగ్బాస్ హౌస్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
అయితే బుల్లితెర సెలబ్రిటీ అన్సర్ హఠాత్తుగా హౌస్ నుండి పారిపోవడానికి చేసిన ప్రయత్నం వెనుక అసలు కారణం తెలియరాలేదు.అయితే, బిగ్ బాస్ హౌస్ మేనేజ్మెంట్తో జరిగిన చర్చలు,తోటి కంటెస్టెంట్స్ జేసన్తో జరిగిన వాగ్వాదం తర్వాత అతను మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
ఈ బిగ్బాస్ తమిళం 10వ సీజన్ గత సీజన్ల కంటే చాలా భిన్నంగా ఉండబోతోంది. మొదటి వారంలో సీరియల్ నటి సత్విక 'హజ్మాట్స్' జట్టుకు నాయకురాలిగా ఎంపిక కాగా.. పోటీదారులను రెండు వేర్వేరు జట్లుగా విభజించారు. దీనికి తోడు 'డెమోక్రసీ రూమ్' వంటి కొత్త ప్రయోగాలతో ఈ సీజన్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితమైన మలుపులు తీసుకుంటోంది. తర్వాత ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read: బిగ్బాస్లో రోజుకు ఎంత సంపాదిస్తారో తెలుసా? వారానికి లక్షల్లో సంపాదన!
Also Read: బిగ్బాస్ హౌస్లోకి ఒలింపిక్స్ బాక్సింగ్ ఛాంపియన్..రియాలిటీ షో చరిత్రలో తొలిసారిగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party: తెలంగాణకు రేవంత్ రెడ్డి అనే చీడ తగిలింది.. దాని పీడ విరగడవ్వాలి'
Baddipadaga, Telangana:Desapathi Srinivas: తెలంగాణకు రేవంత్ రెడ్డి చీడ అనేది తగిలిందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్ తెలిపారు. 'సభ ప్రారంభం కాగానే మా సభ్యులను సస్పెండ్ చేయాలని తీర్మానం పెట్టారు. మెజారిటీగా మేము ఉన్నాం తీర్మానం వీగిపోతుంది. కేవలం ఒక్క నిమిషంలోనే ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేశారు. ఇది చట్ట విరుద్ధమైన సస్పెండ్' అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శాసనమండలి మీడియా పాయింట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సభ బయట జరిగిన దానికి సస్పెండ్ చేసే అధికారం చైర్మన్కి లేదని స్పష్టం చేశారు. సభలో జరిగిన దానికి మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంటుందని తెలిపారు. ఏ రూల్ ప్రకారం సస్పెండ్ చేశారో అడిగితే మమ్మల్ని మార్షల్స్ను పెట్టీ బయటకు పంపారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మా సభ్యుల మీద దాడులు చేస్తున్నారు. మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది కామన్ అయింది. పోలీసులు భౌతిక దాడులు చేస్తున్నారు. ఇది నీచమైన పద్దతి' అని రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. 'జుట్టు పట్టుకు లాగుతున్నారు. మా మహిళ ఎమ్మెల్యేలు కన్నీరు పెట్టుకున్నారు. మా ఎమ్మెల్యేల కన్నీటికి విలువ లేదా?' అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యులను ఏకపక్షంగా ఎలా సస్పెండ్ చేస్తారని నిలదీశారు.
'హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతున్నారు ఇక్కడ మమల్ని బుల్డోజ్ చేస్తున్నారు బుల్డోజర్ ప్రభుత్వం. ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వం అణచివేతకు గురిచేస్తుంది. పాలిటెక్నిక్ పిల్లల పీకలు నొక్కుతున్నారు. ఇక్కడ ప్రతిపక్ష సభ్యుల పీకలు నొక్కుతున్నారు' అని రేవంత్ రెడ్డి పాలనలో పోలీసుల దౌర్జన్యాలు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వివరించారు. 'రాహుల్ గాంధీ నల్ల డ్రెస్ మీద మోదీ, అదానీ క్యారికేచర్ ఉంది. నినాదాలు ఉన్నాయి రాహుల్ గాంధీకి ఒక న్యాయం మాకు ఒక న్యాయమా?' అని ప్రశ్నించారు. ఎవరి ఆదేశాల మేరకు మమల్ని సభలోకి రాకుండా అడ్డుకున్నారని నిలదీశారు. 'రేవంత్ రెడ్డి భాష మీద చర్చ జరగాలి అంటున్నారు. రేవంత్ రెడ్డి భాష గురించి మాట్లాడే హక్కు లేదు. నిండు అసెంబ్లీలో బడివే అంటారు దానిమీద ఏం చర్యలు ఉండవా?' అని స్పీకర్, శాసనమండలి చైర్మన్ను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ దమనకాండ నడవదు ప్రతిఘటిస్తాం మీ దమనకాండ ప్రజల ముందు బట్ట బయలు అవుతుందని హెచ్చరించారు.
Banks Strike: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 5 రోజుల పనిదినాలకు భారీ సమ్మె
Wadgaon, Maharashtra:Four Days Bank Holidays: బ్యాంకు ఉద్యోగులు అంటే మర మనిషిలా మారాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్యోగిగా భావించకుండా అత్యధిక గంటలు బ్యాంకు సేవలో మునిగిపోతున్న ఉద్యోగులు తీవ్ర మానసిక.. శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. అధిక పని గంటలతోపాటు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్లో భారీ ఎత్తున ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించిన కార్యాచరణ వివరాలు ఇలా ఉన్నాయి.
బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు, తమ దీర్ఘకాలిక డిమాండ్ల సాధన కోసం.. తమ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిస్తున్నట్లు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ప్రకటించింది. ఇప్పటికే పండుగలతో వరుస సెలవులు ఉండగా.. ఇప్పుడు సమ్మె ప్రకటించడంతో పెద్ద ఎత్తున బ్యాంకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. బ్యాంకు సంఘాలు ప్రకటించిన సమ్మెతో సెప్టెంబర్ నెలలో బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలుస్తోంది.
బ్యాంకు సెలవులు
తమ ఆందోళనల్లో భాగంగా సెప్టెంబర్ 11వ తేదీన బ్యాంకు సంఘాలు ఒక రోజు దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నాయి. ఆ తర్వాత రోజు సెప్టెంబర్ 12, 13 తేదీలు శని, ఆదివారాలు ఉన్నాయి. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబర్ 14వ తేదీన వినాయక చవితి వచ్చింది. దీంతో దాదాపుగా దేశంలోని అన్ని బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు ఉండనుంది. మొత్తం నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.
ఐదు రోజులు
బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రకటించిన మాదిరి మరో మూడు రోజుల సమ్మె జరగనుంది. సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉండనున్నాయి. ఉద్యమంలో భాగంగా మూడు రోజుల సమ్మె బ్యాంకు ఉద్యోగులు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 26, 27వ తేదీల్లో వారాంతపు సెలవులు ఉండడంతో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.
సెప్టెంబర్లో చేపట్టిన సమ్మెకు కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే అక్టోబర్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఇప్పటికే బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం, బ్యాంక్ యాజమాన్యాలు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే అక్టోబర్ 26వ తేదీ నుంచి భారీ సమ్మెకు దిగుతామని ఇప్పటికే బ్యాంకు సంఘాలు హెచ్చరించాయి.
బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు
తీవ్రస్థాయిలో బ్యాంకు సంఘాలు సమ్మెకు దిగడానికి కొన్ని ప్రధాన డిమాండ్లు, సమస్యలు ఉన్నాయి. వాటిలో పని ఒత్తిడి.. పనిదినాలు ప్రధానంగా ఉన్నాయి.
వారంలో రెండు రోజుల సెలవు: పని ఒత్తిడితో సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగులు వారంలో రెండు రోజుల సెలవు కోరుతున్నారు. ఎప్పటి నుంచే ఈ డిమాండ్ చేస్తున్నారు. వారానికి 5 రోజుల పనిదినాల ప్రతిపాదనను అమలు చేయాలని బ్యాంకు సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి.
పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో వ్యత్యాసాలను తొలగించి.. ఉద్యోగులందరికీ సమాన ప్రాతిపదికన అమలు చేయాలని మరో ప్రధాన డిమాండ్ బ్యాంకు ఉద్యోగులు చేస్తున్నారు.
పెన్షన్ అప్డేషన్, విశ్రాంత ఉద్యోగులందరికీ ఒకే రకమైన కరువు భత్యం (డీఏ) ఫార్ములా అమలు చేయాలని బ్యాంకు సంఘాల డిమాండ్. కొత్త పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) ఎంచుకునే అవకాశం ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగుల మరో డిమాండ్.
DK Aruna: రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు మద్దతుగా ఎంపీ డీకే అరుణ
Baddipadaga, Telangana:DK Arun Demands Revanth Reddy Apology: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చీరలు లాగడం.. జుట్టు పట్టుకోవడం.. దాడికి పాల్పడడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుండగా బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసుల వ్యవహరించిన తీరును ఖండించారు. పోలీసుల తీరు చాలా హేయమని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు.
'నిన్న అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డితో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా హేయమైంది' అని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. మహిళ శాసనసభ్యులపై పోలీసులు అనుచితంగా ఎవరు ఆదేశాల ప్రకారం ప్రవర్తించారు? రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఏ హోదాలో పోలీసులను ఆదేశించారా? సిగ్గు అనిపించడం లేదా?' అని మండిపడ్డారు. మహిళ శాసనసభ్యులపై పోలీసులు అమానుషంగా వ్యవహరించిన తీరుపై చర్చ పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.
'స్పీకర్పై ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుగా ఉందని భావించి క్షమాపణలు కోరాలని చెప్పడం, చర్యలు తీసుకోవాలని సభలో చర్చించారు. దానితోపాటు బీఆర్ఎస్ పార్టీ మహిళ శాసనసభ్యులపై వ్యవహరించిన తీరుపై చర్చ పెట్టాలి' అని ఎంపీ డీకే అరుణ సూచించారు. 'ఎందుకు మహిళ శాసన సభ్యులను అవమానించాల్సి వచ్చింది? మహిళల మెడ, వెంట్రుకలు పట్టుకొని గుంజడం, చీర లాగడంపై నోరు విప్పకపోవడం కన్నా దారుణం ఏమైనా ఉంటుందా?' అని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. మహిళ ఎమ్మెల్యేల పరిస్తితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్తితి తెలంగాణలో ఎలా ఉందో అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి పాలనపై అసహనం వ్యక్తం చేశారు. మహిళ ఎమ్మెల్యేలకు ఎంత అగౌరవం ఇస్తున్నారో ఇది సాక్ష్యం అని కాంగ్రెస్పై మండిపడ్డారు. 'ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పని చేసిన వారు. పార్టీలు వేరైనా సాటి ఎమ్మెల్యేలను గౌరవించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉంటుంది' అని బీజేపీ ఎంపీ డీకే అరుణ గుర్తుచేశారు.
అసెంబ్లీ ఆవరణలో మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యురాళ్లు సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారిపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయం. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు ఇంత అనుచితంగా ప్రవర్తించడం తీవ్రంగా ఖండించదగినది. బాధ్యులైన పోలీసులపై తక్షణమే చర్యలు… pic.twitter.com/6NaST1jxUZ
— D K Aruna (@Aruna_DK) September 8, 2026
'ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఒక న్యాయం సరైంది కాదు. మహిళ పట్ల మరింత గౌరవం ఉండాలి' అని రేవంత్ రెడ్డికి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ సూచించారు. అసెంబ్లీలోని మహిళ ఎమ్మెల్యేలకు గౌరవం లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఇది పార్టీలకు సంబంధం లేని అంశం అని స్పష్టం చేశారు. ఒక మహిళగా, పార్లమెంట్ సభ్యురాలిగా బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఎంపీ డీకే అరుణ ప్రకటించారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Harish Rao: రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా హరీశ్ రావు సంచలన డిమాండ్.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన
Baddipadaga, Telangana:President Rule In Telangana: తెలంగాణలో ఎమ్మెల్యేలు.. మహిళా శాసనసభ్యులను బట్టలు విప్పి దాడి చేయడం.. తొక్కేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను చంపేందుకు కాంగ్రెస్ గూండాలు, రౌడీలు కుట్ర పన్నుతుండడంతో మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన డిమాండ్ చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని.. తెలంగాణలో రాష్ట్రపతి విధించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Party: రేవంత్ రెడ్డికి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్.. 'మగాడివే అయితే కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కో'
Baddipadaga, Telangana:Telangana Assembly Session: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు కోరుతూ మాట్లాడిన వీర్లపల్లి శంకర్, వేముల వీరేశంపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. 'కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ పరిసర ప్రాంతాల్లో మకాం వేశారు. కేసీఆర్పై దాడి చేయాలని పక్కా ప్రణాళికతో కొందరు ఎమ్మెల్యేలు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం దగ్గరే ఉన్నారు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోడివే అయితే రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కో' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ చేశారు. పోలీసులను అడ్డంపెట్టుకొని.. గుండాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తానంటే నడవదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'కేసీఆర్ చావు గురించి ఇద్దరి ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డే అనిపించాడు' అని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మీడియా పాయింట్లో మాట్లాడారు. 'రేవంత్ రెడ్డి మా నాయకుడు కేసీఆర్ చావు గురించి అనేక సార్లు మాట్లాడాడు. కేసీఆర్పై దాడి చేసేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ చేస్తుంది. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేసీఆర్ చావు కోరుకున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంపై వేముల వీరేశం దాడి చేస్తానన్నాడు. వీర్లపల్లి శంకర్ అన్నమాట కాదు రేవంత్ రెడ్డి అన్నమాట' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కేసీఆర్ చావు కోరిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై పోలీసులు కేసు పెట్టీ అరెస్ట్ చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 'అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంస్కృతం మాట్లాడుతున్నాడు. శాసనసభలో, బయట సభలో రేవంత్ రెడ్డి ఒకేలా మాట్లాడుతాడు. వెయ్యి డప్పులతో కేసీఆర్ చావు కోరుకుంతమని వారిపై కేసు పెట్టాలి' అని కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావును కోరుకోవడం సంస్కారమా! అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడికి కాంగ్రెస్ కుట్ర
బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ మాట్లాడుతూ.. 'బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి చేసేందుకు ప్రణాళిక ప్రకారం కాంగ్రెస్ సిద్ధంగా ఉంటుంది. ప్రజల సమస్యలపై చర్చించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇష్యూను దృష్టి మరల్చి కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి ఇష్యూ తెరపైకి తెచ్చారు. ఈరోజు స్పీకర్ను ముందు పెట్టీ దృష్టి మరల్చుతున్నారు' అని తెలిపారు.
'ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ను ఏం అనలేదు. ఒకవేళ అదే జరిగితే తాత మధు విచారం వ్యక్తం చేశాడు. ప్రజల్లో నుంచి వచ్చే తిగుబాటు నుంచి తప్పించుకునేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు' అని రేవంత్ రెడ్డి నీచబుద్ధిని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వివరించారు. తోటి మహిళలను అవమానించేలా సీతక్క మాట్లాడారని మండిపడ్డారు. 'మహిళ ఎమ్మెల్యేలు ఉంటే మగ పోలీసులను ముందు పెడుతున్నారు. పురుష ఎమ్మెల్యేల ముందు ఆడ పోలీసులను పెడుతున్నారు' అని తెలిపారు. 'రాహుల్ గాంధీపై హేమంత్ బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఏకైక సీఎం కేసీఆర్. మహిళలకు జరిగిన అవమానంపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి' అని బీఆర్ఎస్ పార్టీ విప్ వివేకానంద గౌడ్ డిమాండ్ చేశారు. 'బీఆర్ఎస్ పార్టీ మహిళ శాసనసభ్యులపై పదే పదే దాడి జరుగుతుంది' అని తెలిపారు.
KCR House: కేసీఆర్ను చంపాలని చూస్తున్న రేవంత్ రెడ్డి.. గుండాల, రౌడీల రాజ్యం: జగదీశ్ రెడ్డి
Baddipadaga, Telangana:Congress Goons Attack On KCR House: 'స్వయానా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంపై దాడికి పంపాడు. గుండాలు, రౌడీలను పంపిస్తున్నాడు' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్కు ఏమైనా అయితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ప్రకటించారు. కాంగ్రెస్ గూండా రాజ్యాన్ని నడుపుతోందని విమర్శించారు. 'శాంతిభద్రతలు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ఆయనే అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. తొక్కి పడేయండి అని రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు ముట్టడించారు' బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు రెండో రోజు మంగళవారం అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మీడియా పాయింట్లో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అసలు ఏమి జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి? ప్రజలకి నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. ఎమ్మెల్యేలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ను ప్రజలే కాపాడుకుంటారు. వీళ్ల పోలీసుల ఏమి చేయలేరు. కొంతమంది యువకులు కేసీఆర్ని కాపాడుకోవాలని కేసీఆర్ నివాసానికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారు.
'దుర్మార్గంగా పిరికితనంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మేము అసెంబ్లీకి వస్తుంటే అడ్డుకున్నారు. శాసనసభకు వస్తే అనేక విషయాలు బయటకొస్తాయని రానివ్వడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సభ నడపటం ఇష్టం లేదు. వారి చేతగానితనం బయటపడుతుంది' అని రేవంత్ రెడ్డి వైఫల్యాలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వివరించారు. 'రేవంత్ రెడ్డి స్వయానా కాంగ్రెస్ శ్రేణులను కేసీఆర్ నివాసంపై దాడికి పంపాడు. గుండాలు, రౌడీలను పంపిస్తున్నాడు. శాంతిభద్రతలు కాపాడాల్సిన రేవంత్ రెడ్డి ఆయనే అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. తొక్కి పడేయండి అని రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు ముట్టడించారు. ఇక్కడి నుంచే కేసీఆర్ నివాసంపై దాడి చేయడానికి ఆదేశాలు ఇస్తున్నాడు. కేసీఆర్ని చంపడానికే వచ్చామని ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి తెలిపారు.
పాలన చేతగాకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మాట్లాడుతూ.. 'మేము మహిళా ఎమ్మెల్యేలం వెనుక ఉన్నాం. సీతక్క అబద్దాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ గేటు దగ్గర ఏం జరిగిందో విచారణ చేయండి' అని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. పోలీసులు బారికేడ్లు లాగడంతో మహిళా ఎమ్మెల్యేలు కింద పడ్డారని తెలిపారు. మహిళా పోలీసులను దగ్గర పెట్టి ఇబ్బందులు సృష్టించారని చెప్పారు. 'అసెంబ్లీకి వస్తే మాపై దాడులు చేస్తున్నారు. మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు ఎందుకు లోపలికి పంపలేదు?' అని ప్రశ్నించారు.
'అసెంబ్లీకి వచ్చి కేసీఆర్పై రేవంత్ రెడ్డి బూతు పురాణాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సీఎంగా కేసీఆర్ ఉన్నారా?' అని ఎమ్మెల్యే కోవా లక్ష్మి నిలదీశారు. రేవంత్ రెడ్డికి పాలన చేతగాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి అని సవాల్ చేశారు. కేసీఆర్ ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. 'మాకు ఎమ్మెల్యేలుగా సభలోకి వచ్చే హక్కు ఉంది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా?' అని నిలదీశారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై కేసు పెట్టి అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి డిమాండ్ చేశారు.
Wife: విస్తుపోయే ఘటన.. వీడియో కాల్లో మాట్లాడనందుకు భార్య ఆత్మహత్య
Mahabubabad, Telangana:Wife Video Call: విలువైన ప్రాణాలను అతి చిన్న కారణాలతో బలి తీసుకుంటున్నారు. క్షణికావేశానికి లోనయి ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈక్రమంలోనే తెలంగాణలో ఒక విస్తుపోయే సంఘటన చోటుచేసుకుంది. తన భర్త వీడియో కాల్కు సమాధానం ఇవ్వలేదని అలిగిన భార్య క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆమె ప్రాణాలు తీసింది. ఎలుకల మందు తిని ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అయినా కూడా ఆమె ప్రాణం దక్కలేదు. ఈ సంఘటన తెలంగాణలో మహబూబాబాద్లో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండకు గ్రామానికి చెందిన అఖిల (20)కు అదే గ్రామానికి చెందిన బానోత్ హుస్సేన్తో వివాహమైంది. మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో భర్త హుస్సేన్ పని చేస్తున్నాడు. వారం రోజుల కిందట అఖిల పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 2వ తేదీన అఖిల పాప ఏడుస్తుండగా భర్తకు వీడియో కాల్ చేసింది. అయితే విధుల్లో ఉన్న హుస్సేన్ వీడియో కాల్కు స్పందించకుండా సమాధానం ఇవ్వలేదు. దీంతో అఖిల తీవ్ర అసంతృప్తికి లోనయ్యింది. అదేరోజు మహబూబాబాద్లోని హస్తినాపురం కాలనీలోని తాము నివసిస్తున్న ఇంటికి వెళ్లి అక్కడ ఇంట్లో ఉన్న ఎలుకల మందు తినేసి ఆత్మహత్యాయత్నం చేసింది.
అయితే అఖిల వెంట తల్లి శారద కూడా మహబూబాబాద్కు వచ్చింది. పాప రోదిస్తున్నా కూడా పాలు ఇవ్వకుండా అఖిల ఉండడంతో తల్లి మందలించింది. ఎన్నిసార్లు చెప్పినా పాలు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి అఖిలను గట్టిగా నిలదీశారు. దీంతో తాను ఇంట్లో ఉన్న ఎలుకల మందును తిన్నానని అఖిల చెప్పింది. వెంటనే అల్లుడు హుస్సేన్కు ఫోన్ చేయగా అతడు ఇంటికి వచ్చి అఖిలను మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో నాలుగు రోజుల చికిత్స పొందిన అఖిల పరిస్థితి మరింత విషమంగా మారడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం అఖిల మృతి చెందింది. మృతురాలి తల్లి శారద ఫిర్యాదుతో మహబూబాబాద్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. క్షణికావేశంలో తీసుకున్న అఖిల నిండు ప్రాణం పోవడమే కాకుండా పసిపాపకు కన్నతల్లి ప్రేమ దూరమైంది.
Gaddam Prasad: నీ తల్లిని కాదు.. నా తల్లిని అన్నారు.. అసెంబ్లీలో హరీష్ రావుపై స్పీకర్ గరం గరం.. వీడియో ..
Hyderabad, Telangana:Gaddam prasad angry on harish rao: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నిన్న బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దాడులు, అంతే కాకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఎమ్మెల్సీ తాత మధు మాట్లాడిన మాటలపై రచ్చ రాజుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్సీ తాత మధును, మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. ఈ పరిణామాలపై బీఆర్ఎస్ తీవ్రంగా ఖండంచింది.
Speaker Prasad's mother remark sparks Assembly clash
During a heated moment in the Telangana Assembly, Speaker Gaddam Prasad got angry with BRS Deputy Floor Leader Harish Rao and said, “It wasn't your mother he referred to, Harish Rao, it was my mother”.
The Speaker, clearly… pic.twitter.com/ly3M0L1zFO
— Hyderabad Mail (@Hyderabad_Mail) September 8, 2026
ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభ ప్రారంభంకాగానే హరీష్ రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే.. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే స్పీకర్ దీనిపై తమకు ఆదేశాలు ఇచ్చారని చెప్పాు. ఈ వివాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. మహిళా నేతలపై దాడి జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. అదే సమయంలో తాతా మధు తన తల్లిపై చేసిన వ్యాఖ్యల సంగతేంటనీ గడ్డం ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more: పోలీసుల దిగ్బంధనంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాలు.. కొనసాగుతున్న బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం..
ముందు దీనికి సమాధానం చెప్పాలన్నారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్, హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక దీనిలో మంత్రి సీతక్క ఎంట్రీ ఇచ్చారు. స్పీకర్ తల్లిని అవమానిస్తే ప్రధాన ప్రతిపక్షం కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం లేదని సిగ్గుచేటని అన్నారు. దీంతో ఈ విషయంపై అసెంబ్లీలో మరోసారి రచ్చ రాజుకుంది.
Yogi Adityanath: తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి, మాజీ మంత్రి రోజా
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Temple: తిరుమల ఆలయాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వారాంతం ముగిసినా కూడా భక్తుల తాకిడి కొనసాగుతోంది. సాధారణ రోజుల్లో రద్దీ కొనసాగుతుండగా సోమవారం కూడా భక్తులు పోటెత్తారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దర్శించుకోగా.. ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ చొల్ల బొజ్జి రెడ్డి దర్శించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమల చేరుకున్న యోగి ఆదిత్యనాథ్కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామి ఆశీస్సులు పొందారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు తిరుమల అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను అందించి యోగి ఆదిత్యనాథ్ను సత్కరించారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంట ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్తో పాటు పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. స్వామివారి దర్శనం సందర్భంగా ఆలయ పరిసరాల్లో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం యోగి ఆదిత్యనాథ్ తిరుమల నుంచి బయలుదేరారు.
స్వర్ణభారతి ట్రస్ట్ వేడుకలకు హాజరు
అంతకుముందు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె నిర్వహిస్తున్న స్వర్ణ భారతి ట్రస్ట్ 25 సంవత్సరాల వేడుకల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో వెంకటాచలం స్వర్ణ భారతి ట్రస్ట్కు చేరుకోగా.. మంత్రి నారాయణ స్వాగతం పలికారు. మంత్రితోపాటు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా అధికారులు పుష్పగుచ్చం అందజేశారు. యోగి ఆదిత్యనాథ్ పర్యటన సందర్భంగా వెంకటాచలం స్వర్ణ భారతి ట్రస్ట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం 87,115 మంది భక్తులు తిరుమల స్వామిని దర్శించుకున్నారు. 35,053 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు వచ్చాయి. 4.22 లక్షలు లడ్డూ విక్రయాలు జరగ్గా.. 2.96 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు. శిలాతోరణం వరకు వెయిటింగ్ కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా సుమారు సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.
