icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
501505
V SHIVA NAGARAJUV SHIVA NAGARAJUFollow11 Aug 2024, 06:24 pm

లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

Hyderabad, Telangana:

పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవాలు మరియు బోనాల పండుగ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్ కృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఉందని, ప్రజలందరికీ అమ్మవారి, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుతూ ఎంపీ చామల కిరణ్ రెడ్డి ప్రార్థించారు.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Dearness Allowance: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. 2 డీఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులు

Nuzendla, Andhra Pradesh:

AP DA Released: తమ డిమాండ్ల సాధన కోసం.. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడంతో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దిగివచ్చింది. ఉద్యోగులకు భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌లలో ఒకటైన కరువు భత్యం (డీఏ) రెండింటిని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు డీఏలు విడుదల చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులకు వినాయక చవితి కానుక అందించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. 2 నెలల డీఏలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబర్‌ జీతానికి కలిపి చెల్లించాలని ప్రభుత్వ ఆర్థిక శాఖ తెలిపింది. 1.82 శాతం డీఏను 2025 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం చెల్లించనుంది. 20 నెలల బకాయిలు 2028 జనవరి, మార్చి, మే, జూలైన ఆర్థిక శాఖ చెల్లించనుంది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏను 2024 జూలై 1 నుంచి చెల్లించనుంది. ఇక 26 నెలల బకాయిలు 2027 ఏప్రిల్‌, జూన్‌, ఆగస్టులో, అక్టోబర్‌లో ఉద్యోగులకు ఆర్థిక శాఖ జమ చేయనుంది. 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ప్రస్తుతం ఉన్న 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులకు అదనంగా 2.73 శాతం డీఏ పెంపు లభించినుంది.  ఇప్పటివరకు అమల్లో ఉన్న డీఏ శాతాన్ని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీలోని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి భారీ ఆర్థిక ప్రయోజనం కలగనుంది.

పెంచిన డీఏ లబ్ధి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ఇతర వర్గాల ఉద్యోగులకు వర్తించనుంది. 2022 రివైజ్డ్ పే స్కేల్స్ (వేతన సవరణ) ప్రకారం వేతనాలు పొందుతున్న ఉద్యోగులందరికీ డీఏ పెంపు వర్తించనుంది.

డీఏ వర్తించేది వీరికే..
ప్రభుత్వం విడుదల చేసిన డీఏలు ఎవరికి వర్తిస్తుందంటే.. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు తదితర స్థానిక సంస్థల ఉద్యోగులకు పెంపు వర్తించనుంది. ఎయిడెడ్ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది.

0
0
Report

Video Viral: జంక్ ఫుడ్ చూస్తేనే జడుసుకునేలా చేశారుగా.!.. పిల్లలకు బిగ్ షాక్ ఇచ్చిన టీచర్లు.. వీడియో వైరల్..

Hyderabad, Telangana:

Teachers creative ideas to stay away children from junk food video: చాలా మంది పిల్లలు  ఇటీవల ఎక్కువగా జంక్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. శుభ్రంగా అన్నం తినకుండా సూపర్ మార్కెట్ లలో దొరికే చిరుతిండ్లు అంటే పడిచస్తారు. స్కూల్ కు వెళ్లాలన్న, హోమ్ వర్క్ చేయాలన్న వారికి ఇష్టమైన చిరుతిండ్లు తినిపిస్తేనే ఆ పనులు చేస్తారు . పొరపాటున బైటకు తీసుకెళ్తే ఇక తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తారు. కన్పించిన చిరుతిండ్లు కావాలని మారం చేస్తారు. ఇటీవల పిల్లలు మరీ అప్ డెట్ అయ్యారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి మొబైల్ తీసుకుని తమకు కావాల్సిన పిజ్జాలు, బర్గర్ లు ఇతర చిరుతిండ్లు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ లేకుంటే కొంత మంది ముద్దను సైతం ముట్టడంలేదు.

 

ఆ తర్వాత కడుపు నొప్పి, ఇతర సమస్యలతో కన్నవారికిచుక్కలు చూపిస్తారు. ఇదంతా రోటీన్ గా జరిగేదే. అయితే.. దీనిపై ఒక స్కూల్ టీచర్లు చాలా కొత్తగా ఆలోచించారు.అసలు జంక్ ఫుడ్ లు తింటే ఎలాంటి చెడు ప్రభావాలు ఎదుర్కొవాల్సి వస్తుంది.. వారి కడుపులో ఏంజరుగుతుందో వీడియోతో సహా ప్లే చేసి పిల్లలకు చూపించారు.

ఏకంగా క్లాసులో పిల్లలకు మొదట జంక్ ఫుడ్ తినేందుకుఇచ్చారు. అది కడుపులోకి వెళ్లిన తర్వాత ఏమౌతుంది.. ఆ తర్వాతి పరిణామాలను వీడియోలో చూపించారు. దీన్ని ఒక ప్రాజెక్టర్ లో చూపించారు.కడుపులో నులి పురుగులు, ఇతర సమస్యలు , అంతర్గత అవయాలను చూపించారు . దీంతో పిల్లలంతా భయంతో గుక్కపెట్టి ఏడ్చారు.

Read more: Nagpur Sbi Robbery: నాగ్ పూర్ లో షాకింగ్.. బ్యాంక్ ఉద్యోగులపై కారం చల్లుతూ భారీ చోరీ.. వీడియో వైరల్..

కడుపులో నులి పురుగులు చూసి భయపడిపోయారు. ఇక తమకు ఈ జంక్ ఫుడ్ వద్దన్నట్లు ఫిక్స్అయ్యారు.  మొత్తంగా పాపం.. పిల్లలు మాత్రం క్లాసులోనే తెగ ఏడ్చారు. ఈ వీడియోను టీచర్లు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.  ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియో చూసిన నెటిజన్ లు భలే ప్లాన్ చేశారుగా అంటూ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Ganesh Chaturthi 2026: వినాయక చవితి స్పెషల్..దేశంలో 5 ఫేమస్ గణపతి ఆలయాలు..కాణిపాకం ఉందా?

Kanipakam, Andhra Pradesh:

Ganesh Chaturthi 2026 Famous Temples: హిందూ విశ్వాసాలలో తొలి పూజలందుకునే విఘ్నాధిపతికి అంకితం చేసిన ప్రధాన పండుగ గణేశ చతుర్థి. 2026 గణేశ చతుర్థి వేడుకలకు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. జీవితంలోని విఘ్నాలను తొలగించి, సకల శుభాలను అందించే బొజ్జ గణపయ్య అనుగ్రహం కోసం భక్తులు విశేషంగా సందర్శించే భారతదేశంలోని ప్రముఖ గణేశ క్షేత్రాలు, వాటి విశిష్టతల గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం.

2026 గణేశ చతుర్థి వేళ ముంబైలోని సిద్ధివినాయక ఆలయం, పూణేలోని దగ్దుషేత్ హల్వాయి ఆలయం, కర్ణాటకలోని శ్రీ వినాయక దేవురు ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం వినాయక ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు విశేష పూజలు, వేడుకలతో ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుతున్నాయి

భారతదేశంలోని ప్రసిద్ధ గణపతి క్షేత్రాలు..
1) సిద్ధివినాయక ఆలయం (ముంబై) 
దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన గణపతి ఆలయాలలో ముంబైలోని సిద్ధివినాయక ఆలయం ప్రధానమైనది. జీవితంలో విజయం, శ్రేయస్సు, దేవుని అండ లభించాలని కోరుకుంటూ ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. గణేశ చతుర్థి పండుగను ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. గణపతిని ఎంతో సుందరంగా అలంకరిస్తారు. అక్కడ నిర్వహించే ప్రత్యేక హారతులు ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతాయి.

2) దగ్దుషేత్ హల్వాయి గణపతి ఆలయం (పూణే) 
మహారాష్ట్రలోని పూణేలో ఉన్న దగ్దుషేత్ హల్వాయి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. గణపతికి ఎంతో విలువైన ఆభరణాలు, రంగురంగుల పూలతో అలంకరించబడిన వినాయకుడి విగ్రహం భక్తులకు చూడముచ్చటగా ఉంటుంది. కేవలం పూజా కార్యక్రమాలే కాకుండా, ఈ వేడుకలలో భాగంగా జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల కూడా ఇక్కడకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

3) శ్రీ వినాయక దేవుని ఆలయం (కర్ణాటక) 
కర్ణాటకలోని శ్రీ వినాయక దేవుని ఆలయం ప్రశాంతమైన పరిసరాలతో భక్తులను ఎంతో భక్తితో నింపేస్తుంది. ఇది ఇతర ఆలయాల కంటే భిన్నమైన, ప్రశాంతమైన, ధ్యానానికి అనువైన వాతావరణాన్ని కలిగి ఉంది. గణేశ చతుర్థి సమయంలో ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. వినాయక చవితి రోజున ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు ఈ వేడుకలను మరింత వైభోపేతంగా నిర్వహిస్తారు.

4) కాణిపాకం వినాయక ఆలయం (ఆంధ్రప్రదేశ్)
ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం వినాయక ఆలయానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతే కాకుండా గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర కూడా ఉంది. ఇక్కడి వినాయకుడి విగ్రహం స్వయంభువు (స్వయంగా ఆవిర్భవించినది) అని ఆలయ పురాణాల్లో పేర్కొని ఉంది. కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా, ఈ క్షేత్రం పట్ల ఉన్న గాఢమైన నమ్మకంతో వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. వినాయక చవితి పండుగ సమయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించి, ఉత్సవమూర్తిని ఊరేగిస్తూ కన్నుల పండుగలా పూజలు నిర్వహిస్తారు.

5) రంజన్‌గావ్ గణపతి ఆలయం (మహారాష్ట్ర)
రంజన్‌గావ్‌ గణపతి ఆలయానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇది అష్టవినాయక క్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక్కడి విగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు భావిస్తారు. వినాయక చవితి సమయంలో ఈ ఆలయంలో వైభవంగా పూజలు నిర్వహిస్తారు.

Also Read: వినాయక చవితికి ఇంట్లో ప్రతిమకు ప్రాణప్రతిష్ట ఎలా చేయాలి? పూజ నుంచి నిమజ్జనం వరకు..

Also Read: అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..ఎట్టకేలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Bank Employees: బ్యాంకులకు ఐదు రోజుల పని విధానం.. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల ఆందోళన

Hyderabad, Telangana:

Bank Employees Strike: తీవ్ర పని ఒత్తిడి.. అధిక పని గంటలతో తీవ్రంగా సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగులు భారీ ఉద్యమం చేపట్టారు. తమ నిరసనల్లో భాగంగా శుక్రవారం దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. అన్నీ జాతీయ బ్యాంకులు ఒక రోజు బంద్‌ చేపట్టాయి. తమ సమస్యల పరిష్కారం.. తమ డిమాండ్ల సాధనలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ భారీ ఆందోళనకు దిగారు.

ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. హైదరాబాద్‌ కోఠిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున బ్యాంకు ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. వారంలో రెండు రోజుల సెలవు.. ఖాళీల భర్తీ చేపట్టి తమపై పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమ్మెలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.

సమ్మె సందర్భంగా యుఎఫ్‌బీయూ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కె. ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ.. ఐదు రోజుల బ్యాంకింగ్‌ విధానం అమలు, బ్యాంకింగ్‌ రంగంలో ఖాళీ పోస్టుల భర్తీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం తదితర డిమాండ్లను ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు పరిష్కరించాలని కోరారు. బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని, సిబ్బంది కొరతతో ఖాతాదారులకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపివేయాలని యుఎఫ్‌బీయూ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కె. ఆంజనేయ ప్రసాద్ డిమాండ్‌ చేశారు. బ్యాంకింగ్‌ రంగంలో ప్రతిపాదిత పనితీరు ఆధారిత ప్రోత్సాహక విధానం (పీఎల్‌ఐ)పై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉద్యోగుల మధ్య విభజనకు దారితీసే విధానాలను అమలు చేయవద్దని కోరారు. బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగులు, అధికారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బ్యాంకు ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.

బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్‌ 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమావేశాలు నిర్వహించనున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రకటించింది. సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలిపింది. ఈ కార్యక్రమంలో ఏఐబీఈఏ రాంబాబు, ఎన్‌సీబీఈ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, శాండిల్య, వెంకటరామయ్య తదితరులు పాల్గొని సంఘీభవాన్ని తెలిపారు.

0
0
Report
Advertisement

Mahesh Babu SIR Notice: డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు, ఉపాసనకు ఈసీఐ నోటీసులు..వెంటనే స్పందించాలని సూచన!

Hyderabad, Telangana:

Mahesh Babu Rajamouli SIR Notice: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ తెలంగాణలో కూడా సమయం పొడిగించి సమర్థవంతంగా కొనసాగిస్తోంది. ఈ విధానంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రచురించిన ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ వంటి ప్రముఖ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లుగా నమోదైన పలువురు దిగ్గజాల సమాచారంలో వ్యత్యాసాలు, సాంకేతిక లోపాలు ఉన్నట్లు తేలింది. అధికారుల రికార్డులతో వీరి వివరాలు సరిపోలకపోవడంతో చట్టబద్ధంగా వివరణ కోరుతూ ఈసీఐ నోటీసులు జారీ చేసింది.

సినీ రంగానికి చెందిన ప్రముఖులు..
ఎన్నికల సంఘం నోటీసులు పంపిన వారిలో టాలీవుడ్ అగ్రశ్రేణి నటులు, దిగ్గజ దర్శకులు ఉన్నారు. దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, సీనియర్ కథానాయకుడు దగ్గుబాటి వెంకటేష్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు ప్రముఖ కథానాయిక సమంత రూత్ ప్రభు, యువ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండలకు కూడా ఈసీ నోటీసులు పంపారు.

క్రీడా, వ్యాపార రంగాలు..
సినీ ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన దిగ్గజాలు కూడా ఈసీఐ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటరు రికార్డుల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కార్పొరేట్ రంగం నుంచి ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబ్స్ అధినేత మురళీకృష్ణ ప్రసాద్ దివి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల వంటి వ్యాపారవేత్తలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది.

ఓటరు గుర్తింపు కార్డుల్లో మ్యాచ్ కాని వివరాలకు సంబంధించి ప్రముఖులు తమ ఆధారాలను మళ్లీ సమర్పించి సవరణలు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఒకవేళ వీరు ప్రత్యక్షంగా లేదా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేని పక్షంలో, తమ తరపున ఒక ప్రతినిధిని పంపే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది.

Also Read: Chalo Hyderabad: ప్రభుత్వ ఉద్యోగుల్లో గందరగోళం..రేపు చలో హైదరాబాద్ ఉందా? లేదా?!

Also Read: మాధురి రాథోడ్ 'నిమ్మతోట వనములో' పాట సంపాద ఎంత? రూ.10 లక్షలు పెడితే,16.2 కోట్లతో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Srikakulam Crime News: 7 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల ముసలోడు లైంగిక దాడి..శ్రీకాకుళంలో దారుణం, కామాంధుడి అరెస్ట్!

Srikakulam, Andhra Pradesh:

Srikakulam Minor Rape Case: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలానికి చెందిన గుంజిలోవ గ్రామంలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు కవిటి రామారావు, బుధవారం మధ్యాహ్నం ఏడేళ్ల అమాయక బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే స్పందించి, కోటబొమ్మాళి పోలీసులను ఆశ్రయించి ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.

బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోటబొమ్మాళి పోలీసులు తక్షణమే విచారణ చేపట్టారు. భారతీయ నష్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్లతో పాటు, పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 5(m) రెడ్ విత్ 6 కింద నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం పోలీసులు బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.

టెక్కలి డీఎస్పీ దాసరి లక్ష్మణరావు స్వయంగా బాలిక నివాసానికి వెళ్ళి పరిస్థితిని పరిశీలించి విచారణ నిర్వహించారు. అంతేకాకుండా, క్లూస్ టీమ్ (Clues Team) కూడా ఘటనాస్థలానికి చేరుకుని కీలక ఆధారాలను సేకరించింది.

నిందితుడి అరెస్ట్, కోర్టులో హాజరు.. 
కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, గురువారం సాయంత్రం కోటబొమ్మాళి మార్కెట్ యార్డు సమీపంలో టెక్కలి డీఎస్పీ దాసరి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిందితుడు కవిటి రామారావును అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ నుంచి నడిపిస్తూ ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.

ఈ కేసును విచారించిన న్యాయస్థానం, నిందితుడు కవిటి రామారావుకు 7 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిని ప్రత్యేక వాహనంలో శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు ప్రాంతంలో ఉన్న జిల్లా జైలుకు తరలించారు. చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని, అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Also Read: తిరుమల వెళ్లే భక్తులకు ఊహించని షాక్..సెప్టెంబరు 12, సెప్టెంబరు 13న దర్శనాలు రద్దు!

Also Read: "జగన్‌కి డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలుసా?" వైఎస్ జగన్‌కు మంత్రి లోకేష్ కౌంటర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Tirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సేవలో నటి కృతి శెట్టి

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Heavy Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో భక్తుల సందడి కనిపిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు టీటీడీ అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, పాలు, అల్పాహారం అందిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలోని ప్రధాన ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. 

తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సినీ నటి కృతి శెట్టి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో వారు దర్శించుకోగా.. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న ప్రముఖులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.

తిరుమల ఆలయంలో స్వామిని 11వ తేదీన భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. శ్రీవారిని 69,771 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 25,888 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఒక్కరోజే తిరుమల ఆలయానికి భారీగా హుండీ ఆదాయం లభించింది. రూ.6.94 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. 4.42 లక్షల లడ్డూ ప్రసాదం విక్రయాలు జరగ్గా.. 2.65 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 15 నుంచి 20 గంటలు సమయం పడుతోంది.

అవి రద్దు
రెండో శనివారం, ఆదివారంతోపాటు సోమవారం వినాయక చవితి రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, స్కూళ్లతోపాటు బ్యాంకులకు కూడా సెలవు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో టీటీడీ దర్శనాలు త్వరగా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. శ్రీవారిని త్వరితంగా దర్శనం చేసుకునేలా టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్‌ దర్శనం, సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది.

0
0
Report

Gynecological Cancer Symptoms: మహిళల్లో పెరుగుతున్న గైనకాలాజికల్ క్యాన్సర్లు..ఈ లక్షణాలుంటే వెంటనే జాగ్రత్త పడండి!

Hyderabad, Telangana:

Gynecological Cancer Symptoms Signs: మహిళల పునరుత్పత్తి వ్యవస్థలోని అండాశయాలు, గర్భాశయం, యోని, గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్), బాహ్య జననేంద్రియ ప్రాంతం (వల్వా) వంటి అవయవాలకు వచ్చే క్యాన్సర్లను స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లు అంటారు. వీటిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) అత్యంత సాధారణమైనది. అంటే ఎక్కువ శాతం మంది మహిళల్లో ఇది కనిపిస్తుంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లలో ప్రారంభ దశలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే స్త్రీల జననేంద్రియాల క్యాన్సర్లపై ఫెర్నాండెజ్ హాస్పిటల్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వాతి దోనూరి అందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్.. 
లక్షణాలు లేని వారికి కూడా సాధారణ స్క్రీనింగ్ పరీక్షలు సిఫార్సు చేయబడిన ఏకైక స్త్రీ జననేంద్రియ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ మాత్రమే. దీనికోసం పాప్ పరీక్ష (Pap test), హెచ్‌పివి (HPV) పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. హెచ్‌పివి టీకా వేయించుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార, యోని, వల్వార్ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అండాశయ, గర్భాశయ క్యాన్సర్లకు సాధారణ స్క్రీనింగ్ పరీక్షలు లేకపోవడంతో, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర లేదా BRCA1, BRCA2 జన్యుపరమైన మార్పులు ఉన్నవారు నిపుణులను సంప్రదించడం అవసరం.

ముఖ్యమైన హెచ్చరిక లక్షణాలు: ఈ క్యాన్సర్లను గుర్తించడానికి క్రింది లక్షణాలను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు.

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్
అసాధారణ యోని రక్తస్రావం (ఋతుచక్రాల మధ్యలో, దీర్ఘకాలిక ఋతుస్రావం లేదా మెనోపాజ్ తర్వాత) లైంగిక సంపర్కం సమయంలో లేదా తర్వాత నొప్పి/రక్తస్రావం, దుర్వాసనతో కూడిన యోని స్రావాలు కనిపించవచ్చు.

అండాశయ క్యాన్సర్..
నిరంతర కడుపు ఉబ్బరం లేదా వాపు, త్వరగా కడుపు నిండినట్లు అనిపించడం, గ్యాస్, పొత్తికడుపు లేదా కటి ప్రాంతంలో నొప్పి, తరచుగా లేదా అత్యవసరంగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి.

గర్భాశయ / ఎండోమెట్రియల్ క్యాన్సర్..
మెనోపాజ్ తర్వాత అకస్మాత్తుగా రక్తస్రావం కావడం (90% కంటే ఎక్కువ మంది రోగులలో కనిపించే లక్షణం ఇది) లేదా అసాధారణ మచ్చలు కనిపించడం జరుగుతుంది.

యోని క్యాన్సర్..
అసాధారణ యోని రక్తస్రావం లేదా స్రావం, సంభోగం సమయంలో నొప్పి లేదా నిరంతర కటి నొప్పి, యోని లోపల స్పర్శకు తగిలే గడ్డ లేదా ముద్దగా సంభవించవచ్చు.

వల్వార్ క్యాన్సర్..
యోని ముఖద్వారం వద్ద నిరంతర తీవ్రమైన దురద, మంట, సున్నితత్వం, చర్మం రంగు లేదా ఆకృతి మారడం, దద్దుర్లు, మానని పుండ్లు లేదా వ్రణాలు ఏర్పడతాయి.

నివారణ, సూచనలు..
క్రమం తప్పకుండా గైనకాలజికల్ చెకప్‌లు చేయించుకోవడం, శరీరంలో వచ్చే మార్పులను గమనించడం చాలా అవసరం. క్యాన్సర్ శరీరంలో ఇతర భాగాలకు విస్తృతంగా వ్యాపించక ముందే గుర్తించినప్పుడు చికిత్స మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం వైద్యుల సలహాలు సూచనల ప్రకారం పొందుపరిచినది. దీన్ని అనుసరించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Onion Juice: ఉల్లిపాయ రసం ఎప్పుడైనా తాగారా? ఎన్ని లాభాలో తెలుసా?

Also REad: Money Plant Vastu: ఇంట్లో మనీ‌ప్లాంట్ ఉంటే డబ్బు సమస్య తీరుతుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Ganesh Chaturthi 2026: వినాయక చవితికి ఇంట్లో ప్రతిమకు ప్రాణప్రతిష్ట ఎలా చేయాలి? పూజ నుంచి నిమజ్జనం వరకు ఇవి ఖచ్చితంగా చేయాలి!

Hyderabad, Telangana:

Ganesh Chaturthi 2026 Puja Rituals: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి పండుగను భక్తులు ఘనంగా నిర్వహిస్తారు. ప్రజలంతా ఊరూ, వాడ వినాయకుని ప్రతిమను ప్రతిష్టించి.. భక్తి శ్రద్ధలతో 9 లేదా 11 రోజుల పాటు విశేషమైన పూజలందిస్తారు. అయితే ఈ పండుగ నాడు వినాయకుని ప్రాణ ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి పూజా నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వినాయకుని జననానికి ప్రతీక అయిన గణేశ చతుర్థి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు. పూజకు సంబంధించిన పవిత్రమైన ఆచారాలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవడంతో ప్రారంభమవుతాయి. పూజ జరిగే రోజున ఉదయాన్నే కుటుంబ సభ్యులందరూ స్నానం చేసి సిద్ధం కావాలి.

విగ్రహాన్ని తెచ్చేందుకు వెళ్లేటప్పుడు అగరబత్తీలు, ధూపం, హారతి పళ్ళెం, వక్క, తమలపాకు, విగ్రహాన్ని కప్పే వస్త్రం, చందనపు చెక్క పీట కోసం ప్రత్యేక వస్త్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. చతుర్థి కంటే ముందే విగ్రహాన్ని తెస్తే, స్వామివారి ముఖాన్ని వస్త్రంతో కప్పి ఉంచి పూజ రోజున మాత్రమే తొలగించాలి.

ప్రతిష్ఠాపన, ప్రాణ ప్రతిష్ఠ..
విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకువచ్చేటప్పుడు, నిర్ణీత పీఠంపై ఉంచే ముందు దానిపై పచ్చి బియ్యం చల్లాలి. పీఠంపై బియ్యంతో పాటు వక్క, పసుపు, కుంకుమ, దక్షిణ ఉంచాలి. విగ్రహ ప్రతిష్ఠాపనకు పూజారిని ఆహ్వానించి, ఋగ్వేదంలోని గణేశ సూక్తంలో ఉన్న ప్రాణ-ప్రతిష్ఠ మంత్రాల ద్వారా పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠ ఘట్టాన్ని నిర్వహించాలి. ఈ సమయంలో 'ఓం గం గణపతయే నమః' మంత్రాన్ని జపించాలి. కోరుకుంటే పండితుడి ద్వారా 16 రకాల ఆచారాలతో కూడిన షోడశోపచార పూజ జరిపించుకోవచ్చు.

నైవేద్యం, పూజా ఘట్టాలు..
పూజలో భాగంగా లంబోదరునికి ఎంతో ప్రియమైన 21 గరిక పోచలు (దూర్వా గడ్డి), 21 మోదకాలు, ఎర్రని పూలు సమర్పించి, నుదుటిపై ఎర్ర చందనంతో తిలకం దిద్దాలి. ఆ తర్వాత దేవునికి నైవేద్యంగా కొబ్బరికాయ ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అలాగే స్వామివారి వాహనమైన మూషికం కోసం వేయించిన ధాన్యపు గింజలను ఉంచాలి. శ్రేయస్సు కోసం భక్తులు 108 నామాలు లేదా గణేశ ఉపనిషత్తు పఠించడం ఎంతో మంచిది.

నిమజ్జనం.. 
పవిత్రమైన ఆలోచనలతో, విశాల హృదయంతో పూజిస్తే వినాయకుడు భక్తులకు జ్ఞానం, ఆరోగ్యం, శ్రేయస్సును అనుగ్రహిస్తారు. చివరిగా పూజలన్నీ పూర్తయ్యాక నిమజ్జనం సమయంలో "గణపతి బాప్పా మోరియా లేదా జై బోలో గణేష్ మహారాజ్‌కి.. జై" అని నినదిస్తూ మళ్లీ త్వరగా రావాలని కోరుకుంటూ స్వామివారికి వీడ్కోలు పలుకుతారు.

Also Read: ఆంధ్ర, తెలంగాణలో వినాయక చవితి ఎప్పుడు జరుపుకోవాలి? 14 లేదా 15? పండగ సెలవు ఎప్పుడంటే?

Also Read: మీ వీధిలో వినాయక మండపం పెడుతున్నారా? ఒకే క్లిక్‍తో పోలీస్ పర్మిషన్..రూ.1 ఖర్చు లేదు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top