రాజేంద్ర నగర్లో 326 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ప్రకాష్గారు పంపిణీ చేశారు.
రాజేంద్రనగర్ ఎమ్మార్వో కార్యాలయంలో 326 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మార్వో రాములు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పెళ్లికి పేదింటి ఆడబిడ్డలకు డబ్బులిచ్చి అద్భుత పథకం అందించారన్నారు. ఈ కళ్యాణలక్ష్మి యోజన ద్వారా ఎంతో మంది పేద ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
బిల్డర్ నన్ను మోసం చేశాడు అంటూ హైదర్ నగర్ మేస్త్రీ రాము సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు ఇవ్వాల్సిన రూ.8 లక్షలు ఇవ్వలేదని, మొత్తం నగదు ఇస్తేనే సెల్ టవర్ దిగుతానని పట్టబట్టాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని అతడికి సర్ది చెప్పగా కిందికి దిగాడు।
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రాధికారులతో మరియు వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసి అధికారులతో నల్లచెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకుని చెరువు అభివృద్ధి కొరకు ఇప్పటికే నిధులు మంజూరైన కారణంగా త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే వర్షాలు పడినప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం కాకుండా పైప్లైన్ నిర్మాణం ,రిటర్నింగ్ వాల్స్ చేపట్టి దిగువకు నీరు వెళ్లే విధముగా చూడాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.