icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500030
RSRajesh SharmaFollow25 Jun 2024, 07:09 am

కటింగ్ చెపించుకొని మంగలి దుకానాన్ని ధ్వంసం చేసిన కస్టమర్లు

Hyderabad, Telangana:

రంగారెడ్డి జిల్లా దేవపల్లి పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని దానమ్మ జొప్పిడిలో గంజాయి గ్యాంగ్‌ కలకలం రేపుతోంది. గంజాయి ముఠాలోని ముగ్గురు వ్యక్తులు జుట్టు కత్తిరించుకోవడానికి సెలూన్‌కు చేరుకున్నారని మరియు డబ్బు అడిగినప్పుడు యజమానిపై దాడి చేశారని మీకు తెలియజేద్దాం. ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేసిన అనంతరం దుండగులు యజమానిపై దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న దుండగులు బీభత్సం సృష్టించి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

POCO C81 Pro: కేవలం రూ.9 వేలకే 6000mAh బ్యాటరీ ఫోన్.. POCO C81 Pro ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Hyderabad, Telangana:

POCO C81 Pro Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ పోకో (POCO) మార్కెట్‌లోకి అద్భుతమైన మొబైల్ విడుదల చేసింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన యునిసోక్ టి7250 చిప్‌సెట్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా మోస్‌ పవర్‌ఫుల్ బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉంది. పోకో కంపెనీ సాధారణ మిడిల్‌ క్లాస్‌ వినియోగదారులను దృష్టి పెట్టుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసింది. ఇది అత్యంత చీప్‌ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ పోకో సి81 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ పోకో సి81 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. మొదటి స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.9 వేల నుంచి ప్రారంభమైంది. అలాగే రెండవ వేరియంట్ ధర రూ.10 వేలకు లభిస్తోంది. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ పోకో స్మార్ట్‌ఫోన్‌ నలుపు, బంగారంతో పాటు ఆకుపచ్చ రంగులలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్ మార్కెట్‌లోకి కూడా అందుబాటులోకి వచ్చింది. 

పోకో సి81 ప్రో ఫీచర్స్‌:
పోకో C81 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ఇది 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా  120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు హై బ్రైట్‌నెస్ మోడ్‌లో 800 నిట్స్ సపోర్ట్‌తో లభిస్తోంది. వీటికి తోడు ఈ డిస్ల్పే ప్రత్యేకమైన బ్లూ లైట్ సర్టిఫికేషన్‌ కూడా పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై రన్‌ అవుతుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన మాలి-G57 GPUతో కూడిన 12nm ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. అంతేకాకుండా ఇందులో మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది.

ఇక ఈ పోకో సి81 ప్రో స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. C81 ప్రో వెనుక భాగంలో  13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్‌ భాగంలో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకమైన వెట్ టచ్ టెక్నాలజీ 2.0కి సపోర్ట్ కూడా చేస్తుంది. దీని వల్ల తడి వేళ్ళతో కూడా దీని డిస్ల్పే టచ్‌ అవుతుంది. అలాగే C81 ప్రో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. 

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

అంతేకాకుండా ఈ పోకో సి81 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన  6,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ను కూడా అందిస్తోంది. ఇందులో బ్లూటూత్ 5.2, వై-ఫై, జీపీఎస్‌తో పాటు గ్లోనాస్, గెలీలియో, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్స్‌ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన  ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తోంది. ఇవే కాకుండా వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Trigrahi Yoga 2026: సూర్య, కుజ, బుధ గ్రహాల కలయిక.. త్రిగ్రాహి యోగం ప్రభావం ఏ రాశులపై ఎలా ఉండబోతోంది?

Hyderabad, Telangana:

Trigrahi Yoga Effect On Zodiac 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మే నెలలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన గ్రహాలు ఒకే రాశిలో కలయిక జరపబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన యోగం కూడా ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సూర్యుడు మేషరాశిలో సంచార దశలో ఉన్నాడు. అయితే, మే 11వ తేదిన కీడు గ్రహంగా పరిగణించే కుజుడు మేష రాశిలోకి సంచారం చేస్తాడు. అలాగే బుధుడు కూడా సంచారం చేయడంతో మూడు గ్రహాల కలయిక జరుగుతుంది.

దీని కారణంగా మే 11వ తేది నుంచి త్రిగ్రాహి యోగం ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. దీని కొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తే.. మరికొన్ని రాశులవారు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఊహించని ప్రభావం పడబోతుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మకర రాశి
త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌తో మకర రాశివారికి ఈ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనవసరమైన ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం చాలా మంచిది.. దీంతో పాటు తల్లి ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం చాలా మంచిది. వీరు కొత్త ఆస్తులు లేదా కార్లు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు శరీరంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశివారికి 12వ స్థానంలో త్రిగ్రాహి యోగంతో అనేక రకాల సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరికి చిరాకు స్వభావం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ప్రధాన శత్రువు కూడా యాక్టివ్‌ అవుతారు. కార్యాలయంలో బాస్‌తో పాటు సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది. దీంతో పాటు ఈ సమయంలో శత్రువుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద తప్పులు కూడా చేయకపోవడం చాలా మంచిది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

తులా రాశి
తులా రాశివారికి ఈ సమయంలో అనేక రకాల సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా దూకుడు స్వభావం వల్ల దీర్ఘకాలికంగా తీవ్ర సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మేలు.. చిన్న చిన్న కారణాల వల్ల వైవాహిక కలహాలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. తులా రాశివారికి ఈ సమయంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. దీంతో పాటు మానసికంగా కూడా అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే భాగస్వామి జీవితంలో కూడా తీవ్ర సమస్యలు కూడా తలెత్తే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Budhaditya Rajayoga: బుధాదిత్య రాజయోగం ఎఫెక్ట్‌.. మే చివరి నుంచి ఈ రాశుల వారికి కాసుల వర్షం!

Hyderabad, Telangana:

Budhaditya Rajayoga Effect On Zodiac Telugu: ఈ ఏడాదిలోని ఏప్రిల్ నెల చివరి వారికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రధాన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా దీని బుధుడు లాంటి గ్రహం కదలికలు జరపబోతోంది. దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ గ్రమం తెలివితేటలకు, వ్యాపారంతో పాటు ఆనందానికి అధిపతిగా వ్యవహరిస్తుంది. అయితే, ఈ ఏప్రిల్‌ చివరి వారంలో మేష రాశిలోకి ప్రవేశించడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

ముఖ్యంగా మేష రాశిలో బుధుడితో పాటు సూర్యగ్రహాల సంయోగం జరగబోతోంది. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగానే అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ఆయా రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో పదన్నతులు కూడా లభిస్తాయి. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశువారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బుధుడి ప్రభావంతో ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మకర రాశి:
బుధ గ్రహ సంచారం ప్రభావంతో ఎక్కువగా మరక రాశివారు ప్రభావితమవుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో అద్భుతమైన అదృష్టం కూడా సొంతం చేసుకుంటారు. అలాగే వీరికి పెండింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అలాగే అప్పుల నుంచి కూడా బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఆస్తి సంబంధిత కేసుల నుంచి కూడా అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మీకు ఆస్తుల్లో లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు కొత్త ఇళ్లతో పాటు వాహనాలు కూడా సులభంగా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. అలాగే పెద్ద మొత్తంలో వీరికి ఉద్యోగాల పరంగా ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. ఈ సమయంలో స్నేహితుల నుంచి కూడా సహాయం కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీకు అండగా నిలిచి.. అద్భుతమైన లాభాలు కూడా పొందుతారు. 

మేష రాశి:
బుధ గ్రహం సంచారం ప్రభావంతో మేష రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి కెరీర్‌ పరంగా అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు. అలాగే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న విశేషమైన లాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు భవిష్యత్‌కు సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. భారీ మొత్తంలో డబ్బులు కూడా ఖర్చులు చేస్తారు. ఈ సమయంలో ఇతర కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘాకలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. 

మిథున రాశి:
బుధుడితో పాటు సూర్యగ్రహాల కలయిక కారణంగా మిథున రాశివారికి గోల్డెన్‌ డేస్ ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే గతంలో చిక్కుకున్న డబ్బులు కూడా భారీ మొత్తంలో తిరిగి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద మొత్తంలో ప్రమోషన్స్‌ కూడా పొందుతారు. కుటుంబంలో సంతోషంతో పాటు శాంతి కూడా నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. దీని కారణంగా మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థికంగా కూడా విశేషమైన లాభాలు పొందుతారు. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Vande Bharat Derail: వందేభారత్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం..పట్టాలు తప్పిన రన్నింగ్ ట్రైన్..అంతలోనే

Pune, Maharashtra:

Vande Bharat Derail Pune: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లలో తొలి ప్రమాదం జరిగింది. ముంబై-సోలాపూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణిస్తుండగా.. మహారాష్ట్రలోని పూణే రైల్వే స్టేషన్‌లోకి వచ్చే సమయంలో పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని సమాచారం.

సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్ఓ డాక్టర్ స్వప్నిల్ నీలా ప్రకారం.. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) నుండి సోలాపూర్‌కు వెళ్తున్న వందే భారత్ రైలులోని నాలుగో కోచ్‌కు చెందిన ఒక ట్రాలీ, సోమవారం రాత్రి సుమారు 7:30 గంటలకు పూణే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశిస్తుండగా డైమండ్ క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పింది. డైమండ్ క్రాసింగ్ అనేది ఒక రైల్వే ట్రాక్ లేఅవుట్, దీనిలో రెండు ట్రాక్‌లు ఒక కోణంలో ఖండించుకొని వజ్రాకారాన్ని ఏర్పరుస్తాయి, ఇది రైళ్లు లైన్లు మార్చకుండానే దాటుకోవడానికి వీలు కల్పిస్తుంది.

పుణెలోని రైల్వే స్టేషన్ యార్డ్ రీమోడలింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని  అధికారి తెలిపారు. "ప్రయాణికులను మరో రైలులోకి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. డైమండ్ క్రాసింగ్‌ను ప్రాధాన్యతా క్రమంలో మారుస్తున్నాం. భారతీయ రైల్వే వ్యాప్తంగా ఉన్న ఇలాంటి ప్రామాణికం కాని డైమండ్ క్రాసింగ్‌లను కూడా మారుస్తున్నాం" అని చీఫ్ పీఆర్ఓ తెలిపారు.

పట్టాలు తప్పిన కోచ్ నుంచి ప్రయాణికులు రైలు నుంచి దిగి, తమ సామాను తీసుకుని సమీపంలోని ప్లాట్‌ఫామ్‌ వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన తర్వాత పుణే మార్గంలో వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే వందేభారత్ రైలు పట్టాలు తప్పిన సంఘటన ఇదే తొలిసారి అని ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లకు అత్యంత సురక్షితమైన రైళ్లుగా పేరొందాయి. అయితే ఇందులో ప్రమాదాలను నివారించే కవచ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం విశేషం. 

Also Read: Kohli IPL 9000 Runs: మరో 11 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో ఒకేఒక్క మొనగాడు!

Also Read: Chitra Pournami 2026: అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు అత్యంత శుభ ముహూర్తం..ఈ పవిత్ర ఘడియల్లో స్వామి దర్శనం అపూర్వం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Chandrababu: విశాఖ విశ్వనగరం అన్‌స్టాపబుల్.. ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

Visakhapatnam, Andhra Pradesh:

AU Centenary Celebrations: 'రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేను విశాఖ వచ్చా. వందేళ్ల ఏయూ పండుగ ఒక చరిత్ర. రేపు ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మరో చరిత్ర. ఆర్థిక సంస్కరణలు వచ్చాక 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారంటే అది విశాఖ గొప్పతనం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. గూగుల్ కంటే ముందుగానే ఏయూ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్ చేసిందని.. 57 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారంటే రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం అని ప్రకటించారు.

Also Read: Chandrababu: కేంద్రానికి లేఖ.. మొక్కజొన్న రైతులకు అండగా సీఎం చంద్రబాబు

విశాఖపట్టణంలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. 'విశాఖ విశ్వనగరం... గ్లోబల్ సిటీ. ఇది అన్‌స్టాపబుల్ ఎవరూ ఆపలేరు. వందేళ్ల చరిత్ర  ఒక బ్రాండ్. రాష్ట్ర విభజన తర్వాత కేబినెట్ సమావేశం ఏయూలో నిర్వహించాం. అది ఏయూ ప్రత్యేకత' అని వివరించారు. '53 యూనివర్సిటీలు రాష్ట్రంలో ఉండగా.. అన్నింటికీ ఏయూ దిక్సూచి, లీడర్. స్వాతంత్ర్య పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చింది. జైపూర్ రాజ్ విక్రమ దేవ్, గజపతి రాజవంశం, పిఠాపురం రాజవంశం, బొబ్బిలి రాజులు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేశారు. వారిని మనం స్మరించుకోవడం ధర్మం, బాధ్యత' అని చంద్రబాబు పేర్కొన్నారు.

Also Read: KKR vs LSG Highlights: బంతి బంతికి మలుపు.. సూపర్‌ ఓవర్‌లో గట్టెక్కిన కలకత్తా నైట్‌రైడర్స్‌

'కట్టమంచి రామలింగారెడ్డి ఏయూకు మొదటి వీసీగా చేసి బలమైన పునాది వేశారు. ఆయన కూడా చిత్తూరు జిల్లా వాసే. నేనూ చిత్తూరు జిల్లా నుంచి వచ్చి వందేళ్ల ఉత్సవంలో పాల్గొన్నా. 2వ వీసీ సర్వేపల్లి రాధాకృష్ణ దేశ రాష్ట్రపతి అయ్యారు. ఈ రోజు మన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తండ్రి సర్వేపల్లి అభిమాని. ఈయనకు రాధాకృష్ణన్ అని పేరు పెట్టారు' అని చంద్రబాబు వివరించారు. 'కేవలం చదువు చెప్పడమే కాదు... తెలుగు వైభవానికి ఏయూ కృషి చేస్తోంది. విద్య, సాహిత్య రంగాల్లో ప్రముఖులను కళా ప్రపూర్ణ అవార్డుతో అభినందిస్తున్నారు' అని తెలిపారు.

'ఎంతోమంది నాయకులను తయారు చేసిన గడ్డ ఏయూ. రాజకీయ ఉద్దండులు ఇక్కడ నుంచి వచ్చారు. వెంకయ్య నాయుడు ఏయూ నుంచే వచ్చారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ప్రపంచంలోని చాలా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా చేస్తున్నారు' అని చంద్రబాబు తెలిపారు. 'న్యాక్ ఏ ప్లస్ ప్లస్ సాధిస్తోంది. ఎన్ఐఆర్ఎఫ్‌లో 41వ ర్యాంక్, పబ్లిక్ సెక్టార్‌లో 5వ ర్యాంక్‌లో ఉంది. యూనివర్సిటీలు నేషనల్ స్ట్రాటజిక్ అసెట్స్ వాటిని కాపాడుకోవాలి' అని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని యూనివర్సిటీల్లో విద్యాశాఖామంత్రి, గవర్నర్ ప్రతిభ ఉన్నవారిని వీసీలుగా ఎంపిక చేస్తున్నారు. రూ.64 కోట్ల విలువైన ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్‌వర్స్స్ ల్యాబ్ నెట్‌వర్క్ సెంటర్ ప్రారంభించుకున్నాం. రూ.112 కోట్లతో 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నాం. బాలురు, బాలికల హాస్టల్, కాన్వకేషన్ హాలు, వీసీ భవన్ కు శంకుస్థాపన చేసుకున్నాం' అని వివరించారు. 

'యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీతో  ఎంఓయూలు చేసుకున్నాం. నాకు 76 ఏళ్లయినా.. నేను 26 ఏళ్ల వ్యక్తిగానే ఆలోచిస్తా. ఒకప్పుడు ఐటీతో ప్రారంభించాం. నాలెడ్జ్ ఎకానమీకీ దోహదం చేశాం. నేడు డేటా సెంటర్, ఏఐ, క్వాంటం తీసుకొచ్చాం' అని చంద్రబాబు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Kohli IPL 9000 Runs: మరో 11 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో ఒకేఒక్క మొనగాడు!

Hyderabad, Telangana:

Kohli IPL 9000 Runs Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు విరాట్ కోహ్లీ మొదటి నుంచి వెన్నెముకగా నిలిచాడు. ఈ స్టార్ బ్యాటర్ ఇప్పుడు మరో అద్భుతమైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. నేడు అనగా ఏప్రిల్ 27న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరగనున్న మ్యాచ్‌లో.. ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు ఎవరూ సాధించని ఘనతను కోహ్లీ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతను నేడు జరిగే మ్యాచ్‌లో కేవలం 11 పరుగులు చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు 274 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ, 39.95 సగటుతో 8,989 పరుగులు సాధించాడు. ఇందులో 8 అద్భుతమైన సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఐపీఎల్ పరుగుల రేసులో ప్రస్తుతం కోహ్లీకి ఎవరూ సాటిలేరు. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ, 276 మ్యాచ్‌లలో 7,183 పరుగులు సాధించాడు. అంటే కోహ్లీ, రోహిత్‌ల మధ్య 1,800 పరుగులకు పైగా భారీగా గ్యాప్ ఉంది. ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఏ ఇతర బ్యాట్స్‌మెన్ కూడా 8,000 పరుగుల మార్కును దాటకపోవడం కోహ్లీ ఆధిపత్యానికి నిదర్శనం.

ప్రస్తుతం జరుగుతున్న 2026 ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను కేవలం 7 మ్యాచ్‌లలోనే 54.57 సగటుతో 328 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. అతను ఇప్పటికే తన బ్యాట్‌తో 36 ఫోర్లు, 12 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, నేటి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఇది విరాట్ కోహ్లీ పెరిగిన సొంత మైదానం. ఇక్కడి పిచ్, ఫీల్డ్‌లోని ప్రతి మూల గురించి అతనికి క్షుణ్ణంగా తెలుసు. గత సీజన్‌లో ఢిల్లీలో ఆర్సీబీ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేసిన కోహ్లీ, ఈరోజు కూడా జట్టుకు విజయాన్ని అందించేందుకు ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడతానని ధీమాతో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ రికార్డుకు చేరువలో..
ఐపీఎల్‌లో 9,000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచే అవకాశం. విరాట్ 274 మ్యాచ్‌లలో 8,989 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు (8) సాధించాడు. తమ అభిమాన ఆటగాడు ఈ అరుదైన మైలురాయిని చేరుకుని, జట్టును ప్లే-ఆఫ్స్‌కు చేర్చాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: Dhoni Re-Entry News: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు షాక్! ధోనీ చేసిన పెద్ద తప్పు ఇదే! ఇక జట్టులోకి 'తలా' కష్టమే!

Also Read: Mumbai Indians Captain: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ?! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పోతుందా? అంబానీ నిర్ణయం ఏంటి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Chitra Pournami 2026: అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు అత్యంత శుభ ముహూర్తం..ఈ పవిత్ర ఘడియల్లో స్వామి దర్శనం అపూర్వం!

Tiruvannamalai, Tamil Nadu:

Chitra Pournami 2026 Girivalam Timings: తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ రద్దీ సహజం. కానీ, ఈసారి రాబోతున్న చిత్ర పౌర్ణమి సందర్భంగా భక్తులు గిరివలయం చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు శుభ ముహుర్తాన్ని పండితులు ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయం వద్ద తగిన ఏర్పాట్లు చేస్తామని.. భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని దేవాలయ పాలకమండలి వెల్లడించింది. అయితే ఎప్పటి కంటే ఈసారి చిత్ర పౌర్ణమికి భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. 
 
ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, చిత్ర పౌర్ణమి, కార్తీక దీపం సందర్భంగా కొండపై మహాదీపం వెలిగించే కార్యక్రమాల రోజుల్లో  శ్రీ అరుణాచలేశ్వర ఆలయానికి భక్తులు పెద్దఎత్తుల దర్శనానికి రావడం ఆనవాయితీగా వస్తుంది. ఈయా ప్రత్యేక సందర్భాల్లో స్థానిక భక్తులే కాకుండా పక్క రాష్ట్రాలు, విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో తిరువణ్ణామలై ఆలయాన్ని తెల్లవారుజామున తెరుస్తారు. స్వామి వారి అభిషేకం, ఆరాధనలతో ప్రారంభమై.. ఆలయం చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని చుడుతూ భక్తులు తమ మొక్కులను చెల్లిస్తారు. 

ఈ క్రమంలో తమిళనాట చిత్తరై మాస పౌర్ణమి మే నెల 1వ తేదీన శుక్రవారం రాబోతోంది. ఆ రోజున ఆలయాన్ని ఉదయాన్నే తెరిచి.. స్వామివారికి పాలు, పన్నీర్, పెరుగు, పంచామృతాలు, యాలకుల నీర, పవిత్ర జలం, తేనె వంటి వివిధ రకాల పూజా ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఈ విశిష్టాభిషేకం తర్వాత స్వామివారిని పుష్పాలతో అలంకరించి, ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. 

చిత్ర పౌర్ణమి నేపథ్యంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేసేందుకు శుభ ముహూర్తాల వివరాలను పండితులు ప్రకటించారు. ఏప్రిల్ 30 అనగా గురువారం రాత్రి 9.52 గంటలకు ప్రారంభమై.. ఆ తర్వాతి రోజు మే 1 అనగా శుక్రవారం రాత్రి 11.08 గంటల వరకు ఈ శుభకాలం నడుస్తోంది. కాబట్టి, భక్తులు ఈ సమయంలో గిరివలయాన్ని ప్రదక్షిణ చేస్తే మంచిది. అయితే రాబోయే పౌర్ణమికి భక్తులు 30 లక్షల మందికి పైగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని ఆలయ యంత్రాంగం అంచనా వేస్తోంది. 

భక్తులు వేలాదిగా తరలిరానున్నానే అంచనా నేపథ్యంలో వారి సౌకర్యార్థ్యం ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పార్కింగ్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. దీంతో పాటు గిరి ప్రదక్షిణలో వైద్య బృందం, అగ్నిమాపక సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు భద్రతా విధుల్లో అందుబాటులో ఉంటారు. అలాగే జిల్లా యంత్రాంగం కూడా భక్తులకు కావాల్సిన ప్రాథమిక అవసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపడుతోంది. 

ALso Read: Viral Potato Chips: ఆలూ చిప్స్ స్నాక్స్ లాగా తింటున్నారా? ఈ వైరల్ వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు..

Also Read: Dhoni Re-Entry News: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు షాక్! ధోనీ చేసిన పెద్ద తప్పు ఇదే! ఇక జట్టులోకి 'తలా' కష్టమే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Viral Potato Chips: ఆలూ చిప్స్ స్నాక్స్ లాగా తింటున్నారా? ఈ వైరల్ వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు..

Hyderabad, Telangana:

Viral Potato Chips News: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విచిత్రమైన వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. తాజాగా ఒక అసహ్యకరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే అందులో ఉన్న వ్యక్తి కేవలం అండర్‌వేర్ ధరించి..విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అది కూడా అతను ఆలూ చిప్స్ తయారీ చేసే ఓ గౌడౌన్‌లో ఈ వీడియోను రికార్డు చేశారు. స్ట్రీట్ ఫుడ్‌లో ఆలూ చిప్స్ తినే వారికి హెచ్చరిక అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి ఎంతో మంది నెటిజన్లు, ఫుడ్ లవర్స్ నిర్ఘాంతపోయారు. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో పెద్ద దుమారం రేపుతోంది. ఈ వైరల్ క్లిప్ ఓ ఆలూ చిప్స్ ఫ్యాక్టరీకి చెందినది. ఇందులో బంగాళాదుంప చిప్స్ తయారీ విధానాన్ని చూసి నెటిజన్లకు వికారంగా అనిపిస్తోంది. పరిశుభ్రత ప్రమాణాలను ఉల్లంఘిస్తున్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి కేవలం అండర్ వేర్ ధరించి, ఓ పెద్ద ట్యాంకర్‌లో నిలబడ్డాడు. అయితే ఆ ట్యాంకర్‌ నీటిలో బంగాళదుంప చిప్స్ స్లైసెస్ కట్ చేసి ఉంచారు. ఆ ట్యాంక్ నిలబడి ఆ వ్యక్తి సిగరెట్ తాగుతూ, వాటిని కాళ్లతో తొక్కుతూ అపరిశుభ్రంగా ప్రవర్తిస్తున్నాడు. అందులోనూ ఆ పని చేస్తూనే ఆ వ్యక్తి కెమెరాను చూసిన నవ్వడం గమనార్హం. 

ఈ క్లిప్ ఒక స్థానిక చిప్స్ ఫ్యాక్టరీ నుండి తీసినట్లుగా కనిపిస్తోంది, అక్కడ ఆలూ చిప్స్‌ను నూనెలో వేయించడానికి ముందు శుభ్రం చేస్తున్నారు. అయితే ఆ ట్యాంక్‌లోని నీరు ఎంత మురికిగా ఉందంటే, దానిని చూడగానే ప్రజలకు వాంతి వస్తున్నట్లుగా అనిపిస్తోంది.

@fact.flow_india అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ పనికిమాలిన చర్యలను నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. "దీనిని చూడగానే నాకు వాంతి వస్తున్నట్లుగా అనిపిస్తోంది" ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. అలాగే మరొకరు "బహుశా అందుకేనేమో ఈ చిప్స్ ఇంత ఉప్పగా ఉంటున్నాయి" అని వ్యంగ్యంగా అంటున్నారు. "హే, దయచేసి ఆ బ్రాండ్ పేరు కూడా వెల్లడించండి, అప్పుడు ప్రజలు తెలుసుకుని వాటిని కొనడం మానేస్తారు" అని వ్యాఖ్యానించారు. ఇలాంటి మురికి చర్యల పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ALso Read: Dhoni Re-Entry News: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు షాక్! ధోనీ చేసిన పెద్ద తప్పు ఇదే! ఇక జట్టులోకి 'తలా' కష్టమే!

Also Read: AP Fuel Crisis: రాష్ట్రంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత..బంకుల ముందు బారులు తీరిన వాహనాలు..సీఎం కీలక ఆదేశాలు!

0
0
Report
Advertisement

Chandrababu: కేంద్రానికి లేఖ.. మొక్కజొన్న రైతులకు అండగా సీఎం చంద్రబాబు

Nuzendla, Andhra Pradesh:

AP Maize Farmers: ఆంధ్రప్రదేశ్‌ రైతులకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారు. మొక్కజొన్న రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరారు. మొక్కజొన్న రైతులకు ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని వర్తింప చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న రైతుల పరిస్థితిని లేఖలో చంద్రబాబు వివరించారు. వెంటనే స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Also Read: KKR vs LSG Highlights: బంతి బంతికి మలుపు.. సూపర్‌ ఓవర్‌లో గట్టెక్కిన కలకత్తా నైట్‌రైడర్స్‌

మొక్కజొన్న రైతుల సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు సోమవారం సీఎం చంద్రబాబు లేఖ రాశారు. 2025-26 రబీ సీజన్‌లో పండించిన మొక్క జొన్న పంటను కొనుగోలు చేయాలని లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. 'రాష్ట్రంలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఆందోళనగా ఉన్నారు. మార్కెట్‌లో మొక్కజొన్న ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాల్ మొక్కజొన్న ధర రూ.1600 నుండి రూ.1700 మధ్య మాత్రమే ఉంది. కనీస మద్దతు ధర రూ.2400 కంటే చాలా తక్కువగా ప్రస్తుత మార్కెట్ ధర ఉంది' అని లేఖలో కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు.

Also Read: KTR: మూడు ఫీట్ల రేవంత్‌ రెడ్డి.. ఆరున్నర అడుగుల ఉత్తమ్‌తో తెలంగాణకు ఉపయోగం లేదు: కేటీఆర్

'రాష్ట్రంలో సుమారు 42.06 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇంకా 14.26 లక్షల మెట్రిక్ టన్నుల పంట కోత దశలో ఉంది. సకాలంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే రైతులు నష్టపోతారు' అని కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు పరిస్థితి వివరించారు. మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రం నుంచి మద్దతు లేకపోవడంతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పీఎం ఆశా కింద నేరుగా రైతులకు ధరల వ్యత్యాసాన్ని చెల్లించాలని.. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా పరిగణించి ధరల వ్యత్యాసంలో 100 శాతం నిధులను కేంద్రమే భరించాలని లేఖలో సీఎం చంద్రబాబు కోరారు. ఈ పథకాన్ని జూన్ 2026 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. నాఫెడ్, ఏపీ మార్క్‌ఫెడ్ సమన్వయంతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు తక్షణమే అనుమతులివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Also Read: CSK vs GT Highlights: బ్యాటింగ్‌లో చెన్నై ఘోర విఫలం.. సునాయాసంగా గుజరాత్‌ విజయం

విద్యుత్‌ శాఖపై సమీక్ష
అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై సోమవారం సీఎం చంద్రబాబు సమీక్షించారు. వేసవిలో విద్యుత్ సరఫరా, 2026-27 ఏడాదిలో పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల అమలు వంటి అంశాలపై చర్చించారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలను యూనిట్‌కు రూ.4.60కు తగ్గించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పాదన పెంచడమే లక్ష్యమని ప్రకటించారు. ఈవీ వాహనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన, పీఎం సూర్య ఘర్, కుసుమ్ పథకాల అమలులో లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Dhoni Re-Entry News: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు షాక్! ధోనీ చేసిన పెద్ద తప్పు ఇదే! ఇక జట్టులోకి 'తలా' కష్టమే!

Chennai, Tamil Nadu:

MS Dhoni IPL 2026 Return: ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. ముఖ్యమైన మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యి.. ఇప్పుడు ప్లేఆఫ్స్ చేరుకునే ఆశలు నెమ్మదిగా సన్నగిల్లుతున్నాయి. అయితే జట్టులో కీలకంగా ఉన్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి జట్టులోకి రాకపోవడం పట్ల అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో రెండు వారాల పాటు దూరంగా ఉంటారని సమాచారం ఇవ్వగా.. ఇప్పుడు జట్టులోకి రావడానికి మరింత సమయాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న తుదిజట్టులో మార్పులకు ధోనీ అనుకూలంగా లేకపోవడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. 

ఈ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడింది. సీఎస్‌కే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 4 మ్యాచ్‌లు, ఇతర వేదికలలో 4 మ్యాచ్‌లు ఆడింది. చెపాక్ స్టేడియంలో ఆడిన 4 మ్యాచ్‌లలో CSK కేవలం 2 మాత్రమే గెలిచింది. ప్రత్యర్థి మైదానంలో CSK కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీంతో ఆడిన 8 మ్యాచ్‌లలో 3 గెలిచి, 5 ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు  6 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్ మంచి జట్టు కూర్పు ఉంటే, విజయం ఖాయం. సమస్య ఏమిటంటే.. వారు ఓడిపోయిన అన్ని మ్యాచ్‌లలోనూ సరైన జట్టుతో రాలేదని ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు.  ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు. కానీ, ఆ తర్వాత మ్యాచ్‌ల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడం గమనార్హం. 

ఫాస్ట్ బౌలింగ్‌ దళంలో ముఖేష్ చౌదరి, అన్షుల్ కంబోజ్, ఓవర్టన్, గుర్జబ్‌నీత్ సింగ్ ఉండగా.. స్పిన్ బౌలింగ్‌లో నూర్ అహ్మద్, అఖేల్ హుస్సేన్ జట్టులో నిలిచారు. ఈ 6 మంది బౌలర్లతో మూడో స్థానంలో ఆయుష్ మాత్రే కి బదులుగా సర్ఫరాజ్ ఖాన్ ఆడనున్నాడు. కార్తీక్ శర్మ ఒక్కడే కాస్తంత సాధారణమైన ఎంపిక, అతని స్థానంలో ప్రశాంత్ వీర్ ఆడించాల్సింది.

ఐపీఎల్‌ వేదికగా నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేసిన తప్పులేంటో తెలుసుకుందాం. సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కనపెట్టి ఊర్విల్ పటేల్‌ను మూడో స్థానంలో, కార్తిక్ శర్మను ఆ తర్వాత ఆడించడం చెన్నై సూపర్ కింగ్స్ చేసిన మొదటి తప్పు. పవర్‌ప్లేలో వికెట్లు త్వరత్వరగా పడిపోవడంతో, 4వ ఓవర్‌లో ఒక కీలక ఆటగాడిని బరిలోకి దించడం రెండవ పొరపాటు అయింది. దీని కారణంగా, ముఖేష్ చౌదరిని బౌలింగ్‌కు తీసుకురాలేకపోయారు. ఒకవేళ ముఖేష్ చౌదరి గనుక బరిలోకి దిగి ఉంటే, అతను పవర్‌ప్లేలో గుజరాత్ జట్టు టాప్ ఆర్డర్‌లోని రెండు వికెట్లు తీసి ఉండేవాడు. నిన్న అన్షుల్ కంబోజ్ కూడా బాగా బౌలింగ్ చేశాడన్నది కూడా గమనించాల్సిన విషయం.

సరైన జట్టు కూర్పును ఎంచుకుంటేనే సీఎస్కే తదుపరి మ్యాచ్‌లలో గెలవకపోవచ్చు. మిగిలిన 6 మ్యాచ్‌లలోనూ గెలిస్తేనే వారికి ప్లే-ఆఫ్ రౌండ్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది. అందువల్ల, ప్రస్తుత తుది జట్టులో ఊర్విల్ పటేల్‌ను మూడో స్థానంలో ఆడించవచ్చు. లేకపోతే, సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా ఆడించవచ్చు.

ధోనీ వస్తాడా?
కార్తిక్ శర్మ స్థానంలో ప్రశాంత్ వీర్ చక్కగా సరిపోతాడు. ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే, ధోనీ ఖచ్చితంగా తుది జట్టులో ఉండాలి. ధోనీ గాయం నుంచి పూర్తిగా కోలుకుని ఫిట్‌గా ఉన్నాడని వార్తలు సూచిస్తున్నాయి. జట్టు కూర్పును చెడగొట్టకూడదనే ఉద్దేశ్యంతో ధోనీ మ్యాచ్‌లలో ఆడలేదని, అలాగే సీఎస్‌కే వరుస గెలుపు ఓటములను బట్టి అతను కేవలం ఒకటి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడని వార్తలు వస్తున్నాయి. అయితే, ధోనీ చేస్తున్నది తప్పు.

ధోనీ చేస్తున్నది తప్పు...ఎందుకు?
ధోనీ కచ్చితంగా లోయర్ ఆర్డర్‌లో గొప్ప ప్రభావాన్ని చూపాడు. ఒకవేళ ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లలో ధోనీ ఉండి ఉంటే, వారు ఖచ్చితంగా లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించేవారు. కానీ అప్పుడు ధోనీ ఫిట్‌గా లేడు. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. రుత్‌రాజ్ గైక్వాడ్, ఇతర సీఎస్కే ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం కలిగించేందుకు.. సీనియర్ ఆటగాడైన ధోనీని తదుపరి మ్యాచ్‌లో నేరుగా తుది జట్టులోకి తీసుకోవాలి. మూడో స్థానంలో ఊర్విల్ పటేలా లేదా సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకునే నిర్ణయాన్ని CSK ఖరారు చేయాలి. బౌలింగ్ లైనప్‌లో ముఖేష్ చౌదరి లేదా ఆకాష్ మద్వాల్‌కు చోటు కల్పించాలి.

Also Read: Thai Funeral Dance: శవం ముందు పాపలతో అశ్లీల డ్యాన్స్‌లు..ఏడుపు ఆపి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీ..

Also Read: Mumbai Indians Captain: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ?! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పోతుందా? అంబానీ నిర్ణయం ఏంటి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Mumbai Indians Captain: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ?! హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పోతుందా? అంబానీ నిర్ణయం ఏంటి?

Mumbai, Maharashtra:

Mumbai Indians Captain News: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఐదుసార్లు ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టులో ప్రస్తుతం కెప్టెన్సీ విషయం మరోసారి పెద్ద దుమారాన్ని రేపింది. 2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో.. ముంబై యాజమాన్యం ఆకస్మికంగా ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను తొలగించి, గుజరాత్ జట్టు నుండి ట్రేడ్ ద్వారా వచ్చిన హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఈ నిర్ణయాన్ని రోహిత్ శర్మ అభిమానులు, ముంబై ఇండియన్స్ అభిమానులు తీవ్రంగా విమర్శించారు. హార్దిక్ పాండ్యా మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతి స్టేడియంలోనూ అభిమానులు అతడిని హేళన చేశారు. ప్రస్తుతం 2026 ఐపీఎల్ సీజన్ జోరుగా సాగుతుండటంతో, కెప్టెన్సీ మార్పుపై వదంతులు సోషల్ మీడియాలో మరోసారి దావానలంలా వ్యాపిస్తున్నాయి.

రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్ అవుతాడా?
"ముంబై ఇండియన్స్ యాజమాన్యం హార్దిక్ పాండ్యాను ఆకస్మికంగా కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ బాధ్యతను మళ్లీ రోహిత్ శర్మకు అప్పగించబోతోంది" అని ఇంటర్నెట్‌లో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది క్రీడా వ్యాఖ్యాతలు కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే, ఈ వార్తలలోని నిజమెంత అని ఆరా తీయగా.. "ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించడానికి ముంబై ఇండియన్స్ యాజమాన్యం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని వెల్లడైంది. 

ఈ వదంతులకు కారణం ఏమిటి?
ముంబై ఇండియన్స్ జట్టు అకస్మాత్తుగా రావడానికి ప్రధాన కారణం జట్టులో నెలకొన్న అసంతృప్తి. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, అతని కొన్ని నిర్ణయాలు తోటి సీనియర్ ఆటగాళ్లకు, జట్టు యాజమాన్యానికి సంతృప్తినివ్వలేదని అంటున్నారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాడని, జట్టులోని రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లను గౌరవించడం లేదని కొన్ని ఆరోపణలు వచ్చాయి. దీనిని గమనించిన ముంబై ఇండియన్స్ యాజమాన్యం, హార్దిక్ పాండ్యాను వ్యక్తిగతంగా పిలిచి, సీనియర్ ఆటగాళ్లకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలని, లేకపోతే అతడిని కెప్టెన్సీ నుండి తొలగిస్తామని గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. ఈ హెచ్చరికలే హార్దిక్‌ను తొలగించారనే పుకార్లుగా మారాయి.

ముంబై ఇండియన్స్ యాజమాన్యం విషయానికొస్తే, వారు హార్దిక్ పాండ్యాను రాబోయే మూడేళ్లపాటు కెప్టెన్‌గా కొనసాగించాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో జట్టులోకి తీసుకువచ్చి, అతనికి కోట్లాది రూపాయలు చెల్లించారు. అందువల్ల, కొన్ని మ్యాచ్‌లలో చేసిన కొన్ని పొరపాట్లకు గానీ, సోషల్ మీడియాలో విమర్శలకు గానీ వారు అతడిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించరు. ఈ సీజన్ మొత్తం అతనికి పూర్తి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. సీజన్ ముగింపులో జట్టు ప్రదర్శనను, అతని నాయకత్వ లక్షణాలను మూల్యాంకనం చేసిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటారని ముంబై వర్గాలు చెబుతున్నాయి. 

రోహిత్ శర్మ వైఖరి ఏమిటి?
రోహిత్ శర్మ విషయానికొస్తే, అతను ఈ సమస్యలను అధిగమించాడు. ఒక సాధారణ ఆటగాడిగా, అతను ముంబై జట్టుకు తన వంద శాతం సహకారాన్ని అందించడంపై పూర్తిగా దృష్టి సారించాడు. "జీవితంలో మనం అనుకున్నవన్నీ జరగవు. కొన్ని నిర్ణయాలను అంగీకరించాల్సి ఉంటుంది" అని రోహిత్ శర్మ గతంలో తన అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం. అందువల్ల, ఇంటర్నెట్‌లో ప్రచారంలో ఉన్న వదంతుల ప్రకారం ముంబై ఇండియన్స్ జట్టులో ఆకస్మిక కెప్టెన్సీ మార్పు ఏమీ జరగలేదన్నది ప్రస్తుత వాస్తవం!

ప్రస్తుతం ముంబై జట్టు ఎలా ఉంటందే?
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్, తిలక్ వర్మ, శార్దూల్ ఠాకూర్, మిచెల్ సాన్ట్నర్, షెర్పైన్ రూథర్‌ఫోర్డ్, విల్ జాక్వెస్, మయాంక్ మార్కండే, దీపక్ చాహర్, నమన్ కజాన్ అల్లా, నమన్ కజాన్ అల్లా, ర్యాన్‌ర్ మిన్‌షెల్ టన్, ర్యాన్‌ర్ మిన్‌షెల్ డయర్, క్వింటన్ డి కాక్. రాజ్యవర్ధన్ హంగర్‌కేకర్, రాజ్‌బావ, అశ్వనీ కుమార్, డానిష్ మలేవార్, మహ్మద్ ఇజార్, అథర్వ అంగోలేకర్, మయాంక్ రావత్, రఘు శర్మ.

Also Read: AP Fuel Crisis: రాష్ట్రంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత..బంకుల ముందు బారులు తీరిన వాహనాలు..సీఎం కీలక ఆదేశాలు!

Also Read: Vaibhav Sooryavanshi Record: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సూర్యవంశీ..గేల్, రైనా రికార్డులు బ్రేక్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

KKR vs LSG Highlights: బంతి బంతికి మలుపు.. సూపర్‌ ఓవర్‌లో గట్టెక్కిన కలకత్తా నైట్‌రైడర్స్‌

Ardonamau, Uttar Pradesh:

KKR vs LSG Super Over: ఐపీఎల్‌ 2026లో ఆదివారం రెండు స్వల్ప స్కోర్‌ మ్యాచ్‌లు జరిగినా సాయంత్రం జరిగిన కలకత్తా నైట్‌రైడర్స్‌, లక్నో సూపర్‌ జియాంట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ మాత్రం ప్రేక్షకులను నేల మీద ఉండేలా చేయలేదు. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లో.. బంతి బంతికి ఫలితం తారుమారుతున్న వేళ కలకత్తా నైట్‌రైడర్స్‌ అద్భుతం చేసింది. ఈ సీజన్‌లో సూపర్‌ ఓవర్‌కు మరలిన ఈ మ్యాచ్‌లో  కలకత్తా అద్భుత విజయం సొంతం చేసుకుంది. తక్కువ స్కోర్‌ను బాదినా కాపాడుకునేందుకు కలకత్తా.. గెలిచేందుకు లక్నో తీవ్రంగా పోరాడాయి.

సూపర్ ఓవర్ కొనసాగింది ఇలా..

లక్నో సూపర్‌ జియాంట్స్‌ 
తొలి బంతి: నికోలస్ పూరన్‌ ఔట్‌
రెండో బంతి: ఒక పరుగు
మూడో బంతి: మర్‌క్రమ్‌ ఔట్‌
బౌలింగ్‌: సునీల్‌ నరైన్‌

లక్నో సూపర్‌ జియాంట్స్‌ 
తొలి బంతికే రింకూసింగ్‌ నాలుగు పరుగులు చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు
బౌలింగ్‌: ప్రిన్స్‌ యాదవ్‌

వరుస వైఫల్యాలతో బాధపడుతున్న లక్నో సూపర్‌ జియాంట్స్‌ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్‌లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్లు.. మిడిలార్డర్‌ విఫలమై జట్టు పరువు పోతున్న సమయంలో రింకూ సింగ్‌ వచ్చాడు. అందరూ ఔటయిన వేళ మైదానంలో నిలబడి జట్టు పరువు కాపాడాడు. 51 బంతుల్లో 83 పరుగులు చేసిన రింకూ సింగ్‌.. 7 ఫోర్లు, ఐదు సిక్సర్లు నమోదు చేశాడు. కెప్టెన్‌ అజింక్యా రహనే 10 ఓవర్లకు ఔటవగా.. టిమ్‌ సెఫర్ట్‌ డకౌట్‌ అయ్యాడు. అంగ్‌క్రిష్‌ రఘువంశీ 9 పరుగులు చేయగా.. కామెరూన్‌ గ్రీన్‌ అద్భుతంగా ఆడి 34 పరుగులు చేశాడు. రమణ్‌దీప్‌, సునీల్‌ నరైన్‌ వరుసగా 6,4 పరుగులు చేశారు. కలకత్తాకు లక్నో సూపర్‌ జియాంట్స్‌ బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి స్కోర్‌ బోర్డును భారీగా కట్టడి చేశారు. మొహిసిన్‌ ఖాన్‌ నిప్పులు చెరిగేలా బంతులు వేసి ఈ సీజన్‌లో అత్యధికంగా ఐదు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్లు వేసిన మొహిసిన్‌ 23 పరుగులు మాత్రమే ఇచ్చి బ్యాటర్లపై ప్రతాపం చూపించాడు. జార్జ్‌ లిండె ఒక వికెట్‌ పడగొట్టాడు.

0
0
Report

KTR: మూడు ఫీట్ల రేవంత్‌ రెడ్డి.. ఆరున్నర అడుగుల ఉత్తమ్‌తో తెలంగాణకు ఉపయోగం లేదు: కేటీఆర్

Huzur Nagar, Telangana:

Pillutla Raghu Joins In BRS Party: 'మూడు ఫీట్లు ఉన్నోడు కూడా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌పై మాట్లాడుతున్నాడు' అని రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా.. ఎవరు ఏం చేసినా మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వం అని ప్రకటించారు. ఏవో చిన్న తప్పిదాలతో నల్గొండ జిల్లాలో 11 సీట్లు కోల్పోయాం. కానీ గెలిచిన కాంగ్రెస్ ఏం చేస్తోంది? అని నిలదీశారు.  'కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు కమల్ హాసన్‌ను మించిన నటులు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్‌లు ఏమయ్యాయి?' అని ప్రశ్నించారు.

Also Read: BRS Party Anniversary: రేపు తెలంగాణలో పల్లె పల్లెనా గులాబీ జెండా ఎగరాలి: కేటీఆర్‌ పిలుపు

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి చెందిన నాయకుడు పిల్లుట్ల రఘు గులాబీ కండువా కప్పుకున్నారు. అతడికి గులాబీ కండువా కప్పి సాదరంగా బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానం పలికిన అనంతరం కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. '3 నెలల్లో పిల్లలు పుడతారా అని ప్రశ్నించిన రేవంత్‌ రెడ్డిని నేను అడుగుతున్నా.. 30 నెలలైనా పిల్లలు పుట్టకుంటే ఏమనాలో చెప్పు అని? అని ప్రశ్నించారు. స్కైరూట్ మనం తెచ్చిన కంపెనీ.. దానికి రిబ్బన్ కట్ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Also Read: CSK vs GT Highlights: బ్యాటింగ్‌లో చెన్నై ఘోర విఫలం.. సునాయాసంగా గుజరాత్‌ విజయం

'ఆరున్నర అడుగులు ఉన్న ఉత్తమ్ కుమార్‌తో ఏమీ ఉపయోగం లేదు. 2014కు పూర్వం కాంగ్రెస్ నల్గొండకు ఏం చేసింది? మూసీని దుర్గంధంతో నింపింది. ఫ్లోరోసిస్‌తో నల్గొండ వెన్నుపూస విరిచేసింది' అని నాటి కాంగ్రెస్‌ పాపాలను మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. రాంరెడ్డి అనే వ్యక్తి 56 బోర్లు వేస్తే నీరు రాని పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉండేదని గుర్తుచేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వచ్చాక.. రూ.1,800 కోట్లతో యాదాద్రి, మెడికల్ కాలేజీలు, మిర్యాలగూడలో రూ.35 వేల కోట్లతో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్, మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్‌ను దూరం చేశారు' అని నల్లగొండ జిల్లాకు కేసీఆర్‌ పాలనలో చేసిన ఘనతలను కేటీఆర్‌ వెల్లడించారు.

'కోదాడలో చివరి మడికి నీరు వస్తుందంటే అది కాళేశ్వరం వల్లే. రేవంత్ రూ.3 లక్షల 70 వేల కోట్ల అప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఢిల్లీకి మూటలు మోయడం తప్ప.. ఏం చేసిండు మరి?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. 'రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు దాన వీర శూర కర్ణ. ఎన్నికలు అయ్యాక కుంభ కర్ణ' అని ఎద్దేవా చేశారు. 'వచ్చే ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు.. కేసీఆర్‌ని మళ్లీ ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని పునర్నిర్మించే ఎన్నికలు' అని కేటీఆర్‌ ప్రకటించారు. మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు జలదృశ్యంలో మొదలైన బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం 25 ఏళ్లు పూర్తి చేసుకుందని గుర్తుచేశారు. 2023 సాధారణ ఎన్నికల కంటే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలం పెరిగింది అని మాజీ మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top