icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
500030
RSRajesh SharmaFollow25 Jun 2024, 07:09 am

కటింగ్ చెపించుకొని మంగలి దుకానాన్ని ధ్వంసం చేసిన కస్టమర్లు

Hyderabad, Telangana:

రంగారెడ్డి జిల్లా దేవపల్లి పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని దానమ్మ జొప్పిడిలో గంజాయి గ్యాంగ్‌ కలకలం రేపుతోంది. గంజాయి ముఠాలోని ముగ్గురు వ్యక్తులు జుట్టు కత్తిరించుకోవడానికి సెలూన్‌కు చేరుకున్నారని మరియు డబ్బు అడిగినప్పుడు యజమానిపై దాడి చేశారని మీకు తెలియజేద్దాం. ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేసిన అనంతరం దుండగులు యజమానిపై దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న దుండగులు బీభత్సం సృష్టించి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

అమెజాన్ జాబ్ పోయిందని కుంగిపోలేదు.. 6 కోళ్లతో మొదలుపెట్టి బిజినెస్ ఉమన్‌గా మారిన మరియా!

Hyderabad, Telangana:

Woman Entrepreneur Success Story: కార్పొరేట్ ఉద్యోగం.. చేతినిండా భారీ జీతం.. ఉన్నట్టుండి ఆ ఉద్యోగం పోతే బాధ మాటల్లో చెప్పడం చాలా కష్టం.. ఎంతోమంది   ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులకు లేఆఫ్స్ కారణంగా తీవ్ర నిరాశకు గురవుతూ వస్తున్నారు. కానీ ఆ కష్టాన్ని అవకాశంగా మలుచుకుని.. ఒక యువతి తన రాతను తానే మార్చుకుంది.. అమెజాన్ లో ఉద్యోగం కోల్పోయిన మరియా హర్షిత అని యువతి ఏకంగా కోళ్ల ఫారం స్టార్ట్ చేసి.. తన సత్తా ఏంటో చాటుతూ వస్తోంది.. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సక్సెస్ స్టోరీ ఏంటో.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మరియా హర్షిత అమెజాన్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్ విభాగంలో గతంలో పనిచేసేది.. అయితే మార్చి నెలలో అమెజాన్ సంస్థ చేపట్టిన లేఆఫ్స్ లో ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయింది. దీంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా అయోమయంలో పడిపోయింది.. ఎన్నో ఇంటర్వ్యూలకు తను హాజరైనప్పటికీ.. సీనియర్లు స్నేహితుల సాయం కోరినప్పటికీ.. ఆమెకు నిరాశే ఎదురయ్యింది.. తనకు డ్రీమ్ కెరీర్ ను ముగిసిపోయిందని ఆమె తీవ్ర ఆవేదనకు కూడా గురైంది..

ఉద్యోగం వెతుక్కోవడంలో విసిగిపోయిన ఆమెకు.. సొంతంగా ఏదైనా మొదలు పెట్టాలని భర్త డేవిడ్ సలహా ఇచ్చాడు.. దాంతో ఇంట్లోనే చిన్న మినీ కోళ్ల ఫారం పెట్టాలనుకున్నారు.. మొదటగా ఆరు కోళ్లను కొనుక్కొచ్చారు.. అవి 6 పెరిగి పెద్దయ్యాక కోడిపుంజులు గా మారాయి.. అయినప్పటికీ ఆమె నిరాశ పడలేదు.. మళ్లీ ప్రయత్నించింది.. ఈసారి పిల్లల కోసం ప్రత్యేకంగా మంచి గుడ్లను అందించాలని ఉద్దేశంతో పెట్టాలను కొనుక్కొచ్చింది. కొన్నాళ్లకే ఆ కోళ్లు గుడ్లు పెట్టడం ప్రారంభించాయి.. ఇంట్లోకి వాడుకోగా.. మిగిలిన గుడ్లను చుట్టుపక్కల వాళ్లకు అమ్మడం మొదలుపెట్టింది.. అలా మొదలైన చిన్న ప్రయాణం ఇప్పుడు మంచి లాభాలను తెచ్చిపెట్టే వ్యాపారంగా మారిపోయింది..

ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..

అందరిలా కేవలం కోళ్లను పెంచడంతోనే ఆమె ఆగిపోలేదు.. తన కార్పొరేట్ నైపుణ్యాలను వినియోగించి పవర్ బి ఐ లాంటి టెక్నాలజీ టూల్స్‌ను వినియోగించి తన కోళ్ల ఫారానికి సంబంధించిన లెక్కలతో పాటు.. సప్లై, స్టాక్ మెసేజ్లు చేయడం కూడా ప్రారంభించింది.. ఒకప్పుడు ఏసీ గదుల్లో లాప్టాప్‌ల ముందు కూర్చుని పెద్దపెద్ద మీటింగ్లు పెట్టిన మరియా.. ఇప్పుడు పాములతో పాటు ఎలకల నుంచి తన కోళ్లను కాపాడుకుంటూ తాను నిర్మించుకున్న ఫారంను సమర్థవంతంగా నిర్వహిస్తోంది.. తన స్ట్రగుల్స్.. సక్సెస్ జర్నీని మరియా ఇటీవలే ఓ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో పంచుకుంది. అది కాస్త వైరల్‌గా మారింది..

ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

12 ఏళ్లకు ఒకసారి పూసే నీలకురింజి.. 2030 వరకు ఆగాల్సిన పనిలేదు.. మున్నార్‌లో ఇప్పుడే వికసించాయ్‌!

Hyderabad, Telangana:

Neelakurinji 2026 Blooms: ప్రకృతి ఎప్పుడు ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో ఊహించడం చాలా కష్టం.. పచ్చని కొండలపై నీలిరంగు తివాచీ పరిచినట్లు ఉండే మున్నార్ అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే పూసే అరుదైన నీలకురింజి పూల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రేమికులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు.. అయితే, ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు అందరూ అనుకున్నట్లుగా 2030 వరకు ఆగాల్సిన పనిలేదు.. ఎందుకంటే పర్యాటకులకు పెద్ద సర్ప్రైజ్ ఇస్తూ అంచనాల కంటే.. దాదాపు నాలుగు ఏళ్ల ముందే మున్నార్ కొండల్లో ఈ పూలు పూసాయి..

సాధారణంగా మున్నార్ లోని ఎరవికులం నేషనల్ పార్క్‌లో కనిపించే నీలకురింజి పూలు అత్యంత ప్రసిద్ధి.. అవి గతంలో 2018లో వికసించాయి.. ఆ తర్వాత 12 ఏళ్ల జీవిత చక్రం ప్రకారం దాదాపు 2030లో పూయాల్సి ఉంటుంది.. కానీ ప్రకృతిలో దాగివున్న అసలు మ్యాజిక్ ఇక్కడే ఉంది.. పశ్చిమ కనుమల్లో విభిన్న రకాల నీలకురింజి  మొక్కలు ఉన్నాయి.. ఇప్పుడు వికసించిన పూలు ఆ 2030 నాటి రకానికి చెందినవి కావని అక్కడున్న స్థానికులు అభిప్రాయపడుతున్నారు. చొక్రముడి, మట్టుపెట్టి ప్రాంతాల్లో పూలు తమ సొంత 12 ఏళ్ల సైకిల్‌ను ఫాలో అవుతూ ఇప్పుడు వికసించాయి.. ఇవి చివరిసారిగా 2014లో వికసించాయని.. కాబట్టి లెక్కల ప్రకారం సరిగ్గా 2026లో మళ్లీ పుసాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు..

వీటిని కొంతమంది స్ట్రోబిలాంథెస్ కుంతియానాగా కూడా పిలుస్తారు.. ఎందుకంటే వీటి శాస్త్రీయ నామం అదే కాబట్టి. మొక్కతన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పూలు పూసి.. ఆ తర్వాత విత్తనాలను రాల్చి చనిపోతూ ఉంటుంది.. ఆ విత్తనాలు మళ్లీ మొలకెత్తి పూలు పూయడానికి దాదాపు 12 ఏళ్ల సమయం పడుతుంది.. తమిళంలో నీల అంటే బ్లూ అని అర్థం.. కురుంజి అంటే పర్వతపు పువ్వు అని అర్ధాన్ని అందిస్తూ ఉంటుంది. అందమైన పూలవల్లే నీలగిరి పర్వతాలకు ఆ పేరు వచ్చింది. కేరళలో సుమారు 43 రకాల ఈ పూలకు సంబంధించిన జాతులు ఉండగా.. మున్నార్ ప్రాంతంలో సుమారు 3000 హెక్టార్లలో ఇవి విస్తరించి ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి..

ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..

ప్రస్తుతం ఛోక్రముడి కొండల వాలులో.. ఈ నీలకురుంజి పూలు పూయడం ప్రారంభించాయి.. అక్టోబర్ నెల నుంచి సెప్టెంబర్ నెలకి ఇవి మరింత విస్తరించి పూర్తిస్థాయిలో కనువిందు చేసే అవకాశాలు ఉన్నాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మట్టుపెట్టి సమీపంలో ఉండే ఎడలిమేడు, సెవెన్‌మల, గుండమల, మీసపులిమల వంటి ఎత్తైన ప్రాంతాల్లో ఈ పూలకు సంబంధించిన అరుదైన ప్రకృతి రమణీయతను వీక్షించవచ్చని వారు చెబుతున్నారు.. మళ్లీ ఈ ప్రాంతాల్లో ఈ పూలను చూడాలంటే దాదాపు 2038 వరకు ఆగాల్సిందేనట..

ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Irumudi Nizam Record: బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' ప్రభంజనం.. మెగాస్టార్ చిరంజీవి రికార్డు బ్రేక్ చేసిన రవితేజ!

Hyderabad, Telangana:

Irumudi Nizam Collection Record: తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమా థియేటర్లలో విడుదలై నేటికి విజయవంతంగా 12 రోజులు పూర్తవుతున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల జోరు ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన కలెక్షన్లు ప్రాంతీయ (రీజినల్) చిత్రాలకు సంబంధించిన అనేక పాత రికార్డులను తిరగరాస్తున్నాయి.

గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' పేరిట ఉన్న రూ.47.55 కోట్ల షేర్ రికార్డును 'ఇరుముడి' సినిమా రూ.48 కోట్ల భారీ షేర్‌తో బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.186.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ప్రతిష్టాత్మకమైన రూ.200 కోట్ల క్లబ్‌లో చేరేందుకు అత్యంత సమీపంలో ఉంది. దీనితో పాటు ఈ చిత్రంలోని "మల్లెపూల పల్లకి" పాట థియేటర్లలో, సోషల్ మీడియాలో సృష్టించిన సంచలనం ఈ విజయానికి ప్రధాన బలగంగా నిలిచింది.

చిరంజీవి రికార్డును అధిగమించిన రవితేజ
సినీ వర్గాల, ట్రేడ్ విశ్లేషకుల సమాచారం ప్రకారం.. 'ఇరుముడి' చిత్రం తెలంగాణ (TG) రాష్ట్రంలో ఊహించని రీతిలో భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో ఏకంగా రూ.48 కోట్ల అద్భుతమైన షేర్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డును సృష్టించింది.

తెలంగాణ బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యధిక షేర్ సాధించిన ప్రాంతీయ చిత్రంగా ఈ సినిమా సరికొత్త మైలురాయిని నెలకొల్పింది. ఈ క్రమంలో, గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' అనే చిత్రం సాధించిన రూ.47.55 కోట్ల షేర్ రికార్డును 'ఇరుముడి' విజయవంతంగా అధిగమించింది.

రూ.200 కోట్ల క్లబ్ దిశగా..
కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా 'ఇరుముడి' చిత్రం వసూళ్ల పరంగా అద్భుతమైన ఘనతలను సాధిస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.186.5 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్ల స్పీడ్ చూస్తుంటే, అతి త్వరలోనే ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన రూ.200 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

'మల్లెపూల పల్లకి' పాట క్రేజ్
ఈ చిత్రం సాధించిన భారీ విజయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది జానపద గాయకుడు డప్పు శ్రీనివాస్ (డప్పు శ్రీను) రాసి, స్వరపరిచిన "మల్లెపూల పల్లకి" పాట. థియేటర్లలో ఈ పాట వచ్చే సమయంలో ప్రేక్షకులు, రవితేజ అభిమానులు, అయ్యప్ప భక్తులు హారతులు ఇస్తూ భక్తితో స్టెప్పులు వేస్తున్నారు.

యూట్యూబ్‌లో ఇప్పటికే ఈ పాట 24 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ఈ పాటకున్న క్రేజ్‌ను గుర్తించి సినిమాలో ప్రత్యేకంగా నిలిపారు. ఈ అద్భుతమైన పాటను అందించినందుకు గానూ చిత్ర నిర్మాతలు డప్పు శ్రీనుకు అక్షరాల రూ.9 లక్షల భారీ పారితోషికం (రెమ్యునరేషన్) అందించడం విశేషం.
 

Also Read: రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తోన్న 'ఇరుముడి'..బాక్సాఫీసు వద్ద రవితేజ సినిమా రికార్డు!

Also Read: 'ఇరుముడి'లో 'మల్లెపూల పల్లకి' సెన్సేషన్.. సింగర్ డప్పు శ్రీనుకు భారీ రెమ్యునరేషన్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Ganesh Chaturthi: గణేశ్‌ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. మండపాలకు ఉచిత విద్యుత్‌

Baddipadaga, Telangana:

Ganesh Mandap Free Electricity: దేశంలోనే అత్యంత వైభవంగా హైదరాబాద్‌లో గణేశ్‌ ఉత్సవాలు జరగనుండగా.. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉత్సవ నిర్వాహకులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వినాయక చవితి ఉత్సవాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటుచేయనున్న గణేశ్‌ మండపాలకు ఈసారి కూడా ఉచిత విద్యుత్‌ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శోభాయమానంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని ఆదేశించింది. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టాలని సూచించింది.

రాష్ట్రంలో అన్ని  గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పర్యావరణహిత వేడుకలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సమస్యలను ఇబ్బందులను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలని సూచించారు. భద్రత, రక్షణ, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, నిరంతర విద్యుత్ అందించాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, డీజేల వినియోగాన్ని పూర్తిగా నిషేధిద్దామని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్ గణేష్ ఉత్సవ వేడుకలు-2026 ఉన్నతస్థాయి సన్నాహక  సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే గణేష్ నవరాత్రి ఉత్సవాలను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల్లో ఘనంగా ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కలసి పనిచేయాలని మంత్రి సంబంధిత శాఖల ఉన్నతాధికారులను  మంత్రి ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని రాష్ట్రంలోని  గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని.. మండపాల నిర్వాహకులు నిర్దేశిత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లో సుమారు 47 సంవత్సరాలుగా కొనసాగుతున్న గణేష్ ఉత్సవాల సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. గత అనుభవాల్లో ఎదురైన సమస్యలు, లోపాలను ముందుగానే గుర్తించి సరిచేసుకోవాలని ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్సవాలు, నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో  ట్రాఫిక్ నియంత్రణ, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్‌ శాఖకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. షీ టీమ్స్, యాంటీ-థెఫ్ట్ నిఘా బృందాలను వినియోగించడంతోపాటు శాంతిభద్రతలు, మత సామరస్యాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.

మున్సిపల్ శాఖలు 24 గంటల పాటు పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని,  రోడ్డు మరమ్మతులు చేపట్టాలని, వీధి దీపాలను సక్రమంగా నిర్వహించాలని, బేబీ పాండ్ల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఫాగింగ్, బయో టాయిలెట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కొత్తగా ప్రారంభించిన మున్సిపల్ కార్పొరేషన్ల లోగోలను విస్తృతంగా ప్రదర్శించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.

వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కీలక ప్రాంతాల్లో 24 గంటల వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో పాటు ప్రథమ చికిత్స సామగ్రి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, అంబులెన్సులు, షిఫ్ట్‌ల వారీగా వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు  హనుమంతరావు, ఎంపీ  అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు  దానం నాగేందర్, నవీన్ యాదవ్, రఘువీర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, డీజీపీ  సీవీ ఆనంద్, ఏడీజీపీ  మహేష్ భగవత్, పోలీస్ కమిషనర్లు సజ్జనార్, రమేశ్‌, సుమతి, జాయింట్ సీపీ ట్రాఫిక్  జోయెల్ డేవిస్, సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా, నారాయణ రెడ్డి, ఎండోమెంట్స్ కమిషనర్  హనుమంతరావు, ఆరోగ్య శాఖ కమిషనర్  సంగీత సత్యనారాయణ, టూరిజం ఎండీ  గౌతమి, టీజీఎస్‌పీడీసీఎల్ ఎండీ జితేష్ పాటిల్, సాంస్కృతిక శాఖ సంచాలకులు  నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0
0
Report
Advertisement

Nepal Compensation: "భారత్, చైనా, అమెరికా వల్లనే వరదలు వచ్చాయి": నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా!

Golche, Bagmati Province:

Nepal Wants Compensation: ఆగస్టు 26న భోటేకోశి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన ఘోర వరదలు నేపాల్‌లోని రసువా, నువాకోట్, ధాడింగ్ జిల్లాలను అతలాకుతలం చేశాయి. నేపాల్ అధికారులు 'హిమాలయ సునామీ'గా అభివర్ణించిన ఈ విపత్తులో కనీసం 1,127 మంది మరణించగా, సుమారు 3,900 మంది గల్లంతయ్యారు. ఇళ్లు, రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు దారుణంగా ధ్వంసమయ్యాయి. ఈ నష్టాల నుండి కోలుకుని కీలక మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి నేపాల్‌కు దాదాపు 4 నుండి 5 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 10 శాతం కావడం గమనార్హం.

ఈ ఘోర విపత్తు నేపథ్యంలో, నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ స్పందిస్తూ.. ఇది కేవలం విరాళాలు కోరే మానవతా అత్యవసర పరిస్థితి కాదని, ఉద్గారాలకు బాధ్యత వహించాల్సిన దేశాల నుండి పొందాల్సిన చట్టపరమైన, నైతిక హక్కు అని స్పష్టం చేశారు. వాతావరణ విపత్తు బాధితులకు సహాయపడేందుకు ఏర్పాటైన 'ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డామేజ్'కు నేపాల్ ఇప్పటికే అధికారిక అభ్యర్థన పంపింది. 

తొలుత సహాయక చర్యల కోసం విదేశీ సహాయాన్ని నిరాకరించినప్పటికీ, పరిస్థితి తీవ్రతను బట్టి కాఠ్మండు ప్రభుత్వం భారత్, చైనా, ఇతర దేశాల నుండి ప్రత్యేక రెస్క్యూ బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు, బెయిలీ వంతెనల సహాయాన్ని కోరింది. భూకంపాలు సంభవించే అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతంలో చైనా నిర్మించిన మౌలిక సదుపాయాల భద్రతపై కూడా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణాసియా వ్యాప్తంగా కోట్లాది మందికి జీవనాధారమైన హిమాలయ నదీ వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయని ఖనాల్ హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్‌కు అతి తక్కువగా దోహదపడిన నేపాల్ వంటి బలహీన దేశాలు, పునర్నిర్మాణ కార్యక్రమాలకు ఒంటరిగా నిధులు సమకూర్చుకోలేవని ఆయన స్పష్టం చేశారు.

ఈ వాతావరణ పరిహార డిమాండ్‌ను మరింత బలోపేతం చేసేందుకు, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 81వ సర్వసభ్య సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించడానికి ప్రధాని బాలేంద్ర షా స్వయంగా న్యూయార్క్ వెళ్లే అవకాశం ఉంది. అయితే, వాతావరణ బాధ్యతకు సంబంధించిన వివాదం అత్యంత సంక్లిష్టంగా మారింది. 

యూరోపియన్ కమిషన్ 2024 నివేదిక ప్రకారం భారత్ కూడా అగ్ర ఉద్గార దేశాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, చారిత్రక, తలసరి ఉద్గారాల పరంగా భారత్ వాటా చాలా తక్కువ. భారతదేశ తలసరి ఉద్గారాలు కేవలం 3 టన్నులు కాగా, చైనా తలసరి 11 టన్నులు, అమెరికా 17 టన్నులుగా ఉన్నాయి. అందువల్ల, ముందుగా పారిశ్రామికీకరణ చెంది ప్రయోజనం పొందిన ధనిక దేశాలే అధిక బాధ్యత వహించాలని భారత్ నిరంతరం వాదిస్తోంది.

Also Read: నేపాల్‌లో పెను విలయం..ఆకస్మిక వరదలకు 392 మంది మృతి..290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు!

Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Mamitha Baiju Hospitalised: నటి మమితా బైజుకు తీవ్ర అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక..ఆస్ట్రేలియా పర్యటన రద్దు!

Hyderabad, Telangana:

Mamitha Baiju Hospitalised News: చిత్రసీమలో వరుస విజయాలతో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ యువ కథానాయిక మమితా బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఆస్ట్రేలియా పర్యటన రద్దు..వేడుకలు వాయిదా..
సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా జరగాల్సిన 'క్లైడ్ ఓనం 2026' వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, వైద్యుల సలహా మేరకు ఆమె తన ఆస్ట్రేలియా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని 'క్లైడ్ మలయాళీ అసోసియేషన్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూనే, ఆమె లేకపోవడంతో ఓనం వేడుకలను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

అభిమానులకు క్షమాపణలు చెప్పిన మమిత..
ఈ మేరకు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమితా బైజు ఈ వీడియోలో స్వయంగా మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల వల్ల, వైద్యుల సూచనల మేరకు తాను ప్రయాణం చేయలేకపోతున్నానని తెలిపారు. 

ప్రయాణాలు చేయడం వల్ల శారీరక నొప్పులు, అలర్జీలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని డాక్టర్లు హెచ్చరించారని, పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. తనను ఎంతగానో ఆహ్వానించిన నిర్వాహకులకు, ఆస్ట్రేలియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలోనే పూర్తిగా కోలుకుని కలుసుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజ్..
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వరుస హిట్‌లతో మమితా బైజు కెరీర్ అద్భుతంగా సాగుతోంది. మలయాళంలో 'సూపర్ శరణ్య', 'ప్రేమలు' వంటి చిత్రాలతో అద్భుతమైన విజయాలు అందుకున్న ఆమె, జి.వి. ప్రకాష్ కుమార్ సరసన 'రెబెల్' సినిమాతో తమిళంలో ప్రవేశించారు. ఆ తర్వాత వచ్చిన 'డ్యూడ్' సినిమా కూడా తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ 2026 సంవత్సరంలోనే ఆమె నటించిన నాలుగు సినిమాలు విడుదల కాగా, నెల రోజుల వ్యవధిలో విడుదలైన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించాయి.

ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం 'బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌' తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఇంతటి బిజీ షెడ్యూల్స్, సినిమా విడుదల ఉన్న తరుణంలో నటి ఆసుపత్రిలో చేరడం ఆమె అభిమానులను కలవరపెడుతోంది. ఒకే ఏడాదిలో ఇన్ని వరుస విజయాలు అందించిన మమితకు దిష్టి తగిలి ఉంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.

Also Read: రూ.200 కోట్ల దిశగా దూసుకెళ్తోన్న 'ఇరుముడి'..బాక్సాఫీసు వద్ద రవితేజ సినిమా రికార్డు!

Also Read: 'దశావతారం' థీమ్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10..సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంఛ్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Thalliki Vandanam: విద్యార్థులకు శుభవార్త.. 'తల్లికి వందనం' నిధులు మరోసారి విడుదల..లిస్ట్ వచ్చేసింది!

Vijayawada, Andhra Pradesh:

Thalliki Vandanam 2026 Funds: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక అడ్డంకులు లేకుండా చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రధాన విడత నిధులను అర్హుల ఖాతాల్లో విజయవంతంగా జమ చేసిన సంగతి తెలిసిందే.

అయితే, నూతనంగా పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులతో పాటు, అర్హత కలిగి ఉండి కూడా వివిధ సాంకేతిక సమస్యల వల్ల నిధులు అందుకోలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో సువర్ణావకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కూడా ఈ దఫాలోనే పథకం లబ్ధి చేకూరుతుంది.

వాయిదా వెనుక కారణాలు
నిజానికి, ఈ పెండింగ్ నిధులను ఆగస్టు 30వ తేదీనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులు తొలుత ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ బ్యాంకులకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో ఆర్థిక లావాదేవీల ప్రక్రియకు సాంకేతిక అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ సెలవుల కారణంగా నిధుల జమ ఆలస్యం కాగా, అధికారులు తాజా షెడ్యూల్‌ను నిర్ధారించారు. దీని ప్రకారం, వచ్చే వారం అంటే సెప్టెంబర్ 7 లేదా 8వ తేదీల్లో అర్హులైన లబ్ధిదారుల తల్లుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయడానికి రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

అర్హుల గుర్తింపు..పరిశీలన ప్రక్రియ..
గతంలో నిధులు అందని తల్లుల నుండి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అభ్యంతరాలు, నూతన దరఖాస్తులను స్వీకరించింది. సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి, అర్హులైన సుమారు 2.80 లక్షల మందితో తుది లబ్ధిదారుల జాబితాను ఖరారు చేశారు. ఈ జాబితాలను ఇప్పటికే స్థానిక సచివాలయాల్లో ప్రజల సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించారు. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, గుర్తింపు పొందిన విద్యాసంస్థలలో చదివే అర్హత గల విద్యార్థులందరికీ ఈ ఆర్థిక భరోసా లభిస్తుంది.

ఆర్థిక సహాయం, మౌలిక వసతుల నిధులు..
ఈ పథకం ద్వారా ఏటా ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15,000 చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల మౌలిక సదుపాయాల మెరుగుదల, నిర్వహణ అవసరాల కోసం ఇందులో రూ. 2,000 నిధులను మినహాయించి, ఆ మొత్తాన్ని ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాలకు బదిలీ చేస్తారు. మిగిలిన రూ.13,000 లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేస్తారు. 

Also Read: Botsa Satyanarayana KA Paul: బొత్స సత్యనారాయణపై కేఏ పాల్ ఆగ్రహం..బొత్సకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్!

Also Read: చిలకలూరిపేట ఘోర రోడ్డు ప్రమాదం..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందజేత!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report
Advertisement

నమ్మినవాళ్లే మోసం చేస్తున్నారా? చాణక్య నీతిలో ఈ 5 సూత్రాలతో వారికి చెక్ పెట్టండి!

Hyderabad, Telangana:

Chanakya Niti Rules: మన జీవితంలో కొన్నిసార్లు బయట వ్యక్తుల కంటే.. మనకు అత్యంత సన్నిహితంగా ఉండే సొంత మనుషులే ఎక్కువ బాధ పెడుతూ ఉంటారు.. మన ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయతో రగిలిపోయే బంధువులతో పాటు మిత్రులు మన చుట్టూనే ఉండిపోతూ ఉంటారు.. వాళ్లు మనపై కుట్రలు పన్నుతున్నారని తెలిసినప్పుడు చాలామంది ఆవేశంతో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వేల ఏల క్రితమే ఆచార్య చానక్యుడు తన చాణక్య నీతి శాస్త్రంలో స్పష్టంగా వివరించారు. సన్నిహితులు ద్రోహానికి పాల్పడినప్పుడు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా.. చాణక్యుడు సూచించిన ఐదు పద్ధతులను పాటిస్తే మిమ్మల్ని మీరు సులభంగా కాపాడుకోవచ్చు..

ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది..
మీరు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులు మీకు ద్రోహం చేస్తున్నారని.. లేదా మీపై కుట్రలు చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఆవేశపడకుండా ఉండడం చాలా మంచిది.. కోపంతో రగిలిపోతూ అప్పటికప్పుడు స్పందించడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశాలు ఉంటాయని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మీకే నష్టం కలగవచ్చు.. కాబట్టి ఆ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిదని.. ముఖ్యంగా మౌనంగా ఉండి పరిస్థితులను అంచనా వేయడం చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్ గా చెబుతోంది..

మీ సీక్రెట్స్ ఎవరితో పంచుకోకూడదు..
కుటుంబంలో నమ్మకం చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు.. కానీ అందరితో అన్నీ పంచుకోవడం తెలివైన పని కాదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. మీ ఆర్థిక పరిస్థితులతో పాటు భవిష్యత్తు ప్రణాళికలు.. మీలోని బలహీనతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పకండి. మీ మాటలను వక్రీకరించి.. మీ రహస్యాలను మీకే ఆయుధంగా మలిచే ప్రమాదం కూడా ఉందని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాల పట్ల ఎప్పుడు సీక్రెట్ మైంటైన్ చేయడం చాలా మంచిది..

ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులను అస్సలు నిందించకూడదు..
అనుమానం వేరు.. వాస్తవం వేరు.. మీపై ఎవరో కుట్రలు చేస్తున్నారని అనుమానం వచ్చిన వెంటనే వారిపై నిందలు వేయడం అస్సలు మంచిది కాదు.. ముందుగా అసలు నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి.. పక్క ఆధారాలు సేకరించిన తర్వాతే నిలదీయడం మంచిదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. సరైన ఆధారాలు లేకుండా బంధువులను, స్నేహితులను వేలెత్తి చూపుతే ఎన్నో రకాల గొడవలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని చాణక్యనీతి శాస్త్రం క్లియర్గా చెబుతోంది..

అనవసరంగా గొడవలకు దిగొద్దు..
ప్రతి సమస్యకు గొడవ పడడమే పరిష్కారం కాదు.. కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఘర్షణ పడటం వల్ల ఇంట్లో ప్రశాంతత ఊహించని స్థాయిలో దెబ్బతిని అవకాశాలున్నాయి. కొన్నిసార్లు దీని ప్రభావం ఇంట్లో పిల్లలతో పాటు వృద్ధులపై తీవ్రంగా పడుతుందని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. కాబట్టి అసలైన సమయం కోసం వేచి చూడాల్సి ఉంటుంది.. సరైన సమయం వచ్చినప్పుడు మీ వాదనలను సున్నితంగా.. కానీ గట్టిగా కానీ వినిపించడం చాలా మంచిది. వివాదాలను ఎప్పటికప్పుడు శాంతి మార్గంలో పరిష్కరించుకోవడం చాలా మంచిదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్ గా చెబుతోంది.

ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..

అవసరమైతే దూరంగా ఉండండి..
ఒక వ్యక్తి పదే పదే మీ నమ్మకాన్ని వమ్ము చేస్తే.. ఉద్దేశపూర్వకంగా మీకు హాని తల పెడితే.. వారిని భరించాల్సిన అవసరం లేదు.. వారితో శాశ్వత బంధం పెంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. వారితో కేవలం అవసరమైతే మాట్లాడండి.. అన్నింటికంటే మీ మానసిక ప్రశాంతత తో పాటు సెక్యూరిటీ చాలా ముఖ్యం.. కాబట్టి ఎప్పుడు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించడం చాలా మంచిది..

ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

పెళ్లి వేడుకల్లో విషాదం.. డీజే సౌండ్‌కు డాన్స్ చేస్తూ 17 ఏళ్ల యువకుడు మృతి!

Hyderabad, Telangana:

Narayanpet Dj Death: స్నేహితుడు పెళ్లి వేడుకల్లో ఆ యువకుడు అందరిలాగే ఉత్సాహంగా డాన్స్ చేస్తూ ఉన్నాడు.. చెవులు చిల్లుపడే డిజె సౌండ్స్ మధ్య స్నేహితులతో కలిసి సందడి చేస్తున్నాడు.. కానీ కాసేపట్లోనే ఆ ఆనందం ఆవిరి అయిపోయింది. డిజె సౌండ్ ల తీవ్రతకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.

పోతిరెడ్డిపల్లి కి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ (17) అక్కడే ఉన్న ఓ కాలేజీలో ఇంటర్ చేస్తున్నాడు.. అయితే తనకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉండడంతో రాత్రి సమయంలో ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్లాడు.. వివాహ సంబరాల్లో భాగంగా భారీ శబ్దాలతో డీజేలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే స్నేహితులందరూ కలిసి ఆ డిజె సౌండ్స్ మధ్య అందరూ కలిసి బాగా డాన్స్ చేస్తున్నారు..

అయితే ఇంతలోనే.. డిజె సౌండ్స్ తాకిడికి ఆ యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గమనించిన స్నేహితులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు.. రవితేజ అప్పటికే తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారణ చేశారు..

చేతికి అందించిన కొడుకు అకాల మరణంతో కానరాని లోకంలోకి వెళ్లడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అనుకున్న కొడుకు ఇలా విగత జీవిగా మారడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు.. వివాహ వేడుకలు ఒక్కసారిగా ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి..

మితిమీరిన శబ్దాలతో వచ్చే డీజేల కారణంగానే ఇప్పటివరకు ఎంతోమంది అస్వస్థకు గురవ్వడమే కాకుండా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ ఆంక్షలు ఎన్ని ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో డీజేల వినియోగం ఏమాత్రం ఆగడం లేదు.. చిన్న పెద్ద తేడా లేకుండా ఎలాంటి వేడుకలైనా డీజేలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మారి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. నిబంధనలను ఉల్లంఘించి విపరీతమైన శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న డీజే ఆపరేటర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నిపుణులు కోరుతున్నారు..

Read more: Jagtial: వామ్మో.. హోటల్లో ఇలా కూడా బిల్ వసూలు చేస్తారా..?.. జగిత్యాలలో షాకింగ్ ఘటన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Telangana SIR: సర్‌ ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన.. రెండు రోజులు ప్రత్యేక ప్రచారం

Baddipadaga, Telangana:

Telangana SIR: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు సాగిన సర్‌ ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ, ఫిర్యాదులు తదితర అంశాలపై ప్రకటన విడుదల చేసింది. సర్‌కు సంబంధించి ప్రత్యేక ప్రచారం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను 17.08.2026న ఆయా ఈఆర్‌ఓ కార్యాలయాల్లో ప్రచురించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితాతో పాటు ఏఎస్‌డీడీ ఓటర్ల వివరాలను సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్ (https://ceotelangana.nic.in)లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

ముఖ్య వివరాలు, గడువులు
క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు: ఆగస్టు 17 నుంచి ఈనెల 16వ తేదీ వరకు
నోటీసుల జారీ, పరిష్కారం: 17.08.2026 నుండి 15.10.2026 వరకు
ప్రత్యేక ప్రచార (స్పెషల్ క్యాంపెయిన్) తేదీలు
- మొదటి విడత: ఈనెల 5 నుంచి 6వ తేదీ వరకు
- రెండో విడత: ఈనెల 12వ తేదీ నుంచి 13 వరకు

ప్రస్తుత పురోగతి
మొత్తం 92,88,112 నోటీసులు రూపొందించగా 31,74,952 నోటీసులు అందాయి. 1,94,737 నోటీసులపై విచారణ పూర్తయింది. మిగిలిన నోటీసులను 119 మంది ఈఆర్‌ఓలు, 1,973 మంది ఏఈఆర్‌ఓల ద్వారా గడువులోగా విచారించనున్నారు.
మొత్తం క్లెయిమ్‌లు, అభ్యంతరాలు: 9,07,292
  - ఫారం-6 (కొత్త ఓటరు): 3,94,517
  - ఫారం-6ఏ (ప్రవాస భారతీయులు): 6,346
  - ఫారం-7 (పేర్ల తొలగింపు): 48,752
  - ఫారం-8 (సవరణలు/మార్పులు): 4,57,677

ప్రత్యేక ప్రచార దినాలలో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలను లేదా ఈఆర్‌ఓ కార్యాలయాలను సందర్శించి తమ పేర్లను సరిచూసుకోవాలని, ఫారాలు 6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ముఖ్య ఎన్నికల అధికారి కోరారు.

0
0
Report
Advertisement

MPLADS: ఎంపీ లాడ్స్‌ నిధులపై దుష్ప్రచారం.. నిధులన్నీ ఉపయోగించాం: బండి సంజయ్‌

Karimnagar, Telangana:

MPLADS Usage: 'ఎంపీ లాడ్స్ నిధులన్నీ వినియోగించాం. నా పరిధిలో రూ.17.50 కోట్ల నిధులు వస్తే రూ.16.47 కోట్లు వినియోగించాం. మొత్తం నిధుల్లో 94 శాతం పనులు పురోగతిలో ఉన్నాయి' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ప్రకటించారు. 'అసలే ఎంపీ నిధులు సరిపోక ఇబ్బంది పడుతున్నాం. ఎంపీ లాడ్స్ నిధులు పెంచాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. అయినా నిధులే వినియోగించడం లేదని దుష్ప్రచారం సరికాదు' అని వివరించారు.

ఎంపీ లాడ్స్‌ నిధులు వినియోగించలేదని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఖండించారు. ఎంపీల గౌరవాన్ని తగ్గించేందుకు ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ లాడ్స్ నిధులు సరిపోక సీఎస్సార్ నిధులను సేకరిస్తూ ప్రజల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ నివేదికను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కేటాయిస్తున్న ఎంపీ లాడ్స్ నిధులను వినియోగించుకోవడంలో పార్లమెంట్ సభ్యులు పూర్తిగా వెనుకబడిపోతున్నారంటూ ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ విడుదల చేసిన నివేదిక సత్య దూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు.

ఎంపీ లాడ్స్ కింద పంపిన ప్రతిపాదనలకు సంబంధించి పనుల పురోగతి వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఎంపీలపై అభాండాలు వేయడం సరికాదని బండి సంజయ్‌ తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం విషయానికొస్తే ఎంపీ లాడ్స్ కింద రూ.17.50 కోట్లు కేటాయించగా.. దీనిలో ఇప్పటికే రూ.16.47 కోట్లు వినియోగించామని వివరించారు. మొత్తంగా కేంద్రం కేటాయించిన రూ.17.5 కోట్లలో 94.1 శాతం మేరకు అంటే రూ.16.47 కోట్ల నిధులకు సంబంధించిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. 

కేంద్రం యేటా కేటాయిస్తున్న ఎంపీ లాడ్స్ నిధులు సరిపోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ సమయంలో ఎంపీ లాడ్స్ నిధులే ఖర్చు చేయడం లేదంటూ ఎంపవర్డ్ ఇండియన్ సంస్థ ప్రచారం చేయడం అన్యాయమని తప్పుబట్టారు. ఎంపీ లాడ్స్ నిధుల కేటాయింపు, ఎంపీల ప్రతిపాదనలు, జిల్లా కలెక్టర్ల ఆమోదం, వివిధ శాఖల అధికారుల కార్యాచరణ, అధికారుల అమలు, పనుల పూర్తి వరకు అనేక దశలు ఉన్నాయని వెల్లడించారు. ఎంపీ లాడ్స్ నిధులనే వినియోగించుకోవడం లేదని ఆరోపణలు చేయడమంటే బట్ట కాల్చి మీద వేయడమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. 

'ఈ ఆర్థిక సంవత్సరం ముగింపుకు మరో 7 నెలల సమయం ఉన్నప్పటికీ నా వద్ద ఎంపీ లాడ్స్ నిధులే మిగలలేదు. ఆ నిధులకు సంబంధించిన ప్రతిపాదనలన్నీ ఎప్పుడో సంబంధిత జిల్లాల కలెక్టర్లకు పంపాం. స్థానిక సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధుల కోసం సీఎస్సార్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఫండ్స్ ను సేకరిస్తున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వివరించారు.

0
0
Report

Govt Employees: రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యోగుల భారీ ఆందోళన.. దద్దరిల్లిన సచివాలయం

Baddipadaga, Telangana:

Govt Employees DA Hike: సుదీర్ఘ కాలంగా తమ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు భత్యం, పీఆర్‌సీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ తదితర డిమాండ్లు పరిష్కరించని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం రోజు తమ ఆందోళనలను తీవ్ర రూపం చేశారు. తమ నిరసన కార్యక్రమాలతో హైదరాబాద్‌ను దద్దరిల్లేలా చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులు హైదరాబాద్‌లోని సచివాలయం, కలెక్టరేట్‌, భీమా భవన్‌, గగన్‌ విహార్‌ కాంప్లెక్స్‌ తదిదతర ప్రాంతాల్లో మహాధర్నా చేపట్టారు. సెక్రటేరియేట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో బాహుబలి గేట్ వద్ద మహా గర్జన చేశారు. రెండో వేతన సవరణ సంఘం, డీఏ, పెండింగ్ బిల్లులు, ఈహెచ్‌ఎస్‌, ఓపీఎస్‌, డీపీసీ వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల మహా గర్జన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెక్రటేరీయేట్ పరిసర ప్రాంతాల్లో పోలీసుల భారీగా మోహరించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాతన పింఛన్‌ పథకం (ఓపీఎస్) అమలు చేయాలని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్, ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని గగన్ విహార్‌, భీమా భవన్, హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్‌ల వద్ద పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్, ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10వ తేదీన చేపట్టనున్న చలో హైదరాబాద్‌కు ప్రతి ఒక్క ఉద్యోగి పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని కానీ తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరసనలు చేపడుతున్నట్లు వివరించారు.

తమ సమస్యలపై రేవంత్‌ రెడ్డి చొరవ తీసుకొని వెంటనే పీఆర్సీ అమలు చేయాలని ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని.. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. సీపీస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరణ, తక్షణ ఆరోగ్య సేవల సాధన చేయాలని విజ్ఞప్తి చేశారు. తాము రోడ్డెక్కే పరిస్థితి రాకుండా రేవంత్‌ రెడ్డి చొరవ చూపాలని.. లేకపోతే తమ ఉద్యమాన్ని తీవ్ర రూపం చేస్తామని హెచ్చరించారు.

0
0
Report

Sajjala vs Vijaya Sai: విజయసాయి రెడ్డిని సజ్జల కొట్టింది వాస్తవమే! ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటన

Amancherla, Andhra Pradesh:

YSRCP Attack: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకులుగా గుర్తింపు పొందిన విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి మధ్య పెద్ద వివాదమే నడిచిందని.. ఈ క్రమంలో విజయసాయిపై సజ్జల దాడి చేశాడనే ప్రచారం తీవ్ర వివాదం రేపుతోంది. ఈ వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. విజయసాయిని సజ్జల కొట్టింది నిజమేనని సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు తెలిపారు.

'విజయసాయి రెడ్డిని సజ్జల రామకృష్ణా రెడ్డిని కొట్టింది వాస్తవమే. సజ్జల, విజయసాయి రెడ్డి మధ్య అంతర్గత వ్యవహారం నడుస్తోంది' అని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. విజయసాయి రెడ్డి తన గురించి తప్పుగా మాట్లాడారని.. తనకేమి అతడి మీద ప్రేమ లేదని స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి కొట్టిన మాట వాస్తవం అని పునరుద్ఘాటించారు. 2022లో మంగళగిరిలో జరిగిన ప్లీనరీ రెస్ట్ రూమ్‌లో ఈ ఘటన జరిగిందని కీలక ప్రకటన చేశారు.

'వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో వేదిక మీద ఎవరితో మాట్లాడించాలి అనే విషయంపై గొడవ వచ్చింది. ఉత్తరాంధ్ర నుంచి కొన్ని పేర్లు విజయసాయి రెడ్డి సూచిస్తే చొక్కా పట్టుకుని సజ్జల కొట్టారు' అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో సంచలన విషయం తెలిపారు. 'మరో అవమానం కూడా జరిగింది అది నాకు తెలుసు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపాడుకు ఎంపీగా ఉన్న సమయంలో విజయసాయి రెడ్డి వచ్చారు. అప్పట్లో కాకుపల్లి వద్ద 100 కార్లు పెట్టి గౌరవంగా స్వాగతం పలికి మాలలు వేశా. వారం నేను అమరావతికి వెళ్లినప్పుడు సజ్జల నన్ను పిలిచి విజయసాయి రెడ్డి గురించి నీచంగా మాట్లాడారు' అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు.

'ఎందుకు అన్ని కార్లు పెట్టావని అడిగారు. నేను సరదాగా తీసుకున్నాను. అత్యంత ఖరీదైన తప్పు (కాస్ట్లీస్ట్ మిస్టీక్) చేశావ్ అని నన్ను సజ్జల అన్నాడు' అని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. సజ్జలకు సంబంధించిన మరో విషయాన్ని బయటపెట్టారు. 'అమరావతి రైతులు నెల్లూరుకి వచ్చినప్పుడు వర్షంలో ఇరుక్కున్నారు. నేను దారిలో వెళ్తూ వారిని కలిసి సామాన్యుడిగా మాట్లాడా. అమరావతి కోసం నేను రాలేదు. వరదల్లో చిక్కుకున్నారు. మీకు మెరుగైన వసతి చూపిస్తాం రూరల్ దాటే వరకు ఏమి అవసరం ఉన్నా మాట్లాడమని చెప్పా' అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 

'ఆ రోజు సాయంత్రం నాకు సజ్జల కాల్ చేసి మాట్లాడారు. ఎందుకు వెళ్లావు అని అడిగారు. రెండోసారి నన్ను కాస్ట్లీస్ట్ మిస్టీక్ చేశావ్ అన్నారు' అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. వరుసగా ఇలా చెప్పి సజ్జలకు తాను కౌంటర్‌ ఇచ్చానని తెలిపారు. 'ఇలా మాట్లాడి నువ్వు కాస్ట్లీస్ట్ మిస్టీక్ చేయవద్దు అని సజ్జలకి సమాధానం ఇచ్చా' అని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. గత సాధారణ ఎన్నికలకు ముందు వరకు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వైఎస్సార్‌సీపీలో కొనసాగిన విషయం తెలిసిందే. వైఎస్సార్‌సీపీలో జరిగిన ఉదంతాలు చెప్పడంతో ఇప్పుడు ఆ పార్టీ సమాధానం ఇచ్చుకోలేక ఇరుకున పడింది.

0
0
Report
Advertisement
Advertisement
Back to top