శివారాంపల్లి లో బస్ ఆక్సిడెంట్, తప్పిన పెను ప్రమాదం..
Hyderabad, Telangana:రంగారెడ్డి జిల్లా... రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంఘర్ చౌరస్తా వద్ద తప్పిన ప్రమాదం... అతివేగంగా వచ్చి రోడ్డుపైనున్న సిసి కెమెరా స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు... బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు బస్సు ను అక్కడ నుంచి తరలించి, గాయాలైన వారిని ప్రాథమిక చికిత్స అందించారు..हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Vemulawada: దక్షిణ కాశికి పూర్వవైభవం.. CM రేవంత్ రెడ్డి నేతృత్వంలో వేములవాడ మాస్టర్ ప్లాన్ అమలు..
Hyderabad, Telangana:Vemulawada Temple Latest News: దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఆలయ పునర్నిర్మాణంతో పాటు భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించడమే లక్ష్యంగా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం భారీ మార్పులతో పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఆలయ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరింది..
కొత్తగా నియామకమైన ఈ అథారిటీకి ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి స్వయంగా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడికి కమిటీలో కీలక స్థానం కల్పించారు. అలాగే వేములవాడ తో పాటు సిరిసిల్ల నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు. దీనివల్ల స్థానిక సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి వెళ్లి నిధుల మంజూరు సులభతరం అవుతుంది..
అధారిటీలో కేవలం రాజకీయ నేతలకే కాకుండా పరిపాలనలో పారదర్శకత కోసం ఉన్నత అధికారులకు కూడా చోటు కల్పించారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ జిల్లా అటవీశాఖ అధికారులను ఈ అథారిటీలో కీలకమైన మెంబర్లుగా ఉంచినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా రాష్ట్ర ఫైనాన్స్తో పాటు దేవాదాయ శాఖకు చెందిన ఉన్నత అధికారులు, ప్రభుత్వం తరఫున ఆరుగురు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను కూడా నియమించినట్లు తెలుస్తోంది. మీరు ఆలయ వాస్తు తో పాటు ఆగమన శాస్త్రం, పర్యాటక రంగంలో అనుభవం ఉన్న నిపుణులుగా ఉండే అవకాశం ఉంది..
Read more: BRS KTR Tweet: బేటా భగావో.. బేటా బచావో.. బండి సంజయ్ కొడుకు పోక్సోపై కేటీఆర్ సెటైరికల్ ట్విట్..
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేయడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం.. కోనేరు అభివృద్ధితో పాటు భక్తుల కోసం క్యూ లైన్లు ఆధునీకరణ, వసతి గృహాల నిర్మాణం, ఆలయ విస్తరణ పనులపై ఈ అథారిటీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహాశివరాత్రితో పాటు ఇతర పండగల సమయాల్లో వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరచబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం పట్ల వేములవాడ ప్రజలతో పాటు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చైర్మన్ గా ఉండడంతో రాజన్న క్షేత్రానికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read more: BRS KTR Tweet: బేటా భగావో.. బేటా బచావో.. బండి సంజయ్ కొడుకు పోక్సోపై కేటీఆర్ సెటైరికల్ ట్విట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NEET 2026: మళ్లీ మొదటికే.. నీట్ పేపర్ లీక్, పరీక్షను రద్దు చేస్తూ NTA సంచలన నిర్ణయం!
Hyderabad, Telangana:NEET UG May 3 exam cancelled: నీట్ పరీక్ష 2026 దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో మే 3వ తేదీ ఆదివారం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 551 కేంద్రాలతో పాటు అంతర్జాతీయంగా సిటీలో 14 సెంటర్లలో నిర్వహించారు. మొత్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే రాజస్థాన్ పరీక్ష కేంద్రంలో పేపర్ లీక్ అయిన వార్త కలకలం రేపుతోంది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ పరీక్షను 2026 రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
పరీక్ష జరిగిన మరుసటి రోజు నుంచి నీట్ పేపర్ లీక్ అయిందని వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా నీట్ రాసిన విద్యార్థులకు ఎన్టీఏ షాక్ ఇచ్చింది. పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ సంబంధించిన తేదీలను అతి త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
మన దేశంలో నీట్ అనేది ఒక కీలకమైన పరీక్ష. దేశవ్యాప్తంగా వివిధ మెడికల్ కోర్సుల్లో కాలేజీల ప్రవేశాలకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షల నిర్వహిస్తుంది. దీంతో MBBS, BDS, BAMS, BHMS, BVSC కోర్సుల్లో అడ్మిషన్ దొరుకుతుంది. ఈ సీట్ల కేటాయింపునకు నీట్ స్కోర్ తప్పనిసరి. అందుకే లక్షలాదిమంది విద్యార్థులు ప్రతి ఏడాది నీట్ పరీక్షకు హాజరవుతారు. ఈ పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో ఓఎంఆర్ షీట్ పై జరుగుతుంది. మొత్తంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంశాలపై 150 ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానం టిక్ చేస్తే నాలుగు మార్కులు, తప్పుడు సమాధానానికి ఒక్క మార్కు తగ్గింపు కూడా ఉంటుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించారు.
Also Read: ఉచితంగా ఆన్లైన్ క్లాసులు.. స్వయం ప్లాట్ఫామ్లో ఇంటర్ విద్యార్థుల కోసం సరికొత్త కోర్సులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
King Cobra Video: నిధికి కాపలాగా నాగుపాములు.. ఒళ్లు గగుర్పొడిచే వైరల్ వీడియో!
Hyderabad, Telangana:King Cobra Video Watch Now: హిందూ పురాణాల్లోనూ.. జానపద కథల్లోనూ నిధుల దగ్గర పాములు కాపలాగా ఉంటాయని మనం వినే ఉంటాం.. అయితే సరిగ్గా అలాంటి దృశ్యమే నిజంగా వెలుగులోకి రావడం ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. బంగారు నగలు కలిగిన ఒక నిండు బంగారు కొండపై రెండు అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు చుట్టుకొని పహారా కాస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. నేలపై ఒక పురాతనమైన రాగి కుండ కనిపిస్తూ ఉండడం మీరు చూడొచ్చు.. ఆ కుండ నిండా తళతళలాడే బంగారు ఆభరణాలతో పాటు భారీ గొలుసులు, ప్రాచీనం కాలం నాటి నగలు ఉండడం మీకు కనిపిస్తుంది.. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ కొండపై రెండు నల్లటి నాగుపాములు పడగవిప్పి కూర్చున్నాయి. ఎవరైనా ఆ బంగారాన్ని తాకడానికి ప్రయత్నిస్తే ప్రాణాలు తీస్తా అన్నట్లుగా అవి బుసలు కొడుతూ అక్కడే ఉండడం మీరు చూడొచ్చు.
ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారని దానిపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ.. ఇంస్టాగ్రామ్తో పాటు ఎక్స్ వేదికలపై ఇది మిలియన్లకు కొద్దిగా వ్యూస్ సంపాదించుకుంది. "నిజంగానే నిధుల దగ్గర పాములు ఉంటాయని ఈ వీడియో నిరూపిస్తోంది.'' అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కూడా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. ఇది ఎవరైనా కావాలనే సెట్ చేసి షూట్ షూట్ చేసిన వీడియో కావచ్చు లేదా గ్రాఫిక్స్ ప్రభావం కావచ్చు అని మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
గతంలో కూడా ఇలాంటి వీడియోలు కొన్ని వెలుగులోకి వచ్చినప్పటికీ.. ఈ స్థాయిలో నాగుపాములు పడగవిప్పి నిధిని రక్షించడం మాత్రం ఇదే మొదటిసారి అని సోషల్ మీడియా వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం నిధి పాములకు సంబంధించిన వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.. అయితే ఈ వీడియోను ఫ్యాక్ట్ చెక్ చేసి చూడగా.. ఇది ఎవరో కావాలని ఇలా పాములను ముంచి వీడియో తీసి వ్యూస్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తేలింది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్
Cobra Video: కింగ్ కోబ్రా పడగ కింద బుల్లి బాలుడు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!
Hyderabad, Telangana:Black King Cobra Viral Video Watch: సోషల్ మీడియా లో నిత్యం ఏదో ఒక వింత వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా తీవ్రభయాందోళనకు గురిచేస్తుంది. ఒక చిన్న బాలుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ కింగ్ కోబ్రా తో పచ్చిక మైదానంలో ఆడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక పచ్చిక మైదానంలో ఒక బాలుడు ఎంతో అమాయకంగా ఆడుకుంటూ ఉండటం మీరు గమనించవచ్చు. అయితే, ఆ బాలుడి వెనికే ఒక భారీ బ్లాక్ కింగ్ కోబ్రా పడక విప్పి నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. ఆ పాము ఎంత భయానకరంగా ఉందంటే.. అది ఒక్కసారి కాటు వేస్తే ప్రాణాలు నిలవడం దాదాపు అసాధ్యం అన్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ బాలుడు మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఆ పాముకు మరింత దగ్గరగా అటు ఇటు కదలడం మీరు చూడొచ్చు.
ఈ వీడియో అక్కడే ఉన్న కొంతమంది వారి మొబైల్స్ ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ప్రధాన అంశం ఏంటంటే.. సాధారణంగా మనుషుల అలికిడి అయితేనే అటాక్ చేసే కింగ్ కోబ్రా.. ఆ బాలుడిపై దాడి చేయకపోవడం. బాలుడు పాముకు అంత దగ్గరగా వెళుతున్నప్పటికీ.. అది కేవలం తన పడగలను అటు ఇటు తిప్పుతూ చూస్తోంది తప్ప కాటు వేయడానికి ప్రయత్నించడం లేదు.. బాలుడు దాని తోకను తాకినప్పటికీ.. దగ్గరగా వెళ్లిన.. అది శాంతంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.. దీనిని చూసిన కొంత మంది దైవ లీల అంటుంటే మరి కొంతమంది అది పెంపుడుపామని చెబుతున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించుకున్నప్పటికీ.. సోషల్ మీడియా నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. వ్యూస్ కోసం.. లైక్స్ కోసం చిన్న పిల్లల ప్రాణాలను పణంగా పెడతారా? అంటూ బాలుడి తల్లిదండ్రులపై సోషల్ మీడియా వినియోగదారులు ఊహించని స్థాయిలో మండిపడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన పాములు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదని.. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Hyderabad: బాలుడిపై పది కుక్కల దాడి.. తల చర్మం ఊడిపోయేలా బీభత్సం!
Hyderabad, Telangana:Stray Dogs Attack Child Hyderabad: వీధి కుక్కల స్వైర విహారం మరో పసి ప్రాణాన్ని బలి తీసుకోబోయింది.. వేసవి సెలవుల కోసం సరదాగా చుట్టాల ఇంటికి వచ్చిన ఒక బాలుడిపై పదికి పైగా వీరి కుక్కలు ఏకకాలంలో దాడి చేసి మృత్యు అంచులకు తీసుకెళ్లాయి.. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడి.. ప్రస్తుతం మృత్యుతో పోరాడుతున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం బోటుమీదపల్లెకు చెందిన ఆద్విక్ అనే బాలుడు తన వేసవి సెలవులను గడిపేందుకు హైదరాబాదులోని బి ఎన్ రెడ్డి నగర్, టీచర్స్ కాలనీలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం ఇంటికి బయట తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు అతనిపై విరుచుకుపడింది..
దాదాపు 10 కుక్కలు అద్విక్ను చుట్టుముట్టి.. విచక్షణ రహితంగా కరిచాయి. ఈ క్రమంలో కుక్కలు బాలుడి తలభాగాన్ని పీకేసే ప్రయత్నం చేశాయి. దీనివల్ల అతడి తలపై భాగంలోని చర్మం మొత్తం ఊడిపోయి రక్త ప్రవాహం ఏరులై పారింది. శరీరంపై ఇతర చోట్ల కూడా లోతైన గాయాలయ్యాయి. బాలుడి అరుపులు విని స్థానికులు పరుగున వచ్చి అక్కడున్న కుక్క లను వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వెంటనే రక్తపు మడుగులో ఉన్న అద్విక్ను సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
గాయపడిన బాలుడు అద్విక్.. బోటుమీదపల్లె గ్రామ సర్పంచ్ కుమారుడిగా గుర్తించారు.. సెలవుల్లో ఆడుకోవడానికి పంపిన కొడుకు ఇలా కుక్కల దాడిలో గాయపడటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనతో టీచర్స్ కాలనీ వాసులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. నగరంలో కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతున్న.. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధిలో నడవాలంటే చిన్న పిల్లలతో పాటు వృద్ధులు వణికి పోతున్నారట. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి వీధి కుక్కలని నియంత్రణ చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook ..
Mars Transit 2026: కేతు నక్షత్రంలోకి కుజుడు.. ఆ రాశుల వారికి తిరుగులేని అదృష్టం, ఆకస్మిక ధనలాభం!
Hyderabad, Telangana:Mars Transit In Ketu Nakshatra 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కదలికలతో పాటు నక్షత్రం మార్పులు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తూ ఉంటారు. ముఖ్యంగా గ్రహాలు తమ స్థానాలు మార్చుకోవడం వల్ల వాటి ప్రభావం ఒక వ్యక్తి జీవితంతో పాటు వృత్తి సంపద, సంబంధాలపై నేరుగా ప్రభావం పడే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటిది శక్తివంతమైన గ్రహాలు సంచారం చేస్తే ద్వాదశ రాశుల వారి జీవితాల్లో ఎప్పుడూ చూడని ఊహించని మార్పులు సంభవిస్తాయి.
2026 సంవత్సరం మే 11న కుజుడు కేతు నక్షత్రంలోకి ప్రవేశించాడు. కుజుడిని జ్యోతిష్య శాస్త్రంలో బలం ధైర్యం ఆత్మవిశ్వాసం కార్యచరణకు అధిపతిగా పరిగణిస్తారు. అయితే, కేతు ఆకస్మిక మార్పులతో పాటు కర్మ ఫలాలకి కారకుడిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ రెండు గ్రహాల మధ్య ఉన్న ప్రత్యేక సంబంధం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదమైన ప్రభావాన్ని చూపే అవకాశాలుంటాయి. ముఖ్యంగా డబ్బుతో పాటు ఉద్యోగం వ్యాపారాలు ఆస్తి సంబంధించిన విషయాల్లో తప్పకుండా శుభసంకేతాలు రావడం ప్రారంభమవుతాయి.
కుజుడి బలమైన స్థానం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా?
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జాతకంలో కుజుడి అనుకూల స్థానం అనేక సానుకూలమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా నిలిచిపోయిన డబ్బులు కూడా భారీ మొత్తంలో తిరిగి వస్తాయి. వృత్తిపరంగా కొత్త కొత్త విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో దిమ్మతిరిగే ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా భూమితో పాటు ఆస్తుల్లో భారీ మొత్తంలో లాభాలు కలుగుతాయి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా అంచలంచలుగా పెరిగే అవకాశాలున్నాయి. పాత వివాదాల నుంచి కూడా పరిష్కారం లభించే సంకేతాలు మీరు పొందుతారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.
ఈ రాశులవారికి బంపర్ జాక్ఫాట్:
మేష రాశి
కుజుడి అనుగ్రహం వల్ల మేష రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా శ్రమించే వ్యక్తులకు ఈ సమయంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడమే కాకుండా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉండబోతోంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడి ప్రత్యేకమైన అనుగ్రహం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కూడా లభించడమే కాకుండా కొత్త బాధ్యతలు లభించబోతున్నాయి. వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సమయం అద్భుతమైన లాభాలను అందించే అవకాశాలున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము నెలకొనడమే కాకుండా సానుకూలమైన వాతావరణ నెలకొంటుంది.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడి శక్తివంతమైన ప్రభావంతో కెరీర్లో పెద్ద మార్పులు సంభవించబోతున్నాయి. ముఖ్యంగా అంకితభావంతో పనులు చేసే వారికి ఈ సమయంలో తప్పకుండా ప్రశంసలు లభించబోతున్నాయి. అలాగే కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు వ్యాపారస్తులకు గణనీయమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు సమాజంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వీరికి అదృష్టం సహకరించి విశేషమైన విజయాలు కలుగుతాయి. సామాజిక హోదా పెరగడమే కాకుండా ఆర్థిక విషయాల్లో అద్భుతమైన ఉపశమనం లభించబోతోంది. గతంలో ఉన్న ఆస్తులు కూడా తప్పకుండా తిరిగి పొందుతారు. అలాగే ఈ సమయంలో వాహనాలు కూడా కొనుగోలు చేస్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hanuman Jayanthi: రేపు హనుమాన్ జయంతి.. తిరుమల జాపాలి తీర్థంలో భారీ ఏర్పాట్లు
Tirupati Urban, Andhra Pradesh:Tomorrow Hanuman Jayanthi: తిరుమల కొండల్లో కొలువుదీరిన హనుమంతుడికి రేపు పెద్ద ఎత్తున పూజలు, ఉత్సవాలు జరగనున్నాయి. హనుమంతుడు జన్మించాడని చెబుతున్న జాపాలి తీర్థంలో హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయగా.. హనుమాన్ జయంతికి జాపాలి తీర్థం ముస్తాబైంది.
Also Read: Harish Rao: గుప్త నిధుల వేటలో 800 ఏళ్ల శివాలయం రేవంత్ రెడ్డి కూల్చివేత: హరీశ్ రావు
హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమల గిరులు హనుమ నామస్మరణతో మారుమోగుతున్నాయి. అంజనీపుత్రుడు జన్మించిన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన జపాలి తీర్థం హనుమాన్ జయంతి వేడుకలకు సర్వంగాసుందరంగా ముస్తాబైంది. రేపు జరగనున్న ఈ వేడుకల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హనుమంతుడు జపాలిలోనే జన్మించాడని పురాణ చరిత్ర చెబుతుండగా.. టీటీడీ కూడా ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. దీంతో ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.
Also Read: Chandrababu: ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వండి.. కేంద్ర మంత్రులకు చంద్రబాబు విజ్ఞప్తి
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జపాలి ఆంజనేయ స్వామి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, సుగంధభరిత పుష్పాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లు, తాగునీరు, అన్నప్రసాదం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రేపు జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు సిబ్బందిని నియమించారు.
ఏడు కొండల పైన వెలసిన అద్భుత క్షేత్రం జపాలి తీర్థం. వాయుపుత్రుడు హనుమంతుడు ఇక్కడే జన్మించాడనే చారిత్రక ఆధారాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రేపు హనుమాన్ జయంతి కావడంతో జపాలిలోని ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించేందుకు ఆలయ అర్చకులు సిద్ధమయ్యారు. దట్టమైన అడవి మధ్యలో ఉండే ఈ క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో రవాణా, భద్రతా పరంగా టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Chandrababu: ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇవ్వండి.. కేంద్ర మంత్రులకు చంద్రబాబు విజ్ఞప్తి
New Delhi, Delhi:Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర పథకాలతోపాటు గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు సాగునీటి అవసరాలకు సంబంధించి విజ్ఞప్తులు చేశారు. ప్రధానంగా జల వనరులకు సంబంధించి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి వివరించి వాటికి సంబంధించి అనుమతులు, నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు.
Also Read: Dowry Death: 45 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. బైక్ అంటే బైక్, పొలం అంటే పొలం ఇచ్చినా భర్త వేధింపులు
ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు, ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వేర్వేరుగా భేటీ అయ్యారు. విభజన అంశాలతో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల్ని మంజూరు చేయాలని కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్లో చేసిన కేటాయింపులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందించాలని కోరారు.
Also Read: Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచన
అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం, మంత్రి సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 2027 గోదావరి పుష్కరాల లోపు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని విన్నవించారు. తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.
'2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి అయ్యింది. గ్యాప్ 1, గ్యాప్ 2లలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్లో ఉందనే కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలి' అని కేంద్ర జల శక్తి మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దాని కంటే కుడి, ఎడమ కాలువల సామర్ధ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్టు.. ప్రస్తుతం కుడి కాలువ 95 శాతం మేర ఎడమ కాలువ పనులు 78 శాతం మేర పూర్తి అయినట్టు కేంద్ర మంత్రికి ఇచ్చిన లేఖలో వివరించారు. ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
హర్ ఖేత్ కో పానీ పథకం నిధులు
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్తో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద రాష్ట్రంలోని వివిధ పథకాల పునరుద్ధరణ, ఆధునీకరణకు నిధుల అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. హర్ ఖేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ ,ఆధునీకరణ, కాలువల పూడికతీత, గట్ల బలోపేతం లాంటి పనులు చేపట్టాల్సి ఉందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ.285 కోట్ల నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు కోరారు.
సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చేంతవరకు ఆలమట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దని.. ఆనకట్ట ఎత్తును 519.60 మీటర్ల నుండి 524.256 మీటర్లకు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని కేంద్ర మంత్రి వద్ద సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆల్మట్టి ఎత్తు పెంపునకు ఎలాంటి సాంకేతిక, పాలనా పరమైన అనుమతులు మంజూరు చేయరాదని కోరారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోయే 200 టీఎంసీల వరద జలాలను మళ్లించేలా.. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల దాహార్తిని తీర్చే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Harish Rao: గుప్త నిధుల వేటలో 800 ఏళ్ల శివాలయం రేవంత్ రెడ్డి కూల్చివేత: హరీశ్ రావు
Narsampet, Telangana:Ashok Nagar Ancient Shiva Temple Vandalise: 'బడులు ఆగమే కాదు రేవంత్ రెడ్డి పాలనలో ఏకంగా గుడుల విధ్వంసం కూడా జరుగుతోంది. ఆనాడు కేసీఆర్ మన ఊరు-మన బడి పెడితే రేవంత్ రెడ్డి దాన్ని అర్ధాంతరంగా నిలిపేశారు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి వంద శాతం రుణమాఫీ చేయకుండా మాట తప్పిన తొలి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనకు దేవుడంటే భయం లేదు, భక్తీ లేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన 800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల మట్టికోట శివాలయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు సందర్శించారు. కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణంలో స్థానికులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచన
'తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి లాంటి మహా పుణ్యక్షేత్రాలను నిర్మిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా పేరుతో పేదల ఇండ్లు, మసీదులు, చర్చీలు, ఇప్పుడు ఏకంగా గుడులు కూలగొడుతున్నాడు. విశాఖ పీఠం కూలుస్తా అని మొన్న అధికారులను పంపాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. గతంలో సచివాలయానికి వెళ్తే లంకె బిందెలు దొరుకుతాయనుకున్నా అని రేవంత్ రెడ్డి అన్న మాటను గుర్తుచేశారు. 'ఆయన అనుచరులతో కలిసి నిజాం భవనాల చుట్టూ గుప్త నిధుల కోసం బాగానే వెతికాడు. అక్కడ దొరకకపోయే సరికి ఇప్పుడు కాకతీయుల గుడుల మీద పడ్డాడు. అశోక్ నగర్లో కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన 800 ఏళ్ల నాటి అద్భుతమైన శివాలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేశారు. ఆలయ రక్షణ కోసం ఉన్న అతిపెద్ద మట్టి ఆనకట్టను తొలుచుకుంటూ వెళ్లి మరీ గర్భగుడిని ధ్వంసం చేశారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు.
'రాత్రి 12 నుంచి 1 గంట మధ్య చీకట్లో గర్భగుడి కింద ఏకంగా 24 అడుగుల లోతు భారీ గుంత తవ్వారు. స్కూల్ కట్టే పనైతే పగలు చేయొచ్చు కదా? అర్ధరాత్రి ఎందుకు తవ్వారు? గుప్త నిధుల వేటలో రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ కుట్ర జరిగింది' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. 'ఇది గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకమే అని పురావస్తు శాఖ జిల్లా అధికారి బుజ్జి ఈ నెల 7వ తేదీన కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆర్కియాలజీ అధికారి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ కాలేదు, మిషనరీ సీజ్ చేయలేదు, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. అంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నది స్పష్టం' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
'బీఆర్ఎస్ పార్టీ హయాంలో ధరణిలో ఇది దేవాలయ భూమిగా ఉంటే.. కాంగ్రెస్ రాగానే భూభారతిలో రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిగా ఎట్లా మారింది? స్కూల్ కట్టడానికి చుట్టూ కావలసినంత స్థలం ఉంది. అసలు ఈ నియోజకవర్గంలో వేరే చోట జీవో వచ్చిన స్కూల్ను ఇక్కడికి ఎందుకు మార్చారు. గుడి ఉన్నకాడ బడి కట్టొచ్చు, కానీ పోయిపోయి గుడినే కూలగొట్టడం ఎందుకు?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పురావస్తు శాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బాధ్యులను అరెస్ట్ చేసి మిషనరీని సీజ్ చేయాలని చేయాలని డిమాండ్ చేశారు.
'యుద్ధప్రాతిపదికన ఈ చారిత్రక శివాలయాన్ని పునరుద్ధరించాలి. 1958 చట్టం ప్రకారం వందేళ్లు దాటిన కట్టడాలు ఆర్కియాలజీ పరిధిలోకి వస్తాయి కాబట్టి, ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పగించాలి. అర్ధరాత్రి తవ్వకాల్లో బయటపడ్డ గుప్త నిధులు, లంక బిందెలు ఏ ప్రభుత్వ పెద్దల ఇళ్లకు పోయాయో సమగ్ర విచారణ జరగాలి' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. ఈ గుడి కూల్చివేతపై సీవీసీకి, విజిలెన్స్కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.
'విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి స్కూళ్ల టెండర్లలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఒక్క టెండర్ కూడా మైనస్కు పోకుండా అన్నీ ఎక్సెస్కే ఎట్లా పోయాయి? ఈ స్కూళ్ల టెండర్లలో ఏకంగా రూ.494 కోట్ల ఎక్సెస్ అమౌంట్ ద్వారా ప్రజాధనం లూటీ అయ్యింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉండేందుకు ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్గా పెట్టుకుని ఈ రూ.500 కోట్ల దోపిడీకి తెరతీశారని తెలిపారు.
'కాంట్రాక్టర్లు నా మనుషులైతే టెండర్లు రద్దు చేయి. టెండర్లు దక్కించుకున్న వాళ్లు హరీశ్ రావు మనుషులే అని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. వాళ్లు నా మనుషులే అయితే వెంటనే ఆ టెండర్లను రద్దు చేయి. నేనే కదా రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నది. మొన్న హ్యామ్ రోడ్ల పేరుతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల్లో 25 శాతం ఎక్సైస్తో జరిగిన రూ.5 వేల కోట్ల కుంభకోణాన్ని అసెంబ్లీలో బయటపెట్టి పోరాడింది నేనే. అవి నీ మనుషులా? నా మనుషులా? అన్నది కాదు. అది రాష్ట్ర ప్రజల చెమట చుక్కల ఆదాయం' అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, ధాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేశ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
Doni, Karnataka:Govt Employees DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కరువు భత్యం (డియర్నెస్ అలవెన్స్) ప్రభుత్వం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 1.50 శాతం డీఏ పెంచుతూ కర్ణాటక ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తాజా పెంపుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏలో 15.75 శాతం పెరుగుదల రానుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ వర్గాల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన డీఏ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Bandi Bageerath POCSO: బండి భగీరథను దేశం దాటించొద్దు.. లుకౌట్ నోటీస్ ఇవ్వాలి: మాజీ ఐపీఎస్
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)ను 1.50 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 సవరించిన పే స్కేళ్లలో జీతం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు.. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చేలా కరువు భత్యం (డీఏ) ధరలను పెంచాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ డీఏ పెంపును మూల వేతనంలో ప్రస్తుతం ఉన్న 14.25 శాతం నుంచి 15.75 శాతానికి సవరించారు. ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు కరువు భత్యాన్ని 2 శాతం పెంచాలని ఆదేశించగా.. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తన ఉద్యోగులకు 1.50 శాతం డీఏ పెంచడం గమనార్హం. పెంచిన డీఏ 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read: Dowry Death: 45 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. బైక్ అంటే బైక్, పొలం అంటే పొలం ఇచ్చినా భర్త వేధింపులు
ప్రాథమిక వేతనం అంటే ప్రభుత్వ ఉద్యోగి అతడు నిర్వర్తించే పదవికి వర్తించే వేతన స్కేలులో పొందుతున్న వేతనం. కర్ణాటక సివిల్ సర్వీసెస్ (సవరించిన వేతన) నియమావళి- 2024 ప్రకారం ఉద్యోగికి మంజూరు చేసిన వ్యక్తిగత వేతనం (ఏదైనా ఉంటే), వేతన స్కేలు గరిష్ట స్థాయికి మించి సిబ్బందికి మంజూరు చేసిన ఏవైనా అదనపు వేతన పెంపులకు అదనంగా కరువు భత్యం చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర సంఘటిత నిధి నుంచి పింఛన్, కుటుంబ పింఛన్ పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులు/ కుటుంబ పింఛన్దారులు, సహాయక విద్యా సంస్థల పింఛన్దారులు/ కుటుంబ పింఛన్దారులకు కూడా ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి అందించే డియర్నెస్ రిలీఫ్ను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుత ప్రాథమిక పింఛన్/ కుటుంబ పింఛన్లో 14.25 శాతం నుంచి 15.75 శాతానికి పెంచడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Also Read: Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచన
పెంచిన డీఏ, డీఆర్ ప్రభుత్వ, జిల్లా పంచాయతీల పూర్తికాల ఉద్యోగులకు, తాత్కాలిక పే స్కేళ్లలోని పూర్తికాల వర్క్చార్జ్ ఉద్యోగులకు, ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలలోని తాత్కాలిక పే స్కేళ్ల పూర్తికాల ఉద్యోగులకు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Palnadu Railway Facilities: కేంద్ర రైల్వే మంత్రితో ఎంపీ లావు భేటీ..పల్నాడు రైల్వే అభివృద్ధిపై కీలక ప్రతిపాదనలు
Narasaraopeta, Andhra Pradesh:MP Sri Krishnadevarayalu Meets Ashwini Vaishnaw: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఆయన ప్రాతినిధ్యంలో నరసరావుపేట కేంద్రంగా నిలిచిన పల్నాడు జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాలను ఏర్పాటుకు విన్నవించుకునేందుకు రైల్వే మంత్రిని నేడు కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలిక సమస్యలు, నూతన రైల్వే లైన్ల అవశ్యకతను వివరిస్తూ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.
ఈ భేటీలో చర్చించిన మూడు కీలక అంశాలు..
1. పిడుగురాళ్ల - రామాయపట్నం కొత్త రైల్వే లైన్
పల్నాడు ప్రాంతంలోని సిమెంట్, సున్నపురాయి పరిశ్రమలతో పాటు వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా పిడుగురాళ్ల నుంచి రామాయపట్నం పోర్టు వరకు కొత్త రైల్వే లైన్ నిర్మించాలని ఎంపీ భావిస్తున్నారు. ఈ అనుసంధానం వల్ల రవాణా ఖర్చులు తగ్గాయని, పారిశ్రామికంగా ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా స్థానిక యువతకు భారీగా ఉపాధి లభిస్తుందని వివరించారు.
2. విజయవాడ - బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్
పల్నాడు జిల్లా నుండి బెంగళూరుకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తల సంఖ్య ఎక్కువగా ఉన్న దృష్ట్యా, విజయవాడ - బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, అధునాతన రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
రైల్వే సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి
ప్రజలకు రైల్వే సదుపాయాలు మెరుగుపరచాలనే సంకల్పంతో ఈరోజు ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని కలిసి మూడు కీలక ప్రతిపాదనలు వారి ముందు ఉంచడమైనది. సంబంధించిన వినతి పత్రాన్ని మంత్రి గారికి సమర్పించడం… pic.twitter.com/A8GmryYvNH
— Lavu Sri Krishna Devarayalu (@SriKrishnaLavu) May 11, 2026
3. సూపర్ఫాస్ట్ రైళ్ల స్టాపేజ్
స్థానిక ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రధాన రైళ్లకు స్టేజీలు కల్పించాలని ఆ విధంగా నిబంధనల్లో మార్పులు చేయాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రైల్వే మంత్రిని ఈ సందర్భంగా కోరారు. సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ (20701), లింగంపల్లి - విజయవాడ ఎక్స్ప్రెస్ (12796).. ఈ రెండు రైళ్లను నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. పల్నాడు ప్రాంత రైల్వే అభివృద్ధికి అవసరమైన సాంకేతిక నివేదికలను పరిశీలించి, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ భేటీతో పల్నాడు రైల్వే దృశ్యం మారనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also REad: Peddi Trailer Launch: మెగా ఫ్యాన్స్కు గుడ్న్యూస్..'పెద్ది' సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CM Vijay Visits Stalin: తమిళనాడులో మరో సంచలనం..మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లిన సీఎం విజయ్!
Eragudi North, Tamil Nadu:CM Vijay Visits Stalin Residence: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్.. నేడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ ప్రమాణం పూర్తవ్వగానే.. మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎండీఎంకే నేత వైగో ఇంటికి వెళ్లినట్లు సమాచారం.Peddi Trailer Launch: మెగా ఫ్యాన్స్కు గుడ్న్యూస్..'పెద్ది' సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Peddi Trailer Release Date: మెగా ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు దగ్గర పడుతోంది. ఎన్నో వాయిదాల తర్వాత 'పెద్ది' సినిమా గ్రాండ్ రిలీజ్కు ముస్తాబవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించిన 'పెద్ది' చిత్ర ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ను మే 18న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీ ఆదరణ పొందాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో, చిత్ర బృందం ఉత్తర భారతదేశం, ఇతర కీలక మార్కెట్లలో విస్తృత ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. ప్రాంతీయ, భాషా అడ్డంకులను అధిగమించి ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యి, దేశవ్యాప్తంగా బ్లాక్బస్టర్గా నిలిచే సత్తా 'పెద్ది'కి ఉందని చిత్ర బృందం బలంగా విశ్వసిస్తోంది.
బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న థియేటర్లలోకి రానుంది. విడుదలకు కేవలం 23 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ట్రైలర్ విడుదల కార్యక్రమంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత హీరో రామ్ చరణ్ పూర్తిగా ప్రమోషన్స్ కోసం దేశవ్యాప్తంగా పర్యటన చేయనున్నారని తెలుస్తోంది. 
'పెద్ది' సినిమా కోసం నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని బిగ్ ఈవెంట్స్ను కూడా నార్త్ ఇండియాలోనే ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తోంది. 'పెద్ది' చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా..ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ బ్యానర్పై మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో నిర్మించారు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా క్రికెట్, కుస్తీ ఆటపై ప్రధానంగా కథ అలుముకోని ఉంటుందని తెలుస్తోంది. మరికొందరు కోడి రామమూర్తి బయోపిక్ అని అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
ఇప్పటికే 'పెద్ది' సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్లో 'చికిరీ' పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోగా.. అదే బాటలో రెండో సాంగ్ 'రయ్ రయ్ రారా' దూసుకుపోతుంది. అదే విధంగా ఈ సినిమాలో మరో ఐటెమ్ సాంగ్ ఉందని సమాచారం. ఇందులో తమిళ నటి శ్రుతి హాసన్ ఆడిపాడినట్లు తెలుస్తోంది.
Also Read: మహేష్ బాబు మేనకోడలిని చూశారా? హీరోయిన్లనే మించిన అందం..క్యూట్లో క్వీన్!
Also Read: Malavika Mohanan Photos: పొట్టిపొట్టి బట్టల్లో సెగ పుట్టిస్తున్న బ్యూటీ..అందంలో గత్తరలేపేస్తుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bandi Bageerath POCSO: బండి భగీరథను దేశం దాటించొద్దు.. లుకౌట్ నోటీస్ ఇవ్వాలి: మాజీ ఐపీఎస్
Kagaznagar, Telangana:Bandi Sai Bageerath POCSO Case: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు నోటీసులు పంపాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సాయి భగీరథ్ ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవాలని కోరారు. సాయి భగీరథ్ ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామని తెలుపుతూ సైబరాబాద్ పోలీసులు రివార్డు ప్రకటించాలని కోరారు. బండి భగీరథ్పై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.
Also Read: Dowry Death: 45 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. బైక్ అంటే బైక్, పొలం అంటే పొలం ఇచ్చినా భర్త వేధింపులు
బండి భగీరథ్ పోక్సో కేసుపై కాగజ్నగర్లోని తమ నివాసంలో సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 'బాధిత కుటుంబాన్ని బెదిరించి, కేసు వాపస్ తీసుకోవాలని భయపెట్టడానికి పోలీసులే కావాలని అరెస్ట్ చేయడం లేదు. నిందితుడికే పోలీసులు సహకరిస్తున్నారు' అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 'బాధిత అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే పేట్ బషీరాబాద్ పోలీసులు 5 గంటల పాటు ఎందుకు పట్టించుకోలేదు? బండి సాయి భగీరథ్ అమ్మాయిపై ఫిర్యాదు చేసిన 2 నిమిషాల్లోనే ఎలా ఎఫ్ఐఆర్ చేశారో పోలీసులు సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
Also Read: Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచన
నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెపెక్టర్, ఏసీపీలను బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర డీజీపీని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. పోలీసులు సాయి భగీరథ్పై ఉద్దేశ్యపూర్వకంగా సెక్షన్ 11, 12 ప్రకారం చిన్న చిన్న కేసులు నమోదు చేశారు. వాస్తవానికి సెక్షన్ 7, 8 ప్రకారం నిందితుడు బండి భగీరథ్పై కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసులు పెట్టాలి. నిందితుడిపై సెక్షన్ 6 ప్రకారం కూడా కేసు పెట్టాలి' అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న ఎస్ఓటీ, టాస్క్ఫోర్స్ పోలీసులు ఏం చేస్తున్నారు? నిందితుడిని ఎందుకు పట్టుకోవడంలేదని ప్రశ్నించారు.
హైదరాబాద్లో మాజీ డీజీపీ భార్యను హత్య చేసినా అడిగే నాథుడే లేడని.. తెలంగాణలో శాంతి భద్రతలు ప్రమాదంలో ఉన్నాయని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హోం శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 'లక్ష మంది పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వంటివి ఉన్నాయి. ఘటన జరిగినప్పటి నుండి ఇప్పటివరకు ఎందుకు ఆధారాలు సేకరించలేదు. అత్యాచారానికి పాల్పడిన ప్రాంతాలను ఎందుకు సందర్శించలేదు' అని ప్రశ్నించారు.
'బండి సంజయ్ కొడుకును కాపాడడం కోసం రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ కేసులు బయటకు తీయాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ కేసులు, సీబీఐ కేసులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం చేయాలని చూస్తున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుఆర్ ఆరోపించారు. 'కాంగ్రెస్ నాయకులు మైనర్ అమ్మాయికి ఎందుకు న్యాయం చేయడం లేదు. కాంగ్రెస్ మంత్రులు, మహిళా నాయకురాలు ఎందుకు పోక్సో కేసు గురించి మాట్లాడడం లేదు' అని ప్రశ్నించారు.
'బీజేపీ అగ్రనాయకత్వం బేటీ బచావో అని చెబుతుంటే.. బండి సంజయ్ బేటా బచావో అమలు చేస్తోంది. మైనర్ అమ్మాయిని వేధించిన మంత్రిని ప్రధాని మోదీ తన పక్కన కూర్చోబెట్టుకున్నందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మహిళలకు మోడీ ఇచ్చే గౌరవం ఇదేనా?' అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. 'బండి సంజయ్ తన కుమారుడు ఎలాంటి తప్పు చేయకపోతే పోలీసులకు అప్పగించి విచారణకు సహకరించాలి' అని కోరారు. మూడు రోజులుగా పోలీసుల మౌనం అనేక అనుమానాలు కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్లు
==> బాలల హక్కుల కమిషన్, మానవ హక్కుల సంస్థలు స్పందించి రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ, డీజీపీకు లేఖలు రాసి నిందితుడిని అరెస్ట్ చేయించాలి
==> బాధిత కుటుంబాన్ని బెదిరించిన బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి.
==> బాధితులను బెదిరించిన వీ6 మాజీ రిపోర్టర్, బీజేపీ అధికార ప్రతినిధి సంగప్పతోపాటు బండి సంజయ్ను ఏ2, సంగప్ప ఏ3గా ఎఫ్ఐఆర్లో చేర్చాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Srisailam Booking Scam: శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్..రూమ్ బుకింగ్ పేరుతో యాత్రికులకు టోకరా..తస్మాత్ జాగ్రత్త!
Srisailam, Andhra Pradesh:Srisailam Room Booking Scam: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని భావించే భక్తులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని, "నకిలీ వెబ్సైట్ల" ద్వారా నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ వెబ్సైట్లు ఇప్పుడు జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి.
ఇటీవల కాలంలో మంత్రాలయం, అహోబిలం క్షేత్రాలలో వరుసగా సైబర్ మోసాలు వెలుగు చూశాయి. తాజాగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లన్న భక్తులు కూడా ఈ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నారు. సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఏసీ గదుల బుకింగ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి, భక్తుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నారు. తీరా ఆలయానికి చేరుకున్నాక గానీ, తాము బుక్ చేసుకున్న టిక్కెట్లు చెల్లవని భక్తులు తెలుసుకోలేకపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
అధికారుల హెచ్చరిక..
ఈ ఘటనలపై స్పందించిన దేవస్థాన అధికారులు, ఆలయ ఈవో, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గదులు లేదా దర్శన టిక్కెట్ల కోసం కేవలం ప్రభుత్వ, దేవస్థానం అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేశారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, సెర్చ్ ఇంజన్లలో కనిపించే ప్రతి వెబ్సైట్ను గుడ్డిగా నమ్మవద్దని హెచ్చరించారు.
సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. ఆలయ అధికారిక వెబ్సైట్ అడ్రస్ను క్షుణ్ణంగా పరిశీలించండి (ముఖ్యంగా .gov.in లేదా అధికారిక డొమైన్లను గమనించాలి). టిక్కెట్ బుక్ చేసే ముందు దేవస్థాన హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేసి నిర్ధారించుకోండి. అనుమానాస్పద వెబ్సైట్లలో మీ వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలను నమోదు చేయకండి.
ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ నకిలీ వెబ్సైట్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ వెబ్సైట్తో మోసపోయామని ఆలయ అధికారుల వద్ద భక్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తి పేరుతో జరుగుతున్న ఈ సైబర్ దోపిడీని అరికట్టేందుకు పోలీసులు కూడా నిఘా పెంచారు. యాత్రికులు అప్రమత్తంగా ఉండి, అధికారిక మార్గాల ద్వారానే సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలంటే భక్తులకు సరైన అవగాహన పెంచడం సహా నకిలీ వెబ్సైట్లను నిర్మూలించడంలో ప్రభుత్వం చాకచక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: ప్రజలకు ముఖ్య గమనిక..ఈ వారంలో రెండు రోజులు బ్యాంకులకు సెలవు..ఎప్పుడంటే?
Also Read: ప్రభుత్వ ఉద్యోగుల ఎగిరి గంతేసే వార్త..డీఏతో పాటు HRA పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
