రాజేంద్ర నగర్లో పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్
Hyderabad, Telangana:రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ను అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆర్జిఐ విమానాశ్రయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్ల నుంచి మైనర్ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్న ప్రదీప్ పై బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుద్వెల్లోని ఓ చర్చిలో ఇద్దరూ కలుసుకుని బంధం ఏర్పరుచుకున్నారు. ప్రదీప్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Guru Pushya Yoga: గురు పుష్యమి యోగం.. ఈ 4 రాశుల వారికి వారం రోజుల పాటు కాసుల వర్షం!
Hyderabad, Telangana:Guru Pushya Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మే నెలలోని 21వ తేదికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ రోజు గ్రహాల సంయోగం జరిగింది. ముఖ్యంగా ఈ గురు సంచారంతో శుక్రుడి కలయిక జరిగి ఎంతో శక్తివంతమైన గజలక్ష్మి యోగం ఏర్పడింది. అలాగే చంద్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంచారం చేయడం వల్ల గౌరీ యోగం ఏర్పడింది. ఈ సమయంలో అనేక రాజయోగాలు ఏర్పడ్డాయి. దీని కారణంగా వీటి ప్రభావం దాదాపు వారం రోజుల పాటు కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఏర్పడే గురు పుష్యమి యోగంతో ఆయా రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా బోలెడు లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేషరాశి
మేష రాశివారికి మే 21వ తేది చాలా శుభప్రదమైనదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో సంభాషణ నైపుణ్యం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇతరుల నుంచి కూడా భారీ మొత్తంలో డబ్బు కూడా సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి చంద్రుడు శుభ స్థానంలో ఉండడం వల్ల కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా వీరికి అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే జీవితంలో కూడా విలాసవంతం గడుపుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయాల్లో ఉన్న వ్యక్తులకు జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. వ్యాపారాలు కూడా సక్రమంగా సాగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే సంబంధాల్లో భావోద్వేగ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి.
వృషభ రాశి
వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఈ గురు పుష్యమి యోగంతో జీవితంలో అపారమైన తెలివితేటలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో తోబుట్టువుల నుంచి కూడా సపోర్ట్ పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. దీంతో పాటు వైవాహిక బంధం మధురంగా మారుతుంది. వీరికి జీవిత భాగస్వామితో అద్భుతమైన ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. దీని వల్ల వైవాహిక బంధం చాలా మధురంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే ఛాన్స్లు ఉన్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి రాశివారికి కూడా ఈ యోగంతో దిమ్మతిరిగే లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి చంద్రుడి సంచారంతో వివిధ రకాల కళలు, కళాత్మక విషయాలపై ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఇతరులతో సంబంధాలు స్నేహపూర్వకంగా మారుతాయి. దీంతో పాటు వీరు తప్పకుండా విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కాబట్టి దీని కారణంగా డబ్బులు కూడా విపరీతంగా ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో సహోద్యోగుల నుంచి మీకు మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. అలాగే అదృష్టం ఈ సమయంలో 99 శాతం వరకు సహకరిస్తుంది.
మకర రాశి
మే 21వ తేదీ నుంచి మకర రాశివారికి కూడా ఈ సమయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారాల విషయాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఏడవ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల వీరికి తగిన తెలివితేటలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే అద్భుతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దీంతో పాటు మీ సామాజిక పలుకుబడి, గౌరవం పెరుగుతాయి. ఈ సమయంలో తప్పకుండా ప్రభుత్వ పనులలో విజయం సాధిస్తారు. వీరికి ఈ సమయంలో ఎలాంటి ప్రత్యర్థులు మీకు హాని చేసే అవకాశాలు ఉండవని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రేమ జీవితంలో సంబంధాలు కూడా మధురంగా మారుతాయి. వీరికి అదృష్టం కూడా 87 శాతం వరకు సహకరిస్తుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
SRH Vs RCB Match: హైదరాబాద్ Vs బెంగళూరు.. ఉప్పల్ గడ్డపై నేడు చివరి లీగ్ మ్యాచ్! గెలుపు ఎవరికి అవసరం?
Hyderabad, Telangana:SRH Vs RCB Match Preview: ఐపీఎల్ లీగ్ దశ ముగింపుకు చేరుకున్న వేళ.. నేడు సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్లో తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాల్లో లక్ష్యంగా ఇరు జట్లు శుక్రవారం హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 10 జట్లలోనే +1.065 అత్యుత్తమ నెట్ రన్ రేట్ (NRR) ఆర్సీబీ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ నంబర్ 1 స్థానాన్ని ఖరారు చేసుకోవడంతో పాటు, ఫైనల్కు చేరడానికి రెండు అవకాశాలు (క్వాలిఫయర్-1 ఆడటం ద్వారా) లభిస్తాయి.
అలాగే మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా 18 పాయింట్లతో ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ పరంగా గుజరాత్ (+0.400) కంటే హైదరాబాద్ (+0.350) వెనుకబడి ఉంది. SRH టాప్-2లోకి వెళ్లాలంటే.. ఆర్సీబీని భారీ తేడాతో ఓడించడమే కాకుండా మెరుగైన నెట్ రన్రేట్తో గెలిస్తే టాప్-2 స్థానానికి చేరే అవకాశం ఉంది.
కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో వరుసగా రెండో సీజన్లోనూ టైటిల్ ఫేవరెట్గా నిలిచింది. సీనియర్ స్టార్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా దుమ్మురేపుతున్నాడు (13 మ్యాచ్ల్లో 542 పరుగులు). యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.
అదే విధంగా అనుభవజ్ఞులైన ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్ జోడి పవర్ప్లేలో ప్రత్యర్థులను వణికిస్తోంది. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో భువనేశ్వర్ ఒకడిగా ఉన్నాడు. కృనాల్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శనతో, లెగ్ స్పిన్నర్ సుయాష్ శర్మ, రొమారియో షెపర్డ్ తమ వైవిధ్యమైన బౌలింగ్తో మిడిల్ ఓవర్లలో జట్టుకు బలంగా నిలుస్తున్నారు.
అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గత 5 మ్యాచ్ల్లో వరుస విజయాలతో ఊపు మీదున్నట్లు కనిపించినా, చివరి 4 మ్యాచ్ల్లో రెండింటిలో ఓడిపోవడం హైదరాబాద్ను కాస్త ఆత్మరక్షణలో పడేసింది. ప్రమాదకర బ్యాటింగ్ లైనప్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నప్పటికీ.. ఇటీవలి కాలంలో బ్యాటింగ్లో నిలకడలేమి జట్టును దెబ్బతీసింది. నాకౌట్కు ముందు ఈ లోపాలను సరిదిద్దుకోవాలని జట్టు భావిస్తోంది.
కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం నుంచి కోలుకుని తిరిగి రావడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. యువ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ ఇషాన్ మలింగ ఈ సీజన్లో పెద్ద అసెట్గా మారాడు. ఒత్తిడిలోనూ నిలకడగా వికెట్లు తీస్తూ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. లీగ్ దశలో చివరి మ్యాచ్ కావడం, పైగా టాప్-2 స్థానాల కోసం జరుగుతున్న పోరు కావడంతో ఈ మ్యాచ్ అభిమానులకు అసలైన ఐపీఎల్ మజాను అందించడం ఖాయంగా కనిపిస్తోంది!
హెడ్-టూ-హెడ్..
ఐపీఎల్ చరిత్రలో సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 27 సార్లు తలపడ్డాయి. అయితే ఇందులో 14 సార్లు గెలుపొంది సన్రైజర్స్ హైదరాబాద్ పైచేయి సాధించగా.. ఆర్సీబీ 12 విజయాలను నమోదు చేసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభ మ్యాచ్లో ఈ రెండు టీమ్లు తలపడడం గమనార్హం. ఆ ఆరంభ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 42 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది.
సన్రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, సమ్రాన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, శివాంగ్ కుమార్, ఇషాన్ మలింగ, షకీబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే, ట్రావిస్ హెడ్ (ఇంపాక్ట్ ప్లేయర్).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు (అంచనా)
వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడిక్కల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియా షెఫార్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిఖ్ సలాం, జోష్ హేజిల్వుడ్, జకోబ్ డఫీ (ఇంపాక్ట్ ప్లేయర్).
Also Read: ఐపీఎల్లో విరాట్ కోహ్లీ సంపాదన ఎంతో తెలుసా? రూ.12 లక్షల నుండి రూ.230 కోట్లకు చేరాడు
Also Read: కోల్కతా నైట్రైడర్స్కు నేడు చావో రేవో మ్యాచ్..కేకేఆర్ ఆశలు ముంబై గల్లంతు చేస్తుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Metro: నేడు హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సర్వీసులు!
Hyderabad, Telangana:SRH vs RCB Metro Timings Extended Today: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ కారణంగా ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేశారు. సొంత వాహనాల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని ట్రాఫిక్ పోలీసులు సూచనలు కూడా చేశారు. మెట్రో రైల్ సంస్థ కూడా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కారణంగా అభిమానులు మ్యాచ్ అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళడానికి మెట్రో సేవలను రాత్రి 12 గంటల వరకు పొడిగించింది. ఉప్పల్ స్టేడియం నుండి అన్ని కారిడార్లలో ప్రయాణించవచ్చు. రద్దీని బట్టి ఉప్పల్ నుండి నాగోల్, అమీర్పేట్, మియాపూర్ రూట్లలో ప్రత్యేక రైళ్లు నడుపుతారు.
ఈరోజు క్రికెట్ అభిమానులకు పండుగ. దీంతో హైదరాబాద్ మెట్రో ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ముగిసే సమయానికి ఒక్కసారిగా ఫ్యాన్స్ ఒక్కసారిగా బయటకు వస్తారు. ఈ సమయంలో ఇబ్బందులు కలగకుండా మెట్రో సమయాన్ని పొడిగించారు. ఇక మ్యాచ్ అయిపోయిన వెంటనే ప్రయాణికులు ఉప్పల్ నుండి వివిధ మార్గాల్లో వారి ఇళ్లకు చేరుకోవచ్చు. అంతేకాకుండా క్యూ లైన్లో వేచి ఉండకుండా ముందుగానే రిటర్న్ జర్నీ టికెట్లు, స్మార్ట్ కార్డ్స్ను క్యూఆర్ కోడ్ ద్వారా ఉపయోగించి ప్రయాణం చేయాలని అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా మ్యాచ్ చూసి బయటకు రాగానే ఒక్కసారిగా రద్దీ పెరుగుతుంది. పార్కింగ్ నుండి వాహనాలు తీసేటప్పుడు కూడా రద్దీ ఏర్పడుతుంది. సొంత వాహనాలు కాకుండా మెట్రో, ఆర్టీసీ బస్సుల ద్వారా వెళ్లడం వల్ల రద్దీని నివారించవచ్చు. మెట్రోను ఉపయోగిస్తే త్వరగా కూడా చేరుకోవచ్చు. అందుకే రద్దీని తగ్గించడానికి రాత్రి 12 గంటల వరకు మెట్రో సమయాన్ని పొడిగించారు. దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాత్రి సమయంలో ఉండవు.
సాధారణంగా మెట్రో రైళ్లు రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే హైదరాబాద్ మెట్రో సమయాన్ని పొడిగిస్తుంది. శుక్రవారం కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉన్నందున ప్రయాణికుల కోసం ఈ సేవలను పొడిగించింది. ఈ నేపథ్యంలో ఉప్పల్ వైపుగా వచ్చే భారీ వాహనాలకు కూడా ముందుగానే ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. మల్కాజిగిరి పోలీసులు క్రికెట్ స్టేడియం వైపుగా వచ్చే భారీ వాహనాలకు కూడా మళ్లింపులు చేపట్టారు.
READ ALSO: Traffic Diversion: నేడు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. ఆ రూట్లలో వెళ్తే ట్రాఫిక్ లో చిక్కుకున్నట్టే!
READ ALSO: హైదరాబాద్లో నీటి కష్టాలు.. రోడ్డు విస్తరణ పనుల వల్ల పగిలిన పైప్లైన్, ఆ ప్రాంతాల్లో నో వాటర్ సప్లై!
పార్కింగ్ ఇక్కడే..
అంతేకాకుండా పార్కింగ్ కోసం ఐదు ప్రాంతాల్లో స్థలాన్ని కేటాయించారు. అభిమానుల కోసం స్టేడియం బయట ఏర్పాటు చేయగా, వీవీఐపీ, వీఐపీ పాస్ ఉన్నవారికి స్టేడియం లోపల గేట్ 1A ద్వారా ప్రవేశం కల్పించారు.
ఈరోజు ఐపీఎల్ SRH సొంతగడ్డపై RCB తో తలపడుతుంది కాబట్టి అభిమానులకు ఈరోజు పండుగ రోజు. రెండు జట్ల మధ్య స్టేడియం దగ్గర పోరు ఉంటుందని అభిమానులు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా కోహ్లీ ఆట చూసేందుకు RCB ఫ్యాన్స్ ఎదురు చూడగా, అభిషేక్ కూడా రాణిస్తాడని అంటున్నారు. ఇదే అదునుగా చూసుకొని టికెట్లను బ్లాక్ లో ఒక్కో టిక్కెట్ రూ. 15 వేలకు పైగా అమ్ముతున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Heatwaves Deaths: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం..నిన్న ఒక్కరోజే వడదెబ్బకు 22 మంది మృత్యువాత!
Hyderabad, Telangana:Heatwaves Deaths In Telangana: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. భానుడి భగభగలతో రాష్ట్రం మొత్తం నిప్పుల కొలిమిలా మారిపోయింది. వడదెబ్బ కారణంగా గురువారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 22 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. మృతులలో వృద్ధులు, హమాలీలు, వ్యవసాయ కూలీలతో పాటు ఓ విద్యార్థి కూడా ఉండడం గమనార్హం.
ఎండ తీవ్రతకు ఉమ్మడి వరంగల్ జిల్లా విలవిలలాడింది. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలకు ఈ ఉమ్మడి జిల్లాల్లో 9 మంది మృత్యువాత పడ్డారు. అలాగే మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్త ఇర్సులాపురంలో ఒకరు.. కేసముద్రం మండలం కల్వ ఒకరు, నెల్లికుదురు మండలం హనుమాన్నగర్ తండాకు చెందిన మహిళా రైతు మృతి చెందారు. హనుమకొండ జిల్లాలోని కాజీపేటలో భూపాలపల్లి జిల్లా చల్లగరిగెలో ఓ వ్యక్తి చనిపోగా.. ఎల్కతుర్తి మండలం కేశవపూర్కు చెందిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు.
ములుగు జిల్లాలో ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ, ములుగు బస్టాండు ప్రాంతంలో ఒక గుర్తు తెలియని మహిళ మృతి చెందారు. అదే విధంగా భూపాలపల్లి జిల్లాలో మొగుళ్లపల్లి మండలం పోతుగల్లో మహిళా వ్యవసాయ కూలి, రేగొండ మండలం బాగిర్తిపేటలో ఓ వ్యక్తితో పాటు ఇతర జిల్లాల్లో వడదెబ్బ మరణాల వివరాలను తెలుసుకుందాం.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సూర్యాపేటలో ఓ ఇంటర్ విద్యార్థి.. తుంగుతుర్తిలో హమాలీ, నల్గొండలోని మునుగోడు మండలం చీమటిమామిడికి చెందిన ఓ రైతు, యాదాద్రి భువనగిరిలో కోమటికుంటలో ఓ వ్యక్తి,
మంచిర్యాలలోని శ్రీరాంపూర్ ఏరియా లక్ష్మీనగర్ ఓ మహిళ, పాత మంచిర్యాలలో ఓ వ్యక్తి.. అలాగే కరీంనగర్లోని ఓ ఉపాధి హామీ కూలీ, ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలో ఓ మహిళ.. జోగులాంబ గద్వాలలోని ఇటిక్యాలలో ఓ వ్యక్తి.. మెదక్ నార్సింగిలో ఓ వ్యక్తి.. ఇలా జగిత్యాల, పెద్దపిల్లి, ఖమ్మం వంటి ప్రాంతాల్లో వడదెబ్బకు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోయారు.
నేడు 11 జిల్లాల్లో వడగాలులు..
తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో శుక్రవారం కూడా బలమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, సూర్యపేట, నల్గొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీస్తాయని వాతావరణ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఆయా జిల్లాల ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించింది. మరోవైపు ఖమ్మం, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, కామారెడ్డి వంటి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది.
గమనిక: ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: బక్రీద్ పండగ సెలవు ఎప్పుడు? మే 27 లేదా మే 28 ఏపీలో హాలీడే ఎప్పుడంటే?
Also Read: తెలంగాణ కార్మికులకు గుడ్న్యూస్..రూ.20,000లకు జీతం పెంచిన రేవంత్ సర్కార్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Government: ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు..భారీగా నిధుల విడుదల..
Vijayawada, Andhra Pradesh:Ap Government Anganwadi Gratuity: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు భారీ ఊరటనిచ్చింది. వారు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ (పదవీ విరమణ ప్రయోజనాలు) చెల్లింపు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.19.70 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మహిళలు, వికలాంగులు, బాలలు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారికంగా పరిపాలనా అనుమతులు ఇస్తూ కీలక ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.
ఈ నిధులు 2025-26 ఆర్థిక ఏడాదికి సంబంధించిన పదవీ విరమణ బెనిఫిట్స్ చెల్లింపుల కోసమే ప్రత్యేకంగా కేటాయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంగన్వాడీ మెయిన్, మినీ కార్యకర్తలతో పాటు సహాయకులు అందరికీ ఈ ప్రయోజనాలు అందనున్నాయి. అంగన్వాడీలకు వీలైనంత త్వరగా న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా నిధుల విత్డ్రాపై ఉండే ఆర్థికపరమైన ఆంక్షలను పక్కన పెట్టింది. ట్రెజరీ నియంత్రణ, త్రైమాసిక నియమాలను సడలించి, ఈ నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.
ప్రస్తుతానికి అడ్వాన్స్గా ఇస్తున్న ఈ మొత్తాన్ని, రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరంలో సప్లిమెంటరీ గ్రాంట్స్ ద్వారా సర్దుబాటు చేయనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ నిధులను నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు సకాలంలో చేరవేసే బాధ్యతను మహిళల అభివృద్ధి, బాల వికాస శాఖ డైరెక్టర్కు ప్రభుత్వం అప్పగించింది.
గ్రాట్యుటీ చట్టం పరిధిలోకి అంగన్వాడీలు..
గతంలో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ప్రకారం.. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు కూడా 'గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం, 1972' కింద రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం, పదవీ విరమణ పొంది ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అంగన్వాడీలకు కొండంత అండగా మారనుంది.
రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందిస్తూ రాత్రింబవళ్లు సేవలు అందిస్తున్న అంగన్వాడీల సంక్షేమానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ తాజా జీవోతో వేలాది అంగన్వాడీ కుటుంబాల్లో రిటైర్మెంట్ భరోసా లభించినట్లయింది.
Also Read: తెలంగాణ కార్మికులకు గుడ్న్యూస్..రూ.20,000లకు జీతం పెంచిన రేవంత్ సర్కార్!
Also Read: బక్రీద్ పండగ సెలవు ఎప్పుడు? మే 27 లేదా మే 28 ఏపీలో హాలీడే ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
GT vs CSK Highlights: టాప్ 2లోకి గుజరాత్ టైటాన్స్.. ఘోర పరాభవంతో చెన్నై ఇంటికి
Ahmedabad, Gujarat:GT Beat CSK By 89 Runs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026లో ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉన్న పరిస్థితిలో చెన్నై సూపర్ కింగ్స్ చివరి మ్యాచ్లో పోరాడలేక చేతులెత్తేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో ఘోరంగా వైఫల్యమవండంతో మ్యాచ్ను చేజార్చుకోవడమే కాకుండా ఘోర పరాభవం ఎదుర్కొంది. ఇప్పటికే ప్లేఆఫ్స్లోకి వెళ్లిన గుజరాత్ టైటాన్స్ సంచలన ప్రదర్శన చేసి ప్రత్యర్థి చెన్నై జట్టుకు ఘోర పరాభవం మిగిల్చింది. సీజన్లో చివరి మ్యాచ్ ఆడిన చెన్నై ఓటమితో ఇంటి బాట పట్టగా.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ను గుజరాత్ టైటాన్స్ 89 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ విశేషాలు ఇలా ఉన్నాయి.
Save KBR Park: కేబీఆర్ పార్క్ను కాపాడాలి.. పర్యావరణ పరిరక్షణలో అండగా ఉంటాం: కేటీఆర్
Hyderabad, Telangana:KTR Reacts On Save KBR Park: అభివృద్ధి కార్యక్రమాల కోసం హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్లోని చెట్లను తొలగిస్తుండడంతో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కొనసాగుతోంది. అభివృద్ధి పనులతో పార్క్ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతూ నిత్యం నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేబీఆర్ పరిరక్షణ కోసం పర్యావరణ ప్రేమికులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను కలిశారు.
Also Read: Sara Tendulkar: 'ఎంత బొద్దుగా ఉంది'.. సారా టెండూల్కర్పై బాడీ షేమింగ్
హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో కేటీఆర్ను కేబీఆర్ పార్క్ రోడ్ విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు కలిసి మాట్లాడారు. కేబీఆర్ పార్క్ రోడ్ విస్తరణతో దానివలన ప్రభావం పడనున్న యజమానుల ఫోరం ప్రతినిధులు తమ సమస్యలను కేటీఆర్కు విన్నవించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా చెట్లను నరికివేసే ప్రయత్నాలను వ్యతిరేకించాలని.. హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్క్ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Cockroach Janta Party: దేశంలో పెను సంచలనం.. బీజేపీని వెనక్కి నెట్టిన సీజేపీ
అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి అత్యంత విలువైన లంగ్స్ స్పేస్. వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడడంలో కేబీఆర్ పార్క్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇలాంటి పచ్చదనాన్ని నాశనం చేసే ఏ చర్యనైనా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేబీఆర్ పార్క్ ఉనికి, చెట్లకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా అండర్గ్రౌండ్ ప్రతిపాదికన ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశామని మాజీ మంత్రి కేటీఆర్ కేటీఆర్ గుర్తుచేశారు. ఆ ప్రణాళికలు ఇప్పటికీ మున్సిపల్ శాఖ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేయడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేయవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: Kurchi Thatha: సోషల్ మీడియా తీవ్ర దిగ్భ్రాంతి.. గుండెపోటుతో 'కుర్చీ తాత' మృతి
కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రజలు వ్యక్తం చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సి అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తు తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించాలంటే కేబీఆర్ పార్క్ వంటి పర్యావరణ సంపదలను కాపాడుకోవడం అత్యవసరమని కేటీఆర్ స్పష్టం చేశారు.
Sara Tendulkar: 'ఎంత బొద్దుగా ఉంది'.. సారా టెండూల్కర్పై బాడీ షేమింగ్
Mumbai, Maharashtra:Sara Tendulkar Body Shaming: సెలబ్రిటీలను కొందరు ప్రశాంతంగా ఉంచడం లేదు. నిత్యం ఏదో ఒక వివాదం సృష్టిస్తున్నారు. తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ఫొటోలు, వీడియోలు పోస్టు చేయడం తీవ్ర దుమారం రేపింది. అంతేకాకుండా ఆమె వదినపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో అతడిపై సారాతోపాటు నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారంపై సారా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసహ్యంగా మాట్లాడుతున్నారని మండిపడుతూ వెంటనే డిలీట్ చేయాలని కోరారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.
Also Read: Kurchi Thatha: సోషల్ మీడియా తీవ్ర దిగ్భ్రాంతి.. గుండెపోటుతో 'కుర్చీ తాత' మృతి
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ముంబైలో నివసిస్తున్నారు. సచిన్ కుమార్తె కావడంతోపాటు ఆమె నిత్యం సోషల్ మీడియాలో తన ఫొటోలు, తనకు సంబంధించిన విశేషాలు పంచుకుంటుండడంతో ఆమెకు అభిమానులు పెరుగుతున్నారు. ఆమె సెలబ్రిటీ స్థాయి గుర్తింపు పొందడంతో ఎక్కడకు వెళ్లినా సారా టెండూల్కర్ను చుట్టుముడుతున్నారు. ఈ క్రమంలో ముంబై ఎయిర్పోర్టుకు తన వదినతో కలిసి సారా టెండూల్కర్ వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న కొందరు జర్నలిస్టులు ఫొటోలు, వీడియోలు తీశారు. అవి తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో పంచుకుంటూ సారా టెండూల్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెపై బాడీ షేమింగ్కు పాల్పడ్డారు.
Also Read: Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు బంపర్ శుభవార్త.. రెండు రోజులు ఏమిటంటే?
‘మీరు చాలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇది జర్నలిజం కాదు. మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయాలి' అని సారా టెండూల్కర్ విజ్ఞప్తి చేశారు. సారా టెండూల్కర్ స్పందించడంతో వెంటనే ఆ వ్యక్తి వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించారు. పోస్టును తొలగించిన వ్యక్తిని సారా టెండూల్కర్ అంతటితో వదిలేయకుండా.. ‘మీ పోస్ట్ను డిలీట్ చేసి ఉండొచ్చు. కానీ మీలోని అసహ్యకరమైన ఆలోచనా విధానాన్ని ఏమాత్రం మారదు’ అని బుద్ధి చెప్పారు.
Also Read: Petrol Price: 'మోదీ పిలక ట్రంప్ చేతికి చిక్కింది.. ఇందిరకు ఉన్న తెగువ మోదీకి లేదు
సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్కు మార్చి 5వ తేదీన సానియా చంధోక్తో వివాహమైన విషయం తెలిసిందే. ఎయిర్పోర్టులో వదన సానియాతో కలిసి వెళ్తుండగా సదరు జర్నలిస్టు (పాపరాజీ) వీడియో తీసి పోస్టు చేయడం దుమారం రేపింది. ఇది ఇంతటితో ఆగే అంశం కాదని.. ఆ జర్నలిస్టుపై సారా టెండూల్కర్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అతడి నుంచి క్షమాపణ అడగడమే కాకుండా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారని సమాచారం. ఇది ఇలా ఉంటే 28 ఏళ్ల సారా టెండూల్కర్ ఇంకా వివాహం చేసుకోలేదు. ప్రస్తుతానికి తండ్రి స్థాపించిన ఫౌండేషన్తోపాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ కొత్త వ్యాపారం ప్రారంభించిన విషయం తెలిసిందే.
Karimnagar: కరీంనగర్ జలాశయాలపై మట్టి మాఫియా పంజా.. కోట్లలో వ్యాపారం, నిమ్మకు నీరెత్తిన అధికారులు!
Karimnagar, Telangana:Karimnagar Soil Mafia: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన జలాశయాలు ప్రస్తుతం అక్రమ మట్టి దారులకు అడ్డగా మారాయి. నీటి నిల్వలు తగ్గి.. బ్యాక్ వాటర్ వెనక్కి వెళ్లడమే ఆలస్యం.. ముంపు గ్రామాల భూములపై మట్టి మాఫియా పంజా విసురుతోంది. లోయర్ మానేరు డ్యాం, అప్పర్ మానేరు, మధ్య మానేరు జలాశయాల పరివాహక ప్రాంతాల్లో రాత్రింబగళ్లు యదేచ్చగా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాలు పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ సంపద కొల్లగొడుతున్నప్పటికీ.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
ఎండ తీవ్రతకు జలాశయాల్లోని నీటిమట్టాలు అడుగంటి పోవడంతో.. ముంపునకు గురైన రెవెన్యూ భూములు బయటపడుతున్నాయి. ఈ భూముల్లోని అత్యంత ఫలవంతమైన, నాణ్యమైన మట్టిపై మాఫియా కన్ను పడింది. ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ వందలాది ఇసుక ట్రాక్టర్లతో పాటు జేసీబీలు, టిప్పర్లతో రంగంలోకి దిగుతున్నారు. రోజుకు వందల ట్రిప్పుల మట్టిని ఇటు ఇసుక బట్టీలకు, అటు రియల్ ఎస్టేట్ వెంచర్ల పూడిక పనులకు తరలిస్తూ రూపాయలు కోట్లలో వ్యాపారం చేస్తున్నారు.
ఈ అక్రమ రవాణాను అడ్డుకోవలసిన నీటిపారుదల, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల మధ్య కనీస సమన్వయం కరువైంది. ఏ శాఖను ప్రశ్నించినప్పటికీ.. మా పరిధిలోకి రాదు అంటూ కాలయాపన చేస్తుండడం అక్రమార్కులకు వరంగా మారింది. జలాశయ పరిధి ఇరిగేషన్ శాఖకు చెందితే.. భూమిపై హక్కులు రెవెన్యూ శాఖకు ఉంటాయి. ఖనిజ సంపద కాబట్టి మైనింగ్ శాఖ చర్యలు తీసుకోవాలి. కానీ ఏ ఒక్క శాఖ కూడా దీనిపై ప్రత్యేక నిఘా పెట్టడం లేదు. ఈ శాఖల మధ్య ఉన్న సమన్వయ లోపమే మాఫియాకు రక్షణ కవచంగా నిలుస్తోందని స్పష్టం అవుతుంది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
గతంలో కొన్నిచోట్ల స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మొక్కుబడి తనిఖీలతో సరిపెట్టారే తప్ప శాశ్వత చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికారులు స్పందించి జలాశయాల వద్ద ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేయాలని.. అక్రమ తవ్వకాలకు పాల్పడితే వారిపై పీడియా నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జలాశయాలను గుల్ల చేస్తున్న మట్టి మాఫియా పై ప్రత్యేకమైన ఉక్కు పాదం మోపాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు కోరుతున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Jeevan Reddy: జగిత్యాలలో చెరువుల ఆక్రమణలపై కలెక్టర్కు జీవన్ రెడ్డి ఫిర్యాదు.. తక్షణ చర్యలకు డిమాండ్!
Hyderabad, Telangana:Jeevan Reddy Complaint To Collector: జగిత్యాల అర్బన్తో పాటు రూరల్ మండలాల పరిధిలో రోజురోజుకు మితిమీరుతున్న చెరువులు, కుంటల ఆక్రమణ పై స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం జిల్లా కలెక్టర్ తో పాటు ఆర్డిఓ, తహసిల్దార్లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూములతో పాటు సహజ నీటి వనరులను కాపాడటంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని ఆయన కోరారు..
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. జగిత్యాల పరిసర ప్రాంతాల్లోని మోతేతో పాటు చింతకుంట, ముప్పాల చెరువుల పరివాహక ప్రాంతాలు, బఫర్ జోన్లు తీవ్ర ఆక్రమణలకు గురవుతున్నాయని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు కొంతమంది స్వార్థపరులు నిబంధనలకు విరుద్ధంగా చెరువు శిఖం భూముల్లోకి చొచ్చుకు వచ్చి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని మండిపడ్డారు. విలువైన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నప్పటికీ సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు..
కొందరు అక్రమార్కులు రాత్రికి రాత్రే జెసిబిలతో చెరువుల్లోకి మట్టితో పాటు ముఠా వేసి పూడుస్తున్నారని.. సహజంగా వచ్చే నీటి ప్రవాహాలను అడ్డుకుంటూ కాలువలను మూసేస్తున్నారని.. దీనివల్ల వర్షాకాలంలో సమీప కాలనీలు మునిగిపోయే ప్రమాదం ఉందని జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.. భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోయి తీవ్రమైన నీటి సమస్యలతో పాటు సాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
సహజ నీతి వనరులను లేకుండా చేస్తూ.. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్న ఆక్రమణ దారులపై తక్షణమే క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన అధికారులను కోరారు. ఆక్రమణలకు గురైన మోతే, చింతకుంట, వివిధ ప్రాంతాల్లోని చెరువులను రెవెన్యూ తో పాటు నీటిపారుదల శాఖ అధికారులతో సంయుక్తంగా సర్వే చేయించి.. సరిహద్దులను మళ్లీ సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసి.. చెరువుల చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని కోరారు.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Jagtial: జగిత్యాలలో మధ్యాహ్నం అయితే కర్ఫ్యూ వాతావరణం.. రికార్డులు బద్దలు కొడుతున్న ఎండలు!
Hyderabad, Telangana:Jagtial Weather Updates: జగిత్యాల జిల్లాలో ఎండలు మునిపెన్నడూ లేనివిధంగా ప్రజలను పడలేత్తిస్తున్నాయి. రోహిణి కార్తె ప్రవేశించక ముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జిల్లా ప్రజలు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి ఎండ తీవ్రత మొదలై.. మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. జిల్లాలోని కొన్ని చోట్లనైతే ఎప్పుడు రికార్డ్ కానీ గరిష్ట స్థాయిలో రికార్డింగ్ సంచలనం సృష్టిస్తున్నాయి.
అధికారుల గణాంకాల ప్రకారం.. జిల్లాలోని అత్యధికంగా ధర్మపురి మండలం నేరెళ్లలోని 46.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే ఇబ్రహీంపట్నం మండలం గూడూరు లోని 46.3 డిగ్రీలో ఉష్ణోగ్రతతో పాటు.. ధర్మపురి మండలం జైనలో 46.2 డిగ్రీలు, ఎండపల్లి మండలం గుల్లకోటలో 46.1 డిగ్రీలు, ధర్మపురి పట్టణంలో 46.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. జిల్లావ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో జనం ఇళ్లలో నుంచి బయటికి రావడానికి జంకుతున్నారు.
తీవ్రమైన వడగాల్పుల కారణంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన రహదారులన్నీ జనసంచారం లేక వేలవేల బోతున్నాయి.. వ్యాపార సముదాయాలు సైతం మధ్యాహ్నం సమయంలో మూతపడుతుండడంతో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఉపాధి హామీ కూలీలు, నిర్మాణరంగ కార్మికులతో పాటు వీధి వ్యాపారులు ఈ తీవ్రమైన ఎండల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
గరిష్ట స్థాయిలో రికార్డు అవుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది వైద్య నిపుణులు వివిధ అంశాలను సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళలో బయటికి రావద్దని.. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. నిరంతరం మంచినీటితోపాటు ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూ శరీరాన్ని డిహైడ్రేషన్కు గురికాకుండా కాపాడుకోవాలని తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వృద్ధులతో పాటు చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారి సూచిస్తున్నారు. మరో రెండు మూడు రోజులపాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. స్థానిక యంత్రాంగం కూడా వడదెబ్బ నివారణ చర్యలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని కోరుతున్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Bank Holidays: ఎల్లుండి నుంచి వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే?
Hyderabad, Telangana:SBI Bank Holiday Alert: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఒక ముఖ్య గమనిక.. ఎల్లుండి నుంచి వరుసగా నాలుగు రోజులపాటు దేశవ్యాప్తంగా ఎస్బిఐ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోబోతున్నాయి. సాధారణ సెలవులతో పాటు బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం, ఆ వెంటనే పండగ సెలవు కూడా రావడంతో వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నగదు డిపాజిట్లతో పాటు చెక్కుల క్లియరెన్స్, నగదు ను తీసుకోవడం వంటి అత్యవసర పనులు ఉన్నవారు గురు శుక్రవారాల్లోనే తమ పనులను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు..
ఈనెల 23వ తేదీ నాలుగో శనివారం కావడంతో పాటు ఆ మరుసటి రోజు నాలుగున ఆదివారం కావడంతో బ్యాంకులకు యధావిధిగా సెలవులు ఉంటాయి. ఆ తర్వాత రానున్న 25 తో పాటు 26 తేదీల్లో ఎస్బిఐ బ్యాంకు ఉద్యోగులు తమ పలు దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. యాజమాన్యం అనుసరిస్తున్న కొన్ని విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరుగుతుండడంతో.. ఈ రెండు రోజులు కూడా బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్తంభించిపోనున్నాయి. ఇక ఆ వెంటనే 27 లేదా 28వ తేదీ బక్రీద్ పండగ ప్రభుత్వ సెలవు ఉండడంతో మొత్తం మీద ఐదు రోజులపాటు ఎస్బిఐ బ్యాంకులు బంద్ ఉండబోతున్నాయి..
శాఖల ద్వారా జరిగే ప్రత్యక్ష లావాదేవీలు నిలిచిపోయినప్పటికీ.. ఖాతాదారులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అందుబాటులో ఉంటాయని బ్యాంకు వర్గాలు తెలిపాయి.. సమ్మెతో పాటు సెలవు దినాల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు యధాతధంగా కొనసాగుతాయి. అంతేకాకుండా ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో పాటు మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యూపీఐ లావాదేవీలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయని ఎస్బిఐ స్పష్టం చేసింది..
Also Read: Essel Group 100: వందేళ్లలో ఎస్సైల్ గ్రూపు అపూర్వ క్షణాలు.. గర్వించదగ్గ అవార్డులు
అయితే, వరుస సెలవుల కారణంగా నగరాల్లోని ఏటీఎంలో నగదుకు కొంత కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున ఖాతాదారులు ముందస్తుగా అవసరమైన నగదును సమకూర్చుకోవడం ఉత్తమమని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. లోన్ ప్రాసెసింగ్తో పాటు డిమాండ్ డ్రాఫ్ట్ల జారీ వంటి పనులకు ఈ ఐదు రోజులు వేచి చూడక తప్పదు. అంతేకాకుండా ఇతర బ్యాంకింగ్ సేవల కోసం కూడా తప్పకుండా కొన్ని రోజులపాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఎస్బిఐ బ్యాంక్ తో పాటు ఇతర బ్యాంకులకు కూడా ఇదేవిధంగా బంద్ ఫాలో అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Essel Group 100: వందేళ్లలో ఎస్సైల్ గ్రూపు అపూర్వ క్షణాలు.. గర్వించదగ్గ అవార్డులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Anjanadri Hanuman Temple: అంజనాద్రి హనుమాన్ ఆభరణాలపై అసత్య ప్రచారాలు వద్దు: ఏఎంఆర్ ఇండియా లిమిటెట్ స్పష్టత
Bengaluru, Karnataka:Anjanadri Hanuman Temple Gold Ornaments: కర్నాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లా గంగావతి ప్రాంతంలోని ప్రసిద్ధ అంజనాద్రి హనుమాన్ దేవస్థానానికి సమర్పించిన బంగారు ఆభరణాలపై జరుగుతున్న ప్రచారాన్ని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ (AMR India Ltd) తీవ్రంగా ఖండించింది. హైదరాబాద్కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఏఎంఆర్ సంస్థ చైర్మన్ శ్రీ ఎ.మహేష్ కుమార్ రెడ్డి ఆ ఆభరణాలను విరాళంగా అందించారు.
ఈ ఆభరణాలలో కేవలం 250–300 గ్రాముల బంగారమే వాడారంటూ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు ముమ్మాటికీ అసత్యమని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ బి.సుబ్బరామిరెడ్డి స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించిన అసలు వాస్తవాలు, అధికారిక వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
2026 మే 8వ తేదీన ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ తరఫున అంజనాద్రి హనుమాన్ స్వామి వారికి దాదాపుగా రూ.2,20,42,000 (రూ.2.20 కోట్లు) విలువైన ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. దాదాపుగా ఒక కిలో 280 గ్రాముల (నికర బరువు) ఉన్న ఈ ఆభరణాలలో కిరీటం, మకరతోరణం, గద, ఛత్రి, సూర్య చంద్ర, గరుడ హనుమ జెండా సహా మొత్తం 12 రకాలు ఆభరణాలను స్వామి వారికి సమర్పించారు.
జ్యుడీషియల్ బాండ్ వివరాలు
ఈ ఆభరణాలను కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రసిద్ధ 'కె. రంగనాచారి సన్స్ మెటల్ వర్క్స్' సంస్థ వీటిని తయారు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి వారు జ్యుడీషియల్ బాండ్ ద్వారా పూర్తి వివరాలను వెల్లడించారు. ఆభరణాల తయారీ కోసం ఏఎంఆర్ చైర్మన్ మహేష్ రెడ్డి తమకు 1400 గ్రాముల (1.4 కిలోలు) బంగారాన్ని అందజేశారు. తయారీలో తరుగు (Wastage) పోగా మిగిలిన 1 కిలో 280 గ్రాముల నికర బరువుతో 12 ఆభరణాలను రూపొందించారు. ఈ బంగారు ఆభరణాలకు తయారీ సంస్థ 50 సంవత్సరాల గ్యారంటీ ఇస్తూ బాండ్ సమర్పించింది. హైదరాబాద్కు చెందిన ప్రసిద్ధ 'Tibarumal Jewellery' ఇన్వాయిస్ ఆధారంగా ఈ ఆభరణాల విలువ రూ.2,20,42,000/- గా నిర్ధారించారు.
"అవగాహన లోపంతోనో లేదా కావాలనే తప్పుదారి పట్టించేందుకో కొందరు కేవలం 300 గ్రాముల బంగారమే వాడారని దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించిన అన్ని రకాల ఒరిజినల్ బిల్లులు, ఆధార పత్రాలను ఇప్పటికే ఆలయ అధికారులకు సమర్పించాము. దేశవ్యాప్తంగా ఉన్న శ్రీశైలం, శ్రీకాళహస్తి, షిర్డీ సాయి బాబా వంటి ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలకు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను విరాళంగా ఇచ్చిన గొప్ప చరిత్ర దాత మహేష్ రెడ్డి గారికి ఉంది. అలాంటి వారిపై ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం అత్యంత బాధాకరం." అని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ సంస్ధ డైరెక్టర్ బి.సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు.
లీగల్ యాక్షన్ హెచ్చరిక
భక్తులు, ప్రజలు ఎవరూ ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని సంస్థ విజ్ఞప్తి చేసింది. దేవుడికి భక్తితో సమర్పించిన పవిత్ర ఆభరణాల విషయంలో హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించవద్దని మీడియా, సోషల్ మీడియా సంస్థలను కోరింది. వాస్తవాలను పరిశీలించకుండా కుట్రపూర్వకంగా అసత్యాలు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు (Legal Action) తీసుకుంటామని ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ హెచ్చరించింది.
ప్రకటన విడుదల చేసినవారు:
బి. సుబ్బరామిరెడ్డి
డైరెక్టర్, AMR India Limited, హైదరాబాద్.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం ప్రకటన మాత్రమే. ఇందులో సదరు ఆలయంతో గానీ, దాతల వ్యవహారాల్లో కానీ జీ తెలుగు న్యూస్ కు ఎలాంటి ప్రమేయం లేదు. దీన్ని జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు కేవలం ప్రకటనగానే తీసుకుంటురాని ఆశిస్తున్నాం.)
Also Read; Gudivada Temple: తాకట్టులో వెంకటేశ్వరస్వామి బంగారు కిరీటం..దాని విలువ అక్షరాల రూ.కోటి!
Also Read: తెలంగాణ కార్మికులకు గుడ్న్యూస్..రూ.20,000లకు జీతం పెంచిన రేవంత్ సర్కార్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cockroach Janta Party: దేశంలో పెను సంచలనం.. బీజేపీని వెనక్కి నెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ
Wadgaon, Maharashtra:CJP Beat To BJP: యువతకు పనిలేదు.. బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు భారతదేశ రాజకీయాలను ఒక మలుపు తిప్పబోతున్నట్లు కనిపిస్తోంది. అతడి వ్యాఖ్యలపై యువత తీవ్రంగా స్పందించడంతో ఓ యువకుడు 'కాక్రోచ్ జనతా పార్టీ' అని పార్టీని ఏర్పాటుచేశాడు. పార్టీ ప్రకటించిన కొన్ని రోజుల్లోనే లక్షల మంది సభ్యత్వాలు పొందుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీని దాటేసింది.
పార్టీ పెట్టి వారం తిరగకముందే కాక్రోచ్ జనతా పార్టీ సంచలనాలు సృష్టిస్తోంది. బీజేపీని దాటేయగా.. కాంగ్రెస్ను కూడా పక్కకు పెట్టే అవకాశం ఉంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా.. అతిపెద్ద పార్టీగా ఎదగడానికి కాక్రోచ్ పార్టీ సిద్ధమైందని తెలుస్తోంది. జెన్ జీ యువత కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేసుబుక్లో కాక్రోచ్ పార్టీకి యువత బ్రహ్మరథం పడుతున్నారు. ఫాలోవర్స్ విషయంలో బీజేపీని దాటేసింది. అత్యధిక ఫాలోవర్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా కాక్రోచ్ పార్టీ దాటేయనుంది.
మే 17 నుంచి 20వ తేదీల మధ్య నాలుగు రోజుల్లోనే కాక్రోచ్ పార్టీ వెబ్ పేజీకి 4 లక్షలకు పైగా సభ్యులు ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో 10 మిలియన్ ఫాలోవర్లు చేరారు. బీజేపీకి 8.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. గురువారానికి కాక్రోచ్ పార్టీ 13 మిలియన్ల ఫాలోవర్లు వచ్చారు. ఈస్థాయిలో ఫాలోవర్లు, ప్రజాదరణ పొందుతుండడంతో దేశంలో యువత మోదీ ప్రభుత్వంతోపాటు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలపై ఎంతటి ఆగ్రహం ఉన్నారో అర్థమవుతోంది.
విశేష ఆదరణ పొందుతూ ప్రజల వ్యతిరేతను స్పష్టంగా వ్యక్తం చేస్తున్న కాక్రోచ్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎక్స్ (ట్విటర్) అకౌంట్ను నిషేధించారు. ట్విటర్ అకౌంట్పై వేటు పడడంతో విస్మయం వ్యక్తమవుతోంది. అయితే ట్విటర్ ఖాతా తొలగింపు వార్త తాము ఊహించినదేనని అభిజిత్ తెలిపాడు.
15 మే 2026న సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ 'కొంతమంది యువకులు బొద్దింకల్లాంటివాళ్లు' అని ఒక వ్యాఖ్య చేశారు. ఈ వ్యాఖ్యలు నిరుద్యోగ యువతలో ఆగ్రహాన్ని రగిల్చాయి. దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన 30 ఏళ్ల అభిజీత్ దిప్కే వెంటనే తమను బొద్దింకలు అని ప్రబోధించడంతో బొద్దింక పేరు మీదనే 'కాక్రోచ్ జనతా పార్టీ'ని పెట్టేశాడు. మహారాష్ట్రలో పుట్టి పుణేలో జర్నలిజం చదివిన అభిజిత్.. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్నాడు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ వలంటీర్గా పనిచేశాడు. అతడికి డిజిటల్ క్యాంపెయిన్, మీమ్ కల్చర్ బాగా తెలియడంతో వెంటనే కాక్రోచ్ జనతా పార్టీకి విశేష ఆదరణ వచ్చేలా చేశాడు.
మే 16న గూగుల్ ఫారమ్ ద్వారా అభిజిత్ సీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభించాడు. నిరుద్యోగులు, బద్దకస్తుల గొంతు 'వాయిస్ ఆఫ్ లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్' అనే నినాదం ఇచ్చాడు. 'సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ' అనే సిద్ధాంతాలతో కాక్రోచ్ పార్టీ ముందుకుసాగుతుందని అభిజీత్ దీప్కే ప్రకటించాడు. అప్పటికే సీజేఐ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నా.. పెద్ద సంఖ్యలో యువత మాత్రం వెనక్కి తగ్గలేదు. కాక్రోచ్ పార్టీకి మద్దతు తెలిపేలా ‘‘మేము కూడా కాక్రోచులమే’ అంటూ ఫాలో బటన్ను క్లిక్ చేస్తూ, సభ్యత్వం తీసుకుంటూ తమ అసంతృప్తిని డిజిటల్ వేదికలపై భారీగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
Pulwama Attack Mastermind: పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం..పీఓకేలోకి దూరి కాల్చి చంపేశారు!
Muzaffarabad,Pulwama Attack Mastermind Killed: 2019లో భారతదేశాన్ని కుదిపేసిన పుల్వామా ఉగ్రదాడికి వెనుక ఉన్న ముఖ్య సూత్రధారులలో ఒకడైన హంజా బుర్హాన్ అంతమయ్యాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని ముజఫరాబాద్లో గుర్తుతెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో అతడు హతమైనట్లు సమాచారం అందుతోంది.
Also Read: నేడు కేంద్ర క్యాబినేట్ అత్యవసర సమావేశం..మంత్రులందరూ ఢిల్లీలో ఉండాలని మోదీ ఆదేశాలు!
Also Read: 2026లో చివరి సూర్యగ్రహణం ఆరోజే! గ్రహణం సమయం, తేదీ అప్పుడే! భారత్లో కనిపిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
