రాజేంద్ర నగర్లో 326 కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ప్రకాష్గారు పంపిణీ చేశారు.
Hyderabad, Telangana:రాజేంద్రనగర్ ఎమ్మార్వో కార్యాలయంలో 326 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మార్వో రాములు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ పెళ్లికి పేదింటి ఆడబిడ్డలకు డబ్బులిచ్చి అద్భుత పథకం అందించారన్నారు. ఈ కళ్యాణలక్ష్మి యోజన ద్వారా ఎంతో మంది పేద ఆడపిల్లలకు పెళ్లిళ్లు అయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
IPL 2026: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయం.. ఫోర్లతో చెలరేగిన యశస్వి
Guwahati, Assam:RR Won By 27 Runs: ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతూ ఓటమి లేకుండా వరుసగా మూడు విజయాలను ఖాతా వేసుకుంది. విజయంతో సీజన్ను ఆరంభించిన ముంబై ఇండియన్స్ రెండో ఓటమిని చవిచూసింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను 27 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడించింది. వర్షం పడి పిచ్ తడిచినా కూడా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 77 పరుగులు చేసి అదరగొట్టాడు.
Also Read: Iran Israel War: ఇరాన్కు డొనల్డ్ ట్రంప్ చివరి హెచ్చరిక.. ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో..?
గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్ దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. భారీ వర్షం పడడంతో మ్యాచ్ ఆలస్యమవగా.. 11 ఓవర్లకు మ్యాచ్ను కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు సాధించింది. ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకు పరిమితమైంది. మూడు విజయాలతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. ముంబై ఇండియన్స్ రెండు స్థానాలు పడిపోయింది.
Also Read: Pinarayi Vijayan: రేవంత్ రెడ్డికి కేరళం సీఎం పినరయి విజయన్ లాస్ట్ పంచ్
బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. బాల క్రికెటర్ సూర్యవంశీతోపాటు మిగతా బ్యాటర్లందరితో కలిసి ఆడుతూ ఆఖరి బంతి వరకు ఆడిన జైస్వాల్ నాటౌట్గా నిలిచాడు. 32 బంతుల్లో 77 పరుగులు చేసి అద్భుతం చేశాడు. వాటిలో 10 ఫోర్లు బాదడం ద్వారా 40 పరుగులు రాగా.. 4 సిక్సర్లు బాది చెలరేగి ఆడాడు. ఇక సూర్యవంశీ వైభవ్ 14 బంతుల్లో 39 పరుగులు చేసి రాణించగా.. ధ్రువ్ జురేల్ రెండు పరుగులకే పరిమితమయ్యాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ 20 పరుగులు చేయగా.. షిమ్రాన్ హిట్మెయిర్ 6 పరుగులు చేశాడు. తక్కువ ఓవర్లు ఉన్నా కూడా ముంబై బౌలర్లు ఏమాత్రం ప్రతాపం చూపించలేకపోయారు. సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా రాజస్థాన్ బ్యాటర్లు చిత్కొట్టడం విశేషం. స్టార్ బౌలర్లు బుమ్రా, హార్దిక్ పాండ్యా బౌల్ట్ ఒక్క వికెట్ తీయకపోగా.. అల్లా గజాన్ఫర్ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీశాడు.
Also Read: Unclaimed Money: మూలుగుతున్న రూ.లక్షా 2000 కోట్లు.. అందులో మీ డబ్బు ఉందా? అని తెలుసుకోవడం ఇలా
ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్కు ఆరంభమే భారీ షాక్ తగిలింది. పవర్ప్లేలోనే భారీగా వికెట్లు పడడంతో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులకు పరిమితమైంది. స్టార్ బ్యాటర్లు రియాన్ రికల్టన్ (8), రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (6) డబుల్ డిజిట్ స్కోర్ నమోదు చేయలేదు. తిలక్ వర్మ (14), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9), శార్దూల్ ఠాకూర్ (8), దీపక్ చాహర్ (6), బౌల్ట్ (1), జస్ప్రీత్ బుమ్రా (5*) తక్కువ పరుగులు చేయగా.. నమన్ దీర్, రూథర్ఫోర్డు తలా 25 చొప్పున పరుగులు చేసి ఓటమి అంతరాన్ని తగ్గించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Unclaimed Money: మూలుగుతున్న రూ.1,02,000 కోట్లు.. అందులో మీ డబ్బు ఉందా? అని తెలుసుకోవడం ఇలా
Wadgaon, Maharashtra:Your Money Your Right Programme: ప్రజల సొమ్ము పలు సంస్థల్లో లక్షల కోట్లు మూలుగుతున్నాయి. ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారి డబ్బు కోట్ల కొద్దీ పేరుకుపోయింది. అక్షరాల లక్షా 2 వేల కోట్ల డబ్బు దేశంలో అన్క్లెయిమ్డ్గా మిగిలింది. ఈ విషయం లబ్ధిదారులకు కూడా తెలియకపోవడం గమనార్హం. లెక్కలు తీస్తే బ్యాంకు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాల్లో ఇలా చాలా వాటిల్లో లక్షల కోట్ల డబ్బు ఆయా ఆర్థిక సంస్థల్లో మిగిలి ఉన్నాయి. వాటిని ఖాతాదారులు, వినియోగదారులు క్లెయిమ్ చేసుకోవడం లేదు.
Also Read: Iran Israel War: ఇరాన్కు డొనల్డ్ ట్రంప్ చివరి హెచ్చరిక.. ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో..?
ఇక్కడే మూలుగుతున్న డబ్బు
బీమా సంస్థలు (ఇన్సురెన్స్ కంపెనీలు): రూ.1,500 కోట్ల అన్క్లెయిమ్డ్ అకౌంట్లు ఉన్నాయి.
మ్యూచువల్ ఫండ్స్: రూ.3,400 కోట్లు అన్క్లెయిమ్డ్ పెట్టుబడులు
భారతీయ బ్యాంకులు: రూ.67,000 కోట్ల డిపాజిట్లు అన్క్లెయిమ్డ్
డివిడెండ్స్: రూ.9,000 కోట్లు అన్క్లెయిమ్డ్ డివిడెండ్స్
ఈ లెక్కలేనన్ని డబ్బు భారతీయ కుటుంబాలు ఎంతో కష్టపడి కూడబెట్టాయి. కష్టపడి పొదుపు చేసిన సొమ్మును ఆయా కుటుంబాలు అన్క్లెయిమ్ చేసుకోకపోవడం గమనార్హం. పేరుకుపోయిన ఈ అన్క్లెయిమ్ డబ్బును కొందరు మరచిపోయి ఉండవచ్చు. అసలు ఇలాంటి సొమ్ము ఉందని కొందరికి తెలియకపోవచ్చు. మరికొందరు తమ కుటుంబసభ్యులకు తెలియకుండా వీటిని తీసుకుని చెప్పకుండా మరణించినవారు కూడా ఉండి ఉండవచ్చు.
Also Read: Pinarayi Vijayan: రేవంత్ రెడ్డికి కేరళం సీఎం పినరయి విజయన్ లాస్ట్ పంచ్
లక్షల కోట్ల డబ్బు మూలుగుతుండడంతో ఈ కారణంగా అక్టోబర్ 2025లో భారత ప్రభుత్వం 'మీ సొమ్ము, మీ హక్కు' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. పౌరులు తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన సొమ్మును తిరిగి పొందేందుకు సహాయపడటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మీకు సంబంధించిన ఏదైనా సొమ్ము ఎవరూ క్లెయిమ్ చేసుకోకుండా మిగిలి ఉందో లేదో ఇలా తనిఖీ చేసుకోవచ్చు:
బ్యాంకు డిపాజిట్లు
అచేతనంగా ఉన్న బ్యాంకు ఖాతాలు, క్లెయిమ్ చేయని ఫిక్స్డ్ డిపాజిట్లు, మరచిపోయిన పొదుపు ఖాతాల కోసం ఇక్కడ తనిఖీ చేసుకునే అవకాశం ఉంది.
https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login
బీమా అన్క్లెయిమ్
గడువు ముగిసిన పాలసీలు, క్లెయిమ్ చేయని మరణ ప్రయోజనాలు (డెత్ బెనిఫిట్స్), మర్చిపోయిన బీమా వాటి గురించి ఈ కింది లింక్లో తనిఖీ చేయవచ్చు.
https://bimabharosa.irdai.gov.in/
మ్యుచువల్ ఫండ్స్
క్లెయిమ్ చేయని ఎంఎఫ్ రిడెంప్షన్లు, మర్చిపోయిన ఫోలియోలు, ఎప్పుడూ క్లెయిమ్ చేయని డివిడెండ్ల కోసం ఈ కింది లింక్లో తనిఖీ చేయవచ్చు.
https://app.mfcentral.com/investor/signin
డివైడెండ్, షేర్లు
అన్క్లెయిమ్డ్ డివైడెండ్స్, ఐఈపీఎఫ్కు షేర్లు బదలాయింపు, మరచిపోయిన ఈక్విటీ హోల్డింగ్స్
https://www.iepf.gov.in/content/iepf/global/master/Home/Home.html
ఈ సందర్భాలలో ఇవి ప్రత్యేకం
==> తల్లిదండ్రులు, తాతముత్తాతలు ఆర్థిక వ్యవహారాలు తెలుసుకోవడం
==> ఆస్తులు వారసత్వంగా లభించి, వాటికి సంబంధించిన పూర్తి రికార్డులు మీ వద్ద లేకపోతే
==> కొన్నేళ్ల కిందట భారతదేశంలో పెట్టుబడి పెట్టి విదేశాల్లో స్థిరపడితే
==> అనేకసార్లు నగరాలు లేదా ఉద్యోగాలు మార్చి ఉంటే
వెతికితే మీకు జాక్పాట్
==> మీకు, మీ కుటుంబానికి సంబంధించిన అన్క్లెయిమ్డ్ పెట్టుబడులు, ఇన్సురెన్స్, డివైడెండ్లు, షేర్లు, డిపాజిట్లు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ కింది చర్యల ద్వారా సాధ్యమవుతుంది. పైన పేర్కొన్న నాలుగు పోర్టల్లను స్వయంగా తనిఖీ చేసుకోవాలి.
==> మీ తల్లిదండ్రులు, వృద్ధ కుటుంబసభ్యుల కోసం తనిఖీ చేసుకోవాలి. డిజిటల్ యుగానికి ముందు చేసిన పెట్టుబడుల నుంచి క్లెయిమ్ చేయని డబ్బు వారి వద్ద ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.
==> అన్ని పెట్టుబడుల డిజిటల్ రికార్డులను ఉంచండి. ఖాతా నంబర్లను సేవ్ చేయండి, ఒక మాస్టర్ ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ను నిర్వహించుకోవాలి.
==> పెట్టుబడుల గురించి కుటుంబానికి తెలపాలి. డబ్బు క్లెయిమ్ చేయకుండా ఉండటానికి అతిపెద్ద కారణం పెట్టుబడులు ఉన్నాయనే విషయం కుటుంబసభ్యులకు తెలియకపోవడం. చాలాకాలం గడిస్తే ఈ డబ్బు ప్రభుత్వ నిధులకు బదిలీ అవుతాయి. అక్కడ తిరిగి పొందడం చాలా కష్టమవుతుంది.
==> మీరు, మీ కుటుంబసభ్యులు కష్టపడి సంపాదించిన డబ్బు వృథాగా వదులుకోవద్దు. ఒక 20 నిమిషాలు కేటాయిస్తే మీ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, డిపాజిట్లు, షేర్లు, బీమా, డివైడెండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటివి తెలుస్తాయి. దీనికి పైన పేర్కొన్న నాలుగు ప్రభుత్వ పోర్టల్స్ను సంప్రదించి పరిశీలించాలి.
==> ఈ వెతికే సమయంలో అన్క్లెయిమ్డ్కు సంబంధించిన డబ్బు వంటివి లభిస్తే అది మీకు జాక్పాట్ తగిలినట్టే. ఆ డబ్బుతో మీ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడమో లేదంటే తిరిగి పెట్టుబడిగా పెట్టవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Pinarayi Vijayan: రేవంత్ రెడ్డికి కేరళం సీఎం పినరయి విజయన్ లాస్ట్ పంచ్
Ayyampuzha, Kerala:Keralam Elections: ఉత్కంఠ రేపుతున్న కేరళం ఎన్నికల్లోకి వెళ్లి ప్రచారం చేసి అక్కడి ప్రభుత్వాన్ని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇరకాటంలో పడ్డారు. అదే స్థాయిలో కేరళం రాజకీయ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు పొందుతున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారం చివరి రోజు అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్ చివరి పంచ్ ఇచ్చారు. తనకు రాసిన లేఖపై బదులిస్తూ.. అతడితో చర్చకు ఇగే ఉద్దేశం తనకు లేదని కొట్టిపారేశారు. అతడి పరిపాలనపై తెలంగాణ ప్రజలే తీర్పు ఇవ్వాలని చురకలు అంటించారు.
Also Read: Iran Israel War: ఇరాన్కు డొనల్డ్ ట్రంప్ చివరి హెచ్చరిక.. ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో..?
కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా లేఖ రాసిన విషయం తెలిసిందే. దానికి తాజాగా కేరళం సీఎం పినరయి విజయన్ మీడియా సమావేశంతోపాటు లేఖ రూపంలో బదులిచ్చారు. రేవంత్ రెడ్డిని పూచికపుల్లతో తీసిపారేసినట్టు తీసిపడేశారు. తనతో చర్చకు రావాలని లేఖ రాసిన రేవంత్ రెడ్డికి.. ఆ అవసరం తనకు లేదని తెలిపారు. 'రేవంత్తో చర్చకు దిగేందుకు తెలంగాణలో పార్టీ ఉన్నాయి. ఆయన ప్రభుత్వ తీరుపై అక్కడి ప్రజలే తీర్పు ఇవ్వాలి' అని పినరయి విజయన్ పేర్కొన్నారు.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. పీఆర్సీ కోసం భారీ యాక్షన్ ప్లాన్
'కేరళ ప్రభుత్వ పనితీరుపై ఎంతో గౌరవప్రదంగా.. హుందాగా విమర్శలు చేశా. కానీ అసహనంతో కూడిన వ్యాఖ్యలకు నేను అదే రీతిలో స్పందించలేను. మీరు నా రాష్ట్రానికి (కేరళం) సందర్శించినప్పుడు ఒక అతిథికి చేయాల్సిన అన్ని మర్యాదలు చేస్తానని మాట ఇస్తున్నా' అని చెప్పి రేవంత్ రెడ్డి వెగటు భాషపై కేరళం సీఎం పినరయి విజయన్ తనదైన శైలిలో విమర్శించారు. కేరళ ప్రజలకు కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో చూపించాలని రేవంత్ రెడ్డికి కేరళ సీఎం పినరయి విజయన్ సవాల్ చేశారు.
Also Read: Sathankulam case: లాక్డౌన్లో కిరాణ దుకాణం తెరిచారని వేధింపులు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
కేరళంలో ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. మూడు వారాలకుపైగా హోరాహోరీగా ప్రచార పర్వం సాగగా.. అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలు, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడంతో హాట్హాట్గా రోజులు గడిచాయి. ధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్, ఎన్డీఏ కూటములు భారీ స్థాయిలో ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. ఈనెల 9వ తేదీన ఒకే దశలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 2.71 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పు చెప్పనున్నారు. పినరయి విజయన్ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి కేరళ రాజకీయాల్లో రికార్డు నెలకొల్పాలని భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Govt Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. పీఆర్సీ కోసం భారీ యాక్షన్ ప్లాన్
Baddipadaga, Telangana:Govt Employees Big Action Plan: వేతన సవరణ సంఘంతోపాటు కరువు భత్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలా ఎన్నో సమస్యలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అపరిష్కృతంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో భారీగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదు. రెండున్నరేళ్ల తర్వాత కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పోరాటానికి సిద్ధమయ్యారు. గతంలో కూడా ఉద్యమ కార్యాచరణ ప్రకటించినా ప్రభుత్వం కమిటీలు, చర్చలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇక ఊరుకునేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు భారీ పోరాటం ప్రకటించారు. ముఖ్యంగా వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణ రచించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగులు భారీ హెచ్చరిక చేశారు.
Also Read: Sathankulam case: లాక్డౌన్లో కిరాణ దుకాణం తెరిచారని వేధింపులు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
హైదరాబాద్ మలక్పేట్లోని రెవెన్యూ భవన్లో మంగళవారం ఉద్యోగ జేఏసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారంపై చర్చించారు. తమను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై జేఏసీ నాయకులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పీఆర్సీ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించొద్దని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి, జూన్ 2వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Also Read: DJ Dispute: గంగమ్మ జాతరలో చిచ్చుపెట్టిన డీజే.. వేట కొడవళ్ల దాడిలో ఒకరి మృతి
'పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన రూ.700 కోట్లు సరిపోవు. వాస్తవ అవసరం రూ.1500 కోట్లకు పైగా ఉంది. ప్రతి నెల సుమారు 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో బకాయిలు భారీగా పెరుగుతున్నాయి' అని ఉద్యోగ జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు రూ.750 కోట్లు, రెగ్యులర్ ఉద్యోగులకు రూ.750 కోట్లు చొప్పున ప్రతి నెల విడుదల చేయాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల అమలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆరోపించింది. మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం తీసుకున్నప్పటికీ అమలు కాకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మే 1 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి, పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కోరారు. ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆకునూరి మురళీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము చర్యలు చేపడతామని హెచ్చరించారు.
Also Read: RCB vs CSK: ఐపీఎల్ 2026లో ఆర్సీబీ డబుల్ ధమాకా.. చెన్నై హ్యాట్రిక్ ఓటమి
కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఉద్యోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. ప్రభుత్వం విచారణ చేయించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు మారం జగదీశ్వర్, శ్రీనివాస్ రావుచకోరారు. లేదంటే ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిక జారీ చేశారు. డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఈ సందర్భంగా జేఏసీ నిర్ణయించింది.
ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణ
ఏప్రిల్ 17న నల్ల బ్యాడ్జీలతో నిరసన
మే 5న రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు
మే 14న కీలక సమావేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Snakes Video: ఓర్నాయనో.. చిమ్మ చీకట్లో నాలుగు నాగు పాముల సయ్యాటలు.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
Hyderabad, Telangana:Four Venomous Snakes mating each other in forest rare video: పాములకు చెందిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్ కోబ్రాల వీడియోలను ఆసక్తిగా చూస్తున్నారు. అందుకే ఎక్కవ ఎలాంటి పాముల వీడియోలు కన్పించిన వెంటనే తమ ఫోన్లలో రికార్డు చేస్తున్నారు. ఇటీవల పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. బూట్లలో, బెడ్ ల కింద, సోఫాల కింద, దిండుల్లో దాక్కుంటున్నాయి. కారు డీక్కిల్లో , సజ్జల మీద పాములు నక్కి ఉంటున్నాయి. ఏ మాత్రం నెగ్లీజెన్సీగా ఉన్న పాము కాటుకు గురౌతారు. అందుకు చీకటిలో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు. కోబ్రాలు నిరంతరం రాత్రి పూట వేటడతాయి.
ఈ క్రమంలో పాములు రాత్రిపూట బైటకు వెళ్లి రొమాన్స్ లు చేస్తాయి. ముఖ్యంగా ఆడపాములు వాటి శరీరంనుంచి కొన్ని రకాలు రసాయనాల్ని వదులుతాయి.వీటిని మగపాములు గుర్తిస్తాయంట . ఆడ తోడు కోసం అవి వెతుక్కుంటూ వస్తాయంట. అందుకే రాత్రి పూట కోబ్రాలు ఎక్కువగా బైటకు వచ్చి చెట్లలో సంచరిస్తాయి.
ప్రస్తుతం ఒక వీడియో బాగా వైరల్గా మారింది. దీనిలో నాలుగు పాములు చిమ్మని చీకట్లో సయ్యాటలు ఆడుతున్నాయి. అవి నాలుగు కూడా ఒకవైపు కాటు వేసుకుంటూ, మరోవైపు సయ్యాటలు ఆడుతున్నాయి. మరీ ఈ ఘటన ఎలా కెమెరాకు ఎలా చిక్కిందో కానీ మొత్తంగా ఈ వీడియో మాత్రం నెట్టింట వైరల్గా మారింది.
నాలుగు పాములు ఈవిధంగా మీటింగ్ కు కూర్చున్నాయా..?..ఈ రొమాన్స్ ఏంట్రా బాబు అంటూ నెటిజన్లుఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా కోబ్రాల వీడియో కాస్త నెట్టింట షేక్ చేస్తుంది. మరికొంత మంది మాత్రం ఆ సమయంలో పాములు చాలా కోపంగా ఉంటాయని వాటి జోలికి పొవద్దని చెప్తున్నారు.
Sony సెన్సార్ కెమెరా, 5500mAh బ్యాటరీ.. నేడే OnePlus Nord 6 గ్రాండ్ ఎంట్రీ!
Hyderabad, Telangana:Oneplus Nord 6 Launch News: భారత మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వన్ప్లస్ తన వినియోగదారులకు అదిరిపోయే స్మార్ట్ఫోన్ ఈ రోజు విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ నార్డ్ సిరీస్లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది చాలా శక్తివంతమైన ఫీచర్స్తో పాటు అద్భుతమైన డిజైన్తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ఫోన్, అత్యాధునిక సాంకేతికతతో పాటు ఆకర్షణీయమైన ధరలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది OnePlus Nord 6 పేరుతో విడుదల కాబోతోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ కానుంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ OnePlus Nord 6 స్మార్ట్ఫోన్ కంపెనీ మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్స్లో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోని బేస్ వేరియంట్ 8GB ర్యామ్తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అందుబాటులోకి రాబోతోంది. ఇక దీని ధర రూ.19,999 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే సెంకండ్ వేరియంట్ 256GB స్టోరేజ్ వేరియంట్తో రూ.22,999 నుంచి అందుబాటులోకి రాబోతోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్ను మొదటి సేల్లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఊహించని బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందుబాటుటో ఉండబోతోంది.
ఇక ఈ ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇందులో కంపెనీ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ (FHD+) అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉండటం వల్ల గేమింగ్ చేసేందుకు, వీడియో స్ట్రీమింగ్ చాలా స్మూత్గా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. దీనిలో శక్తివంతమైన క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇది మల్టీ టాస్కింగ్ చేసేవారికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో కంపెనీ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్పై తీసుకు వచ్చింది.
Also Read: Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!
ఈ స్మార్ట్ఫోన్ వెనక భాగం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఫోటోగ్రఫీ కోసం Sony LYT-600 సెన్సార్తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది తక్కువ వెలుతురు, ఎక్కువ చీకటి ప్రదేశాల్లో స్పష్టమైన చిత్రాలను అందించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇది 5500mAh భారీ సామర్థ్యంతో పాటు 80W సూపర్ వూక్ (SUPERVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది. అంతేకాకుండా ఇందులో ఎన్నో రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!
Hyderabad, Telangana:Best Used Car Showrooms In Delhi: సొంత కారు ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కారు కొనుగోలు చేయాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ బడ్జెట్ కారణంగా కొనుగోలు చేయలేకపోతారు. ఒక వైపు కార్ల ధరలు విపరీతంగా పెరగడం వల్ల కార్ల కల మరింత నెరవేరకుండా పోతోంది. అయితే, ఇలాంటి వారి కోసం ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ (NSP)లో ఉండే సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. షోరూమ్ కండిషన్లో ఉన్న సరికొత్త మోడళ్లు కూడా అత్యంత చీప్ ధరల్లో అందుబాటులో ఉండడం విశేషం..
ఇక్కడ ఉండే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో పాత కార్లే కాకుండా, ఐదు ఆరు నెలల క్రితం కొనుగోలు చేసిన కార్లు కూడా అత్యంత చీప్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న మహీంద్రా స్కార్పియో-ఎన్ (Scorpio-N) 2025 మోడల్ కార్లు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అంతేకాకుండా వీటిపై దాదాపు రూ.2 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటలో ఉండడం విశేషం.. వీటికి ఇక్కడ అదనంగా లక్షల విలువైన యాక్సెసరీస్, పిపిఎఫ్ (PPF) కోటింగ్ వంటివి ఉచితంగా అందిస్తున్నారు.
ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం ఈ మార్కెట్లో చీప్ ధరలకే మంచి మంచి కార్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మహీంద్రా థార్ (Thar) కార్ల భారీ తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. దీంతో పాటు కొత్త మోడల్ మాడిఫైడ్ రాక్స్ (Thar Roxx) ఇక్కడ అత్యంత చీప్ ధరలకు లభించడం విశేషం.. ఈ కార్లకు వెయిటింగ్ పీరియడ్ భరించలేని వారు ఇక్కడ దాదాపు రూ.4 లక్షల తగ్గింపు ధరకే పొందండి.
ఇవే కాకుండా ఇక్కడి మార్కెట్లో లగ్జరీ కార్లు కూడా లభిస్తుంది. దీంతో పాటు రూ.4 లక్షల నుంచి రూ.9 లక్షల బడ్జెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా, వెన్యూ వంటి కార్లు కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా అందరూ ఎంతగానో ఇష్టపడే ఎంజీ హెక్టర్ (MG Hector) వంటి ప్రీమియం ఎస్యూవీలపై ఏకంగా రూ.7 నుంచి దాదాపు రూ.8 లక్షల వరకు తగ్గింపుతో విక్రయిస్తున్నారు. దీంతో పాటు మహీంద్రా ఎక్స్యూవీ 700 (XUV 700) వంటి టాప్ ఎండ్ మోడళ్లు కూడా అత్యంత భారీ డిస్కౌంట్తో లభిస్తున్నాయి.
Also Read: Dhurandhar The Revenge: ‘దురందర్ 2’లో ప్రధాని మోడీ.. దావూద్ లదే రోల్..
ఈ మార్కెట్లో కార్లు కొనుగోలు చేయాలనుకునేవారికి కొన్ని సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ అద్భుతమైన అవకాశాలను కూడా అందిస్తున్నాయి. ఇందులో భాగంగా సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్న వారికి కూడా లోన్ సదుపాయం కూడా అందిస్తున్నారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడికైనా హోమ్ డెలివరీ చేయబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక్కడ కొనుగోలు చేసేవారికి ప్రతి కారుకు సర్వీస్ హిస్టరీతో పాటు కంపెనీ వారంటీని కూడా అందిస్తున్నారు.
Also Read: Dhurandhar The Revenge: ‘దురందర్ 2’లో ప్రధాని మోడీ.. దావూద్ లదే రోల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Jagtial: జగిత్యాలలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో తొమ్మిదేళ్ల బాలుడి మృతి!
Mannegudem, Telangana:9-year-old Boy Heart Attack Latest News: చిన్నారి నవ్వులతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది.. తోటి స్నేహితులతో ఆడుకుంటూ.. చదువుకుంటూ తల్లిదండ్రుల కళ్లముందే అటు ఇటు తిరుగుతున్న ఆ బాలుడిని మృత్యువు గుండెపోటు రూపంలో కబళించింది. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.. కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే గుండెపోటుతో బాలుడు మృతి చెందడం అందిరినీ బాధిస్తోంది..
పొరండ్ల గ్రామానికి చెందిన నిశాంత్ (9) స్థానిక ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. సోమవారం కావడంతో గ్రామంలో నిర్వహించిన ఒక అన్నదానానికి నిశాంత్ వెళ్లాడు. ఈ సమయంలో అందరితో కలిసి ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆ బాలుడు.. చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన అక్కడి వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కిందపడి పోయిన బాలుడుని చూసి తల్లిదండ్రులు, బంధువులు కంగారుపడిపోయి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆస్పత్రికి చేరుకునే లోపే నిశాంత్ పరిస్థితి విషమించింది. మార్గమధ్యలోనే అతడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. అతి చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ రావడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని ప్రాథమికంగా వైద్యులు నిర్ధారించారు.
Also Read: Dhurandhar The Revenge: ‘దురందర్ 2’లో ప్రధాని మోడీ.. దావూద్ లదే రోల్..
నిశాంత్ మరణవార్త తెలియగానే.. పొరండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అందొచ్చిన కొడుకు కళ్లముందే విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. "పొద్దున్నే బడికి వెళ్తానని చెప్పిన వాడు.. ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్తాడనుకోలేదు" అంటూ వారు పడుతున్న ఆవేదన చూసి గ్రామస్తుల కూడా కన్నిళ్లు పెట్టుకుంటున్నారు.
Also Read: Dhurandhar The Revenge: ‘దురందర్ 2’లో ప్రధాని మోడీ.. దావూద్ లదే రోల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Why China Buying Gold: భారీగా బంగారాన్ని కొంటున్న చైనా... అసలు ప్లాన్ ఏంటి? భారీ కుట్రకు తెరలేపిందా?
Secunderabad, Telangana:China Gold Reserve vs US Dollar: ప్రపంచ దేశాలన్నీ యుద్ధ మేఘాల మధ్య చిక్కుకుని, చమురు, గ్యాస్ కొరతపై ఆందోళన చెందుతుంటే, డ్రాగన్ దేశం చైనా మాత్రం అత్యంత వ్యూహాత్మకమైన అడుగులు వేస్తోంది. గత 16 నెలలుగా ఎటువంటి హడావిడి లేకుండా చైనా రికార్డు స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, ప్రపంచంలో ఐదవ అతిపెద్ద బంగారు నిల్వలు కలిగిన చైనా, తన ఖజానాను నిరంతరాయంగా నింపుకుంటూ పోతోంది.
16 నెలలుగా ఆగని బంగారం వేట:
కేవలం 2026 ఫిబ్రవరి నెలలోనే చైనా పీపుల్స్ బ్యాంక్ తన బులియన్ నిల్వలను ఏకంగా 30,000 ట్రాయ్ ఔన్సులు పెంచుకుంది. దీంతో చైనా వద్ద ఉన్న మొత్తం స్వచ్ఛమైన బంగారు నిల్వలు 74.22 మిలియన్ ఔన్సులకు (సుమారు 2,307 టన్నులు) చేరుకున్నాయి. అమెరికా డాలర్ ఆధిపత్యానికి గట్టి సవాలు విసరడమే లక్ష్యంగా చైనా ఈ భారీ కొనుగోళ్లకు పాల్పడుతున్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్, మధ్యప్రాచ్య యుద్ధాల నేపథ్యంలో సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారంపై చైనా తన పట్టును బిగిస్తోంది.
వెండిపై కూడా 'డ్రాగన్' కన్ను:
చైనా కేవలం బంగారంపైనే కాకుండా, "తెల్ల లోహం" అని పిలిచే వెండిపై కూడా తన ఆకలిని పెంచుకుంటోంది. 2026 మొదటి రెండు నెలల్లోనే చైనా ఏకంగా 790 టన్నులకు పైగా వెండిని దిగుమతి చేసుకుంది. ముఖ్యంగా హాంకాంగ్ ద్వారా గరిష్ట స్థాయిలో వెండిని సేకరించేందుకు చైనా ఎగబడుతోంది. దీనికి ప్రధాన కారణం భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ రంగానికి ఉండే డిమాండ్ అని చెప్పవచ్చు. సోలార్ ప్యానెల్ తయారీలో చైనా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది, వీటికి వెండి అత్యంత అవసరం.
డాలర్ ఆధిపత్యానికి చైనా చెక్:
అసలు చైనా ఇంతలా బంగారం నిల్వలను పెంచుకోవడం వెనుక ఉన్న అసలు వ్యూహం అమెరికా డాలర్ను దెబ్బకొట్టడమే. బ్రిక్స్ (BRICS) దేశాలు ప్రతిపాదించిన కొత్త పేమెంట్ ఇనిషియేటివ్ ద్వారా డాలర్ వాడకాన్ని తగ్గించి, తమ సొంత కరెన్సీలను బలోపేతం చేయాలని చైనా భావిస్తోంది. ఒక దేశం వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అంత సుస్థిరంగా మారుతుంది. ఇప్పటికే అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తులలో బంగారం యూరోను అధిగమించి రెండవ స్థానానికి చేరుకుంది.
అమెరికాను ఓడించడం సాధ్యమేనా?
అయితే, అమెరికాను ఓడించడం చైనాకు అంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే 8,133 టన్నుల బంగారు నిల్వలతో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. జర్మనీ (3,350 టన్నులు), ఇటలీ (2,452 టన్నులు) వంటి దేశాలు కూడా చైనా కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. మన దేశం భారతదేశం 880 టన్నులతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా తన విదేశీ మారక నిల్వల్లో 78% బంగారాన్ని కలిగి ఉండగా, చైనా వాటా కేవలం 7% మాత్రమే.
ఆర్థిక భద్రతే లక్ష్యం
చైనా తన నిల్వలను త్వరలోనే 5,000 టన్నులకు చేర్చి అమెరికాకు మరింత చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు ఒడిదుడుకులకు గురవుతున్న తరుణంలో, చైనా ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ తన విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరుచుకుంటోంది. డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య తన ఆర్థిక భద్రతను కాపాడుకోవడమే చైనా అసలు ప్లాన్ అని స్పష్టమవుతోంది.
ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన టాప్ 10 దేశాలు:
అమెరికా: 8133 టన్నులు
జర్మనీ: 3350 టన్నులు
ఇటలీ: 2452 టన్నులు
ఫ్రాన్స్: 2437 టన్నులు
రష్యా: 2330 టన్నులు
చైనా: 2304 టన్నులు
స్విట్జర్లాండ్: 1040 టన్నులు
భారతదేశం: 880 టన్నులు
జపాన్: 846 టన్నులు
టర్కీ: 641 టన్నులు
Also Read: Mahindra XUV 3XO Vs Maruti Brezza: బడ్జెట్ SUVలలో ఏది తోపు? ఫీచర్లు, ధర, మైలేజ్లో దేనిది వాపు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Mars Saturn Conjunction: శని-కుజుల కలయిక.. ఏ రాశి వారికి ధన నష్టం? ఎవరికి మానసిక ఒత్తిడి?
Hyderabad, Telangana:Mars Saturn Conjunction Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏడాదిలోని ఏప్రిల్ నెలలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా కుజుడు, సూర్యుడు లాంటి ప్రధాన గ్రహాలు కదలికలు చేబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా బాగుంటే మరికొన్ని రాశి చక్రాలకు తీవ్ర సమస్యలు తప్పవని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే కుజ, శని గ్రహాలు కలయిక జరపబోతున్నాయి. దీంతో కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి రాబోతోంది. అంతేకాకుండా ఈ సమయంలో అంగారక యోగం కూడా ఏర్పడబోతోంది. అలాగే మూడు ప్రధాన రాశులవారు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశులవారిపై అంగారక యోగం ప్రభావం
మేష రాశి:
అంగారక యోగం ఎఫెక్ట్తో మేష రాశివారికి ఈ సమయం ఊహించని సమస్యలు వస్తాయి. అంతేకాకుండా శని, కుజుల ప్రభావంతో ఆటంకాలు కూడా ఏర్పడతాయి. దీంతో పాటు ఆర్థిక విషయాల్లో తప్పకుండా ఆచితూచి ఆలోచించడం చాలా మంచిది. అలాగే అనవసర ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. మానసిక సమస్యలు కూడా విపరీతంగా పెరుగుతాయి. దీంతో పాటు తీవ్ర ఒత్తిడికి కూడా గురవుతాయి. అలాగే వ్యాపారస్తులకు పెట్టుబడుల్లో తీవ్ర ఇబ్బందులు కూడా తలెత్తే ఛాన్స్లు ఉన్నాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా మాట తీరు వల్ల కుటుంబ సభ్యులతో మనస్పర్థలు రావచ్చు. వాహనాలు నడిపే క్రమంలో కూడా తప్పకుండా జాగ్రత్త అవసరమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కోపాన్ని అదుపుతో ఉంచుకోవడం చాలా ముఖ్యం..
కుంభ రాశి:
శని కదలికల కారణంగా కుంభ రాశివారిపై కూడా ఊహించని ప్రభావం పడుతుంది. వీరికి కుజుడు స్పెషల్ ఎఫెక్ట్తో ఊహించని ధన నష్టం కలుగుతుంది. అంతేకాకుండా కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా అద్భుతమైన సమయంగా కూడా భావించవచ్చు. అలాగే ప్రతి పనిలోనూ అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు సమస్యలు వచ్చిన్నప్పడు చాలా ఓపికతో ముందుకు సాగడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. లేకపోతే మరిన్ని సమస్యలు కూడా రావొచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KKR vs PBKS Abandoned: కలకత్తాకు భారీ షాక్.. పంజాబ్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు
Kolkata, West Bengal:KKR vs PBKS Match Abandoned: కొత్త ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన తర్వాత సత్తా చాటాలని చూస్తున్న కలక్తా నైట్రైడర్స్కు పరిస్థితులు సహకరించడం లేదు. రెండు మ్యాచ్ల్లో సత్తా చాటినా ఫలితం మాత్రం నిరాశ ఎదురవగా.. సొంత గడ్డపై పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసి తొలి విజయాన్ని పొందాలనుకుంటే వర్షం రూపంలో అడ్డంకి ఏర్పడింది. ఏకధాటిగా మూడు గంటలకు పైగా వర్షం పడడంతో జరగాల్సిన మ్యాచ్ రద్దయ్యింది. ఈ సీజన్లో వర్షం కారణంగా రద్దయిన తొలి మ్యాచ్ ఇదే. మ్యాచ్ రద్దు కలకత్తాకు తీవ్ర నిరాశ మిగిల్చగా.. వరుస విజయాలతో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్కు పాయింట్ల పట్టికలో మరో ముందడుగు వేసింది.
Also Read: Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో అధ్వానం.. ఖర్చీఫ్లతో తుడుచుకున్న ప్రేక్షకులు
ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం సాయంత్రం కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన కలకత్తా నైట్రైడర్స్ భారీ ఇన్నింగ్స్ నమోదు చేయాలని మైదానంలోకి దిగింది. మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే వర్షం ప్రారంభమైంది. ఎంతకీ వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ను రిఫరీలు రద్దు చేశారు. అయితే అప్పటికే బ్యాటింగ్కు దిగిన కలకత్తా 3.4 ఓవర్లు ఆడి 2 వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (6), కామెరూన్ గ్రీన్ (4) అతి తక్కువ పరుగులకే ఔటయ్యారు. క్రీజులో కెప్టెన్ అజింక్యా రహనే (6), అంగ్క్రిష్ రఘువంశీ (7) ఉన్నారు. ఆరంభమే కలకత్తా బౌలర్లు పైచేయి సాధించారు. వేసిన రెండు ఓవర్లలోనే క్సేవియర్ బార్ట్లెట్ రెండు వికెట్లు తీసి కలకత్తాకు భారీ షాక్ ఇచ్చాడు. హర్ష్దీప్ రెండు ఓవర్లు వేసి 16 పరుగులు ఇచ్చాడు.
Also Read: RCB vs CSK: ఐపీఎల్ 2026లో ఆర్సీబీ డబుల్ ధమాకా.. చెన్నై హ్యాట్రిక్ ఓటమి
మొదట తేలికపాటి వర్షం పడడంతో తగ్గిపోతుందని.. తిరిగి మ్యాచ్ ప్రారంభమవుతుందని క్రికెట్ అభిమానులు భావించారు. కొన్ని నిమిషాల్లోనే మోస్తరు నుంచి భారీ వర్షంగా మారింది. దాదాపు రెండున్నర గంటల తర్వాత వర్షం తెరపనిచ్చింది. అయితే భారీ వర్షం కారణంగా పిచ్ మొత్తం తడిసి ముద్దయ్యింది. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో ఓవర్లు కుదించి ఆడించే పరిస్థితి కూడా లేకపోయింది. దీంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. మ్యాచ్ రద్దు కారణంగా ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. 5 పాయింట్లతో పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానానికి చేరుకోగా.. కలకత్తాకు ఒక పాయింట్తో ఖాతా తెరిచింది.
Also Read: Sathankulam case: లాక్డౌన్లో కిరాణ దుకాణం తెరిచారని వేధింపులు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
రద్దవడమే మంచిది..
వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడాన్ని ఒకవిధంగా కలకత్తా అభిమానులు మంచి పరిణామమే అని భావిస్తున్నారు. ఎందుకంటే మూడు ఓవర్లు కూడా పూర్తి కాకముందే రెండు వికెట్లు కోల్పోవడంతో తర్వాతి మ్యాచ్ పరిస్థితి ఏమిటో అర్థమైంది. వర్షం రాకుండా మ్యాచ్ కొనసాగి ఉంటే ఇది కూడా ఓటమి చవిచూసేవారమని.. వర్షం రావడం మంచికే అని అభిప్రాయపడుతున్నారు. మ్యాచ్ రద్దవడంతో ఒక పాయింట్ అయినా వచ్చిందని కలకత్తా అభిమానులు సంతోషిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Amaravati Gazette Notification: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి..అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రప్రభుత్వం!
Amaravathi, Andhra Pradesh:Amaravati Gazette Notification News: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గత కొన్నేళ్లుగా నెలకొన్న సందిగ్ధతపై ఇప్పుడు తెరపడింది. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి నుంచే ఇక పరిపాలన మొత్తం జరగనుంది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో.. ఓ చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ.. 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) 2026' చట్టం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లు-2026 పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత.. సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరింది. ఆ తర్వాత తాజాగా కేంద్ర న్యాయశాఖ అమరావతి రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీతో పాటు పార్లమెంట్లోని ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఇకపై అమరావతి ఉండనుంది.
ఏప్రిల్ 1, 2వ తేదీల్లో పార్లమెంట్లోని లోక్సభ, రాజ్యసభ సభలు ఆమోదం తెలిపాయి. అయితే ఈ బిల్లుపై ఉభయసభల్లో సుమారు 5 గంటల పాటు చర్చ జరిగింది. అయితే ఈ సవరణ బిల్లులో ఎలాంటి సవరణలు లేకుండానే ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అమరావతి రాజధానికి చట్టబద్ధత రావడం పట్ల ఆ ప్రాంత రైతులు సంబరాలు చేసుకున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి పాదయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
అమరావతిని రాజధానిగా చట్టబద్దత వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు, అంతర్జాతీయ సంస్థల నుంచి నిధుల సేకరణకు అనుకూలంగా మారనుంది. పెట్టుబడుల రాకకు పూర్తిస్థాయి భరోసా లభించినట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగానికి.. ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం వల్ల రైతుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అమరావతి రాజధానికి సుదీర్ఘ కాలం పాటు సాగిన పోరాటానికి ఇది విజయం అని వారంతా భావిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన అమరావతి గెజిట్ నోటిఫికేషన్లో కొన్ని కీలక అంశాలను పొందుపరిచారు. గత ప్రభుత్వం హయంలో చర్చకు వచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను పక్కన పెట్టడమే కాకుండా అమరావతిని పూర్తిస్థాయి.. పరిపాలన, న్యాయ, శాసన రాజధానిగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినట్లు అయ్యింది. అదే విధంగా సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) భూములను మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు పూర్తిస్థాయిలో అనుమతులు దక్కినట్లే. ఈ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా గతంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐకానిక్ భవనాలైన హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ వంటి మౌలిక సదుపాయల కల్పన కోసం జెట్ స్పీడ్లో ప్రారంభించేందుకు మార్గం సుగమం అయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sathankulam case: లాక్డౌన్లో కిరాణ దుకాణం తెరిచారని వేధింపులు.. 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
Sathankulam, Tamil Nadu:Madurai Court Awards Death Penalty: కరోనా సమయంలో లాక్డౌన్ ఉండగా దుకాణం తెరచి ఉంచారని కిరాణ దుకాణం నిర్వహిస్తున్న తండ్రీ కొడుకులను పోలీస్ స్టేషన్లో వేధింపులకు గురిచేసి వారి మృతికి కారణమైన పోలీసులపై మధురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లాకప్ డెత్ కేసును తీవ్రంగా పరిగణించిన మధురై న్యాయస్థానం అమాయకులైన ఇద్దరి ప్రాణం తీసిన పోలీసులకు మరణశిక్ష విధించింది. తండ్రీ కొడుకులను చిత్రహింసలకు గురిచేసిన వారికి ఉరిశిక్ష వేయడం సంచలనం సృష్టించింది.
Also Read: DJ Dispute: గంగమ్మ జాతరలో చిచ్చుపెట్టిన డీజే.. వేట కొడవళ్ల దాడిలో ఒకరి మృతి
తమిళనాడు మధురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్, బెన్నిక్స్ కస్టోడియల్ మరణానికి కారణమైన తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్-ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్తోపాటు హెడ్ కానిస్టేబుళ్లు మురుగన్, సమిదురై, కానిస్టేబుళ్లు ముత్తుర, సెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలుముత్తుకు కోర్టు ఉరిశిక్ష విధించింది. దాదాపు 6 ఏళ్ల పాటు విచారణ జరగ్గా.. ఈ కేసులో సీబీఐ కీలక సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ రిపోర్టులను కోర్టుకు సమర్పించింది. వాటిని పరిశీలించిన అనంతరం సమగ్ర విచారణ చేసిన ధర్మాసనం తీవ్రమైన శిక్ష విధించింది.ఈ కేసు 5 సంవత్సరాలుగా మధురై జిల్లా క్రిమినల్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్లో ఉండగా.. జడ్జి ముత్తుకుమారన్ ఏప్రిల్ 9వ తేదీన శిక్ష వేస్తూ తీర్పునిచ్చారు.
Also Read: RCB vs CSK: ఐపీఎల్ 2026లో ఆర్సీబీ డబుల్ ధమాకా.. చెన్నై హ్యాట్రిక్ ఓటమి
కేసు చరిత్ర
కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండగా.. 2020 జూన్ నెలలో లాక్డౌన్ దేశవ్యాప్తంగా ఉంది. తమిళనాడులోని శాంతకుళంలో జయరాం, అతడి కుమారుడు బెన్నిక్స్ కిరాణ దుకాణం నిర్వహించేవారు. అయితే లాక్డౌన్ సమయంలో కిరాణ దుకాణం ఎందుకు తెరిచావని స్థానిక పోలీసులు తండ్రీ కొడుకులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. స్టేషన్లో పోలీసు అధికారులు తీవ్ర ఆగ్రహంతో తండ్రి ఎదుట కొడుకు బెన్నిక్స్ బట్టలు విప్పి అతడిపై దాడి చేశారు. అయితే వారికి ఎలాంటి నేర చరిత్ర లేకుండా తీవ్రంగా దాడి చేసి హింసించారు. శాంతకుళంలో విచారణ నిమిత్తం పోలీసు అధికారులు తీసుకెళ్లిన తండ్రీకొడుకులైన జయరాజ్, బెన్నిక్స్ మరణం యావత్ తమిళనాడును కుదిపేసింది.
Also Read: Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో అధ్వానం.. ఖర్చీఫ్లతో తుడుచుకున్న ప్రేక్షకులు
కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఉరిశిక్ష విధిస్తూ కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఈ కేసు చాలా అరుదైనది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం దారుణం. పోలీస్ స్టేషన్లో మరణించడం చాలా హేయమైనది. తండ్రీకొడుకులను నిర్దాక్షిణ్యంగా కొట్టడాన్ని క్రూరమైనదిగా పరిగణించాలి. పోలీసు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం క్రూరమైనదిగా భావించాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Harish Rao: భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు: భూకబ్జాలపై హరీశ్ రావు ఆగ్రహం
Koheda, Telangana:Koheda Fruit Market: 'రాజకీయాల కోసం రాలేదు...రైతుల కోసం ఇక్కడకు వచ్చాం. సమస్య కాంగ్రెస్ పార్టీ కాదు రైతుల సమస్యలు. ఏ ప్రభుత్వం అయిన రైతుల కోసం చేయాలి కానీ దళారుల కోసం పని చేయద్దు' అని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు. 'దళారుల కోసం కాకుండా రైతుల కోసం ఆలోచన చేయాలి' అని రేవంత్ రెడ్డికి సూచించారు. రైతుల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి కోహెడలో అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ పెట్టాలని కేసీఆర్ ఆలోచన చేశారని గుర్తుచేశారు.
Also Read: DJ Dispute: గంగమ్మ జాతరలో చిచ్చుపెట్టిన డీజే.. వేట కొడవళ్ల దాడిలో ఒకరి మృతి
'అనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సహాయం చేయాలని అన్నప్పుడు నేను రూ.10 కోట్లు మంజూరు చేయించా. ఇక్కడ 200 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ కట్టాలని ఇక్కడ స్థలం కేటాయించారు. మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్న నిరంజన్ రెడ్డి రూ.350 కోట్లు మంజూరు చేయించగా ఇంకా బ్యాంకులోనే ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కన్సల్టెంట్ ద్వారా దీనిని మ్యాపింగ్ చేయించాం. భవిష్యత్తులో ఇక్కడే పూల మార్కెట్, ఫిష్ మార్కెట్లు రావాలని ఆలోచన చేశాం' అని వివరించారు.
Also Read: RCB vs CSK: ఐపీఎల్ 2026లో ఆర్సీబీ డబుల్ ధమాకా.. చెన్నై హ్యాట్రిక్ ఓటమి
'అంతర్జాతీయ మార్కెట్ కోసం అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటన చేసి అధ్యయనం చేశారు. భూ సేకరణ కూడా పూర్తి అయింది. లక్షలాది రైతుల కోసం ఈ ఆలోచన చేశాం. కొన్ని రకాల ఫ్రూట్స్ వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ తెస్తారు. దానికి అనుగుణంగా ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే మార్కెట్ను ప్లాన్ చేశాం. ఈ భూమిని మాయం చేసే కుట్ర చేస్తున్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. 'ఇక్కడ రూ.3 వేల కోట్ల విలువైన భూమి పరిశ్రమల శాఖకు బదిలీ చేసి వారికి నచ్చినవారికి కట్టబెట్టే ప్రయత్నం నడుస్తోంది. ఇప్పటికే దీనిపై కన్ను వేశారు అంట. లీలా హోటల్లో సమావేశాలు కూడా జరిపారు అంట' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Also Read: Uppal Stadium: ఉప్పల్ స్టేడియంలో అధ్వానం.. ఖర్చీఫ్లతో తుడుచుకున్న ప్రేక్షకులు
'దిల్ భూముల సంగతి మనకు తెలియదా? దిల్(దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్) భూముల్లో మాకు వాటా ఉంటుంది అని ఏపీ ప్రభుత్వం అంటుంది. దిల్ భూమిలో పంచాయతీ నడుస్తోంది. ఆ భూమిలో 50 ఎకరాల వరకు రైతులు సాగు చేసుకుంటున్నారు. అక్కడ మార్కెట్ పెడుతున్నారని చెబుతున్నారు. అందులో మా భూమిలో పోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. కిరికిరి భూమితో అయ్యేది కాదు పోయేది కాదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
'ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కట్టాలని ప్లాన్ చేసింది మార్కెటింగ్ శాఖ. మార్కెటింగ్ మంగళం.. భూమి మాత్రం కథం. సూర్యుడు చుట్టూ భూమి తిరిగితే భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతాడు. ఈ భూమిపై రేవంత్ రెడ్డి కన్ను పడింది. రైతుల పక్షాన ఉంటావా? దళారుల పక్షాన ఉంటావా రేవంత్?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. వేలాది మంది ఈ మార్కెట్పై జీవనాధారం కొనసాగిస్తున్నారు. నీ కమీషన్ల కోసం రైతులను కూడా వదిలిపెట్టవా? అని నిలదీశారు.
'కబ్జాలకు కాదేది అన్నట్టు ఉంది ఈ ప్రభుత్వం తీరు. ఈ భూమి మార్కెటింగ్ శాఖకు చెందిన భూమి. పండ్ల మార్కెట్పై రేవంత్ రెడ్డి కన్ను పడింది' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు ఆరోపించారు. 'పంట మార్పిడి అంటున్నావు మరి పండ్ల రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వారికి అన్ని రకాలుగా వసతులు కల్పించాలని కానీ ఇవన్నీ కాదని ఏదో చేస్తాను అంటున్నాడు. ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కట్టే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఉంటుంది' అని స్పష్టం చేశారు.
'ఈ ప్రభుత్వం భూములు తప్ప ఇంకోటి కాదు. కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టింది. ఎక్కడ పడితే అక్కడ భూములను నిషేధిత జాబితాలో పెట్టి రేవంత్ రెడ్డి రైతుల ఉసురు తీస్తున్నాడు. దేవుడి పేరు చెప్పి కూడా ఈ ప్రభుత్వంలోని పెద్దలు వసూలు చేస్తున్నారు. దేవుడి పేరు చెప్పి వసూలు చెప్తే దేవుడు తగిన శాస్త్రి చేస్తాడు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తుమ్మల నాగేశ్వరరావు రైతు పక్షపాతి...నిజమైన రైతు బిడ్డ గా రైతులకు అండగా నిలవాలి. రేవంత్ రెడ్డితో పట్టుపట్టి ఈ భూమిలోనే రైతులకు ఫ్రూట్ మార్కెట్ కట్టాలి' అని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ కట్టే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నామని తెలిపారు. దిల్ భూముల్లో భూములున్న వారికి కూడా మా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
