icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
501505
V SHIVA NAGARAJUV SHIVA NAGARAJUFollow11 Aug 2024, 06:24 pm

లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

Hyderabad, Telangana:

పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవాలు మరియు బోనాల పండుగ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్ కృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఉందని, ప్రజలందరికీ అమ్మవారి, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుతూ ఎంపీ చామల కిరణ్ రెడ్డి ప్రార్థించారు.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Cobra Video: కింగ్ కోబ్రా పడగపై ముట్టుకున్న స్నేక్‌ క్యాచర్‌.. చివరికి ఏం జరిగింది? వీడియో..

Hyderabad, Telangana:

 King Cobra Hood Video Watch Now: కేరళకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్.. మరోసారి అతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాములను పట్టడంలో తనదైన శైలిలో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఓ ఇంట్లో చొరబడిన భారీ కింగ్ కోబ్రాను పట్టుకుంటున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఊహించని స్థాయిలో షాక్కు గురవుతున్నారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వీడియో వివరాల ప్రకారం.. ఒక నివాస గృహంలోకి సుమారు 7 నుంచి 8 అడుగుల పొడవున్న అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా చొరబడింది. సమాచారం అందుకున్న వావా సురేష్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండా.. కేవలం చేతులతోనే ఆ పామును పట్టుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ క్రమంలో పాము పడకపై చేయి వేసి అదుపు చేస్తుండగా.. ఆ కింగ్ కోబ్రా ఒక్కసారిగా కోపంతో సురేష్ పైకి దూసుకు వచ్చింది.. అత్యంత వేగంగా దాడి చేసేందుకు ప్రయత్నించిన ఆ సర్పం నుంచి ఆయన ఎంతో చాకచక్యంగా.. అన్ని సెకండ్ల పరిధిలోనే పక్కకు తప్పుకున్నారు. కొద్దిగా అటు ఇటు అయినా ఆయన ప్రాణాలకే ముప్పు వాటి లేదని వీడియో చూస్తే అర్థమవుతూ వస్తోంది.

ఈ వీడియో గతంలో ఎప్పటిదో అయినప్పటికీ.. ఎవరో కావాలనే ఇప్పుడు పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన కొద్దిసేపట్లోనే లక్షలాది వ్యూస్ తో పాటు షేర్లతో వైరల్ గా మారింది. సోషల్ మీడియా వినియోగదారులు సురేష్ ధైర్యాన్ని మెచ్చుకున్నప్పటికీ.. అంతటి ప్రమాదకరమైన పాములతో వ్యవహరించేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. గతంలో కూడా వావా సురేష్ పలుమార్లు పాముకాటుకు గురై.. మృత్యు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారని ఎన్నో వార్తలు వచ్చాయి.

 
 
 
 
 

ఈ వీడియో చూసిన వన్యప్రాణి నిపుణులు సైతం స్పందిస్తూ వస్తున్నారు. కింగ్ కోబ్రా వంటి అత్యంత విషపూరితమైన పాములను పట్టుకునేటప్పుడు స్నేక్ ఉక్స్, చేతి తొడుగులు వంటి రక్షణ పరికరాలను తప్పకుండా వాడాలని.. ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి సాహసాలు చేయడం మంచిది కాదని వారి అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ కింగ్ కోబ్రా వర్సెస్ సురేష్ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

  

0
0
Report

Cobra Video: బుల్లెట్ బైక్‌లో దూరిన నాగుపాము.. వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడవడం ఖాయం!

Hyderabad, Telangana:

 Cobra In Bullet Bike Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వింత విశేషాలు వైరల్ అవుతాయో ఊహించడం చాలా కష్టం. తాజాగా బైక్‌లో దర్శనమిచ్చిన అత్యంత ప్రమాదకరమైన నాగుపాముకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది. రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న ఒక బుల్లెట్ మోటార్ సైకిల్‌లో భారీ నాగుపాము దూరిన ఘటన ఇప్పుడు స్థానికంగా చర్చినీయాంశంగా మారింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

సాధారణంగా వాహనాలను రోడ్డు పక్కన పార్క్ చేసినప్పుడు సీట్ల కిందనో.. ఇంజన్ భాగంలోనో చిన్నపాటి జీవులు చేరడం చూస్తూ ఉంటాం.. కానీ ఇక్కడ ఏకంగా అత్యంత విషపూరితమైన నాగుపాము బుల్లెట్ బండిని తన నివాసంగా మార్చుకుంది.. రోడ్డుపై నిలిపించిన ఆ బుల్లెట్ మోటార్ సైకిల్‌లో నాగుపాము అటు ఇటు కదులుతూ ఉన్న దృశ్యాలను అటుగా వెళుతున్న కొందరు గమనించారు. మొదట అది ఏదో వైర్ అనుకోని పొరపాటు పడినప్పటికీ.. అది కదలడం చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు.. పాము చూసి భయాందోళనతో బైకుకు దూరంగా ఉండిపోయారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

విషయం క్షణాల్లో చుట్టుపక్కల ప్రాంతాలకు పాకడంతో ఆ బుల్లెట్ బండిలో ఉన్న పాములు చూసేందుకు జనం భారీగా గుమ్మికూడడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ప్రమాదాన్ని పసిగట్టిన స్థానికులు వెంటనే అప్రమత్తమై.. స్థానిక స్నేక్ క్యాచర్ బృందానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే వార అక్కడికి తమకు కావాల్సిన పరికరాలతో ఘటన స్థలానికి చేరుకున్నారు..

 
 
 
 
 

బైక్ వెనక సీటు కింద నాగుపాము గట్టిగా చుట్టుకొని పడుకోవడంతో దానిని బయటికి తీయడం రెస్క్యూటివ్‌కు పెద్ద సవాలుగా మారింది. పాముకు ఎటువంటి గాయం కాకుండా అలాగే అక్కడ ఉన్నవారికి ప్రమాదం జరగకుండా స్నేక్ క్యాచర్స్ ఎంతో చాకచక్యంగా.. అరగంట పాటు శ్రమించి కష్టపడి మరి ఆ నాగుపాముని సురక్షితంగా బయటికి తీశారు. అలా బయటికి తీసిన నాగుపామును ఒక ప్లాస్టిక్ సంచిలో బంధించి సురక్షితమైన ప్రదేశంలో తీసుకెళ్లి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియోనే.. సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

  

0
0
Report

Kaleshwaram: కాళేశ్వరంలో కాకతీయుల శిల్పకళా వైభవం.. రూ.1.20 కోట్లతో అత్యాధునిక మ్యూజియం!

Hyderabad, Telangana:

Kaleshwaram Museum Latest Telugu News: ప్రముఖ పుణ్యక్షేత్రం, త్రిలింగ క్షేత్రంగా విరాజిల్లుతున్న కాలేశ్వరంలో కాకతీయుల కాలం నాటి అరుదైన పురాతన విగ్రహాలతో పాటు అద్భుతమైన శిల్ప సంపదను భద్రపరిచేందుకు దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది.. ఇందులో భాగంగా ఒకటి పాయింట్ 20 కోట్ల భారీ వ్యాయామంతో ఒక ప్రతిష్టాత్మక మ్యూజియం నిర్మాణ పనులను వేగవంతం చేసింది. కాలేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో లభించిన, శతాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రక కళాఖండాలను భక్తులతో పాటు పర్యాటకులు ఒకే చోట వీక్షించేలా ఈ అత్యాధునిక మ్యూజియంలో తీర్చిదిద్దుతున్నారు. 

కాలేశ్వర పరిసర ప్రాంతాల్లో గతంలో జరిగిన తవ్వకాలతో పాటు ఆలయ పునర్నిర్మాణ సమయాల్లో కాకతీయ శిల్పాకళా వైభవానికి ప్రతీకంగా భావించే అనేక విగ్రహాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.. కాలగర్భంలో కలిసిపోకుండా వీటిని సంరక్షించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యూజియంలో విగ్రహాలను ప్రదర్శించడమే కాకుండా.. వాటి చరిత్రక నేపథ్యంతో పాటు కాలం, ప్రాముఖ్యతను వివరించే డిజిటల్ బోర్డులను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా పరిశోధనలకు, విద్యార్థులకు ఒక అద్భుతమైన జ్ఞాన వేదికగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు..

త్వరలో అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్న సరస్వతీ నది పుష్కరాల నాటికి ఈ మ్యూజియం నిర్మాణం పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని దేవాదాయ శాఖ లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పుష్కరాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది భక్తులు కాళేశ్వర క్షేత్రానికి తరలివచ్చే అవకాశం ఉండడంతో.. వారందరికీ తెలంగాణ ప్రాచీన సాంస్కృతితో పాటు కాకతీయుల కళా నైపుణ్యాన్ని పరిచయం చేసేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం..

Also Read: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..

ప్రస్తుతం సివిల్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.. ఇంటీరియల్ తో పాటు లైటింగ్ వ్యవస్థ, విగ్రహాల అమరిక కోసం ప్రత్యేక నిపుణుల బృందం పర్యావేక్షిస్తోంది. కాలేశ్వరం వచ్చి భక్తులకు ముక్తేశ్వరుని దర్శనంతో పాటు మన పూర్వీకుల శిల్పకళా నైపుణ్యాన్ని చూపించాలన్నదే మా లక్ష్యం అని అధికారులు తెలుపుతున్నారు. పుష్కర ఘాట్లకు సమీపంలోనే ఈ మ్యూజియం నిర్మిస్తున్నామని.. పనులను నిరంతరం పర్యావేక్షిస్తూ గడువులోగా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.. ఈ మ్యూజియం అందుబాటులోకి వస్తే కాలేశ్వరం ఆధ్యాత్మిక, పర్యాటక రంగంలో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

 - https://apple.co/3loQYe ఆపిల్ లింక్..

0
0
Report
Advertisement

Snake Attract Plants: ఇంట్లో ఈ చెట్లు ఉంటే పాముల ఎక్కడ ఉన్నా వచ్చేస్తాయి..పాములకు విపరీతంగా నచ్చే మొక్కలు!

Hyderabad, Telangana:

Plants Attract Snakes: మన ఇంటి పెరట్లోని పచ్చని చెట్లు, మొక్కలు ఇళ్లకు ఎంతో అందాన్ని తీసుకొస్తాయి. అవి మనుషులకు మనశ్శాంతిని కలిస్తాయి. ఉదయాన్నే వికసించే పువ్వుల సువాసన, పచ్చని ఆకుల గుండా వీచే గాలి మనలోని ఒత్తిడిని, మనసులో ఆందోళనను తగ్గిస్తాయి. మనం ఎంతో ప్రేమతో పెంచే కొన్ని మొక్కలు మనకు మాత్రమే కాకుండా భూమిపై ఉన్న ఇతర జీవులకు కూడా ఆకర్షిస్తాయి. వాటి సువాసనతో జీవాలు వెతుక్కుంటూ వస్తాయి. కొన్ని రకాల పువ్వులు, దట్టమైన పొదల నుండి వెలువడే సువాసన అయస్కాంతంలా పాములను ఆకర్షిస్తుంది. అయితే ఎలాంటి మొక్కలు, పువ్వులు ఇంట్లోకి పాములను ఆకర్షిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గున్నెరా చెట్లు గొడుగు ఆకారంలో విశాలంగా పెరుగుతాయి. ఇవి గుబురుగా పెరగడం వల్ల వాటి కింద నీడ ఎక్కువగా ఉండడం సహా ఆ చెట్ల కింద ఎంతో చల్లగా ఉంటుంది. దీంతో నేల చల్లగా ఉన్నప్పుడు పాములు విశ్రాంతి తీసుకునేందుకు వీలు ఉండదు. కానీ, గున్నెరా పువ్వుల దగ్గర వచ్చే కీటకాలు, తేనటీగలు, కప్పలు, బల్లులను పాములు వేటాడి తింటాయి. అందుకోసం పాములు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అంటే మనుషుల సంచారం తక్కువగా ఉన్న చోట పాములు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి.

మల్లెపువ్వుల సువాసన పాములను ఎక్కువగా ఆకర్షిస్తుంది. మల్లె పువ్వులు ప్రధానంగా సాయంత్రం, రాత్రి వేళల్లో వికసించి వాటి సువాసనను గుబాళింపజేస్తాయి. అదే సమయంలో, పాములు కూడా ఆహారం కోసం బయటకు వస్తాయి. అందువల్ల, మల్లె పూల పొదలలో పాములు తరచుగా కనిపిస్తాయని కొందరు చెప్పే మాటల్లో లేదా మీరే స్వయంగా చూసే ఉంటారు. ఈ తీగల తేమ, చల్లదనం కూడా పాములను ఆకర్షిస్తాయి. అంతేకాకుండా, మల్లె పూల పొదలు దట్టంగా ఉంటాయి. ఇది కూడా పాములు అక్కడ ఉండేందుకు ఇష్టపడతాయి. 

గంధపు చెట్లు సహజంగా చాలా చల్లగా ఉంటాయి. శీతల రక్త జీవులైన పాములు, తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడానికి ఈ చెట్ల వద్దకు వస్తాయి. గంధపు చెట్టు నుండి వెలువడే గంధపు వాసన పాములను ఆకర్షిస్తుంది. గంధపు మొక్కలు పెరిగే ప్రాంతం ఎల్లప్పుడూ తేమగా ఉంటుంది. ఇది పాములకు చాలా అనువైనది. గంధపు చెట్టు బెరడు మరియు దాని చుట్టూ ఉండే దట్టమైన ఆకులు, పాములు పగటిపూట నిద్రపోవడం సహా శత్రువుల నుండి దాక్కోవడానికి అనువుగా ఉంటాయి.

తీగల మొక్కలు గోడల మీద లేదా నేల మీద చాలా దట్టంగా పెరుగుతాయి. ఆ తీగలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉంటాయి. పాములు ఈ దట్టమైన తీగల మధ్య కొరకగలవు. అంతేకాకుండా, ఈ తీగలు నేలపై సూర్యరశ్మి పడకుండా అడ్డుకుంటాయి, దీనివల్ల లోపల ఎప్పుడూ తేమగా, చల్లగా ఉంటుంది. ఇది పాములను ఆకర్షిస్తుంది. చిన్న కీటకాలు, బల్లులు, ఎలుకలు ఈ ఐవీ పొదల మధ్య నివసిస్తాయి. పాములు వాటిని వేటాడటానికి వస్తాయి. కాబట్టి, ఇలాంటి మొక్కలను ఇంటి చుట్టుపక్కల పెంచడం ఎంతో రిస్క్‌తో కూడుకున్న పని.

Also Read: Carrot Juice: ఎండల్లో క్యారెట్ జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్యానికి అమృతమే!

Also Read: Grapes Juice: వేసవిలో రోజూ ద్రాక్ష జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Used Cars: కార్ల లవర్స్‌కి బంపర్ ఆఫర్.. సగం ధరకే మహీంద్రా థార్, స్కార్పియో, ఇన్నోవా క్రిస్టా..

Hyderabad, Telangana:

Huge Second-Hand Car Market In Delhi News: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సెకండ్ హ్యాండ్ వాహనాల ప్రియుల కోసం కొన్ని సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ అద్భుతమైన కార్లకు సంబంధించిన కార్ల మేళాను ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని పీతాంపురా పరిధిలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్‌లు ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ తో అందర్నీ ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక్కడ మార్కెట్‌లో ఉన్న ఒక్కొక్క సెకండ్ హ్యాండ్ షో రూమ్‌లో దాదాపు 100కు పైగా సెకండ్ హ్యాండ్ డీజిల్, పెట్రోల్ కార్లు అత్యంత తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత తక్కువ ధరలోనే కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఢిల్లీలోని ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయొచ్చు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఇక్కడ కొనుగోలు చేస్తే ప్రత్యేకమైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. అలాగే కొన్ని కార్లు అయితే ఇక్కడ కేవలం రూ.1,25,000 లోపే ప్రారంభం అవ్వడం విశేషం.. అయితే ఇక్కడ ఏయే బ్రాండ్లకు సంబంధించిన కార్లు అత్యంత తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయో.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇక్కడ లభించే సెకండ్ హ్యాండ్ షోరూమ్స్‌లో మహీంద్రా స్కార్పియోతో పాటు ఎక్స్‌యూవీ 500 (XUV 500), థార్, టాటా హారియర్, సఫారీ, జీప్ కంపాస్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి స్విఫ్ట్, డిజైర్, ఇన్నోవా క్రిస్టా వంటి టాప్ బ్రాండ్లకు సంబంధించిన కార్లు అత్యంత తక్కువ ధరల్లో లభిస్తూ వస్తున్నాయి. ఇక్కడ వీటిని దాదాపు సగం ధరల్లోనే సొంతం చేసుకుని స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తూ వస్తున్నారు. అలాగే దాదాపు 20 లక్షలకు పైగా విలువైన కొత్త మోడల్ బొలెరోతో పాటు మహీంద్రా థార్, స్కార్పియో వంటి కార్లను సగం ధరలకే విక్రయిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ లభించే అన్ని కార్లు కేవలం రూ.40 వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినవని నిర్వాహకులు చెబుతూ వస్తున్నారు..

అదేవిధంగా సన్రూఫ్‌తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన కార్లు కూడా ఇక్కడ అత్యంత తక్కువ ధరల్లో లభిస్తూ వస్తున్నాయి.. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వినియోగదారుల కోసం ఇక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్లు రన్ చేసే నిర్వాహకులు ప్రత్యేకమైన సదుపాయాలను కూడా అందిస్తూ వస్తున్నారు. ఢిల్లీ బయట రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వివిధ రకాల ఏర్పాట్లను కూడా చేసినట్లు తెలుపుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలోని ఏ రాష్ట్రానికైనా చెల్లుబాటే అయ్యే విధంగా నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను అందిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

అంతేకాకుండా కొనుగోలు చేసిన వాహనాలను కస్టమర్లు సొంత రాష్ట్రాలకు సురక్షితంగా పంపేందుకు నిర్వాహకులే ప్రత్యేకమైన ట్రాన్స్పోర్ట్ సదుపాయాన్ని కూడా అందిస్తూ వస్తున్నారు. అదేవిధంగా వాహనాలపై లోన్ సదుపాయంతో పాటు ఇన్సూరెన్స్ కూడా అక్కడే అత్యంత తక్కువ ధరల్లో చేపిస్తున్నారు. ముఖ్యంగా SUV వాహనాలను రూ.10 లక్షల లోపే కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా భావించవచ్చు.. ఎందుకంటే ఇక్కడ అన్ని బ్రాండ్లకు సంబంధించిన కార్లు సగం ధరల్లో, సగం కంటే తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ కొనుగోలు చేసేవారు తప్పకుండా అన్ని పత్రాలను, కార్లను బాగా పరిశీలించి మాత్రమే విక్రయించడం మంచిదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు..

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Luxury Cars In Delhi: రూ.16 లక్షలకే BMW, జాగ్వార్ లగ్జరీ కార్లు.. అన్ని కార్లు సగం ధరలకే మీ సొంతం..

Hyderabad, Telangana:

Second Hand Luxury Cars In Delhi: సొంతగా ఒక  మంచి కారును కొనుగోలు చేయాలని ప్రతి ఒక్క సాధారణ కుటుంబ సభ్యుడు కలలు కంటూ ఉంటాడు. ఇక సాధారణ ధనవంతులైతే లగ్జరీ కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. సాధారణంగా మార్కెట్లలో లగ్జరీ కార్లు కోట్ల రూపాయలకు విక్రయిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వీటిని ధనవంతులు సైతం కొనుగోలు చేయలేకపోతూ ఉంటారు. ముఖ్యంగా మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన లగ్జరీ కార్లు అయితే, ఏకంగా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల వరకు విక్రయిస్తూ ఉంటారు. ఇలాంటి కార్లను ధనవంతులు సైతం సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఇలా సెకండ్ హ్యాండ్ కార్ల ధరలోనే ఢిల్లీలో మంచి కండిషన్ కలిగిన లగ్జరీ కార్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఫార్చునర్ కారు ధరకే లగ్జరీ కార్లు సొంతం చేసుకోవచ్చు. 

ఢిల్లీలోని అశోక్ విహార్‌లో అందుబాటులో ఉన్న సెకండ్ హ్యాండ్ షోరూమ్స్‌లో మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన లగ్జరీ కార్లు చీప్ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్. ధోని, హర్భజన్ సింగ్ వంటి ఎందరో ప్రముఖ సెలబ్రిటీలు ఎంతగానో ఇష్టపడే ఐకానిక్ లగ్జరీ మోడల్ హమ్మర్ H2 (Hummer H2) ఇక్కడి సెకండ్ హ్యాండ్ షోరూమ్స్‌లో కొనుగోలు చేసే వారికి అత్యంత చవక ధరలో లభిస్తుంది. అంతేకాకుండా దీనిని వివిధ రకాల డిస్కౌంట్ ఆఫర్స్‌తో విక్రయిస్తున్నారు. అయితే, ఈ కారు 2009 మోడల్‌కు సంబంధించింది. ఇది రాయల్ ఎల్లో కలర్ లో అందుబాటులో ఉంది. అలాగే దీనికి 2029 వరకు పూర్తి ఫిట్నెస్ వాలిడిటీ కలిగి ఉంది. మార్కెట్లు దీనికి ఉన్న క్రేజీను దృష్టిలో పెట్టుకొని ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కేవలం రూ.52 లక్షల లోపే విక్రయిస్తున్నారు..

అలాగే భారతదేశంలో ఇంకా అందుబాటులోకి రాని నిస్సాన్ పెట్రోల్ 2026 మోడల్ లగ్జరీ కార్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా ఈ బ్రాండ్ కి సంబంధించిన 2025 మోడల్ కార్లు అయితే ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో విక్రయిస్తున్నారు. అలాగే ఢిల్లీలోని రోడ్డు టాక్స్‌తో పాటు ఇన్సూరెన్స్, VIP ఫ్యాన్సీ నెంబర్లతో కలిగిన ఈ బ్రాండ్ కొత్త కార్లు కేవలం రెండు కోట్ల లోపే విక్రయిస్తున్నారు. దీనిపై దాదాపు 80 నుంచి 90 శాతం వరకు ఫ్యాన్ ఇండియా బ్యాంకు లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలను కూడా అందిస్తూ వస్తున్నారు. 

రూ.16 లక్షల లోపే లగ్జరీ కార్లు..
సాధారణంగా వర్నా లేదా క్రెటా కార్లను బడ్జెట్ ఉన్న వారు కొనుగోలు చేస్తారు. అయితే, ఇదే కార్ల బడ్జెట్‌లో ఆడి కార్లతో పాటు మెర్సిడెస్ బెంజ్ కార్లు ఈ మార్కెట్లో లభించడం విశేషం.. ముఖ్యంగా జాగ్వర్ బ్రాండ్‌కి సంబంధించిన కార్లు కూడా ఇక్కడ అత్యంత తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. 2018 పెట్రోల్ టాప్ ఎండ్ మోడల్ జాగ్వార్ ఎక్స్ ఎఫ్ కార్లు కేవలం ఇక్కడ రూ.17 లక్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. అలాగే దీనికి కేవలం నాలుగు లక్షల లోపే డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు సులభంగా ఈఎంఐ లోన్ లభిస్తుంది. 

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

అంతేకాకుండా ఆడి ఏ సిక్స్‌తో పాటు మెర్సిడెస్ సి క్లాస్ 2016 మోడల్ పెట్రోల్ ఇంజన్ కలిగిన కార్లు కేవలం ఇక్కడ రూ.16 లక్షల లోపే అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు బీఎండబ్ల్యూ x7 ప్రత్యేకమైన ఎడిషన్ కేవలం 64 లక్షల లోపే అందుబాటులో ఉంది. అదేవిధంగా బీఎండబ్ల్యూ x5 కారు కూడా ఇక్కడ రూ.42 లక్షల లోపే లభిస్తుంది. ఇక ఇవే కాకుండా ఆడి q5, ల్యాండ్ రోవర్ ఎవోక్ కార్లు అయితే, కేవలం రూ.20 లక్షలు లోపే అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇలాంటి బ్రాండ్లకు సంబంధించిన ఎన్నో కార్లు అత్యంత తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉండడం విశేషం.

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Karimnagar: ఒకే రోజు రెండు దారుణాలు.. ఆస్తి తగాదాలు, గొడవలతో తండ్రులను పొట్టనబెట్టుకున్న కిరాతకులు!

Karimnagar, Telangana:

Karimnagar Double Murder Latest News: సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు మంటగలుస్తూ వస్తున్నాయి. కన్న ప్రేమ కరువైపోతోంది.. నవ మాసాలు పెంచి.. రక్తాన్ని కూడుగా చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులపైనే కొడుకులు కిరాతకులుగా మారుతూ వస్తున్నారు. చిన్నపాటి ఆస్తి తగాదాలతో పాటు పంపకాల్లో లెక్కల తప్పుల కారణంగా క్షణికావేషాల్లో కన్నవారిని కాటికి పంపుతున్నారు.  జగిత్యాల జిల్లాలో ఏప్రిల్ 11న పోషణ భారమై.. కన్నతల్లి కిరాతకంగా కొట్టి చంపిన ఘటన మరువకముందే.. కరీంనగర్ జిల్లాలో శుక్రవారం జరిగిన రెండు వేరువేరు వరస హత్యలు స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 

ఇల్లందకుంటలో జరిగిన ఘటన..
మొదటి ఘటన ఇల్లందకుంట మండలంలో చోటుచేసుకుంది. వ్యవసాయ భూమి కౌలుకు సంబంధించిన విషయంలో తండ్రి కొడుకుల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తూ వస్తోందట.. ఈ క్రమంలో శుక్రవారం ఇద్దరి మధ్య మాట పెరిగి పెద్దదైపోయింది.. తీవ్ర ఆగ్రహానికి లోనైన కొడుకు.. ఇంట్లోని రోకలి బండను తీసుకొని కన్న తండ్రి తలపై బలంగా బాదాడు.. తీవ్ర రక్తస్రాభమై ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు..

కరీంనగర్లో మరో ఘటన..
ఈ దారుణం మరవక ముందే కరీంనగర్ నగర పరిధిలో మరో ఘోరం చోటుచేసుకుంది.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇక్కడ ఒక కొడుకు కసాయిగా మారడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తండ్రితో ఏర్పడిన గొడవ తీవ్ర రూపం దాల్చడంతో.. ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకొని తండ్రి పై విచక్షణారహితంగా దాడి చేశాడు. మెడ తో పాటు తలభాగాల్లో తీవ్ర గాయాలు కావడంతో ఆ తండ్రి అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మరణించాడు..

Also Read: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..

ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు దారుణ హత్యలతో కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలను సందర్శించి ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మృతదేహాలను కూడా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. నిందితులపై హత్య కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు..

సమాజం ఇంత ఇంత దారుణంగా ఎందుకు మారుతుంది? 
ఆధునిక సమాజంలో నైతిక విలువలు నశించిపోతున్నాయి అనడానికి ఈ సంఘటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆస్తులతో పాటు ఇతర వాటికోసం కన్నపేగును పెంచేస్తున్న కసాయి కొడుకుల తీరుపై సానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కిరాతకులకు చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు పడాలని అధికారులు సైతం డిమాండ్ చేస్తూ వస్తున్నారు..

Also Read: అన్నదాతకు తప్పని ధాన్యం కష్టాలు.. కాంగ్రెస్ పాలనలో రైతుల గోస..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

 - https://apple.co/3loQYe ఆపిల్ లింక్..

0
0
Report

Jupiter Transit 2026: పుష్యమి నక్షత్రంలోకి గురుడు.. ఈ 4 రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు, ఊహించని సక్సెస్!

Hyderabad, Telangana:

Jupiter Transit In Pushya Nakshatra 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలోని అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో గురు గ్రహం ఒకటి.. ఇది జాతకంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. వ్యక్తుల జాతకాల్లో గురు గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి దేనికి డోకా ఉండదు. అంతేకాకుండా అనుకున్న పనుల్లో కూడా దిమ్మతిరిగే ధన లాభాలు పొందుతూ ఉంటారు. అలాగే ఉన్నట్టుండి రాత్రికి రాత్రే అదృష్టం సహకరించి సక్సెస్ అవుతారు. ఇవన్నీ జాతకంలో గురు గురు గ్రహం స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ గ్రహం అతి త్వరలోనే పుష్యమి నక్షత్రంలోకి సంచారం చెయ్యబోతోంది.  గురు నక్షత్ర సంచారానికి కూడా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు..

ఈ సంవత్సరం జూన్ 18వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో అదృష్టంతో పాటు జ్ఞానం, ఆనందానికి అధిపతి అయిన గురు పుష్య నక్షత్రం లోకి సంచారం చేయబోతోంది. ముఖ్యంగా శని నక్షత్రంగా పరిగణించే ఈ నక్షత్రంలోకి గురుడు సంచారం చేయడం చాలా ప్రత్యేకమైన. దీని కారణంగా నాలుగు రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో పెద్ద మార్పులు రావచ్చు అని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు అసంపూర్తిగా ఉండ పనులు సులభంగా పూర్తవుతాయి. ఈ సమయంలో ఎన్నో రకాల సమస్యలు దూరమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు, డబ్బే..డబ్బే!
కర్కాటక రాశి 
శని నక్షత్రంలో గురుగ్రహం సంచారం చేయడం కారణంగా కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు కలగవచ్చు. కొత్త వాహనాలు కొనుగోలు చేయడమే కాకుండా కుటుంబ సంబంధిత సమస్యలనుంచి పరిష్కారం లభించబోతోంది. ఉద్యోగాలు చేస్తున్నవారు అద్భుతమైన పదోన్నతులు పొందడమే కాకుండా జీతాలు విపరీతంగా పెరుగుతాయి. సమాజంలో వీరికి గౌరవం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కన్యారాశి 
శని నక్షత్రంలో గురుగ్రహం సంచారం చేయడం కన్యారాశి వారికి కూడా చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ప్రదేశాల్లో విపరీతమైన గౌరవం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఊహించని స్థాయిలో హోదా పెరిగి అనుకున్న ఫలితాలు పొందగలుగుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. దీని కారణంగా మానసిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా మారుతుంది. వృత్తి జీవితంలో కూడా అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి.

ధనస్సు రాశి 
గురు గ్రహ సంచారంతో ధనస్సు రాశి వారికి అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అంతేకాకుండా ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనుకునే వారికి మంచి లాభాలు కూడా కలుగుతాయి. దీంతోపాటు పాత సమస్యల నుంచి అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా వీరు ఉద్యోగాల్లో మార్పులు పొంది.. అన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు..

మీన రాశి 
గురు గ్రహ సంచారంతో మీన రాశి వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు చేసుకునే వారికి మంచి భాగస్వాములతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు తప్పకుండా శుభవార్తలు కూడా వింటారు. అంతేకాకుండా అదృష్టం తోడుండి.. అన్ని రకాల లాభాలు పొందగలుగుతారు. శ్రమకు తగ్గ గుర్తింపు లభించి అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. ఇక్కడ అందించిన  వార్త కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని రాసింది మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించదు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Bandi Bhageerath: ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నిరాకరణ.. ఇక బండి భగీరథ్‌ అరెస్ట్‌ తప్పదా?

Hyderabad, Telangana:

Bandi Bhageerath POCSO Case: బాలికపై అత్యాచారానికి పాల్పడి పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్‌కు ఊరట లభించలేదు. మధ్యంతర ముందస్తు బెయిల్‌కు తెలంగాణ హైకోర్టు నిరాకరణ చేసింది. బెయిల్‌ ఇచ్చేందుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసులో బండి భగీరథ్‌కు తాత్కాలిక ఉపశమనం లభించకపోవడంతో ఇక అతడి అరెస్ట్‌ తప్పదని స్పష్టమవుతోంది. పోక్సో కేసు నమోదై దాదాపు వారం దాటుతున్నా ఇంకా అరెస్ట్‌ చేయకపోవడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో హైకోర్టు కూడా నిరాకరించడంతో ఇప్పటికైనా నిందితుడు బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

Also Read: Bandi Bhageerath: 'మా కూతురిపై కుట్ర చేస్తున్నారు'.. పోక్సో బాధితురాలి తల్లి ఆవేదన

నిందితుడు బండి సాయి భగీరథ్‌ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలనే అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టులో శుక్రవారం రాత్రి బండి భగీరథ్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో పలు వాదనలు వినిపించారు. కేసులో నమోదైన ఫిర్యాదు, బాధితురాలి ప్రవర్తన, కాల్ రికార్డులు, చాటింగ్ వివరాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ వచ్చిన ఆరోపణలపై అనుమానాలు వ్యక్తం చేశారు.

Also Read: Bandi Bhageerath: కొడుకును అప్పగించకుండా బండి సంజయ్‌ ఎవరిని బెదిరిస్తున్నాడు?

'బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో తన కుమార్తెను డిసెంబర్ 31న రెండు రోజుల పాటు ఫామ్‌హౌస్‌లో ఉంచారని పేర్కొన్నరు. బలవంతంగా ఆల్కహాల్ తాగించారని కూడా ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయి. అయితే అదే ఫిర్యాదులో బాధితురాలు, నిందితుడితో పాటు మరో ఐదుగురు కూడా ఫామ్‌హౌస్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు' అని న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఫొటోలు, వీడియోల అంశాన్ని కూడా ప్రస్తావించారు. స్నేహితులు తీసుకున్న ఫొటోలను పరిశీలిస్తే బాధితురాలు స్వచ్ఛందంగానే ఆల్కహాల్ తీసుకున్నట్లు కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. బాధితురాలిని కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని.. కానీ జరుగుతున్న దుష్ప్రచారంపై స్పష్టత ఇవ్వడం కోసమే ఈ విషయాలను వెల్లడిస్తున్నట్లు కోర్టులో వివరించారు. అవసరమైతే తమ వద్ద ఫొటోలు, వీడియోలు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు.

Also Read: Bandi Sanjay Mother: పోక్సో కేసులో కీలక మలుపు.. బండి సంజయ్‌ తల్లికి తీవ్ర అస్వస్థత

కేసు నమోదు ఆలస్యంపైనా పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశ్నలు లేవనెత్తారు. ఘటన జరిగిన నాలుగున్నర నెలల తరువాత ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు.  బాధితురాలు మానసికంగా,  శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తల్లి ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ.. విషయం తెలిసిన వెంటనే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బండి భగీరథ్‌ వాదించారు. ఫిర్యాదులో 2025 అక్టోబర్ 25న శారీరక వేధింపులు జరిగాయని పేర్కొన్నారని.. కానీ ఆ తరువాత రోజే బాధితురాలు స్వయంగా నిందితుడిని సినిమాకు రావాలని ఆహ్వానిస్తూ టికెట్లు పంపిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 

పూర్తి వాదనలు విన్న హైకోర్టు వారి వాదనలతో ఏకీభవించలేదు. కేసు తీవ్రత, ఆరోపణల స్వభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు బండి భగీరథ్‌కు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరుకు నిరాకరించింది. కాగా ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగనుంది.

0
0
Report
Advertisement

Bandi Sanjay Mother: పోక్సో కేసులో కీలక మలుపు.. బండి సంజయ్‌ తల్లికి తీవ్ర అస్వస్థత

Hyderabad, Telangana:

Bandi Sanjay Mother Heart Attack: మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బండి భగీరథ్‌ కుటుంబంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తల్లి గుండెపోటుకు గురయ్యారు. పోక్సో కేసుపై విచారణ కొనసాగుతున్న సమయంలో ఆమె తీవ్ర మనోవేదనకు గురయి ఆస్పత్రి పాలయ్యారని తెలుస్తోంది. నిందితుడు బండి భగీరథ్‌ నాన్నమ్మ అస్వస్థతకు గురవడంతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురయ్యింది. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే బండి సంజయ్‌ ఆస్పత్రికి చేరుకున్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటుకు గురయ్యారు. దీంతో బండి సంజయ్ కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో శంకుతల చికిత్స పొందుతున్నారు. ఆమెకు గుండెకు స్టంట్ వేసి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వెంటనే మెడికవర్ ఆసుపత్రికి చేరుకున్నారు. తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి ఆరా తీశారు.

0
0
Report

LSG vs CSK Highlights: లక్నో సంచలన విజయం.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లేఆఫ్స్‌ ఆశలు ఆవిరి

Lucknow, Uttar Pradesh:

IPL 2026 Playoffs Race: ఐపీఎల్‌ 2026 ప్లేఆఫ్స్‌ రేసులో ఉన్న వారిని ఎలిమినేట్‌ అయిన జట్లు భారీ నష్టాన్ని చేస్తున్నాయి. పంజాబ్‌ కింగ్స్‌ను ముంబై దెబ్బతీయగా.. తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ను లక్నో సూపర్‌ జియాంట్స్‌ తీవ్ర నష్టం కలిగింది.  తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నైను దెబ్బతీస్తూ లక్నో సంచలన విజయం సాధించి మూడో మ్యాచ్‌ను ఖాతాలో వేసుకుంది. రసవత్తరంగా సాగిన ఈ పోరులో చెన్నైపై లక్నో పైచేయి సాధించడం విశేషం. పోతూ పోతూ రేసులో ఉన్న వారిని తీసుకెళ్తున్న జట్టులో లక్నో కూడా చేరింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.

0
0
Report

SRH Vs RCB Tickets: హైదరాబాద్ Vs బెంగళూరు మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో ఖాళీ..ధరలు భారీగా పెంచినా ఎగబడ్డ ఫ్యాన్స్!

Hyderabad, Telangana:

SRH Vs RCB Match Tickets: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న మే 22న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను తాజాగా విడుదల చేసింది సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ. అయితే ఈ SRH vs RCB మ్యాచ్ టికెట్ల వ్యవహారం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. విరాట్ కోహ్లీ, ప్యాట్ కమిన్స్ వంటి స్టార్ల పోరును చూడాలని ఆశపడ్డ అభిమానులకు ఇప్పుడు పెద్ద షాకే తగిలింది.

మే 22న జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం నేడు అనగా గురువారం సాయంత్రం 5 గంటలకు టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. బుకింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే సుమారు 6 లక్షల మంది ఆన్‌లైన్ క్యూలో చేరడం విశేషం. భారీ ట్రాఫిక్ కారణంగా సర్వర్లు మొరాయించడంతో గంటల తరబడి వేచి చూసినా చాలా మందికి టికెట్లు దక్కలేదు. కొద్దిసేపటికే 'సోల్డ్ ఔట్' బోర్డు కనిపించడంతో ఫ్యాన్స్ అవాక్కయ్యారు.

ధరల పెంపుపై ఆగ్రహం
ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ టికెట్ల ధరలను భారీగా పెంచేసింది. దీనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మ్యాచ్‌ల్లో రూ.750 గా ఉన్న కనీస టికెట్ ధరను ఈసారి రూ.1,950కి పెంచారు. సామాన్య అభిమానులకు భారంగా మారేలా ఇతర గ్యాలరీల ధరలను కూడా భారీగా పెంచడంపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

బ్లాక్ మార్కెట్ ఆరోపణలు
టికెట్ల కేటాయింపులో పారదర్శకత లేదని, అంతర్గతంగా భారీగా అక్రమాలు జరుగుతున్నాయని క్రీడా ప్రేమికులు మండిపడుతున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో నిమిషాల్లోనే మాయమైన టికెట్లు, బయట బ్లాక్ మార్కెట్‌లో విపరీతమైన ధరలకు లభిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే టికెట్లను హోల్డ్‌లో పెట్టి, కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నారని అభిమానులు విమర్శిస్తున్నారు.

Also Read: బెంగళూరు Vs కోల్‌కతా..ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్త్ కోసం హోరాహోరీ పోరు..

Also Read:  పంజాబ్ కింగ్స్ పతనం ఆగిపోతుందా? ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ నుంచి వైదొలగుతుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Telangana Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. పీఆర్‌సీ, ఈహెచ్‌ఎస్‌పై కీలక ముందడుగు

Baddipadaga, Telangana:

Telangana Govt Employees: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను పరిష్కరించకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కరువు భత్యం, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, వేతన సవరణ సంఘం, పెండింగ్‌ బిల్లులు వంటి సమస్యలపై కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌లోని సచివాలయంలో శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులతో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ముఖ్య హామీలు తెలుసుకుందాం.

Also Read: Gold Operation: 1991లో భారతదేశం ఏం చేసింది..? ఒకేసారి 47 వేల కిలోల బంగారం తాకట్టు ఎందుకు?

ఉద్యోగ ఆరోగ్య పథకం
ఉద్యోగ ఆరోగ్య పథకం (ఎంప్లాయీస్ హెల్త్ స్కీం-ఈహెచ్‌ఎస్‌) జూన్ 2వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. ఉద్యోగుల మూల వేతనంలో 1.5 శాతం చొప్పున వసూలు చేసి.. ప్రభుత్వం కూడా సమానమైన మ్యాచింగ్ గ్రాంట్ అందిస్తూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈహెచ్‌ఎస్‌ అమలు చేయనున్నట్లు తెలిపారు.

పీఆర్‌సీ
వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నివేదికపై త్వరలో తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారు. పీఆర్‌సీ నివేదిక తుది దశకు చేరుకుందని.. త్వరలో నివేదిక తెప్పించి దానిపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

Also Read: Erragadda TIMS: హైదరాబాద్‌ ప్రజలకు కేసీఆర్‌ ప్రపంచ స్థాయి వైద్యం అందించారు: కేటీఆర్‌

పెండింగ్‌ బిల్లులు చెల్లింపు
ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పెండింగ్ బిల్లులను 100 రోజులలోపు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌
2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌పై చర్చలు జరిగాయి. పాత పెన్షన్ అమలుపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

జిల్లాస్థాయిలో సమావేశాలు
రాష్ట్ర స్థాయిలో నిర్వహించినట్టుగానే జిల్లా స్థాయిలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం
విద్యా బుద్ధులు నేర్పిస్తున్న ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విద్యాశాఖ కార్యదర్శికి సూచించినట్లు సీఎస్‌ వెల్లడించారు.

ఏకీకృత సర్వీస్ రూల్స్‌
ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని విద్యాశాఖ కార్యదర్శికి సూచన

Also Read: Bandi Bhageerath: 'మా కూతురిపై కుట్ర చేస్తున్నారు'.. పోక్సో బాధితురాలి తల్లి ఆవేదన

స్పౌస్ కేటగిరీలో కేంద్ర ఉద్యోగులకు ఛాన్స్‌
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా స్పౌస్ కేటగిరీలో పరిగణించేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

5 రోజుల పని విధానంపై పరిశీలన
వారంలో ఐదు రోజుల పని విధానాన్ని కూడా పరిశీలనలోకి తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇవ్వడం విశేషం.

తెలంగాణ అభివృద్ధికి పునరంకితం
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరింత నిబద్ధతతో పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.

ఐటీ వినియోగంపై అవగాహన పెంపు
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు టెక్నాలజీపై మరింత అవగాహన పెంచుకుని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top