రాజేంద్ర నగర్లో పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ను అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆర్జిఐ విమానాశ్రయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్ల నుంచి మైనర్ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్న ప్రదీప్ పై బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుద్వెల్లోని ఓ చర్చిలో ఇద్దరూ కలుసుకుని బంధం ఏర్పరుచుకున్నారు. ప్రదీప్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Financial Planning Tips for Women 2026: నేటికాలం మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదుగుతున్నారు. సరైన కాలంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో కోటీశ్వరులు అవ్వడం సాధ్యం అవుతుంది. మీరు కూడా 2026 జనవరి 1వ తేదీన కొన్ని ఆర్థిక అలవాట్లను షురూ చేసినట్లయితే.. దీర్ఘకాలంలో భారీ సంపదను కూడబెట్టుకోవచ్చు. ఆదాయం ఎంత ఉంది అనేదానికంటే దాన్ని ఎలా నిర్వహిస్తున్నామన్నదే ముఖ్యం. ఈ నేపథ్యంలో మహిళలు కొత్త ఏడాదిలో తీసుకోవాల్సిన మూడు ముఖ్యమైన నిర్ణయాల గురించి తెలుసుకుందాం. ఈ నిర్ణయాలతో మీరు కోటీశ్వరులు అవడం సాధ్యం అవుతుంది.
మ్యూచువల్ ఫండ్ SIP:
మొదటగా మనం చర్చించాల్సిన స్కీమ్ మ్యూచువల్ ఫండ్ సిప్. ఇందులో ప్రతినెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయండి. చిన్న మొత్తాలతో మొదలై.. భారీ సంపదగా మారుతుంది. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి. ఉదాహరణకు చెప్పుకుంటే నెలకు రూ. 5వేల చొప్పున 25ఏండు సిప్ చేస్తే 12శదాతం రాబడి వస్తుంది. చివరికి కోటికిపైగా మొత్తం కూడబెట్టుకోవచ్చు. మహిళలకు ఇది క్రమశిక్షణతో కూడిన పొదుపు అని చెప్పాలి. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి భయపడకుండా పెట్టుబడి పెట్టేందుకు ఇది మంచి మార్గం అవుతుంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్:
ఇక రెండవ స్కీమ్..నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా బలంగా ఉండేందుకు రూపొందించిన పథకం. ఉద్యోగం చేస్తున్నా.. వ్యాపారం చేస్తున్న మహిళలు కూడా ఈ స్కీమ్ లో అకౌంట్ తీసుకోవచ్చు. దీనిలో పెట్టే మొత్తానికి ట్యాన్స్ బెనిఫిట్ ఉంటుంది. దీర్ఘకాల పెట్టుబడి కావడంతో పదవి విరమణ సమయంలో పెద్ద మొత్తంలో నిధులు చేతికి అందుతాయి. కుటుంబ బాధ్యతలు తీర్చుకున్న తర్వాత కూడా స్వతంత్రంగా జీవించేందుకు ఈస్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
రికరింగ్ డిపాజిట్ :
మూడవది రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇది రిస్క్ లేని స్కీమ్. మహిళలకు పూర్తి భద్రతనిస్తుంది. ప్రతినెలా కొంత మొత్తాన్ని బ్యాంకులో జమ చేసినట్లయితే.. మెచ్యూరిటీ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. పిల్లల చదువు, పెళ్లి ఖర్చులు లేదంటే అత్యవసరాల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే రాబడి తక్కువగా ఉన్నా కూడా భద్రత మాత్రం ఎక్కువగా ఉంటుంది.
టర్మ్ ఇన్సూరెన్స్:
ఈ మూడు స్కీముల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయగా మిగిలిన డబ్బులతో టర్మ్ ఇన్సూరెన్స్ కట్టండి. ఇది కుటుంబానికి భరోసానిస్తుంది. మహిళలు తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఇది మీకు రక్షణగా నిలుస్తుంది. తక్కువ ప్రీమియంతో పెద్ద కవరేజీని పొందవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్:
ఐదవది..చివరిది.. అత్యంత ముఖ్యమైంది. హెల్త్ ఇన్సూరెన్స్. అనారోగ్యం చెప్పిరాదు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే చిన్న వయస్సులోనే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే.. ఆసుపత్రి ఖర్చుల నుంచి కుటుంబాన్ని గట్టెక్కిస్తుంది.
వచ్చే కొత్త ఏడాది 2026లో ఈ ఐదు నిర్ణయాలు తీసుకుంటే మహిళలు ఆర్థికంగా బలంగా మారడమే కాదు..దీర్ఘకాలంలో కోటీశ్వరులుగా మారుతారు. సంపద అనేది ఒక రోజులోనే కూడబెడితే రాదు. రూపాయి రూపాయి పొదుపు చేస్తూ సరైన ప్రణాళి, క్రమశిక్షణ ఉంటే ప్రతి మహిళ తన ఆర్థిక భవిష్యత్తును తానే నిర్మించుకునే సత్తా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Raktha Pinjara Video Watch Here: పసుపు పొలాల్లో పనిచేస్తున్న రైతులకు తృతిలో పేను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లాలోని ఉన్న ఓ పసుపు తోటలో అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర పాము కలకలం సృష్టించింది. గత రెండు నెలల క్రితం ఇదే పాము కొంతమంది పసుపు తోటల్లో సంచారం చేస్తూ కనిపించింది.. దీంతో అప్పటి నుంచి కొంతమంది రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ వచ్చింది. అయితే, మరోసారి పసుపు పంటలు కొంతమంది రైతులు పనిచేస్తున్న క్రమంలో కనిపించడంతో వెంటనే వారు స్నేక్ క్యాచర్కి సమాచారం అందించారు. దీంతో అతను అక్కడికి చేరుకొని రెస్క్యూ చేపట్టిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు పడి పడి వీక్షిస్తున్నారు. ఇంతకీ ఆ పామును ఎలా పట్టుకున్నారో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. పసుపు తోటలో నీళ్లు పెడుతున్న రైతుకు ఎండిన ఆకుల మధ్య దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న రక్తపింజర పాము కనిపించింది. దీంతో వారి వెంటనే ప్రముఖ స్నేక్ క్యాచర్ మున్నాకి సమాచారం అందించారు. దీంతో అతను అక్కడికి చేరుకొని.. ఆకుల్లో కలిసిపోయిన పామును గుర్తించి మున్నా దానిని ఎంతో జాగ్రత్తగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ పాము ఎండుటాకుల్లో ఉండడం వల్ల అది కొద్దిసేపు వరకు కనబడకుండా ఆకుల కింద ఉండిపోయింది. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ ఆకులను కూడా అటు ఇటు జరపడంతో బయటపడింది.
రక్తపింజర్ పాముకు సంబంధించిన ఎన్నో అపోహాలు ఇప్పటికీ చాలామంది నమ్ముతూ ఉంటారు. రక్తపింజర బుసలు కొడుతుంటే దానికి దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. లేకపోతే దాని బుసల నుంచి వచ్చే గాలి ఒంటికి పై పడి.. చర్మం మచ్చలుగా ఏర్పడుతుందని చాలామంది ఇప్పటికీ ఊళ్ళల్లో రైతులు నమ్ముతూ ఉన్నారు. అయితే ఈ మూఢనమ్మకాన్ని స్నేక్ క్యాచర్ మున్నా కొట్టి పారేశాడు.. పాము బుసలు కొట్టడం అనేది కేవలం తనని తాను ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి ఇచ్చే ఒక సంకేతమని.. ఇలా బుసలు కొడితే ఎలాంటి మచ్చలు రావని.. ముఖ్యంగా చర్మ సమస్యలు అసలు రావని ఆయన వీడియోలో పేర్కొన్నారు.
ప్రముఖ స్నేక్ క్యాచర్ మున్నా వీడియోలు మాట్లాడుతూనే ఆ పాములు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చివరికి ఆ పామును పట్టుకొని.. ఓ సంచిలో బంధించాడు. ఇలా బంధించిన పాములు అతను ఓ అడవి ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టాడు. సాధారణంగా పసుపు పొలాల్లో ఇలాంటి పాములు సంచారం చేయడం సర్వసాధారణమే. కానీ సంచారం చేసే క్రమంలో తప్పకుండా వాటిని గుర్తించి వెంటనే స్నేక్ క్యాచర్స్కి సమాచారం అందించడం మంచిదని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Redmi Note 15 5G Launch Date: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ Xiaomi విడుదల చేసే మొబైల్కి అద్భుతమైన డిమాండ్ ఉంటుంది. ప్రీమియం ఫీచర్స్తో కూడిన స్మార్ట్ఫోన్స్ని అతి తక్కువ ధరల్లో విడుదల చేయడంలో ఈ కంపెనీ ఎప్పుడు ముందుంటుంది. ముఖ్యంగా Redmi పేరుతో విడుదల చేసే నోట్ సిరీస్ మొబైల్స్కి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నోట్ సిరీస్ పేరుతోనే ఇప్పటివరకు అనేక మొబైల్స్ను విడుదల చేసింది. అయితే, అతి త్వరలోనే నోట్ 15 సిరీస్ కూడా భారత్లో విడుదల కాబోతోంది. విడుదలకు ముందే ఈ మొబైల్ ఇటీవల ఓ దేశంలో అమ్మకానికి కనిపించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి. ఇంతకీ ఈ స్మార్ట్ఫోన్ ఎక్కడ అమ్మకానికి అందుబాటులో ఉందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
REDMI నోట్ 15 సిరీస్(REDMI Note 15 5G)ను కంపెనీ చైనాతో పాటు ఇటీవలే పోలాండ్ దేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్ స్మార్ట్ఫోన్ అద్భుతమైన మోడల్స్తో అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇటీవలే బెల్జియం క్యారియర్ టెలినెట్ వెబ్సైట్లో ఒక మోడల్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.. అధికారిక లాంచింగ్కి ముందే ఈ స్మార్ట్ ఫోన్ ధర పూర్తి వివరాలు షాపింగ్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మోడల్కు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలాండ్లో REDMI నోట్ 15 5G (REDMI Note 15 5G) స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ 128 జీబీ సిరీస్తో విడుదల చేసింది. దీని ధర రూ.29,662తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది వివిధ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తున్నట్లు కూడా సమాచారం. స్టోరేజ్ వేరియంట్ను బట్టి ధర అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన వివరాలను ఇప్పటికీ కంపెనీ Xiaomi అధికారికంగా ఎలాంటి ప్రకటనగా చేయలేదు. కానీ ఈ ఫోన్ మాత్రం అందుబాటులోకి రావడం వల్ల చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. REDMI నోట్ 15 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ యొక్క స్నాప్డ్రాగన్ 6 Gen 3 చిప్సెట్తో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్లో అద్భుతమే!
అలాగే ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 5,520mAh బ్యాటరీతో లాంచ్ అయింది. ఇక చైనాలో విడుదలైన మొబైల్ మాత్రం 5,800 mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ బ్యాటరీ చార్జింగ్ కోసం కంపెనీ దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది 6.77-అంగుళాల OLED డిస్ప్లేతో విడుదలైంది. ఇక ఇది 1,080 × 2,392 పిక్సెల్ల రిజల్యూషన్తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్ వెనక కెమెరా మాడ్యూల్ వివరాల్లోకి వెళితే.. ఇందులోని కంపెనీ 108MP ప్రధాన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అదనంగా 8MP అల్ట్రా-వైడ్, 2MP రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు చైనీస్ వేరియంట్ 50MP ప్రధాన కెమెరాతో పాటు అదనంగా 20MP కెమెరా కూడా లభిస్తుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్లో అద్భుతమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PSL Vs IPL Clash 2026: ఈ ఏడాది పాకిస్థాన్కు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. పెహల్గామ్ ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాక్ని భారత్ వణికించింది. అదే రీతిలో అటు మహిళలు, పురుషుల క్రికెట్లో కూడా పాకిస్థాన్పై టీమ్ఇండియా ఆధిపత్యం చలాయించింది. ఇప్పుడు మరోసారి పాకిస్థాన్కు మరో గట్టి దెబ్బ తగిలింది. అది బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ రూపంలో. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
మంగళవారం అనగా డిసెంబరు 16న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం ఇప్పుడు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను చిక్కుల్లోకి నెట్టేసింది. వచ్చే ఏడాది ఒకే సమయంలో అనగా మార్చి 2026లో ఈ రెండు లీగ్లు ప్రారంభం కానున్నాయి. అయితే గతంలో పాకిస్థాన్ సూపర్ లీగ్లో ప్రాతినిధ్యం వహించిన 11 మంది విదేశీ ఆటగాళ్లను ఇప్పుడు ఐపీఎల్ ఎగరేసుకుపోయింది. దీని ఫలితంగా పాకిస్థాన్ సూపర్ లీగ్కు సుమారు రూ.27.3 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
అటు నుంచి ఇటువైపు..
పాకిస్థాన్ వేదికగా జరుగుతోన్న సూపర్ లీగ్లోని వివిధ జట్ల తరఫున ఆడుతున్న 11 మంది కీలక ఆటగాళ్లను ఐపీఎల్ యాజమాన్యాలు నిన్న జరిగిన వేలంలో భారీ ధరలకు దక్కించుకున్నాయి. ఇందులో 10 మందిని వేలంలో కొనగా, మిచెల్ ఓవెన్ను పంజాబ్ కింగ్స్ ముందే రిటైన్ చేసుకుంది.
పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్కు మారిన ఆటగాళ్ల జాబితా ఇక్కడ ఉంది..
| ప్లేయర్ పేరు | ఐపీఎల్ టీమ్ | ధర (రూ. కోట్లలో) | పాత పీఎస్ఎల్ టీమ్ |
| జేసన్ హోల్డర్ | గుజరాత్ టైటాన్స్ | ₹7.00 | ఇస్లామాబాద్ యునైటెడ్ |
| బెన్ ద్వార్షుయిస్ | పంజాబ్ కింగ్స్ | ₹4.40 | ఇస్లామాబాద్ యునైటెడ్ |
| ఆడమ్ మిల్నే | రాజస్థాన్ రాయల్స్ | ₹2.40 | కరాచీ కింగ్స్ |
| ఫిన్ అలెన్ | కేకేఆర్ | ₹2.00 | క్వెట్టా గ్లాడియేటర్స్ |
| అకీల్ హోసేన్ | సీఎస్కే | ₹2.00 | క్వెట్టా గ్లాడియేటర్స్ |
| కైల్ జేమీసన్ | ఢిల్లీ క్యాపిటల్స్ | ₹2.00 | క్వెట్టా గ్లాడియేటర్స్ |
| టిమ్ సైఫర్ట్ | కేకేఆర్ | ₹1.50 | కరాచీ కింగ్స్ |
| మాథ్యూ షార్ట్ | సీఎస్కే | ₹1.50 | ఇస్లామాబాద్ యునైటెడ్ |
వీరితో పాటు ల్యూక్ వుడ్ (₹75 లక్షలు), జోర్డాన్ కాక్స్ (₹75 లక్షలు) కూడా ఐపీఎల్ బాట పట్టినట్లు తెలుస్తోంది.
చిక్కుముడి.. ఐపీఎల్కే మొగ్గు!
నివేదికల ప్రకారం.. ఐపీఎల్, పీఎస్ఎల్ రెండు సీజన్లు కూడా వచ్చే ఏడాది మార్చి 26 నుండే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకే సమయంలో రెండు లీగ్లు పోటీ పడితే, ఆటగాళ్లు సహజంగానే ఆర్థికంగా లాభదాయకమైన, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఐపీఎల్కే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆటగాళ్లు పీఎస్ఎల్ను వదిలి ఐపీఎల్ను ఎంచుకోవడం వల్ల పాకిస్తాన్ లీగ్ తన కళను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది పీఎస్ఎల్ నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో పీఎస్ఎల్ నిర్వాహకులు దిద్దుబాటు చర్యలు మొదలుపెడుతున్నట్లు సమాచారం.
ఫ్రాంచైజీలకు సవాలు
పాకిస్థాన్ సూపర్ లీగ్కు చెందిన క్వెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ వంటి జట్లు తమ ప్రధాన విదేశీ ఆటగాళ్లను కోల్పోవడం వల్ల ఆ జట్లు భారీగా బలహీనపడ్డాయి. ఇప్పుడు ఆ స్థానాలను భర్తీ చేసేందుకు కొత్త ఆటగాళ్లను వెతుక్కోవడం పీఎస్ఎల్ ఫ్రాంచైజీలకు పెద్ద సవాలుగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక అంశం ఇప్పుడు చర్చలో ఉంది. అదే 8వ వేతన సంఘం అమలు. 7వ వేతన సంఘం పదవీకాలం 2025 డిసెంబర్ 31తో ముగియనుంది. దీంతో తదుపరి వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? జీతాలు ఎంత వరకు పెరుగుతాయి? బకాయిలు ఎంత వస్తాయి? అనే అంశాలపై ఉద్యోగుల్లో ఆసక్తి పెరుగుతోంది.
అయితే ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘాన్ని నోటిఫై చేసింది. జస్టిస్ రంజన్ దేశాయ్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు కూడా అయ్యింది. దీనికి సంబంధించిన నిబంధనలు Tor కూడా ఆమోదం పొందాయి. ఈ కమిషన్కు తన నివేదికను సిద్ధం చేయడానికి సుమారు 18 నెలల సమయం అడిగింది. గత వేతన సంఘాల అనుభవాన్ని బట్టి చూస్తే.. నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం దానిని పరిశీలించి ఆమోదించడానికి మరో 3 నుంచి 6 నెలల సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల 8వ వేతన సంఘం అమలు 2027 చివర్లో లేదా 2028 ప్రారంభంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి.
అయితే.. 8పే కమిషన్ అమలు ఆలస్యమైనా కూడా.. సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలులోకి తెస్తే ఉద్యోగులకు భారీగా బకాయిలు లభించే అవకాశం ఉంది. అంటే రెండు సంవత్సరాల పాటు పెరిగిన జీతానికి సంబంధించిన మొత్తం ఒకేసారి అందుతుంది. ఇదే కారణంగా వేతన సంఘం ఆలస్యం అయినా ఉద్యోగులకు ఆర్థికంగా కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది.
జీతాలు ఎంత వరకు పెరిగే అవకాశం?
మార్కెట్ నిపుణులు.. అంబిట్ క్యాపిటల్ వంటి ఆర్థిక సంస్థల అంచనాల ప్రకారం.. 8వ వేతన సంఘం అమలుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో 30 నుంచి 34 శాతం వరకు పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ పెంపు ప్రధానంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.83 నుంచి 2.46 మధ్య ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే.. ఎక్కువగా 2.28 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఆధారంగా తీసుకుంటున్నారు. సాధారణంగా కొత్త వేతన నిర్మాణం అమలుకు ముందు, ప్రస్తుత డీఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేయడం జరుగుతుంది.
ఉదాహరణకు.. ప్రస్తుతం ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 18,000గా ఉంటే.. డీఏ కలిపి అతని స్థూల జీతం సుమారు రూ. 35,000 ఉంటుంది. ఇందులో 34 శాతం పెరుగుదల జరిగితే.. కొత్త స్థూల జీతం సుమారు రూ. 46,900కి చేరుతుంది. అంటే నెలకు దాదాపు రూ. 11,900 అదనపు ఆదాయం పెరుగుతుంది.
బకాయిలు ఎంత వరకు రావచ్చు?
ఒకవేళ 8వ వేతన సంఘం సిఫార్సులు 2028 జనవరిలో అమలులోకి వచ్చి.. అవి 2026 జనవరి 1 నుంచి వర్తింపజేస్తే.. ఉద్యోగులకు మొత్తం 24 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.
-నెలవారీ జీత పెరుగుదల: సుమారు రూ. 11,900
-బకాయిల కాలవ్యవధి: 24 నెలలు
-మొత్తం బకాయిలు: దాదాపు రూ. 2.85 లక్షలు
అంటే బేసిక్ సాలరీ ఉన్న ఉద్యోగికే దాదాపు రూ. 2.8 నుంచి రూ. 3 లక్షల వరకు బకాయిలు రావచ్చు. వేతన స్థాయి ఎక్కువగా ఉన్నవారికి ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
బకాయిల ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి వేతన సంఘంలోనూ బకాయిలు ఉద్యోగులకు ఒక పెద్ద ఆర్థిక ప్రయోజనంగా మారాయి. 7వ వేతన సంఘం సమయంలో కూడా ఉద్యోగులు భారీ మొత్తంలో బకాయిలు పొందారు. అందువల్ల.. అమలు ఆలస్యమైనా.. బకాయిల రూపంలో ఆ ఆలస్యాన్ని కొంతవరకు భర్తీ చేసే అవకాశం ఉంటుంది.
8వ వేతన సంఘం ఏ అంశాలను సమీక్షిస్తుంది?
8వ వేతన సంఘం పరిధి కేవలం ప్రాథమిక వేతనానికి మాత్రమే పరిమితం కాదు. ఇది HRA, ఇతర భత్యాలు, పెన్షన్, డీఏ/డీఆర్, గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలు, వేతన సమానత్వం, ప్రోత్సాహక నిర్మాణం వంటి అనేక కీలక అంశాలను సమీక్షిస్తుంది. కమిషన్ నివేదికను సమర్పించిన తర్వాత, ప్రభుత్వం అన్ని అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగులకు డీఏ, డీఆర్ చెల్లింపులు కొనసాగుతాయి. ఉద్యోగులు ఇప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్, అమలు తేదీ, బడ్జెట్ కేటాయింపులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Redmi K90 Ultra Price Features: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజ సంస్థ Redmi నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ కాబోతుంది. తన ఫ్లాగ్షిప్ సిరీస్లో ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగిన Redmi K90 Ultraను విడుదల చేసేందుకు సిద్ధమైంది. సాధారణ మొబైల్స్ కంటే భిన్నంగా ఈ స్మార్ట్ఫోన్ను రూపొందించారంటూ.. ఏకంగా 10,000 mAh జంబో బ్యాటరీతో అందుబాటులోకి తీసుకురావడం విశేషంగా మారింది.
ఇటీవలే Redmi సంస్థ తన K90 సిరీస్లో భాగంగా Redmi K90, Redmi K90 Pro Max మోడళ్లను 7,100 mAh బ్యాటరీలతో మార్కెట్లోకి విడుదల చేయగా.. ఇప్పుడు దాని ఆల్ట్రా వేరియంట్ ఇప్పుడు రికార్డు సృష్టించబోతుంది.
Redmi K90 Ultra స్మార్ట్ఫోన్ ప్రధాన ఫీచర్లు
ఈ స్మార్ట్ఫోన్ ప్రీమియం డిజైన్, టాప్-ఎండ్ స్పెసిఫికేషన్లతో రానుందని సమాచారం. లీకైన సమాచారం ప్రకారం దీని ఫీచర్లు ఇలా ఉండవచ్చని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో అత్యంత శక్తివంతమైన MediaTek Dimensity 9500 చిప్సెట్ను అమర్చినట్లు తెలుస్తోంది. ఇది మల్టీ-టాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్కు అద్భుతమైన వేగాన్ని ఇస్తుందని చెబుతున్నారు.
బ్యాటరీ & ఛార్జింగ్
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 10,000 mAh బ్యాటరీ సెటప్. దీనికి తోడు 100 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఫుల్-స్పీడ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
సినిమాటిక్ అనుభవం కోసం డాల్బీ విజన్ సపోర్ట్తో కూడిన హై-రిజల్యూషన్ డిస్ప్లేతో ఇది మార్కెట్లోకి రానుంది. రెడ్మీ కే90 అల్ట్రా బేస్ వేరియంట్ 16 GB RAMతో ప్రారంభం కానుండగా.. ఇది ఫోన్ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం Redmi ఇందులో పవర్ఫుల్ కెమెరా సెటప్ను అందిస్తోంది. అందులో భాగంగా ప్రైమరీ కెమెరా 50 MP మెయిన్ సెన్సార్.. టెలిఫోటో కెమెరా 50 MP.. 8 MP అల్ట్రా-వైడ్ కెమెరాతో చివరిగా 20 MP కెపాసిటీతో సెల్ఫీ కెమెరా ఇవ్వనున్నారు.
ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది?
గతంలో వచ్చిన Redmi K80 Ultra తరహాలోనే కొత్తగా రాబోతున్న Redmi K90 Ultra ఉన్నప్పటికీ.. బ్యాటరీ, ప్రాసెసర్ పరంగా కొన్ని భారీ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాలను, ధరను కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. మునుపటి మోడళ్ల కంటే ఇది మరింత ప్రీమియంగా ఉండబోతోందని మార్కెట్ వర్గాల అంచనా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party MLAs: అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తెలంగాణ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా అధికార పార్టీలో చేరిన వారిపై వేటు వేయకుండా వారికి క్లీన్చిట్ ఇచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలు లేవని ప్రకటించారు. దీంతో వారి పార్టీ ఫిరాయింపులపై అనర్హత పిటిషన్లను తోసిపుచ్చారు. స్పీకర్ నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేయగా.. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.
Also Read: Traffic Challan: వాహనదారులకు అలర్ట్..! లంచం ఇస్తే ట్రాఫిక్ చలాన్ రద్దవుతుందా?
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం విషయంలో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), తెల్లం వెంకటరావు (భద్రాచలం), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), బండ్ల కృష్ణమోహన్ (గద్వాల) కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. బహిరంగంగా కాంగ్రెస్ కండువా కప్పుకుని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఈ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.
Also Read: Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. సెలవులు పొడగింపు!
తమ పార్టీ గుర్తు కారుపై గెలిచిన ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడాన్ని సవాల్ చేస్తూ న్యాయ పోరాటానికి దిగింది. సుప్రీంకోర్టు డిసెంబర్ 18వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పగా.. ఆగమేఘాల మీద స్పీకర్ ఆ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను తోసిపుచ్చారు. మిగిలిన ఐదు మందిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Also Read: IPL Mini Auction: కుర్రోళ్లకు కోట్లు కోట్లు.. ఐపీఎల్ మినీ వేలంలో వజ్రాలను పట్టారు
బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం
ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను తిరస్కరించడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. బహిరంగంగా.. నిస్సిగ్గుగా కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో ఆధారాలు లేవని చెప్పడంపై మండిపడింది. స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్లో చేరిన వారిని వదిలేది లేదని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. రేపు సుప్రీంకోర్టులో ఎలాంటి పరిణామాలు జరగనున్నాయో ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ayesha Takia Plastic Surgery: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల కెరీర్ చాలా చిత్రంగా ఉంటుంది. కొందరు ఏళ్లపాటు సినిమాల్లో వరుస అవకాశాలతో దశాబ్దాల పాటు రాణిస్తే, మరికొందరు ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకొని..అంతే వేగంగా కనుమరుగవుతారు. అలాంటి వాళ్లలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'సూపర్' మూవీ హీరోయిన్ అయేషా టాకియా ఒకరు. టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఇప్పటికీ ఆమె అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
టాలీవుడ్లో మెరుపు తీగలా వచ్చెళ్లింది..
కింగ్ నాగార్జున, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సూపర్' సినిమాతో అయేషా టాకియా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా.. హీరోయిన్ ఆయేషా టకియా అందానికి సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. "తెలుగు ఇండస్ట్రీకి మరో క్రేజీ బ్యూటీ దొరికింది" అని అందరూ అనుకునేలోపే ఆమె టాలీవుడ్కు దూరమై బాలీవుడ్ బాట పట్టింది. ఆ సినిమా తర్వాత ఆయేషా మరో తెలుగు సినిమాలో నటించలేదు.
పెళ్లి..మత మార్పిడి..సినిమాలకు స్వస్తి
హీరోయిన్గా కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే అయేషా టాకియా పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరమైంది. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అబూ అజ్మీ కొడుకు, వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీని హీరోయిన్ ఆయేషా టకియా వివాహం చేసుకుంది. ఫర్హాన్ను పెళ్లి చేసుకోవడం కోసం అయేషా..మత మార్పిడి కూడా చేసుకుంది. దాదాపు పదమూడేళ్లుగా ఆమె వెండితెరకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనిస్తోంది.
గుర్తుపట్టలేనంతగా మారిన రూపం
ప్రస్తుతం సోషల్ మీడియాలో అయేషా టాకియాకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'సూపర్' సినిమాలో ఎంతో ముద్దుగా, గ్లామరస్గా ఉన్న ఈ భామ.. ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ముఖ కవళికల్లో వచ్చిన మార్పులు చూసి ఆమె ఏవైనా సర్జరీలు చేయించుకుందా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తన చిరునవ్వుతో వెండితెరను ఏలిన ఈ డ్రీమ్ గర్ల్, ఇప్పుడు లైమ్ లైట్కు దూరంగా సామాన్య గృహిణిగా తన జీవితాన్ని గడుపుతోంది.
Also REad: IPL Auction 2026: ఐపీఎల్ 2026 వేలం పూర్తయ్యింది..ఐపీఎల్లో ఇప్పుడన్న డేంజరస్ టీమ్ ఏదో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kedi Movie Director Kiran Kumar Passed Away: తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)లో మరో విషాదం చోటుచేసుకుంది. అక్కినేని నాగార్జున నటించిన 'కేడీ' చిత్ర దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
సినిమా ప్రస్థానం
కిరణ్ కుమార్ కేవలం దర్శకుడిగానే కాకుండా, అంతకుముందు పలు చిత్రాలకు రచయితగా, సహాయ దర్శకుడిగా పనిచేశారు. 2010లో కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'కేడీ' సినిమాతో ఆయన దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా, కేడీ డైరెక్టర్ కిరణ్ కుమార్ వద్దనే పనిచేయడం గమనార్హం.
విడుదలకు సిద్ధంగా ఉన్న తదుపరి చిత్రం
చాలా కాలం విరామం తర్వాత డైరెక్టర్ కిరణ్ కుమార్ మళ్ళీ మెగా ఫోన్ పట్టారు. ఆయన డైరెక్షన్లో రూపొందిన ‘కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్’ (KJQ) అనే సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో సినిమా విడుదల చూడకుండానే ఆయన మరణించడం అభిమానులను, చిత్ర బృందాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది.
'కేడీ' డైరెక్టర్ కిరణ్ కుమార్ మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ నటులు, దర్శకులు నివాళులు అర్పించారు. సోషల్ మీడియా ఆయన ఫ్యాన్స్ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Also Read: IPL Auction 2026: ఐపీఎల్ 2026 వేలం పూర్తయ్యింది..ఐపీఎల్లో ఇప్పుడన్న డేంజరస్ టీమ్ ఏదో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bharat Taxi App Launch Date: కేంద్ర ప్రభుత్వం త్వరలోనే దేశీయ రవాణా రంగంలో అద్భుతమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రముఖ ప్రైవేట్ క్యాబ్ సంస్థలు ఉబర్తో పాటు ఓలాకు దీటుగా భారత్ ట్యాక్సీ (Bharat Taxi) యాప్ను తీసుకు రాబోతున్నట్లు తెస్తోంది. భారత ప్రజలకు కొత్త సంవత్సరం గిఫ్ట్గా దీని సేవలను జనవరి 1వ తేది నుంచి అందుబాటులో తీసుకు రాబోతున్నట్లు కేంద్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజు క్యాబ్లు వినియోగించే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది.
ప్రస్తుతం భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో క్యాబ్ సేవలు ప్రైవేటు కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. దీని కారణంగా కొన్ని కంపెనీలు డిమాండ్ను బట్టి చార్జీలను ఇష్టానుసారంగా పెంచుతూ వస్తున్నాయి. అలాగే రైడ్ క్యాన్సిలేషన్ ఫీజులతో పాటు డ్రైవర్ల ప్రవర్తన వంటి అంశాలపై ఇప్పటికి ప్రయాణికుల నుంచి ఎన్నో ఫిర్యాదు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతి సామాన్యుడు అతి తక్కువ ధరలోనే నగరాల్లో అన్ని ప్రదేశాలకు సురక్షితంగా ప్రయాణాన్ని అంచడమే లక్ష్యంగా చేసుకుని క్రేంద్రం ఈ యాప్ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కంపెనీ ప్రత్యేకమైన పనులను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా డ్రైవర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికీ భారత్లోని ప్రధాన నగరాల్లో భారత్ ట్యాక్సీ యాప్లో దాదాపు 56 వేల మంది డ్రైవర్లు పేర్లను నమోదు చేసినట్లు కేంద్రం అధికారికంగా వెల్లడించింది. అయితే, ప్రైవేటు కంపెనీతో పోలిస్తే.. ఈ యాప్లో డ్రైవర్ల నుంచి వసూలు చేసే కమిషన్ చాలా తక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని సమచారం.. అయితే, ఈ కమిషన్ తగ్గడం వల్ల డైవర్ల ఆదాయం భారీగా పెరుగుతుంది.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్లో అద్భుతమే!
ఈ భారత్ ట్యాక్సీ (Bharat Taxi) యాప్ వల్ల ప్రయాణికులకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రైవేట్ క్యాబ్లతో పోలిస్తే 16 నుంచి 25 శాతం వరకు తక్కువ ధరలకే ప్రయాణం చేయడానికి సాధ్యమవుతుందని సమాచారం.. అలాగే సర్జ్ ప్రైసింగ్ నుంచి కూడా చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఇది ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటంతో భద్రతా ప్రమాణాలను కూడా కఠినంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సేవలను ప్రారంభించబోతున్నట్లు కేంద్రం యోచిస్తోంది. ఆ తర్వాత దశలవారీగా దేశమంతటా విస్తరించే ఛాన్స్లు ఉన్నాయి.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్లో అద్భుతమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th Pay Commission DA Reset: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ పొందిన వారికి రాబోయే రోజుల్లో డియర్నెస్ రిలీఫ్ (DR), పెన్షన్ పెంపు వంటి ప్రయోజనాలు రావరంటూ ఇటీవలే సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. ఈ వార్త పెన్షనర్లలో తీవ్ర ఆందోళన కలిగించడం వల్ల ప్రభుత్వ అధికారిక వాస్తవ నిర్ధారణ సంస్థ PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) దీనిపై స్పందించింది.
ఏం జరిగింది?
ఆర్థిక చట్టం 2025 ప్రకారం.. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై కరువు భత్యం (DA/DR) పెంపు ఉండదని, అలాగే కొత్త వేతన సంఘం సిఫార్సుల ద్వారా వచ్చే ప్రయోజనాలను కూడా ప్రభుత్వం ఉపసంహరించనున్నట్లు ఇటీవలే ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ ఇదే..!
ఈ వైరల్ వార్తను సంపూర్ణంగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) తోసిపుచ్చింది. ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని స్పష్టం చేసింది. "ఆర్థిక చట్టం 2025 ప్రకారం.. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రయోజనాలు అందవనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. ప్రజలు ఇలాంటి వార్తలను నమ్మొద్దు, షేర్ చేయవద్దు" అని PIB ఫ్యాక్ట్ చెక్ X (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.
ఉద్యోగుల్లో గందరగోళానికి అసలు కారణం..
ఈ తప్పుడు ప్రచారం పెరగడానికి ప్రధాన కారణం CCS (పెన్షన్) రూల్స్, 2021లోని 37వ నిబంధనలో జరిగిన ఒక చిన్న మార్పు. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్లనే అందరికీ ఇది వర్తిస్తుందని భయపడుతున్నారు.
నిజానికి రూల్ 37 దేని గురించి చెబుతుంది?
ఇది కేవలం ప్రభుత్వ రంగ సంస్థల్లో (PSU) విలీనమైన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఒకవేళ సదరు ఉద్యోగి తీవ్రమైన దుష్ప్రవర్తన కారణంగా ఉద్యోగం నుండి తొలగిస్తే, అప్పుడు మాత్రమే వారి పెన్షన్ ప్రయోజనాలను కోల్పోతారు. ఇది సాధారణంగా పదవీ విరమణ చేసిన ఇతర ఏ పెన్షనర్కు వర్తించదు. పెన్షన్ లెక్కించే విధానంలో ఎలాంటి మార్పులూ జరగలేదు. ప్రభుత్వం ఎప్పుడూ పెన్షనర్ల ప్రయోజనాలను గౌరవిస్తుందని, పండుగలకు ముందు డీఆర్ (DR) ప్రకటించే సంప్రదాయం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. తప్పుడు వార్తలను చూసి ఆందోళన చెందకుండా, అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలని కోరారు.
Also Read: IPL Auction 2026: ఐపీఎల్ 2026 వేలం పూర్తయ్యింది..ఐపీఎల్లో ఇప్పుడన్న డేంజరస్ టీమ్ ఏదో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IPL 2026 Team Players List: ఐపీఎల్ 2026 సీజన్ కోసం మెగా వేలం ముగియడంతో, మొత్తం 10 జట్ల తుది ఆటగాళ్ల వివరాలు ఖరారయ్యాయి. ఈసారి చాలా మంది స్టార్ ఆటగాళ్లు కొత్త జట్లలోకి మారగా, పలువురు పాత జట్లకే రిటైన్ అయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్ వరకు అన్ని జట్ల ప్లేయర్ లిస్ట్, కెప్టెన్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)
కెప్టెన్: పాట్ కమిన్స్,
కీలక ఆటగాళ్లు: ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి.
ఇతర జాబితా: ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ, ఆర్. స్మరణ్, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కోర్సే, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్స్టోన్, శివమ్ మావి, జాక్ ఎడ్వర్డ్స్ తదితరులు.
2. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
కెప్టెన్: రజత్ పాటిదార్
కీలక ఆటగాళ్లు: విరాట్ కోహ్లి, జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్.
ఇతర ఆటగాళ్ల జాబితా: దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, యశ్ దయాల్, నువాన్ తుషార, సుయాష్ శర్మ, వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ, జోర్డాన్ కాక్స్.
3. ముంబై ఇండియన్స్ (MI)
ప్రధాన ఆటగాళ్లు: హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
ఇతర ఆటగాళ్ల జాబితా: తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, ర్యాన్ రికిల్టన్, రాబిన్ మింజే, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, అల్లా గఫాంజర్, శార్దూల్ ఠాకూర్, క్వింటన్ డి కాక్, దీపక్ చాహర్, మయాంక్ మార్కండే.
4. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
కెప్టెన్: రుతురాజ్ గైక్వాడ్
కీలక ఆటగాళ్లు: ఎం.ఎస్. ధోనీ, సంజూ శాంసన్, శివమ్ దూబే.
ఇతర ఆటగాళ్ల జాబితా: ఆయుష్ మ్హత్రే, డెవాల్డ్ బ్రీవిస్, ఉర్విల్ పటేల్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, శ్రేయాస్ గోపాల్, ముఖేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, సర్ఫరాజ్ ఖాన్, మాట్ హెన్రీ, రాహుల్ చాహర్.
5. లక్నో సూపర్జెయింట్స్ (LSG)
కెప్టెన్: రిషబ్ పంత్
కీలక ఆటగాళ్లు: నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, మహమ్మద్ షమీ.
ఇతర ఆటగాళ్ల జాబితా: అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని, ఐడెన్ మర్క్రామ్, మాథ్యూ బ్రిట్జ్కే, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, అవేశ్ ఖాన్, వనిందు హసరంగా, అన్రిచ్ నోకియా, అర్జున్ టెండూల్కర్, జోష్ ఇంగ్లిస్.
6. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
కీలక ఆటగాళ్లు: కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్.
ఇతర ఆటగాళ్ల జాబితా: నితీష్ రాణా, అభిషేక్ పోరెల్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, టి నటరాజన్, ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీ, పృథ్వీ షా, కైల్ జేమీసన్, లుంగీ ఎన్గిడి.
7. కోల్కతా నైట్ రైడర్స్ (KKR)
కీలక ఆటగాళ్లు: సునీల్ నరైన్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.
ఇతర ఆటగాళ్ల జాబితా: అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, రమణదీప్ సింగ్, రోవ్మన్ పావెల్, ఉమ్రాన్ మాలిక్, కామెరూన్ గ్రీన్, మతీషా పతిరాణ, రాహుల్ త్రిపాఠి, ముస్తాఫిజుర్ రెహమాన్, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్.
8. రాజస్థాన్ రాయల్స్ (RR)
కీలక ఆటగాళ్లు: యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్.
ఇతర ఆటగాళ్ల జాబితా: ధ్రువ్ జురెల్, ర్యాన్ పరాగ్, సందీప్ శర్మ, శుభమ్ దూబే, షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, సుశాంత్ మిశ్రా, ఆడమ్ మిల్నే, కుల్దీప్ సేన్.
9. గుజరాత్ టైటాన్స్ (GT)
కెప్టెన్: శుభమన్ గిల్
కీలక ఆటగాళ్లు: సాయి సుదర్శన్, జోస్ బట్లర్, మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్.
ఇతర ఆటగాళ్ల జాబితా: కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారూఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్, జాసన్ హోల్డర్.
10. పంజాబ్ కింగ్స్ (PBKS)
కెప్టెన్: శ్రేయాస్ అయ్యర్
కీలక ఆటగాళ్లు: అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, మార్కస్ స్టోయినిస్.
ఇతర ఆటగాళ్ల జాబితా: ప్రభాసిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్, నేహాల్ వధేరా, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, ముషీర్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, వైషాక్ విజయ్కుమార్, విష్ణు వినోద్.
Also Read: Bizarre News: నెలకు రూ.1.31 కోట్ల జీతం..కానీ జాబ్ను వదిలేస్తున్నాడు..కారణం తెలిస్తే ఇరగదీస్తారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Fatty Liver Healthy Drinks: కాలేయం దాని వ్యవస్థ మన శరీరంలోని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. దాని పనితీరు మందగిస్తే.. మనిషి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని మరణం సంభవించవచ్చు. ప్రస్తుత వివిధ ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందిలో కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోయి 'ఫ్యాటీ లివర్' సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యను దూరం చేసి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పచ్చి పసుపు ఒక అద్భుతమైన 'సూపర్ హెర్బ్'గా పనిచేస్తుంది.
పసుపులో ఉండే కర్కుమిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం కాలేయ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో కొన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం.
కాలేయానికి పచ్చి పసుపు కలిగించే ప్రయోజనాలు
1. కొవ్వును కరిగిస్తుంది: పసుపులోని కర్కుమిన్ కాలేయంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును (ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్) తగ్గించడంలో సాయపడుతుంది. ఇది లిపిడ్ జీవక్రియను మెరుగుపరచి, ఫ్యాటీ లివర్ లక్షణాలను నయం చేస్తుందట.
2. వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది: పసుపుకు సహజంగానే శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కాలేయ వాపును తగ్గించడమే కాకుండా, కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ను తటస్థీకరిస్తాయి.
3. కాలేయ ఎంజైమ్ల నియంత్రణ: కాలేయ ఆరోగ్య దెబ్బతిన్నప్పుడు పెరిగే ALT, AST వంటి ఎంజైమ్ల స్థాయిలను ఈ పసుపు నియంత్రణ చేస్తుంది. తద్వారా కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
4. సహజ నిర్విషీకరణ: పచ్చి పసుపు రక్తం నుండి విషతుల్యాలను తొలగించి, కాలేయాన్ని శుభ్రపరిచే సహజ క్లెన్సర్గా పనిచేస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది.
పచ్చి పసుపును ఎలా తీసుకోవాలి?
కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి పచ్చి పసుపు నీరు ఉత్తమ మార్గంగా ఉంది. ముందుగా పచ్చి పసుపు కొమ్మును తీసుకుని శుభ్రంగా కడిగి, చిన్న ముక్కగా నూరాలి లేదా తురమాలి. ఈ పసుపును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. రుచికోసం ఇందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకోవచ్చు. ఈ పానీయాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని ఆరోగ్య నివేదికల ద్వారా పేర్కొన్నాము. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: School Holiday: తల్లీదండ్రులకు ముఖ్యగమనిక..రేపు స్కూళ్లకు సెలవు..బయటకు వెళ్తే ప్రాణాలతో చెలగాటమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook