లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
Hyderabad, Telangana:పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవాలు మరియు బోనాల పండుగ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్ కృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఉందని, ప్రజలందరికీ అమ్మవారి, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుతూ ఎంపీ చామల కిరణ్ రెడ్డి ప్రార్థించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
SRH vs KKR: సన్రైజర్స్ విజయ యాత్రకు బ్రేక్.. ఊపిరి పీల్చుకున్న కలకత్తా నైట్రైడర్స్
Hyderabad, Telangana:SRH vs KKR Highlights: ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్కు భారీ షాక్ ఎదురైంది. స్వల్ప స్కోర్ మ్యాచ్లో కలకత్తా నైట్రైడర్స్ భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటర్లు.. బౌలర్లు ఘోరంగా విఫలమైన వేళ సన్రైజర్స్ చేతులెత్తేసింది. పాయింట్ల పట్టికలో ఆఖరున ఉన్న కలకత్తా నైట్రైడర్స్ అద్భుతంగా ఆడి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. కలకత్తా విజయంతో ప్లే ఆఫ్ రేసు సమీకరణాలు ఆసక్తికరంగా మార్చింది.
Bandla Ganesh Daughter: నిర్మాత బండ్ల గణేష్ కూతురు పెళ్లికి తరలివచ్చిన తారా లోకం..
Hyderabad, Telangana:Telangana Rythu Bharosa: మూడో విడత రైతు భరోసా నిధుల జమకు ముహూర్తం ఖరారు..ఆరోజే అకౌంట్లోకి డబ్బు!
Hyderabad, Telangana:Rythu Bharosa 3rd Installment: అన్నదాతలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని (రైతు భరోసా) పథకానికి సంబంధించిన మూడో విడతను రిలీజ్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 6 నాటికి రాష్ట్రంలోని రైతులకు మూడో విడత రైతు భరోసా సాయాన్ని అకౌంట్లలో జమ చేయనున్నారని తెలుస్తోంది.Heavy Rain: నల్లగొండలో దంచికొట్టిన వాన బీభత్సం.. నేలకూలిన చెట్లు
Nalgonda, Telangana:Heavy Rain In Nalgonda District: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాలుల బీభత్సం సృష్టించింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నిడమనూర్ మండలం బంకాపురం గ్రామంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో రాములు అనే వ్యక్తి ఇంటి పై రేకులు ఎగిరిపోయాయి. అనుముల మండలం అంగడి బజార్లో ఈదురుగాలులతో విద్యుత్ స్తంభం కూలిపోయింది. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రైతులు రోడ్లపై ఆరబోసుకున్న వడ్లు తడిచి ముద్దయ్యాయి. తిరుమలగిరి (సాగర్), పెద్దవూర, గుర్రంపోడు మండలాల్లో ఆకాశం మేఘావృతమై స్వల్ప జల్లులు కురిశాయి. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. వాతావరణం చల్లబడటంతో రైతులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Tamil Nadu Results: తమిళనాడులో హోరాహోరీ.. రేపటి ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ
ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల భారీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కొన్ని రోజులుగా ఎండలకు ఇబ్బందిపడ్డ ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఈదురుగాలులకు పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోగా.. పలు చోట్ల చెట్లు, మామిడి చెట్లు కూలిపోగా.. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోదాడ, యాదాద్రి జిల్లాలో బలమైన గాలులకు మామిడి పంట దెబ్బతింది. కాతకు వచ్చిన మామిడి కాయలు కిందపడ్డాయి.
Also Read: PV Sindhu: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ఒలింపిక్ స్టార్ పీవీ సింధు ప్రశంసలు
హలియాలో బీభత్సం
హాలియాలోని వజ్రతేజ రైస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓపెన్ ఏరియాలో గాలివాన బీభత్సం సృష్టించింది. రైస్ మిల్లులో నిలిపి ఉంచిన ధాన్యంతో కూడిన లారీలపై పట్టాలు ఎగిరిపోయాయి. దీంతో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు కవర్ల కోసం పరుగులు పెట్టారు. పంట చేతికొచ్చే తరుణంలో ప్రకృతి ప్రకోపంతో దిక్కుతోచని స్థితిలో రైతులు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tamil Nadu Results: తమిళనాడులో హోరాహోరీ.. రేపటి ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ
Nagalapuram, Tamil Nadu:TN Election Results: దక్షిణాది ప్రాంతంలో కీలకమైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ద్రవిడ సంస్కృతి.. ద్రవిడ వ్యతిరేక కూటముల మధ్య యుద్ధం అనేలా తమిళ ఎన్నికలు ఎప్పుడూ ఉంటాయి. తమిళనాడులో ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోసారి కోల్పోతుందనే సంప్రదాయం ఉంది. ఎన్నికలకు ఎన్నికలకు ప్రభుత్వం మారుతుందనే సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడనుందా? డీఎంకే మరోసారి అధికారం చేపట్టనుందా? తొలిసారి రాజకీయ పార్టీతో ఎన్నికల్లో నిలిచిన విజయ్ ఏ మేరకు ప్రభావం చూపనున్నారనేది రేపు తేలనుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. మే 4వ తేదీన అంటే రేపు వెలువడనున్న ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఫలితాలకు ముందే చెన్నై రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఉండటంతో అగ్ర నాయకుల్లో టెన్షన్ మొదలైంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
హంగ్ వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో నటుడు, టీవీకే విజయ్ అప్రమత్తమయ్యారు. తన పార్టీ అభ్యర్థులు చేజారకుండా మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ను బుక్ చేసినట్లు సమాచారం. గెలిచిన అభ్యర్థులు నేరుగా అక్కడికే చేరుకోవాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. తమిళనాడు గద్దె ఎవరిదనే విషయంలో సర్వే సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నా మళ్లీ అధికారంలోకి వచ్చేది డీఎంకే పార్టీ అని స్పష్టమవుతోంది.
ఎగ్జిట్ పోల్స్లో యాక్సిస్ మై ఇండియా విడుదల చేసిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి 98-120 సీట్లు వస్తాయని వెల్లడించింది. కింగ్ మేకర్ కాదు కింగ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. మెజారిటీ సంస్థలు మాత్రం డీఎంకే కూటమికే పట్టం కట్టాయి. విజయ్ పార్టీ పది సీట్లు కూడా దాటదని జోస్యం చెప్పాయి. మొత్తం 234 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 118. యాక్సిస్ మై ఇండియా అంచనా నిజమైతే విజయ్ అధికారం చేపట్టడం ఖాయం. ఒకవేళ హంగ్ ఏర్పడితే మాత్రం తమిళ రాజకీయం మరెన్నో మలుపులు తిరిగే అవకాశం ఉంది.
ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ ముగిసినప్పటి నుంచి అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. డీఎంకే కూటమి 92-100 సీట్లు, ఏఐఏడీఎంకే కూటమి 22-32 సీట్లు సాధిస్తాయని అంచనాలు వెలువడుతున్న తరుణంలో అభ్యర్థుల కొనుగోలు జరగకుండా పార్టీలు రిసార్ట్ పాలిటిక్స్కు తెరలేపాయి. మరి తమిళనాడు ఓటరు నాడీ ఎటువైపు ఉంది? దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం అద్భుతాలు సృష్టిస్తుందా? లేక స్టాలిన్ తన పీఠాన్ని నిలబెట్టుకుంటారా? రేపు మధ్యాహ్నం కల్లా ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PV Sindhu: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై ఒలింపిక్ స్టార్ పీవీ సింధు ప్రశంసలు
Vijayawada, Andhra Pradesh:Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు.. మ్యాజిక్ డ్రెయిన్స్తో పల్లెల్లో పారిశుధ్య విప్లవం తెచ్చారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. గ్రామాల్లో మురుగునీటి సమస్యకు ఇది చక్కటి పరిష్కార మార్గం అని.. సిమెంటు డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం నిర్మాణ వ్యయం ఆదా అయిందని వివరించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలుచేస్తున్నారని ఒలంపిక్ మెడలిస్ట్ పీవీ సింధు తెలిపారు. డిప్యూటీ సీఎం ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ ఛేంజర్ లాంటిదని పీవీ సింధు వివరించారు.
ఉప ముఖ్యమంత్రి 20 నెలల పాలన గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో మ్యాజిక్ డ్రెయిన్స్ లాంటి సరికొత్త విధానాలు అమలు చేయడంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాలనా వ్యవహారాలు కొత్తే అయినా పవన్ కల్యాణ్ వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారని చెప్పారు. మన దేశంలో మెజారిటీ శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారని తెలిపారు. అయితే గ్రామాల్లో పారిశుధ్యం పెద్ద సవాలుగా ఉంటుందని పేర్కొన్నారు. సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవనం సాగిస్తూ ఉంటారని పీవీ సింధు పేర్కొన్నారు.
ఈ సమస్యకు పవన్ కల్యాణ్ మ్యాజిక్ డ్రెయిన్స్ రూపంలో అద్భుత పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఇంకుడు గుంతలతో కూడిన డ్రెయిన్లు ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని క్షణాల్లో మాయం చేస్తాయి. మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని భూగర్భ జలంగా మార్చేస్తాయి. మురుగు నీటి నిల్వ, దుర్వాసన తదితర సమస్యలకు మ్యాజిక్ డ్రెయిన్లు చక్కటి పరిష్కార మార్గం' అని పీవీ సింధు తెలిపారు. సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే మ్యాజిక్ డ్రెయిన్లకు 80 శాతం నిర్మాణ వ్యయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు పారిశుద్ధ్యాన్ని ఈ మ్యాజిక్ డ్రెయిన్లు పెంపొందిస్తాయని చెప్పా.
'ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించే వెసులుబాటు కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ భవిష్యత్తులోనూ ఇలాంటి ముందు చూపుతో కూడిన వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలి. గ్రామీణాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నా' అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rajasthan Royals Sold: నక్క తోక తొక్కిన రాజస్థాన్ రాయల్స్ ఓనర్..రూ.15,660 కోట్లకు ఐపీఎల్ జట్టు అమ్మకం!
Jaipur, Rajasthan:Rajasthan Royals Sold Price: ఇండియన్ ప్రీమియర్ లీగ్లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇటీవలే ఆదిత్య బిర్లా గ్రూప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో రాజస్థాన్ రాయల్స్ జట్టు చేరింది. ఈ టీమ్ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలీయనీర్ లక్ష్మీ నివాస్ మిట్టల్ ముందుకొచ్చారు. ఈ టీమ్లోని 75 శాతం వాటాను మిట్టల్ ఫ్యామిలీ సొంతం చేసుకోవడంతో.. ఆ ఫ్రాంచేజీ మేనేజ్మెంట్ మిట్టల్ ఫ్యామిలీ సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ జరుగుతుండగానే ఈ అమ్మకం జరగడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్లో బాగా రాణిస్తుంది. ఈ లీగ్లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్ల్లో గెలిచిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త యజమానిగా భారత సంతతికి చెందిన బిలియనీర్, స్టీల్ కింగ్గా పేరుగాంచిన లక్ష్మీ మిట్టల్ కుటుంబం, రాజస్థాన్ రాయల్స్ను సొంతం చేసుకుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ టీమ్లో 75 శాతం వాటాను మిట్టల్ ఫ్యామిలీ రూ.15,660 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది.
బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ కుటుంబం, దేశంలో 'వ్యాక్సిన్ కింగ్'గా పేరుగాంచిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదర్ పూనావాలాతో కలిసి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నివేదికల ప్రకారం.. ఐపీఎల్ జట్టు ఒప్పందం పూర్తయిన తర్వాత, రాజస్థాన్ రాయల్స్లో మిట్టల్ కుటుంబం సుమారు 75% మెజారిటీ వాటాను కలిగి ఉంటుంది. అయితే ఆదర్ పూనావాలా సుమారు 18% వాటాను కలిగి ఉంటారు. మిట్టల్-పూనావాలా సంయుక్తంగా ఈ ఒప్పందాన్ని పూర్తి చేశారు. మిగిలిన వాటాను ఇతర పెట్టుబడిదారులు కలిగి ఉంటారు.
స్టీల్ కింగ్ బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ ఆర్సెలార్ మిట్టల్ వ్యవస్థాపకుడు. ఆదర్ పూనావాలాతో కలిసి మిట్టల్ కుటుంబం, మనోజ్ బాజ్పేయ్, అతని గ్రూప్ నుండి రాజస్థాన్ రాయల్స్ను స్వాధీనం చేసుకుని, అందులో నియంత్రణ వాటాను పొందేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం విలువ సుమారు $1.65 బిలియన్లు (సుమారు రూ.15,660 కోట్లు) నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ సేల్తో రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ బోర్డులో లక్ష్మీ మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనిషా మిట్టల్-భాటియా, అదర్ పూనావాలా, మనోజ్ బాజ్పేయ్ చేరనున్నారు. ఆదిత్య మిట్టల్ లక్ష్మీ మిట్టల్ కుమారుడు కాగా, వనిషా మిట్టల్-భాటియా ఆయన కుమార్తె. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, ఇతర నియంత్రణ సంస్థల ఆమోదానికి లోబడి, ఈ ఒప్పందం 2026 మూడవ త్రైమాసికంలో అనగా ప్రస్తుత ఐపీఎల్ పూర్తవ్వగానే ఈ డీల్ ఖరారు అవుతుందని భావిస్తున్నారు.
లక్ష్మీ నివాస్ మిట్టల్ ఎవరు?
ఉత్తర రాజస్థాన్లోని సదుల్పూర్లో పుట్టి పెరిగిన లక్ష్మీ మిట్టల్ను దేశపు స్టీల్ కింగ్గా పిలుస్తారు. భారత సంతతికి చెందిన బిలియనీర్ స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ గతంలో బ్రిటన్లోని అత్యంత ధనవంతుల జాబితాలో ఉండేవారు. ఇటీవల, ఆయన యూకేను విడిచిపెట్టాలని నిర్ణయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో లక్ష్మీ మిట్టల్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన నికర ఆస్తి విలువ 28.4 బిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీ విలువ ప్రకారం రూ.27 లక్షల కోట్ల పైమాటే.
లక్ష్మీ మిట్టల్ 1995లో లండన్కు తన నివాసాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే బ్రిటన్లోని అత్యంత ప్రముఖ భారతీయ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఎదిగారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పాదక సంస్థ అయిన ఆర్సెలార్ మిట్టల్ ద్వారా ఆయన తన సంపదను నిర్మించుకున్నారు. ఈ కంపెనీలో లక్ష్మీ మిట్టల్, ఆయన కుటుంబానికి సుమారు 40% వాటా ఉంది. 2021లో లక్ష్మీ మిట్టల్ సీఈఓ పాత్రను తన కుమారుడు ఆదిత్య మిట్టల్కు అప్పగించారు. కానీ తానే ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కొనసాగుతున్నారు.
బ్రిటన్లోని ఆస్తులతో పాటు, బిలియనీర్ లక్ష్మీ మిట్టల్కు దుబాయ్లో ఒక భవనం ఉంది. ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని సమీప నయా ద్వీపంలో ఒక అభివృద్ధి ప్రాజెక్టులో పెద్ద వాటాను కొనుగోలు చేశారు. అంతేకాకుండా, బిలియనీర్స్ రో అని కూడా పిలువబడే కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్లోని ఆయన ఆస్తులు దేశంలోనే అత్యంత ఖరీదైన గృహాలలో ఒకటిగా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Kisan 23rd Installment: ఒకే ఇంట్లో ఇద్దరికి రైతు భరోసా ఇస్తారా? ఏడాది రూ.12,000 పొందాలంటే ఏం చేయాలి?
Hyderabad, Telangana:PM Kisan 23rd Installment Update: భారతదేశపు వెన్నెముక అయిన రైతుల ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (పీఎం-కిసాన్) పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలోని కోట్లాది రైతు కుటుంబాలకు ఈ పథకం ఆసరాగా మారింది. ప్రతి ఏడాది రూ.6000 వేల చొప్పున (నెలనెలా రూ.2,000) వరకు రైతుల కుటుంబాల్లో పీఎం కిసాన్ డబ్బును జమ చేస్తున్నారు. అయితే ఈ పథకం ఒకే ఇంట్లో ఉండే తండ్రి, కుమారులకు వర్తిస్తుందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 22 విడతలను విజయవంతంగా పంపిణీ చేయగా.. రైతులు ఇప్పుడు 23వ విడత డబ్బు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ పథకం ప్రయోజనాలను పొందే విషయంలో ఇంకా చాలా గందరగోళాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఒకే ఇంట్లో నివసించే తండ్రీకొడుకులు ఇద్దరూ ఈ పథకం ప్రయోజనాలను పొందగలరా లేదా అనే ప్రశ్నకు ఇప్పుడు స్పష్టత వచ్చింది.
తండ్రీకొడుకులు ఇద్దరికీ డబ్బు ఎప్పుడు వస్తుంది?
తండ్రీ కొడుకులు ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ కలిసి డబ్బు సంపాదిస్తున్నా కూడా వారికి కొన్ని సందర్భాల్లో తండ్రీకొడుకులుకీ ఈ పథకం పొందేందుకు అనుమతి ఉంది. కొడుకుకు పెళ్లై.. అతని భార్యతో కలిపి ప్రత్యేకంగా రేషన్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే సదరు లబ్ధిదారునిపై ప్రత్యేక వ్యవసాయ భూమి (పహానీ/అడంగళ్) రిజిస్టర్ అయి ఉండాలి. అప్పుడు కొడుకును కూడా ఒక స్వతంత్ర కుటుంబంగా పరిగణిస్తారు. అటువంటి సందర్భంలో, తండ్రీకొడుకులు ఇద్దరూ చెరో రూ.6,000 చొప్పున ఒక ఏడాదికి మొత్తం రూ.12,000 పొందేందుకు అర్హులుగా ఉంటారు.
ఈ పథకానికి ఎవరు అర్హులు కారు?
కుటుంబంలో ఎవరైనా ప్రస్తుత లేదా మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయితే, వారికి ఈ ప్రయోజనం లభించదు. అలాగే గత ఆర్థిక సంవత్సర ఆదాయపు పన్ను చెల్లించిన రైతులు ఈ పథకానికి అనర్హులుగా పరిగణిస్తారు. వీరితో పాటు డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వారు రైతులు ఉన్నప్పటికీ, ఈ పథకాన్ని పొందలేరు. నెలకు రూ.10,000 కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఈ జాబితా నుండి మినహాయించబడలేదు. ఉన్నత రాజ్యాంగ పదవులను కలిగి ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తించదు.
కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా పథకానికి చెందిన డబ్బును పొందుతున్నట్లు ప్రభుత్వానికి తెలిస్తే తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ అటువంటి లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా, ఇప్పటివరకు పొందిన డబ్బు వడ్డీతో సహా తిరిగి వసూలు చేస్తుంది. అందువల్ల, రైతులు ఇ-కెవైసి చేయించుకోవడం, భూమిని ఆధార్తో అనుసంధానం చేయడం తప్పనిసరి.
(గమనిక: రైతులు తమ అర్హత, రావాల్సిన డబ్బు వాయిదాలను పరిశీలించేందుకు pmkisan.gov.in అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఏదైనా ఫిర్యాదులు ఉంటే, వారు ప్రభుత్వ హెల్ప్లైన్ నంబర్ 155261కు ఫోన్ చేయవచ్చు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pant 2027 World Cup: రిషబ్ పంత్కు బీసీసీఐ షాక్..వన్డే ప్రపంచకప్ టీమ్ నుంచి పంత్ ఔట్! అతని స్థానంలో..
Hyderabad, Telangana:Rishabh Pant In 2027 World Cup: ఈ ఏడాది ప్రారంభంలో టీమ్ఇండియా చివరిసారిగా న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడింది. ఆ సిరీస్లో రిషబ్ పంత్ను జట్టులోకి తీసుకున్నారు. కానీ పక్కటెముకల గాయం కారణంగా సిరీస్ ప్రారంభానికి ముందే అతను వైదొలగాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం వన్డే జట్టు నుంచి రిషభ్ పంత్ తన స్థానాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. అతని స్థానంలో సంజూ శాంసన్ లేదా ధ్రువ్ జురెల్ను వికెట్ కీపర్గా పరిశీలించే అవకాశం ఉంది.
ప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో పంత్ ఫామ్తో ఇబ్బంది పడుతున్న క్రమంలో సంజూ శాంసన్ బ్యాటర్గా వికెట్ కీపర్గా రాణిస్తున్నాడు. ఇదే సీజన్లో రెండు సార్లు సెంచరీలు చేసిన శాంసన్.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ధోనీ తర్వాత ప్రధాన కీపర్గా తన స్థానాన్ని పదిల పరుచుకున్నాడు.
భారత్ చివరిసారిగా జనవరిలో న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ ఆడింది. ఆ సిరీస్లో పంత్ను జట్టులోకి తీసుకున్నారు, కానీ పక్కటెముకల గాయం కారణంగా సిరీస్ ప్రారంభానికి ముందే అతను వైదొలగాల్సి వచ్చింది, అతని స్థానంలో జూరెల్ను ఎంపిక చేశారు. పంత్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తూ పంత్ ఇప్పుడు మరోసారి ఎంట్రీ ఇచ్చింది. అయితే, అతను ఎనిమిది ఇన్నింగ్స్లలో 145.79 స్ట్రైక్ రేట్తో కేవలం 189 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పటి వరకు ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున శాంసన్ ప్రదర్శనలతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. అతను ఎనిమిది మ్యాచ్లలో రెండు సెంచరీలతో సహా 304 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచ కప్లో భారత్ విజయం సాధించడంతో అతని అద్భుతమైన ఫామ్ కొనసాగింది. ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్లో అతను 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎంపికయ్యాడు.
మరోవైపు రిషబ్ పంత్ తన చివరి వన్డేను ఆగస్టు 2024లో ఆడాడు. అతను ఈ ఫార్మాట్లో 27 ఇన్నింగ్స్లలో 33.50 సగటుతో 871 పరుగులు రాబట్టాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. శాంసన్ 16 వన్డేలు ఆడి, ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలతో సహా 56.66 అద్భుతమైన సగటుతో 510 పరుగులు సాధించాడు. అతను ఆడిన చివరి వన్డే డిసెంబర్ 2023లో దక్షిణాఫ్రికా పర్యటనలో జరిగింది. అక్కడ అతను 78 పరుగుల విజయంతో పాటు 114 బంతుల్లో 108 పరుగులు చేశాడు.
భారత్ 2027 వన్డే ప్రపంచ కప్ కోసం సన్నాహాలు ప్రారంభించబోతోంది. వన్డే ప్రపంచకప్లో రిషబ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్ ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ జూన్లో ఆఫ్ఘనిస్తాన్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్కు ఆతిథ్యం ఇవ్వనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
iPhone 18 Pro ఫోన్ ఈ ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. డిజైన్ లీక్!
Hyderabad, Telangana:iPhone 18 Pro Leak: యాపిల్ మొబైల్స్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.. ఎందుకంటే కంపెనీ ఎప్పుడు ఫ్లాగ్షిప్ రేంజ్లోనే స్మార్ట్ఫోన్స్ను విడుదల చేస్తూ వస్తుంది. ముఖ్యంగా గతంలో విడుదల చేసిన అన్ని స్మార్ట్ ఫోన్స్ అత్యంత బడ్జెట్ లోనే విడుదలయ్యాయి. అయితే, ప్రతి ఏడాది ఈ కంపెనీ కొత్త సిరీస్ ను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనిని ఇలాగే కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా iPhone 18 సిరీస్ను విడుదల చేయబోతోంది. విడుదలకు ముందే iPhone 18 Pro స్మార్ట్ఫోన్కు సంబంధించిన డిజైన్స్ వివరాలు లీక్ అయ్యాయి. దీన్నిబట్టి చూస్తే ఈసారి విడుదల కాబోయే ఈ మొబైల్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోంది. ముఖ్యంగా డిజైన్ పరంగా చాలా అత్యద్భుతంగా ఉంటుందని లీకైన వివరాలు చెబుతూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ iPhone 18 Pro స్మార్ట్ఫోన్ సెప్టెంబర్ నెలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఐఫోన్ 18 ప్రో ఫోన్లో ముందు భాగంలో కనిపించే డైనమిక్ ఐలాండ్ పరిమాణం తగ్గనుండటం ప్రధానాకర్షణగా నిలవనుంది. త్వరలో విడుదల కాబోయే ఈ మొబైల్ ఐలాండ్ కేవలం 25 నుంచి 30 శాతం వరకు చిన్నదిగా కనిపిస్తూ ఉండబోతోంది. దీనికోసం యాపిల్ సంస్థ వినూత్నంగా లేజర్ మైక్రో డ్రిల్లింగ్ టెక్నాలజీని వినియోగించినట్లు సమాచారం. అంతేకాకుండా ఫేస్ ఐడికి సంబంధించిన ఇన్ఫ్రారెడ్ ఇల్యూమినేటర్ను డిస్ప్లే కింది భాగంలో అమర్చబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇవే కాకుండా ఈ మొబైల్లో భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం..
అయితే, డైనమిక్ ఐలాండ్ మార్చడం వల్ల డిస్ప్లే మరింత పెద్దగా కనిపించడమే కాకుండా.. స్క్రీన్ పరిమాణం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.. దీని కారణంగా చూసేవారికి స్క్రీన్ పైభాగం పూర్తిగా ప్రీవియంగా కనిపిస్తుంది. డిజైన్ మార్పులతో పాటు ప్రాసెసింగ్లో కూడా అనేకమార్పులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ ఆపిల్ సొంతంగా తయారు చేసిన A20 చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. మునుపటి మోడల్స్ కంటే మెరుగైన ప్రాసెసింగ్తో పాటు అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వెనక భాగంలో డిజైన్ ఇటీవల విడుదలైన పాత ఐఫోన్ 17 ప్రోకి సమానంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
ఈ యాపిల్ ఐఫోన్ 18 సిరీస్(iPhone 18 Pro)లో భాగంగా కొన్ని రకాల కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, దీనిని సెప్టెంబర్ నెలలో ప్రస్తుత CEO కొనసాగుతున్న టిమ్ కుక్ సారధ్యంలో.. ఈ సిరీస్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇందులో ప్రత్యేకంగా కంపెనీ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనే కొత్త కెమెరా ఫీచర్తో విడుదల చేయబోతోంది. ఈసారి విడుదల కాబోయే యాపిల్ మొబైల్ డిజైన్ పరంగా కాకుండా ఫంక్షనాలిటీ పరంగా కూడా వినియోగదారులను చాలా వరకు ఆకట్టుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అతి త్వరలోనే యాపిల్ కంపెనీ నుంచి ఈ సిరీస్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vemulawada: రాజన్న క్షేత్రంలో అద్భుతం.. వేములవాడలో కొలువుదీరనున్న భారీ శివ విగ్రహం!
Hyderabad, Telangana:Vemulawada Shiva Statue Telugu News: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న క్షేత్రం త్వరలో సరికొత్త ఆధ్యాత్మిక వెలుగులు దిద్దుకోబోతోంది. భక్తుల కొంగుబంగారమైన రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాలు, చేపట్టిన ఆధునీకరణ పనులతో కొత్త రూపును సంతరించుకుంటుంది. ముఖ్యంగా పర్యాటక అభివృద్ధిలో భాగంగా చేపట్టిన మినీ ట్యాంకు బండి పనులు శరవేగంగా కొనసాగుతూ వస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్న భారీ శివ విగ్రహం పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి..
ఈ విగ్రహం కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాకుండా.. అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా రూపుదిద్దుకుంటోంది. గగనతలం వైపు చూస్తూ.. జటాజూటధారిగా, అత్యంత గంభీరమైన ముద్రలో పరమేశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వడం ఈ దేవాలయానికి తలమానికంగా మారబోతోంది. భక్తుల దృష్టిని ఆకర్షిస్తూ.. ఇప్పటికే ఈ విగ్రహం స్థానికులలో.. యాత్రికులలో భారీ అంచనాలను రేకెత్తించింది.
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనుల వల్ల వేములవాడ క్షేత్రం కేవలం భక్తి కేంద్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందబోతోంది. విగ్రహం చుట్టు విద్యుత్ దీపాలను అలంకరించడమే కాకుండా పచ్చటి లాన్లు, భక్తుల విశ్రాంతి కోసం నిర్మిస్తున్న వాకింగ్ ట్రాకులు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నాయి. అంతేకాకుండా సాయంత్రం వేళల్లో ఈ శివ విగ్రహం వద్ద లైటింగ్ ప్రదర్శనలు భక్తులకు మరి ఎంతో కనువిందు చేయబోతున్నాయి.
Also Read: Bandi Sanjay: పక్కా ప్లాన్ ప్రకారం చోరీ.. కరీంనగర్ జ్యువెల్లరీ ఘటనపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
రాబోతున్న కొద్ది రోజుల్లోనే ఈ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుండడంతో వేములవాడకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు సైతం భావిస్తున్నారు. దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆశీస్సులతో పాటు శివ తత్వాన్ని ప్రతిబింబించే ఈ విగ్రహంతో పర్యాటక పరంగా మరింత ఉన్నత స్థానంలో నిలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. క్షేత్ర పరిసరాలను అందంగా తీర్చిదిద్దడమే కాకుండా.. ఇప్పుడు ఆధ్యాత్మిక అనుభూతిని మరింత పెంపొందించేలా ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు..
Also Read: Bandi Sanjay: పక్కా ప్లాన్ ప్రకారం చోరీ.. కరీంనగర్ జ్యువెల్లరీ ఘటనపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Giant Python Video: కొండచిలువతో సాహసం.. కాళ్లను గట్టిగా చుట్టేసిన పాము.. వీడియో!
Hyderabad, Telangana:Giant Python Wraps Viral Video Watch Now: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి.. మరీ ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టక మానదు.. భారీ కొండచిలువ ఒకటి ఒక వ్యక్తి కాళ్ళను గట్టిగా చుట్టేసి.. అతన్ని ప్రాణాపాయ స్థితిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక వ్యక్తి తన రెండు కాళ్లకు భారీ కొండచిలువ చుట్టుకొని ఉండటాన్ని మీరు క్లియర్ గా చూడొచ్చు.. ఆ పాము తన కండరాల శక్తితో ఆ వ్యక్తిని నలిపేయడానికి ప్రయత్నిస్తుండగా.. అతను ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఒకవైపు పాము తన పట్టును మరింత బిగిస్తుంటే.. మరోవైపు ఆ వ్యక్తి ఏ మాత్రం భయపడకుండా.. చాలా చాకచక్యంగా పాము తలభాగాన్ని పట్టుకొని.. దానిని తన శరీరం నుంచి వేరు చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఉండడం మీరు చూడొచ్చు. అతని ముఖంలో కనిపిస్తున్న కంగారుతో పాటు అతడున్న పరిస్థితులు ఎంత ప్రమాదకరమో వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది..
ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా షాక్కు గురవుతున్నారు. ఒక్క క్షణం ఆలస్యమైనా ప్రాణాలకే ప్రమాదం.. అసలు ఇలాంటి సాహసం ఎందుకు? అంటూ చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయడం మీరు గమనించవచ్చు. వన్యప్రాణులతో పెట్టుకోవడం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. పాములు ఎంత నిశ్శబ్దంగా వేటాడుతాయో.. ఒకసారి పట్టుకుంటే ఎంతటి శక్తిని ఉపయోగించి వేటాడుతాయో అన్నది ఈ వీడియో స్పష్టం చేస్తోంది..
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
కొండచిలువలు చాలా శక్తివంతమైనవి, ప్రమాదకరమైనవి.. ఇవి తన ఆహారాన్ని గట్టిగా చుట్టేసి.. ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు స్వయంగా పాములను పట్టుకోవడానికి లేదా వాటితో ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి ప్రయత్నించడం అస్సలు మంచిది కాదని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతూ ఉన్నారు. ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే.. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించడమే కాకుండా.. మీకు దగ్గరగా ఉన్న ఇతరుల సహాయం తీసుకోవడం చాలా మంచిది. ఏ చిన్న పొరపాటు చేసిన అది ప్రాణాలకే ముప్పుగా మారే అవకాశాలున్నాయి..
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: వామ్మె.. ఇంటి బీరువాలో భారీ కింగ్ కోబ్రాలు.. చూస్తేనే వణుకుపుడుతోంది..
Hyderabad, Telangana:Two King Cobras Viral Video Watch: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులతో పాటు పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా నెట్టింట ఒక వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక సాధారణ ఇంటిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో? అసలు ఈ వీడియోలో పాములు ఎలా వచ్చాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా మనం బీరువాను దుస్తులతో పాటు విలాసవంతమైన వస్తువులను దాచుకోవడానికి వినియోగిస్తూ ఉంటాము.. అయితే, ఒక ఇంటి యజమాని తన బీరువాను తెరవగానే ఊహించని దృశ్యాలు కనిపించాయి. బీరువా తెరిచిన వెంటనే అందులో దాగివున్న రెండు భారీ నాగుపాములు పడగ విప్పి దర్శనం ఇవ్వడంతో ఆ ఇంటి యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు సైతం భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
ఈ వీడియోలో ఆ పాములు చాలా ప్రశాంతంగా.. బీరువాలోని దుస్తుల మధ్య సేద తీరుతున్నట్లు మీరు గమనించవచ్చు. యజమాని తలుపులు తీయగానే.. అవి అప్రమత్తమై పడకవిప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మీరు చూడొచ్చు. అదృష్టవశాత్తూ.. యజమాని తక్షణమే అప్రమత్తం అవ్వడంతో పేను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ బీరువాలోకి పాములు ఎలా వచ్చాయని అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు..
ఈ వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తాది. అంతేకాకుండా వారు ఈ వీడియో పై రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. అసలు అవి బీరువాలోకి ఎలా వెళ్లాలి? చూస్తుంటేనే భయమేస్తోంది.. ఇంటి యజమాని ప్రాణాలతో బయటపడటం నిజంగా అదృష్టం అంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది అడవికి దగ్గరగా ఉండేవారు ఇళ్లలో పాములు రాకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు..
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
పాములకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు.. కంగారు పడకుండా వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు ఎండాకాలంలో పాములు చల్లటి, చీకటి ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో బీరువాలతో పాటు బూట్ల స్టాండ్లు, పాత వస్తువులు ఉంచే ప్రదేశాలను తరచుగా శుభ్రం చేసుకోవడం, తనిఖీలు చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు..
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lassi Viral Video: లస్సీలో మూత్రం పోసి విక్రయిస్తున్న బాలుడు.. వైరల్ వీడియో..
Hyderabad, Telangana:Lassi Contamination Viral Video Watch: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఆహార పదార్థాల్లో కల్తీ అనేది కొత్తేమీ కాదు కానీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మాత్రం ప్రజలను తీవ్ర అసహనంతో పాటు భయాందోళనకు గురిచేస్తుంది. ఓ బాలుడు లస్సిలో మూత్రం పోసి.. అదే విషతుల్యమైన డ్రింకును కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. సదరు బాలుడు ఎంతో నిర్లక్ష్యంగా.. లస్సీని సర్వ్ చేస్తున్నాడు.. కస్టమర్లకు ఇచ్చే లస్సి గ్లాసుల్లో అతను మూత్రం కలిపి.. ఏమీ తెలియనట్లుగా.. వారికి సర్వ్ చేస్తున్నాడు.. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ అమానుష్యాన్ని గమనించి.. వెంటనే తమ స్మార్ట్ ఫోన్స్ లో వీడియోను తీయడం ప్రారంభించారు. ఆ పిల్లాడి చేస్తాలను చూసి కంగుతిన్నవారు.. వెంటనే అతన్ని నిలదీసి అడుగుతుండడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. అయితే, ఆ పిల్లాడు ఏమీ తెలియనట్టు.. ఎటువంటి పాశ్చాతాపం లేకుండా అమాయకపు నటన ప్రదర్శించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. అతని నిర్లక్ష్యం చూసి వీడియో తీస్తున్న వారు కూడా షాక్ అయిపోయారు..
వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది క్షణాల్లోని వైరల్ అవ్వడం ప్రారంభమైంది. ఇది చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆహారంతో ఇలా చెలగాట మాడటం ఎంతవరకు మంచిది? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీధి వ్యాపారుల వద్ద దొరికే ఆహార పదార్థాల పట్ల ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని.. ఇలాంటి కల్తీ ఆహారాల వల్ల ఊహించని రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
ఈ ఘటన ఎక్కడ జరిగిందని విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ.. కానీ ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది.. రోడ్డు పక్కన దొరికే ఆహార పదార్థాల నాణ్యత పై ఆహార భద్రత అధికారులు కఠినమైన నిగా ఉంచాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రజల ప్రాణాలతో ఇలాంటివారు చలగాటమాడుతూనే ఉంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలని సోషల్ మీడియా వినియోగదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana: దేవదాయ శాఖలో భారీగా ఈవో పోస్టులు.. 190 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
Karimnagar, Telangana:Telangana Endowment Department Recruitment Telugu News: రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణను మరింత పతిష్టం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలోని సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 190 కార్య నిర్వహణ అధికారుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎన్ని ఈవో (EO) పోస్టులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎలా వీరి నియామకాలను చేపట్టబోతోంది? దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రేడ్లలో ఖాళీగా ఉన్న ఈవో పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆలయాల్లో పాలన సౌలభ్యంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ, భక్తులకు మెరుగైన సేవలందించే లక్ష్యంగా ఈ పోస్టుల మంజూరు జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గుడిలను అభివృద్ధి చేసే లక్ష్యంతోనే మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఈ నియామకాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రత్యేకమైన ప్రాధాన్యత లభించింది. జిల్లాకు మొత్తం 2 గ్రేడ్ వన్ EO పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఒకటి కరీంనగర్ పట్టణానికి.. మరొకటి సిరిసిల్ల ప్రాంతానికి కేటాయించినట్లు అధికారులు నోటిఫికేషన్లు క్లుప్తంగా పేర్కొన్నారు. జిల్లాలోని ప్రధాన దేవాలయాల పరిపాలన లో ఈ నియామకాలు కీలక మార్పులు తీసుకురానన్నాయి.. ఆలయ అభివృద్ధికి ఇవి తోడ్పడతాయని స్థానికులతో పాటు ఇతర అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Cooking Oil Prices Hike: సామాన్యుడి జేబుకు మంట.. నిన్న గ్యాస్.. నేడు వంట నూనె.. భారీగా పెరిగిన ధరలు
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అధికారులతో పాటు నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న EO పోస్టుల నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పోస్టులు మంజూరు కావడంతో.. అభ్యర్థులు ఇప్పటినుంచి పోటీ పరీక్షల తయారీలో నివంతం అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ భారీ నియామకాల వల్ల దేవాదాయ శాఖలో పరిపాలనపరమైన ఇబ్బందులు తొలగిపోయి.. వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.. అతి త్వరలోనే సిలబస్తో పాటు వయోపరిమితి, దరఖాస్తు విధానం వంటి వివరాలతో కూడిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Cooking Oil Prices Hike: సామాన్యుడి జేబుకు మంట.. నిన్న గ్యాస్.. నేడు వంట నూనె.. భారీగా పెరిగిన ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
