icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500030
RSRajesh SharmaFollow21 Jun 2024, 10:56 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

KCR సోయి లేని నిర్ణయాల వల్లే సింగరేణికి ఈ దుస్థితి: ఈటల

Hyderabad, Telangana:

Eatala Rajender Latest News: ఒకప్పుడు దేశంలోనే అత్యంత సంపన్నమైన సంస్థగా ఉన్న సింగరేణి.. నేడు బ్యాంకుల నుంచి అప్పులు తెస్తే.. తప్ప కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి దిగజారిపోయిందని BJP MP ఈటల రాజేందర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రామగుండంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత BRS ప్రభుత్వంపై, మాజీ CM కేసీఆర్‌పై ఈటల విమర్శల వర్షం కురిపించారు. సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోవడానికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

సభను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతు.. తాను సింగరేణి కార్మికులతో చాలా దగ్గరగా బతికారని.. వారి కష్టసుఖాలు తనకు పూర్తిగా తెలుసని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు చేసిన సకల జనుల సమ్మె చరిత్రలో నిలిచిపోందని.. మీరు సమ్మె చేస్తే రాష్ట్రానికి కరెంటు ఎలా వస్తుందని అప్పట్లో చాలామంది విమర్శించారు.. బెదిరించారు. కానీ, కార్మికులు వేటికీ లొంగకుండా.. తెగించి పోరాడారని.. తెలంగాణ వస్తే సింగరేణికి పూర్వవైభవం వస్తుందని నమ్మి పోరాటం చేశారని.. కానీ, స్వరాష్ట్రంలో పూర్వవైభవం దేవుడెరుగు.. ఉన్న పరిస్థితి మరింత దిగజారిపోయిందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ సోయి లేని నిర్ణయాల వల్లే..
గతంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సానుకూలంగా ఉంటూ.. సింగరేణి ప్రయోజనాలను కాపాడాయని.. కానీ కేసీఆర్ మాత్రం కక్షసాధింపు ధోరణితో.. కనీస సోయి లేకుండా ప్రవర్తించారని ఈటల విమర్శించారు. కేంద్రంతో సఖ్యతగా ఉండకపోవడం వల్లే సింగరేణికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.

అయితే, ప్రస్తుత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒకప్పుడు బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం క్షేత్రస్థాయిలో కొట్లాడిన నాయకుడని గుర్తు చేశారు. నేడు ఆయనే కేంద్రమంత్రిగా ఉండటం వల్ల సింగరేణిని నిర్వీర్యం కాకుండా కాపాడుతున్నారని కొనియాడారు.. సంస్థ పునరుజ్జీవనం కోసం కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల - 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిందని.. తద్వారా సంస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. కార్మికుల సమస్యలన్నింటినీ కిషన్ రెడ్డి సానుకూలంగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) ఇతర రాజకీయ పార్టీలకు కేవలం ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోతే... ప్రధాని నరేంద్ర మోడీ రూ. 6,300 కోట్లు కేటాయించి.. దానిని పునరుద్ధరించి తెలంగాణ రైతులకు అంకితం చేశారని ఈటల గుర్తు చేశారు. రాష్ట్రంలో నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు, అత్యాధునిక రైల్వేస్టేషన్లతో పాటు కొత్త రైళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి దాగి ఉందని నమ్మే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని అన్నారు.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రధాని మోడీ తీవ్రంగా కాంక్షిస్తున్నారని ఈటల పేర్కొన్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

గోడదూకి వచ్చి అఘాయిత్యం.. కళ్లముందే కన్నకూతురిని ఎత్తుకెళ్లిన POCSO కేసు నిందితుడు..

Hyderabad, Telangana:

Addagudur Pocso Case: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.. షాబాద్ నరహంతకుడి అరాచక మారణకాండ సృష్టించిన భీభత్సం ఇంకా మరవక ముందే.. తాజాగా అడ్డగూడూరులో మరో దారుణ ఘటన వెలుగుచూసింది.. ఓ వైపు మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు తెస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు.. ఓ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన పోక్సో కేసు నిందితుడు.. ఏకంగా అదే బాలికను కిడ్నాప్ చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గోడదూకి వచ్చి..
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నిందితుడు అర్ధరాత్రి వేళ బాధితురాలి ఇంటి గోడదూకి లోపలికి ప్రవేశించాడు.. ఇంట్లో నిద్రిస్తున్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు.. బాలిక అప్రమత్తమై కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.. ఈ ఘోరంపై బాలిక కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు వచ్చి.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల నిర్లక్ష్యమే శాపమైందా?
కేసు నమోదైనప్పటికీ.. స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) వ్యవహరించిన తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ వస్తున్నాయి.. పోక్సో చట్టం కింద అత్యంత కఠినమైన సెక్షన్లు నమోదైనప్పటికీ.. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని.. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. SI నిందితుడిని రిమాండ్‌కు పంపకుండా.. స్టేషన్ నుంచే వదిలేశారని.. ఆ అండతోనే నిందితుడు మరింత బరితెగించాడని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

కళ్లముందే బాలికను ఎత్తుకెళ్లిన నిందితుడు..
పోలీసుల చల్లని చూపుతో స్వేచ్ఛగా తిరిగిన నిందితుడు.. తనపై ఫిర్యాదు చేశారన్న కక్షతో పగ పెంచుకున్నాడు.. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికతో బాలికను ఎత్తుకెళ్లాడు. చట్టం తనను ఏమీ చేయలేదనే.. ధీమాతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆ రోజే నిందితుడిని జైలుకు పంపి ఉంటే.. ఈ రోజు మా బిడ్డ మా కళ్లముందే ఉండేది.. ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే మా అమ్మాయికి ఈ గతి పట్టింది.. అంటూ బాధితురాలి కుటుంబం సభ్యులు ఆందోళనకు దిగిన్నట్లు తెలుస్తోంది.

ఉలిక్కిపడ్డ స్థానికులు.. 
ఈ ఘటనతో అడ్డగూడూరు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. షాబాద్ ఘటన మరవక ముందే మరో బాలికకు ఇలాంటి అన్యాయం జరగడంపై మహిళా సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని తక్షణమే పట్టుకుని బాధితురాలిని సురక్షితంగా తలిదండ్రుల చెంతకు చేర్చాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన SIపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు KTR, హరీష్ రావు: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..

Hyderabad, Telangana:

KTR, Harish Rao are Brand Ambassadors for Lies: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెలంగాణ సస్యశ్యామలంగా ఉండటం ఇష్టం లేని వీరిద్దరూ.. స్పైడర్ సినిమా విలన్లలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం సీఎల్‌పీ మీడియా సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ లోయర్ మానేరు డ్యాం (LMD) సందర్శనను ఒక విహారయాత్రగా అభివర్ణించిన సత్యం.. రైతులపై ఆయన చూపిస్తున్నదంతా కపట ప్రేమేనని విమర్శించారు.

కరవు రావాలని కోరుకుంటున్నారు..
సాధారణంగా లోయర్, మిడ్ మానేరు డ్యాంలు జూలై ఆఖరు లేదా ఆగస్టు మాసాల్లో నిండుతాయని.. ఈ ఏడాది కూడా వర్షదేవుడి కటాక్షంతో ప్రాజెక్టులు సమృద్ధిగా నిండుతాయనే నమ్మకం తమకుందని ఎమ్మెల్యే తెలిపారు. అయితే, రాష్ట్రంలో కరవు రావాలి, పంటలు పండకూడదు.. ప్రజలు విలవిలలాడాలి.. తద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనేదే కేటీఆర్, హరీష్ రావుల కుట్రపూరిత ఆలోచన అని ధ్వజమెత్తారు.. ఉద్దేశపూర్వకంగానే ప్రజలను, రైతులను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకవేళ వర్షాలు పడకపోతే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం దగ్గర పక్కా ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

హిట్లర్ పాలన పోయింది.. 
గత పదేళ్ల BRS పాలన హిట్లర్, ఫాసిస్ట్ పద్ధతుల్లో సాగిందని.. అందుకే ప్రజలు విసిగిపోయి.. ఆ పార్టీని బండకేసి కొట్టారని మేడిపల్లి సత్యం ఎద్దేవా చేశారు. మీది ఫాసిస్ట్ పాలన అయితే.. మా సీఎం రేవంత్ రెడ్డిది హ్యుమనిస్ట్ పాలన అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ స్కీమ్ పెట్టినా అందులో స్కామ్ తప్ప తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని.. రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని ఆరోపించారు. CM రేవంత్ రెడ్డి దూరదృష్టి ఉన్న నాయకుడని.. ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్రాన్ని కాపాడుకుంటారని భరోసా ఇచ్చారు.

అబద్ధాల పోటీలో నెంబర్ వన్ స్థానం..
అప్పట్లో హిట్లర్ పక్కన అబద్ధాలు ప్రచారం చేయడానికి గోబెల్స్ ఉన్నట్లు.. ఇప్పుడు కేసీఆర్ పక్కన KTR, హరీష్ రావు చేరారు. వీరిద్దరూ గోబెల్స్‌ను మించిపోయి అబద్ధాల పోటీల్లో నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్నారని.. భవిష్యత్తులో వీరు నిజాలు చెప్పినా ప్రజలు నమ్మలేని స్థాయికి దిగజారిపోయారని.. పిల్లి శాపనార్థాలు, కుట్ర రాజకీయాలు ఇప్పటికైనా ఆపాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

కాళేశ్వరం ప్రాజెక్టుపై BRS నేతలు మాట్లాడుతుంటే .. హంతకుడే సంతాప సభ.. పెట్టినట్లు ఉందని సత్యం ఎద్దేవా చేశారు. కేవలం ధనదాహంతో.. కమీషన్ల కోసమే కాళేశ్వరాన్ని నిర్మించారని.. వారి హయాంలోనే.. వారి అవినీతి వల్లే ఆ ప్రాజెక్టు కూలిపోయిందని గుర్తుచేశారు.. తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులని.. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని.. BRs నేతల డ్రామాలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Metro Lovers Kissing: మెట్రో రైలులో లవర్స్ ముద్దులాట..బూతులు తిడుతున్న ప్రయాణికులు!

Bengaluru, Karnataka:

Namma Metro Lovers Kissing: ఇంతకాలం ఢిల్లీ మెట్రోలో యువతీ యువకుల ప్రేమాయణాలు, రీల్స్ హంగామా, వెర్రి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవ్వడం అడపాదడపా చూసే ఉంటారు. అయితే, ఇప్పుడు ఐటీ హబ్ బెంగళూరులోని 'నమ్మ మెట్రో' లోనూ అలాంటి ఘటనే వెలుగుచూసింది. మెట్రో రైలులో ఒక యువ జంట బహిరంగంగా ముద్దు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

సిలికాన్ సిటీ బెంగళూరులోని కేఆర్ పురం మెట్రో స్టేషన్‌కు వస్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణికులతో ఉండగానే, ఒక యువకుడు, యువతి చుట్టుపక్కల వారిని పట్టించుకోకుండా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. అదే కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు వీరి ప్రవర్తనను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నిబంధనలు బేఖాతర్..
మెట్రోలో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ కోసం బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) అనేక కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. అయినప్పటికీ, కొందరు యువతీ యువకులు వాటిని బేఖాతర్ చేస్తూ బహిరంగ ప్రదేశాలను పార్కులుగా భావిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటంపై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కొంతకాలం క్రితం కూడా బెంగళూరు మెట్రోలో ఒక జంట కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్న వీడియో హల్‌చల్ చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే పునరావృతం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బహిరంగ రవాణా వ్యవస్థల్లో ఇలాంటి అసభ్య ప్రవర్తనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వస్తున్నాయి.

Also Read: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్..తారక్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన!

Also Read: పల్నాడులో కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాల..100 సీట్ల భర్తీకి NMC గ్రీన్ సిగ్నల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

స్టూడెంట్స్ కోసం iQOO సరికొత్త సంచలనం.. iQOO Z11 Lite లాంచ్!

Hyderabad, Telangana:

Iqoo Z11 Lite Launching On July 24: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ (iQOO) భారత స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్స్‌ను, ముఖ్యంగా విద్యార్థులను టార్గెట్ చేస్తూ సరికొత్త మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ iQOO Z11 Lite పేరుతో జూలై 24న భారతదేశంలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సిద్ధమైంది.. కాలేజ్ స్టూడెంట్స్ రోజువారీ అవసరాలతో పాటు ఆన్‌లైన్ క్లాసులు, ప్రాజెక్ట్ అసైన్‌మెంట్‌లను దృష్టిలో ఉంచుకుని నాన్-స్టాప్.. నో లిమిట్ (Non-Stop. No Limit.) అనే కాన్సెప్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన్నట్లు వెల్లడించింది.

స్టూడెంట్స్ కోసం పవర్‌ఫుల్ AI ఫీచర్స్..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ సాధారణ ఫీచర్స్‌ కంటే.. ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఇందులో కంపెనీ విద్యార్థుల చదువుకు ఎంతో సహాయపడే పవర్‌ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో AI క్రియేషన్ ఫీచర్‌ సహాయంతో విద్యార్థులు పెద్ద పెద్ద డాక్యుమెంట్‌లను సులభంగా సమ్మరైజ్ చేస్తుంది. అంతేకాకుండా అసైన్‌మెంట్‌లను ఎడిట్‌ చేయడమే కాకుండా.. కొత్త కంటెంట్ క్రియేట్ చేయడం, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్‌తో పాటు రైటింగ్ ఐడియాలను అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇవే కాకుండా AI క్యాప్షన్ ఫీచర్ కూడా లభిస్తోంది. ఇందులో  రియల్ టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్, ఇన్‌స్టంట్ ట్రాన్స్‌లేషన్‌తో పాటు వన్-టాప్ సమ్మరీ వంటి ఫీచర్లు కూడా లభిస్తున్నాయి.  దీనివల్ల ఆన్‌లైన్ లెక్చర్స్, వర్క్‌షాప్స్ జరిగే సమయంలో నోట్స్ రాసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 

6500mAh భారీ బ్యాటరీ.. 
ఈ iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ అద్భుతమైన బ్యాటరీని కూడా అందిస్తోంది. ఇందులో కంపునీ మోస్ట్ పవర్‌ఫుల్ 6500mAh బ్యాటరీని అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇది 44W ఫ్లాష్ ఛార్జ్ (FlashCharge) సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా, ఈ బ్యాటరీ 5 సంవత్సరాల సుదీర్ఘ హెల్త్ లైఫ్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. 

మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ..
విద్యార్థుల చేతుల్లో ఫోన్లు తరచూ కింద పడుతుంటాయి.. అంతేకాకుండా అప్పుడప్పుడు ప్రయాణాలు చేసే క్రమంలో కిందపడి పగిలిపోతూ ఉంటాయి. దీనిని అడ్డుకోవడానికి ఈ ఫోన్‌కు మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీని అందిస్తోంది.. అంతేకాకుండా SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా దీనికి లభించడం విశేషం.. అంటే ఫోన్ అనుకోకుండా కింద పడినా ఎలాంటి డ్యామేజ్ కాకుండా సురక్షితంగా ఉంటుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్టైలిష్ డిజైన్, కలర్స్..
లుక్ పరంగా కూడా ఈ ఫోన్ చాలా మోడ్రన్‌గా, స్లీక్‌గా ఉంటుంది.. ఇందులో మినిమలిస్ట్, కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్‌ను కూడా కంపెనీ అందించింది.. అలాగే కాల్స్, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మెరిసే డైనమిక్ లైట్ ఫీచర్ దీనికి మరింత స్టైలిష్ లుక్‌ను అందిస్తుందని తెలుస్తోంది.. ఈ ఫోన్ లేటెస్ట్ OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీంతో పాటు 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా అందిస్తోంది.

ధర పూర్తి వివరాలు..
iQOO Z11 Lite ఫోన్ సోలార్ ఫ్లేమ్ (Solar Flame)తో పాటు మిడ్‌నైట్ బ్లూ (Midnight Blue) అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. జూలై 24న లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ ఐకూ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)లో అందుబాటులోకి రాబోతున్నాయి. స్టూడెంట్స్ బడ్జెట్‌కు తగినట్లే.. దీని ధర ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

భారీ 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Redmi Note 17 సిరీస్ లాంచ్.. ఫీచర్లు అరాచకం!

Hyderabad, Telangana:

Redmi Note 17 Series: టెక్ ప్రపంచంలో తమదైనశైలిలో దూసుకుపోతున్న ప్రముఖ చైనీస్ హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ రెడ్‌మి (Redmi) మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఎంతో కాలంగా వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్‌మి నోట్ 17 (Redmi Note 17) సిరీస్ చైనా మార్కెట్లో జూలై 14న అధికారికంగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ సిరీస్‌కు సంబంధించిన కొన్ని స్పెషల్ స్పెసిఫికేషన్లతో పాటు ఫీచర్లు లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌లోని ప్రో మోడల్‌లో ఏకంగా 9,000 mAh భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.

లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త సిరీస్‌లో భాగంగా రెండు మోడళ్లను కంపెనీ విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. ఇందులో బేస్ మోడల్ రెడ్‌మి నోట్ 17 కాగా.. రెండవది హై-ఎండ్ వేరియంట్ రెడ్‌మి నోట్ 17 ప్రో.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన ప్రాసెసర్‌లతో అందుబాటులోకి రాబోతున్నాయి.

రెడ్‌మి నోట్ 17 ఫీచర్లు..
ఈ ఫోన్‌లో భారీ 7-అంగుళాల Full HD+ Samsung E4 Pro డిస్‌ప్లేను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 (Snapdragon 4 Gen 4) చిప్‌సెట్‌ సపోర్ట్‌తో లాంచ్‌ కాబోతోంది.. సాధారణ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ అయినప్పటికీ ఇందులో ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో పాటు 22.5W రివర్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది..

రెడ్‌మి నోట్ 17 ప్రో స్పెసిఫికేషన్లు..
ప్రో మోడల్‌లో ఫీచర్లు మరింత అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ 6.83-అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది. స్క్రీన్ ప్రొటక్షన్‌ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 (Corning Gorilla Glass Victus 2) ప్రొటెక్షన్‌ను అందించారు. అంతేకాకుండా ఇందులో కంపెనీ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 (Snapdragon 6s Gen 4) ప్రాసెసర్‌ను కూడా అందిస్తోంది.

ఇందులో కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ 9,000 mAh మెగా బ్యాటరీని కూడా అందించారు. దీనికి తోడు 67W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో పాటు 22.5W వైర్డ్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం.. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా చార్జ్ అవ్వడమే కాకుండా.. పవర్‌బ్యాంక్‌లా కూడా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ భారత మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని.. భారత్‌లో బేస్ మోడల్ 6 GB రామ్ (RAM)తో పాటు 128 GB స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.. ఇక కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే.. ఇది బ్లూ (Blue)తో పాటు డార్క్ నైట్ (Dark Night) అనే రెండు ఆకర్షణీయమైన కలర్స్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

విశాఖ బోటు మత్య్సకారులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ఫ్లాప్‌: వైఎస్‌ జగన్‌

Visakhapatnam, Andhra Pradesh:

Visakhapatnam: విశాఖపట్టణం బోటు ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురి కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మత్య్సకారుల కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబుకు కోరారు. విశాఖ బోటు గల్లంతుపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని.. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని తెలిపారు. 

జూలై 4వ తేదీన జరిగిన బోటు బోల్తా ప్రమాదంలో గల్లంతైన బాధిత కుటుంబాలను విశాఖపట్టణంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. కుటుంబాలకు ధైర్యం కల్పించిన అనంతరం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వం స్పందన లేకుంటే మన ప్రభుత్వం వచ్చిన నెలలోపు రూ.కోటి ఆర్థిక సహాయం కల్పిస్తాం. జూలై 5వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు  కనీసం నావికాదళం రక్షణ కల్పించలేదు' అని ఆరోపించారు. '114 మంది బాధితులకు  మత్స్యకారులు మద్దతు ఇవ్వలేదు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ప్రకటన చేయకపోవడం, ఆర్థిక సహాయం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శించారు. కర్రి చిన్న మత్స్యకారుడు 16 గంటల పాటు సముద్రంలో యుద్ధం చేసి  ప్రాణాలు కాపాడుకున్నాడని.. ప్రభుత్వం జరిగిన ఘటనను శ్రద్ధగా పని చేసి ఉంటే వారి ఆచూకీ తెలిసేది అని పేర్కొన్నారు.

'జూలై 4వ తేదీ 2.30 నిమిషాలకు సమాచారం అందించిన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఘటన ముందు ఇంటికి వస్తామని సమాచారం చిన్న మేనల్లుడుకు చెప్పాడు. తీవ్రమైన అలలు మధ్యలో బోటు బోల్తా పడింది. బోటు మునిగిపోతున్నది. అదే సమయంలో బోటు కింద ఒక వ్యక్తి అప్పటికే మరణించిన సమాచారం తెలిసింది. సముద్రంలో అలా ఉంటే ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆవేదనతో స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

'విశాఖపట్టణం జిల్లాలో అధికారులు, ప్రభుత్వ నాయకులు పట్టించుకోలేదు. తప్పు జరిగింది అని ప్రభుత్వం అంగీకరించే ఎక్కడ అవహేళన వస్తుంది అని 3 మ్యాన్ కమిటీ వేశారు. వారు రిపోర్టర్‌లో అసత్యంగా రిపోర్టర్ ఇచ్చారు. సమాచారం ఆలస్యంగా వచ్చింది అని 3 మ్యాన్ కమిటీలో తప్పుడు నివేదిక ఇచ్చారు' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. 'ప్రభుత్వంలో పెద్దలు కానీ నాయకులు వారి ఇంటికి వచ్చి పట్టించుకోలేదు. హోంమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి  మత్స్యకారుల ఇంటికి వచ్చి పరామర్శ చేయలేదు' అని గుర్తుచేశారు. వీడియో కాల్‌లో పరామర్శలు చేయడం విడ్డూరంగా ఉందని.. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పించలేదని తెలిపారు. రాత్రికి రాత్రి ప్రభుత్వం స్పందన ఉంటే కనీసం ఐదుగురు బతికేవారు అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వివరించారు.

బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తప్పు జరిగింది కాబట్టే త్రీమెన్‌ కమిటీ వేశారు. త్రీమెన్‌ కమిటీ నివేదిక అంతా తప్పులతడక. ప్రభుత్వానికి మానవత్వం ఉందా?' అని ప్రశ్నించారు. 'ఘటన జరిగిన వెంటనే ఒక్క అధికారి కూడా రాలేదు. ఉత్తరాంధ్ర మంత్రులు ఒక్కరు కూడా రాలేదు. బాధితులను ఫిషరీస్‌ మంత్రి కూడా పరామర్శించలేదు. బాధితుల వద్దకు మంత్రులను పంపాలని చంద్రబాబుకు తెలియదా?' అని నిలదీశారు. 'చంద్రబాబు పట్టించుకోలేదు.. హోం మంత్రి పరామర్శించలేదు. రాత్రికి రాత్రే స్పందిస్తే మత్స్యకారులు బతికేవారు. నష్ట పరిహారం కింద అరకొర సాయం చేశారు. బాధితులకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా.. మన ప్రభుత్వం వచ్చాక నెలలోపే ఆదుకుంటాం' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

0
0
Report

FIFA World Cup 2026: ఫ్రాన్స్ vs స్పెయిన్ సెమీఫైనల్.. ఫైనల్ బెర్త్ కోసం 'యూరోపియన్' యుద్ధం!

Arlington, Texas:

FIFA World Cup 2026 Semifinal: ఫిఫా ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. డల్లాస్‌లోని ప్రతిష్టాత్మక ఏటీ & టీ (AT&T) స్టేడియం మంగళవారం రాత్రి ఒక అద్భుతమైన సమరానికి వేదిక కాబోతోంది. మొదటి సెమీఫైనల్‌లో రెండు విభిన్న శైలులు కలిగిన యూరోపియన్ దిగ్గజాలు, రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్, 2010 విజేత స్పెయిన్ ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి.

కైలియన్ ఎంబాపే సారథ్యంలోని ఫ్రాన్స్ వరుసగా మూడోసారి ప్రపంచ కప్ ఫైనల్లో అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా.. లూయిస్ డి లా ఫ్యూంటె నేతృత్వంలోని స్పానిష్ జట్టు 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ఫైనల్ చేరాలని పట్టుదలతో ఉంది.

డిఫెన్సివ్ కింగ్ స్పెయిన్..
ఈ మ్యాచ్ రెండు భిన్నమైన వ్యూహాల మధ్య జరగబోయే ఆసక్తికర యుద్ధం సాగనుంది. 2010 తర్వాత మొదటిసారి సెమీస్ చేరిన స్పెయిన్ ఈ టోర్నమెంట్‌లో అసాధారణ రక్షణ తీరును కనబరిచింది. క్వార్టర్ ఫైనల్లో బెల్జియం మాత్రమే వారిపై ఒక గోల్ చేయగలిగింది. ఈ ప్రపంచ కప్‌లో ఆరు మ్యాచ్‌ల తర్వాత స్పెయిన్ కేవలం 7 షాట్స్ ఆన్ టార్గెట్‌ను మాత్రమే ఎదుర్కొంది. 1966 తర్వాత ఒక ప్రపంచ కప్‌లో ఒక జట్టు ఒక మ్యాచ్‌కు ఎదుర్కొన్న అత్యల్ప షాట్స్ ఆన్ టార్గెట్ సగటు (1.17) ఇదే కావడం విశేషం.

కౌంటర్ ఎటాక్స్‌తో ఫ్రాన్స్ విధ్వంసం.. 
ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెషామ్స్ ఈ మ్యాచ్ ప్రాధాన్యతను వివరిస్తూ.. "స్పెయిన్ బంతిపై అద్భుతమైన పట్టు సాధించి ఒత్తిడి తెస్తుంది. కానీ, మాకూ బంతిని నియంత్రించే సత్తా ఉంది. వారిని అడ్డుకుంటూనే కౌంటర్ ఎటాక్స్‌లో వేగంగా విరుచుకుపడే నైపుణ్యం మా ఆటగాళ్లకు ఉంది" అని ధీమా వ్యక్తం చేశారు.

ఎంబాపే జోరు.. చౌమేని అందుబాటుపై ఉత్కంఠ
క్వార్టర్ ఫైనల్స్‌లో మొరాకోపై తన 8వ గోల్ సాధించిన కైలియన్ ఎంబాపే ప్రస్తుతం 'గోల్డెన్ బాల్' రేసులో దూసుకుపోతున్నాడు. అలాగే హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్న కీలక మిడ్‌ఫీల్డర్ చౌమేని ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. అయితే, అతను 100 శాతం కోలుకోకపోయినా జట్టుకు అందుబాటులో ఉంటాడని కోచ్ డెషామ్స్ స్పష్టం చేశారు.

రికార్డులపై కన్నేసిన ఫ్రాన్స్
వరుసగా ఆరు విజయాలతో సెమీస్ చేరిన ఫ్రాన్స్ (లె బ్లూస్), ఈ మ్యాచ్ గెలిస్తే 1934-38లో ఇటలీ తర్వాత ప్రపంచ కప్‌లో వరుసగా ఏడు విజయాలు సాధించిన రెండో యూరోపియన్ జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. మరోవైపు ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 2006 రౌండ్ ఆఫ్ 16లో తలపడినప్పుడు ఫ్రాన్స్ 3-1తో విజయం సాధించింది.

అయితే, అన్ని రకాల పోటీలలో గత 10 మ్యాచ్‌లను పరిశీలిస్తే స్పెయిన్‌దే పైచేయిగా ఉంది. ఈ 10 మ్యాచ్‌లలో స్పెయిన్ 7 విజయాలు సాధించగా, ఫ్రాన్స్ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది (ఒక మ్యాచ్ డ్రా అయింది). గత రెండు మ్యాచ్‌లలోనూ స్పెయిన్ దే విజయం సాధించడం గమనార్హం. ఫ్రెంచ్ మెరుపు దాడులను స్పెయిన్ డిఫెన్స్ అడ్డుకుంటుందా? లేక ఎంబాపే సేన స్పానిష్ కోటను బద్దలు కొట్టి వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెడుతుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Also Read: FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధం..ఏ టీమ్‌కి ట్రోఫీ గెలిచే సత్తా ఉంది?

Also Read: ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో హోరాహోరీ టీమ్స్..ట్రోఫీ గెలిచే సత్తా ఎవరికి ఉందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Jr NTR Political Entry: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్..తారక్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన!

Hyderabad, Telangana:

Jr NTR Political Entry News: గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ (NTR) రాజకీయ అరంగేట్రం, సేవా కార్యక్రమాల చుట్టూ తిరుగుతున్న వివాదాలపై ఎన్టీఆర్ అధికారిక కార్యాలయం అత్యంత కీలకమైన వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో, అభిమాన సంఘాల పేరుతో జరుగుతున్న ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ ఎన్టీఆర్ ఆఫీస్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

'RAW NTR'తో మాకు ఎలాంటి సంబంధం లేదు!
ఈ ప్రకటనలో ఎన్టీఆర్ కార్యాలయం ప్రధానంగా 'RAW NTR' అనే సంస్థపై కీలక స్పష్టతనిచ్చింది. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి ఎలాంటి ప్రకటనలు చేయడానికి గానీ, కార్యక్రమాలు నిర్వహించడానికి గానీ 'RAW NTR' సంస్థకు ఎటువంటి హక్కులు లేదా అధికారాలు లేవు.

తాజాగా ఎన్టీఆర్ రాజకీయాల ఎంట్రీపై వస్తున్న వార్తలపై 'RAW NTR' అనే సంస్థ స్పందించింది. జూలై 18న నిర్వహించబోతున్న కార్యక్రమం 'ఊరు-వాడ' అనే సేవా కార్యక్రమం మాత్రమే అని తెలిపింది. దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. అయితే ఈ సంస్థతో ఎన్టీఆర్‌కు లేదా ఆయన కార్యాలయానికి ఎలాంటి అనుబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం నుంచి మరో ప్రకటన వచ్చింది. సదరు RAW NTR అనే సంస్థకు కథానాయకుడు ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ఈ అంశంపై తమ వైపు నుంచి ఇదే చివరి మరియు తుది వివరణ అని ఎన్టీఆర్ కార్యాలయం తేల్చి చెప్పింది.

జులై 18 రాజకీయ ప్రకటన ప్రచారానికి తెర!
ఈ నెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు, ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో ఈ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన ద్వారా లేదా ఆయనకు సంబంధించిన అధికారిక బృందం ద్వారా మాత్రమే అధికారికంగా వెల్లడవుతాయని ఆఫీస్ వర్గాలు స్పష్టం చేశాయి.

అభిమానులకు, మీడియాకు విజ్ఞప్తి..
"ఎలాంటి ధృవీకరణ లేని సమాచారాన్ని సోషల్ మీడియాలో లేదా ఇతర వేదికలపై ప్రచారం చేయవద్దు. కేవలం ఎన్టీఆర్ అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి" అని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనలో ఈ విధంగా వివరించారు.

Also REad: ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం? జూలై 18న మీటింగ్ అందుకే అంటున్న తారక్ ఫ్యాన్స్!

Also Read: శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల మధ్య గొడవ..రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి..చివరికి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Samsung, వన్‌ప్లస్‌లకు చుక్కలే.. 10,000mAh భారీ బ్యాటరీతో Redmi Turbo 6 సిరీస్!

Hyderabad, Telangana:

Redmi Turbo 6 Series Leaked: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు Xiaomi సబ్‌బ్రాండ్  రెడ్‌మి (Redmi) త్వరలోనే మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. మార్కెట్లోకి పవర్‌హౌస్‌గా నిలిచేందుకు రెడ్‌మి టర్బో 6 (Redmi Turbo 6) సిరీస్‌ను రంగంలోకి దించేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. ఈ సిరీస్‌లో భాగంగా రెండు అద్భుతమైన మోడల్స్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రెడ్‌మి టర్బో 6 (Redmi Turbo 6)తో పాటు రెడ్‌మి టర్బో 6 మాక్స్ (Redmi Turbo 6 Max) మోడల్స్‌ మార్కెట్లోకి రాబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వెయిబో (Weibo)లో లీక్ చేశారు. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో పాటు భారీ బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లీక్ అయిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్లలో ఏకంగా 10,000mAh సామర్థ్యం గల అత్యంత శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పవర్‌బ్యాంక్‌లలో మాత్రమే కనిపించే ఈ స్థాయి బ్యాటరీ సామర్థ్యం.. స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులోకి రావడం టెక్ రంగంలో పెద్ద సంచలనంగా మారబోతోందని సమాచారం. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు రోజులు బ్యాటరీ బ్యాకప్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రీమియం డిస్‌ప్లే..
స్క్రీన్ విషయానికి వస్తే.. రెడ్‌మి టర్బో 6 సిరీస్‌లో పెద్ద సైజ్ 7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌లోని ప్రీమియం మోడల్ అయిన రెడ్‌మి టర్బో 6 మాక్స్ వేరియంట్‌లో అత్యంత స్పష్టమైన విజువల్స్ అందించేలా 2K డిస్‌ప్లేను కూడా అందబా. దీనికి తోడు ప్రీమియం లుక్ అండ్ డ్యూరబిలిటీ కోసం మెటల్ ఫ్రేమ్‌ను కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. సెక్యూరిటీ కోసం ఈ మాక్స్ మోడల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందుబాటులో తీసుకు రాబోతోంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్లు..
ఈ సిరీస్‌లోని రెండు ఫోన్లలో వేర్వేరు పవర్‌ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది.. రెడ్‌మి టర్బో 6 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8600 (MediaTek Dimensity 8600) చిప్‌సెట్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. ఈ రెడ్‌మి టర్బో 6 మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ ఈ టాప్-ఎండ్ మోడల్‌లో మరింత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9600s (MediaTek Dimensity 9600s) ప్రాసెసర్‌ను అందించిన్నట్లు సమాచారం. దీనివల్ల గేమింగ్‌తో పాటు మల్టీటాస్కింగ్ అత్యంత వేగంగా, ఎలాంటి లాగ్స్ లేకుండా సాగుతుందని సమాచారం.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

గత మోడల్ ట్రాక్ రికార్డ్..
ఇటీవలే మార్కెట్లో విడుదలైన రెడ్‌మి టర్బో 5 ఫీచర్లను గమనిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.59 అంగుళాల 1.5K ఫ్లూయిడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో 120Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే 50MP (OIS) సపోర్ట్‌తో 8MP డ్యూయల్ రీర్ కెమెరాతో అందుబాటులో ఉంది.. ఇందులో ఎంతో శక్తివంతమైన 7,540mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ఇప్పుడు రాబోయే టర్బో 6 అంతకంటే రెట్టింపు పవర్‌తో 10,000mAh బ్యాటరీతో వస్తుండటంతో మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

YS Sharmila On Polavaram: "పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే 'కిల్లర్'.." ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Vijayawada, Andhra Pradesh:

YS Sharmila On Polavaram Project: ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం పాలిట చంద్రబాబు ఒక 'కిల్లర్'లా మారారని, ప్రాజెక్టును ఉద్ధరించడం పక్కన పెట్టి.. దగ్గరుండి దానికి ఊపిరి తీస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ మెప్పు కోసమే చంద్రబాబు పోలవరానికి వెన్నుపోటు పొడుస్తూ 'అభినవ కట్టప్ప'లా ప్రవర్తిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎత్తు తగ్గింపు.. ఆత్మహత్య సదృశ్యం!
పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించడంపై షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకే పరిమితం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని, బహుళార్థక సాధక ప్రాజెక్టు కాస్తా కేవలం నీటి నిల్వకే పరిమితమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఎత్తు తగ్గిస్తే పోలవరం ఆత్మహత్య సదృశ్యమని తెలిసి కూడా చంద్రబాబు ఈ డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.

ఆర్ అండ్ ఆర్ (పునరావాసం) కింద ఇవ్వాల్సిన రూ.32 వేల కోట్ల మిగులు కోసం రాష్ట్ర ప్రాణాధారమైన ప్రాజెక్టును చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పోలవరంపై చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని.. తానే 37 సార్లు సందర్శించానని, 136 సార్లు రివ్యూ చేశానని గొప్పలు చెప్పుకోవడానికున్న శ్రద్ధ, ప్రాజెక్టును 45.72 మీటర్ల పూర్తి ఎత్తులోనే కట్టాలని కేంద్రాన్ని నిలదీయడంపై లేదని విమర్శించారు. గ్రావిటీ ప్రాజెక్ట్ కాస్తా ఎత్తిపోతల పథకంగా మారుతుంటే కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ముఖ్యమంత్రికి లేకపోవడం రాష్ట్రానికి తీరని అన్యాయమన్నారు.

కాంగ్రెస్ సంధించిన సూటి ప్రశ్నలు..
వచ్చే మార్చి 31 లోపు పోలవరం తొలి దశను పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని ప్రకటిస్తున్న చంద్రబాబు నాయుడికి ఏపీ కాంగ్రెస్ పక్షాన షర్మిల ఐదు సూటి ప్రశ్నలు వేశారు.

రెండో దశపై ఆంతర్యం ఏంటి?
"రెండో దశ పనులకు చాలా డబ్బు కావాలి.. వచ్చే మూడేళ్లలో రెండో దశ పూర్తి చేయడం కష్టం" అన్న మీ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏంటి? ఆర్ అండ్ ఆర్ కింద రెండో దశలో రూ.32 వేల కోట్లు ఇవ్వకుంటే ప్రాజెక్ట్ ప్రయోజనం శూన్యమేనా? ఇంతకాలం మీరు చేసిన హంగామా అంతా చివరకు బూడిదలో పోసిన పన్నీరుగా మిగలాల్సిందేనా?

41.15 మీటర్లతో లాభమేంటి?
డిజైన్ (DPR) ప్రకారం పూర్తి నీటి నిలువ సామర్థ్యం (FRL) 45.72 మీటర్ల ఎత్తులో 194.6 TMC నిల్వ చేస్తేనే 35 లక్షల ఎకరాలకు సాగునీరు, 28 లక్షల మందికి తాగునీరు అందుతుంది. మరి 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయడం ద్వారా సమకూరే ప్రయోజనం ఏంటి? పోలవరం కనీస నీటి నిల్వ సామర్థ్యం (MDDL) అయిన 41.15 మీటర్ల ఎత్తులో కేవలం 119 TMC లకే తొలి దశ పూర్తి చేసి, ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇస్తారు? ఎంతమంది గొంతు తడుపుతారు? అని వైఎస్ షర్మిళా సూటిగా ప్రశ్నిస్తున్నారు.

పోలవరంపై 'శ్వేతపత్రం' విడుదల చేయాలి!
పోలవరం ప్రాజెక్టును కాస్తా 'పోలవరం బ్యారేజ్'గా మారుస్తూ, జాతికి అంకితం ఇస్తామని చెబుతున్న చంద్రబాబు దీనిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. మొదటి దశ ద్వారా రాష్ట్ర ప్రజలకు వచ్చే ప్రయోజనాలు ఏంటో స్పష్టంగా చెప్పాలన్నారు.

"కేంద్రంలో మీ మద్దతుతోనే సర్కార్ నడుస్తోంది కదా, మరి రెండో దశ గురించి నోరు ఎందుకు మెదపడం లేదు? కేంద్రం నుండి ఖచ్చితమైన, కాంక్రీట్ హామీ తీసుకుని రాగలమని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా?" అని ఆమె సవాల్ విసిరారు. ప్రాజెక్టు పేరు పోలవరమే అయినా.. దానికి చంద్రబాబు పొడుస్తున్న వెన్నుపోటు తరతరాలకు శాపంగా మారుతుందని షర్మిల హెచ్చరించారు.

Also Read: పల్నాడులో కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాల..100 సీట్ల భర్తీకి NMC గ్రీన్ సిగ్నల్..

Also Read: "సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డాను"..నరరూప హంతకుడు రాజ్‌కుమార్ సూసైడ్ వీడియో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Moto, OnePlus, iQOO.. రూ.25,000 లోపు అదిరిపోయే ఫీచర్లతో టాప్ స్మార్ట్‌ఫోన్ ఇదే!

Hyderabad, Telangana:

Moto G77 Power Vs OnePlus Nord CE 6 Lite vs iQOO Z10R 5G: ప్రస్తుతం భారతీయ మొబైల్ మార్కెట్‌లో రూ. 25,000 నుంచి రూ.30,000 లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ల కేటగిరీలో తీవ్రమైన పోటీ నడుస్తూ వస్తోంది.. ఇటీవల మోటొరోలా భారీ బ్యాటరీ ఫోన్ Moto G77 Powerను విడుదల చేయడంతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న OnePlus Nord CE 6 Lite స్మార్ట్‌ఫోన్‌తో పాటు అద్భుతమైన ఫీచర్స్‌తో దూసుకుపోతున్న iQOO Z10R 5G లతో గట్టి పోటీ నడుస్తోంది. మరి ఈ మూడు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? ఫీచర్స్‌తో పాటు ధరల పరంగా వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డిస్‌ప్లే పరంగా ఏది బెస్ట్?
ఈ Moto G77 Power స్మార్ట్‌ఫోన్‌ ఎంతో ప్రత్యేకమైన 6.72 ఇంచుల Full HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు  1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది.. ఇక OnePlus Nord CE 6 Lite ఫోన్ కూడా 6.72 అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. అయితే, ఇందులో గరిష్టంగా 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ కూడా లభిస్తోంది.. కానీ పీక్ బ్రైట్‌నెస్ 680 నిట్స్‌ సపోర్ట్‌తో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇక iQOO Z10R 5G  స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే విషయంలో అందరికంటే ముందుందని భావించవచ్చు. ఇందులో 6.77 అంగుళాల Full HD AMOLED క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఏకంగా 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ప్రీమియం విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది..

పవర్‌ఫుల్ ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్..
ప్రాసెసర్ పరంగా మోటో G77 పవర్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. అయితే, వన్‌ప్లస్ నోర్డ్ CE 6 లైట్‌తో పాటు ఐకూ Z10R ఫోన్లు రెండూ మోస్ట్ పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌తో అందుబాటులో ఉంది. వన్‌ప్లస్‌లో దీని అడ్వాన్స్‌డ్ Apex వేరియంట్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. మోటో, వన్‌ప్లస్ ఫోన్లు ప్రీమియం ఆండ్రాయిడ్ 16 ఆధారిత UI తో పని చేస్తుందని.. ఐకూ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో రన్‌ అవుతుందని కంపెనీ తెలిపింది..

కెమెరా వివరాలు..
ఫొటోగ్రఫీ ప్రియుల కోసం మూడు ఫోన్లలోనూ 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాలను కంపెనీలు అందిస్తోంది.. మోటో G77 పవర్‌లో అద్బుతమైన 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక వన్‌ప్లస్‌లో EIS సపోర్ట్‌తో కూడిన 50MP కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఐకూ ఫోన్ విషయానికొస్తే.. 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీల కోసం మోటో, ఐకూ ఫోన్లలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు అందుబాటులో ఉండగా.. వన్‌ప్లస్‌లో కేవలం 8 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే అందుబాటులో ఉండడం విశేషం..

బ్యాటరీ, డిజైన్ వివరాలు..
బ్యాటరీ పరంగా మోటో, వన్‌ప్లస్ భారీ 7,000mAh బ్యాటరీలతో లభిస్తున్నాయి. ఇక మోటో 30W చార్జింగ్‌ సపోర్‌తో.. వన్‌ప్లస్ 45W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చాయి.. ఐకూ ఫోన్ 5700mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ చార్జింగ్‌తో లభిస్తోంది. అయితే, బ్యాటరీ పెద్దదిగా ఉండటం వల్ల మోటో, వన్‌ప్లస్ బరువు ఎక్కువగా ఉంటాయి. ఐకూ కేవలం 183.5 గ్రాముల బరువుతో పాటు 7.39 mm స్లిమ్ డిజైన్, IP68/IP69 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.

ధరల వివరాలు..
ఈ Moto G77 Power స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.25,999తో అందుబాటులో ఉంది. అలాగే OnePlus Nord CE 6 Lite స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.25,999 కాగా.. 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.27,999తో అందుబాటులో ఉంది. ఇక iQOO Z10R 5G స్మార్ట్‌ఫోన్‌ 8GBర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌ కలిగిన ధర రూ.22,999, 8GB ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్‌తో ధర రూ.24,999తో అందుబాటులో ఉంది. అయితే, అద్భుతమైన AMOLED కర్వ్డ్ డిస్‌ప్లే, తక్కువ బరువు, బడ్జెట్ ధర కావాలనుకుంటే iQOO Z10R బెస్ట్ ఛాయిస్‌గా భావించవచ్చు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Astrology: వీరి మనసు కనిపెట్టడం ఎవరి తరం కాదు.. అత్యంత తెలివైన 4 రాశులు వీరే..

Hyderabad, Telangana:

Horoscope Telugu News: మానవ స్వభావం అనేది ఒక వింతగా భావిస్తారు. పైకి చాలా అమాయకంగా.. ప్రశాంతంగా కనిపించే వ్యక్తి మనసులో ఎలాంటి వ్యూహాలు, ఆలోచనలు ఉన్నయో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మొత్తం 12 రాశుల వారిలోనూ ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. కొందరు తమ మనసులోని మాటను దాచుకోలేరు.. కానీ మరికొందరు తమ భావోద్వేగాలను, ప్రణాళికలను ఎంత రహస్యంగా ఉంచుతారంటే.. ఎదుటివారు వారి మనసును అస్సలు తెలుసుకోలేపోతూ ఉంటారు. 

జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాశిచక్రంలో అత్యంత చతురత, వ్యూహాత్మక ఆలోచనలు కలిగిన 4 రాశుల వారు ఉన్నారు. వారు ఏం చేయబోతున్నారో అంచనా వేయడం ఎవరికైనా అసాధ్యం.. ఆ రాశులవారు ఎవరో? వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మకర రాశి (Capricorn)
శని దేవుని ప్రభావం ఉన్న మకర రాశి వారు అత్యంత ప్రాక్టికల్‌గా ఆలోచించే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు చాలా అద్భుతమైన గోల్స్‌ను కలిగి ఉంటారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కానీ ఎప్పుడూ తొందరపడరు. విపరీతమైన ఓర్పుతో తమ లక్ష్యాల కోసం పావులు కదుపుతూ ఉంటారు. వీరు చాలా సాధారణంగా ఉన్నారని మీరు అనుకోవచ్చు.. కానీ సమయం చూసి తమ కెరీర్ లేదా వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన కీలకమైన అడుగు వేస్తూ ఉంటారు.

కుంభ రాశి (Aquarius) 
కుంభ రాశి వారు దూరదృష్టి గలవారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు అందరితో కలిసి ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ.. వీరు తమకంటూ ఒక ప్రత్యేక దూరాన్ని పాటిస్తారు. వీరి పరిశీలనా శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఎక్కువగా మాట్లాడకపోయినా.. చుట్టుపక్కల ఉన్నవారి బలహీనతలను, మనస్తత్వాన్ని చాలా వేగంగా పసిగట్టేస్తారు. వీరి మనసును అంచనా వేయడం చాలా కష్టమని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మిథున రాశి (Gemini)
మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి.. బుధగ్రహం బుద్ధికి, వాక్చాతుర్యానికి కారకుడి భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారిలో ఒక రకమైన ద్వంద్వ వ్యక్తిత్వం (Dual Personality) కనిపిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరి మాటలు, ప్రవర్తన ఎంత ఆకర్షణీయంగా ఉంటాయంటే.. ప్రజలు వీరిని సులభంగా నమ్మేస్తారు. తమ అవసరానికి ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో.. ఏ పరిస్థితిలో ఎలా ప్రవర్తించాలో వీరికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు.

వృశ్చిక రాశి (Scorpio) 
అత్యంత రహస్యమైన రాశుల్లో వృశ్చిక రాశి మొదటి స్థానంలో ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుజుడి ప్రభావం వల్ల వీరు ఎంతో అద్భుతంగా ఆలోచించగలుగుతారు. కానీ తమ వ్యూహాలను ఎప్పుడూ బయటపెట్టరు. వీరి మనసు ఒక అంతుచిక్కని రహస్య సముద్రం లాంటిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. పైకి ఎంతో సాధారణంగా.. ప్రశాంతంగా కనిపిస్తూనే.. లోపల భవిష్యత్తుకు సంబంధించిన పక్కా రోడ్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Mercury Direct 2026: జూలై 24 తర్వాత ఈ రాశుల జాతకం మారిపోతుంది.. అపార ధనలాభం!

Hyderabad, Telangana:

Mercury Margi In Gemini 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.. బుధుడిని బుద్ధితో పాటు జ్ఞానం, వ్యాపారం, కమ్యూనికేషన్, వాక్కుకు కారకుడిగా భావిస్తూ ఉంటారు.. జాతకంలో బుధుడు బలంగా ఉంటే.. వారి వ్యాపారం, సంతోషానికి చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. ఇదిలా ఉంటే.. జూలై 24న పెద్ద గ్రహ సంచారం జరగబోతోంది. గత కొంతకాలంగా వక్రగతిలో నడుస్తున్న బుధుడు.. జూలై 24న తన సొంత రాశి అయిన మిథునరాశిలోకి ప్రవేశించి సక్రమార్గంలోకి కొనసాగుతాడు.. 

ఏదైనా ఒక గ్రహం వక్రదశను వదిలి నేరుగా సంచారం చేసినప్పుడు.. దాని శుభ ప్రభావం పదింతలు పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మీడియా, రైటింగ్, మార్కెటింగ్, బ్యాంకింగ్‌తో పాటు విద్యా రంగాలలో ఉన్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని చెబుతున్నారు. గత కొన్ని ఉన్న మానసిక గందరగోళం సులభంగా తొలగిపోతుంది. ఈ బుధుడు సక్రమార్గంలోకి ప్రవేశించడం వల్ల ప్రధానంగా 4 రాశుల వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్‌:
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి జూలై 24 తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది.. బుధుడి అనుగ్రహంతో మీ వ్యక్తిత్వంలో ప్రత్యేకమైన ఆకర్షణ మొదలవుతుంది. ఇది సహోద్యోగులను ఎంతగానో ఆకట్టుకుంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మల్టీనేషనల్ కంపెనీల నుంచి అద్భుతమైన ఆఫర్లు కూడా లభిస్తాయి. పాత పెట్టుబడులతో పాటు పూర్వీకుల ఆస్తి నుంచి ఆకస్మిక ధనలాభం కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

మిథున రాశి (Gemini)
బుధుడు తన సొంత రాశి అయిన మిథునరాశిలోనే సక్రమ మార్గంలోకి వెళ్లడం కారణంగా ఈ సమయం అత్యంత సానుకూల ప్రభావం పడుతుంది. విద్యార్థులకు ఇది నిజంగా సువర్ణ కాలంగా భావించవచ్చు. పోటీ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ జీవితంలో శాంతితో పాటు సంతోషాలు విపరీతంగా పెరుగుతాయి.. అంతేకాకుండా, ఆదాయానికి కొత్త మార్గాలు కూడా సులభంగా తెరుచుకుంటాయి. దీర్ఘకాలికంగా ఉన్న అప్పుల బాధల నుంచి మిథున రాశి వారు విముక్తి  లభిస్తుంది.

మేష రాశి (Aries)
మేష రాశివారికి బుధుడి ప్రత్యేకమైన ప్రభావంతో ఈ సమయం అత్యంత శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా కాలంగా ఆఫీసుల్లో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. అలాగే ఈ సమయంలో తప్పకుండా ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ముఖ్యమైన ప్రాజెక్టులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఇది సరైన సమయం..

కన్యా రాశి (Virgo)
కన్యా రాశికి అధిపతి స్వయంగా బుధుడే కావడం వల్ల.. బుధుడు ప్రభావంతో ఈ రాశి వారికి లాటరీ తగిలినట్లే ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సమయం అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా కొత్త రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ సమయంలో రెట్టింపు లాభాలు కులుగాయి.. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న పాత విభేదాలు తొలగిపోయే ఛాన్స్‌లు ఉన్నాయి. మార్కెట్లో చిక్కుకుపోయిన డబ్బు అకస్మాత్తుగా లభిస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement
Advertisement
Back to top