icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
501505
V SHIVA NAGARAJUV SHIVA NAGARAJUFollow11 Aug 2024, 06:24 pm

లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

Hyderabad, Telangana:

పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ లక్ష్మారెడ్డి పాలెం కాలనీలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ద్వితీయ వార్షికోత్సవాలు మరియు బోనాల పండుగ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్ కృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా ఉందని, ప్రజలందరికీ అమ్మవారి, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కోరుతూ ఎంపీ చామల కిరణ్ రెడ్డి ప్రార్థించారు.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Yogi Adityanath: తిరుమల శ్రీవారి సేవలో యూపీ సీఎం యోగి, మాజీ మంత్రి రోజా

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Temple: తిరుమల ఆలయాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వారాంతం ముగిసినా కూడా భక్తుల తాకిడి కొనసాగుతోంది. సాధారణ రోజుల్లో రద్దీ కొనసాగుతుండగా సోమవారం కూడా భక్తులు పోటెత్తారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దర్శించుకోగా.. ఏపీ మాజీ మంత్రి ఆర్‌కే రోజా, ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ చొల్ల బొజ్జి రెడ్డి  దర్శించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమల చేరుకున్న యోగి ఆదిత్యనాథ్‌కు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామి ఆశీస్సులు పొందారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు తిరుమల అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను అందించి యోగి ఆదిత్యనాథ్‌ను సత్కరించారు.

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెంట ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. స్వామివారి దర్శనం సందర్భంగా ఆలయ పరిసరాల్లో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం యోగి ఆదిత్యనాథ్ తిరుమల నుంచి బయలుదేరారు.

స్వర్ణభారతి ట్రస్ట్ వేడుకలకు హాజరు
అంతకుముందు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె నిర్వహిస్తున్న స్వర్ణ భారతి ట్రస్ట్ 25 సంవత్సరాల వేడుకల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వెంకటాచలం స్వర్ణ భారతి ట్రస్ట్‌కు చేరుకోగా.. మంత్రి నారాయణ స్వాగతం పలికారు. మంత్రితోపాటు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా అధికారులు పుష్పగుచ్చం  అందజేశారు. యోగి ఆదిత్యనాథ్ పర్యటన సందర్భంగా వెంకటాచలం స్వర్ణ భారతి ట్రస్ట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం 87,115 మంది భక్తులు తిరుమల స్వామిని దర్శించుకున్నారు. 35,053 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.08 కోట్లు వచ్చాయి. 4.22 లక్షలు లడ్డూ విక్రయాలు జరగ్గా.. 2.96 లక్షల మంది అన్నప్రసాదం స్వీకరించారు. శిలాతోరణం వరకు వెయిటింగ్ కంపార్ట్‌మెంట్లు నిండి ఉన్నాయి. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా సుమారు సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.

0
0
Report

Ganesh Utsav: వినాయక ఉత్సవాలపై తెలంగాణ డీజీపీ కీలక ప్రకటన.. పోలీస్‌ యంత్రాగానికి దిశానిర్దేశం

Hyderabad, Telangana:

Telangana Police: దేశంలోనే అత్యంత వైభవంగా హైదరాబాద్‌లో జరిగే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. గణేశ్‌ ఉత్సవాలకు సమగ్ర భద్రతా  ప్రణాళిక రూపొందించినట్లు.. విద్యుత్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, జనసమూహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు అప్రమత్తంగా ఉండాలని పోలీస్‌ యంత్రాంగానికి డీజీపీ సీవీ ఆనంద్‌ ఆదేశించారు.

గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం డీజీపీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని ఎస్‌ఐలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సెప్టెంబర్‌ 14వ తేదీన ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 25వ తేదీన గణేశ్‌ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై పోలీస్‌ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. గణేశ్‌ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ సీవీ ఆనంద్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

నిమజ్జనంపై ముందస్తు ప్రణాళిక 
గణేష్ నిమజ్జనానికి సంబంధించి మార్గాలు, రహదారులు, వంతెనలను ముందుగానే గుర్తించి వాటి సామర్థ్యాన్ని పరిశీలించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్‌, బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని.. భద్రతా చర్యల్లో భాగంగా బాంబు డిస్పోజల్‌ బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌లను అవసరమైన చోట వినియోగించాలని ఆదేశించారు. జియో ట్యాగింగ్‌, తనిఖీల వివరాలను టీజీ-కాప్‌ ప్లాట్‌ఫాంలోనూ అప్‌లోడ్‌ చేయాల న్నారు.

సమన్వయం
గణేశ్‌ ఉత్సవ కమిటీలు, శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహించి సమస్యలను ముందుగానే పరిష్కరించాలని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి ప్రత్యేకంగా బ్రీఫింగ్‌ నిర్వహించాలని..సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలపై తక్షణమే స్పందించాలని సూచించారు. అన్ని శాఖలు, ఉత్సవ కమిటీలు, ప్రజల సమన్వయంతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

సమావేశంలో డీజీ టెక్నికల్‌ సర్వీసెస్‌ వి.వి. శ్రీనివాసరావు, ఐజీ ఇంటెలిజెన్స్‌ కార్తికేయ, ఐజీ మల్టిజోన్‌-1 చంద్రశేఖర్‌రెడ్డి, టీస్పార్క్‌ ఎస్పీ రూపేష్‌, ఏఐజీ రమణకుమార్‌, హైదరాబాద్‌ డీసీపీ అవినాష్‌కుమార్‌, డీసీపీ విక్రాంత్‌కుమార్‌ సింగ్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పోలీసులకు ఆదేశాలు
==> గణేశ్‌ మండపాల వివరాలను సేకరించి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు.
==> మండపం ఉన్న ప్రదేశం, నిర్వాహకులు, కమిటీ సభ్యులు, నిమజ్జనానికి వినియోగించే వాహనాల వివరాలను నమోదు చేయాలి.
==> ఎస్‌హెచ్‌ఓలకు ప్రత్యేక లాగిన్‌లు ఇవ్వడంతో మండపాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
==> మండపాల ప్రాంతాలను జియో ట్యాగింగ్‌ చేసి భద్రతా ఏర్పాట్ల వివరాలను  నమోదు చేయాలి.
==> సీపీలు, డీసీపీలు, ఎస్పీలు మండపాలను సందర్శించి పాయింట్‌ బుక్స్‌లో పరిశీలన వివరాలు నమోదు చేయాలి.
==> మండపాల వద్ద విద్యుత్‌, ట్రాఫిక్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి.. విద్యుత్‌, అగ్నిమాపక తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలి
==> మండపాల వద్ద నిర్వాహకులు స్వచ్ఛంద కార్యకర్తలను ఏర్పాటు చేసుకునేలా చూడడంతోపాటు సీసీ కెమెరాలు, క్యూల నిర్వహణకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలి.

0
0
Report
Advertisement

Vijayasai Reddy: విజయసాయి రెడ్డి కీలక ప్రకటన.. దసరా తర్వాత కొత్త రాజకీయ పార్టీ

Vijayawada, Andhra Pradesh:

Vijayawada: 'విజయదశమి' తర్వాతి రోజే పార్టీ వివరాలు ప్రకటిస్తానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. తమది ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన ప్రాంతీయ పార్టీ అని స్పష్టం చేశారు. యువతతో కలిసి పార్టీని స్థాపిస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని.. తన శత్రువు కాదని ప్రకటించారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా తానేమీ పార్టీని పెట్టడం లేదని స్పష్టం చేశారు.

విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీపై కీలక విషయాలు వెల్లడించారు. దసరా పండుగ తర్వాత రాజకీయ పార్టీ ప్రకటిస్తానని తెలిపారు. 'ఇంకా నాలుగు ప్రెస్‌మీట్లు నిర్వహిస్తా. తదుపరి అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిలో ప్రెస్‌మీట్లు ఉంటాయి. ప్రెస్‌మీట్ల అనంతరం కాంక్లేవ్‌ నిర్వహించి పార్టీ జెండా, అజెండా, పేరు ప్రకటిస్తా' అని విజయసాయి రెడ్డి వెల్లడించారు.

'నేను ప్రజా సొమ్ము దోచుకుని ఉంటే అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి నాపై విచారణ వేయండి.. దేనికైనా నేను సిద్ధం' అని కూటమి ప్రభుత్వానికి విజయసాయి రెడ్డి సవాల్‌ చేశారు. తన ఇమేజ్ ఏమిటో మూడు సంవత్సరాల్లో తెలుస్తుందని చెప్పారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ తనకు ప్రత్యర్థులు మాత్రమేనని శత్రువులు కాదని ప్రకటించారు. ఒంటరిగానే ఎన్నికల్లో పోటీకి వెళ్తామని తెలిపారు. తనది మతతత్వ పార్టీ కాదని స్పష్టం చేశారు.

'గుంటూరులో జరిగింది కూడా కచ్చితంగా లవ్ జిహాద్. నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. నేను ప్రారంభించబోయే పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరప్రదేశ్‌ తరహా ట్రీట్‌మెంట్ ఉంటుంది. నా మీద వచ్చే విమర్శలకు నేను కౌంటర్ ఇచ్చుకోగలను' అని విజయసాయి రెడ్డి తెలిపారు. తన పొలిటికల్ గాడ్‌ ఫాదర్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలేనని చెప్పారు. ప్రతి ప్రభుత్వంలో బలవంతపు, ప్రలోభపు మత మార్పిడిలు ఉంటాయని పేర్కొన్నారు. తాను కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనని విజయసాయి రెడ్డి ప్రకటించారు. త్వరలో పాదయాత్ర చేస్తానని.. 660 మండలాల్లో ప్రజల మధ్య పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు. అడవుల్లో, రోడ్ల మీద గిన్నీస్ బుక్ రికార్డు కోసం పాదయాత్ర చేయనని పరోక్షంగా వైఎస్‌ జగన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీతో తనకు ఎప్పుడు సత్సంబంధాలు ఉన్నాయని విజయసాయి రెడ్డి తెలిపారు.

0
0
Report

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 'మన శంకర వరప్రసాద్' నటి, ప్రముఖ యూట్యూబర్‌ నందన అరెస్ట్! లండన్ వీసాల పేరుతో భారీ ఫ్రాడ్!

Hyderabad, Telangana:

YouTuber Nandus World Nandana Arrest: 'మన శంకర వరప్రసాద్' సినిమాలో నటించిన నటి రమా నందనను, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో ఉద్యోగాలు, స్పాన్సర్‌షిప్‌ల పేరుతో మోసం చేశారని ఆమెపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఈమె ప్రముఖ యూట్యూబర్ నందూస్‌ వరల్డ్‌ ఛానల్‌ నందన. ఇప్పటికే ఆమెపై కేసు నమోదవ్వడమే కాకుండా, లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

'నందుస్ వరల్డ్' యూట్యూబ్ ఛానల్ ద్వారా రమా నందన తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కానీ ఆమె తన భర్త మధుకర్‌తో కలిసి యూకేలో ఉద్యోగాల కోసం వీసా స్పాన్సర్‌షిప్ పేరుతో భారీగా మోసం చేసినట్లు పలువురు మీడియా ముందుకు వచ్చి, ఛానల్‌ల వద్ద కూడా వాపోయారు. సుమారు 100 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.15 నుండి రూ. 20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తోటి యూట్యూబర్‌లు కూడా వీరిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ కొత్తూరుకు చెందిన శివ అనే బాధితుడు ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. తాము మోసపోయామని చాలామంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూనే ఉన్నారు, అయితే రమా నందన, ఆమె లాయర్ ఈ ఆరోపణలను ఖండిస్తూ వచ్చారు.

యూకేలో ఉద్యోగాల పేరిట భారీ మోసం.. నందూస్‌ వరల్డ్‌ ఫ్యామిలీ ఫైనల్‌గా స్పందన! ఫుల్‌ స్టోరీ ఇదే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Ishan Kishan Double Century: డబుల్ సెంచరీతో అలరించిన ఇషాన్ కిషన్..31 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..

Hyderabad, Telangana:

Ishan Kishan Double Century News: భారత్‌లో ప్రస్తుతం జరుగుతున్న డొమెస్టిల్ లీగ్ దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తోంది. ఈ జట్టుకు ఇషాన్ కిషన్ నాయకత్వం వహిస్తుండగా.. ప్రత్యర్థి సౌత్ జోన్ టీమ్‌పై మొదటి రోజు అద్భుతంగా రాణించింది. మొదటి రోజు ఆట ముగిసేనాటికి 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల పటిష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. తన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకదాన్ని ప్రదర్శించిన కెప్టెన్ పుణ్యమా అని, ఈ ఆధిక్యం మరింత పెరిగింది.

ఈస్ట్ జోన్ టీమ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మొదటి రోజు క్రీజులోకి వచ్చి, రెండవ రోజు కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. అతను 301 బంతుల్లో 250 పరుగులు చేసి, దులీప్ ట్రోఫీ చరిత్రలో 12వ అత్యధిక పరుగుల ఇన్నింగ్స్‌గా నిలిచాడు. 1987 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో వెస్ట్ జోన్‌పై నార్త్ జోన్ తరఫున 320 పరుగులు చేసిన రామన్ లంబా ఇప్పటికీ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు.

అయితే ఇప్పుడు 250 పరుగులతో ఇషాన్ కిషన్.. డబ్ల్యూవీ రామన్‌తో కలిసి 12వ స్థానాన్ని పంచుకున్నాడు. ఈస్ట్ జోన్ కెప్టెన్ తన డబుల్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత గేర్ మార్చాడు. అలసట కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా నిష్క్రమించాడు.

ఇషాన్ కిషన్ తన ఇన్నింగ్స్‌లో 34 బౌండరీలు సాధించగా, వాటిలో 27 ఫోర్లు ఉన్నాయి. అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఒకటి ఆడినప్పటికీ, బ్యాట్‌తో చరిత్ర సృష్టించడంలో విఫలమైనప్పటికీ, అతని జట్టు ఈస్ట్ జోన్‌కు ఇప్పుడు రికార్డుల పుస్తకాలను మార్చే అవకాశం లభించింది.

దులీప్ ట్రోఫీలో అత్యధిక జట్టు స్కోరు 868, దీనిని 1987లో నార్త్ జోన్ నమోదు చేసింది. ఈ వార్త రాసే సమయానికి, ఈస్ట్ జోన్ నాలుగు వికెట్ల తేడాతో 626 పరుగులు చేసింది. ఈ రికార్డుకు దగ్గరగా ఉన్నట్లు అనిపించినప్పటికీ, ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ క్రీజ్‌లో లేకుండా.. ఇంతటి టార్గెట్‌ను సాధించడం ఇది సవాలుగా మారవచ్చు.

28 ఏళ్ల కిషన్ పేరిట కేవలం రెండు టెస్ట్ అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. అతని చివరి రెడ్ బాల్ (టెస్టు) మ్యాచ్ జూలై 2023లో వెస్టిండీస్‌తో జరిగింది  అతన్ని ఎంపిక చేయని సెలెక్టర్లందరికీ అతని దులీప్ ట్రోఫీ ఫైనల్ ప్రదర్శన ఒక గట్టి సమాధానం కావచ్చు.

Also REad: India Vs Japan: జపాన్‌తో టీమ్ఇండియా ద్వైపాక్షిక టీ20 సిరీస్..భారత్‌కు ఇన్ని లాభాలా?

Also REad: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్‌ 2026లో దుబాయ్‌లో హై-వోల్టేజ్ మ్యాచ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

BRS Party: 'హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం': వేముల ప్రశాంత్ రెడ్డి

Hyderabad, Telangana:

Telangana Bhavan: 'తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న కేటీఆర్‌ను పోలీసులు కింద వేసి పోలీసులు తొక్కింది తెలంగాణ మొత్తం చూసింది. చిల్లర దౌర్జన్యకాండ రేవంత్ రెడ్డి చేశాడు' అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని.. వెయ్యి రోజుల పాలన నిష్ఫలం అని తెలిపారు. 'రేవంత్ రెడ్డి బడువే మాటలు టీ షర్ట్స్‌పై లేదు. కింద పడేసి తొక్కుతాని రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషలేదు' అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.

'రాహుల్, ప్రియాంక గాంధీ పార్లమెంట్‌లో మోడీ అదానీ టీషర్ట్స్ వేసుకున్నారు. రాహుల్ గాంధీ ఒక న్యాయం కేటీఆర్, హరీశ్‌ రావుకు ఒక న్యాయమా?' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. 'శాంతియుత మార్గంలో మేము నిరసన తెలిపాం. మాజీ హోం శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొంతు పోలీసులు నొక్కారు. ఇదేనా ప్రజా పాలన అంటే?' అని నిలదీశారు. సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకొని లాగారని.. తోపులాటలో మాజీ మంత్రులు హరీశ్‌ రావు, జగదీష్ రెడ్డి సంజయ్ కిందపడ్డారని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు.

'భౌతికంగా కేటీఆర్‌పై దాడి చేశారు. తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలి. బ్లాక్ టీషర్ట్స్ రేవంత్ రెడ్డికి నచ్చడం లేదు. పచ్చ టీ షర్ట్స్ వేసుకొని వస్తే రేవంత్ రెడ్డికి మంచిదేమో' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి శిఖండి రాజకీయం చేస్తున్నాడని.. రేవంత్ రెడ్డి కంటే శిఖండి నయం విమర్శించారు. 'తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను అపహాస్యం చేస్తున్నారు. మమ్మల్ని అవమానించినట్టే కేసీఆర్‌ను అవమానించాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి బండారం బయటపడుతుంది' అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.

'బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీకి రానివ్వడం లేదు. అసెంబ్లీ బయట రెండు వేల మంది పోలీసులు ఉన్నారు. రెండు సార్లు నన్ను వాహనంలో ఎత్తేశారు. ఇంతటి గుండాగిరి ఎన్నడు చూడలేదు' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. తాము కేసీఆర్ సైనికులం.. భయపడేది లేదని ప్రకటించారు. బ్లాక్ టీషర్ట్స్ వేసుకుంటే తమను అడ్డుకున్నారని.. తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచన చేయాలని సూచించారు.

'తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ సభలో ప్లకార్డ్స్‌ ప్రదర్శిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ ములాఖాత్ ప్రజలకు అర్థమైంది. మేము బ్లాక్ టీషర్ట్స్ వేసుకుంటే మమ్మల్ని అడ్డుకున్నారు. బీజేపీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసిపోయారు. రేవంత్ రెడ్డి పొద్దున కాంగ్రెస్ తో సాయంత్రం బిజెపితో ఉంటాడు' అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు.

0
0
Report

Revanth Reddy: కమ్యూస్టుల పోరాటం చేస్తే.. కాంగ్రెస్ పరిష్కారం చూపిస్తుంది: రేవంత్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Hyderabad: 'మనమంతా కలసి దేశంలో మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలవలేనప్పుడు కొత్త కొత్త విధానాలను అవలంభిస్తున్నారు. సర్‌ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను లక్ష్యం చేసుకున్నారు. తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారు' అని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్‌లో చేసినట్లే తెలంగాణలో చేస్తామని బీజేపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారని తెలిపారు.

హైదరాబాద్‌లోని రైతు నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు వెళ్లి రైతుల కోసం తన జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి. ఆయన మరణం రైతాంగానికి తీరని లోటు' అని తెలిపారు. సమస్యపై అవగాహన, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో సారంపల్లికి సాటి లేరని చెప్పారు. కౌలు రైతుల సమస్య, పంటలు గిట్టుబాటు ధర కోసం ఆయన ఎంతో పోరాడారని గుర్తుచేశారు.

'భూమి సారం నుంచి పంట తీసేవరకు సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్‌సైక్లోపీడియా సారంపల్లి. ఆయన రాసిన పుస్తకాలు, లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగ సమస్యలను మా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. భూమిలేని నిరుపేదలకు కనీస కూలీ ఉండాలని కమ్యూనిస్టులు కొట్లాడారని.. కనీస వేతన చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. దున్నేవాడికి భూమికోసం కమ్యూనిస్టులు పోరాడారని చెప్పారు.

'అసైన్డ్ భూములను 24 లక్షల 56 వేల ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది. 10 లక్షల ఎకరాలు ఆదివాసీల చేతుల్లో ఉన్నాయి. ఇది కమ్యూస్టుల పోరాటానికి .. కాంగ్రెస్ పరిష్కారం. ఉపాధి హామీ చట్టం ద్వారా పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆహార భద్రతా చట్టం కాంగ్రెస్‌ తీసుకొచ్చింది. కమ్యూనిస్టులు లేవనెత్తిన ప్రతీ సమస్యను కాంగ్రెస్ పరిష్కరించింది' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో కలిసినా కలవకపోయినా.. కమ్యూనిస్టుల పోరాటం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడిందని చెప్పారు.

'గత ఎన్నికల్లో బూత్‌ల వారీగా బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు. ప్రైవేటు ఏజెన్సీలను పెట్టి సర్వేలు చేయించి క్రమపద్ధతిలో ఓట్లు తొలగిస్తున్నారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. 'ఎన్నికలు వేరు.. పేద ప్రజల ప్రాథమిక హక్కులు వేరు. ఇన్నాళ్లుగా పేదల హక్కుల కోసం కమ్యూనిస్టులు కొట్లాడుతున్నారు. ఎర్రజెండా కనిపిస్తే పేదవాడికి ఒక భరోసా' అని రేవంత్ రెడ్డి చెప్పారు. 'దేశానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్రమోదీ. మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు. పేద ప్రజల ఓటు హక్కును కమ్యూనిస్టులు కాపాడాలి' అని రేవంత్ రెడ్డి తెలిపారు. కేబినెట్ సహచరులతో చర్చించి.. సారంపల్లి మల్లారెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేస్తామని హామీ ఇచ్చారు.

0
0
Report

Bigg Boss Telugu 10 Salaries: బిగ్‌బాస్‌లో రోజుకు ఎంత సంపాదిస్తారో తెలుసా? వారానికి లక్షల్లో సంపాదన..ఆ ఇద్దరికే ఎక్కువ!

Hyderabad, Telangana:

Bigg Boss Telugu 10 Contestants Salaries: బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లడం.. అక్కడ గెలవడం ఏమో కానీ.. ఒక్కసారి బిగ్ బాస్ హౌస్‌కి వెళ్తే లైఫ్ సెట్ అయిపోతుందని చాలామంది అంటుంటారు. కేవలం షో నిర్వాహకులు ఇచ్చే రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా.. బిగ్ బాస్ ద్వారా లభించే విపరీతమైన క్రేజ్, పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానెల్స్ వ్యూవర్ షిప్ పెరిగి చేతినిండా సంపాదనతో లైఫ్ స్థిరపడుతుందని నమ్ముతారు.

ఇప్పటివరకు ఓటీటీతో కలుపుకుని 11 సీజన్లు (దాదాపు 220 మంది కంటెస్టెంట్స్) పూర్తయినప్పటికీ, విజేతలతో సహా చాలామంది ఆశించిన స్థాయిలో అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారనేది కూడా నిజం. అయినప్పటికీ, ఈ షో ఇచ్చే పారితోషికాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి.

కంటెస్టెంట్ల భారీ పారితోషికాలు
ఆదివారం (సెప్టెంబర్ 6) నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 10లో మొత్తం 16 మంది సభ్యులు అడుగుపెట్టారు. వీరిలో 10 మంది సెలబ్రిటీలు కాగా, ఆరుగురు సామాన్యులు ఉన్నారు. వీరి రెమ్యూనరేషన్స్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో అందరికంటే అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్‌గా 'జబర్దస్త్' రాంప్రసాద్ నిలిచారు. ఆయనకున్న క్రేజ్ దృష్ట్యా వారానికి ఏకంగా రూ.4.5 లక్షలు చెల్లిస్తున్నారని సమాచారం. ఆ తర్వాతి స్థానంలో ప్రముఖ యాంకర్ వర్షిణి నిలిచారు. 

ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ ఉన్న వర్షిణికి వారానికి రూ. 3.5 లక్షలు ఇస్తున్నారు. గత మూడు నాలుగు సీజన్ల నుండి బిగ్ బాస్ టీమ్ సంప్రదిస్తున్నా నో చెప్పిన వర్షిణి, ఈ సారి భారీ ఆఫర్‌తో అంగీకరించింది. 'గుప్పెడంత మనసు' సీరియల్ హీరో ముఖేష్ గౌడకు కూడా వారానికి రూ. 3 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు అందుతున్నట్లు సమాచారం.

ఇతర సెలబ్రిటీల పారితోషికాలు పరిశీలిస్తే, నటి దేబ్జానీ మోదక్ వారానికి రూ. 2.75 లక్షలు, నటుడు త్రిగుణ్ (ఆదిత్) రూ. 2.75 లక్షలు పొందుతున్నారు. 'జబర్దస్త్' నరేష్, నటి చైత్రా రాయ్‌లు వారానికి రూ.2.5 లక్షల చొప్పున అందుకుంటున్నారు. ఇక 'వినాయకుడు' ఫేమ్ కృష్ణుడు, టెంపర్ వంశీలు వారానికి రూ. 2 లక్షల చొప్పున తీసుకోగా, యాంకర్ సుధీర్ రెడ్డికి వారానికి రూ. 1.25 లక్షలు చెల్లిస్తున్నారు.

సామాన్యులకు జాక్‌పాట్ ఆఫర్
ఈ సీజన్‌లో సామాన్యులకు (కామనర్స్) కూడా మంచి ఆఫర్ దక్కింది. గత సీజన్ 'అగ్నిపరీక్ష' సమయంలో ఎటువంటి అమౌంట్ ఇవ్వలేదు. కానీ ఈసారి అగ్నిపరీక్షకు హాజరైన 15 మందికి ఒక్కొక్కరికి రూ.50,000 చొప్పున చెల్లించారు. అలాగే హౌస్‌లోకి ప్రవేశించిన ఆరుగురు సామాన్యులకు గత సీజన్ తరహాలోనే వారానికి రూ.70,000 చొప్పున పారితోషికం ఇవ్వనున్నారు. సెలబ్రిటీలతో సమానంగా క్రేజ్ పొందేలా ఈ సారి సామాన్యులు కూడా భారీ ఆదాయాన్నే ఆర్జిస్తున్నారు.

Also Read: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది.. ఊహించని సర్‌ప్రైజ్‌లతో 16 మంది కంటెస్టెంట్లు!

ALso REad; బిగ్‌బాస్ హౌస్‌లోకి ఒలింపిక్స్‌ బాక్సింగ్ ఛాంపియన్..రియాలిటీ షో చరిత్రలో తొలిసారిగా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Telangana Assembly Session: తాతా మధును తొలగించాలి.. కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలి: రేవంత్‌ రెడ్డి

Baddipadaga, Telangana:

MLC Thatha Madhu: 'సభ సంప్రదాయాలకు విలువ ఇవ్వాలి. ప్రతి సభ్యుడి గౌరవానికి భంగం కలిగించడం అంశం ఇది. స్పీకర్ ఛాంబర్ అంటే ఎనలేని గౌరవం ఉంది. చట్టసభ ఏదయినా స్పీకర్ పోస్ట్ అనేది గౌరవం ఉండేది. సభ్య సమాజం కించపర్చే విధంగా మట్కాడిన తీరుపై ఇక్కడ చర్చ ఇది. వారి అపవాదును మీరు ఎందుకు మోస్తున్నారు? మీ చర్చను బీఏసీలో మాట్లాడండి. కచ్చితంగా అవకాశం ఉంటది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. వారి నాయకుడు ఇలా మాట్లాడాలని చెప్పి పంపించాడా? అనాలోచితంగా మాట్లాడటం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. సభ్య సమాజం ఇబ్బందిపడేలా.. వాడలేని భాష వాడి ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధుపై తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఓ తీర్మానం ప్రవేశపెట్టగా రేవంత్ రెడ్డి ప్రసంగం చేశారు. 'వారి పార్టీ నాయకుడు దళితుల ఓట్లు వాడుకొని నమ్మించి మోసం చేసిన చరిత్ర వారిది. డిప్యూటీ సీఎం పోస్టులో ఉన్న తాటికొండ రాజయ్యను పీకేశాడు. దళిత బంధు ఇవ్బకుండా మోసం చేశాడు. నేరెళ్ల ఘటనలో దాఁకితులను లారీలతో తొక్కించాడు' అని రేవంత్ రెడ్డి వివరించారు. సీఎల్పీ నాయకుడిగా ఉండడం ఇష్టం లేక ఏ రకంగా చేసాడో మనం చూశామని తెలిపారు. 'ఇలా ఎన్నో రకాలుగా దళితులను మోసం చేశాడో  చూశాం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఇలా వినలేదు. ఇలాంటి వ్యక్తులను శాశ్వతంగా సభ్యత్వాలను రద్దు చేయాలి' అని రేవంత్‌ రెడ్డి చెప్పారు.

'అన్నీ సభల్లో చూశాను 20 ఏళ్లలో ఎక్కడ చూడలేదు, రాజ్యసభ తప్ప అన్నిటిలో చేశా. కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలి. సభ్యుడి చేత రాజీనామా చేయించాలి. మండలి చైర్మన్‌కు కూడా సూచిస్తున్నా. తొలింగించేలా నిర్ణయం తీసుకువాలని సూచిస్తున్నా' అని రేవంత్ రెడ్డి తెలిపారు.

పొన్నం ప్రభాకర్
అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రసంగం చేశారు. 'సభాపతిపై అనుచిత వ్యాఖ్యలపై వారి ప్రవర్తనపై సభలో చర్చ జరుగుతుంటే బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు. బీజేపీలో ఒక దళిత ఎమ్మెల్యేలు ఎవరు లేకపోతే దళితులకు ఏమి అయినా మాకు సంబధం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. 14 సార్లు గెలిచిన ఏఐసీసీ అధ్యక్షుడు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న ప్రదేశాన్ని శుద్ధి చేసిన సంస్కృతి బీజేపీది' అని పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు. సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీసం స్పందించే పరిస్థితి లేదని తెలిపారు. 'బీజేపీది ఫ్యూడలిస్ట్ పార్టీ.. మనువాద పార్టీ' అని విమర్శించారు.

0
0
Report

KTR Harish Rao Black Shirt: కేటీఆర్ తలకు గాయం..హరీశ్ రావు చొక్కా ఊడగొట్టారు..తెలంగాణ అసెంబ్లీలో రణరంగం!

Hyderabad, Telangana:KTR Harish Rao Assembly Black Shirt: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తంచేస్తూ నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వెళ్లడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాట, రణరంగం లాంటి వాతావరణంలో కేటీఆర్ తల, నుదురు, చేతికి గాయలైనట్లు తెలిపారు. హరీశ్ రావు, మరికొందరు శాసనసభ్యుల చొక్కాలు చిరిగిపోయాయి. ఈ క్రమంలో కేటీఆర్ గాయాల కోసం సూదిమందు తీసుకున్నారు.
0
0
Report
Advertisement

Ganesh Chaturthi 2026: వినాయక చవితి 2026 ఎప్పుడు జరుపుకోవాలి? సెప్టెంబరు 14 లేదా 15? తిథి, పూజా సమయం ఎప్పుడంటే?

Hyderabad, Telangana:

Ganesh Chaturthi 2026 Timing: భారతీయుల సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి అత్యంత ప్రాముఖ్యమైనది. పార్వతీపరమేశ్వరుల చిన్న కుమారుడైన విఘ్నేశ్వరుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జరుపుకొంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితి పండుగను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే, ప్రతి ఏటా లాగే ఈసారి కూడా పండుగను ఏ రోజున నిర్వహించుకోవాలి, పూజలకు ఏ సమయం ఉత్తమమైనది అనే విషయాలపై భక్తులలో కొంత క్లారిటీ లేకుండా సందేహాలు నెలకొన్నాయి.

ఈ ఏడాది వినాయక చవితి తిథి వివరాల్లోకి వెళితే.. భాద్రపద శుక్ల పక్ష చవితి తిథి సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం ఉదయం 7:06 గంటల (AM) నుండి ప్రారంభమై, మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15వ తేదీ మంగళవారం ఉదయం 7:44 గంటల (AM) వరకు కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ తిథి సమయం కారణంగా 2026 సంవత్సరంలో వినాయక చవితి పండుగను భక్తులు రెండు రోజుల పాటు జరుపుకునే అవకాశం లభించింది.

అయితే, అత్యధిక శాతం మంది భక్తులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం రోజునే ఈ పవిత్ర పండుగ పూజలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం ఇప్పటి నుంచే వినాయక బొమ్మలను ఎంతో ఉత్సాహంగా కొనుగోలు చేసి తమ ఇళ్లకు, పూజా మండపాలకు తరలిస్తున్నారు.

ఈసారి పండుగ సోమవారం రోజున రావడం భక్తులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే శనివారం, ఆదివారం, సోమవారం కలుపుకొని వరుసగా మూడు రోజుల పాటు సుదీర్ఘమైన సెలవులు లభించాయి. దీనితో పండుగ వాతావరణం అంతటా మరింత ఉత్సాహంగా మారనుంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 14వ తేదీన పండుగ చేసుకోలేని వారు, సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 7:44 గంటల వరకు తిథి అందుబాటులో ఉన్నందున, ఆ రోజు ఉదయం కూడా పూజా కార్యక్రమాలను జరుపుకోవచ్చు.

సాధారణంగా సెప్టెంబర్ 14న వినాయక ప్రతిమలను నిలిపి నాటి నుండి దాదాపు 11 రోజుల పాటు నిత్యం అత్యంత భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ భాద్రపద మాసం మొత్తం గణపతి ఆరాధనకు అంకితం చేస్తారు. ఈ మాసంలో గణేశ్‌ చతుర్థి రోజు నుండి ప్రారంభించి అనంత చతుర్దశి తిథి వరకు భక్తులు నిరంతరాయంగా గణనాథుడిని పూజిస్తూ ఉంటారు.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే అందించారు. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. ఈ సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధృవీకరించలేదు.

Also Read: 300 యేళ్ల తర్వాత అరుదైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే.. లగ్జరీ లైఫ్ వీళ్ల

Also Read: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి అదృష్ట యోగం! ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

KTR Harish Rao Black Shirt: తెలంగాణ అసెంబ్లీలో రణరంగం..కేటీఆర్ తలకు గాయం..ఉద్రిక్తతలో చిరిగిన హరీశ్ రావు చొక్క!

Hyderabad, Telangana:

KTR Harish Rao Assembly Black Shirt: అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ఉద్రిక్తత, తోపులాట తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ ప్రాంగణం వద్ద పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రభుత్వ వైఫల్యాలను నిరసించేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా నల్ల టీషర్టులను ధరించి బయలుదేరింది. 

ఈ దుస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని ఆరు గ్యారంటీలపై విమర్శనాత్మక నినాదాలు ముద్రించి ఉన్నాయి. అయితే, అసెంబ్లీ ప్రవేశ ద్వారం (గేట్ నంబర్ 1) వద్ద పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను నిలిపివేశారు. నల్ల చొక్కాలతో సభలోకి వెళ్లడం శాసనసభ నిబంధనలకు విరుద్ధమని పోలీసులు స్పష్టం చేస్తూ వారిని నిలువరించారు. నిరసనకారుల అరెస్టుతో లక్డీకాపూల్ పరిసర ప్రాంతాలు స్తంభించిపోగా, అసెంబ్లీ లోపల బీజేపీ భూ దందాలపై విచారణ డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగింది.

రోడ్డుపై బైఠాయింపు, నిలిచిపోయిన రవాణా వ్యవస్థ పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేట్ నంబర్ 1 వెలుపల ప్రధాన రహదారిపైనే వారంతా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ అకస్మాత్తు పరిణామంతో లక్డీకాపూల్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్స్, ఖైరతాబాద్ వంటి నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, సాధారణ ప్రజలు కిలోమీటర్ల మేర స్తంభించిపోయిన భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

బలప్రయోగం, గాయాలు, తీవ్ర నిరసనలు రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు చివరికి బలప్రయోగం చేయాల్సి వచ్చింది. కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఇతర ప్రతినిధులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి సమీపంలోని స్టేషన్లకు తరలించారు. ఈ తోపులాట ప్రక్రియలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తల, నుదురు, చేతికి స్వల్ప గాయాలైనట్లు చెప్పుకొచ్చారు. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు, మరికొందరు సభ్యుల చొక్కాలు చిరిగిపోయినట్లు సమాచారం.

ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వారి ఎంపీలు నల్ల టీషర్టులు ధరించి తిరగవచ్చని, కానీ ఇక్కడ తమను నిరోధించడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. మరోవైపు అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు సైతం 22ఏ భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ నిరసనకు దిగడంతో సభ వాయిదా పడింది.

Also REad: Madhuri Rathod: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయికి మాధురి బిగ్‌ షాక్!

Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు వరాల జల్లు..పీఆర్సీ, DA చెల్లింపునకు డేట్ ఫిక్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Mary Kom Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి ఒలింపిక్స్‌ బాక్సింగ్ ఛాంపియన్..రియాలిటీ షో చరిత్రలో ఇదే తొలిసారి!

Hyderabad, Telangana:

Mary Kom Bigg Boss 20: దేశవ్యాప్తంగా బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరించే ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' సరికొత్త సీజన్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిన్న ఒకేరోజు ఐదు విభిన్న భాషల్లో బిగ్ బాస్ సీజన్లు అత్యంత వైభవంగా ల్యాంచ్ అయ్యాయి. ఈ ప్రారంభోత్సవాలలో భాగంగా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 10 హౌస్‌లోకి 16 మంది కంటెస్టెంట్లను హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించారు. అదే సమయంలో.. తమిళం నుంచి విజయ్ సేతుపతి, కన్నడ నుంచి కిచ్చా సుదీప్, మలయాళం నుంచి మోహన్ లాల్ వారివారి బిగ్‌బాస్ సీజన్ లాంచ్ సందర్భంగా అందరూ కలిసి వీడియో కాల్‌లో మాట్లాడుకున్నారు. ఇది సంఘటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

మరోవైపు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 20 కూడా ఎంతో వైభవంగా ప్రారంభమైంది. అయితే, ఈ సీజన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, భారతదేశపు మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించడం. మేరీ కోమ్ హౌస్‌లోకి ప్రవేశించిన విధానం ఎంతో ప్రత్యేకంగా సాగింది. ఈ వేడుకకు ఆమె కుమారుడు స్వయంగా విచ్చేసి, బిగ్ బాస్ సెట్ వద్ద తన తల్లికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ రియాలిటీ షోలో పాల్గొనడంపై మేరీ కోమ్ బిగ్ బాస్ వేదికపై మాట్లాడుతూ.. "గృహిణిగా ఉండటం నా వ్యక్తిత్వంలో ఒక ముఖ్యమైన భాగం" అని ఎంతో వినమ్రంగా చెప్పారు. అథ్లెట్‌గా బాక్సింగ్ రింగ్‌లో అద్భుత విజయాలు సాధించిన ఆమె, ఇప్పుడు రియాలిటీ టీవీ స్టార్‌గా ఒక సరికొత్త పాత్ర పోషిస్తున్నారు. ఈ కొత్త పాత్రను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో మనం వేచి చూడాలి. ఈ షోలో ఆమె తన వ్యక్తిత్వాన్ని ఎలా నిరూపించుకుంటుందో చూడటం అత్యంత ఆసక్తికరంగా మారింది. హౌస్‌లో మేరీ కోమ్ వ్యక్తిత్వంలోని విభిన్న కోణాలను ప్రజలు తెలుసుకుంటారు, ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఆమెను ఏ కోణం నుండి ఇంటికి పంపారో దాని ఆధారంగా ప్రేక్షకులు ఆమె అసలు వ్యక్తిత్వాన్ని గమనించవచ్చు.

మేరీ కోమ్ హౌస్‌లోకి ప్రవేశించిన శుభ తరుణంలో, ప్రియాంక చోప్రా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సాధించిన విజయవంతమైన ప్రయాణానికి గాను బిగ్ బాస్ స్వయంగా ఆమెను అభినందించింది. హోస్ట్ సల్మాన్ ఖాన్ ఈ అభినందనల వీడియోను వేదికపై అందరికీ చూపించారు. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి దేశానికి ప్రాతినిధ్యం వహించిన మేరీ కోమ్‌ను స్వదేశంలో తక్కువ అంచనా వేయలేము. దేశం కోసం పోరాడిన ఈ వీరనారి, రింగ్ వెలుపల కూడా విజయం సాధించగలదని ఆశిద్దాం.

Also Read: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది.. ఊహించని సర్‌ప్రైజ్‌లతో 16 మంది కంటెస్టెంట్లు!

Also Read: భారత వెయిట్‌లిఫ్టర్ కీయా బెనర్జీకి చేదు అనుభవం.. నగ్న ఫొటోలుగా మార్ఫింగ్ వైరల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top