icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
501505
V SHIVA NAGARAJUV SHIVA NAGARAJUFollow11 Aug 2024, 06:24 pm

లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

Hyderabad, Telangana:

పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవాలు మరియు బోనాల పండుగ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్ కృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఉందని, ప్రజలందరికీ అమ్మవారి, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుతూ ఎంపీ చామల కిరణ్ రెడ్డి ప్రార్థించారు.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Zee 24 Ghanta: పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధికి ఆరు సూత్రాలు ప్రకటించిన సువేందు అధికారి

Kolkata, West Bengal:

Zee 24 Ghanta Mega Conclave: చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు వివరించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పాలన వంద రోజుల పాలన పూర్తి చేసుకుందని.. 6 సూత్రాల ప్రణాళిక, 3 ప్రత్యేక కమిటీలు వేస్తున్నట్లు సువేందు అధికారి ప్రకటన చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా కలకత్తాలో జరిగిన జీ 24 ఘంటా సదస్సులో సీఎం సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాన్ని స్వయం సమృద్ధిగా మార్చేందుకు 6 సూత్రాల ప్రణాళికను సువేందు అధికారి ఆవిష్కరించారు. పారిశ్రామిక పునరుద్ధరణ, పరిపాలనా నిర్ణయాలు, అవినీతి ఫిర్యాదులకు సంబంధించి 3 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి, సరిహద్దు భద్రత, విద్య, పర్యాటకం వంటి పలు అంశాలపై జీ 24 కాంక్లేవ్‌లో చర్చించారు.

0
0
Report
Advertisement

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ ఆఫర్‌ను రెండుసార్లు తిరస్కరించిన క్రేజీ సీరియల్ హీరో..ఈసారి మాత్రం తానే వస్తా అంటున్నాడు!

Hyderabad, Telangana:

Mukesh Gowda Bigg Boss 10 Telugu: తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ హీరోలకు ఉండే క్రేజ్, ఫాలోయింగ్ సాధారణంగా ఒక సినిమా హీరో రేంజ్‌లోనే ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటుల్లో 'గుప్పెడంత మనసు' సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ ఒకరు. సాధారణంగా ముఖేష్ గౌడ అంటే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు కానీ, 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో రిషి అంటే మాత్రం ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడతారు.

ఈ సీరియల్‌లో ఆయన నటన, లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది, ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనను 3 లక్షల కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఈ విశేష ఆదరణ కారణంగానే ఆయనకు సినిమాల్లో కూడా వరుస అవకాశాలు లభిస్తున్నాయి.

ఇంతటి క్రేజ్ ఉన్న ఈ నటుడికి గతంలోనే బిగ్‌బాస్ షో నిర్వాహకుల నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తెలుగు బిగ్‌బాస్ నుంచే కాకుండా, కన్నడ బిగ్‌బాస్ నుంచి కూడా భారీ రెమ్యునరేషన్ ఆఫర్లతో పిలుపు వచ్చిందని, అయితే అప్పట్లో బిగ్‌బాస్ గేమ్ తనకు పూర్తిగా అర్థం కాకపోవడం వల్లే ఆ ఆఫర్లను తిరస్కరించానని ముఖేష్ తెలిపారు.

ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అగ్ని పరీక్ష సీజన్ 2 ముగింపు దశకు చేరుకోవడంతో, సెప్టెంబర్ మొదటి వారంలోనే ఈ కొత్త సీజన్ ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే హౌస్ లోకి వెళ్లే సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఫైనల్ చేసే పనిలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. సోషల్ మీడియాలో పల్లవి గౌడ, తేజస్విని గౌడ, కావ్యశ్రీ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, జబర్దస్త్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ వంటి ఎందరో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే, ఈసారి ఈ జాబితాలో ముఖేష్ గౌడ పేరు మరింత బలంగా వినిపిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఈ పదో సీజన్‌లో ముఖేష్ ఖచ్చితంగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే గ్రాండ్ లాంచింగ్ వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Toxic Vs Irumudi: 'టాక్సిక్' నెగటివ్ టాక్.. రవితేజ 'ఇరుముడి' సినిమాకు ఊహించని బూస్ట్

Also Read: చిరంజీవి 'విశ్వంభర' విడుదల అవుతుందా? మూవీ యూనిట్ ఏం చేస్తుంది? 2027లో కూడా డౌటే?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

సెప్టెంబర్‌లో లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ 4 రాశుల వారికి కనకవర్షం ఖాయం!

Hyderabad, Telangana:

Lakshmi Narayana Raja Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికతో పాటు వాటి మార్పులు మానవ జీవితాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి గ్రహాలు అనుకూలం స్థానంలో ఉంటే అదృష్టం తలుపు తడుతుంది సరిగ్గా 2026 సెప్టెంబర్ నెలలో కూడా ఒక మహా అద్భుతం జరగబోతోంది ఈ నెలలో గ్రహాల గమనం అనేక అద్భుతాలకు మార్పులకు నాంది పలకబోతోంది. ముఖ్యంగా రెండు ప్రధాన గ్రహాలు కలిసినప్పుడు ఏర్పడే ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఈ సమయంలో ఏర్పడబోతోంది ఈ అరుదైన యోగంతో నాలుగు రాశుల వారికి ధన లాభాలతో పాటు కనక వర్షం కురవబోతోంది. అయితే, ఏ రాశుల వారికి అదృష్టం లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 26వ తేదీ బుధ గ్రహం తులా రాశిలోకి సంచారం చేసింది. అప్పటికే తులా రాశిలో శుక్రుడు సంచార దశలో ఉన్నాడు.. తులారాశిలో ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక కారణంగానే ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రాజయోగం వల్ల మహర్దశ పట్టబోతోంది.. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి అనుకున్న ధన లాభాలు కలగబోతున్నాయి.

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
వృషభ రాశి 
ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వృషభరాశి వారికి అంతులేని ధన లాభాలు కలగబోతున్నాయి.. వీరు చేపట్టే ప్రతి పనిలో అద్భుతమైన విజయాలు కలుగుతాయి. సకల భౌతిక సుఖాలు కలగడమే కాకుండా భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో రకాల ప్రణాళికలు ఈ సమయంలో కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా మిత్రులకు సంబంధించిన ఆస్తులు కూడా మీ వైపు వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండటమే కాకుండా జీవితం మరింత అద్భుతంగా ఆనందకరంగా మారుతుంది. 

మిథున రాశి 
మిథున రాశి వారికి ఈ సమయం ఒక స్వర్ణ యుగం లాంటిది లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావంతో వీరికి కొత్త కొత్త ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా ఆర్థికంగా అతిపెద్ద ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులు అందరికీ భారీ మొత్తంలో లాభాలు చేకూరుతాయి.. కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా మారి అనుకున్న పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు.

కన్యారాశి 
సుదీర్ఘకాలం తర్వాత కన్యా రాశి వారికి విశేషమైన అదృష్టం పట్టబోతోంది. ఈ శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావంతో జీవితం పూర్తిగా మారబోతోంది. ముఖ్యంగా చాలా కాలంగా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో కళ్ళు చెదిరే ధన లాభాలు కలుగుతాయి. కొత్తగా ఏదైనా వ్యాపారాలు లేదా ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులందరికీ అద్భుతమైన సమయం లాంటిది. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

వృశ్చిక రాశి 
ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావం వృచ్చిక రాశి వారిపై కూడా పడుతుంది. దీని కారణంగా వీరికి అకస్మాత్తుగా ధన లాభాలు కలగడమే కాకుండా.. జీవితంలో వస్తున్న అనేక కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. కోరుకున్న కోరికలు సింపుల్‌గా నెరవేరి ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా లభించబోతున్నాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో అనుకుంటున్నా పనులు ఎంతో సులభంగా చేయగలిగి సింపుల్గా విజయాలు సాధించగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

Irumudi Collection: రూ.100 క్లబ్‌లోకి రవితేజ 'ఇరుముడి'..మాస్ మహారాజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బాస్టర్!

Hyderabad, Telangana:Irumudi Rs 100 Crore Collection: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన తాజా ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని అందుకుంది. విడుదలైన మొదటి రోజే నుంచే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. రవితేజ కెరీర్‌లోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక వసూళ్లతో ఈ సినిమా ఒక సరికొత్త మైలురాయిని తాకింది. సినిమా విడుదలైన వారంలోపే రూ.100 కోట్ల కలెక్షన్ల్ గ్రాస్ ను కొల్లగొట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది.
0
0
Report

Fastag Traffic Fines: వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై ఫాస్టాగ్‌ ద్వారా ట్రాఫిక్ చలాన్లు ఆటోమేటిక్ వసూళ్లు!

Hyderabad, Telangana:

Fastag Traffic Fines Deduction: హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు సమగ్ర ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజా రవాణా బలోపేతం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ, మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో, ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి సాంకేతికత సాయంతో ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.

ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనుల ఈ-చలాన్ జరిమానాలను నేరుగా వారి ఫాస్టాగ్ ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా కట్ చేసే విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్షికోత్సవ కార్యక్రమంలో జాయింట్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఈ సరికొత్త ప్రతిపాదన వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ విధానానికి సంబంధించి హెచ్‌ఎండీఏ (HMDA) అధికారులతో చర్చలు జరుగుతున్నాయని, అనుమతులు, సాంకేతిక అంశాలు పూర్తయిన తర్వాత దీనిని అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుత విధానం ప్రకారం కెమెరాలు, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల ద్వారా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి వాహనదారులకు ఈ-చలాన్లు జారీ చేస్తున్నారు. అయితే, చాలామంది వాహనదారులు ఈ జరిమానాలను వెంటనే చెల్లించకుండా పెండింగ్‌లో పెడుతున్నారు. దీనివల్ల బకాయిల వసూలు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి వస్తోంది. కానీ కొత్తగా ప్రతిపాదించిన ఫాస్టాగ్ అనుసంధాన విధానం అమల్లోకి వస్తే, జరిమానా విధించిన వెంటనే మొత్తం ఆటోమేటిక్‌గా వసూలైపోతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ విధానం కేవలం చలాన్ల వసూళ్లకే కాకుండా, నగరంలో ట్రాఫిక్ నిర్వహణకు సాంకేతికతను జోడించే దిశగా ఒక కీలక అడుగు కానుంది. దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించే వారిపై తక్షణ ఆర్థిక ప్రభావం పడుతుంది. అయితే, ఈ కొత్త విధానం ఎప్పుడు అమలవుతుంది? జరిమానాలు ఏ నిబంధనల ప్రకారం కట్ చేస్తారు? ముందస్తు సమాచారం ఎలా ఇస్తారు? అనే విషయాలపై ఇంకా అధికారికంగా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

ఏదేమైనా, ఈ సరికొత్త నియమం అమల్లోకి వస్తే చలాన్ పడిన వెంటనే ఫాస్టాగ్ ఖాతా నుండి డబ్బు కట్ అవుతుంది కాబట్టి, ఇది వాహనదారుల జేబులకు భారీగా చిల్లు పెట్టే విషయమేనని సాధారణ జనం అభిప్రాయపడుతున్నారు.

Also Read: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి ఫైర్..రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రెస్‌మీట్

Also Read: మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త.. తెలంగాణలో 121 కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు సిద్ధం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

12 ఏళ్ల పాపలా నటించి ఫ్యామిలీని ముంచిన 37 ఏళ్ల మహిళ.. చివరికి ఏమైందంటే?

Hyderabad, Telangana:

Real-Life Orphan Movie Case News: సినిమాల్లో మాత్రమే చూసే వింతైన మోసాలు ఒక్కొక్కసారి నిజజీవితంలోనూ జరిగి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి.. హాలీవుడ్ లో సంచలనం సృష్టించిన అనాధ సినిమా మీకు గుర్తుందా? అచ్చం అలాంటి ఘటన బ్రెజిల్ లో వెలుగు చూసింది.. ఒక 37 ఏళ్ల మహిళ..ఆటిజంతో బాధపడుతున్న 12 ఏళ్ల చిన్నారిగా నటించి ఏకంగా ఒక కుటుంబాన్ని దారుణంగా మోసం చేసింది.. చివరికి ఏం జరిగిందో తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం.. ఇప్పుడు ఈ హైడ్రామాకు ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రెజిల్ కు చెందిన అమండ సౌజా డి ఒలివేరా అనే మహిళ ఈ కళ్ళు చెదిరే మోసానికి పాల్పడింది.. శాంటా కాటరినా రాష్ట్రంలో స్థానికంగా ఉండేవో చర్చికి వెళ్లే ఒక దంపతులను ఆమె టార్గెట్ చేసింది.. చర్చి పాస్టర్ ద్వారా వారితో పరిచయం పెంచుకొని.. తన పేరు గాబ్రియేలని .. తాను తీవ్రమైన ఆటిజంతో బాధపడుతున్నానని 12 ఏళ్ల అనాధ బాలికనని వారిని నమ్మించింది.. వారిలో సానుభూతి పొందేందుకు నోట్లో చిన్నపిల్లల పీకపెట్టుకొని తిరగడంతో పాటు పాల బాటిల్తో పాలు తాగడం, అర్ధరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేవడం, మెనీ మోర్ లాంటి బొమ్మల దుస్తులు వేసుకోవడం.. ఇలా అచ్చం చిన్నపిల్లల వ్యవహరిస్తూ దంపతులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది..

పాప అనుకోవడానికి ఆమె శరీర ఆకృతి పెద్దవారిలా ఎందుకు ఉందన్న అనుమానం రాకుండా ఆ యువతి ఒక పెద్ద కట్టుకతే అల్లింది.. చిన్నతనంలో తన తల్లిదండ్రులు తనను తీవ్రంగా హింసించారని.. బలవంతంగా హార్మోన్ ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే తాను త్వరగా ఎదిగిపోయిందని.. పెద్ద దానిలాగా కనిపిస్తున్నానని కన్నీళ్లు పెట్టుకుంది.. దీంతో ఆ దంపతులు చలించిపోయారు.. ఏకంగా 14 నెలల పాటు తనను ఇంట్లో ఉంచుకొని.. ఆమె పన్నెండు పుట్టినరోజు వేడుకలను కూడా ఎంతో అద్భుతంగా నిర్వహించారు.. ఆమె బరువు తగ్గడం కోసం మౌన్‌జారో అనే ఖరీదైన మందులు కూడా కొనిచ్చి కంటికి రెప్పలా ఆ యువతీని కాపాడారు. ఆమెను చట్టబద్ధంగా దత్తత తీసుకునేందుకు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు..

ఆ దంపతులకు చెందిన ఒక బంధువుకు ఆ యువతి వింత ప్రవర్తన పై అనుమానం వచ్చింది.. ఇంటర్నెట్లో ఇలాంటి కేసుల గురించి వెతకగా.. ఈమె ఇలాగే మోసం చేసిన పాత పాత వార్తలు కూడా కొన్ని కనిపించాయట.. ఆ బంధువులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది.. పోలీసులు ఆ యువతీని విచారించగా మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు వెలుగులోకి వచ్చాయి.. ఆమె ఒక ప్రొఫెషనల్ మోసం చేసే యువతి అని.. దాదాపు ఏడు రాష్ట్రాల్లో ఇలాగే పేర్లు మార్చుకొని కుటుంబాలను మోసం చేసిందని గుర్తించారు. దత్తత తీసుకునే వారి నుంచి మరింత సానుభూతి కోసం ఏకంగా తన శరీరంలో 200 సూదులను స్వయంగా గుచ్చుకొని.. కన్నవాళ్లే చిత్రహింసలు పెట్టారని నమ్మించే ప్రయత్నం చేసిందట..

తాను మానసిక రోగినని.. ఎవరినీ మోసం చేయలేనని కోర్టులో ఆ యువతి వాదించింది. కానీ ఆమె పక్క ప్లాన్ ప్రకారమే మోసాలకు పాల్పడిందని గుర్తించిన న్యాయమూర్తి ఆ వాదనను తోసిపిచ్చారు. ఆమెపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో కోర్టు ఆమెకు దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

No Traffic Lights: ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని ఏకైక దేశం ఇదే..

Hyderabad, Telangana:

No Traffic Lights Country: ప్రస్తుతం ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా నగరాల్లో వాహనాల్లో ఒకచోట నుంచి మరొక చోటికి వెళ్లడం ఊహించగలమా? ఎక్కడ చూసినా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో వెలిగే లైట్లు మనం చేసే ట్రావెలింగ్ ను అద్భుతంగా నియంత్రిస్తూ ఉంటాయి. అయితే ప్రపంచంలో ఎక్కడా ఒక ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని దేశం ఒకటి ఉందని చెబితే మీరు నమ్ముతారా? మీరు తప్పకుండా నమ్మాల్సిందే.. అవును మీరు విన్నది నిజమే.. ఆ దేశం మరేదో కాదు మన పురుగున ఉన్న అద్భుతమైన హిమాలయ దేశం భూటాన్..

ప్రపంచమంతా సాంకేతికత వైపు పరుగులు తీస్తూ ఉంటే.. భూటాన్ మాత్రం భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది.. ఆ దేశ రాజధాని థింఫూ తో సహా దేశంలో ఎక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ కూడా మనకు కనిపించదు.. ఇందుకు ప్రధాన కారణం అక్కడి ప్రజలు మనస్తత్వంగా భావించవచ్చు.. ట్రాఫిక్ లైట్లు అనేవి కేవలం యంత్రాలని.. వాటికి ఎలాంటి బాగోద్వేగాలు ఉండవని భూటాన్ ప్రజలు నమ్ముతూ ఉంటారు.. యంత్రాల ద్వారా నియంత్రించడం కంటే తోటి మనుషులే దారి చూపడాన్ని వారు ఇష్టపడతారట..

అయితే, భూటాన్‌లో ఎప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రయత్నించలేదా అంటే.. చేశారు కూడా.. కొన్ని సంవత్సరాల క్రితం థింఫూ నగరంలోని ఓ రద్దీ ఉండే కూడలిలో మొదటిసారిగా ఒక ట్రాఫిక్ లైట్ను ప్రభుత్వం ప్రయోజనాత్మకంగా ఏర్పాటు చేసింది.. కానీ ఆ లైట్లను చూసి అక్కడ ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. అది యాంత్రికంగా ఉందని.. మనుషుల మధ్య ఉండే ఆత్మీయ బంధాన్ని దూరం చేస్తోందని వారు భావించారట.. ప్రజల వ్యతిరేకతను గమనించిన అక్కడి ప్రభుత్వం.. ఆ లైట్లను పెట్టిన 24 గంటల్లోనే తీసేసిందట.. అప్పటినుంచి ఇప్పటివరకు భూటాన్ లో మళ్ళీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఊసే ఎత్తలేదు..

సిగ్నల్స్ లేనప్పుడు అంత రద్దీలో ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తారని సందేహం రావడం సహజం.. అయితే, థింఫూ నగరంలోని కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా డిజైన్ చేసిన అందమైన బూతులలో నిలబడి.. తమ చేతి సైగలతో వాహనాలను నియంత్రిస్తూ ఉంటారట.. వారు ఎంతో ఓపికగా.. నవ్వుతూ ట్రాఫిక్ క్లియర్ చేయడం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.. ప్రజలు కూడా నిబంధనలు పాటిస్తూ ఎంతో క్రమశిక్షణతో డ్రైవ్ చేస్తారు.. కాబట్టి అక్కడ ప్రమాదాలు జరగడం చాలా అరుదు..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

భూటాన్ దేశం అభివృద్ధిని GDPతో కాకుండా ప్రజల సంతోషంతో కొలుస్తుంది.. ప్రజల సంతోషానికి.. ప్రశాంతతకు భంగం కలిగించే ఆధునికతను వారు సున్నితంగా తిరస్కరిస్తారట.. ట్రాఫిక్ లైట్ ల స్థానంలో పోలీసులను నియమించడం కూడా ఇందులో భాగమే.. యంత్రాలకంటే మనుషులకే ఎక్కువగా విలువనిచ్చే భూటాన్.. నిజంగా నేటి ప్రపంచానికి ఒక గొప్ప ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదని కొంతమంది నిపుణులు చెబుతూ వస్తున్నారు..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Suryakumar Yadav Reentry: టీమ్ఇండియాలోకి సూర్యకుమార్ యాదవ్ రీఎంట్రీ? బీసీసీఐ నుంచి కీలక సమాచారం లీక్!

Hyderabad, Telangana:

Suryakumar Yadav Re-Entry News: గత టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియాను విజయపథంలో నడిపించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత జట్టులో కనుమరుగయ్యాడు. ప్రపంచ ఛాంపియన్‌గా భారత్‌ను నిలబెట్టిన సూర్యకుమార్ యాదవ్‌ను జట్టు నుంచి తప్పించడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే టీ20లతో పాటు ఇతర సిరీస్‌లలో భారత్ వరుస ఓటముల తర్వాత సూర్యకుమార్ యాదవ్‌ను తిరిగి జట్టు కెప్టెన్‌గా తీసుకోవాలని బీసీసీఐ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. 

అంతకుముందు, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తే సూర్యకుమార్ యాదవ్ భారత జట్టులోకి తిరిగి రాగలరని BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) వర్గాలు ANIకి తెలిపాయి. బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోవడంతో, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ముందు సూర్యకుమార్ యాదవ్ T20I కెప్టెన్సీని కోల్పోవడమే కాకుండా జట్టు నుంచి కూడా తొలగించారు. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్‌ను కొత్త T20I కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది.

అయితే, అయ్యర్ నాయకత్వంలో భారత జట్టు ప్రదర్శన అంతగా ఆశాజనకంగా లేదు. ఐర్లాండ్ చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైన 'మెన్ ఇన్ బ్లూ' (భారత జట్టు), ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 4-0తో ఓటమిని చవిచూసింది (మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది).

BCCI వర్గాల సమాచారం ప్రకారం, సూర్యకుమార్ పునరాగమన అవకాశాలను బోర్డు పూర్తిగా తోసిపుచ్చలేదు. ప్రస్తుత ప్రణాళికల్లో లేనప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తే జట్టు ఎంపికకు ఆయన పరిగణించబడే అవకాశం ఉంది. "సూర్యకుమార్ యాదవ్‌కు ఇంకా అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అతను జట్టు ఎంపిక పరిశీలనలో లేనప్పటికీ, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తే తిరిగి జట్టులోకి వచ్చే అర్హత అతనికి ఉంది" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో ప్రకారం.. టీమ్ఇండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య కొలంబోలో కలిశారు. సూర్యకుమార్ జయసూర్యను పలకరిస్తూ కాసేపు మాట్లాడటం కనిపించింది. జయసూర్య చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించిన భారత బ్యాటర్, ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారా అని సరదాగా అడిగారు. "మరింత ఫిట్‌గా తయారవుతున్నారు, పునరాగమనం కోసం ప్రయత్నిస్తున్నారా? చూస్తుంటే 100% అలాగే అనిపిస్తోంది" అని ఆయన అన్నారు. ఆ కామెంట్‌కు శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య నవ్వారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్ల మనసులను గెలుచుకుంది.

Also Read: శ్రీలంకతో టెస్టులో ఉద్రిక్తత..లంక బౌలర్‌తో యశస్వి జైస్వాల్ రణరంగం..వీడియో వైరల్!

Also Read: డబ్ల్యూటీసీ రేసులో భారత్ అసలు సిసలైన పరీక్ష.. ఫైనల్‌ చేరాలంటే భారత్‌ ఇలా చేయాలి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Costly Egg Auction: డజన్ కాదు ఒక్కటే.. రూ.25 వేలకి అమ్ముడుపోయి కోడిగుడ్డు..

Hyderabad, Telangana:

Egg Sold For Rs 25k: సాధారణంగా ఒక కోడిగుడ్డు ధర ఎంత ఉంటుంది.. మహా అయితే దాదాపు 7 నుంచి 8 రూపాయల వరకు ఉంటుంది.. కొన్ని కోడిగుడ్ల ధరలు దాదాపు 20 రూపాయలు ఉంటాయి.. కానీ ఎవరైనా ఒక కోడిగుడ్డుని ఏకంగా 25,000 పెట్టి కొన్నాను అంటే మీరు కళ్ళు మూసుకొని నమ్మగలుగుతారా..? అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజమే.. ఈ ఆశ్చర్యకరమైన ఘటన లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒక సాధారణ కోడి గుడ్డును వేలంలో ఏకంగా 25 వేల రూపాయలకు కొనుగోలు చేసేసారంటే నమ్మాల్సిందే.. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం తెలిసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ కారణమేంటో? ఇంత ధరకు అమ్ముడు పోవడానికి గల కారణాలు.. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల ఇరాన్లో నెలకొన్న ఘర్షణలతో పాటు యుద్ధ వాతావరణం వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఇరాన్ బాధితులకు సహాయం చేసేందుకు లద్దాఖ్, కాశ్మీర్ తదితర ప్రాంతాల ప్రజలు ఏకమైనట్లు తెలుస్తోంది.. ఈ నేపథ్యంలోనే లేహ్ జిల్లాలో భారీ ప్రత్యేకమైన విరాళాల సేకరణ కార్యక్రమం చేపడుతూ వస్తున్నారు. ఇందులో భాగంగా స్థానికులు తమ వద్ద ఉన్న వస్తువులతో పాటు నగదును విరాళంగా ఇవ్వడం మొదలుపెట్టారు..

ఈ క్రమంలోనే ఒక కోడి గుడ్డును వేలానికి ఉంచగా.. షబీర్ హుస్సేన్ అనే స్థానిక వ్యక్తి దానిని ఏకంగా 25 వేలకు పాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ఒక గుడ్డు ధర ₹10 మాత్రమేనని నాకు తెలుసని.. కానీ నేను ఆ పాతిక వేలు ఇచ్చింది గుడ్డు కోసం కాదని.. ఇరాన్ కష్టాలు పడుతున్న బాధితులకు నా వంతు సహాయం చేయడం కోసమని.. మానవత్వం ముందు డబ్బు ఎంత అవసరమైతే మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమంటూ గొప్ప మనసును చాటుకున్నాడు..

కేవలం కోడి గుడ్డు మాత్రమే కాదు.. కాశ్మీర్ అంతట ఇరాన్ బాధితుల కోసం ప్రజలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.. మహిళలు తమ బంగారంతో పాటు వెండి ఆభరణాలు విరాళాన్ని ఇస్తుంటే.. చిన్నపిల్లలు సైతం తమ కడ్డీ బ్యాంకులను పగలగొట్టి దాచుకున్న డబ్బులను విరాళంగా ఇచ్చేస్తున్నారు. మరి కొంతమంది తమ ఇళ్ళలోని సైకిళ్లతో పాటు పాత్రలు, పశువులను సైతం విరాళంగా అందించి మానవత్వం చాటుకుంటున్నారు.. 

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

భారతీయులు చూపుతున్న ఈ ఆదరణ పట్ల ఇరాన్ రాయబారి కార్యాలయం కూడా స్పందించింది. కష్ట కాలంలో అండగా నిలిచిన భారతీయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.. మీ దయతో పాటు మానవత్వాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము.. థాంక్యూ ఇండియా అంటూ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఒక చిన్న కోడి గుడ్డు ద్వారా మొదలైన ఈ గొప్ప సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. తోటి మనుషుల కష్టాల్లో ఉన్నప్పుడు మతంతో పాటు ప్రాంతాలకు అతీతంగా స్పందించడమే నిజమైన మానవత్వం అని భారత ప్రజలు నిరూపించారు.

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
0
Report
Advertisement

Viral News: పగలు ప్రియుడితో.. రాత్రి భర్తతో.. భార్య షిఫ్ట్ కాపురం..

Hyderabad, Telangana:

Viral Latest News: పోలీస్ స్టేషన్‌ను ప్రతిరోజు ఎన్నో రకాల ఫిర్యాదులు వస్తూ ఉండడం మనం అప్పుడప్పుడు వార్తల్లో చూస్తూ ఉంటాం.. ఆస్తి తగాదాలతో పాటు దొంగతనాలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎన్నో రకాల కేసులు పోలీసులు చూస్తూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని వెలుగు చూసిన ఓ విచిత్రమైన కేసును చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యింది.. అవును మీరు చదువుతుంది నిజమే.. ఒకే ఇంట్లో తన భర్తతో పాటు ప్రియుడితో కలిసి జీవించేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఓ మహిళ ఏకంగా పోలీసులను ఆశ్రయించడం ఆసక్తి కలిగిస్తోంది. వినడానికి వింతగా ఉన్న ఇది అక్షరాల నిజమే.. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.. అయితే ఈ ఘటనకు సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సీతాపూర్ జిల్లా మహమ్మదాబాద్ కొత్వాలి పోలీస్ స్టేషన్కు ఓ మహిళ తన భర్తతో పాటు ప్రియుడితో కలిసి వచ్చింది.. ముగ్గురూ కలిసి పోలీసులకు ఓ లిఖితపూర్వకమైన ఫిర్యాదును అందించారు. తాము ముగ్గురం ఒకే ఇంట్లో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని.. తమ ప్రత్యేకమైన కాపురానికి రక్షణ కల్పించాలని వారు కోరారు.. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఆ మహిళ చెప్పిన షిఫ్ట్ కాపురం ప్లాన్ విన్న పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోయారట..

 తన భర్త పగటిపూట ఉద్యోగానికి వెళ్తాడని.. ఆ సమయంలో తన ప్రియుడు ఇంట్లో ఉంటాడని మహిళ వివరించింది.. ఆ తర్వాత రాత్రి పూట ప్రియుడు డ్యూటీకి వెళ్తాడని.. అప్పుడు భర్త ఇంటికి వస్తాడని.. ఇలా ఎవరి షిఫ్ట్ ప్రకారం వారు తనతో సమయం గడుపుతారని చెప్పుకొచ్చింది.. ఇద్దరి పని వేళలకు అనుగుణంగా తన జీవితాన్ని ప్లాన్ చేసుకున్నానని.. తాము ముగ్గురం ఈ ఒప్పందానికి పూర్తిగా అంగీకరించామని ఆమె పోలీసులకు చెప్పడంతో వారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు..

ఒక ఒప్పందానికి భార్య, భర్త, ప్రియుడు ముగ్గురు అంగీకరించినప్పటికీ.. భర్త కుటుంబ సభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.. ముఖ్యంగా భర్త తండ్రి, ఇద్దరు ఆడపడుచులు ఈ ఆలోచనను తీవ్రంగా ఖండిస్తున్నారట.. తమ వ్యక్తిగత జీవితంలో వారు జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని.. వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆ ఆ ముగ్గురు కలిసి పోలీసులను వేడుకున్నారు..

సాధారణంగా ఇలాంటి వ్యవహారాలలో గొడవలు, దాడులు జరగడం మనం చూస్తూ ఉంటాం.. కానీ భర్త ప్రియుడు కలిసిపోయి.. ఒకే ఇంట్లో భార్యతో షిఫ్టుల వారిగా కాపురం చేయడానికి అంగీకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. తమ పోలీసులు తమ సర్వీసులో ఇలాంటి వింత కేసులు ఎప్పుడూ చూడలేదని తలలు పట్టుకుంటున్నారు.. చట్ట పరిధిలో ఈ ఒప్పందానికి ఎలాంటి అనుమతి ఇవ్వాలో అర్థం కాక అధికారులు గందరగోళంలో పడ్డారు..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

YS Jagan Press Meet: కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మరోసారి ఫైర్..రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కీలక ప్రెస్‌మీట్!

Vijayawada, Andhra Pradesh:

YS Jagan Press Meet Today: గత కొన్ని రోజులుగా డీఎస్సీ, ఏపీపీఎస్సీ అంశాలపై వాస్తవాలను ప్రజల ముందుంచినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని వైయస్సార్‌సీపీ అధినాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, బీసీల సంక్షేమంపై మాట్లాడిన ఆయన మరికొన్ని అంశాలను లేవనెత్తారు. 

రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు
రాష్ట్రవ్యాప్తంగా సగటున -52 శాతం వర్షపాతం లోటు ఉందని.. కోస్తాంధ్రలో -47 శాతం, రాయలసీమలో -52 శాతం చొప్పున లోటు నమోదైందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే రాష్ట్రంలోని 688 మండలాల్లో 625 మండలాల్లో (91 శాతం) లోటు వర్షపాతం ఉందని.. 28 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి విడుదల అంటూ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేసిందని, వాటిని నమ్మి రైతులు అప్పులు చేసి విత్తనాలు వేస్తే నార్లు ఎండిపోయి ఎకరాకు రూ.15 వేల వరకు నష్టపోయారని వైఎస్ జగన్ ఆరోపించారు.

రైతులను ఆదుకోవడంలో విఫలం..
వైయస్సార్‌సీపీ హయాంలో పూర్తిగా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ.7,802 కోట్ల ఉచిత బీమాను అందించామని, ప్రస్తుత ప్రభుత్వం దానిని రద్దు చేసి రైతులపై భారం మోపిందని వైఎస్ జగన్ విమర్శించారు. ఇ-క్రాప్, రైతు భరోసా కేంద్రాలు, అగ్రిల్యాబ్స్‌తో పాటు సున్నా వడ్డీ పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జూన్, జులై నెలల్లోనే వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా, ఇప్పటివరకు ఎలాంటి కరువు నివారణ చర్యలు గానీ, ప్రత్యామ్నాయ విత్తనాల పంపిణీ గానీ చేపట్టలేదని విమర్శించారు.

బీసీల సంక్షేమం
వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని జగన్ తన మాటగా చెప్పుకున్నారు. తన కేబినెట్‌లో 40 శాతం (11 మంది) మంత్రి పదవులు బీసీలకే కేటాయించడమే కాకుండా ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. రాజ్యసభ, లోక్‌సభ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేయడం జరిగిందని జగన్ మీడియాతో అన్నారు.

అదే విధంగా 139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కోరుతూ పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టించామన్నారు.

ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం బీసీల రాజకీయ ఎదుగుదలను ఓర్చుకోలేక వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని జగన్ ఆరోపించారు. యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.. అలాగే వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మహిళా ఎస్సైను వేధించిన కేసు.. మహిళలను వేధించిన కేసులో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు..  అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు వంటి వారిని అరెస్టు చేయగా.. బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని తమ పార్టీ నేతలను వైఎస్ జగన్ వెనకేసుకొస్తున్నారు.

Also Read: మద్యం ప్రియులకు కిక్ ఇచ్చే వార్త.. తెలంగాణలో 121 కొత్త అంతర్జాతీయ బ్రాండ్లు సిద్ధం!

Also Read: మంత్రి కొండా సురేఖపై అధిష్టానానికి పీసీసీ నివేదిక..మంత్రివర్గ మార్పులపై చర్చ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Toxic Vs Irumudi: 'టాక్సిక్' నెగటివ్ టాక్.. రవితేజ 'ఇరుముడి' సినిమాకు ఊహించని బూస్ట్!

Hyderabad, Telangana:

Toxic Vs Irumudi At Box Office: బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతకాలు ఎప్పుడు, ఏ విధంగా మారతాయో ముందే చెప్పడం ఎవరికైనా చాలా కష్టం. ఒక భారీ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోతే, థియేటర్లలో స్థిరంగా నడుస్తున్న మరో సినిమాకు అది పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. ప్రస్తుతం సరిగ్గా ఇదే తరహా ఆసక్తికరమైన పరిణామం సినిమా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి అడుగుపెట్టిన రాకింగ్ స్టార్ యశ్ తాజా చిత్రం 'టాక్సిక్' చిత్రానికి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగాను, అలాగే సాధారణ ప్రేక్షకుల్లోనూ తీవ్ర నెగటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ నెగటివ్ ప్రభావం మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' సినిమాకు అనూహ్యమైన ప్లస్ పాయింట్ గా మారబోతోందని సినిమా ఇండస్ట్రీలోనూ, నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న యశ్ సినిమా 'టాక్సిక్' విడుదలవుతుండటంతో, సహజంగానే 'ఇరుముడి' సినిమాకు కేటాయించిన థియేటర్ల సంఖ్య తగ్గింది. అయితే ఇప్పుడు 'టాక్సిక్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోవడంతో పరిస్థితి తారుమారైంది. థియేటర్లలో ఉన్న ప్రేక్షకులు మళ్లీ మంచి పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా నడుస్తున్న 'ఇరుముడి' సినిమా వైపు చూసే అవకాశం ఏర్పడింది. దీనివల్ల పెరిగిన డిమాండ్‌కు తగినట్లుగా ఎగ్జిబిటర్లు సైతం రవితేజ సినిమాకు థియేటర్ల సంఖ్యను, రోజువారీ షోలను మళ్లీ పెంచే యోచనలో ఉండటం విశేషం.

వంద కోట్ల మైలురాయి దాటిన 'ఇరుముడి'.. 
మరోవైపు మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' సినిమా తొలి రోజు నుంచే అత్యంత అద్భుతమైన పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లను రాబడుతూ రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి ఘన విజయం దిశగా వేగంగా దూసుకుపోతోంది. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కథలోని బలమైన మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే ఈ స్థాయి అద్భుతమైన వసూళ్లకు ప్రధాన కారణమైంది.

వీకెండ్స్, పండగ సెలవుల అడ్వాంటేజ్..
ప్రస్తుతం వరుసగా పండగలు, వారాంతపు సెలవులు (లాంగ్ వీకెండ్స్) వస్తుండటం రవితేజ 'ఇరుముడి' సినిమాకు మరింత పెద్ద వరంలా మారనుంది. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీగా నిలుస్తుందని భావించిన 'టాక్సిక్' చిత్రం రేసులో కాస్త వెనుకబడటంతో, ఈ రాబోయే లాంగ్ హాలిడే సీజన్ పూర్తి అడ్వాంటేజ్ మొత్తం రవితేజ ఖాతాలోనే పడనుంది. అనుకున్నట్లుగా థియేటర్లు కూడా పెరిగితే రాబోయే రోజుల్లో రవితేజ 'ఇరుముడి' బాక్సాఫీస్ వసూళ్లు మరిన్ని సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: చిరంజీవి 'విశ్వంభర' విడుదల అవుతుందా? మూవీ యూనిట్ ఏం చేస్తుంది? 2027లో కూడా డౌటే?!

Also Read: రూ.200 కోట్ల క్లబ్‌లో 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. బాక్సాఫీస్ వద్ద సూర్య కొత్త రికార్డు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top