icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
501505
V SHIVA NAGARAJUV SHIVA NAGARAJUFollow22 Jul 2024, 03:55 pm

తారమతిపేట భారీ చోరి కేస్ ఛేదించిన పోలీస్ లు..ఇద్దరు అరెస్ట్,రిమాండ్ కి తరలింపు

Taramatipet, Telangana:

అబ్దుల్లా పూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని తరమతిపెట్ గ్రామం లో వారం రోజుల క్రితం జరిగిన భారీ చోరి కేస్ ను ఛేదించారు పోలీస్ లు,వరికుప్పల వెంకటేష్ మరియు బత్తుల గోపి అనే ఇద్దరు దొంగలను తారామతి పేట గ్రామం లో ఘటన సమయం లో సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా ఎల్ బి నగర్ లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకున్న పోలీస్ లు స్టేషన్ కి తీసుకుని వచ్చి విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకోగా నిందితులను ఈ రోజు రిమాండ్ కి తరలించినట్లు అబ్దుల్లా పూర్ మెట్టు పోలీస్ లు తెలిపారు.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Petrol And Diesel: ఏపీలో పెట్రోల్‌, డీజిల్ సరఫరాకు బ్రేక్‌ పడొద్దు: షర్మిల, మాధవ్‌

Nuzendla, Andhra Pradesh:

Petrol And Diesel Shortage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ వంటి అత్యవసర ఇంధనాలు ప్రతి వినియోగదారుడిఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం  అందుబాటులో ఉండాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు. పెట్రోల్ బంక్ యాజమాన్యాలు సమగ్ర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మొత్తం 4,312 పెట్రోల్ బంకులు ఉండగా.. వాటిలో సుమారు 1.29 శాతం (దాదాపు 56 బంకులు) కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మాధవ్‌ విజ్ఞప్తి చేశారు.

Also Read: AP Rains: మండే ఎండల వేళ ఆంధ్రప్రదేశ్‌కు చల్లటి కబురు.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాపై అనిశ్చితి నెలకొనే అవకాశాల దృష్ట్యా.. ముందస్తుగా తగిన నిల్వలు ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీవీఎన్‌ మాధవ్‌ డిమాండ్‌ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభం వ్యవసాయం, రవాణా, అత్యవసర సేవల వంటి కీలక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంపొందించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు సహకరించాలని బంక్ నిర్వాహకులకు పీవీఎన్‌ మాధవ్‌ విజ్ఞప్తి చేశారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పీవీయన్ మాధవ్ సూచించారు.

Also Read: Census 2027: జనగణనతో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది: యార్లగడ్డ వెంకట్‌రావు

పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభంపై షర్మిల స్పందన
'డీజిల్ కోసం రైతులు.. పెట్రోల్ కోసం సాధారణ ప్రజలు గంటల కొద్ది క్యూలో పడిగాపులు. ఇలాంటి అత్యవసర స్థితిలో ప్రజా అవసరాల మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం బడా కాంట్రాక్టర్ల కోసం మాట్లాడటం ఏమిటి? వారి ప్రయోజనాలే ముఖ్యంగా పని చేయడం ఏంటి?' అని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిలదీశారు. 'బడా కాంట్రాక్టర్ల కోసమే ప్రత్యేకంగా డీజిల్ సరఫరా కోరడం ఏమిటి? ఇదేనా ఈ ప్రభుత్వ ధోరణి? రైతుకన్నా కాంట్రాక్టర్ ముఖ్యమా? ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులే ప్రాధాన్యమా?' అని ప్రశ్నించారు. 'ఇది పాలన కాదు పూర్తిగా ప్రాధాన్యతల వైఫల్యం. ముందుగా రైతులు, సాధారణ ప్రజలకు నిరంతర ఇంధన సరఫరా సాగేలా చూడాలి' అని వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ప్రజలు ఎలా పోతే ఏంటి .. మాకు కాంట్రాక్టర్లే ముఖ్యం అనుకుంటే ప్రజల కష్టాలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని 'ఎక్స్‌' వేదికగా కూటమి ప్రభుత్వాన్ని వైఎస్‌ షర్మిల హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

AP Rains: మండే ఎండల వేళ ఆంధ్రప్రదేశ్‌కు చల్లటి కబురు.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Nuzendla, Andhra Pradesh:

AP Rain Alert: ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతోపాటు ఉక్కపోతకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వారికి వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని ప్రకటించారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత.. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించారు.

Also Read: Ambati Rambabu: వైఎస్సార్‌ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం

వర్షం ప్రభావం
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులు అకాల వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.

Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం

అత్యధిక ఉష్ణోగ్రత
నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలు రికార్డు అయ్యింది. పల్నాడు జిల్లాలో 28 మండలాలు,  వైఎస్సార్ కడపలో 26, తిరుపతిలో 25, నెల్లూరులో 25, ప్రకాశంలో 22, మార్కాపురంలో 15, నంద్యాలలో 14, చిత్తూరు 13, గుంటూరులో 11 మండలాలు మొత్తంగా 28 జిల్లాల్లో 20 జిల్లాల పరిధిలోని 216 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపింది. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

రేపు వడగాల్పులు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలతోపాటు పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో (9) తీవ్ర వడగాల్పులు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 49 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Also Read: RS Praveen Kumar: కేటీఆర్‌, హరీశ్‌ రావు ఇంటి సీసీ కెమెరాలు హ్యాకింగ్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

ఈ జిల్లాల్లో..
వడగాలులు ఈ జిల్లాలో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం జిల్లా 10, మన్యం 6, పోలవరం 5, కాకినాడ 3, తూర్పుగోదావరి 3, ఏలూరు 3, ఎన్టీఆర్ 4, గుంటూరు 3, పల్నాడు 11, మార్కాపురం 1 మండలాల్లో మొత్తం 49 ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నాయి.

గురువారం ఉష్ణోగ్రతలు
వేసవికాలంలో గురువారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 డిగ్రీలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45,  తిరుపతి జిల్లా రాయలచెరువులో 44.3, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలో 43.6, బాపట్ల జిల్లా కారంచేడు, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43.5, నంద్యాల జిల్లా సంజామలలో 43.2, వైఎస్సార్ కడప జిల్లా కోడూరులో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Census 2027: జనగణనతో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది: యార్లగడ్డ వెంకట్‌రావు

Vijayawada, Andhra Pradesh:

Census 2027 Self-Registration: దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనగణనే బలమైన పునాది అవుతుందని.. ప్రతి ఇంటికీ వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు సూచించారు. ప్రజలందరూ జనగణనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనగణన 2027 స్వీయ నమోదు ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారులకు ప్రజలు ఎటువంటి భయం, సంకోచం లేకుండా సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు.

Also Read: Ambati Rambabu: వైఎస్సార్‌ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం

జనగణన 2027లో భాగంగా ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వినియోగించుకున్నారు. విజయవాడ ఎమ్మెల్యే కార్యాలయంలో తహసీల్దార్ శివయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తన కుటుంబ వివరాలను జనగణన పోర్టల్‌లో నమోదు చేశారు. దేశాభివృద్ధిలో కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని యార్లగడ్డ వెంకట్రావు కోరారు.

Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం

ఈ సందర్భంగా తహసీల్దార్ స్వీయ నమోదు ప్రక్రియలోని ప్రాముఖ్యతను, వివరాలను నమోదు చేసే విధానాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్‌రావు మాట్లాడుతూ.. జనగణన అనేది కేవలం జనాభా లెక్కల సేకరణ మాత్రమే కాదని.. రాబోయే కాలానికి దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి ఇది ఒక బలమైన పునాది అని తెలిపారు. మే 1వ తేదీ నుంచి ప్రారంభమై మే 31వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ అధికారులు, ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికీ వచ్చి వివరాలను సేకరిస్తారని వివరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారులకు ప్రజలు ఎటువంటి భయం, సంకోచం లేకుండా సరైన సమాచారాన్ని అందించాలని చెప్పారు. ఈ జాతీయ కార్యసాధనలో భాగస్వాములు కావాలని టీడీపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గన్నవరం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ చొరవ చూపాలని పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Ambati Rambabu: వైఎస్సార్‌ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం

Nandimandalam, Andhra Pradesh:

YSR Ghat: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు శపథం బూనారు. వైఎస్‌ జగన్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను పోరాటం చేస్తానని శపథం చేశారు. ఈ పోరాటంలో తనపై ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా తాను ధైర్యంగా ఎదుర్కుంటానని ప్రకటించారు. తాము వైఎస్సార్‌ వారసులం అని.. వైఎస్‌ జగన్‌ వెంట నడిచేవాళ్లమని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సమాధి వద్ద అంబటి రాంబాబు ప్రతిజ్ఞ చేశారు.

Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం

కడప జిల్లా వేంపల్లిలోని ఇడుపులపాయలో ఉన్న వైఎస్సార్ ఘాట్‌ను అంబటి రాంబాబు సందర్శించారు. వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కూలుస్తామని ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని అంబటి రాంబాబు ప్రతిజ్ఞ పూనారు. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని స్పష్టం చేశారు.

Also Read: RS Praveen Kumar: కేటీఆర్‌, హరీశ్‌ రావు ఇంటి సీసీ కెమెరాలు హ్యాకింగ్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

'వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో రామ మునిరెడ్డి అనే తెలుగుదేశం నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నాపై కేసు పెట్టారు. ఒకే అంశంపై చట్టవిరుద్ధంగా 36 కేసులు నమోదు చేయడం దారుణం' అని అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ ఆదేశాలతోనే పోలీసులు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 'వైఎస్సార్ వారసులం. వైఎస్‌ జగన్ వెంట నడుస్తున్న వాళ్లం. అక్రమ కేసులకు ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. వచ్చేది జగన్ ప్రభుత్వమే.. అరాచక పాలనకు చరమగీతం పాడుతాం' మాజీ మంత్రి అంబటి రాంబాబు ధీమా వ్యక్తం చేశారు.

'చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదు. నిబంధనలు అతిక్రమించే అధికారులను భవిష్యత్తులో చట్టం ముందు నిలబెడతాం. రాష్ట్రంలో సాగుతున్నది కక్షసాధింపు రాజకీయాలే తప్ప.. ప్రజాస్వామ్య పాలన కాదు. ప్రభుత్వ అరాచకాలపై న్యాయపోరాటం చేస్తాం' అని అంబటి రాంబాబు ప్రకటించారు. ఇటీవల గుంటూరులోని సత్తెనపల్లిలో జరిగిన పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అతడు అరెస్టయి జైలు జీవితం గడిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం

Amaravathi, Andhra Pradesh:

AP Cabinet Meeting Decisions: రాజధాని అమరావతి అభివృద్ధి లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే సమావేశమైన మంత్రిమండలి కూడా రాజధాని అంశంపై నిర్ణయాలు తీసుకుంది. సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల పెంపు తదితర అంశాలపై మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంటూ పలు అంశాలకు ఆమోదం తెలిపింది. పలు ప్రాజెక్టులకు భూకేటాయింపులు చేస్తూ మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది.

Also Read: RS Praveen Kumar: కేటీఆర్‌, హరీశ్‌ రావు ఇంటి సీసీ కెమెరాలు హ్యాకింగ్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

అమరావతిలోని సచివాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమై కొన్ని గంటల పాటు చర్చలు జరిపింది. మొత్తం 26 అంశాలపై చర్చించి, అభివృద్ధి, మౌలిక వసతులు, పరిపాలన సంబంధిత ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కృష్ణానది వరద నుంచి రక్షణ (ఫ్లడ్ ప్రొటెక్షన్) పనులకు రూ.443 కోట్ల ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయంలో గ్లాస్ క్లాడింగ్ సహా వివిధ పనులకు రూ.2540 కోట్ల నిధుల విడుదలకు మంత్రిమండలి ఆమోదించింది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరోగ్య పథకంపై బిగ్‌ అప్‌డేట్‌ ఇదే!

ఇక రాజధాని ప్రాంతంలోని అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణానికి మంత్రిమండలి సమావేశం అనుమతి ఇచ్చింది. అసెంబ్లీ పరిసరాల్లో సివిల్ వర్క్స్‌కు రూ.798 కోట్ల ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలకు, పోలవరం ప్రాజెక్ట్ బాధితుల గృహ యూనిట్ ఖర్చు పెంపుకు ఏపీ మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. ఉండవల్లి జోన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.580 కోట్ల ప్రణాళికకు ఆమోదం తెలిపింది.

అమరావతి ప్రాంతంలో డ్రెయిన్ సైఫన్ నిర్మాణ పనులకు రూ.76 కోట్లకు, హంద్రీ-నీవా ప్రాజెక్ట్‌కు రూ.3099 కోట్ల సవరణ అంచనాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. హోంశాఖలో 385 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుళ్లుగా అప్‌గ్రేడ్ చేయడానికి, హైకోర్టు, జిల్లా న్యాయ వ్యవస్థలో 21 కొత్త పోస్టులను సృష్టికి, పంచాయతీ రాజ్ శాఖలో 20 పోస్టులు సృష్టించడంతోపాటు 9 పోస్టులను అవుట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడానికి మంత్రిమండలి పచ్చజెండా ఊపింది.

మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..!
==> న్యూఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి రూ.124.5 కోట్లు కేటాయించాలని నిర్ణయం
==> మార్క్‌ఫెడ్‌కు రూ.1,800 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్‌కు ప్రభుత్వం హామీ
==> రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ ఖర్చుల మార్పులకు ఆమోదం
==> వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు
==> మున్సిపల్ ఆస్తుల లీజ్, రెంట్ ఫిక్సేషన్ నిబంధనల్లో మార్పులకు నిర్ణయం
==> మున్సిపల్ చట్టాల్లో సవరణల బిల్లును ప్రతిపాదన
==> తిరుపతి సమీపంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం భూముల కేటాయింపు
==> కడపలో 92 ఎకరాల డంపింగ్ యార్డ్ కోసం భూమి కేటాయింపు
==> ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్, చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూముల బదిలీ ప్రతిపాదనల పచ్చజెండా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

RS Praveen Kumar: కేటీఆర్‌, హరీశ్‌ రావు ఇంటి సీసీ కెమెరాలు హ్యాకింగ్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

Hyderabad, Telangana:

Telangana Phone Tapping Issue: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తుండగా.. ఈ క్రమంలో మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు నివాసాల ముందు ఉన్న సీసీ కెమెరాలు కూడా హ్యాకింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.

'టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకులను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టబద్ధంగా దేశ భద్రత కోసం జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా ట్యాపింగ్ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నేతలను ఇరికించే ప్రయత్నం జరుగుతుంది' అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ విమర్శించారు. '350 మంది సాక్షులను విచారించి ఇప్పటి వరకు ఛార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. ప్రభాకర్ రావును 18 రోజులు జైల్లో కరుడుగట్టిన నేరస్తుడిలా ట్రీట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఛార్జ్‌షీట్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు పెట్టాలని అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారు' అని మండిపడ్డారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సంధ్య శ్రీధర్ రావుపై 26 కేసులు ఉన్నాయి. అతనితో ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీనియర్ జర్నలిస్టును ఇరికించి అతను సుప్రీంకోర్టులో బెయిల్ పిటీషన్ వేస్తే హరీష్ రావు పేరు చెప్తారా లేదా అని బెదిరిస్తున్నారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ తెలిపారు.

'కేసీఆర్ ఇంటి గోడలపై నోటీసులు అంటించి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రహస్యంగా ఉంటుంది. బాధ్యత లేని హోంమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పోలీసు శాఖ బలైంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు తప్పులు చేస్తున్నారు. నంబీ నారాయణన్ అనే ఇస్రో సైన్టిస్ట్‌పై అక్రమ కేసు మోపినందుకు విచారణ చేసిన వాళ్ళను కోర్టు దోషులుగా ప్రకటించింది. క్రిషాంక్‌పై కేసు పెట్టి జైలుకు పంపారు' అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ తెలిపారు.

'కేటీఆర్, హరీష్ రావు ఇళ్ల ముందు ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు. బెంగుళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకువచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. దీనిపై సిట్ వేసి విచారణ చేయాలి' అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. 'ఐపీఎస్ అధికారులు సీఎం ఆదేశాలను పాటించవద్దు. కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం. గతంలో నాకు యాపిల్ ఫోన్ నుంచి వచ్చిన మెసేజ్‌ను సెంట్రల్ క్రైం పోలీసులకు ఇచ్చా' అని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Seethakka: రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న బీజేపీ: సీతక్క

Hyderabad, Telangana:

Congress Seva Dal Meeting: 'రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోంది. ప్రజల ఐక్యతను దెబ్బతీసి బీజేపీ విద్వేష రాజకీయాలను చేస్తుంది. గాంధీ చూపిన శాంతియుత బాటలో మనం విద్వేష రాజకీయాలను గెలవాలి' అని సీతక్క పిలుపునిచ్చారు. ఈ దేశంలో గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించింది కాంగ్రెస్ పార్టీ. ఇది దేశ ఆత్మను కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది. ఆ దిశలో రక్షణ దళాలుగా సేవాదళ్ కార్యకర్తలు పని చేయాలి' అని సీతక్క సూచించారు.

హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న కాంగ్రెస్ సేవాదళ్ కార్యక్రమంలో సీతక్క పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 'సిద్ధాంత బలం ఉంటే ఎన్ని కష్టాలు అయినా ఎదుర్కోవచ్చు. పార్టీ త్యాగాలు, త్యాగాల చరిత్రను, పార్టీ గొప్పతనాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లాలి. ఆ దిశలో కాంగ్రెస్ సేవాదళ్ ముందుండి నడిపించాలి.  మీ శిక్షణ కార్యక్రమాలను జిల్లాలకు విస్తరిస్తే మన సైన్యం మరింత బలపడుతుంది' అని సీతక్క తెలిపారు. 'గాంధీ జ్ఞానం, నెహ్రు నిర్మించిన భారతదేశ విధి విధానాలు.. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఈ దేశానికి వెన్నెముక. కానీ రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోంది' అని మండిపడ్డారు.

'గాంధీ ఆలోచనలతో క్రమశిక్షణ కలిగిన సంఘంగా కాంగ్రెస్ సేవాదళ్ అవతరించింది. దేశానికి స్వతంత్రం సాధించటంలో.. దేశాన్ని నిర్మించడంలో కాంగ్రెస్ పాత్ర అమోఘం. దేశ స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ దేవ్ సేవాదళ్ పాత్ర మరువలేనిది. కాంగ్రెస్‌ది గాంధీ అహింస సిద్ధాంతం. అదే సిద్ధాంతాన్ని కాంగ్రెస్ సేవా దళ్  కూడా అనుసరిస్తుంది. 'కాంగ్రెస్ సేవాదళ్ అంటే దేశభక్తుల సంఘం. జిల్లాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు సేవాదళ్ నిర్వహించాలి. సేవాదళ్ కాంగ్రెస్ సిద్ధాంతాలకు శ్రీరామరక్ష' అని సీతక్క వివరించారు. క్రమశిక్షణకు మారుపేరు కాంగ్రెస్ సేవాదళ్ అని ప్రకటించారు. అంతకుముందు సీతక్క చరకా పట్టి నూలు వడికారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

BRS Party Post: గులాబీ పార్టీలో ఆ పదవి కలిసి రాదా? పోస్టుపై నాయకుల్లో ఆందోళన

Baddipadaga, Telangana:

BRS Party: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి కొత్త జోష్ వచ్చింది. చాలా రోజులు తర్వాత.. గులాబీ బాస్ కేసీఆర్ జనంలోకి వచ్చారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. కారు పార్టీలో చేరిన సందర్భంగా.. జగిత్యాలలో జరిగిన ఓ భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్.. ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించారు. అంతేకాదు.. ఉత్తర తెలంగాణలో పార్టీ బాధ్యతలు చూడాలని కోరారు.. మొదట్లో జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ జనరల్ సెకట్రరీ వస్తుందని ప్రచారం సాగింది.

ఈ పదవికి ఆయన కూడా ఓకే అన్నారని అనుచరులు చెప్పారు. కానీ కేసీఆర్ మాత్రం.. జీవన్ రెడ్డికి జనరల్ సెక్రటరీ బాధ్యతలు అప్పగించడంతో.. నేతలంతా షాక్ అయ్యారు. అయితే జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ పదవి ఇస్తే.. సెంటిమెంట్‌గా కలిసి రాదనీ.. గతంలో ఈ పదవి చేపట్టిన కే. కేశవరావు విషయంలో ఇదే నిజమైందట. అందుకే జీవన్ రెడ్డికి సెక్రటరీ జనరల్ కాకుండా.. జనరల్ సెక్రటరీ పోస్టును కట్టబెట్టారని ప్రచారం సాగుతోంది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరోగ్య పథకంపై బిగ్‌ అప్‌డేట్‌ ఇదే!

వాస్తవానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే.. కాంగ్రెస్ నేత కే. కేశవరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పట్లో సీనియర్ నేతగా ఉన్న కేశవరావుకు ఏ పోస్టు ఇవ్వాలో అర్థం కాక.. గులాబీ బాస్ తర్జనభర్జనలు పడ్డారు. చివరకు కేకే కోసం కొత్తగా బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ అంటూ.. ఓ పోస్టును క్రియేట్ చేసి పదవిని అప్పగించారు. ఆ తర్వాత మాజీ మంత్రి డీ. శ్రీనివాస్ కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పదవి విషయంలో పరేషన్ అయ్యారు. చివరకు డీఎస్ ను రాజ్యసభకు పంపడంతో కేసీఆర్ కాస్తా రిలాక్స్ అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా.. బీఆర్ఎస్ పార్టీలో చేరిన సమయంలో కేసీఆర్ పోస్టింగ్ ఇవ్వడం పెద్ద తలనొప్పిగా మారింది.

తంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన నేతలంతా.. బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువకాలం ఇమడలేక పోయారు. అందుకే డీఎస్ కొన్నేళ్లకే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో.. కేకే కూడా పార్టీ మారారు.. దాంతో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇద్దరు నేతలు.. తిరిగి ఆ పార్టీలోకే వెళ్లిపోయారు. అయితే పార్టీలో సెక్రటరీ జనరల్ పోస్టు కట్టబెట్టినా.. కేకే పార్టీ మారడంతో.. కేసీఆర్ బాగా హర్ట్ అయ్యారట. అందుకే జీవన్ రెడ్డికి పార్టీ ప్రధాన కార్యదర్శి పోస్టింగ్ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. 

Also Read: Singer Mangli: యూట్యూబ్‌ చానళ్లపై మంగ్లీ ఫిర్యాదు! మేనేజర్‌ తీవ్ర ఆరోపణలు

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి పవర్ లోకి రావాలని లెక్కలు వేసుకుంటోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మెజారిటీ సీట్లు దక్కించుకుంటే.. పవర్ ఖాయమని కేసీఆర్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్‌కు బలమైన రెడ్డి సామజికవర్గం నేత లేరు. హుజురాబాద్‌లో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నప్పటికీ ఆయన చాలా జూనియర్. అందుకే మాజీమంత్రి జీవన్ రెడ్డి సేవలను వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. జీవన్ రెడ్డి లాంటి నేతను ముందుపెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ తీరును ఎండగడితే.. మరింత కలిసి వస్తుందని అనుకుంటున్నారట. అందుకే జగిత్యాల సభలో జీవన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు.

కాంగ్రెస్ పార్టీలో 40 ఏళ్లుగా సేవచేసిన జీవన్ రెడ్డికి రేవంత్ రెడ్డి అన్యాయం చేశారని మండిపడ్డారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు తగిన గౌరవం ఇస్తామని ప్రకటించారు. అందుకే ఆయనకు సెక్రటరీ జనరల్ పదవి కాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శిగా తక్షణమే నియమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే సెక్రటరీ జనరల్ పోస్టు.. బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా కలిసి రాలేదని.. అందుకే.. జీవన్ రెడ్డికి ఆ పోస్టు ఇచ్చేందుకు కేసీఆర్ కూడా పెద్దగా ఆసక్తి చూపలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also Read: AP Summer Camps: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. త్వరలో 1,389 సమ్మర్‌ క్యాంపులు

అయితే బీఆర్ఎస్ పార్టీలో చాలామంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ఇటీవల పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కూడా ప్రధాన కార్యదర్శే.. అంతేకాదు.. జిల్లాకో నేత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారిన జీవన్ రెడ్డికి కూడా జనరల్ సెక్రటరీ పోస్టు కేటాయించారు. అయితే సెక్రటరీ జనరల్ పోస్టు తమకు పెద్దగా కలిసి రాలేదని.. అందుకే జీవన్ రెడ్డికి జనరల్ సెక్రటరీ పోస్టు ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు..మొత్తం మీద నాలుగుదశాబ్ధాల అనుబంధాన్ని తెంచుకుని.. కారు పార్టీలో చేరిన జీవన్ రెడ్డికి భవిష్యత్తులో మంచి పదవి ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు. దాంతో 2029 లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే.. మంత్రి పదవి ఖాయమని అనుచరులు తెగ ప్రచారం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Doomsday Fish 2026: మరికొద్ది రోజుల్లో ప్రపంచంలో ప్రళయం..ఒడ్డుకు చేరిన 'దేవుని చేప'..భయాందోళనలో ప్రజలు!

Mexico Beach, Florida:

Doomsday Fish Mexico 2026: ప్రకృతి తరచుగా కొన్ని సంఘటనల ద్వారా రాబోయే ప్రమాదాలను మనల్ని హెచ్చరిస్తుంది. అందుకు తగిన విధంగా మనం మేల్కొనకపోతే దాని భారీ మూల్యం చెల్లించక తప్పదు. గతంలోనూ గాడ్ ఫిష్‌గా పిలిచే ఓ డూమ్స్ డే ఫిష్ సముద్రపు ఒడ్డుకు కొట్టికు వచ్చిన కొన్ని రోజులకే సునామీ వచ్చింది. అదే విధంగా మరోసారి ఆ డూమ్స్‌డే ఫిష్ లేదా ఓర్ ఫిష్ మరోసారి సముద్ర గర్భం నుంచి భూమి మీదకు వచ్చింది. దీంతో మరోసారి ప్రకృతి నుంచి తీవ్ర ప్రమాదం పొంచిఉందని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకృతి వైపరీత్యాలకు సూచికగా భావించే అత్యంత అరుదైన "గాడ్స్ ఫిష్" లేదా 'డూమ్స్‌డే ఫిష్' లేదా ఓర్ ఫిష్, మెక్సికో తీరంలో కనిపించడంతో, ప్రపంచవ్యాప్తంగా భయం నెలకొంది.

అవును.. సాధారణంగా సముద్రంలో వేల అడుగుల లోతులో నివసించే ఈ భారీ చేపలు ఒడ్డుకు వచ్చాయని, ఇది రాబోయే విపత్తుకు సంకేతమని ప్రజలు నమ్ముతున్నారు. వైరల్ అవుతున్న వీడియో మీరు ఖచ్చితంగా చూస్తే, మెక్సికోలోని ఒక అందమైన బీచ్‌లో పర్యాటకులు, స్థానికులు స్నానం చేస్తూ ఉండగా.. అదే సమయంలో సముద్రపు అలల మధ్య వింతగా కదులుతున్న ఒక భారీ చేప తీరం వైపు తేలుతూ వస్తుంది. పాముల కనిపించే ఈ పొడవాటి, వెండి చేపను చూసి అక్కడి ప్రజలు క్షణకాలం పాటు భయభ్రాంతులయ్యారు. కానీ ఆశ్చర్యకరంగా, అది ఒక్క చేప మాత్రమే కాదు, దాని వెనువెంటనే మరో భారీ చేప కూడా తీరానికి వస్తుంది. రెండు 'ప్రళయ' చేపలు ఒకే సమయంలో తీరానికి రావడం ప్రజలలో భయాన్ని కలిగించింది.

ఈ చేపలను 'ప్రళయపు చేపలు' లేదా 'గాడ్ ఫిష్' అని పిలవడానికి వెనుక ఓ బలమైన కారణం ఉంది. జపనీస్ పురాణాల ప్రకారం.. ఈ చేపలు సముద్రంపైకి వస్తే, త్వరలో భూకంపం లేదా సునామీ సంభవిస్తుందని అర్థం. శాస్త్రీయంగా చెప్పాలంటే, లోతైన సముద్రంలో భూకంప కేంద్రాలు ఉంటాయి. భూకంపానికి ముందే పసిగట్టే ఈ చేపలు ముందుగా ఒడ్డుకు చేరుకొని ప్రజలకు సూచికగా కనిపిస్తాయి.

ప్రస్తుతం, ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. నెటిజన్లు "తర్వాత ఏం జరుగుతుంది?" వంటి వ్యాఖ్యలు చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది కేవలం యాదృచ్ఛికం అని సమర్థిస్తున్నారు. మొత్తం మీద, ఈ వీడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారం అవుతుండటంతో, తర్వాత ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు.

Also Read: Career Options After 10th: 10వ తరగతి తర్వాత ఏం చేయాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్ బాగుంటుంది?

Also REad: EPS-95 Pension Hike: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..కనీస పెన్షన్ రూ.7,500కి పెంపు..కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Karimnagar: డబ్బు ఇస్తేనే బిల్లు.. కరీంనగర్ ట్రెజరీ కార్యాలయాల్లో కొనసాగుతున్న భారీ దందా!

Karimnagar, Telangana:

Corruption In Karimnagar Treasury News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ట్రెజరీ కార్యాలయాలు ఇప్పుడు అవినీతికి అడ్డాలుగా మారాయ అనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని సక్రమంగా పంపిణీ చేయాల్సిన బాధ్యత కలిగిన అధికారులే, నిధుల విడుదలలో పర్సెంటేజీల కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా బిల్ పాస్  కావాలంటే లంచం ఇవ్వాల్సిందేననే.. నిబంధనను పరోక్షంగా అమలు చేస్తూ.. నిస్సహాయులను దోచుకుంటున్నారని ఆరోపణలు ఊహించని స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా ఎస్టీవో (STO) కార్యాలయాల్లో ఈ వ్యవహారం దర్జాగా సాగుతోందని బాధితులు సైతం వాపోతున్నారు.. గ్రామపంచాయతీల అభివృద్ధి నిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యేల కోట నిధులు, ఉద్యోగుల మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ (GPF) అడ్వాన్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్.. ఇలా ఏ బిల్లు క్లియర్ అవ్వాలన్న కనీసం రెండు నుంచి గరిష్టంగా 10 శాతం వరకు లంచం సమర్పించుకోవాల్సిందేనని సమాచారం.  అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో 15 శాతం వరకు కూడా లంచాలు తీసుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు..

నిబంధనల ప్రకారం బిల్లులను సకాలంలో ఆమోదించాల్సిన అధికారులు.. లంచం చెల్లించని వారి ఫైళ్లను మాత్రం నెలలు తో పాటు ఏళ్లుగా పెండింగ్లో ఉంచుతున్నారు. ఎంతో అత్యవసరమైన, ప్రాణపాయ స్థితిలో ఉన్న వారి మెడికల్ బిల్లుల విషయంలోనూ మానవత్వం లేకుండా రేట్ ఫిక్స్ చేస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్ పద్ధతుల్లో అమల్లోకి వచ్చిన.. ట్రెజరీలో మాత్రం మాన్యువల్ పద్ధతిలోనే తెర వెనక సెటిల్మెంట్లు జరుగుతున్నాయని ఊహించని స్థాయిలో ప్రచారం జరుగుతూ వస్తోంది.

Also Read: TGSRTC గుడ్‌న్యూస్.. కేవలం రూ.10,500కే దక్షిణ భారత యాత్ర .. పూర్తి వివరాలివే!

మా కష్టార్జితం లేదా అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చును తిరిగి పొందడానికి కూడా మళ్లీ లంచం ఇవ్వాలా అని.. కాంట్రాక్టర్లతోపాటు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు సైతం ఈ దందా వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల డిమాండ్లకు తలొగ్గి, అప్పులు తెచ్చి మరీ లంచాలు చెల్లించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పై అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం ఉండడం లేదని.. ఉన్నత అధికారులు సైతం పట్టించుకోలేకపోవడం వల్లే ఈ అరాచకం కొనసాగుతూ ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నత అధికారులు దృష్టి సారించి ట్రెజరీలో జరుగుతున్న ఈ అవినీతి బాగోతాన్ని అరికట్టాలని ఉద్యోగులతో పాటు కాంట్రాక్టర్లు కోరుకుంటున్నారు.

Also Read: TGSRTC గుడ్‌న్యూస్.. కేవలం రూ.10,500కే దక్షిణ భారత యాత్ర .. పూర్తి వివరాలివే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

EPS-95 Pension Hike: ఉద్యోగులకు గుడ్‌న్యూస్..కనీస పెన్షన్ రూ.7,500కి పెంపు..కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు!

Hyderabad, Telangana:

EPS-95 Pension Hike Update: ప్రైవేట్ ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) పెన్షన్ అందజేస్తుంది. ఉద్యోగ విరమణ తర్వాత పెన్షనర్లకు ఆసరాగా ఉండే ఈ పెన్షన్‌ను రూ.1,000 నుంచి రూ.7,500 వరకు కనీస పెన్షన్ ‌ను పెంచాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కానీ, రిటైర్డ్ ఉద్యోగులకు ఆ పెన్షన్ పెంపుపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందే అనే అంశంపై తెగ చర్చ జరుగుతోంది. 

ఈపీఎఫ్ఓ కింద పదవీవిరమణ తర్వాత ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ.7,500 అందజేయాలని పెన్షనర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈపీఎస్-95 పథకం కింద ప్రస్తుతం రూ.1,000 ఆర్థిక అవసరాలకు సరిపోవడం లేదని.. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెంక్కేందుకు కనీస పెన్షన్‌ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని జాతీయ మీడియాల నివేదికల ప్రకారం.. ఈపీఎస్ కనీస పెన్షన్‌పై కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖలో తీవ్ర చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ, ప్రభుత్వం నుంచి సరైన ప్రకటన రాలేదు. 

ఎన్ఏసీ అనే జాతీయ ఆందోళన కమిటీ చేసిన ప్రధాన డిమాండ్ ప్రకారం.. ఈపీఎస్-95 పథకం కింద పెన్షన్లకు కనీస నెల పెన్షన్ రూ.1,000 నుంచి రూ.7,500కి పెంచాలని అభ్యర్థనలు వస్తున్నాయి. అలాగే డీఏతో పెన్షన్‌ను అనుసంధానం చేయాలి అంటే ధరల పెరుగుదల ప్రకారం పెన్షన్ పెంపు కూడా జరగాలనేది వారి వాదన. కోష్యారీ కమిటీ ఇచ్చిన నివేదిక ఈ చర్చకు ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. ఆ కమిటీ ప్రాథమిక కనీస పెన్షన్ రూ.3,000గా సూచించగా.. ఇప్పుడు దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో సంస్థలు రూ.7,500 కనీస పెన్షన్‌ను డిమాండ్ చేస్తున్నాయి. 

కేంద్ర కార్మిక మంత్రితో పాటు పీఎంఓ అధికారులతో ఈపీఎస్-95 ప్రతినిధులు కూడా పలుమార్లు సమావేశం జరిపారు. పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ప్రత్యేకంగా సమీక్షిస్తుందని భరోసా ఇచ్చింది. ఈపీఎఫ్ఓ మాత్రం పెన్షన్ పెంపు చేస్తే నిధుల కొరత భారీగా ఏర్పడుతుందని అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ రూపంలో ఉద్యోగులకు పెన్షనర్లకు సాయం చేయాల్సి ఉంటుంది. ఇదే విషయంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల తాలూకా అంచనాలు వేస్తోంది. ప్రస్తుతానికి కనీస పెన్షన్ రూ.7,500కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆమోదం తెలపలేదు. కానీ, దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుందని సమాచారం అందుతోంది.

ALso Read: Rohit Sharma Birthday: హ్యాపీ బర్త్‌డే హిట్‌మ్యాన్..రోహిత్ శర్మ సంపద ఎంతో తెలుసా? ఇల్లు ఒక్కటే రూ.40 కోట్లు!

Also REad: Career Options After 10th: 10వ తరగతి తర్వాత ఏం చేయాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్ బాగుంటుంది?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top