icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500030
RSRajesh SharmaFollow29 Jun 2024, 05:28 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Crocodile Attack: మొసలి కడుపులో బంగారపు ఉంగరాలు, 6 జతల బూట్లు..ఎంతమందిని మింగేసిందో తెలుసా?

Mookgophong, Northern Cape:

Crocodile Attack In South Africa: దక్షిణాఫ్రికాలో ఒళ్ళు గగుర్పొడిచే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి ఇప్పుడు మొసలికి ఆహారం అవ్వడం ప్రజలను నిర్ఘాంతపోయేలా చేస్తోంది. అతడు స్థానిక హోటల్ యజమానిగా గుర్తించగా.. ఇప్పుడాయన మొసలిగా ఆహారంగా మారాడు. దాదాపుగా 15 అడుగుల పొడవు సుమారు 1000 పౌండ్ల బరువున్న (అనగా 454 కిలోల బరువు) ఆ మొసలిని హెలికాప్టర్ ద్వారా తరలిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఏం జరిగిందంటే?
స్థానిక అధికారుల కథనం ప్రకారం.. 59 ఏళ్ల ప్రముఖ వ్యాపారవేత్త హోటల్ యజమాని గాబ్రియేల్ బాటిస్టా నది వంతెన దాటుతూ ఆ వరద నీటిలో కొట్టుకుపోయాడు. అతని జాడ కోసం ఎంత వెతికినా దొరకపోవడంతో నది ఒడ్డున ఓ మొసలి భారీగా ఉబ్బిన పొట్టతో కనిపించింది. ఆ భారీ మొసలిని అధికారులు గుర్తించిన తర్వాత బటిష్టాను ఆ ముసలి మింగేసి ఉండవచ్చు అంతా భావించారు. ఆ అనుమానంతో దాన్ని ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. హెలికాప్టర్ ద్వారా ఆ ముసలిని కట్టి బయటికి తీసుకురావడం పెద్ద సవాలుగా మారింది. కొద్దిసేపు తర్వాత హెలికాప్టర్ నుంచి తాడుతో మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. 

ఆ తర్వాత మొసలిని చంపి పొట్టను కోసి చూడగా అధికారులు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బాటిస్టా శరీర భాగాలు భావిస్తున్న ప్రక్కటెముకలు, రెండు చేతులు. మాంసం ముద్దలతో పాటు ఆయన వేలికి ఉన్న ఉంగరాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అందరు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే. ఆ ముసలి కడుపులో ఏకంగా ఆరు జతల బూట్లు లభించాయి దీనిని బట్టి ఆ ముసలి గతంలో అనేక మందిని దాడి చేసి, మింగేసి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. దాదాపుగా 13 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. అయితే ఒక మనిషి తాలూకు నిర్లక్ష్యం అనగా వరదలో వంతెన దాటడాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఇప్పుడు ప్రాణాలు తీసే ప్రమాదంగా మారిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అలాంటి సాహస కృత్యం ద్వారా మొసలికి ఆహారంగా మారాడని చెబుతున్నారు. మరికొందరు మాత్రం మొసలి ఎంతో మందిని మింగేసింది అని అభిప్రాయపడ్డారు.

Also Read: Vijay Trisha Age Gap: త్వరలోనే హీరో విజయ్-త్రిషల పెళ్లి?! వీళ్లిద్దరి మధ్య వయసు గ్యాప్ ఎంత ఉందంటే?

ALso Read: Bank Strike 2026: బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..ఈ పనులు వెంటనే పూర్తి చేసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Vijay Trisha Age Gap: త్వరలోనే హీరో విజయ్-త్రిషల పెళ్లి?! వీళ్లిద్దరి మధ్య వయసు గ్యాప్ ఎంత ఉందంటే?

Hyderabad, Telangana:

Vijay Trisha Age Difference: ఇటీవలే జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సినీ నటుడు విజయ్ స్థాపించిన పార్టీ స్థాపించింది. తమిళ వెట్రి కజగం పేరిట స్థాపించిన ఈ రాజకీయ పార్టీతో పాటు ఆయన పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. సోషల్ మీడియా వేదిక దగ్గర నుంచి జాతీయ స్థాయి వార్తా ఛానళ్లలో తమిళనాడు విజయ్ పార్టీ సంచలనంగా మారింది. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఇప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. హీరోయిన్ త్రిష‌తో విజయ్ ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే చాలా రకాల వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అయితే విజయ్ ఇటీవలే తన భార్య సంగీతకు విడాకులు కోరగా.. ఆమె విడిపోవడానికి ఓ హీరోయిన్ కారణం అంటూ వచ్చిన రూమర్లతో హీరో విజయ్, త్రిషల మధ్య కచ్చితంగా రిలేషన్ ఉందంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. దీంతో తలపతి విజయ్, త్రిష కృష్ణన్‌లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. తలపతి విజయ్ రాజకీయ విజయాన్ని నటి త్రిష కూడా జరుపుకోవడం ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తలపతి విజయ్, త్రిష కృష్ణన్‌లు డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ జంట గురించి అన్నిచోట్లా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వీటన్నిటి మధ్య టీవీకే విజయ్, హీరో త్రిషా కృష్ణన్ మధ్య ఉన్న వయసు వ్యత్యాసం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య చాలా వయసు వ్యత్యాసం ఉందని చెబుతున్నారు. 

టీవీకే విజయ్ 1974 జూన్ 22న జన్మించారు. దీని ప్రకారం.. తలపతి విజయ్ ప్రస్తుత వయస్సు 51 ఏళ్లు. సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో ఫేమస్ అయిన విజయ్.. ఇప్పుడు నటనకు గుడ్‌బై చెప్పి.. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ విధంగా తమిళ వెట్రి కజగం పార్టీని స్థాపించి మొదటి ఎన్నికలోనే అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నారు. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సీట్లను గెలుపొందడంలో విజయం సాధించలేకపోయారు.  

మరోవైపు నటి త్రిషా కృష్ణన్ విషయానికి వస్తే.. ఆమె 1983 మే 4న జన్మించా, రు. దీని ప్రకారం.. త్రిషా కృష్ణన్ ప్రస్తుత వయస్సు 43 ఏళ్లు. ఈ క్రమంలో త్రిష, తలపతి విజయ్ మధ్య 8 ఏళ్ల వ్యత్యాసం ఉంది. 

ప్రస్తుతంగా తలపతి విజయ్ వ్యక్తిగత జీవితం నిరంతరం చర్చనీయాంశంగా ఉంది. తలపతి విజయ్, ఆయన మాజీ భార్య సంగీత మధ్య సంబంధంలో మనస్పర్థలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి పెళ్లి ఇప్పుడు విడాకుల బాట పట్టనుందని భావిస్తున్నారు. అయితే, దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఏది లభించలేదు.

విజయ్, త్రిషలు 2004లో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'గిల్లి' (ఒక్కడు సినిమా రీమేక్) సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు. ఈ చిత్రం విజయ్ కెరీర్‌ను తమిళ స్థాయి పెంచడమే కాకుండా.. చిత్ర పరిశ్రమకు ఒక సూపర్‌హిట్ జోడీని పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ జంట 'అప్పడి పోడు' పాటకు డ్యాన్స్ చేసి వార్తల్లో నిలుస్తున్నారు. ఆ తర్వాత విజయ్, త్రిషలు 'తిరుపాచి' (2005), 'అది' (2006), 'కురువి' (2008), లియో (2023) వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు.

Also Read: Bank Strike 2026: బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..ఈ పనులు వెంటనే పూర్తి చేసుకోండి!

Also Read: SRH Vs PBKS Preview: పంజాబ్ ప్లేఆఫ్స్‌కు వెళ్తుందా? హైదరబాద్ మరో విజయం సాధిస్తుందా? పంజాబ్ Vs హైదరాబాద్ ప్లేయింగ్ 11 ఇదే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Bank Strike 2026: బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..ఈ పనులు వెంటనే పూర్తి చేసుకోండి!

Hyderabad, Telangana:

SBI Bank Strike 2026 Update: భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమ్మెకు పిలుపునిచ్చింది. మే 25, 26 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు ప్రకటిచింది. అయితే మే 23 నాలుగో శనివారం.. మే 24న ఆదివారం కావడం వల్ల ఆ రెండు రోజులు కూడా బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ క్రమంలో మే 23 నుంచి మే 26 వరకు వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు క్లోజ్ కానున్నాయి.  

ఈ క్రమంలో దేశంలోనే 50 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఆయా నాలుగు రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగుల సంఘం సిబ్బంది కొరత, పెన్షన్లు, నియామకాలు, సేవా నిబంధనలకు సంబంధించి 16 డిమాండ్లను ముందుకు తెచ్చింది. అందువల్ల, ఈ నెల చివరి వారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలకు అంతరాయం కలగవచ్చు. 

బ్రాంచ్ సంబంధిత లావాదేవీల విషయంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే, ఏటీఎంలతో పాటు బ్యాంకుకు సంబంధించిన  అన్ని డిజిటల్ సేవలు పనిచేస్తాయని భావిస్తున్నారు. నగదు డిపాజిట్లు, విత్‌డ్రా, రుణాలకు సంబంధించిన బ్యాంక్ డ్రాఫ్ట్‌ల జారీ, భౌతిక పత్రాల పని వంటి సేవలు ప్రభావితం కావచ్చు.

ఎస్‌బిఐలోని ఉద్యోగుల సంఘం మొత్తం 16 డిమాండ్లను బహిర్గతం చేసింది. వాటిలో సహాయక సిబ్బంది నియామకాలను పెంచడం, భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచడం, వేతన వ్యత్యాసాలను తొలగించడం వంటి సమస్యలను వారు ప్రస్తావించారు. ఉద్యోగులకు వైద్య ప్రయోజనాలు, మొత్తం పని పరిస్థితులను మెరుగుపరచాలని కూడా వారు డిమాండ్లలో ప్రధానంగా కోరుతున్నారు.

పెన్షన్‌కు సంబంధించిన నిబంధనలలో మార్పులు చేయాలని కూడా ఎస్బీఐ ఉద్యోగలు సంఘం డిమాండ్ చేస్తోంది. NPS (జాతీయ పింఛను వ్యవస్థ) కింద మరింత సౌలభ్యం, మెరుగైన ప్రయోజనాలు కల్పించాలని వారు కోరారు. మెరుగైన కెరీర్ పురోగతి అవకాశాలు, పెన్షన్ లెక్కింపు పద్ధతులలో మార్పుల అవసరాన్ని వారు తెలియజేశారు. ఎంట్రీ-లెవల్ ఉద్యోగాల నియామకాలలో తగ్గుదలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకవేళ సమ్మె జరిగితే, బ్యాంక్ శాఖలు అందించే సేవల్లో వినియోగదారులు అంతరాయాలను ఎదుర్కోవచ్చు. నగదు లావాదేవీలు, చెక్ క్లియరెన్స్‌లు, డిమాండ్ డ్రాఫ్ట్ జారీ చేయడం వంటి ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు.

రుణాలకు సంబంధించిన పత్రాల పని కూడా ప్రభావితం కావచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ ఛానెళ్లు యథావిధిగా పనిచేయాల్సి ఉంది. అయితే, బ్యాకెండ్ ప్రాసెసింగ్‌లో మందకొడితనం కారణంగా కొన్ని లావాదేవీలలో జాప్యం జరగవచ్చు. అందువల్ల, అత్యవసరమైన బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తున్నారు. 

ఇవి SBI ఉద్యోగుల డిమాండ్లు అయినప్పటికీ, ఐదు రోజుల పని విధానానికి మారాలనే అత్యవసర డిమాండ్ బ్యాంకు ఉద్యోగులందరి నుండి కూడా బలంగా వినిపిస్తోంది. స్టాక్ మార్కెట్, RBI, కమోడిటీ మార్కెట్, అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల వంటి ఆర్థిక రంగానికి సంబంధించిన మిగిలిన విభాగాలు శని, ఆదివారాల్లో మూతపడనుండగా.. మిగిలిన మొదటి, మూడో శనివారాల్లో బ్యాంకులు మాత్రం ఎందుకు తెరిచి ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Rajasthan Royals Sold: నక్క తోక తొక్కిన రాజస్థాన్ రాయల్స్ ఓనర్..రూ.15,660 కోట్లకు ఐపీఎల్ జట్టు అమ్మకం!

Also Read: PM Kisan 23rd Installment: ఒకే ఇంట్లో ఇద్దరికి రైతు భరోసా ఇస్తారా? ఏడాది రూ.12,000 పొందాలంటే ఏం చేయాలి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

SRH Vs PBKS Preview: పంజాబ్ ప్లేఆఫ్స్‌కు వెళ్తుందా? హైదరబాద్ మరో విజయం సాధిస్తుందా? పంజాబ్ Vs హైదరాబాద్ ప్లేయింగ్ 11 ఇదే?

Hyderabad, Telangana:

SRH Vs PBKS Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఆతిథ్య సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో పంజాబ్ కింగ్స్ టీమ్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌ లో బ్యాటర్లుకు అనుగుణంగా.. భారీ స్కోరు చేసేందుకు వీలుగా అద్భుతమైన బ్యాటింగ్ పిచ్‌ను అందిస్తుందని అంచనా.

గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన పోరులో 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌట్ అయి, ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన సన్‌రైజర్స్ జట్టుకు షాక్ తగిలింది. ఆడిన 10 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌ల్లో గెలిచిన సన్‌రైజర్స్.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గత సీజన్ రన్నరప్ అయిన పంజాబ్ కింగ్స్.. ప్రస్తుత లీగ్‌లో ఆడిన 9 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌ల్లో గెలిచి, ఈ ఏడాది టైటిల్ రేసులో బలమైన పోటీదారుగా ఉంది. అంతే కాకుండా పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. జట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవడానికి, ఈ ఓటముల పరంపరకు బ్రేక్ వేయాలని ఆ జట్టు చూస్తోంది.

ఐపీఎల్ లీగ్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 25 మ్యాచ్‌లు జరిగ్గా.. అందులో హైదరాబాద్ 17 సార్లు నెగ్గగా.. పంజాబ్ జట్టు 8 సార్లు విజయం సాధించింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం అద్భుతమైన బ్యాటింగ్ పిచ్ రెడీ చేస్తున్నారని భావిస్తున్నారు. అదే నిజమైతే ఈ మ్యాచ్‌లో బౌండరీల వరద పారే అవకాశం ఉంది. ఇరు జట్లకు బ్యాటింగ్ లైనప్ బాగున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారీగా స్కోర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు అంచనా.. 
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్.

పంజాబ్ కింగ్స్ తుదిజట్టు అంచనా..
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్. 

Also Read: Rajasthan Royals Sold: నక్క తోక తొక్కిన రాజస్థాన్ రాయల్స్ ఓనర్..రూ.15,660 కోట్లకు ఐపీఎల్ జట్టు అమ్మకం!

Also Read: Pant 2027 World Cup: రిషబ్‌ పంత్‌కు బీసీసీఐ షాక్..వన్డే ప్రపంచకప్ టీమ్‌ నుంచి పంత్ ఔట్! అతని స్థానంలో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Union Cabinet: తెలంగాణ, ఏపీకి కేంద్రం భారీ శుభవార్త.. మంత్రివర్గంలో కీలక నిర్ణయం

Wadgaon, Maharashtra:

Indian Railways: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. రైల్వే వ్యవస్థను మరింత చేరువ చేసేందుకు కొన్ని ప్రాజెక్టులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థను విస్తరించడంలో భాగంగా తెలంగాణ, ఏపీ మీదుగా పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారత రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేలా రూ.23,437 కోట్ల అంచనా వ్యయంతో 3 కీలక ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది.

Also Read: TVK Success Secret: తమిళనాడులో టీవీకే విజయ్‌ సునామీ వెనుక ఒకే ఒక్కడు.. ఎవరాయన?

న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ), భారత రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేలా రూ.23,437 కోట్ల అంచనా వ్యయంతో 3 కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆ ప్రాజెక్టుల్లో తెలంగాణ, ఏపీకి భారీ ప్రయోజనం లభించనుంది.

ప్రాజెక్టుల వివరాలు
ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 901 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు (3వ, 4వ లైన్లు) నిర్మించబడతాయి.

==> గుంతకల్ - వాడి (3వ , 4వ లైన్): ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా సాగుతుంది.
==> నాగ్దా - మథుర (3వ , 4వ లైన్): మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది.
==> బుర్హ్వాల్ - సీతాపూర్ (3వ, 4వ లైన్): ఉత్తరప్రదేశ్‌లో రద్దీని తగ్గిస్తుంది.

Also Read: Election Results 2026: ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అంటే?

గణాంకాలు
మొత్తం ఖర్చు: రూ.23,437 కోట్లు
గడువు: 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం

ప్రయోజనం పొందే ప్రాంతాలు: 6 రాష్ట్రాల్లోని 19 జిల్లాలు, 4,161 గ్రామాలు, సుమారు 83 లక్షల జనాభాకు మేలు జరుగుతుంది.
సరుకు రవాణా: ఏడాదికి అదనంగా 60 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది.

ఈ మూడు ప్రాజెక్టులతో పారిశ్రామిక వృద్ధి కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బొగ్గు, ఆహార ధాన్యాలు, సిమెంట్, ఇనుము వంటి వస్తువుల రవాణా వేగవంతం అవుతుంది. అంతేకాకుండా పర్యాటక రంగానికి ఊతమిచ్చింది. మంత్రాలయం (రాఘవేంద్ర స్వామి మఠం), కాసాపురం ఆంజనేయ స్వామి ఆలయం, మథుర, బృందావనం, మహాకాళేశ్వర్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రైల్వే రవాణా పెరగడంతో సుమారు 37 కోట్ల లీటర్ల చమురు దిగుమతి తగ్గుతుంది. 185 కోట్ల కిలోల కార్బన్‌డైయాక్సైడ్‌ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది కనుక తగ్గితే 7 కోట్ల మొక్కలు నాటడంతో సమానం.

పీఎం-గతి శక్తిలో భాగంగా ఈ ప్రాజెక్టులు రూపొందించారు. 'పీఎం-గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్' కింద కేంద్ర ప్రభుత్వం రూపొందించింది.  ఇది సమగ్ర మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడుతుంది. ఈ మల్టీట్రాకింగ్ పనులతో రైళ్ల రాకపోకల్లో జాప్యం తగ్గి ప్రయాణికులకు, వ్యాపారస్తులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Proddutur Murder Case: భార్య లావుగా ఉందని దారుణం.. పాలకోవాలో విషం కలిపి, కిల్లర్ భర్త వేసిన స్కెచ్ వింటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Hyderabad, Telangana:

Husband killed Wife For Being Fat In Proddutur: యూట్యూబ్‌లో హత్య చేయడం ఎలా అని సెర్చ్ చేశాడు.. జవాబు దొరికిన వెంటనే రూ.80 పెట్టి మరీ హైదరాబాద్ నుంచి విషం కొనుగోలు చేశాడు. చివరికి ఆ భార్యకు ఇష్టమైన పాలకోవా లోనే ఆ విషాన్ని కలిపి ఇచ్చాడు. ప్రొద్దుటూరులో వెలుగు చూసిన ఈ కిరాతక భర్త ఉదాంతం వింటే ఒళ్ళు గగుర్పాటుస్తోంది. అసలు భార్యాభర్తల పై ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. యూట్యూబ్ క్రైమ్ స్కెచ్ ఫాలో అయ్యి పాలకోవాలో విషం కలిపి మరి మర్డర్ చేశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇతడు చేసిన దారుణ ఘటన వైరల్‌ అవుతోంది. పోలీసుల ప్రకారం కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉండే కిరణ్ కుమార్, పద్మజా దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ప్రధానంగా పద్మజ లావుగా ఉందన్న సాకుతో ఆమెను వదిలించుకోవడానికి కిరణ్ ప్లాన్ వేశాడు. అందుకే ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను మించిన ప్లాన్ వేశాడు. దీనికి యూట్యూబ్ ని ఆసరాగా చేసుకున్నాడు. గంటలకొద్దీ ఎలా మర్డర్ చేయాలా అని సెర్చ్ చేశాడు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రూ.80 వేలు పెట్టు మరీ కొరియర్ ద్వారా విషాన్ని తెప్పించుకున్నాడు. అంతే కాదు తన భార్యకు ఇష్టమైన పాలకోవాలోనే ఆ విషం కలిపి తినిపించాడు. చివరికి ఆమె అపస్మారక స్థితిలో వెళ్లిపోయినా.. చనిపోయిందా? లేదా? అని నిర్ధరించుకోవడానికి దిండుతో ఆమె ముఖంపై అదిమి మరీ చంపేశాడు.

Also Read: తీర్పులు ఇచ్చే చేతులే ప్రాణాలు తీసుకున్నాయి.. జడ్జి అమన్ కుమార్ శర్మ సూసైడ్ మిస్టరీ!

Also Read: బర్గి డ్యామ్‌లో ఘోర ప్రమాదం.. 30 మందితో వెళ్తున్న క్రూయిజ్ బోల్తా.. ఏడుగురి మృతదేహాల వెలికితీత!

 హత్య తర్వాత ఆమె గుండెపోటుతో చనిపోయిందని అందరినీ నమ్మబలికాడు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పద్మజ చనిపోయిన వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా పోలీసులకు కిరణ్ కుమార్‌ను కూడా విచారించారు. ఇక ఎట్టకేలకు నిందితుడు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు. తన భార్య లావుగా ఉందని.. తనను తరచూ అనుమానిస్తుందనే కారణంతోనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం రిమాండ్‌కు తరలించారు. కేవలం భార్య లావుగా ఉందని ఇలాంటి దారుణ ఘటనకు ఒడిగట్టాడు. రాను రాను భార్య భర్తల మధ్య సంబంధాలు దారుణంగా మారిపోతున్నాయి. ఈ భర్త వేసిన ప్లాన్ చూస్తే ఒళ్ళు గగ్గురుపొడుస్తోంది. అసలు భార్యాభర్తల మధ్య నమ్మకమే పోతుంది. అయితే వీళ్లు చేసిన దారుణాల వల్ల అనాథలుగా పిల్లలు మారుతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

AP POLYCET 2026: ఏపీ పాలిసెట్‌ 2026 ఫలితాలు విడుదల.. నిమిషాల్లో రిజల్ట్స్ చూసుకోండిలా! డైరెక్ట్ లింక్ ఇదే!

Hyderabad, Telangana:

AP POLYCET 2026 Results Announced:ఎట్టకేలకు ఏపీ పాలిసెట్ 2026 సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు ఉదయం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదల చేసింది. పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన అభ్యర్థులు వెంటనే స్కోరు కార్డ్స్ కూడా ఆన్‌లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈరోజు ఉదయం మంత్రి లోకేష్ 10 గంటల సమయంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్ https://polycetap.ap.gov.in/Default.aspx నుంచి ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వివిధ రకాల పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి గాను ఈ పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

 

0
0
Report

Election Results 2026: ఎన్నికల కౌంటింగ్ పూర్తి.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అంటే?

Wadgaon, Maharashtra:

TN And WB Election Results: భారతదేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిశాయి. దాదాపుగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తమిళనాడు, కేరళం, పశ్చిమబెంగాల్‌, పుదుచ్చేరి, అస్సాంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పూర్తి స్పష్టత వచ్చింది. పశ్చిమబెంగాల్‌, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారాన్ని కైవసం చేసుకోగా.. తమిళనాడులో నటుడు విజయ్‌ స్థాపించిన టీవీకే పార్టీ చారిత్రాత్మక విజయం సాధించింది. ఇక కేరళంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి అధికారాన్ని సొంతం చేసుకుంది.

Also Read: Narendra Modi: ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం: నరేంద్ర మోదీ

పశ్చిమబెంగాల్‌
మొత్తం స్థానాలు: 293, మ్యాజిక్‌ ఫిగర్‌: 148
తృణమూల్‌ కాంగ్రెస్‌: 77
బీజేపీ: 211
కాంగ్రెస్‌: 2
ఇతరులు: 3

తమిళనాడు
మొత్తం సీట్లు : 234, మ్యాజిక్ ఫిగర్ : 118
టీవీకే పార్టీ: 106
డీఎంకే కూటమి: 74
ఏఐడీఎంకే పార్టీ కూటమి: 51

కేరళం
మొత్తం సీట్లు : 140, మ్యాజిక్ ఫిగర్ : 71
యూడీఎఫ్‌: 102
ఎల్‌డీఎఫ్‌: 35
బీజేపీ: 3

Also Read: Pawan Kalyan: టీవీకే విజయ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రశంసలు.. బీజేపీ గెలుపుపై హర్షం

అస్సాం
మొత్తం సీట్లు : 126, మ్యాజిక్ ఫిగర్ : 64
బీజేపీ కూటమి: 102
కాంగ్రెస్‌ కూటమి: 21
ఇతరులు : 3

పుదుచ్చేరి
మొత్తం సీట్లు : 30 మ్యాజిక్ ఫిగర్ : 16
ఎన్నార్‌ కాంగ్రెస్‌, బీజేపీ కూటమి: 18
కాంగ్రెస్‌ కూటమి: 6
టీవీకే కూటమి: 3
ఇతరులు: 3

తమిళనాడులో ఎవరికి ఎన్ని ఓట్లు?
విజయ్‌ టీవీకే పార్టీ: 1.28 కోట్లు
డీఎంకే కూటమి: 1.17 కోట్లు
డీఎంకే పార్టీ ఒంటరిగా సాధించిన ఓట్లు: 83 లక్షలు
ఏఐఏడీఎంకే కూటమి: ఓట్లు 1.08 కోట్లు
ఒంటరిగా ఏఐఏడీఎం సాధించిన ఓట్లు: 77 లక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Narendra Modi: ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం: నరేంద్ర మోదీ

New Delhi, Delhi:

PM Modi Winning Speech: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన విజయంగా తెలిపారు. పశ్చిమబెంగాల్‌లో ప్రజాశక్తి గెలిచింది. బీజేపీని గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. బెంగాల్‌ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నా' అని ప్రధాని మోదీ తెలిపారు.

Also Read: Pawan Kalyan: టీవీకే విజయ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రశంసలు.. బీజేపీ గెలుపుపై హర్షం

'ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి వంటిదని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఐదు రాష్ట్రాల ప్రజలు రాజ్యాంగాన్ని గెలిపించారు. గంగోత్రి నుంచి గంగాసాగర్‌ వరకు కమలం వికసించింది' అని ప్రధాని మోదీ తెలిపారు. 'బీజేపీ కార్యకర్తల సుదీర్ఘ కల, శ్రమ ఫలించింది. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. నితిన్‌ నబీన్‌ పార్టీ అధ్యక్షుడు అయ్యాక జరిగిన తొలి ఎన్నిక ఇది. బెంగాల్‌లోనూ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్ ప్రవేశించింది. బెంగాల్‌ ఓటర్లు కొత్త రికార్డు సృష్టించారు' అని నరేంద్ర మోదీ తెలిపారు. హింస రాజకీయాల నుంచి బెంగాల్ ప్రజలు విముక్తి కోరుకున్నారని చెప్పారు. హింస రాజకీయాలకు బెంగాల్ ప్రజలు స్వస్తి చెప్పారని పరోక్షంగా టీఎంసీ పాలనపై విమర్శలు చేశారు.

ఈ ఎన్నికల ఫలితాలతో దేశంలో బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ‍ప్రజలు గుర్తించారని ప్రధాని మోదీ చెప్పారు. ఈ రోజు భారతదేశానికి, బీజేపీకి ఎంతో చారిత్రాత్మకమైన రోజు అని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజలకు నిజమైన భరోసా కల్పించాల్సిన రోజు అని తెలిపారు. బీజేపీ విజయంలో అధ్యక్షుడు నితిన్ నబీన్‌ కీలక పాత్ర పోషించారని ప్రశంసలు కురిపించారు. బీజేపీ కార్యకర్తలు చేసిన కృషి, పోరాటాలు లేకుండా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన రికార్డు విజయం సాధ్యమయ్యేది కాదని పార్టీ శ్రేణుల సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. 

'అస్సాం విజయం అభివృద్ధికి, ప్రజల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడానికి ఎన్డీయే కూటమి ఇస్తున్న ప్రాధాన్యాలకు ప్రజల అచంచలమైన మద్దతుకు నిదర్శనం' అని అస్సాం ఫలితాలపై ప్రధాన మోదీ తెలిపారు. అన్ని రకాల ప్రతికూలతలను అధిగమించి అస్సాంలో అభివృద్ధి అజెండా గురించి ప్రజలకు వివరించారని.. దాని ఫలితంగానే మరోసారి విజయం అని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Pawan Kalyan: టీవీకే విజయ్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రశంసలు.. బీజేపీ గెలుపుపై హర్షం

Nuzendla, Andhra Pradesh:

Pawan Kalyan Congrats To TVK Vijay: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భారతదేశ రాజకీయాలను సరికొత్త మలుపు తిప్పాయి. బీజేపీ భారీ విజయం సాధించగా.. కేరళంలో కాంగ్రెస్‌, తమిళనాడులో టీవీకే పార్టీ విజయ ధుందుబి మోగించాయి. రాజకీయాల్లో సరికొత్త కోణాన్ని చూపిన ఈ ఎన్నికల ఫలితాలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. టీవీకే విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: SRH vs KKR: సన్‌రైజర్స్‌ విజయ యాత్రకు బ్రేక్‌.. ఊపిరి పీల్చుకున్న కలకత్తా నైట్‌రైడర్స్‌

'ఓటర్ల చైతన్యం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలలో మరోసారి స్పష్టంగా కనిపిస్తోంది. పాలన నచ్చితే మళ్లీ మళ్లీ గెలిపిస్తారు. నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా ఓడిస్తారనడానికి ఈ ఫలితాలే చక్కటి ఉదాహరణ. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పును బలంగా కోరుకున్నారు. ఆ మార్పును తమ తీర్పు ద్వారా బలంగా చెప్పారు' అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పవన్‌ కల్యాణ్‌ ప్రకటన విడుదల చేశారు.

Also Read: Heavy Rain: నల్లగొండలో దంచికొట్టిన వాన బీభత్సం.. నేలకూలిన చెట్లు

అస్సోం, పుదుచ్చేరిలో తమ ప్రాభవాన్ని నిలబెట్టుకుని పశ్చిమ బెంగాల్ ప్రజల మనసును గెలుచుకున్న బీజేపీని అగ్ర నాయకత్వం అకుంఠిత దీక్ష సర్వదా శ్లాఘనీయం. పశ్చిమ బెంగాల్‌వాసుల నమ్మకాన్ని ప్రోది చేసుకోడానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చింది' అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 'నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిర్దేశకత్వంలో రాష్ట్రంలో బీజేపీ పాలన ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే పశ్చిమ బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందనే గట్టి విశ్వాసంతో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు' అని వివరించారు.

Also Read: Tamil Nadu Results: తమిళనాడులో హోరాహోరీ.. రేపటి ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ

ఈ సందర్భంగా నరేంద్ర మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్, సువేందు అధికారికి విజయంలో భాగస్వాములైన బీజేపీ నాయకత్వానికి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ అభినందనలు తెలిపారు. అస్సాం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి మరోమారు విజయాన్ని దక్కించుకున్న హిమంత బిశ్వశర్మకు, పుదుచ్చేరిలో ఎన్‌డీఏ కూటమికి విజయాన్ని మళ్లీ అందించిన రంగసామిని అభినందించారు. 'తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రజలు మార్పును స్పష్టంగా కోరుకున్నారు. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి అధిక  స్థానాలను అందించి సింహభాగం ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారు. పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే చక్కటి విజయాన్ని సాధించిన విజయ్‌ను మనసారా అభినందిస్తున్నా' అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. 'ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి పోరాటం బలమైనదే. కేరళంలో కూడా మార్పునే మెజారిటీ ఓటర్లు కోరుకున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన యూడీఎఫ్‌ నాయకత్వానికి అభినందనలు. ఈ ఎన్నికల పోరాటంలో నిలిచి గెలిచిన విజేతలందరికీ పేరుపేరునా శుభాభినందనలు' అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Lucky Zodiac Signs: జూన్ 29 వరకు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ధనవర్షం ఖాయం!

Hyderabad, Telangana:

Astrology Predictions May-June 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. దాదాపు 60 రోజుల తర్వాత పలు గ్రహాలు అద్భుతమైన మార్పులు చేయబోతున్నాయి. ముఖ్యంగా మే 2 నుంచి ప్రారంభమై జూన్ 29 వరకు అద్భుతమైన కాలం కొనసాగబోతోంది. ఈ సమయం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా మారబోతోంది. ముఖ్యంగా సూర్యుడు, అంగారకుడితో బుధుడు కలయిక జరపడం వల్ల ఆయా రాశులవారికి చాలా బాగుంటుంది. అలాగే ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన బుధాదిత్య, మంగళాదిత్య రాజయోగాలు కూడా ఏర్పడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభించి.. ఆయా రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అంతేకాకుండా ఐదు రాశులవారికి ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది. 

ఈ రాశులవారికి అంతా శుభం..
మేష రాశి
శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల మేష రాశివారికి కెరీర్‌ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు ఈ సమయంలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. పాత బాకీల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా లభిస్తాయి.

వృషభ రాశి
ఈ సమయంలో ఏర్పడే బుధాదిత్య, మంగళాదిత్య రాజయోగాల ప్రభావంతో వృషభ రాశివారికి సువర్ణ అవకాశంగా మారుతుంది. అలాగే గురు గ్రహం ప్రభావంతో తండ్రి నుంచి భారీ మొత్తంలో ఆస్తులు కూడా పొందుతారు. దీంతో పాటు వివాహాలు కానివారికి ఈ సమయంలో మంచి మంచి పెళ్లి సంబంధాలు కూడా వస్తాయి. అలాగే సమాజంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది.

సింహ రాశి
సింహ రాశివారికి పరిపాలన, రాజకీయ రంగాల్లో ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా మారుతుంది. అంతేకాకుండా పదోన్నతులు లభించడమే కాకుండా.. అధికార బలంతో శత్రువులపై ఊహించని విజయాలు కూడా సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. 

తుల రాశి
బుధాదిత్య, మంగళాదిత్య రాజయోగాల ఎఫెక్ట్‌తో వృత్తిపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన ఫలితాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి జీవితంలో కొత్త జీవిత భాగస్వామి పరిచయం కూడా అవుతుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Samsung Galaxy S27: సామ్‌సంగ్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. 6 ఏళ్ల తర్వాత మారనున్న గెలాక్సీ S27 డిజైన్!

Hyderabad, Telangana:

Samsung Galaxy S27 Design Leaks: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న సామ్‌సంగ్ కంపెనీ ప్రతి ఏడాది అద్భుతమైన మొబైల్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ఇదిలా ఉంటే తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గెలాక్సీ S డిజైన్‌లో త్వరలోనే కొన్ని కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆరు సంవత్సరాల తర్వాత సాంసంగ్‌ కంపెనీ త్వరలో రాబోయే గెలాక్సీ S27 సిరీస్‌తో అద్భుతమైన మార్పులు చేయబోతున్నట్లు వార్తలు వస్తాయి. అంతేకాకుండా ఈ సిరీస్‌కి సంబంధించిన కొన్ని ఫోటోస్‌ కూడా ఇటీవలే సోషల్ మీడియాల్లో లీక్‌ అయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ సీరీస్‌ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గెలాక్సీ S27 సిరీస్‌లో అత్యంత కీలకమైన వెనక భాగంలో ఊహించని మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఫ్లోటింగ్ లెన్స్ బైబై చెబుతూ..సామ్‌సంగ్ ఈసారి హారిజాంటల్ కెమెరా ఐలాండ్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చూడడానికి అచ్చం.. గూగుల్ పిక్సెల్ (Google Pixel) ఫోన్ల కెమెరా మాడ్యూల్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ డిజైన్ మార్పు ఫోన్‌కు మరింత గుర్తింపు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

మాగ్నెటిక్ యాక్సెసరీస్ (Magnetic Accessories) సదుపాయాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి డిజైన్‌లో మార్పులు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ టెక్నాలజీని మరింత అద్భుతంగా మెరుగుపరిచేందుకు ఈ డిజైన్‌ను తీసుకు రాబోతోంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో మాగ్నెటిక్ కాయిల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. లీకైన కాన్సెప్ట్ చిత్రాల్లో కెమెరా ఐలాండ్‌లో మూడు కెమెరా సెన్సార్లు ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా అల్ట్రా  మోడల్స్‌లో నాలుగు కెమెరాలు ఉండే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

ఒకవేళ సామ్‌సంగ్ కంపెనీ ఇదే డిజైన్‌ను ఫైనల్ చేస్తే.. నాలుగు కెమెరాలను ఆ ఐలాండ్‌లో ఎలా పెడతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, కంపెనీ దీనిపై ఇప్పటికీ ఎలాంటి అధికారక ప్రకటన కూడా చేయలేదు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటనతో పాటు ఇతర అన్ని వివరాలను కూడా వెల్లడించే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ డిజైన్‌ సిరీస్‌ విడుదలైతే.. అద్భుతంగా సక్సెస్‌ అవుతుంది. 

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Car Deals: రూ.6 లక్షలకే టాటా ఆల్ట్రోజ్? కార్లు కొనుగోలుకు ఇదే బెస్ట్ ఛాన్స్!

Hyderabad, Telangana:

Best Second-Hand Car Deals Latest News: సెకండ్ హ్యాండ్ కార్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో లభించి మల్టీ నేషనల్ బ్రాండ్‌ కార్లు ఢిల్లీలో అత్యంత చీప్‌ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని రోహిణిలో ఉన్న కొన్ని సెకండ్‌ హ్యాండ్‌ మోటర్ షోరూమ్స్‌లో సగం ధరలకే లభిస్తున్నాయి. కాబట్టి చాలా మంది మిడిల్‌ క్లాస్‌ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇక్కడ ఏయే కార్లపై ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రోహిణిలో ఉన్న కారు షోరూమ్స్‌లో చిన్న తరహా హ్యాచ్‌బ్యాక్ కార్ల నుంచి ప్రీమియం SUVల వరకు అన్ని రకాల కార్లు అత్యంత చౌకవ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా టాటా హారియర్, హోండా అమేజ్, టయోటా గ్లాంజా వంటి ప్రముఖ బ్రాండ్లను సంబంధించిన కార్లు ఇక్కడ సగం కంపెనీ తక్కువ ధరలో అందుబాటులో ఉండడం విశేషం.. ఇక్కడున్న సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌లో 2020 మోడల్ టాటా హారియర్ ఎక్స్‌టి మాన్యువల్ డీజిల్ కార్లను కేవలం రూ. 8.5 లక్షలకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా 2023 మోడల్ టాటా ఆల్ట్రోజ్ కారును రూ. 6.5 లక్షలకే అందుబాటులో ఉన్నాయి. 

అయితే, ఇక్కడ కార్లను అత్యంత చీప్‌ ధరలకే అందించడమే కాకుండా పలు రకాల అదనపు సౌకర్యాలు కూడా సంస్థ అందిస్తూ వస్తోంది. ఇక్కడ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలనుకునేవారికి ప్యాన్ ఇండియా లోన్ సపోర్ట్‌ కూడా అందిస్తున్నారు. అలాగే కార్ల కొనుగోలు తర్వాత చేయాల్సిన ఆర్సీ (RC) ట్రాన్స్‌ఫర్ బాధ్యతను కూడా వారే తీసుకుని అన్ని క్లీయర్‌గా కొనుగోలు చేసేవారికి సర్వీసులు అందిస్తున్నారు. అదేవిధంగా ప్రతి వాహనానికి సంబంధించిన అప్‌డేటెడ్ సర్వీస్ రికార్డులను అందించడం విశేషం..

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలనుకునేవారు.. ఈ కార్లను నేరుగా వీడియో కాల్‌ ద్వారా పరిశీలించే సదుపాయం కూడా అందిస్తున్నారు. అలాగే ఇక్కడ కార్లను కొనుగోలు చేసినవారికి ప్రత్యేకమైన Transportation సపోర్ట్‌ కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు వివిధ సదుపాయాలను కూడా అందిస్తున్నారు. కాబట్టి చీప్‌ ధరల్లోనే మంచి కార్లను కొనుగోలు చేయాలనుకునేవారు రోహిణి సెక్టార్ 6, బి-2373 వద్ద ఉన్న షోరూమ్స్‌ను సందర్శించవచ్చు..

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Chalisa Yoga: ఒకేసారి చాలీసా యోగం, బుధాదిత్య యోగం.. ఈ రాశులవారికి ఇక పండగే!

Hyderabad, Telangana:

Mercury-Venus Conjunction Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో రెండు గ్రహాల కలయికకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాల కలయికను సంయోగంగా పిలుస్తారు. ఇదిలా ఉంటే మే 4వ తేదిన బుధతో పాటు శుక్ర గ్రహాల కలయికతో అరుదైన యోగం ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన చాలీసా యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది..

బుధ, శుక్ర గ్రహాల కలయికతో అరుదైన చాలీసా యోగంతో పాటు బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ఆయా రాశులవారికి అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా నాలుగు రాశుల్లో జన్మించివారికి జీవితంలో అద్భుతమైన సంపాదన కూడా లభిస్తోంది. ఈ కింది రాశులవారికి తెలివితేటలు, సంభాషణ నైపుణ్యాలతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాల పరంగా అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన మార్పులు కూడా లభిస్తాయి. అయితే, ఈసమయం నాలుగు రాశులవారికి స్వర్ణయుగంలా మారుతుంది. 

మేష రాశి
చాలీసా యోగంతో మేష రాశివారికి ఈ సమయంలో అనేక రకాల ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో అనుకున్న అద్భుతమైన లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

మిథున రాశి
బుధ గ్రహ ప్రభావంతో మిథున రాశివారికి అనుకోని ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు కూడా సాధిస్తారు. అలాగే పనుల్లో నైపుణ్యం కూడా పెరుగుతుంది. ఉద్యోగాల్లో పురోగతికి కూడా అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

సింహ రాశి
బుధుడి ప్రభావంతో సింహ రాశివారికి గౌరవంతో పాటు సామాజంలో హోదా కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల విస్తరణకు కూడా అవకాశాలు కనిపిస్తున్నారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయం చాలా అద్బుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

తులారాశి
తులారాశి వారికి ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా జీవితంలో ఆనందంతో పాటు సౌకర్యం కూడా పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో శాంతి కూడా నెలకొంటుంది. దీంతో పాటు వైవాహిక జీవితంలో సంబంధాలు కూడా రెట్టింపు అవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top