Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy501505

హెడ్‌లైన్: హైదరాబాద్‌లో ఘరానా దొంగ అరెస్ట్, 23 తులాల బంగారం స్వాధీనం

Jul 23, 2024 17:48:41
Hayathnagar_Khalsa, Telangana

వార్త: హయత్‌నగర్ పోలీసులు ఘరానా దొంగను అరెస్ట్ చేశారు. షేక్ అజీజ్ (కాకినాడ) గత 7 నెలల్లో 12 కేసులు, గతంలో 50 కేసులతో సంబంధం ఉన్నాడు. విలాసవంతమైన జీవనశైలి కోసం దొంగతనాలు చేసేవాడు. ప్రియదర్శిని కాలనీలో తాజా దొంగతనం చేశాడు. పోలీసులు 23 తులాల బంగారం, 2 లక్షల నగదు, కెమెరా, కారు స్వాధీనం చేసుకున్నారు. అతని లక్ష్యం తాళాలు వేసిన ఇళ్ళు, ఖరీదైన కార్లతో తిరిగేవాడు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 21, 2026 17:44:52
Davos, Platz:

RMZ Group Investment: పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ బృందం ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు శ్రమిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేయగా.. ఈ క్రమంలోనే ప్రముఖ కంపెనీ ఆర్‌ఎంజెడ్‌ గ్రూపు ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఏపీలో పది బిలియన్‌ డార్ల పెట్టుబడి పెడతామని ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఆర్‌ఎంజెడ్‌ గ్రూపు కీలక ఒప్పందం చేసుకుంది.

Also Read: YS Jagan: ఇక వైసీపీ కార్యకర్తలతో ఉంటా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసిపోతా: వైఎస్‌ జగన్‌

వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆర్‌ఎంజెడ్‌ గ్రూప్ ఒప్పందం చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయి మిక్స్‌డ్-యూజ్, డిజిటల్, పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించడంతో ఏపీలో వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ఆర్‌ఎంజెడ్‌ గ్రూపు ప్రకటించింది. నారా లోకేశ్‌, ఆర్‌ఎంజెడ్‌ గ్రూప్ చైర్మన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. విశాఖపట్టణాన్ని నెక్స్ట్-జనరేషన్ మిక్స్‌డ్-యూజ్, డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంతో రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు, లాజిస్టిక్స్ ఆధారిత అభివృద్ధిని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. ఈ అంశాలను ఆర్‌ఎంజెడ్‌ గ్రూప్‌ ప్రతినిధులకు ప్రభుత్వ బృందం వివరించడంతో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ అంగీకారం తెలిపింది.

Also Read: YS Jagan: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన ప్రకటన.. 2027 తర్వాత పాదయాత్ర

విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) పార్క్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తోంది. సుమారు 50 ఎకరాల్లో గరిష్టంగా 10 మిలియన్ చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసి, గ్లోబల్ సంస్థలను ఆకర్షించడంతో విశాఖలోని జీసీసీ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఉంది. విశాఖపట్నం ప్రాంతంలో దశలవారీగా గరిష్టంగా 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని ఆర్‌ఎంజెడ్‌ గ్రూప్ ప్రణాళికలు రూపొందించింది. దీనికోసం విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్-జనరేషన్ డిజిటల్, ఏఐ వర్క్‌లోడ్స్‌కు మద్దతు లభిస్తుంది.

Also Read: Medaram Jathara: మేడారం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏం ప్రకటించిందో తెలుసా?

రాయలసీమ ప్రాంతంలోని టెకులోడు వద్ద సుమారు 1,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఆర్‌ఎంజెడ్‌ గ్రూప్ ప్రతిపాదిస్తోంది. ఇది పరిశ్రమల తయారీ, గిడ్డంగుల నిర్వహణ, లాజిస్టిక్స్ కార్యకలాపాలకు కేంద్రంగా నిలువనుంది. ఈ అన్ని ప్రాజెక్టులు కలిపి రాబోయే ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడిని ఆర్‌ఎంజెడ్‌ సంస్థ సూచిస్తోంది. ఈ పెట్టుబడులతో ఐటీ, డేటా సెంటర్లు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాల్లో సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 21, 2026 11:08:36
:

YS Jagan Padayatra: కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క వర్గానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతామని తెలిపారు. జెండా పట్టుకుని బాధితుల తరపున పోరాడుతున్నామని చెప్పారు. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలని పార్టీ శ్రేణులకు వైఎస్‌ జగన్‌ సూచించారు.

Also Read: Medaram Jathara: మేడారం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏం ప్రకటించిందో తెలుసా?

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక ప్రసంగం చేశారు. 'కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. జగన్‌ ఉంటే ఎలా మేలు జరిగేదన్నది ఆలోచిస్తున్నారు. ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమే. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతా' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన ప్రకటన చేశారు.

Also Read: Phone Tapping: బొగ్గు కుంభకోణంపై డైవర్షన్‌ కోసమే రేవంత్‌ రెడ్డి సరికొత్త డ్రామా: కేటీఆర్‌

ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని.. ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెడుతున్నామని.. ఇక ముందు వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇలా సమావేశమవుతామని తెలిపారు. 'వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. పరిపాలన చాలా అన్యాయంగా జరగుతోంది' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

Also Read: Kavitha: తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ ప్రశాంత్‌ కిశోర్‌.. కవిత పార్టీకి సేవలు

రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావరంతో వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనంతా అబద్దాలు మోసాలు.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని వివరించారు. పోలీస్‌ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే కూటమి ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందని వైఎస్‌ జగన్‌ తెలిపారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పలావ్‌ కూడా లేకుండా చేశారని అంతా బాధపడుతున్నారని వివరించారు.

Also Read: Viral Pic: ఈ 'స్టార్ యువకులకు వధువు కావలెను'.. పెళ్లి కాని యువకుల బ్యానర్ ఫొటో వైరల్‌

'వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్‌ వచ్చింది. అన్ని కష్టాలున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది ప్రతిదీ చేసి చూపాం. చంద్రబాబు పాలన మళ్లీ తిరిగి చూసిన తర్వాత, ప్రజలంతా అన్ని వాస్తవాలు గుర్తించారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వారు ఉండరని అంతా గుర్తించారని చెప్పారు.

'సూపర్‌సిక్స్‌ లేదు. సూపర్‌ సెవెన్‌ లేదు. అన్నీ మోసాలే. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. గవర్నమెంటు స్కూళ్లు పూర్తిగా కళ తప్పాయి. పిల్లలకు టోఫెల్‌ క్లాస్‌లు లేవు. గోరుముద్ద కూడా క్వాలిటీ లేకుండా పోయింది. పిల్లల ప్రాణాలు పోతున్నాయి' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు గవర్నమెంట్‌ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం ఎమ్మెల్యేల నుంచి కూడా రికమెండేషన్లు ఉండేవని.. ఆ స్థాయిలో గవర్నమెంటు స్కూళ్లకు డిమాండ్‌ ఉండేదని గుర్తుచేశారు. అదే ఇప్పుడు దాదాపు 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంటు స్కూళ్ల నుంచి చదువు మానేశారని వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 21, 2026 08:06:03
Hyderabad, Telangana:

Samsung Galaxy A57 Specifications: సాంసంగ్‌ కంపెనీ మార్కెట్‌లోకి Samsung Galaxy A57 మొబైల్ విడుదల చేయబోతోంది. విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన వివరాలు MIIT సర్టిఫికేషన్‌లో కూడా పేర్కొన్నారు. ఇది  120Hz రిఫ్రెష్ రేట్‌తో OLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా స్లిమ్‌గా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో OLED డిస్‌ప్లేతో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లీక్‌ అయిన ఇతర వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ Samsung Galaxy A57 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ లాంచింగ్‌కి ముందే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.  సర్టిఫికేషన్ జాబితాలో అందించిన స్పెషిఫికేషన్స్‌ వివరాల్లోకి వెళితే.. 6.6-అంగుళాల FullHD+ డిస్ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో OLED ప్యానెల్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన  ఆక్టా-కోర్ Exynos 1680 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కంపెనీ ఈ మొబైల్‌ను కేవలం ఒక స్టోరేజ్‌ వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 256GB స్టోరేజ్‌ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతోంది.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

Samsung Galaxy A57 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో లాంచ్‌ కాబోతోంది. ఇది Samsung One UI 8 స్కిన్ అందుబాటులోకి రానుంది. ఇక ఈ మొబైల్ వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన లెన్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు అదనంగా 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా 5-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఫ్రంట్‌ భాగంలో సెల్ఫీ కోసం ప్రత్యేకమైన 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. దీంతో పాటు సెక్యూరుటీ కోసం ఇందులో ప్రత్యేకంగా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా అందిస్తోంది. 

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రత్యేకంగా USB టైప్-Cతో పాటు స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. దీనిని కంపెనీ  IP67 రేటింగ్ కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ 161.5 x 76.8 x 6.9mm కొలతలతో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన అధికారక ప్రకటనను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
GSG Shekhar
Jan 21, 2026 07:44:28
Jagtial, Telangana:

Telangana Municipal Elections Updates: జగిత్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి మొదలైంది. వచ్చే నెలలో మున్సిఫోల్స్ జరుగుతాయన్న సమాచారంతో.. నేతల మధ్య సీట్ల లొల్లి నడుస్తోంది. ప్రస్తుతం జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యేగా డాక్టర్ సంజయ్ కుమార్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి.. అధికార పార్టీలో చేరిపోయారు. ఇటీవల ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ వివరణ కోరారు. దాంతో ఆయన తాను ఇంకా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనంటూ ప్రకటించుకున్నారు. అనాధికారికంగా మాత్రం.. కాంగ్రెస్ నేతలతోనే కలిసి తిరుగుతున్నారు.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తుండటంతో.. తన వర్గానికే టికెట్లు ఇప్పించుకునే పనిలో ఉన్నారు. కానీ.. మొదట్నుంచి కాంగ్రెస్ లో కొనసాగుతున్న మాజీమంత్రి జీవన్ రెడ్డి మాత్రం.. సంజయ్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి.. కాంగ్రెస్ పార్టీ భీఫామ్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ మారారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అధికార పార్టీలో చేరిపోయారు. అప్పట్లో డాక్టర్‌ సంజయ్ చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తన ఇలాఖాలో ఎమ్మెల్యే సంజయ్‌ను ఎలా చేర్చుకుంటారంటూ పార్టీ పెద్దలను నిలదీశారు. ఒకనొక దశలో పార్టీనుంచి బయటకు వెళ్లిపోతానంటూ హైకమాండ్ పెద్దలకు వార్నింగ్ ఇచ్చారు. చివరకు పార్టీ నేతలు రంగంలోకి దిగి.. సర్ధిచెప్పడంతో వెనక్కి తగ్గారు. కానీ కొద్దిరోజులుగా మాత్రం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. అందుకే మరోసారి డాక్టర్ సంజయ్‌ను జీవన్ రెడ్డి టార్గెట్‌ చేసినట్టు ప్రచారం సాగుతోంది.. 
 
ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫైట్ ఇద్దరి మధ్య మంటలు రాజేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటూ ప్రకటించుకున్న డాక్టర్ సంజయ్ కుమార్.. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ ఎలా ఇస్తారంటూ  జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీతో ఎమ్మెల్యే సంజయ్ కి సంబంధమే లేదని ఆయనే అంటున్నారు. కేవలం జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నాను అని ఎమ్మెల్యే చెబుతున్నారు. అలాగే తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్టు అఫిడవిట్ కూడా సమర్పించారు. అలాంటప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలా అవుతారంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలల్లో జోక్యాన్ని సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలలో అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడానికి సంజయ్ ఎవరంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ అవుతోంది. 
 
ఇక్కడితోనే ఈ వ్యవహారాన్ని జీవన్ రెడ్డి వదిలిపెట్టలేదు. అసలు జగిత్యాల మున్సిపల్ లో ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జగిత్యాలలోని బీట్ బజార్ లో ఉన్న వ్యవసాయ సమీకృత వెజ్- నాన్ వెజ్ మార్కెట్లో ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ నిల్వ ఉంచిన సిమెంట్, ఇసుకలను ఎలా నిల్వ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది సమీకృత మార్కెటా లేక ఒక కాంట్రాక్టర్ గోదామా అని మండిపడ్డారు. గతంలో కేటీఆర్ చేతులమీదుగా మార్కెట్ ను ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యే రాజ్యమే నడుస్తోంది. అప్పుడు ఆయన ఎమ్మెల్యే ఇప్పుడు కూడా ఆయనే ఎమ్మెల్యే.. అభివృద్ధి ప్రదాత చేస్తున్న అభివృద్ధి ఇది.. ఇదే నా  అభివృద్ధి అని ప్రశ్నిస్తున్నారు.. 
 
అయితే జీవన్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే ఇబ్బందిగా మారుతోంది. ఆయన తీరు సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. దాంతో జీవన్ రెడ్డికి చెక్ పెట్టాలని ఎమ్మెల్యే సంజయ్ వర్గం కోరుతున్నట్టు తెలుస్తోంది. కానీ జీవన్ రెడ్డి మాత్రం.. తన తీరు మార్చకోవడం లేదు. గతంలోనే మంత్రిగా, ఎంపీ, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనేకమార్లు అవకాశం ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జగిత్యాలలో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ ఆయన ఓడారు. ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు జరిగితే.. నిజామాబాద్ ఎంపీగా అవకాశం కల్పించారు. అక్కడ ఓడిపోయారు. ఇప్పటికి డజన్‌కు పైగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు దక్కాయి. ఇన్ని అవకాశాలు ఎవరికి దక్కలేదు. అయినప్పటికీ.. కన్నతల్లి లాంటి సొంత పార్టీపై విషం చిమ్మితే ఎలా అని పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి.. జగిత్యాల లీడర్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. 75 ఏళ్ల వయసులో ఇంత చాదస్థం ఇంత చాదస్థం అవసరమా అని ప్రశ్నించినట్టు టాక్ వినిపిస్తోంది. 
 
మొత్తంమీద మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డిని లైట్ తీసుకోమంటూ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది. ఇకమీదట జీవన్ రెడ్డిని పూర్తిగా పక్కన పెట్టాలంటూ జగిత్యాల నేతలకు కూడా సూచించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు అవకాశాలు దక్కాయి.. భవిష్యత్తులో చాన్స్ ఇద్దామని పార్టీ పెద్దలు భావించారు. కానీ ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎట్టా అని పార్టీ హైకమాండ్ ప్రశ్నించిందట. ఇయితే ఇన్నాళ్లు ఎమ్మెల్యే సంజయ్ ను విమర్శించొద్దని హెచ్చరించినా ఆయన మాత్రం తగ్గడం లేదు. దాంతో ఆయనకు చెక్ పెడితేనే జగిత్యాలలో కాంగ్రెస్ కు భవిష్యత్తు అని టీపీసీసీ వర్గాలు సైతం అభిప్రాయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి పెద్దాయన చాదస్థం వీడి.. పార్టీ లైన్‌లో పనిచేస్తారా.. లేక మారేది లేదు అన్నట్టుగా వ్యవహారిస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందే..

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 21, 2026 06:43:30
Hyderabad, Telangana:

Motorola Edge 60 Fusion 5G Price Cut: మిడ్-రేంజ్ విభాగంలో మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే మోటరోలా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్స్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే విడుదలైన స్మార్ట్‌ఫోన్స్‌ అత్యంత చీప్‌ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా  Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేవారికి ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన ఆఫర్స్‌ అందిస్తోంది. రిపబ్లిక్‌ డే సేల్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే ఎన్నో రకాల అద్భుతమైన ఆఫర్స్‌ లభిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్‌ ఏంటో? ఇది ఎన్ని రకాల ఫీచర్స్‌తో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే, ఇది 6.67 అంగుళాల pOLED క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1.5K (1220 x 2712 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇందులో డిస్ల్పే ప్రోటక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iను కూడా అందిస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (MediaTek Dimensity 7400 - 4nm) ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 

ప్రస్తుతం మార్కెట్‌లో రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. మొదటిది 256GB స్టోరేజ్‌తో పాటు రెండవది 512GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 15 (హలో UI) ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో లభిస్తోంది. ఇది 3 ఏళ్ల OS అప్‌డేట్స్,  4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా అందిస్తోంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన కెమెరా 50MP సోనీ LYT-700C సెన్సార్‌తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇది మాక్రో, డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. అలాగే ఫ్రంట్‌ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా (4K వీడియో రికార్డింగ్ సపోర్ట్) కూడా అందుబాటులో ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన 5500mAh బ్యాటరీతో లభిస్తోంది. ఇందులో ప్రత్యేకంగా 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్.!

ప్రస్తుతం మార్కెట్‌లో వేరియంట్స్‌ను బట్టి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే, 8GB + 256GB స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌ ధర మార్కెట్‌లో సుమారు రూ.21,999 నుంచి రూ.22,999 వరకు ధరతో లభిస్తోంది. అలాగే రెండవ వేరియంట్‌ 12GB + 256GB స్టోరేజ్‌తో సుమారు రూ.23,999 నుంచి రూ.24,999 ధరల్లో లభిస్తోంది. అయితే, దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం మొదిటి వేరియంట్‌పై స్పెషల్ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ.27,999 కాగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్స్‌తో కేవలం రూ. 23,999కే అందుబాటులో ఉంది. ఇక రిపబ్లిక్‌ డే సేల్స్‌లో యాక్సిస్‌  బ్యాంక్‌, SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేస్తే రూ.3,048 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్చేంజ్‌ బోనస్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ.20 వేల బోనస్‌తో కేవలం రూ.3,999కే పొందవచ్చు.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్.!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 20, 2026 13:35:42
Hyderabad, Telangana:

Allu Arjun Mana Shankara Vara Prasad Movie Review: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన అల్లు అర్జున్, చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అభినందనలు తెలిపారు.

జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తాజాగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంపై బన్నీ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బన్నీ రివ్యూ హైలైట్స్..
"బాస్ ఈస్ బ్యాక్! చిరంజీవి గారు మరోసారి స్క్రీన్ పై వెలిగిపోయారు. ఆయన ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది" అని మెగాస్టార్ మ్యాజిక్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొనియాడారు.

వెంకటేష్ & నయనతార: "వెంకటేష్ గారు తన నటనతో అదరగొట్టారు. నయనతార చాలా అందంగా కనిపించారు" అంటూ ప్రధాన తారాగణాన్ని ప్రశంసించారు.

అనిల్ రావిపూడిపై ప్రశంసలు: దర్శకుడు అనిల్ రావిపూడిని 'సక్సెస్ మిషన్' గా అభివర్ణించారు. "సంక్రాంతికి వస్తారు.. హిట్ కొడతారు.. రిపీట్! అనిల్ గారు మీ సక్సెస్ కు అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు.

సంగీతం: భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ సూపర్ గా ఉందని బన్నీ కితాబిచ్చారు.

జపాన్‌లో పుష్ప-2 హవా.. అట్లీతో కొత్త ప్రాజెక్ట్!
మరోవైపు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి జపాన్ లోని చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించి వచ్చారు. అక్కడ విడుదలైన 'పుష్ప 2' ప్రమోషన్లలోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్, దర్శకుడు అట్లీతో సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మరోవైపు 'మాస్టర్' డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా బన్నీ ఒక సినిమాను అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

వరుస హిట్లు అందుకుంటున్న అనిల్ రావిపూడికి, మెగాస్టార్‌కు అల్లు అర్జున్ అభినందనలు తెలపడం మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. ఈ సినిమా వసూళ్ల పరంగా మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: 500 Note Ban: రూ.500 నోట్లు రద్దు కానున్నాయా? ఏటీఎంల నుంచి మాయమవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే?

Also Read: 8th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్..మళ్లీ పెరగనున్న DA! ఎంతమేర పెరుగుతుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 20, 2026 13:10:59
Hyderabad, Telangana:

500 Note Ban News: గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్‌లో రూ.500 నోట్ల భవిష్యత్తుపై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో రూ.500 నోట్ల రద్దు గురించి జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉందో వివరిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కీలక స్పష్టతనిచ్చింది. 

వైరల్ అవుతున్న వార్త ఏమిటి?
మార్చి 2026 తర్వాత ఏటీఎంలలో రూ.500 నోట్లు అందుబాటులో ఉండవనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరోసారి డీమోనిటైజేషన్ (Demonetization 2.0) కి సిద్ధమవుతున్న క్రమంలో.. ఇకపై దేశంలో రూ.100 నోటే అతిపెద్ద కరెన్సీగా ఉండబోతోదనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నెట్టింట విపరీతంగా షేర్ కావడంతో, పదేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు కష్టాలను గుర్తుచేసుకుంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ నివేదిక..
ఈ పుకార్లను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తీవ్రంగా ఖండించింది. 500 రూపాయల నోట్లను నిషేధించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని PIB స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అటువంటి తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరింది. కరెన్సీ మార్పుల గురించి ఆర్‌బీఐ (RBI) గానీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదని తేల్చి చెప్పింది.

తప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేస్తూ, ఒక స్క్రీన్ షాట్‌ను కూడా PIB షేర్ చేసింది. ప్రభుత్వ విధానాలు లేదా ఆర్థిక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం కోసం కేవలం అధికారిక వెబ్‌సైట్లు, ధ్రువీకరించబడిన ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాలని సూచించింది.

కాబట్టి, మీ దగ్గర ఉన్న రూ.500 నోట్లు పూర్తి సురక్షితం. వాటి రద్దు గురించి వస్తున్న వార్తలు కేవలం సృష్టించిన పుకార్లు మాత్రమే. ఇటువంటి మెసేజ్‌లను ఫార్వార్డ్ చేయకుండా ఉండటం బాధ్యతాయుతమైన పని.

Also Read: 8th Pay Commission DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్..మళ్లీ పెరగనున్న DA! ఎంతమేర పెరుగుతుందంటే?

Also Read: Megastar MSG Movie Home Set: 'మన శంకర వరప్రసాద్' గారి ఇంద్ర భవనం..రూ.5 కోట్లతో అద్భుతమైన సెట్..హోమ్ టూర్‌పై ఒకసారి లుక్కేయండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
AMAruna Maharaju
Jan 20, 2026 11:14:53
Hyderabad, Telangana:

India Vs Pakistan: టోర్నీ ఏదైనా స‌రే భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయంటే వ‌చ్చే కిక్కే వేరు. ఇరు దేశాల అభిమానులే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ సైతం భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు అన్న సంగ‌తిని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక ఇప్పుడు అంద‌రి దృష్టి ఫిబ్ర‌వ‌రి 15 పైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

అయితే.. అదే రోజు మ‌రో భార‌త్ వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ కూడా జ‌ర‌గ‌నుంది. తొలి మ్యాచ్ లో పురుషుల జ‌ట్లు త‌ల‌ప‌డ‌నుండ‌గా రెండో మ్యాచ్ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో భాగంగా జ‌ర‌గ‌నుంది. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ విడుద‌ల చేసింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 13 నుంచి 22 వ‌ర‌కు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. భార‌త మ‌హిళ‌ల‌-ఏ జ‌ట్టుతో పాటు మ‌రో ఏడు జ‌ట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 13న జ‌ర‌గ‌నుంది. యూఏఈ, నేపాల్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

8 జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు. భార‌త్‌, పాకిస్తాన్‌ల‌తో పాటు యూఏఈ, నేపాల్ జ‌ట్లు గ్రూప్‌-ఏలో ఉండ‌గా, బంగ్లాదేశ్, శ్రీలంక‌, మ‌లేషియా, థాయిలాండ్ జ‌ట్లు గ్రూప్‌-బిలో ఉన్నాయి. ఇక భార‌త-ఏ జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్ ను ఫిబ్ర‌వ‌రి 13న యూఏఈతో ఆడ‌నుంది. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్‌తో ఫిబ్ర‌వ‌రి 15న త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ భార‌త కాల‌మానం ప్రకారం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ షెడ్యూల్ ఇదే..
* ఫిబ్రవరి 13న – పాకిస్తాన్ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 13న – భార‌త్ vs యుఎఇ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 14న – మలేషియా vs థాయిలాండ్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 14న – బంగ్లాదేశ్ vs శ్రీలంక (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 15న – యుఏఈ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 15న – భారత్ vs పాకిస్తాన్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 16న – శ్రీలంక vs మలేషియా (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 16న – బంగ్లాదేశ్ vs థాయిలాండ్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 17న – భారత్ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 17న – పాకిస్తాన్ vs యుఎఇ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 18న – బంగ్లాదేశ్ vs మలేషియా (ఉదయం 9:30 గంటలకు)
* ఫిబ్రవరి 18న – శ్రీలంక vs థాయిలాండ్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 20న – సెమీ-ఫైనల్ 1 (A1 vs B2) (ఉదయం 9:30 గంటలకు)
* ఫిబ్రవరి 20న – సెమీ-ఫైనల్ 2 (B1 vs A2) (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 22న – ఫైనల్ (మధ్యాహ్నం 2 గంటలకు)

Also Read: WPL 2026: డ‌బ్ల్యూపీఎల్‌లో స్మృతి మంధాన సేన‌ దూకుడు.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ..!

Also Read: Pan Card Loan: బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. పాన్ కార్డ్‌తో రూ. 5 లక్షల లోన్.. 24 గంటల్లో డబ్బు మీ అకౌంట్‌లో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 20, 2026 11:13:12
Hyderabad, Telangana:

8th Pay Commission DA Hike 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త సంవత్సరం 2026 కానుకగా డియర్నెస్ అలవెన్స్ (DA) పెరగనుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులు, AICPI-IW గణాంకాలను బట్టి చూస్తే, ఈసారి డీఏ పెంపు ఎంత ఉండబోతోంది? దీనివల్ల జీతాలు ఏ మేరకు పెరుగుతాయి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం ఏడాదికి రెండుసార్లు (జనవరి, జూలై) కరువు భత్యాన్ని (DA) సవరిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగులు 58% డీఏ పొందుతున్నారు.

డీఏ పెంపు అంచనాలు (AICPI-IW డేటా ఆధారంగా)
కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నవంబర్ 2025 వరకు ఉన్న ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) గణాంకాల ప్రకారం.. 

నవంబర్ ఇండెక్స్: 148.2 పాయింట్లు.

పెరుగుదల: 59.93% డీఏకి సమానమైన పాయింట్లు నమోదయ్యాయి.

అంచనా: డిసెంబర్ గణాంకాలు కూడా కలిపితే, డీఏ 2% నుండి 3% వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం డీఏ 60% లేదా 61% కి చేరుకోవచ్చు.

ఎప్పుడు ప్రకటిస్తారు?
సాధారణంగా జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపును మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో (హోలీ పండుగ తర్వాత) కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. ప్రకటన ఎప్పుడు వచ్చినా, పెంపు మాత్రం జనవరి 1, 2026 నుండి వర్తిస్తుంది. కాబట్టి గడిచిన నెలల వ్యత్యాసాన్ని బకాయిల రూపంలో చెల్లిస్తారు.

8వ వేతన సంఘం ప్రభావం:
నిజానికి 7వ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ 31, 2025తో ముగిసింది. 8వ వేతన సంఘం జనవరి 2026 నుండి అమల్లోకి రావాల్సి ఉన్నా, ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల, ప్రస్తుతం ఈ పెంపు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారమే కొనసాగుతోంది.

జనవరి 30 లేదా 31న విడుదలయ్యే డిసెంబర్ నెల AICPI-IW డేటాతో డీఏ పెంపుపై పూర్తి స్పష్టత వస్తుంది. 3% పెంపు లభిస్తే ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Megastar MSG Movie Home Set: 'మన శంకర వరప్రసాద్' గారి ఇంద్ర భవనం..రూ.5 కోట్లతో అద్భుతమైన సెట్..హోమ్ టూర్‌పై ఒకసారి లుక్కేయండి!

Also REad: Akshay Kumar Car Accident: హీరో అక్షయ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం..కారులో అక్షయ్, ట్వింకిల్..ఆటోని ఢీకొని గాల్లోకి అమాంతం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 20, 2026 10:48:53
Medaram, Telangana:

Medaram Jathara 2026: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర 28 నుంచి 1వ తేదీ వరకు జరగనుండగా ఈ జాతరకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే భక్తులు లక్షలాది సంఖ్య అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలివస్తుండగా.. భక్త జనుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జారత ముందు నుంచే ప్రత్యేకంగా బస్సులు నడుపుతామని ప్రకటించింది. ఈనెల 25 నుంచి 1వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

Also Read: Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?

2024 జాతరలో ఆర్టీసీ 3,491 బస్సులు నడిపి 16.82 లక్షల మంది ప్రయాణికులను తరలించగా.. ఉచిత బస్సు పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ జాతరకు 20 లక్షల సంఖ్యలో ప్రయాణికులు వెళ్తారని ఆర్టీసీ అంచనా వేసింది. తదనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మేడారం జాతరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తూనే.. ప్రత్యేక బస్సులు నడపనుంది. ఆర్టీసీ మేడారం జాతరకు మొత్తం 4,000 బస్సులను నడపనుంది. ఈ బస్సులు అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ సిటీ నుంచి మొత్తం 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లతో ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.

Also Read: Viral Pic: ఈ 'స్టార్ యువకులకు వధువు కావలెను'.. పెళ్లి కాని యువకుల బ్యానర్ ఫొటో వైరల్‌

మేడారం నుండి భక్తులను రవాణా చేయడానికి మేడారంలో 50 ఎకరాల భూమిలో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. భక్తులు తమ గమ్యస్థానాల ప్రకారం సులభంగా బస్సుల్లో ఎక్కేందుకు మొత్తం 9 కిలో మీటర్ల పొడవు కలిగిన 50 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్లలో ఒకేసారి సుమారు 20,000 మంది ప్రయాణికులను నిలుపుకునే ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ సంస్థ తెలిపింది. తాత్కాలిక బస్ స్టేషన్‌లో ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతం, సిబ్బంది విశ్రాంతి గదులు, నిర్వహణ కార్యకలాపాలు మొదలైన వాటి కోసం 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. మేడారం, కామారం ప్రాంతాలలో సుమారు వెయ్యి బస్సుల పార్కింగ్‌కు వీలుగా 25.76 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం పార్కింగ్ ప్రాంతం అభివృద్ధి చేశారు. బస్సుల చిన్నపాటి నిర్వహణ సమస్యలు, మార్గమధ్యలో బస్సులు నిలిచిపోతే అత్యవసర సేవల కోసం 11 గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు, 2 క్రేన్లు, 1 ట్రాక్టర్‌ను ఏర్పాటు చేశారు.

Also Read: Kavitha: తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ ప్రశాంత్‌ కిశోర్‌.. కవిత పార్టీకి సేవలు

జోన్లవారీగా..
ప్రత్యేక బస్సులను నడిపే కేంద్రాల నుంచి మేడారం జాతర ప్రాంతం వరకు ఉన్న ప్రయాణ మార్గాలను 11 జోన్లుగా విభజించి 15 జీపులు, 8 మోటర్ సైకిల్‌లను ప్రత్యేకమైన పెట్రోలింగ్ వ్యవస్థను ఆఫీసర్ల పర్యవేక్షణలో బస్సులు మార్గమధ్యలో ఆగకుండా చర్యలు తీసుకున్నారు. మార్గమధ్యలో ఉన్న 7 ప్రైవేట్ పెట్రోల్ బంకుల వద్ద బస్సులకు డీజిల్ టాప్-అప్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. మేడారం తాత్కాలిక బస్ స్టేషన్‌లో, 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ట్రాఫిక్‌ను సమీపంగా పర్యవేక్షించేందుకు, మొత్తం 10,000 మంది వారం రోజులు పనిచేయనున్నారు.

హనుమకొండ నుంచి తాడ్వాయి వరకు మార్గంలో ఉన్న కల్వర్టులు, ట్యాంక్‌బండ్‌లు, గుండ్ల వాగు, జలగలాంచ వాగు వంటి కీలక ప్రాంతాల్లో బస్సులకు మార్గనిర్దేశం చేయడానికి గార్డులను ఏర్పాటు చేశారు. మేడారం తాత్కాలిక బస్ స్టేషన్‌లో ట్రాఫిక్ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక కమెండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. తాత్కాలిక బస్ స్టేషన్‌లో 76 క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ తెలిపింది.

సౌకర్యాలు
తాత్కాలిక బస్ స్టేషన్‌లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు ఏర్పాటు. పూర్తిగా సన్నద్ధమైన అంబులెన్సులు, వైద్యులు, మందులతో కూడిన వైద్య శిబిరం కూడా ఏర్పాటుచేశారు. సిబ్బందికి స్టాఫ్ క్యాంటీన్ ఏర్పరిచి భోజన సదుపాయం కల్పించారు.

హనుమకొండ నుంచి మేడారం వరకు బస్సుల సజావుగా రాకపోకలు జరగడానికి ములుగు, వరంగల్ హనుమకొండ జిల్లాల పోలీసులు, జిల్లా పరిపాలనలతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. క్లర్కులు, డ్రైవర్లు, కండక్టర్లు, విధులు నిర్వర్తించేందుకు గుర్తించిన అన్ని సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రైవేటు వాహనాలలో ప్రయాణించడంతో దూరంగా పార్కింగ్ చేయడం, అసౌకర్యం కలుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
AMAruna Maharaju
Jan 20, 2026 10:32:12
Hyderabad, Telangana:

Rs 345 Crore Flyover Project Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు అదిరిపోయే శుభవార్త. జీహెచ్‌ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్యను తప్పించేందుకు మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రానుంది. దీంతో సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వెళ్లే వెహికిల్స్‌ సిగ్నల్‌ ఫ్రీగా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టును 345 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. 

హై సిటీ-హైదరాబాద్‌ సిటీ ఇన్నోవేటివ్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మేటివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్‌ కింద 6 లేన్లతో ఫ్లై ఓవర్‌ పనులు త్వరలోనే షురూ కానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం టెండర్లు  ఆహ్వానించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాటేదాన్‌ జంక్షన్‌ వద్ద మూడు లేన్లతో డౌన్‌ర్యాంప్‌ ఉంటుంది. టెండర్‌ ద్వారా ప్రాజెక్ట్‌ దక్కించుకునే ఏజెన్సీయే సర్వే, డిజైన్, డ్రాయింగ్స్, నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ జరిగినప్పటి నుంచి రెండు సంవత్సరాల్లో పనులు పూర్తి కావాలి. 

యుటిలిటీ షిఫ్టింగ్, ఫుట్‌పాత్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, సైనేజీలు, లైటింగ్, పేవ్‌మెంట్‌ మార్కింగ్స్‌ తదితర పనులు కూడా చేయాలి. మెట్రోకు సమాంతరంగా.. ఎయిర్‌పోర్ట్‌ మెట్రోలైన్‌కు పక్క నుంచి ఈ ఫ్లై ఓవర్‌ రానుంది. ఫ్లై ఓవర్‌ కంటే మెట్రోమార్గం ఎక్కువ ఎత్తులో ఉంటుంది. దీంతోపాటు టీకేర్‌ కాలేజ్‌ జంక్షన్, గాయత్రినగర్‌ జంక్షన్, మంద మల్లమ్మ జంక్షన్‌ల మీదుగా ఆరు లేన్లతో మరో ఫ్లైఓవర్‌ పనులకు టెండర్ల గడువు ముగిసింది. టెండర్లు ఖరారు కావాల్సి ఉంది.    

ఈ ఫ్లైఓవర్‌ పూర్తయితే.. విమానాశ్రయానికి వెళ్లేవారు మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్‌ జంక్షన్‌ల వంటివాటి వద్ద వాహనాలను ఆపకుండానే వెళ్లిపోవచ్చు. ఇరు వైపులా సాఫీగా ప్రయాణం సాగుతుంది. అంతేగాక, షాద్‌నగర్‌తో పాటు మహబూబ్‌నగర్, అత్తాపూర్, మెహదీపట్నం వెళ్లే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 6 లేన్లతో ఫ్లై ఓవర్‌ పనులు పూర్తయితే వాహనదారులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

Also Read: Pan Card Loan: బ్యాంక్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. పాన్ కార్డ్‌తో రూ. 5 లక్షల లోన్.. 24 గంటల్లో డబ్బు మీ అకౌంట్‌లో..!

Also Read: WPL 2026: డ‌బ్ల్యూపీఎల్‌లో స్మృతి మంధాన సేన‌ దూకుడు.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన ఆర్సీబీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 20, 2026 09:19:27
Hyderabad, Telangana:

Kohli Rohit BCCI Contract Status: భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ (BCCI) షాక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ చేసిన తాజా సిఫార్సులు అమలైతే, వీరిద్దరి కాంట్రాక్ట్ హోదా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన వార్షిక రిటైనర్‌షిప్ కాంట్రాక్ట్ వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల హోదాలను మార్చే దిశగా చర్చలు జరుగుతున్నాయి.

ఏ-ప్లస్ (A+) కేటగిరీ రద్దు?
ప్రస్తుతం బీసీసీఐలో నాలుగు అంచెల కాంట్రాక్ట్ వ్యవస్థ (A+, A, B, C) అమలులో ఉంది. అయితే, అత్యున్నతమైన ఏ-ప్లస్ (A+) కేటగిరీని పూర్తిగా తొలగించాలని సెలక్షన్ కమిటీ సూచించింది. అందుకు కారణం ఏంటంటే..సాధారణంగా మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) ఆడే కీలక ఆటగాళ్లకు ఈ గ్రేడ్ కేటాయిస్తారు.

కానీ, ఆ గ్రేడ్‌లో కొనసాగుతున్న రోహిత్, కోహ్లీల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వీరిద్దరూ ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిని నేరుగా 'బి' (B) కేటగిరీకి తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాంట్రాక్ట్ గ్రేడ్‌లు - వేతనాల వివరాలు:
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లకు ఏడాదికి లభించే వేతనాలు ఇలా ఉంటాయి.

కేటగిరీ వార్షిక వేతనం ప్రస్తుతం ఉన్న ప్రముఖ ఆటగాళ్లు
A+ ₹7 కోట్లు రోహిత్, విరాట్, బుమ్రా, జడేజా
A ₹5 కోట్లు గిల్, రాహుల్, పాండ్యా, పంత్, సిరాజ్, షమీ
B ₹3 కోట్లు సూర్యకుమార్, జైస్వాల్, కుల్దీప్, అక్షర్, అయ్యర్
C ₹1 కోటి రింకు, సంజు శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తదితరులు

ముఖ్య మార్పులు, పదోన్నతులు..
శుభ్‌మన్ గిల్: టెస్టులు, వన్డేల్లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనుండటంతో గిల్‌ను అగ్రశ్రేణికి (A) ప్రమోట్ చేసే అవకాశం ఉంది.

జస్‌ప్రీత్ బుమ్రా: మూడు ఫార్మాట్లలో ఆడే సత్తా ఉన్న బుమ్రా వంటి బౌలర్ల విషయంలో ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

జడేజా: టెస్ట్ క్రికెట్‌లో కొనసాగుతున్న జడేజా తన అగ్రశ్రేణి స్థానాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.

ఎంపిక నిబంధన:
కేంద్ర కాంట్రాక్ట్ పొందాలంటే ఒక ఆటగాడు కనీసం 3 టెస్ట్ మ్యాచ్‌లు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20 మ్యాచ్‌లు ఆడి ఉండాలి. అలాంటి ఆటగాళ్లు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌కు అర్హత సాధిస్తారు.

ఈ సిఫార్సులపై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఏ-ప్లస్ కేటగిరీ రద్దయితే, అది భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసినట్లే అవుతుంది. దిగ్గజ ఆటగాళ్ల ఆదాయంపై కూడా ఇది గణనీయమైన ప్రభావం చూపుతుంది.

Also Read: Rohit Sharma Doubtful: రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు ఎండ్ కార్డ్? గంభీర్ 'మిషన్ 2027'లో హిట్ మ్యాన్ ఉంటారా?

Also Read: Rohit Sharma Doubtful: రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు ఎండ్ కార్డ్? గంభీర్ 'మిషన్ 2027'లో హిట్ మ్యాన్ ఉంటారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top