రాజేంద్ర నగర్లో పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్
Hyderabad, Telangana:రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ను అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆర్జిఐ విమానాశ్రయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్ల నుంచి మైనర్ బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్న ప్రదీప్ పై బాలిక తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుద్వెల్లోని ఓ చర్చిలో ఇద్దరూ కలుసుకుని బంధం ఏర్పరుచుకున్నారు. ప్రదీప్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Snake Video: డేంజరస్ స్నేక్ను చుట్టుముట్టిన కుక్కలు.. వీడియో..
Hyderabad, Telangana:Snake Video Watch: తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోలో కొన్ని కుక్కలు అత్యంత ప్రమాదకరమైన పాముపైకి దాడికి దిగడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. అయితే, ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన్నట్లు తెలుస్తోంది.Moto, OnePlus, iQOO.. రూ.25,000 లోపు అదిరిపోయే ఫీచర్లతో టాప్ స్మార్ట్ఫోన్ ఇదే!
Hyderabad, Telangana:Moto G77 Power Vs OnePlus Nord CE 6 Lite vs iQOO Z10R 5G: ప్రస్తుతం భారతీయ మొబైల్ మార్కెట్లో రూ. 25,000 నుంచి రూ.30,000 లోపు ధర కలిగిన స్మార్ట్ఫోన్ల కేటగిరీలో తీవ్రమైన పోటీ నడుస్తూ వస్తోంది.. ఇటీవల మోటొరోలా భారీ బ్యాటరీ ఫోన్ Moto G77 Powerను విడుదల చేయడంతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న OnePlus Nord CE 6 Lite స్మార్ట్ఫోన్తో పాటు అద్భుతమైన ఫీచర్స్తో దూసుకుపోతున్న iQOO Z10R 5G లతో గట్టి పోటీ నడుస్తోంది. మరి ఈ మూడు స్మార్ట్ఫోన్లలో ఏది బెస్ట్? ఫీచర్స్తో పాటు ధరల పరంగా వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డిస్ప్లే పరంగా ఏది బెస్ట్?
ఈ Moto G77 Power స్మార్ట్ఫోన్ ఎంతో ప్రత్యేకమైన 6.72 ఇంచుల Full HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1,050 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అందుబాటులోకి వచ్చింది.. ఇక OnePlus Nord CE 6 Lite ఫోన్ కూడా 6.72 అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. అయితే, ఇందులో గరిష్టంగా 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కూడా లభిస్తోంది.. కానీ పీక్ బ్రైట్నెస్ 680 నిట్స్ సపోర్ట్తో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇక iQOO Z10R 5G స్మార్ట్ఫోన్ డిస్ప్లే విషయంలో అందరికంటే ముందుందని భావించవచ్చు. ఇందులో 6.77 అంగుళాల Full HD AMOLED క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది.. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు ఏకంగా 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో ప్రీమియం విజువల్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుందని కంపెనీ తెలిపింది..
పవర్ఫుల్ ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్..
ప్రాసెసర్ పరంగా మోటో G77 పవర్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్సెట్ను కలిగి ఉంటుంది. అయితే, వన్ప్లస్ నోర్డ్ CE 6 లైట్తో పాటు ఐకూ Z10R ఫోన్లు రెండూ మోస్ట్ పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్తో అందుబాటులో ఉంది. వన్ప్లస్లో దీని అడ్వాన్స్డ్ Apex వేరియంట్ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికొస్తే.. మోటో, వన్ప్లస్ ఫోన్లు ప్రీమియం ఆండ్రాయిడ్ 16 ఆధారిత UI తో పని చేస్తుందని.. ఐకూ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుందని కంపెనీ తెలిపింది..
కెమెరా వివరాలు..
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం మూడు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాలను కంపెనీలు అందిస్తోంది.. మోటో G77 పవర్లో అద్బుతమైన 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక వన్ప్లస్లో EIS సపోర్ట్తో కూడిన 50MP కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఐకూ ఫోన్ విషయానికొస్తే.. 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీల కోసం మోటో, ఐకూ ఫోన్లలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు అందుబాటులో ఉండగా.. వన్ప్లస్లో కేవలం 8 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే అందుబాటులో ఉండడం విశేషం..
బ్యాటరీ, డిజైన్ వివరాలు..
బ్యాటరీ పరంగా మోటో, వన్ప్లస్ భారీ 7,000mAh బ్యాటరీలతో లభిస్తున్నాయి. ఇక మోటో 30W చార్జింగ్ సపోర్తో.. వన్ప్లస్ 45W ఫాస్ట్ చార్జింగ్ను సపోర్ట్తో అందుబాటులోకి వచ్చాయి.. ఐకూ ఫోన్ 5700mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ చార్జింగ్తో లభిస్తోంది. అయితే, బ్యాటరీ పెద్దదిగా ఉండటం వల్ల మోటో, వన్ప్లస్ బరువు ఎక్కువగా ఉంటాయి. ఐకూ కేవలం 183.5 గ్రాముల బరువుతో పాటు 7.39 mm స్లిమ్ డిజైన్, IP68/IP69 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది.
ధరల వివరాలు..
ఈ Moto G77 Power స్మార్ట్ఫోన్ 8GB ర్యామ్తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999తో అందుబాటులో ఉంది. అలాగే OnePlus Nord CE 6 Lite స్మార్ట్ఫోన్ 6GB ర్యామ్తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 కాగా.. 8GB ర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999తో అందుబాటులో ఉంది. ఇక iQOO Z10R 5G స్మార్ట్ఫోన్ 8GBర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ కలిగిన ధర రూ.22,999, 8GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్తో ధర రూ.24,999తో అందుబాటులో ఉంది. అయితే, అద్భుతమైన AMOLED కర్వ్డ్ డిస్ప్లే, తక్కువ బరువు, బడ్జెట్ ధర కావాలనుకుంటే iQOO Z10R బెస్ట్ ఛాయిస్గా భావించవచ్చు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Astrology: వీరి మనసు కనిపెట్టడం ఎవరి తరం కాదు.. అత్యంత తెలివైన 4 రాశులు వీరే..
Hyderabad, Telangana:Horoscope Telugu News: మానవ స్వభావం అనేది ఒక వింతగా భావిస్తారు. పైకి చాలా అమాయకంగా.. ప్రశాంతంగా కనిపించే వ్యక్తి మనసులో ఎలాంటి వ్యూహాలు, ఆలోచనలు ఉన్నయో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మొత్తం 12 రాశుల వారిలోనూ ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కొందరు తమ మనసులోని మాటను దాచుకోలేరు.. కానీ మరికొందరు తమ భావోద్వేగాలను, ప్రణాళికలను ఎంత రహస్యంగా ఉంచుతారంటే.. ఎదుటివారు వారి మనసును అస్సలు తెలుసుకోలేపోతూ ఉంటారు.
జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాశిచక్రంలో అత్యంత చతురత, వ్యూహాత్మక ఆలోచనలు కలిగిన 4 రాశుల వారు ఉన్నారు. వారు ఏం చేయబోతున్నారో అంచనా వేయడం ఎవరికైనా అసాధ్యం.. ఆ రాశులవారు ఎవరో? వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మకర రాశి (Capricorn)
శని దేవుని ప్రభావం ఉన్న మకర రాశి వారు అత్యంత ప్రాక్టికల్గా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా అద్భుతమైన గోల్స్ను కలిగి ఉంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కానీ ఎప్పుడూ తొందరపడరు. విపరీతమైన ఓర్పుతో తమ లక్ష్యాల కోసం పావులు కదుపుతూ ఉంటారు. వీరు చాలా సాధారణంగా ఉన్నారని మీరు అనుకోవచ్చు.. కానీ సమయం చూసి తమ కెరీర్ లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన కీలకమైన అడుగు వేస్తూ ఉంటారు.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వారు దూరదృష్టి గలవారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు అందరితో కలిసి ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ.. వీరు తమకంటూ ఒక ప్రత్యేక దూరాన్ని పాటిస్తారు. వీరి పరిశీలనా శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఎక్కువగా మాట్లాడకపోయినా.. చుట్టుపక్కల ఉన్నవారి బలహీనతలను, మనస్తత్వాన్ని చాలా వేగంగా పసిగట్టేస్తారు. వీరి మనసును అంచనా వేయడం చాలా కష్టమని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మిథున రాశి (Gemini)
మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి.. బుధగ్రహం బుద్ధికి, వాక్చాతుర్యానికి కారకుడి భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారిలో ఒక రకమైన ద్వంద్వ వ్యక్తిత్వం (Dual Personality) కనిపిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి మాటలు, ప్రవర్తన ఎంత ఆకర్షణీయంగా ఉంటాయంటే.. ప్రజలు వీరిని సులభంగా నమ్మేస్తారు. తమ అవసరానికి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో.. ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో వీరికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.
వృశ్చిక రాశి (Scorpio)
అత్యంత రహస్యమైన రాశుల్లో వృశ్చిక రాశి మొదటి స్థానంలో ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుజుడి ప్రభావం వల్ల వీరు ఎంతో అద్భుతంగా ఆలోచించగలుగుతారు. కానీ తమ వ్యూహాలను ఎప్పుడూ బయటపెట్టరు. వీరి మనసు ఒక అంతుచిక్కని రహస్య సముద్రం లాంటిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. పైకి ఎంతో సాధారణంగా.. ప్రశాంతంగా కనిపిస్తూనే.. లోపల భవిష్యత్తుకు సంబంధించిన పక్కా రోడ్మ్యాప్ సిద్ధం చేసుకుంటారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Mercury Direct 2026: జూలై 24 తర్వాత ఈ రాశుల జాతకం మారిపోతుంది.. అపార ధనలాభం!
Hyderabad, Telangana:Mercury Margi In Gemini 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.. బుధుడిని బుద్ధితో పాటు జ్ఞానం, వ్యాపారం, కమ్యూనికేషన్, వాక్కుకు కారకుడిగా భావిస్తూ ఉంటారు.. జాతకంలో బుధుడు బలంగా ఉంటే.. వారి వ్యాపారం, సంతోషానికి చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఇదిలా ఉంటే.. జూలై 24న పెద్ద గ్రహ సంచారం జరగబోతోంది. గత కొంతకాలంగా వక్రగతిలో నడుస్తున్న బుధుడు.. జూలై 24న తన సొంత రాశి అయిన మిథునరాశిలోకి ప్రవేశించి సక్రమార్గంలోకి కొనసాగుతాడు..
ఏదైనా ఒక గ్రహం వక్రదశను వదిలి నేరుగా సంచారం చేసినప్పుడు.. దాని శుభ ప్రభావం పదింతలు పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మీడియా, రైటింగ్, మార్కెటింగ్, బ్యాంకింగ్తో పాటు విద్యా రంగాలలో ఉన్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని చెబుతున్నారు. గత కొన్ని ఉన్న మానసిక గందరగోళం సులభంగా తొలగిపోతుంది. ఈ బుధుడు సక్రమార్గంలోకి ప్రవేశించడం వల్ల ప్రధానంగా 4 రాశుల వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి జూలై 24 తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది.. బుధుడి అనుగ్రహంతో మీ వ్యక్తిత్వంలో ప్రత్యేకమైన ఆకర్షణ మొదలవుతుంది. ఇది సహోద్యోగులను ఎంతగానో ఆకట్టుకుంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మల్టీనేషనల్ కంపెనీల నుంచి అద్భుతమైన ఆఫర్లు కూడా లభిస్తాయి. పాత పెట్టుబడులతో పాటు పూర్వీకుల ఆస్తి నుంచి ఆకస్మిక ధనలాభం కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మిథున రాశి (Gemini)
బుధుడు తన సొంత రాశి అయిన మిథునరాశిలోనే సక్రమ మార్గంలోకి వెళ్లడం కారణంగా ఈ సమయం అత్యంత సానుకూల ప్రభావం పడుతుంది. విద్యార్థులకు ఇది నిజంగా సువర్ణ కాలంగా భావించవచ్చు. పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ జీవితంలో శాంతితో పాటు సంతోషాలు విపరీతంగా పెరుగుతాయి.. అంతేకాకుండా, ఆదాయానికి కొత్త మార్గాలు కూడా సులభంగా తెరుచుకుంటాయి. దీర్ఘకాలికంగా ఉన్న అప్పుల బాధల నుంచి మిథున రాశి వారు విముక్తి లభిస్తుంది.
మేష రాశి (Aries)
మేష రాశివారికి బుధుడి ప్రత్యేకమైన ప్రభావంతో ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా కాలంగా ఆఫీసుల్లో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. అలాగే ఈ సమయంలో తప్పకుండా ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ముఖ్యమైన ప్రాజెక్టులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం..
కన్యా రాశి (Virgo)
కన్యా రాశికి అధిపతి స్వయంగా బుధుడే కావడం వల్ల.. బుధుడు ప్రభావంతో ఈ రాశి వారికి లాటరీ తగిలినట్లే ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సమయం అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా కొత్త రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ సమయంలో రెట్టింపు లాభాలు కులుగాయి.. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న పాత విభేదాలు తొలగిపోయే ఛాన్స్లు ఉన్నాయి. మార్కెట్లో చిక్కుకుపోయిన డబ్బు అకస్మాత్తుగా లభిస్తుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Guru Asthamayam 2026: జూలై 15 నుంచి గురు అస్తమయం.. ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
Hyderabad, Telangana:Guru Asthamayam 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల స్థాన చలనాలు, వాటి నక్షత్ర సంచారాలకు, శక్తి మార్పులు మానవ జీవితాలపై ఎంతగానో ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే రాబోయే జూలై 15 నుంచి కర్కాటక రాశిలో దేవగురువు బృహస్పతి అస్తమించబోతున్నాడు. ఇది దాదాపు ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. జ్యోతిష్య ప్రకారం.. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి గురుడికి అత్యంత సమీపంలోకి రావడం వల్ల ఈ గురుడి అస్తమయం జరగబోతోంది..
దీనివల్ల దేవగురువు శుభ ప్రభావం తాత్కాలికంగా చాలా బలహీనపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శాస్త్రాల ప్రకారం.. ఈ సమయంలో వివాహాలు, ఉపనయనాలతో పాటు ముండన సంస్కారాలు వంటి ఎటువంటి శుభ కార్యాలు జరపడం నిశిద్ధం.. ఇదే సమయంలో చాతుర్మాస్యం కూడా ప్రారంభం కాబోతోంది.. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. గురుడి శుభ దృష్టి బలహీనపడటం వల్ల రాబోయే 3 వారాల పాటు 4 ప్రధాన రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సమయం అంత అనుకూలంగా లేదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి అనుకూలంగా ఉండదో.. తీవ్ర దుష్పభావాలు ఎదుర్కొనే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది..
మకర రాశి (Capricorn)
మకర రాశి వారిపై కూడా గురు అస్తమయ కారణంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇప్పటివరకు గురుడి ఏడవ స్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలు పొందినప్పటికీ.. ఇప్పుడు మీ కెరీర్ పరంగా అనేక సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడి పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. మీ వ్యాపార ప్రత్యర్థులు మీ ప్రణాళికలకు ఆటంకం కలిగించడానికి ప్రయత్నించే ఛాన్స్ కూడా ఉంది. తొందరపడి ఉద్యోగం మారే నిర్ణయం తీసుకోవద్దని జ్యోతిష్యలు చెబుతున్నారు. ప్రభుత్వ పనులు లేదా చట్టపరమైన విషయాలలో అజాగ్రత్త పనికి రాదు..
కర్కాటక రాశి (Cancer)
దేవగురువు కర్కాటక రాశిలోనే అస్తమిస్తుండటం వల్ల ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.. గత కొన్ని వారాలుగా వేగంగా సాగుతున్న మీ పనులలో అకస్మాత్తుగా ఆటంకాలు కూడా ఎదురవుతాయి.. మీ ఆర్థిక ప్రణాళికలు నిలిచిపోయే ప్రమాదం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడైనా ప్రత్యేక జాగ్రత్త అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మీ కోపాన్ని నియంత్రించుకోలేనివారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు... ప్రియమైన వారితో విభేదాలు లేదా గొడవలు వచ్చే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ క్లిష్ట సమయంలో తండ్రి లేదా కుటుంబ పెద్దల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మీన రాశి (Pisces)
మీన రాశి వారి జీవితంలో కూడా ఈ సమయంలో సవాళ్ల ఎదురవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం నడుస్తోంది. ఇప్పటివరకు ఐదో స్థానంలో ఉన్న గురుడు ఆ శని ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించాడు.. కానీ ఇప్పుడు గురుడు అస్తమించడం వల్ల శని ప్రతికూల ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ఆశించిన విజయం సాధించాలంటే మునుపటి కంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది.. ఆదాయం సాధారణంగానే ఉన్నప్పటికీ.. వివిధ కారణాల వల్ల ఖర్చులు విపరీంతగా పెరుగుతాయి.. విద్యార్థులు కూడా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలంటే గతంలో కంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
బర్త్డే రైడ్లో దారుణం.. భార్యను సర్వీస్ రివాల్వర్తో కాల్చేసిన పోలీస్! కానీ, అసలు కారణం వేరే!!
Hyderabad, Telangana:Delhi Police Constable Shoots Wife: ఢిల్లీ క్రైమ్ వార్తల్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో, సర్వీస్ రివాల్వర్తో భర్త మనీష్ తన భార్య ప్రియాంకను రోడ్డుపైనే చంపినట్లు తెలిసింది. సోమవారం తెల్లవారుజామున, ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ కలిసి రాత్రి రెండు గంటల సమయంలో బైక్పై బయటకు వెళ్లారు. మార్గమధ్యంలో లాల్ బహుదూర్ శాస్త్రి ఆసుపత్రి వద్ద ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో, ఆమె బైక్ దిగి వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. వెంటనే మనీష్ తన సర్వీస్ రివాల్వర్ను తీసి ఆమెను కాల్చి, అక్కడి నుండి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయిన ఆమెను ఒక డెలివరీ బాయ్ వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేవలం చిన్న గొడవకే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టాడా? లేదా మరేదైనా కారణం ఉందా? అని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే, 2024లో మనీష్ తన భార్యను కట్నం కోసం వేధించినట్లు ఒక లిఖితపూర్వక పత్రం బయటకు వచ్చింది. పగతో కూడిన ప్లాన్ ప్రకారం మనీష్ ఈ హత్య చేసినట్లు బంధువులు చెబుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, స్కూటర్పై వెళ్తుండగా జరిగిన గొడవలో మనీష్ పిస్టల్తో కాల్చి, ప్రియాంక గాయాలతో రోడ్డుపై పడిపోతుండగా అక్కడి నుండి పారిపోయాడు. ఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కళ్యాణ్ పూరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వీరిద్దరూ ఈస్ట్ వినోద్ నగర్లో నివసిస్తున్నారు. వీరి సంసారంలో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతాయని అందరూ అనుకున్నారు.. కానీ అది ఇంతటి రక్తపాతానికి దారితీస్తుందని ఎవరూ ఊహించలేదు. ఎల్బీఎస్ ఆసుపత్రి సమీపంలో ఇద్దరూ మాట్లాడుకుంటున్న వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. అక్కడ వాగ్వాదం పెరగడంతో నిందితుడు కాల్పులు జరిపి స్కూటర్తో పరారయ్యాడు. కాల్పుల శబ్దం విని స్థానికులు గమనించగా, ఒక ఆటో డ్రైవర్ ఆమెను ఆసుపత్రికి తరలించారు.
మనీష్ యాంటీ ఆటో తెఫ్ట్ స్క్వాడ్లో పనిచేస్తున్నట్లు, ప్రియాంక ఒక ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు వివిధ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇరుగుపొరుగు వారు కూడా వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి విచారించిన తర్వాతే అసలు విషయం పూర్తిగా తేలుతుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Read more: ఫిరోజాబాద్ సంచలన హత్య కేసులో చారిత్రాత్మక తీర్పు.. కేవలం 40 రోజుల్లోనే మరణశిక్ష!
Read more: ఆరుగురి హత్య కేసులో ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్ ముందు స్థానికుల ధర్నా
హత్యకు గల కారణాల విషయానికి వస్తే, వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని బంధువులు చెబుతున్నారు. ప్రియాంక ఇప్పటికే మహిళా క్రైమ్ బ్రాంచ్లో తన భర్తపై లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అందులో తన అత్తమామలు ,భర్త వరకట్న వేధింపులకు, మానసిక హింసకు గురిచేస్తున్నారని, తన ప్రాణానికి ప్రమాదం ఉన్నందున రక్షణ కల్పించాలని ఆమె కోరింది. 2023 ఫిబ్రవరి 8న వీరి వివాహం జరిగినప్పుడు, అత్తమామలు రూ. 25 లక్షలు ,ఒక పెద్ద కారు కావాలని డిమాండ్ చేశారని ఆమె ఆరోపించింది. మనీష్కు మద్యం అలవాటు ఉందని, అతను తనను శారీరకంగా, మానసికగా వేధించేవాడని, పదేపదే గొంతు నొక్కడానికి ప్రయత్నించేవాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, పెళ్లికి ముందే అతనికి మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఆమెను పెళ్లి చేసుకుంటానని, తనను తుపాకీతో చంపేస్తానని ఎన్నోమార్లు తలకు గురిపెట్టి మరీ బెదిరించాడని ఆమె రాసింది. ఈ వేధింపుల వల్ల ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్ళినప్పటికీ, తల్లిదండ్రుల ఒత్తిడితో మళ్ళీ అత్తగారి ఇంటికి తిరిగి వచ్చేది. ఇలా మనీష్ ఆమెను మానసిక ,శారీరక హింసకు గురిచేసి, పలుమార్లు హత్యాయత్నం కూడా చేశాడని ప్రియాంక తన ఫిర్యాదులో వివరించింది. ఇంతలోనే ఆమెను కాల్చి పొట్టనబెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Piduguralla Medical College: పల్నాడులో కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాల..100 సీట్ల భర్తీకి NMC గ్రీన్ సిగ్నల్..ఈ ఏడాదే తరగతులు!
Piduguralla, Andhra Pradesh:Piduguralla Medical College News: మెడికల్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా విద్యార్థుల దశాబ్దాల కల ఈనాటికి సాకారమైంది. పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 100 ఎం.బి.బి.ఎస్ సీట్ల భర్తీకి జాతీయ మెడికల్ కమిషన్(NMC) ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం(2026-27) నుంచే ప్రవేశాలు, తరగతులు ప్రారంభం కానున్నాయి. జాతీయ నిబంధనల ప్రకారం.. అనుమతినిచ్చిన 100 సీట్లలో 15 శాతం సీట్లను (AIQ) ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేయనున్నారు.
ఇదే విషయాన్ని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు కూడా ఇప్పటికే తుదిదశకు చేరుకోవడం వల్ల అతిత్వరలోనే తరగతుల ప్రారంభానికి మార్గం సుగమం అయ్యింది. మెడికల్ కాలేజీకి అవసరమైన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. అలాగే ఆస్పత్రికి సంబంధించిన వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర టెక్నీషియన్ల ఎంపిక కూడా తుదిదశకు చేరుకుంది.
ఫలించిన పల్నాడు ఎంపీ కృషి..
ఈ చారిత్రాత్మక అనుమతులు సాధించడం వెనుక నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషి ఉందని స్థానిక నాయకులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయంలో మెడికల్ కాలేజీ మంజూరు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి, అనుమతుల సాధన వరకు ఎంపీ లావు కృష్ణదేవరాయలు ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఉన్నతాధికారులతో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖతో స్వయంగా సంప్రదింపులు జరిపినట్లు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ కృషి ఫలితమే ఈరోజు అనుమతి (LoP) వచ్చేలా సాధ్యపడిందని నియోజకవర్గ నేతలు అంటున్నారు.
మరోవైపు, మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు తుది దశకు చేరుకోగా.. కళాశాలకు అవసరమైన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆసుపత్రికి అవసరమైన వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర టెక్నీషియన్ల ఎంపిక కూడా జరుగుతోంది.
ALso Read: విజయవాడ భారీ అగ్నిప్రమాదం..ఏడు బస్సులు పూర్తిగా దగ్ధం..రూ.కోట్ల ఆస్తి బూడిద!
Also Read: ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం? జూలై 18న మీటింగ్ అందుకే అంటున్న తారక్ ఫ్యాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jani Master Vs Sekhar Master: శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల మధ్య గొడవ..రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి..చివరికి ఏం జరిగిందంటే?
Hyderabad, Telangana:Chiranjeevi Meets Jani Sekhar Masters: టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారానికి తెరపడింది. తమ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలపై జానీ మాస్టర్ స్వయంగా స్పందిస్తూ పూర్తి స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ఆయన తన 'ఎక్స్'(ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేస్తూ రూమర్లను కొట్టిపారేశారు.
నాకు అన్నలాంటి వారు!
తనకు, శేఖర్ మాస్టర్కు మధ్య ఎలాంటి అపార్థాలు లేవని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. "శేఖర్ మాస్టర్ నాకు అన్నలాంటి వారు. మేమిద్దరం ఎప్పటి నుంచో ఒకే కుటుంబంలా కలిసి ఉంటున్నాం. ఒకరికొకరం ఎప్పుడూ అండగా నిలబడ్డాం. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోలు, తప్పుడు కథనాలను అభిమానులు ఎవరూ నమ్మవద్ద"ని జానీ మాస్టార్ విజ్ఞప్తి చేశారు.
పెద్దరికం వహించిన మెగాస్టార్ చిరంజీవి
ఈ వివాదంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరును జానీ మాస్టర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం జోరందుకున్న సమయంలో, చిరంజీవి గారు స్వయంగా చొరవ తీసుకున్నారని తెలిపారు. సినిమా షూటింగ్ సెట్స్లో చిరంజీవి గారు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇద్దరినీ పిలిపించి మాట్లాడారు. అనంతరం ముగ్గురూ కలిసి కాసేపు సరదాగా ముచ్చటించి, కలిసి భోజనం కూడా చేశారు.
A few misleading videos and false reports have been doing the rounds over the last couple of days….
I want to make this clear… there is absolutely no misunderstanding or conflict between me and Shekar Master Anna. We are one family and we have always stood by each other.… pic.twitter.com/oCOsngCtwI
— Jani Master (@AlwaysJani) July 13, 2026
"చిరంజీవి గారు చూపించిన ప్రేమ, అందించిన మార్గదర్శకత్వం, మద్దతు మాకు ఎంతో విలువైనవి" అని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. ఆధారాలు లేని ఇలాంటి అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని జానీ మాస్టర్ సినీ ప్రేమికులను కోరారు. ప్రేమ, పరస్పర గౌరవం, సానుకూల దృక్పథంతో అందరూ కలిసి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read: ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం? జూలై 18న మీటింగ్ అందుకే అంటున్న తారక్ ఫ్యాన్స్!
Also Read: గ్లామర్ డోస్ పెంచిన 'అలేఖ్య చిట్టి పికిల్స్' బ్యూటీ..అందాలతో హీరోయిన్లకు పోటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amavasya 2026: అరుదైన భౌమవతి అమావాస్య.. రేపు ఈ రహస్య పరిహరం పాటిస్తే విశేష ధనయోగంతో పాటు సొంతింటి కల సాకారం.!.
Hyderabad, Telangana:Amavasya date 2026 timing rituals and remedies: సాధారణంగా చాలా మంది అమావాస్య అనగానే చెడుగా భావిస్తారు. కానీ మనం దీపావళి పండగను జరుపుకుంటాం. చెడుపై మంచిసాధించిన విజయంకు గుర్తుగా దీపాలు వెలిగించి పండగ చేసుకుంటాం. అందుకే అమావాస్యను చెడుగా భావించకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే.. మనం జులై 14న అమావాస్యను జరుపుకుంటాం.
ఈసారి మంగళవారం అమావాస్య రావడంను విశేషంగా చెప్తారు. ముఖ్యంగా రాహు, కేతు దోషాలున్న వారికి ఇది చాలా యోగ్యమైన రోజు. అంతే కాకుండా మంగళవారం అమావాస్యతో కూడి రావడంను భౌమవతి అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున కొన్ని పరిహరాలు పాటిస్తే చాలా శక్తివంతంగా అవి యోగిస్తాయని పండితులు చెబుతున్నారు.
భౌమవతి అమావాస్యరోజున ఏంచేయాలంటే..?..
చాలామంది జీవితంలో పూర్వీకుల శాపాల వల్ల బాధలు పడుతారు. పితృదోషాలతో సతమతమౌతారు. దీని వల్ల జీవితంలో ఎదుగుదల ఉండదు. పెళ్లిలో ఆటంకాలు, ఉద్యోగంలో ఎదుగుదల ఉండదు. డబ్బులు నిలవదు. ఒక వేళ పెళ్లి అయితే సంతానంవిషయలో సమస్యలు వస్తాయి.
ఇలాంటి వారు చనిపోయిన తమ పూర్వీకుల ప్రీతికొరకునదీతీరంలో అమావాస్య రోజున శ్రాద్దకర్మలు చేయాలి. పండితుడ్ని పిలిచి ఆయనతో విధి ప్రకారం పిండ ప్రదానం చేయాలి.ఆ తర్వాత వాటిని నదీలో వదిలేయాలి. యథా శక్తి దాన ధర్మాలు చేయాలి. దశదానాలు ఇచ్చుకొవాలి. ఈవిధంగా చేస్తే పూర్వీకుల శాపాలు దూరమౌతాయి.
ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంటే..?..
కొంత మంది ఎంత సంపాదించిన ఇంట్లో ధనం నిలవదని బాధపడుతారు. తరచుగా గొడవలు, చికాకులు, వాగ్వాదాలు ఉంటాయి. నెగెటివ్ ఎనర్జీతో సతమతమౌతారు. వీరు ఇంటి ముందు గుమ్మడి కాయను కట్టాలి. దాని మీదపసుపు, కుంకుమ వేయాలి. ఈ విధంగా కట్టిన గుమ్మడికాయను ప్రతి అమావాస్యకు మారుస్తుండాలి. దొడ్డు ఉప్పును తీసుకుని గాజు గ్లాసులో గిన్నెడు వేసి దానిలో 5 రూపాయికాయిన్ లు వేసి చిన్న టీ గ్లాస్ నీళ్లువేసి గుమ్మంకు ఎడమ వైపు ఉంచాలి. ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీని లాగేస్తుంది. ఇంట్లో శుభ్రంచేస్తుండగా దొడ్డు ఉప్పు వేసి క్లీన్ చేసుకొవాలి.
ధనంకు రావడానికి, కోరిక కొర్కెలకు రెమిడీలు..
అమావాస్య రోజున ప్రవహించే నది దగ్గరకు వెళ్లి మీరు వాడిన బట్టల్ని ఒక జత తీసుకుని దాన్ని మీ మీద నుంచి మూడు సార్లు తిప్పి ప్రవహించే నదిలో వేసి వెనక్కు చూడకుండా రావాలి.నల్లనువ్వులు, కర్పూరం, ఎండు మిర్చిలను తీసుకుని మీ ఇంటి చుట్టు తిప్పి ప్రవహించే నదిలో వేయాలి.
ఇలా చేస్తే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ పొవడంతో పాటు, ధనం కావాలనుకున్న వారికి డబ్బులు, కొత్త ఇల్లు,పెళ్లి ఇలా ఎవరి మనస్సులో ఏ కోరిక ఉంటుందో అది నెరవేరుతుంది. ( గమనిక - ఈ స్టోరీ కేవలంనమ్మకం, విశ్వాసాలపై మాత్రమే ఆధార పడి ఉంటుంది. జీతెలుగు మీడియా దీనికి బాధ్యత వహించదు..)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rajkumar Suicide Video: "సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాను"..నరరూప హంతకుడు రాజ్కుమార్ సూసైడ్ వీడియో!
Hyderabad, Telangana:Rajkumar Suicide Video News: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో పెను సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా 6 హత్యలకు ఒడిగట్టిన కిరాతకుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ముందు రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘాతుకానికి పాల్పడటానికి కొన్ని గంటల ముందే (జూలై 10న సాయంత్రం 4:55 గంటలకు) ఈ వీడియో రికార్డ్ చేసినట్లు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. అసలు రాజ్కుమార్ అంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాల్సి వచ్చింది? ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసులు విడుదల చేసిన వీడియో ప్రకారం.. నిందుతుడు రాజ్ కుమార్ వీడియో రికార్డు చేసుకొని.. తన చావుకు, ఈ ఘాతుకానికి గల కారణాలను రాజ్కుమార్ ఆ సెల్ఫీ వీడియోలో కన్నీళ్లతో వివరించాడు. "నా సంపాదనలో సగం వాళ్ల కోసమే తగలేశా. నా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు లాక్కుని నన్ను పూర్తిగా రోడ్డున పడేశారు. ఆ అమ్మాయిని నమ్మి సర్వస్వం కోల్పోయాను. అప్పులపాలై, ఆఖరికి నా కన్న పిల్లలకు రూపాయి భూమి కూడా లేకుండా చేసేశాను. నన్ను ఇంతలా ముంచేసి.. చివరకు నాపైనే కేసు పెట్టి జైలుకు పంపించారు" అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
అసలేం జరిగింది?
తనపై పోక్సో (POCSO) కేసు పెట్టారనే తీవ్ర కక్షతో రాజ్కుమార్ జూలై 10న ఈ మారణహోమానికి తెగబడ్డాడు. మొదట షాబాద్ టౌన్లో సదరు మైనర్ బాలిక తల్లిని, నాయనమ్మను కత్తులతో నరికి చంపాడు. ఆ తర్వాత తన స్వంత భార్యాపిల్లలను కూడా అతి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం మైనర్ బాలికను కారులో కిడ్నాప్ చేసి అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతుకోసి చంపేశాడు.
ఈ ఆరు హత్యల అనంతరం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగానే, అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజ్కుమార్ మృతదేహం లభ్యమైన చోటే ఈ కీలకమైన మొబైల్ ఫోన్ కూడా దొరికింది.
కారులోనే బాలిక.. ముమ్మరంగా దర్యాప్తు
భార్యాపిల్లలను చంపే ఆ భయానక సమయంలో మైనర్ బాలిక కారులోనే ఉందనే ఆందోళనకరమైన విషయం కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. "ప్రస్తుతం నిందితుడి మొబైల్ ఫోన్ను, అందులోని సెల్ఫీ వీడియోను సైన్స్ అండ్ ఫోరెన్సిక్ ల్యాబ్ (FSL)కు పంపించాం. పూర్తి సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నాం" అని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు.
Also Read: ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం? జూలై 18న మీటింగ్ అందుకే అంటున్న తారక్ ఫ్యాన్స్!
Also Read: సీఎం రేవంత్పై లైవ్ డిబెట్లో అనుచిత వ్యాఖ్యలు..వైసీపీ నేతను అరెస్టు చేసిన TG పోలీస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nand Kishore Goenka: జీ గ్రూప్ ఛైర్మెన్ డాక్టర్ సుభాష్ చంద్ర ఇంట విషాదం..ఆయన తండ్రి నంద్ కిషోర్ గోయెంకా మృతి!
Hyderabad, Telangana:Nand Kishore Goenka Passed Away: దేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర తండ్రి, సంఘ సేవకుడు నంద్ కిషోర్ గోయెంకా (96) మరణించారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ముంబై మెరైన్ డ్రైవ్లోని తన నివాసంలో కన్నుమూశారు. దేశంలోని అగ్రశ్రేణి వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటైన ఎస్సెల్ గ్రూప్తో అనుబంధం ఉన్నప్పటికీ, ఆయన తన జీవితాంతం వ్యాపారానికి దూరంగా ఉంటూ నిరాడంబరత, పరోపకారం, సామాజిక సేవకే అంకితమయ్యారు. ఆయన మరణం వైశ్య సమాజంలో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వర్గాలలో, సామాజిక సంస్థలలో తీవ్ర విషాదాన్ని నింపింది.FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్స్కు రంగం సిద్ధం..ఏ టీమ్కి ట్రోఫీ గెలిచే సత్తా ఉంది?
Zürich, Zürich:FIFA World Cup 2026 Semi Finals ఫిఫా ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఫుట్బాల్ ప్రపంచంలోనే అత్యున్నతమైన ఈ ట్రోఫీ కోసం నలుగురు మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్, అర్జెంటీనా సెమీఫైనల్లో తలపడటానికి సిద్ధమయ్యారు. ఈ నాలుగు జట్లు ఇక్కడి దాకా వేర్వేరు వ్యూహాలతో దూసుకొచ్చినప్పటికీ, ప్రతి జట్టుకూ టైటిల్ గెలిచే బలమైన అవకాశాలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.Nand Kishore Goenka: సంఘ సేవకుడు నంద్ కిషోర్ గోయెంకా ఇకలేరు..జీ గ్రూప్ ఛైర్మన్కు పితృవియోగం!
Hyderabad, Telangana:Nand Kishore Goenka Passed Away: దేశ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర తండ్రి, సంఘ సేవకుడు నంద్ కిషోర్ గోయెంకా (96) మరణించారు. సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ముంబై మెరైన్ డ్రైవ్లోని తన నివాసంలో కన్నుమూశారు.
దేశంలోని అగ్రశ్రేణి వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటైన ఎస్సెల్ గ్రూప్తో అనుబంధం ఉన్నప్పటికీ, ఆయన తన జీవితాంతం వ్యాపారానికి దూరంగా ఉంటూ నిరాడంబరత, పరోపకారం, సామాజిక సేవకే అంకితమయ్యారు. ఆయన మరణం వైశ్య సమాజంలో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వర్గాలలో, సామాజిక సంస్థలలో తీవ్ర విషాదాన్ని నింపింది.
అంత్యక్రియల వివరాలు
ప్రస్తుతం ముంబై నివాసంలో ఉంచిన ఆయన పార్థివ దేహాన్ని, మంగళవారం (జూలై 14) ఉదయం 7:00 గంటలకు ప్రత్యేక చార్టర్డ్ విమానంలో హర్యానాలోని ఆయన పూర్వీకుల పట్టణమైన హిసార్కు తరలిస్తారు. హిసార్ చేరుకున్నాక, ప్రజల సందర్శనార్థం పార్థివ దేహాన్ని 'గోయెంకా హౌస్' (166, కృష్ణ మంది, హిసార్)లో ఉంచుతారు.
జూలై 15, బుధవారం ఉదయం 11:00 గంటలకు హిసార్లో అంత్యక్రియలు నిర్వహిస్తారు. అగ్రోహా ధామ్లోని గోయెంకా ఉద్యానంలో ఉన్న పంచతత్వలో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేస్తారు. గతంలో ఆయన భార్య అంత్యక్రియలు కూడా ఇదే ప్రదేశంలో జరిగాయి.
సమాజ సేవకే అంకితమైన జీవితం
1930 సెప్టెంబర్ 28న హిసార్లో జన్మించిన నంద్ కిషోర్ గోయెంకా, సాంప్రదాయ విలువలకు నిలువెత్తు రూపంగా జీవించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో నిబద్ధత కలిగిన వాలంటీర్గా చేరి, జాతీయ ప్రయోజనాల కోసం, సాంస్కృతిక విలువల పరిరక్షణ కోసం ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
కీలక రంగాలు - చేసిన సేవలు..
అగ్రోహా ధామ్ స్థాపన: మహారాజా అగర్సేన్ చారిత్రక రాజధాని అయిన అగ్రోహా ధామ్ ప్రధాన వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. ఆయన దూరదృష్టి వల్లే ఈ ప్రదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
గోసేవ: గోరక్షణ, సంక్షేమాన్ని తన జీవితంలో అంతర్భాగంగా భావించిన ఆయన.. శ్రీ దేవి భవన్ మందిర్ గోశాల ట్రస్ట్, శ్రీ వైష్ణవ్ అగర్సేన్ గోశాలలకు అధ్యక్షుడిగా, పోషకుడిగా సేవలందించారు.
విద్యా రంగం, మహిళా సాధికారత: ఫతే చంద్ మహిళా కళాశాల అధ్యక్షుడిగా, జి.ఎన్.జి. గోయెంకా పాఠశాల పోషకుడిగా ఉంటూ ముఖ్యంగా బాలికల విద్యను ప్రోత్సహించడానికి, నాణ్యమైన విద్యా సౌకర్యాలు అందించడానికి ఎంతో కృషి చేశారు.
వైశ్య సమాజ ఐక్యత: వైశ్య సమాజాన్ని సంఘటితం చేసి, వారిలో ఐక్యత, సహాయ నిరతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించారు.
అన్ని వర్గాల ప్రజలతో ఆత్మీయ సంబంధాలను కలిగి ఉండి, సేవనే పరమావధిగా బతికిన నంద్ కిషోర్ గోయెంకా మరణం సామాజిక, మత, విద్యా రంగాలకు తీరని లోటు. ఆయన ఆదర్శవంతమైన జీవితం భవిష్యత్ తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
ALso Read; ఎయిర్టెల్ వినియోగదారులకు గుడ్న్యూస్..రూ.200 రీఛార్జ్తో అన్లిమిటెడ్ కాల్స్,OTTలు
Also Read; రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ? ఫ్యాన్స్తో భారీ ప్లానింగ్..ముహూర్తం కూడా ఫిక
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ratha Yatra 2026: జగన్నాథుని రథయాత్రకు అంతా సిద్ధం.. ఈ ఏడాది రథయాత్ర ముహూర్త సమయం ఎప్పుడో తెలుసా?
Puri, Odisha:Ratha Yatra 2026 Date And Time: విష్ణుమూర్తి స్వరూపమైన జగన్నాథ స్వామి గౌరవార్థం జరుపుకునే రథయాత్ర లేదా జగన్నాథ రథయాత్ర అనేది అత్యంత ప్రజాదరణ పొందిన హిందూ పండుగలలో ఒకటి. ఒడిశా రాష్ట్రంలోని పూరీలోని జగన్నాథ ఆలయం నుండి జగన్నాథ స్వామి, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రా దేవి అద్భుతంగా అలంకరించిన రథాలపై బయటకు వచ్చే గొప్ప ఊరేగింపును వీక్షించడానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు జగన్నాథుని దర్శనానికి వస్తారు.
ఈ రథయాత్ర అనేది జగన్నాథ స్వామి తన ఆలయం నుండి గుండిచా ఆలయానికి (ఇది ఆయన అత్తగారి ఇల్లు అని నమ్ముతారు) చేసే దైవిక ప్రయాణానికి ప్రతీక. ఇది భక్తుల మధ్యకు దేవుడు రాకగా భావిస్తారు. రథయాత్ర కేవలం ఒక మతపరమైన సందర్భం మాత్రమే కాకుండా.. ఇదొక భక్తి, సమానత్వం, ఆధ్యాత్మిక అనుబంధాల వేడుకగా పేరుగాంచింది.
రథయాత్ర 2026 తేదీ, సమయం..
హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం.. ఆషాఢ మాసంలోని (జులై, ఆగస్టు నెలల మధ్యలో వచ్చే తెలుగు మాసం) శుక్ల పక్షం రెండవ రోజున (ద్వితీయ తిథి) రథయాత్ర నిర్వహిస్తారు. ఈ శోభాయమాన రథయాత్రను ఈ ఏడాది 2026 జూలై 16 గురువారం నాడు జరుగుతుంది. దీనికి సంబంధించిన సమయాలు, కార్యక్రమాలు చారిత్రకంగా చాంద్రమాన క్యాలెండర్ ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణంగా ఉదయం 07:00 గంటలకు అద్భుతమైన రథాల లాగడం ప్రారంభమై, రోజంతా కొనసాగుతుంది.
రథయాత్ర వేళ జగన్నాథునికి ప్రధాన ఆచారాలు..
ఆలయంలో ఉదయపు పూజ, మంగళ హారతి ఉంటుంది.
పహండి కార్యక్రమం: ఇందులో దేవుళ్లను ఆలయం నుండి వారి రథాలకు తీసుకువెళతారు.
ఛేరా పహరా ఆచారం: ఇందులో పూరీ రాజు వినయానికి చిహ్నంగా రథం వేదికలను శుభ్రం చేస్తారు.
రథాలను లాగే కార్యక్రమం: భక్తులు పవిత్ర రథాలను గుండిచా ఆలయం వైపు లాగుతారు.
(ముహూర్తానికి సంబంధించిన ఖచ్చితమైన సమయాలు అధికారిక ఆలయ ప్రకటనల ద్వారా తెలియజేయబడతాయి.)
మూడు దైవిక రథాలు:
రథయాత్రలో ప్రధాన ఆకర్షణ మూడు పెద్ద చెక్క రథాల ఊరేగింపు. ప్రతి రథం ఒక దేవుడికి లేదా దేవతకు కేటాయించబడి ఉంటుంది.
నందిఘోష - జగన్నాథ స్వామి రథం:
జగన్నాథ స్వామి రథాన్ని 'నందిఘోష' అని పిలుస్తారు. మూడు రథాలలోకెల్లా ఇది అతిపెద్దది.
తాలధ్వజ - బలభద్ర స్వామి రథం:
బలభద్ర స్వామి రథం బలం, ధైర్యం, రక్షణకు ప్రతీక. ఇది స్థిరత్వం, ధర్మానికి సంకేతంగా భక్తులు భావిస్తారు.
దర్పదలన - సుభద్రా దేవి రథం:
సుభద్రా దేవి రథం శాంతి, కరుణ, స్త్రీత్వంలోని పోషక గుణానికి చిహ్నంగా ఉంటుంది. ఈ రథాలను ప్రతి ఏటా సంప్రదాయ పద్ధతిలో, పవిత్రమైన కలప (చెక్క) ప్రత్యేకమైన కొలతలతో కొత్తగా తయారు చేస్తారు.
రథయాత్రలోని ముఖ్యమైన ఆచారాలు..
1) స్నాన యాత్ర:
ప్రధాన రథయాత్రకు ముందు, దేవుళ్ళు 'స్నాన యాత్ర'లో పాల్గొంటారు. ఇది ఒక ఉత్సవ స్నానపు కార్యక్రమం. ఈ ఆచారం తర్వాత దేవుళ్ళు అనారోగ్యానికి గురవుతారని నమ్ముతారు. అందుకే ఆ తర్వాత జరిగే రథయాత్ర తిరిగి కనిపించే వరకు కొంతకాలం పాటు భక్తులకు దూరంగా (ఏకాంతంలో) ఉంటారు.
2) పహండి ఉత్సవం:
ఈ పండుగలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టాలలో 'పహండి' ఒకటి. ఇందులో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలను ఆలయం నుండి వారి సంబంధిత రథాలకు లయబద్ధమైన ఊరేగింపుగా తీసుకువెళతారు.
ఆ దైవిక సోదర సోదరీమణులు తమ యాత్రను ప్రారంభిస్తుండగా భక్తులు ప్రార్థనలు చేస్తూ, భక్తి గీతాలను ఆలపిస్తారు.
3) ఛేరా పహరా:
పూరీకి చెందిన గజపతి రాజు 'ఛేరా పహరా' ఆచారాన్ని నిర్వహిస్తారు. సంపద లేదా సామాజిక హోదాతో సంబంధం లేకుండా దేవుని ముందు అందరూ సమానమేనని చాటిచెప్పేలా, రాజు బంగారు చీపురుతో రథం పరిసరాలను శుభ్రం చేస్తారు. ఈ ఆచారం వినయం, భక్తి అనే సందేశాన్ని ఇస్తుంది.
4) బహుదా యాత్ర (తిరుగు ప్రయాణం)
దేవుళ్ళు కొన్ని రోజుల పాటు గుండిచా ఆలయంలో ఉంటారు, ఆ తర్వాత 'బహుదా యాత్ర' అనే తిరుగు ప్రయాణంలో తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకువెళ్లబడతారు. ఇది ఆ పవిత్ర యాత్ర యొక్క ముగింపు ఘట్టం.
రథయాత్ర ఆధ్యాత్మిక అర్థం..
రథయాత్ర అనేది కేవలం ఒక అద్భుతమైన పండుగ మాత్రమే కాదు, దీనికి లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. రథయాత్రలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, దేవుడు ఆలయం నుండి బయటకు వచ్చి వీధుల్లోకి వస్తాడు. దీని అర్థం ఏమిటంటే, దైవ ప్రసాదాలు ఒక పుణ్యక్షేత్రానికి మాత్రమే పరిమితం కావు, అవి అందరికీ అందుబాటులో ఉంటాయి.
సమానత్వానికి ప్రతీక..
అన్ని రకాల ప్రజలు రథాలను లాగుతారు. ఈ కార్యక్రమం ఏకత్వానికి, అంకితభావానికి, దైవ దృష్టిలో అందరూ సమానులే అనే భావనకు ప్రతిబింబం.
ఆత్మ మార్గం..
రథాన్ని సాధారణంగా మానవ శరీరానికి రూపకంగా, మరియు యాత్రను ఆధ్యాత్మిక జాగృతి వైపు ఆత్మ యొక్క ప్రగతికి రూపకంగా భావిస్తారు. రథాన్ని లాగడం అంటే ప్రతికూలత, అహం మరియు అంకితభావానికి అడ్డువచ్చే వాటన్నింటినీ తొలగించడం.
శ్రీకృష్ణునితో సంబంధం..
చాలా మంది భక్తులకు, రథయాత్ర శ్రీకృష్ణుని యాత్రకు, ఆయన భక్తులతో ఉన్న ప్రేమ బంధానికి ప్రతీకగా భావిస్తారు. ఇది దైవిక ప్రేమను, కరుణను, దేవునికి, మానవాళికి మధ్య ఉన్న శాశ్వత సంబంధాన్ని వ్యక్తులకు గుర్తు చేస్తుంది.
పూరీ వెలుపలి ఉత్సవాలు..
వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది పూరీలో జరిగే రథయాత్ర, కానీ ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతటా, ప్రపంచంలోని అనేక ఇతర దేశాలలో కూడా జరుపుకుంటారు. భక్తులు ఊరేగింపులు నిర్వహించి, భక్తి గీతాలు పాడతారు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహిక సమావేశాలు జరుపుకుంటారు.
Also Read: ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం? జూలై 18న మీటింగ్ అందుకే అంటున్న తారక్ ఫ్యాన్స్!
Also Read: సీఎం రేవంత్పై లైవ్ డిబెట్లో అనుచిత వ్యాఖ్యలు..వైసీపీ నేతను అరెస్టు చేసిన TG పోలీస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్స్లో హోరాహోరీ టీమ్స్..ట్రోఫీ గెలిచే సత్తా ఎవరికి ఉందంటే?
Zürich, Zürich:FIFA World Cup 2026 Semi Finals: ఫిఫా ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఫుట్బాల్ ప్రపంచంలోనే అత్యున్నతమైన ఈ ట్రోఫీ కోసం నలుగురు మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్, అర్జెంటీనా సెమీఫైనల్లో తలపడటానికి సిద్ధమయ్యారు. ఈ నాలుగు జట్లు ఇక్కడి దాకా వేర్వేరు వ్యూహాలతో దూసుకొచ్చినప్పటికీ, ప్రతి జట్టుకూ టైటిల్ గెలిచే బలమైన అవకాశాలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ నాలుగు జట్ల బలాలు, బలహీనతలపై ప్రత్యేక విశ్లేషణ..
1) ఫ్రాన్స్: విధ్వంసకర దాడితో 'లెస్ బ్లూస్' జోరు
ఈ టోర్నమెంట్లో అత్యంత పరిపూర్ణమైన ప్రదర్శనతో దూసుకుపోతున్న జట్టు ఫ్రాన్స్. డిడియర్ డెషామ్ప్స్ వ్యూహాలు, ఆటగాళ్ల క్రమశిక్షణ ఆ జట్టును తిరుగులేని శక్తిగా మార్చాయి. కైలియన్ ఎంబాపే (8 గోల్స్) గోల్డెన్ బూట్ రేసులో ముందంజలో ఉండగా, ఉస్మాన్ డెంబెలె (5 గోల్స్) అతనికి అండగా నిలిచాడు. ప్రపంచకప్ చరిత్రలో గత 50 ఏళ్లలో ఒకే జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు 5 లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేయడం 2002 బ్రెజిల్ తర్వాత ఇదే తొలిసారి.
ఆప్టా (Opta) ప్రకారం.. ఫ్రాన్స్ జట్టు బంతిని ప్రత్యర్థి హాఫ్లోకి వేగంగా తీసుకెళ్లి 33 సార్లు షాట్లు కొట్టింది. సెమీఫైనలిస్టులలో ఇదే అత్యధికం. అలాగే నాకౌట్ రౌండ్లలో వరుసగా 3 క్లీన్ షీట్లు సాధించి డిఫెన్స్లోనూ రాణించింది. ఎంబాపే ఫామ్, మెరుపు వేగంతో చేసే కౌంటర్ ఎటాక్లు, కోచ్ డెషామ్ప్స్ టోర్నమెంట్ అనుభవం ఫ్రాన్స్ను హాట్ ఫేవరెట్గా నిలబెడుతున్నాయి.
2) స్పెయిన్: అజేయ పరంపర.. పటిష్టమైన రక్షణ
రక్షణాత్మక ఆటతీరుతో పాటు బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడంలో స్పెయిన్ దిట్ట అని లూయిస్ డి లా ఫ్యూంటె జట్టు మరోసారి నిరూపించింది. స్పెయిన్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క గోల్ మాత్రమే ఇచ్చింది. వారి డిఫెన్స్ను ఛేదించడం ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారింది.
మైకెల్ మెరినో చివరి నిమిషాల్లో సాధించిన గోల్స్ స్పెయిన్ పట్టుదలను చూపిస్తున్నాయి. లామిన్ యమాల్ మెరుపులు, మైకెల్ ఓయార్జబాల్ గోల్స్ ఆ జట్టుకు శ్రీరామరక్ష. స్పెయిన్ ప్రస్తుతం వరుసగా 36 మ్యాచ్ల అజేయ పరంపరతో అప్రతిహతంగా దూసుకుపోతోంది. అద్భుతమైన మిడ్ఫీల్డ్ నియంత్రణ, పటిష్టమైన డిఫెన్స్, ఓటమి ఎరుగని ఆత్మవిశ్వాసం స్పెయిన్ను ప్రమాదకరమైన జట్టుగా మార్చాయి.
3) ఇంగ్లాండ్: అవకాశాలను సృష్టించడంలో నెంబర్ 1
థామస్ టూచెల్ ఆధ్వర్యంలోని 'ది త్రీ లయన్స్' జట్టు విమర్శకుల ప్రశంసలు అందుకోకపోయినా, మైదానంలో మాత్రం అత్యంత ప్రభావవంతమైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. ఇంగ్లాండ్ ఈ టోర్నమెంట్లో ప్రత్యర్థి గోల్ పోస్ట్పై దాడి చేస్తూ ఏకంగా 23 కీలకమైన అవకాశాలను సృష్టించింది. మిగిలిన మూడు జట్ల కంటే ఇది చాలా ఎక్కువ.
జూడ్ బెల్లింగ్హామ్ జట్టుకు వెన్నెముకగా మారి, మెక్సికో, నార్వేలపై ఒంటరి పోరాటంతో మ్యాచ్లను గెలిపించాడు. 2018 నుండి ఇంగ్లాండ్ నాలుగు ప్రధాన అంతర్జాతీయ టోర్నమెంట్లలో సెమీఫైనల్కు చేరింది. వ్యూహాత్మక క్రమశిక్షణ, నిలకడగా అవకాశాలు సృష్టించడం, బెల్లింగ్హామ్ వంటి మ్యాచ్ విన్నర్ ఉండటం ఇంగ్లాండ్కు అతిపెద్ద ప్లస్ పాయింట్.
4) అర్జెంటీనా: ఒత్తిడిని జయించే డిఫెండింగ్ ఛాంపియన్స్
హై-ప్రెజర్ (అధిక ఒత్తిడి) మ్యాచ్లను ఎలా గెలవాలో అర్జెంటీనాకు తెలిసినంతగా బహుశా మరే జట్టుకూ తెలియదేమో! లియోనెల్ స్కలోని బృందం మరోసారి నాకౌట్ స్పెషలిస్ట్గా నిరూపించుకుంది. ఈ టోర్నమెంట్లో లియోనెల్ మెస్సీ ఇంకా గోల్ ఖాతా తెరవనప్పటికీ, జూలియన్ అల్వారెజ్, లౌటారో మార్టినెజ్ బాధ్యతను భుజాన వేసుకుని జట్టును నడిపిస్తున్నారు.
ప్రత్యర్థి బలహీనతలను బట్టి తమ ఆట శైలిని మార్చుకోవడంలో అర్జెంటీనా సిద్ధహస్తురాలు. ప్రపంచ కప్ చరిత్రలో అదనపు సమయం (Extra Time) లేదా పెనాల్టీల దాకా వెళ్లిన 13 మ్యాచ్లలో అర్జెంటీనా 11 సార్లు విజయం సాధించింది. గత ఛాంపియన్లనే పట్టుదల, నాకౌట్ మ్యాచ్లలో ఒత్తిడిని తట్టుకునే అపారమైన అనుభవం అర్జెంటీనాను రేసులో ముందుంచుతున్నాయి.
ఫీఫా ప్రపంచకప్లో భాగంగా జరగబోతున్న రెండు సెమీఫైనల్స్ మ్యాచ్ల షెడ్యూల్ విడుదల అయ్యింది. తొలి మ్యాచ్లో ఫ్రాన్స్ జట్టుతో స్పెయిన్ తలపడనుండగా.. భారత కాలమానం ప్రకారం జూలై 15 అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే అర్జెంటీనా, ఇంగ్లాండ్ టీమ్స్ మధ్య జూలై 16 అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రత్యక్షప్రసారం కానుంది. ఈ నలుగురు దిగ్గజాలలో ఫైనల్ చేరి, ప్రపంచ కప్ ముద్దాడే ఆ ఇద్దరు ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది!
Also Read: తప్పక గెలవాల్సిన మ్యాచ్..టీమ్ఇండియా గెలుస్తుందా? ఇంగ్లాండ్పై పట్టు సాధిస్తుందా?
Also Read: చెన్నై సూపర్ కింగ్స్తో 18 ఏళ్ల బంధానికి ముగింపు.. అతడ్ని పక్కన పెట్టిన సీఎస్కే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
