icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500030
RSRajesh SharmaFollow21 Jun 2024, 10:56 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

ICC ODI World Cup Teams: క్రికెట్ ప్రపంచకప్ 2027 రేసు నుంచి ఆ రెండు టీమ్స్ ఔట్?! టీమ్ఇండియా పరిస్థితి ఏంటంటే?

Dubai, Dubai:

ICC ODI World Cup 2027 Teams: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 మెగా టోర్నీకి సమయం ఆసన్నమవుతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగనున్న ఈ టోర్నీ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఈసారి టోర్నీలో జట్ల సంఖ్యను 10 నుంచి 14 జట్లకు పెంచడంతో అర్హత పోరు మరింత రసవత్తరంగా మారింది.

టోర్నీ అర్హత నిబంధనలు ఇవే..
ఆతిథ్య హోదా కింద ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. అయితే మరో కో-హోస్ట్ అయిన నమీబియా మాత్రం ఈ ఆతిథ్య కోటాను దక్కించుకోలేకపోయింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం కటాఫ్ తేదీ నాటికి టాప్-8లో నిలిచే జట్లే ఎలాంటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడకుండా నేరుగా ప్రపంచకప్ టోర్నీ ఆడేందుకు అర్హత సాధిస్తాయి. 

క్రికెట్ వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం ఆతిథ్య దేశాలు రెండింటితో పాటు ర్యాంకింగ్స్ ద్వారా అర్హత సాధించిన 8 జట్లు పోను.. మిగిలిన 4 స్థానాల కోసం ప్రత్యేకంగా గ్లోబల్ క్వాలిఫైయర్ టోర్నీ నిర్వహిస్తారు.

టీమిండియా పరిస్థితి ఏంటంటే?
ఐసీసీ వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా ప్రస్తుతం 116 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకుపోతోంది. భారత జట్టు పాయింట్ల పరంగా ఎంతో పటిష్టంగా ఉండటంతో పాటు భారీ ఆధిక్యంలో ఉంది. దీంతో టీమిండియా ఎలాంటి ఆందోళన లేకుండా నేరుగా 2027 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించడం లాంఛనమే కానుంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా సురక్షితమైన స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఇతర ప్రధాన జట్ల పరిస్థితి ఎలా ఉందంటే?
ర్యాంకింగ్స్ రేసులో పాకిస్తాన్ (100 పాయింట్లు) 5వ స్థానంలో, శ్రీలంక (96 పాయింట్లు) 6వ స్థానంలో, ఇంగ్లాండ్ (93 పాయింట్లు) 7వ స్థానంలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్ - శ్రీలంక మధ్య జరిగే వన్డే సిరీస్ ఈ రెండు జట్ల ర్యాంకింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక అఫ్గానిస్తాన్ 90 పాయింట్లతో 8వ స్థానంలో ఉంటూ క్వాలిఫికేషన్ అంచున నిలిచింది. రాబోయే సిరీస్‌లలో ప్రతీ మ్యాచ్ ప్రతీ జట్టుకూ అత్యంత కీలకం కానుంది.

Also Read: యశస్వి జైస్వాల్‌తో స్టార్ హీరోయిన్ డేటింగ్ రూమర్స్..స్పందించిన మృణాల్ ఠాకూర్!

Also Read: "నా సొంత ఊర్లో ఇంటి స్థలం ఇప్పించండి సీఎం గారూ"..క్రికెటర్ రిషబ్ పంత్ ఆవేదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

తెలంగాణ వాతావరణ హెచ్చరిక.. రానున్న 2 రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు! 3 జిల్లాలకు రెడ్ అలర్ట్!

Hyderabad, Telangana:

2 Days Heavy Rains In Telangana: రానున్న రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటే, కొన్ని చోట్ల స్వల్పంగా అధికంగా ఉండవచ్చని తెలిపారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఇప్పటికీ వర్షాల లోటు కనిపిస్తోంది. రాష్ట్ర సగటు వర్షపాతం ప్రస్తుతం 4 శాతం లోటులో ఉంది. జూన్ 1 నుండి ఆగస్టు 8 వరకు 41.5 సెం.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ప్రస్తుతం 39.95 సెం.మీ మాత్రమే కురిసింది. దీనివల్ల 10 జిల్లాల్లో వర్షాల లోటు ఉండగా, 20 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. మండలాల వారీగా పరిశీలిస్తే, 18 మండలాల్లో అత్యధికం, 111లో అధికం, 278లో సాధారణం, 210లో లోటు మరియు 4 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది.

మళ్లీ మొదలైన వర్ష గండం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అలజడి కారణంగా ఈరోజు నుండి 13వ తేదీ వరకు రాష్ట్రంలో మరోసారి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. గత పది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఈనేపథ్యంలో, కొమరం భీం, ఆసిఫాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఒక్క రాత్రికే జలమయమైన కామారెడ్డి..
గత వారం కురిసిన భారీ వర్షాల వల్ల కొమరుం భీం, ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో ఒక్క రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. కొమరం భీం జిల్లాలోని తిరియాని, బెజ్జూరు, దహేగాం, నార్నూరు, జైనూరు మండలాల్లో దాదాపు 15 నుండి 20 సెం.మీ వర్షం కురిసింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన మెదక్ జిల్లాలో మాత్రం ఇప్పటివరకు భారీ వర్షపాతం నమోదు కాలేదు.

నైరుతి తుస్సు.. వాయుగుండం హిట్టు..
నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో ఇప్పటికీ వర్షాల లోటు కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో కురిసిన వర్షాలతో ఈ గణాంకాలు కొంతవరకు మెరుగుపడ్డాయి. ఒకవేళ పది రోజుల్లో వర్షాలు కురవకపోయి ఉంటే, రాష్ట్రం కరువు ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికీ వర్షాల లోటు కొనసాగుతుండగా, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షపాతం నమోదు కాలేదు.

గోదావరిలో తగ్గుతున్న వరద ఉధృతి..
బంగాళాఖాతంలోని అలజడి వాయుగుండంగా లేదా అల్పపీడనంగా మారే అవకాశం ఉండటంతో, ఉత్తర తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, దక్షిణ తెలంగాణలో ఇప్పటివరకు భారీ వర్షాలు పడకపోవడంతో, నల్గొండ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గోదావరి నది ప్రవాహం గత వర్షాల వల్ల పెరిగింది. మహారాష్ట్రలో పడుతున్న భారీ వర్షాల వల్ల ప్రాణహిత, గోదావరి నదుల ప్రవాహాలు పెరిగాయి. కాళేశ్వరం వద్ద ఈ వానాకాలంలో ఇప్పటివరకు సుమారు 8.5 లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ మీదుగా గోదావరిలోకి ప్రవహించింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండకపోవడంతో, ప్రస్తుతం గోదావరి నది ప్రవాహం కూడా చాలా వరకు తగ్గిపోయింది.

సాగర్‌కు చేరుతున్న శ్రీశైలం నీరు..
 కృష్ణా నది ప్రవాహం కూడా తక్కువగా ఉంది, దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కూడా పెద్దగా వరదలు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడైనా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తాల్సి వస్తే, ఆ నీరంతా దిగువన ఉన్న నాగార్జున సాగర్ చేరుకునే అవకాశం ఉంది. మొన్న కురిసిన వర్షాలు పంటలకు ప్రాణం పోశాయని రైతులు చెబుతున్నప్పటికీ, రాష్ట్రం ఇంకా వర్షాల లోటుతోనే ఉంది. ఇప్పటివరకు వచ్చిన వర్షాలు ఈ వానాకాలం సాగుకు దాదాపు 70 శాతం వరకు ఉపయోగపడతాయి, కానీ పంటలు చివరి దశకు వచ్చేసరికి మళ్ళీ నీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం, మరిన్ని భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా ఉంది...
నిన్న అర్ధరాత్రి కూడా భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, సూర్యాపేటలతో పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. మియాపూర్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సమీపంలో వర్షం కారణంగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ బృందం వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించారు. మరోవైపు ఖైరతాబాద్‌లో కూడా భారీ వర్షం కురిసింది. బోరబండ్‌లో అత్యధికంగా 3.4 మిల్లీమీటర్లు, రహమత్ నగర్‌లో 2.5 మిల్లీమీటర్లు, శ్రీనగర్ కాలనీలో 2.3 మిల్లీమీటర్లు, యూసఫ్ గూడలో 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Also Read:  హైదరాబాద్ బోనాలు క్లైమాక్స్.. లాల్‌దర్వాజా సింహవాహినికి ఘనంగా బలిహరణం

Also Read:  హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం.. ఈ సీజన్‌లో ఇదే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Mahesh Babu Varanasi: 'వారణాసి' సినిమా నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్..ట్రీట్ అదిరిపోయింది!

Hyderabad, Telangana:

Mahesh Babu Birthday Varanasi Special: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వారణాసి'. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ పై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హీరో మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 'వారణాసి' సినిమా నుంచి సరికొత్త లుక్స్‌ను చిత్రబృందం షేర్ చేసింది. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'వారణాసి' చిత్రబృందం విడుదల చేసిన లుక్స్ ప్రకారం.. ఆఫ్రికాలోని వైల్డ్‌లైఫ్‌లో షూటింగ్ చేస్తున్న క్రమంలో దాని తాలూకా లుక్స్‌ను విడుదల చేసినట్లు కనిపిస్తుంది. అందులో ఓ లుక్.. మహేష్ బాబు సైడ్‌ లుక్ ఉండగా, రెండోది ఆయన స్టైల్‌గా పడుకున్న లుక్‌ను విడుదల చేశారు. ఇప్పుడా పిక్స్ వైరల్ అవుతున్నాయి. 

ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. వీరితో పాటు మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజు మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను 2027 ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది. 

అసలు కథ ఏంటంటే..? 
ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి యాక్షన్ తో అల్లరించబోతున్నప్పటికీ.. ఈ స్టోరీ సోల్ మాత్రం పక్క ఇండియన్ ఎమోషన్ అని రాజమౌళి హింట్ ఇచ్చారు. సినిమా స్టోరీ లైన్ గురించి ఆయన మాట్లాడుతూ.. "ఆఫ్రికాలోని దట్టమైన అడవుల నుంచి అంటార్కిటికాలోని గడగట్టే చలి వరకు.. రామాయణంలోని దేవుళ్ళు, ప్రకృతి విపత్తులు, అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్.. ఇలా ఇవన్నీ ఒకే సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారు. అయితే వారణాసి సినిమాకు అసలైన మూలం మాత్రం తండ్రీకొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్. ఆ ఎమోషన్ నుంచి కథలోని మిగిలిన అడ్వెంచర్స్ అన్ని గుర్తుకొస్తాయి" అని ఆయన అన్నారు. 

రాజమౌళి లిఫ్ట్ చేసిన ఈ స్టోరీ లైన్, రామాయణం రిఫరెన్సులు విన్న తర్వాత మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అడవులు, అంటార్కిటికా, ఫాంటసీ ఎలిమెంట్స్, తండ్రి కొడుకుల ఎమోషన్.. ఇవన్నీ కలిస్తే థియేటర్లలో పూనకాలే అని ఫిక్స్ అయిపోతున్నారు.

సీక్వెల్స్ లేవు.. 
సాధారణంగా రాజమౌళి సినిమాలో అనగానే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తరహాలో పార్ట్ టూ లేదా సీక్వెల్స్ ఉంటాయేమో అని అంతా భావించారు. కానీ జక్కన్న వహదారులకు బ్రేక్ వేశారు. మహేష్ బాబుతో తీస్తున్న ఈ సినిమాకి ఎలాంటి సీక్వెల్స్ గాని ఫ్రీక్వెల్స్ గాని ఉండవని.. ఇది కేవలం ఒకే ఒక స్టాండ్ అలోన్ చిత్రంగా మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: నటనలో 'రాజకుమారుడు'..అమ్మాయిల మనసు దోచే 'పోకిరి' ఈ సూపర్ స్టార్..HBD మహేష్ బాబు!

Also Read: యశస్వి జైస్వాల్‌తో స్టార్ హీరోయిన్ డేటింగ్ రూమర్స్..స్పందించిన మృణాల్ ఠాకూర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Petrol Price Today: భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు..భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Hyderabad, Telangana:

Petrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొంతమేర శాంతించడం, హార్ముజ్ జలసంధి తెరుచుకుంటుందనే ఆశలు బలపడటంతో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. అయితే అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్నప్పటికీ, దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పతనం..
గత కొన్ని వారాలుగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సుమారు 13 శాతానికి పైగా పడిపోయింది. ఆగస్టు 7 నాటికి ముగిసిన వారంలో ఇది బ్యారెల్‌కు 83.55 డాలర్ల వద్ద సెటిల్ అయింది. డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా 78.18 డాలర్ల వద్ద ముగిసింది. వారమంతా చూస్తే ఇది సుమారు 7.7 శాతం వరకు క్షీణించింది.

ఇరాన్-ఒమన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉండటం, హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు సజావుగా సాగుతాయనే అంచనాలే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

భారత్‌లో పెట్రోల్, డీజిల్ ప్రస్తుత ధరలు..
ప్రపంచ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ.. దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) గత కొన్ని నెలలుగా ధరలను సవరించలేదు. మే 25 తర్వాత దేశంలో ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.115.69 ఉండగా, డీజిల్ ధర రూ. 103.82గా ఉంది. (XP95 పెట్రోల్ రూ. 125.17)

విజయవాడ: లీటర్ పెట్రోల్ ధర రూ. 117.25 కాగా, డీజిల్ ధర రూ. 104.96 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నం: లీటర్ పెట్రోల్ ధర రూ. 116.39, డీజిల్ ధర రూ. 104.11గా ఉంది.

భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారు దేశంగా ఉంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గుతున్న తరుణంలో దేశీయంగానూ ఇంధన ధరలను తగ్గించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆయిల్ కంపెనీలు ప్రస్తుతానికి ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులోనూ పశ్చిమాసియా పరిణామాలు, యుద్ధ ఉద్రిక్తతలపైనే చమురు ధరల మనుగడ ఆధారపడి ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Also REad: యూపీఐ లావాదేవీలపై భారీగా ఛార్జీలు?! అదనపు ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!

Also Read: జియో వినియోగదారులకు అదిరిపోయే ప్లాన్..రూ.200లకే 30 జీబీ డేటా-15 OTT సబ్‌స్క్రిప్షన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

బంగారం, వెండి ధరలు.. ఆగస్టు 9వ తేదీ ఆదివారం తులం పసిడి ధర ఎంతంటే..?

BBhoomi7h ago
Secunderabad, Telangana:

Gold Rate Today: ఈరోజు ఆదివారం, ఆగస్టు 9న బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ.152,150కి చేరింది. 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారం ధర రూ.139,471కి చేరింది. ఒక కిలోగ్రాము వెండి ధర రూ.232,640కి చేరింది. బంగారం ధరల పెరుగుదలకు అనేక అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. గత ఆరు వారాల్లో డాలర్ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఈ పెరుగుదలకు ఒక కారణం. డాలర్ పడిపోయినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయని.. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి.. బంగారం  ధర కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదనంగా, జూలై నెలకు సంబంధించిన యూఎస్ ఉద్యోగాల డేటా అంచనాల కంటే తక్కువగా ఉంది. దీని ఫలితంగా, సెప్టెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం తగ్గిందని చెబుతున్నారు. పర్యవసానంగా, మార్కెట్లో బంగారం ధరల పెరుగుదలకు ఇది ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు.

బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?

ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, బంగారం ధర గణనీయంగా తగ్గుతుందని అంచనా. అయితే, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ద్రవ్య విధాన కమిటీ సెప్టెంబర్‌లో మళ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచవచ్చని లేదా మరింత తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల, సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ప్రోత్సాహం పొందవచ్చు.

బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం 10 సంవత్సరాల యూఎస్ బాండ్లపై రాబడి తగ్గడమే. ఇది డాలర్ విలువను కూడా ప్రభావితం చేస్తుంది. డాలర్ విలువ పడిపోయినప్పుడు, యూఎస్ బాండ్లపై రాబడి కూడా తగ్గుతుంది. పెట్టుబడిదారులు యూఎస్ ట్రెజరీ బాండ్ల కంటే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నందున, దీనిని బంగారం ధరల పెరుగుదలగా కూడా భావించవచ్చు. శ్రావణ మాసం ప్రారంభంతో బంగారం ధరలు పెరగడం దీనికి ఒక కారణం.

మరోవైపు, దేశీయ మార్కెట్‌లోని కారణాలను పరిశీలిస్తే, శ్రావణ మాసం ప్రారంభంతో పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలవబోతోంది. దీని కారణంగా, ప్రస్తుతం మార్కెట్‌లో బంగారు ఆభరణాలకు బలమైన డిమాండ్ ఉంది. బంగారం ధరలు పెరగడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. అంతేకాకుండా, ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ముడి చమురు ధరలు కూడా తగ్గాయి, ఇది డాలర్ విలువ తగ్గడానికి  బంగారం ధరలు పెరగడానికి దోహదపడింది. మరోవైపు, భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరుగుతాయని అనేక బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నట్లు మనం చూడవచ్చు.

Also Read: ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. గజిని కంటే దారుణం..ఏం అడిగినా.. ఆ మూడే సమాధానాలు..!!

Also Read:ఎస్‌బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!

Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్‌తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?

Also Read:  రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

Mahesh Babu Birthday: నటనలో 'రాజకుమారుడు'..అమ్మాయిల మనసు దోచే 'పోకిరి' ఈ సూపర్ స్టార్..HBD మహేష్ బాబు!

Hyderabad, Telangana:

Mahesh Babu Birthday: తెలుగు సినీ పరిశ్రమలో 'సూపర్ స్టార్' అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు హీరో మహేష్ బాబు. అందంతో పాటు అభినయం, అంకితభావం ఉట్టిపడే ఆయన నటనతో కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టారు. కేవలం నటుడిగానే కాకుండా, తనదైన శైలిలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ 'రియల్ హీరో' అనిపించుకుంటున్న మహేశ్ బాబు పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని ఆయన సినీ ప్రయాణంపై ప్రత్యేక కథనం.

బాలనటుడిగా ఎంట్రీ..
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసిన హీరో మహేష్ బాబు.. 'రాకుమారుడు' సినిమాతో పూర్తి స్థాయి హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన అందం, అభినయంతో యువతను విపరీతంగా ఆకట్టుకుని 'ప్రిన్స్' బిరుదును సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 'మురారి', 'ఒక్కడు', 'అతడు', 'పోకిరి' వంటి సంచలన విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

ప్రయోగాత్మక చిత్రాలు - బాక్సాఫీస్ రికార్డులు..
కేవలం కమర్షియల్ చిత్రాలకే పరిమితం కాకుండా 'శ్రీమంతుడు', 'మహర్షి', 'భారత్ అనే నేను' వంటి సందేశాత్మక చిత్రాలతో సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించారు. విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోగా తన హవాను కొనసాగిస్తున్నారు.

గ్లోబల్ ప్రాజెక్ట్‌తో సరికొత్త మైలురాయి..
ప్రస్తుతం మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా నిలిచిన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలోని భారీ యాక్షన్ అండ్ మైథలాజికల్ మూవీ 'వారణాసి' సినిమాలో నటిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు పొందిన తర్వాత ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చే మూవీ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

సామాజిక సేవా కార్యక్రమం..
తెరపైనే కాకుండా తెరవెనుక కూడా మహేశ్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 'మహేష్ బాబు ఫౌండేషన్' ద్వారా వందలాది గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు నిలబెడుతున్నారు. అలాగే 'మీనాక్షి' గ్రామం వంటి దత్తత కార్యక్రమాలతో తన మంచితనాన్ని చాటుకుంటున్నారు.

విలక్షణ నటనతో, బాధ్యతాయుతమైన పౌరుడిగా తెలుగు జాతి గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయన కెరీర్ మరిన్ని అద్భుత విజయాలను అందుకోవాలని మనసారా కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే మహేష్ బాబు!

Also Read: ప్రభాస్ సినిమాలోని ఈ లేడీ విలన్ గుర్తుందా? 54 ఏళ్ల వయసులోనూ హీట్ పుట్టించే గ్లామర్!

Also Read: యశస్వి జైస్వాల్‌తో స్టార్ హీరోయిన్ డేటింగ్ రూమర్స్..స్పందించిన మృణాల్ ఠాకూర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Chintada Ravikumar Arrest: మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన..ఆముదాలవలస వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్!

Amadalavalasa, Andhra Pradesh:

YSRCP Chintada Ravikumar Arrest: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం పర్యటన సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐపై దౌర్జన్యం చేశారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఆయనను ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

ఘటన నేపథ్యం..
శ్రీకాకుళం పర్యటనలో భాగంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైలులో పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఇటీవల శ్రీకాకుళంలో పర్యటించారు. ఈ సందర్భంగా జగన్‌కు స్వాగతం పలికేందుకు చింతాడ రవికుమార్ తన అనుచరులతో కలిసి తరలివచ్చారు.

అయితే ఈ క్రమంలో మహిళా ఎస్సైపై కొందరు వైసీపీ నేతలు దురుసగా ప్రవర్తించారు. కొట్టారోడ్డు వద్ద బందోబస్తులో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల రవికుమార్, ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 21 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా, చింతాడ రవికుమార్‌ను ఈ కేసులో ఏ1 గా చేర్చారు. కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.

రవికుమార్ ఆరోపణలు, వివరణ..
అరెస్ట్ సమయంలో చింతాడ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై ఆరోపణలు గుప్పించారు. తన కుటుంబ సభ్యులను, వైసీపీ కార్యకర్తలను విచారణ పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. డీఎస్పీ వద్దకు లొంగిపోయేందుకు వెళ్తుండగా తనను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

అంతకుముందు సోషల్ మీడియా ద్వారా స్పందించిన రవికుమార్.. తనతో పాటు అమాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తే పోలీసులకు లొంగిపోతానని తెలిపారు. జనసంచారం ఎక్కువగా ఉండటం వల్లే మహిళా ఎస్ఐని పక్కకు జరిపామని, అంతేక్రీ ఆమె గౌరవానికి ఎలాంటి భంగం కలిగించలేదని ఆ వీడియోలో వివరణ ఇచ్చారు.

Also Read: రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు..ఆగస్టు 8 నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్!

Also Read: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం..బ్యాలెట్ బాక్సులా? ఈవీఎంలా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Jio Rs 200 Recharge: జియో వినియోగదారులకు అదిరిపోయే ప్లాన్..రూ.200లకే 30 జీబీ డేటాతో 15 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్!

Hyderabad, Telangana:

Jio Rs 200 Recharge Free OTTs: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్ల కోసం మరో ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం మొబైల్ డేటా మాత్రమే కాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్‌ని దృష్టిలో ఉంచుకుని రూ.200 ధరతో ఈ సరికొత్త ప్లాన్‌ను డిజైన్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ OTT ప్రయోజనాలు కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

రూ.200 ప్లాన్ ప్రత్యేకతలు..
ఈ రూ.200 రీఛార్జ్ ప్లాన్ కేవలం 28 రోజుల వ్యాలిడిటీతో వినియోగదారులకు లభిస్తుంది. రోజూవారీ డేటా లిమిట్ ఉండే సాధారణ ప్లాన్‌లా కాకుండా.. మొత్తం 28 రోజులకు కలిపి ఒకేసారి 30 GB హై-స్పీడ్ డేటాను అందిస్తారు. దీన్ని యూజర్లు తమ అవసరానికి తగ్గట్టు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు.

ఈ రీఛార్జ్ ద్వారా అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లతో కలిపి మొత్తం 15 ఓటీటీ సేవలకు ఉచితంగా యాక్సెస్ లభిస్తుంది.

ఓటీటీ ప్రియులు విడివిడిగా వేర్వేరు సబ్‌స్క్రిప్షన్‌లు తీసుకునే పనిలేకుండా, తక్కువ ఖర్చుతోనే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్పోర్ట్స్ ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ అద్భుతంగా సరిపోతుంది.

ఈ ప్లాన్ ఎవరికి అనుకూలం?
ప్రతిరోజూ ఇంటర్నెట్ అవసరం పెద్దగా లేనివారికి, లేదా అప్పుడప్పుడు బల్క్ డేటా కావాలనుకునే వారికి ఈ రీఛార్జ్ చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, ఈ ప్లాన్‌ను ఎంచుకునే ముందు దీనికి ఏదైనా యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరమా లేదా అనే పూర్తి వివరాలను 'మై జియో' యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.

Also Read: వినియోగదారులకు ఎయిర్‌టెల్ బిగ్‌షాక్..అతిచౌకైన రూ.299 రీఛార్జ్ ప్లాన్ క్యాన్సిల్!

Also Read: మార్కెట్లోకి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..చలామణీ ఎప్పటినుంచి అంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Leg Cramps: తరచుగా కాళ్లు నొప్పులు వస్తున్నాయా? ఈ విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు!

Hyderabad, Telangana:

Leg Cramps Deficiency: రాత్రి పడుకున్నప్పుడు లేదా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత కాళ్లలో ఆకస్మిక నొప్పి, బిగువును అనుభవించడం చాలా మందిలో సాధారణంగా కనిపించే సమస్యే. కొద్దిసేపట్లో తగ్గిపోయే ఈ నొప్పులను సాధారణంగా 'కాలి తిమ్మిర్లు' అంటారు. అయితే, ఈ సమస్య పదే పదే వేధిస్తుంటే మాత్రం దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.

కాలు తిమ్మిర్లకు ప్రధాన కారణాలు..
శరీరంలో తగినంత నీరు లేకపోవడం, ఎండలో ఎక్కువగా పనిచేయడం, లేదా అధిక చెమట వల్ల నీరు, ఎలక్ట్రోలైట్ల కొరత ఏర్పడి కండరాల నొప్పులు వస్తాయి. కండరాలు సక్రమంగా పనిచేయడానికి మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు అత్యంత ముఖ్యం. వీటి లోపం వల్ల కండరాల బలహీనత, సంకోచాలు సంభవిస్తాయి. అయితే, సొంతంగా సప్లిమెంట్లు లేదా మాత్రలు వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

శరీరానికి అలవాటు లేకుండా అకస్మాత్తుగా ఎక్కువ వ్యాయామాలు చేయడం వల్ల కండాలపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అలాగే ఎక్కువసేపు ఆఫీసుల్లో కూర్చోవడం లేదా ఎక్కువసేపు నిలబడటం వల్ల కాలి కండరాలలో అసమతుల్యత ఏర్పడుతుంది.

తిమ్మిర్లు వచ్చినప్పుడు తక్షణ ఉపశమనం కోసం..
నొప్పిగా ఉన్న కండరాన్ని మెల్లగా సాగదీయాలి (ఉదాహరణకు కాలి వేళ్లను మెల్లగా పైకి లాగడం). కండరాన్ని సున్నితంగా మసాజ్ చేయడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. నొప్పి తగ్గిన తర్వాత కాసేపు నెమ్మదిగా నడవడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి చిట్కాలు..
> రోజంతా తగినన్ని నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి.

> వ్యాయామానికి ముందు, తర్వాత సరైన స్ట్రెచింగ్ చేయాలి.

> అప్పుడప్పుడు లేచి నడవడం, కాళ్లను కదిలించడం చేయాలి.

> ఆకుకూరలు, పప్పుధాన్యాలు, గింజలు, విత్తనాలు, పండ్లు, పాలు వంటి సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అవసరమైన పోషకాలు అందుతాయి.

ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి?
కాలు నొప్పులు తరచుగా వస్తూ, తీవ్రమైన బాధను కలిగిస్తే లేదా రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కాలులో వాపు, ఎరుపు రంగులోకి మారడం, నిరంతర నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి.

(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీర్ఘకాలిక లేదా తీవ్రమైన సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించాలి.)

Also Read: Muskmelon Benefits: కాన్సర్ కణాలను చంపేసే ఏకైక పండు..రోజూ తింటే మెండు!

Also Read: Detox Overnight: రాత్రికి రాత్రే మీ కడుపంతా క్లీన్ అవ్వాలంటే ఇలా చేయండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Bonalu: రేపు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా బోనాలు.. 25 ఆలయాలకు పట్టువస్త్రాలు సమర్పించేది వీరే

Hyderabad, Telangana:

Hyderabad Bonalu: రేపు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా బోనాలు జరగనున్నాయి. ఆషాఢ మాసం పురస్కరించుకుని జరిగే బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం రేపు జరగనుంది. గోల్కొండ, బల్కంపేట, లష్కర్‌ బోనాల అనంతరం హైదరాబాద్‌ మొత్తం రేపు బోనం ఎత్తుకోనుంది. ఈ సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. అన్నీ ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాలంకరణలో ధగధగలాడుతున్నాయి. బోనాల సందర్భంగా రేపు హైదరాబాద్‌లోని అన్నీ ప్రముఖ ఆలయాల్లో తెలంగాణ ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనుంది.

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆగస్టు 9న హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని పలు ప్రముఖ అమ్మవారి ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తుల విశ్వాసాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. ప్రముఖ ఆలయాల్లో ప్రభుత్వ ప్రతినిధులుగా పట్టు వస్త్రాలు సమర్పించే ముఖ్య నేతల వివరాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. లాల్‌ దర్వాజ సింహావాహిని అమ్మవారు, కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ, అక్కన్న మాదన్న ఆలయం తదితర ఆలయాలతోపాటు మొత్తం 25 ఆలయాలకు ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించనుంది.

ఆలయాలు.. పట్టువస్త్రాలు సమర్పించే అతిథులు
ఉప్పుగూడ మహంకాళి ఆలయం – గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్

మీరాలం మండి మహంకాళి ఆలయం – గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ స్పీకర్

లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం – మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ 

కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయం – దామోదర రాజనర్సింహ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి

సుల్తాన్‌షాహి బంగారు మైసమ్మ ఆలయం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి

హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయం – దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి

చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి

అంబర్‌పేట మహంకాళి ఆలయం – దనసరి అనసూయ సీతక్క, మంత్రి

సబ్జీ మండి నల్ల పోచమ్మ ఆలయం – తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి

రాంబక్షబండ బంగారు మైసమ్మ ఆలయం – జూపల్లి కృష్ణారావు, మంత్రి

భేలా ముత్యాలమ్మ ఆలయం – గడ్డం వివేక్ వెంకటస్వామి, మంత్రి

సుల్తాన్‌షాహి జగదాంబ ఆలయం – అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి

గౌలిపూర మహంకాళి ఆలయం – వాకిటి శ్రీహరి, మంత్రి

హరిబౌలి నల్ల పోచమ్మ ఆలయం – వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు

హరిబౌలి బంగారు మైసమ్మ ఆలయం – వి. హనుమంతరావు, ప్రభుత్వ సలహాదారు

బోయిగూడ బంగారు మైసమ్మ ఆలయం – కె. కేశవరావు, అద్దంకి దయాకర్, ప్రభుత్వ ప్రతినిధులు

నాచారం మహంకాళి సమేత మహంకాళేశ్వర ఆలయం – పి. సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు

గౌలిగూడ మహంకాళి ఆలయం – హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ సలహాదారు

ఎల్‌బీనగర్ ఖిల్లా మైసమ్మ ఆలయం – పొచారం శ్రీనివాస్ రెడ్డి, ఆది శ్రీనివాస్, ప్రభుత్వ విప్‌లు

అలీజాకోట మహంకాళి ఆలయం – విజయ రమణారావు, ప్రభుత్వ సలహాదారు/ఎమ్మెల్యే

మూసీ బ్రిడ్జి భూలక్ష్మి ఆలయం – పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్

నట్రాజ్ నగర్ మహంకాళి ఆలయం – బాల్మూరి వెంకట్, ప్రభుత్వ విప్

అలియాబాద్ దర్బార్ మైసమ్మ ఆలయం – జాతోత్ రామ్‌చందర్ నాయక్, ఉప సభాపతి

మురాద్ మహల్ నల్ల పోచమ్మ ఆలయం – డా. బండా ప్రకాశ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ 

సీబీఐ క్వార్టర్స్ నల్ల పోచమ్మ ఆలయం – ఎం. అనిల్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం – బి. మహేష్ కుమార్ గౌడ్, శాసనమండలి సభ్యుడు

0
0
Report
Advertisement

Rajinikanth Sreeleela: సూపర్ స్టార్ రజినీకాంత్‌తో హీరోయిన్ శ్రీలీల..75 ఏళ్ల హీరో..25 ఏళ్ల హీరోయిన్!

Hyderabad, Telangana:Rajinikanth Sreeleela Movie:సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో యువ నటి శ్రీలీల కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు అశ్వత్ మారిముత్తుతో ఓ భారీ సినిమాకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి పనిచేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
0
0
Report
Advertisement
Advertisement
Back to top