icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500030
RSRajesh SharmaFollow29 Jun 2024, 05:28 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

రెండో టీ20 సిరీస్‌ పాయె.. ఇంగ్లండ్‌ చేతిలో పరువు పోగొట్టుకున్న టీమిండియా

England:

Team India: టీ20 ప్రపంచ‌ చాంపియన్‌ భారత జట్టు‌కు మరో భంగపాటు ఎదురైంది. ఐర్లాండ్‌ సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురయిన టీమిండియా ఇంగ్లాండ్‌ చేతిలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. నాలుగో టీ20 మ్యాచ్‌లో కూడా ఓడిపోయిన భారత జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి ఆతిథ్య టీమిండియాను వైట్‌వాష్‌ చేయాలని చూస్తోంది.

శ్రేయస్‌ అయ్యర్‌ నాయ కత్వంలో బరిలో దిగిన టీమిండియా నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. భారత్‌ జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 13.5 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌, ఫిల్‌ సాల్ట్‌ చెలరేగి ఆడడంతో ఇంగ్లండ్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 35 బంతుల్లో 79 పరుగులు చేసిన బ్రూక్‌ నాటౌట్‌గా నిలవగా.. 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. చక్కటి సహకారం అందిస్తూ ఫిల్‌ సాల్ట్‌ 59 పరుగులు చేసి అజేయంగా మ్యాచ్‌ను ముగించాడు. 39 బంతులు మిగిలుండగానే ఆట ముగియడం విశేషం. తక్కువ లక్ష్యాన్ని కాపాడడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఏమాత్రం ప్రత్యర్థిని ఇరుకునపెట్టేలా బౌలింగ్‌ చేయలేకపోయారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ తీసిన ఒక్క వికెట్‌ తప్ప మిగిలిన బౌలర్లు తమలోని శక్తిని బయటకు తీయలేదు. దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే ఐదు టీ20 సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్‌ తన ఖాతాలో వేసుకుంది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు అతి తక్కువ స్కోర్‌ నమోదు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మెరిసినా మిగతా వాళ్లంతా నిరాశపరచడంతో ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించలేకపోయింది. 49 బంతుల్లో 80 పరుగులు చేసి చివరి వరకు కెప్టెన్‌ శ్రేయస్‌ నిలబడ్డాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగినా ఇతర బ్యాటర్లు సహకరించలేకపోయారు. యంగ్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ మరోసారి తక్కువ పరుగులు (15) చేయగా.. ఇషాన్‌ కిషన్‌ (4), అభిషేక్‌ శర్మ (16) ఘోరంగా విఫలమయ్యారు. మూడు వికెట్లు కోల్పోయిన విపత్కర పరిస్థితుల్లో శ్రేయస్‌ అయ్యర్ కెప్టెన్‌‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. శివమ్‌ దూబే (22) కొంత సహకారం అందించగా తర్వాత వచ్చిన బ్యాటర్లు నిలబడలేకపోయారు. తిలక్‌ వర్మ (11), వాషింగ్టన్‌ సుందర్‌ (5) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. బౌలింగ్‌తో ఇంగ్లీష్‌ బౌలర్లు అదరగొట్టి భారత్‌ను తక్కువ స్కోర్‌కు పరిమితం చేశారు. ఆర్చర్‌ 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. జోష్‌ టంగ్‌ కూడా రెండు వికెట్లు పడగొట్టారు. 

ఒక ప్రపంచకప్‌ సాధించిన జట్టు ఇదేనా అని రెండు సిరీస్‌లను చూస్తే అనుమానం వస్తోంది. పసికూన ఐర్లాండ్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురవడమే షాకింగ్‌గా ఉండగా.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనూ ఇంతటి చెత్త ప్రదర్శన భారత జట్టు నుంచి ఎవరూ ఊహించలేదు. ఒక మ్యాచ్‌ రద్దు.. జరిగిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ ఘోర వైఫల్యం ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండో మ్యాచ్‌లో అత్యంత భారీ తేడాతో ఓడిపోగా.. నాలుగో మ్యాచ్‌ కూడా ఘోర పరాభవమే. ఈ స్థాయి చెత్త ప్రదర్శన చేయడంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జట్టు తిరిగివచ్చాక భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చివరి ఐదో టీ20 శనివారం జరుగుతుండగా.. ఈ మ్యాచ్‌లోనైనా భారత జట్టు గొప్ప ప్రదర్శన చేసి పరువు నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.

0
0
Report
Advertisement

2036లో హైదరాబాద్‌కు ఒలింపిక్స్‌ క్రీడలు తీసుకురావడమే నా కల: రేవంత్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Revanth Reddy: 2036లో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించాలని భారతదేశం పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ క్రీడల నిర్వహణకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలనే బలమైన ఆకాంక్షను తెలంగాణ ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణకు అనుగుణంగా తెలంగాణ, హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా సర్వసన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 'క్రీడారంగంలో స్పష్టమైన విధానం లేని కారణంగా క్రీడల్లో దేశం వెనుకబడిపోయింది. తెలంగాణలో స్పష్టమైన క్రీడా పాలసీని తెచ్చాం. దేశంలో క్రీడా శిక్షణా కేంద్రాలు, యూనివర్సిటీలకు పాలసీ ఉండాలి. స్వాతంత్య్రోద్యమ కాలంలో యంగ్ ఇండియా పేరుతో మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా దినపత్రిక స్ఫూర్తిగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం' అని వివరించారు.

హైదరాబాద్‌ వేదికగా గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు.

'వచ్చే నవంబర్‌లో ఖేలో ఇండియా పోటీలను నిర్వహించడమే కాకుండా 2036 ఒలింపిక్స్ నిర్వహించాలని భారతదేశం భావిస్తున్న నేపథ్యంలో దీనికి తెలంగాణ వేదిక కావాలి' అని తెలంగాణ సీఎం ఆకాంక్షించారు. 82 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటీని, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని ఇక్కడ నిర్మించబోతున్నామని.. 2028 డిసెంబర్‌లో ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకోబోతున్నట్లు వెల్లడించారు.

'క్రీడారంగంలో స్పష్టమైన విధానం లేని కారణంగా క్రీడల్లో దేశం వెనుకబడిపోయింది. తెలంగాణలో స్పష్టమైన క్రీడా పాలసీని తెచ్చాం. దేశంలో క్రీడా శిక్షణా కేంద్రాలు, యూనివర్సిటీలకు పాలసీ ఉండాలి. స్వాతంత్య్రోద్యమ కాలంలో యంగ్ ఇండియా పేరుతో మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా దినపత్రిక స్ఫూర్తిగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం అని వివరించారు.

'ఏషియన్ క్రీడలు, ప్రపంచ మిలిటరీ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు వేదికగా ఉన్న హైదరాబాద్ ఆ తర్వాత గడిచిన 20 ఏళ్లపాటు చెప్పుకోదగిన క్రీడలను నిర్వహించలేదు. 23 ఏళ్ల కిందట నిర్మించిన స్టేడియాలు ఆ తర్వాత పెళ్లిళ్లకు, రాజకీయ కార్యక్రమాలకు వేదికగా ఉపయోగించారు. వాటన్నింటినీ పునరుద్ధరించాలని భావిస్తున్నాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. నిజమైన క్రీడాకారులను సంపూర్ణమైన ప్రోత్సాహకాలను అందించడానికి స్పోర్ట్స్ పాలసీతో పాటు పీపీపీ విధానంలో క్రీడా యూనివర్సిటీని నెలకొల్పామని వెల్లడించారు. దీనిలో ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. సంజయ్ గోయంకా, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, కావ్య మారన్, ఉపాసన రామ్ చరణ్, రవికాంత్ రెడ్డి లాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న వారితో యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ వర్సిటీ నిర్వహణ విషయంలో వారికే పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని తెలంగాణ సీఎం తెలిపారు. 

'చదువులోనే కాదు, క్రీడల్లో రాణించినా భవిష్యత్తు బాగుంటుందని, క్రీడలపై దృష్టి సారించండి. క్రీడల్లో రాణించి దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది' అని తెలంగాణ సీఎం ప్రకటించారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో పీటీ ఉష లాంటి వారు అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 

ఏ రంగంలోనైనా ఉత్తమంగా రాణించాలంటే ఏకాగ్రత ఉండాలని.. అప్పుడే రాణించగలుతామని తెలంగాణ సీఎం సూచించారు. వందకు వంద శాతం సాధన చేయాలని. ఒకసారి ఓటమి చెందినంత మాత్రాన కుంగిపోవలసిన అవసరం లేదని చెప్పారు. ఒక ఓటమి మనల్ని నిరాశపరచకూడదని.. ఓటమిని సవాలుగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (8వ ఎడిషన్) క్రీడలు, జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ టోర్నమెంట్స్‌, హాకీ ఇండియా లీగ్, ప్రపంచ పికిల్‌బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన తెలంగాణకు చెందిన ఆరుగురు క్రీడాకారులకు రూ.7.15 కోట్ల మేరకు నగదు ప్రోత్సాహకాలను అందించారు. 

నగదు ప్రోత్సాహకాలు ఇలా..
దీప్తి దివాంజీ (ప్యారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్): రూ.50 లక్షలు
ధనుష్ శ్రీకాంత్‌ (షూటింగ్ - డెఫ్లింపిక్స్): రూ.2.10 కోట్లు
ఈషా సింగ్‌ (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్ విజేత - వరల్డ్ రికార్డు): రూ.3.3 కోట్లు
నిఖత్ జరీన్‌ (బాక్సింగ్): రూ.60 లక్షలు
తనిష్క్ మురళీధర్ నాయుడు (షూటింగ్): రూ.53.65 లక్షలు
రావూరి సురభి భరద్వాజ్‌ (షూటింగ్): రూ.10 లక్షలు

0
0
Report

జీ మీడియాకు అడ్వర్టైజర్ల బ్రహ్మరథం.. ఫిఫా ప్రపంచకప్‌ 2026తో అమాంతం పెరిగిన జీ నెట్‌వర్క్‌ యాడ్‌లు

Mumbai, Maharashtra:

Z Media Advertisements: ఫిఫా వరల్డ్ కప్ 2026 హక్కులు దక్కించుకున్న జీ మీడియాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడమే కాకుండా జీ మీడియా వాణిజ్య ప్రకటనలతోనూ దూసుకెళ్తోంది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను భారతదేశ ప్రజలకు అందిస్తున్న జీ మీడియాకు వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అత్యధిక వీక్షణలు పొందుతుండడంతో జీ మీడియాలో వాణిజ్య ప్రకటనలు వేసేందుకు అంతర్జాతీయ బ్రాండ్లు క్యూలు కడుతున్నాయి. టీవీ స్పోర్ట్స్‌ పోర్ట్‌ఫోలియోలో 95 శాతానికి పైగా ప్రీమియం అడ్వర్టైజింగ్‌ ఇన్వెంటరీ ఇప్పటికే అమ్ముడైపోవడం విశేషం.

0
0
Report
Advertisement

Kiara Advani Remuneration: 'తబాహీ' సాంగ్‌లో కియారా అద్వానీ అందాలు అరబోత..ఆ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందో తెలుసా?

Hyderabad, Telangana:

Kiara Advani Remuneration For Toxic Movie: 'రాకింగ్ స్టార్' యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్'. 'కేవీఎన్ ప్రొడక్షన్స్' సంస్థ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఈ సినిమాలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఒక సాంగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ట్రెండింగ్‌లో 'తబాహి'..కియారా బోల్డ్ లుక్!
బుధవారం (జులై 9) ఈ సినిమా నుంచి 'తబాహి' అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గతంలో ఎన్నడూ లేనంత రొమాంటిక్, బోల్డ్ లుక్‌లో కనిపించి అందాలు ఆరబోసింది. సినిమాలో యాక్షన్, హింసతో పాటు రొమాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉండబోతుందని ఈ పాటతో క్లారిటీ వచ్చేసింది. యూట్యూబ్‌లో విడుదలైన నిమిషాల వ్యవధిలోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

కియారా కెరీర్‌లో ఇదే అత్యధికం..
'తబాహి' సాంగ్ నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా కోసం కియారా అద్వానీ తీసుకున్న పారితోషికంపై సరికొత్త చర్చ మొదలైంది. ఈ చిత్రంలో తన పాత్ర డిమాండ్ మేరకు గ్లామరస్‌గా నటించినందుకు గానూ ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా లెవెల్‌లో కియారాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, నిర్మాతలు ఆమె అడిగినంత మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమా కోసం కియారా ఏకంగా రూ.15 కోట్లు అందుకుందట. 'గేమ్ ఛేంజర్' సినిమా కోసం కియారా సుమారు రూ.5 నుంచి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంది. దానితో పోలిస్తే 'టాక్సిక్' చిత్రానికి ఆమె రెమ్యునరేషన్ ఏకంగా డబుల్ అయింది. కియారా సినీ కెరీర్‌లోనే ఇదే అత్యధిక పారితోషికం కావడం విశేషం.

బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న కియారా అద్వానీ, ఈ భారీ పారితోషికంతో భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే స్టార్ హీరోయిన్ల లీగ్‌లోకి అధికారికంగా చేరిపోయింది.

Also Read: హీరోయిన్ జాన్వీ కపూర్ కాబోయే భర్త ఇతనే! ఎట్టకేలకు ప్రియుడి పేరును బయటపెట్టిన బ్యూటీ!

Also Read: "ఆ హీరో ముద్దు పెట్టుకుంటూ అక్కడ చేయి పెట్టాడు"..'పోటుగాడు' హీరోయిన్ షాకింగ్ కామెంట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Telangana School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు..పండగే పండగ!

Hyderabad, Telangana:

Telangana Bandh Holidays: తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు జూలై నెలలో ఊహించిన విధంగా సెలవులు రానున్నాయి. సాధారణంగా జూలైలో ఎలాంటి పండుగలు, ప్రభుత్వ సెలవులు ఉండవు. కేవలం ఆదివారాలు, రెండో శనివారం మాత్రమే సెలవులు ఉన్నాయి. రేపు అనగా జూలై 10న విద్యార్థి సంఘాల బంద్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడనున్నాయి. 

అయితే తాజాగా జూలై నెలలో రెండో శనివారం సెలవును కూడా ఇటీవలే రద్దు చేయగా.. జూలై నెలలో అత్యధికంగా 27 రోజుల పాటు విద్యాసంస్థల పనిదినాలను ప్రభుత్వం ప్రకటించింది. అయినా తాజాగా బంద్ మరి ఇతర సెలవులు నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడనున్నాయి. 

గత వారం బీసీ సంఘాల డిమాండ్ల పరిష్కారానికి బంద్ నిర్వహించిన తర్వాత.. ఇప్పుడు జూలై 10న తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంధువులను పిలుపునివ్వడమే అందుకు కారణంగా తెలుస్తోంది. సాధారణంగా జూలై నెల వచ్చిందంటే విద్యార్థులకు ఎలాంటి పండగ హాలిడేలు దొరకవు. కానీ, తెలంగాణలో మాత్రం ఈసారి ఊహించిన విధంగా అదనపు సెలవులు రానున్నాయి. వేరువేరు డిమాండ్లతో బీసీ సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్‌లకు పిలుపునివ్వడమే అందుకు కారణంగా తెలుస్తుంది. 

జులై 10న వామపక్ష విద్యార్థి సంఘాల బంద్..
బీసీ సంఘాల బంధు ముగిసిన వారం రోజులకే మరో బంద్ తెరపైకి వచ్చింది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్న పలు సంస్థలు పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు, జులై 10న బంద్‌ను పిలుపునిచ్చాయి. హైదరాబాదులో సమావేశమైన విద్యార్థుల సంఘాల నాయకులు ఈ మేరకు కార్యచరణ రూపొందించి పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. 

జులై 10 శుక్రవారం నాడు విద్యాసంస్థలు స్వచ్చందంగా ఇబ్బందులు పాటించాలని, అవాంఛనీయ పరిస్థితులు రాకుండా యాజమాన్యాలు, తల్లిదండ్రులు సహకరించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు వీకెండ్ కు ముందు మరో అదనపు సెలవు దొరకనుంది. అయితే జూలై 11న రెండో శనివారం కావడం వల్ల కొన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉండనుంది. కానీ, కొన్ని విద్యాసంస్థలు మాత్రం జూన్‌లో ఇచ్చిన సెలవుల నేపథ్యంలో దీన్ని రద్దు చేసినట్లు గతంలో ప్రకటించారు. జూలై 12న ఆదివారం.. ఈ విధంగా రెండో శనివారం లభించే వాళ్లకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చినట్లు ఉంది. 

బంద్‌లతో పార్టీ నెలలో వర్షాల కారణంగా అదనపు సెలవులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఊపొందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫానుగా మరి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. గత ఏడాది కూడా భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు వరుసగా అత్యవసర సెలవులు ప్రకటించింది. ఏడాది కూడా అదే పరిస్థితి రిపీట్ అయితే, జులై నెలలో విద్యార్థులకు మరిన్ని సడన్ హాలిడేస్ దొరికే అవకాశం ఉంది.

Also REad: పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్‌ కోసం 'ఓజీ' సినిమా నుంచి గిఫ్ట్! తమన్ సంచలన నిర్ణయం!

Also REad: రైల్వే ప్రయాణికలకు గుడ్‌న్యూస్..ఇకపై కేవలం రూ.200లకే స్లీపింగ్ పాడ్స్‌లో విశ్రాంతి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Insomnia Symptoms: రాత్రివేళ నిద్ర రావడం లేదా? పగటిపూట విపరీతంగా నిద్ర వస్తుందా? అయితే ఇది ఆరోగ్య సమస్యే!

Hyderabad, Telangana:

Insomnia Disorder Symptoms: నిద్రలేమి అనేది ఇటీవలి కాలంలో లక్షలాది మందిని పీడిస్తున్న ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఉద్యోగుల్లో పని ఒత్తిడి, రాత్రివేళ మొబైల్స్, ల్యాప్‌టాప్ వినియోగం వంటివి అధికంగా వాడడం వల్ల మానసిక ఒత్తిడి కారణంగా చాలా మంది నిద్ర సరిపోకపోవడం లేదా నిద్ర లేకపోవడం వంటి వాటి వల్ల బాధపడుతుంటారు. దీని వల్ల పగిటిపూట నిద్రమత్తు, అలసట, ఏకాగ్రత లోపించడం వంటివి దాపురించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..సాధారణ వ్యక్తి ప్రతిరోజూ 7 నుండి 9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. నిద్రలేమి అనేది మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, భావోద్వేగ సమతుల్యతపై ప్రభావం చూపుతుంది. పగటిపూట నిద్రమత్తుగా లేదా అలసటగా అనిపించడం నిరంతర నిద్రలేమిలోని ఒక సాధారణ లక్షణంగా పరిగణిస్తారు.  

పగటిపూట తరచుగా నిద్రమత్తుగా ఉండటం అనేది కేవలం నిద్రలేమికి మాత్రమే లక్షణం కాదని వైద్యుల చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో, ఇది స్లీప్ అప్నియా, నార్కోలెప్సీ లేదా ఇతర నిద్ర సంబంధిత రుగ్మతలకు కూడా సంకేతం కావచ్చు. అందువల్ల, ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే, వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమని డాక్టర్లు సూచిస్తున్నారు. నిద్రపోయే ముందు మొబైల్, టాబ్లెట్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించడం వల్ల వెలువడే నీలి కాంతి, మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అణచివేస్తుంది. దీనివల్ల నిద్ర ఆలస్యం అయి, రాత్రిపూట సరైన నిద్ర పట్టదు. ఫలితంగా మరుసటి రోజు నిద్రమత్తు, తలనొప్పి, చిరాకు, పని చేసేటప్పుడు ఏకాగ్రత లోపం వంటివి సంభవించవచ్చు.  

నిద్రలేమి దీర్ఘకాలంలో గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, ఆందోళన, కుంగుబాటు వంటి వాటి ప్రమాదాన్ని పెంచుతుందని అనేక అధ్యయనాలు సూచించాయి. అందువల్ల, నిద్రను నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.  

ఆరోగ్యకరమైన నిద్ర కోసం కొన్ని సాధారణ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి నిద్రలేవడం, రాత్రి భోజనం తర్వాత ఎక్కువగా టీ లేదా కాఫీ తాగకపోవడం, నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్ వాడకాన్ని తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, నిశ్శబ్ద వాతావరణంలో నిద్రపోయే అలవాటును పెంపొందించుకోవడం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి. 

పగటిపూట నిద్రమత్తు అనేది వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలను ఆపరేట్ చేసేటప్పుడు, లేదా అధిక ఏకాగ్రత అవసరమయ్యే పనులు చేసేటప్పుడు ప్రమాదకరంగా ఉంటుంది. అందువల్ల, ఈ సమస్యను సాధారణమైనదిగా భావించి నిర్లక్ష్యం చేయకుండా, దాని మూల కారణాన్ని గుర్తించి, తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం అని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

మానవ శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. రాత్రిపూట నాణ్యమైన నిద్ర లభించినప్పుడే శరీరం, మెదడు మరుసటి రోజు పూర్తిగా విశ్రాంతి పొంది, ఉత్తమంగా పనిచేయగలవు. అందువల్ల, మీరు రాత్రిపూట నిరంతరం నిద్రపోవడంలో ఇబ్బంది పడుతుంటే, సొంతంగా మందులు వాడటానికి బదులుగా నిద్ర నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించడం సురక్షితమైన మార్గం. 

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం ప్రజలకు అవగాహన కోసం మాత్రమే పొందుపరిచింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

ALso Read: Yoga Day 2026: రోజూ యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

Also Read: Fathers Day 2026: మనకు అన్నీ నేర్పించిన నాన్న కోసం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Xiaomi 18 Pro: ఐఫోన్, సాంసంగ్‌లకు చుక్కలు చూపించేలా షామీ కొత్త ఫ్లాగ్‌షిప్.. ఫీచర్లు లీక్!

Hyderabad, Telangana:

Xiaomi 18 Pro Leak: టెక్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన గ్లోబల్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో  ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షామీ 18 ప్రో (Xiaomi 18 Pro) స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేయబోతోంది. అలాగే దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ప్రముఖ టెక్ పోర్టల్ గిజ్మోచైనా (Gizmochina) అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ యాపిల్, సాంసంగ్‌ వంటి దిగ్గజాలకు ఫోన్‌లకు పోటీగా అద్భుతమైన ఫీచర్లతో పాటు అత్యాధునిక సాంకేతికతతో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రీమియం కెమెరా సెటప్..
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని కెమెరాగా భావించవచ్చు.. లీక్ అయిన సమాచారం ప్రకారం.. షామీ 18 ప్రో వెనుక భాగంలో డ్యూయల్ 200 మెగాపిక్సెల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో ప్రత్యేకమైన సామర్థ్యం కలిగిన కొత్త LOFIC ప్రైమరీ సెన్సార్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 3x ఆప్టికల్ జూమ్‌తో పాటు అద్భుతమైన మాక్రో సపోర్ట్‌తో కూడిన 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. వైడ్ షాట్ల కోసం మరో 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఇది ఒక గొప్ప వరం కాబోతున్నట్లు తెలుస్తోంది.

పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్..
పనితీరు (Performance) పరంగా చూస్తే.. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 (Snapdragon 8 Elite Gen 6) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. ఇది అత్యాధునిక 2nm ప్రాసెసింగ్ టెక్నాలజీపై పనిచేస్తుందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. దీనివల్ల ఫోన్ వేగం పెరగడమే కాకుండా.. బ్యాటరీ వినియోగం కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా ఇందులో AI హార్డ్‌వేర్ బటన్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.

అదిరిపోయే డిజైన్..
షామీ 18 ప్రో మోడల్ దాదాపు 6.9-ఇంచుల 2K ఫ్లాట్ LTPO OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అల్ట్రా-నారో బెజెల్స్‌తో పాటు పెద్ద రౌండెడ్ కార్నర్స్ ఉంటాయి. ఈ డిస్‌ప్లేలో ప్రత్యేకంగా ప్రైవసీ ప్రొటెక్షన్ టెక్నాలజీని వాడుతున్నట్లు సమాచారం.. దీనివల్ల పక్కన ఉన్నవారు మీ ఫోన్ స్క్రీన్‌ను సైడ్ యాంగిల్ నుంచి చూడలేరు. స్క్రీన్ ప్రొటక్షన్‌ కోసం అత్యంత అద్భుతమైన డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.

7,000mAh భారీ బ్యాటరీ..
సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు.. కానీ Xiaomi ఈసారి ఆ అంచనాలను తలకిందులు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో ఏకంగా 7,000mAh నుంచి 8,500mAh సామర్థ్యం గల సరికొత్త సిలికాన్-కార్బన్ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ బరువు పెరగకుండా.. స్లిమ్‌గా ఉండేలా ఈ టెక్నాలజీ సహాయపడుతుంది. దీనికి తోడు 100W లేదా 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు సూపర్ ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!a

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Talliki Vandanam 2026: ఇదే లాస్ట్ ఛాన్స్..ఈ పనులు చేయకపోతే 'తల్లికి వందనం' డబ్బులు కట్..జాగ్రత్త మరీ!

Vijayawada, Andhra Pradesh:

Talliki Vandanam List 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలపై కీలక అప్‌డేట్ వచ్చేసింది. స్కూళ్లు, ఇంటర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ కావాల్సిన ఈ ఏడాది నిధుల విషయంలో ఏపీ ప్రభుత్వం కొన్ని కీలక  సూచనలు చేసింది. జూలై 15 నుంచి 'తల్లికి వందనం' నిధులను అకౌంట్లోకి జమ చేయనున్న నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారులు తప్పనిసరిగా చేయాల్సిన కొన్ని నియమాలను వెల్లడించింది. వాటిలో అలసత్వం వహిస్తే నిధులు అకౌంట్లోకి జమ కావని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

అకౌంట్లోకి డబ్బు పడాలంటే ఇవి తప్పనిసరి!
'తల్లికి వందనం' పథకం కింద అకౌంట్లోకి డబ్బు జమ కావాలంటే ముందుగా మీ బ్యాంకు ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ కార్డు లింక్ చేయాలి. అలాగే బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఎన్పీసీఐ మ్యాపింగ్‌ను కూడా పూర్తి చేయించుకోవాలి. మీ ఖాతా ఉన్న బ్యాంకు వద్దకు వెళితే ఈ రెండు పనులను పూర్తి చేస్తారు. అది కూడా ఈ రెండు పనులు జూలై 15 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోపు ఈ రెండు పనులు పూర్తి చేయడంలో విఫలమైతే డబ్బు మీ ఖాతాల్లోకి జమ కాదు. 

పైన చెప్పిన రెండు పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల పథకం డబ్బు మీ అకౌంట్లోకి జమ కావడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని ఏపీ ప్రభుత్వం సూచిస్తోంది. అలాగే ఏదైనా ఓ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండడంతో పాటు ప్రతి ఏడాది ఒక్కసారైనా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందజేసే ఏ పథకానికైనా కేవైసీ అనేది ఎంతో ముఖ్యం. కేవైసీ పూర్తి చేసిన ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయని ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

జాబితా విడుదల..
గత నెలలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏడాది తల్లికి వందనం పథకం గురించి ప్రభుత్వం తర్జనభర్జన పడుతుంది. వీలైనంత త్వరగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బును జమ చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇటీవలే ఈ పథకానికి అర్హులైన వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. జూలై 15న ఏర్పాటు చేయనున్న పేరెంట్-టీచర్ మీటింగ్ తర్వాత ఈ డబ్బును ఖాతాల్లో జమ చేయనున్నారు. 

Also Read: గర్ల్స్ హాస్టల్ గదిలో విషాదం..పడుకున్న విద్యార్థుల్ని కాటేసిన పాము..ఒకరు మృతి!

Also Read: రైల్వే ప్రయాణికలకు గుడ్‌న్యూస్..ఇకపై కేవలం రూ.200లకే స్లీపింగ్ పాడ్స్‌లో విశ్రాంతి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

iQOO Z11 Lite 5G జూలై 24న లాంచ్.. 6500mAh భారీ బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లు!

Hyderabad, Telangana:

Iqoo Z11 Lite 5g Price: భారత మార్కెట్‌లోకి ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ ఐకూ (iQOO) మరో సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. గతేడాది జూన్‌లో విడుదలైన iQOO Z10 Lite మంచి సక్సెస్‌ కావడం వల్ల.. దానికి సీక్వెల్‌గా iQOO Z11 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేయబోతున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. జూలై 24న ఈ ఫోన్ భారత మార్కెట్‌లో అడుగుపెట్టబోతున్నట్లు ఐకూ ఇండియా తన X ఖాతా ద్వారా తెలిపింది.. అయితే, అధికారిక లాంచ్‌కు ముందే ప్రముఖ టిప్‌స్టర్ ద్వారా ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అయితే, లీక్‌ అయిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పవర్‌ఫుల్ ప్రాసెసర్..
లీక్ అయిన సమాచారం ప్రకారం.. iQOO Z11 Lite 5G స్మార్ట్‌ఫోన్  మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (MediaTek Dimensity 6300) చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జి57 (Mali-G57 MC2) GPUను అందించారు. ఇది బడ్జెట్ ధరలో అద్భుతమైన పనితీరును అందిచే అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ పరంగా.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజినల్ ఓఎస్ 6 (OriginOS 6)తో రన్ కావడం విశేషం. అలాగే ఇది వివిధ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది.

6,500mAh భారీ బ్యాటరీ.. 
ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీగా భావించవచ్చు. గత మోడల్ Z10 Liteలో 6,000mAh బ్యాటరీ ఉండగా.. ఈ కొత్త Z11 Liteలో దానిని ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీకి అప్‌గ్రేడ్ చేశారు. అంతేకాకుండా ఛార్జింగ్ స్పీడ్‌ను కూడా 15W నుంచి 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు పెంచారు. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవ్వడమే కాకుండా.. బ్యాటరీ బ్యాకప్ కూడా సుదీర్ఘ కాలం పాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

డిస్‌ప్లే, కెమెరా సెటప్..
వినియోగదారులకు మెరుగైన విజువల్ అనుభూతిని కలిగించేందుకు ఇందులో 6.74 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో పాటు అద్భుతమైన స్ట్రాంగ్‌ డిస్ల్పేతో అందుబాటులోకి రాబోతోంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

నోటిఫికేషన్ రింగ్ లైట్..
ఈ ఫోన్ డిజైన్ పరంగా కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు తెలుపుతున్నాయి. అమెజాన్ ఇండియా లిస్టింగ్ ప్రకారం.. ఇది సోలార్ ఫ్లేమ్ (Solar Flame) కలర్ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో నిలువుగా ఉండే కెమెరా మాడ్యూల్ కింద ఒక Circular LED రింగ్ లైట్‌ను కూడా అందించిన్నట్లు తెలుస్తోంది. ఇది నోటిఫికేషన్లు లేదా కాల్స్ వచ్చినప్పుడు మిని లైట్-అప్ అలర్ట్ సిస్టమ్‌లా మెరుస్తూ ప్రీమియం లుక్‌ను అందిస్తుందని సమాచారం.. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.22,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

షుగర్ పేషంట్లకు గుడ్ న్యూస్.. ఇక నుంచి వారానికి ఒక్కసారి ఇన్సులిన్ తీసుకుంటే చాలు..!!

BBhoomi15h ago
Secunderabad, Telangana:

Diabetes Insulin :  భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం 101 మిలియన్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. చాలా మంది మధుమేహ రోగులు ప్రస్తుతం ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటున్నారు. అధిక ధర కారణంగా కొందరు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడానికి సంకోచిస్తున్నారు. 

డానిష్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నార్డిస్క్ అటువంటి వారికి తీపి కబురందించింది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నార్డిస్క్ మధుమేహ రోగులకు ఒక శుభవార్తను అందించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి బేసల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ అయిన అవిక్లిని ఇది భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనిని వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. టైప్ 1,  టైప్ 2 డయాబెటిస్ ఉన్న వృద్ధులు కూడా ఈ మందును ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం..  ఇన్సులిన్ వాడే చాలా మంది మధుమేహ రోగులు ప్రతిరోజూ ఇంజెక్షన్లు తీసుకోవలసి వస్తుంది. అయితే.. అవిక్లితో వారానికి ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల చికిత్సను కొనసాగించే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత బేసల్ ఇన్సులిన్ కంటే ఇది మెరుగ్గా పనిచేస్తుందని, దేశవ్యాప్తంగా 4,500 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా ఈ ఇంజెక్షన్‌ను అందుబాటులోకి తెస్తున్నామని నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా తెలిపారు. భారతదేశంలో దీనిని ప్రారంభించడంతో.. ఈ ఔషధం ఇప్పుడు మొత్తం ఏడు దేశాలలో అందుబాటులో ఉందని విక్రాంత్ చెప్పారు.  

Also Read: జనం అడిగారా?..ఆ ఉచిత పథకాలు ఎవరి కోసం? తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..!!

Also Read: ఉచిత వైద్యం ఉద్యోగుల హక్కు.. జీతాల్లో EHS కోతపై తెలంగాణ హైకోర్టు సీరియస్..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top