శివారాంపల్లి లో బస్ ఆక్సిడెంట్, తప్పిన పెను ప్రమాదం..
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
YS Jagan AP Politics: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజకీయాల్లో తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మాస్ లీడర్. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన జగన్. కడప ఎంపీగా కాంగ్రెస్ తరపున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కానీ తండ్రి హఠాన్మరణంతో జగన్ రాజకీయ దారి ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన వారిని ఓదార్పు యాత్ర పేరుతో జనంలోకి వెళ్లి.. ప్రజలకు మరింత దగ్గరయ్యారు. ఇదే జగన్ రాజకీయ భవిష్యత్తును మొత్తం మార్చేసింది. ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతివ్వలేదు. అధిష్టానం నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ కు జగన్ కు మధ్య తీవ్ర అగాథం ఏర్పడింది. అ తర్వాత జరిగిన పరిణామాలతో అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లడం. ఆ తర్వాత ప్రత్యేకంగా వైసీపీ పార్టీ పెట్టడం చకచక జరిగిపోయాయి. ఆ తర్వాత.. ఏపీలో ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.. మరోసారి సీఎం అయ్యేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
Also Read: RK Roja: ఉగాది రోజు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీఆర్ నాయుడు గాడిదలు కాస్తున్నారా?
ఇక 2019లో ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైందని అందరూ భావించారు. కానీ, ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కొద్ది రోజుల్లోనే జగన్ తన పంథాను మార్చేశారు. విధానపరమైన విమర్శలను పక్కన పెట్టి, వ్యక్తిగత టార్గెట్లకు ప్రాధాన్యత ఇచ్చారు. తనకంటూ రాజకీయ మిత్రులను సంపాదించుకోవాల్సింది పోయి, గడిచిన ఐదేళ్లలో ప్రతిపక్ష పార్టీలను, నాయకులను బద్ధ శత్రువులుగా మార్చుకున్నారు. నేనే శాశ్వత ముఖ్యమంత్రిని అనే భ్రమలో ఉండి, రేపు తాను కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందన్న కనీస ఆలోచనను విస్మరించారన్న విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. జగన్ తనను తాను వైఎస్సార్ వారసుడిగా చెప్పుకుంటారు. కానీ, రాజకీయ శైలిలో తండ్రికి, కొడుకుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్న టాక్. వైఎస్సార్ హయాంలో చంద్రబాబుతో రాజకీయ పోరు ఉన్నా, అది వ్యక్తిగత స్థాయికి ఎప్పుడూ వెళ్లలేదు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తన దగ్గరకు వస్తే పనులు చేసి పెట్టే ఉదార స్వభావం వైఎస్సార్ది. అందుకే ఆయనకు సొంత పార్టీలోనే కాదు, ప్రత్యర్థి పార్టీల్లోనూ అభిమానులు, శ్రేయోభిలాషులు ఉండేవారు. కానీ జగన్ మాత్రం ప్రత్యర్థులను రాజకీయంగా కాకుండా, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని వేధించారనే ఆరోపణలు మూటగట్టుకున్నారనేది ఓపెన్ సీక్రెట్.
Also Read: Harish Rao: కాంగ్రెస్ బడ్జెట్తో ఆరు గ్యారెంటీలకు ఘోరీ.. అందరికీ మొండి'చేయి': హరీశ్ రావు
అయితే వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పిదం సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయడమే అనే చర్చ ఉంది. 70 ఏళ్ల వయసున్న ఒక సీనియర్ నాయకుడిని, సరైన సాక్ష్యాధారాలు చూపకుండా, అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేసి 50 రోజుల పాటు జైల్లో ఉంచడం ఏపీ ప్రజలకు రుచించలేదు. ఈ అరెస్ట్ ద్వారా చంద్రబాబుపై సానుభూతి పెరగడమే కాకుండా, జగన్ ఒక కక్షపూరిత నాయకుడు అనే ముద్ర బలంగా పడిపోయింది. సామాన్యులు సైతం ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు అని చర్చించుకునేలా చేసింది. అదే ఆగ్రహం 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి శవ పంచనామా రాసింది. కేవలం రాజకీయ నాయకులనే కాకుండా, కొన్ని సామాజిక వర్గాలను, వ్యాపారవేత్తలను జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా అమరావతి రైతుల పట్ల అనుసరించిన తీరు, వారిని హేళన చేయడం గ్రామీణ ఓటర్లలో తీవ్ర అసంతృప్తిని నింపిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. వీటికి తోడు, వైసీపీ సోషల్ మీడియా వింగ్ ద్వారా అప్పటి ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యులపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాయనే విమర్శలు ఉన్నాయి.
ఇక 2024 ఎన్నికల్లో మాత్రం.. జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బలంగా నమ్మారు. మరోసారి తానే సీఎం అవుతానంటూ కలలు కన్నారు. అప్పట్లో సంక్షేమ పథకాలు ప్రజలను ఆదుకుంటాయని జగన్ నమ్మినా, అహంకారం, వ్యక్తిత్వ హననం ఆ పథకాల ప్రభావాన్ని తుడిచిపెట్టేశాయన్న ఆరోపణలు ఎదురవుతున్నాయి. ఇంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదని చర్చ జరుగుతోంది. ఇప్పటికీ తనదే తప్పు లేదని, ఈవీఎంల వల్లో లేక మరే కారణం వల్లో ఓడిపోయామని చెప్పుకోవడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదకరమని పొలిటికల్ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. పార్టీలో ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పక్కకు తప్పుకుంటున్నా, కేవలం కొందరు వీరాభిమానుల మాటలు విని జగన్ ముందుకు వెళ్తున్నారనే టాక్ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రజలు పగలు, ప్రతీకారాలు కోరుకోవడం లేదు. కేవలం అభివృద్ధిని, ప్రశాంతమైన పాలనను కోరుకుంటున్నారనీ జగన్ గ్రహించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఏదీఏమైనా జగన్ ఇప్పటికైనా తన పంథాను మార్చుకుంటారా. తన తండ్రిలా అందరివాడు అనిపించుకునే ప్రయత్నం చేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. లేక అదే పాత కక్ష రాజకీయాలను కొనసాగిస్తారా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ తన రాజకీయ శైలిని పూర్తిగా ప్రక్షాళన చేసుకోకపోతే మాత్రం 11 సీట్ల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందన్నది రాజకీయ పండితుల మాట. మరి జగన్ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Congress Whip: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. శాసనసభ, శాసనమండలిలో కొత్త విప్లను నియమించింది. అసెంబ్లీలో విప్ లుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావుకు అవకాశం ఇచ్చారు. ఇక శాసనమండలిలో విప్లుగా ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్కు చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ పదవుల నియామకంపై అధికార పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. విప్ పదవుల భర్తీలో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ ఉందనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు కీలక పదవి దక్కడంతో.. త్వరలో జరిగే విస్తరణలో నల్గొండ జిల్లాకు మంత్రి పదవి లేనట్టే అన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Also Read: TMC Manifesto: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. తృణమూల్ అధినేత్రి మమతా టాప్ 10 హామీలు
ప్రస్తుతం నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇందులో ఒకరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాగా.. మరొకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మరోవైపు ఇదే జిల్లా నుంచి ప్రభుత్వ విప్గా బీర్ల ఐలయ్య కొనసాగుతున్నారు. అటు శాసనమండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇప్పుడు వేముల వీరేశంకు సైతం ప్రభుత్వ విప్ పదవిని అప్పగించారు. మరోవైపు ఎస్టీ కోటాలో ఎంపికైన డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టినా.. ఆ పదవిని ఆయన చేపట్టలేదు.. ఈ పోస్టును సైతం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ను అప్పగిస్తారని ప్రచారం సాగుతోంది. దాంతో ఉమ్మడి జిల్లాకు ఆరు కీలక పోస్టులు దక్కినట్టు అవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే విస్తరణలో నల్గొండ జిల్లాకు మంత్రి పదవి దాదాపు లేనట్టేనని జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు. అందుకే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు విప్ పదవి ఇచ్చారని ప్రచారం సాగుతోంది.
Also Read: Kavitha: తెలంగాణ బడ్జెట్పై జాగృతి ఫైర్.. రాహుల్ గాంధీకి కొత్త పేరు పెట్టిన కవిత
కొద్దిరోజులుగా మంత్రి పదవి రాలేదనే అసంతృప్తిలో మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పెద్దలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డి దూకుడు పెంచారు. వైన్స్ షాపుల దగ్గర నుంచి.. లోకల్ బాడీ ఎన్నికల్లోనూ తన మార్క్ చూపించారు. అంతేకాకుండా తనకు అవకాశం దొరికిప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. దాంతో రాజ్ గోపాల్ రెడ్డి వ్యవహారాన్ని టీపీసీసీ చీఫ్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దాంతో హైకమాండ్ సైతం రాజ్ గోపాల్ రెడ్డి అంశాన్ని హైకమాండ్ సీరియస్గా పరిశీలిస్తోందని అంటున్నారు. అయితే ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు ఆసాధ్యమని పార్టీ పెద్దలు అన్నట్టు తెలిసింది. ఒకవేళ వెంకట్ రెడ్డి మంత్రి పదవి వదులుకుంటే.. ఆ పదవిని రాజ్ గోపాల్ రెడ్డికి ఇవ్వమంటూ హైకమాండ్ చెప్పినట్టు ప్రచారం సాగుతోంది.
కానీ వెంకట్ రెడ్డిని మంత్రి పదవిలో నుంచి తప్పించడం అసాధ్యమని తేలడంతోనే.. రాజ్ గోపాల్ రెడ్డిని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్ గోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు సైతం కాస్తా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఆయన పార్టీకి లాయల్గా ఉండే పరిస్థితులు లేరనే అభిప్రాయానికి పార్టీ పెద్దలు వచ్చినట్టు సమాచారం. అందుకే రాజ్ గోపాల్ రెడ్డిని పక్కన పెట్టారని టాక్. మరోవైపు త్వరలో జరిగే విస్తరణలో ఎస్టీ సామాజికవర్గం నేతకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. ఇప్పటివరకు ఎస్టీలకు, రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మరో పదవి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రెడ్డి నేతకు ఇచ్చేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. కాబట్టి.. రాజ్ గోపాల్ రెడ్డికి మంత్రి దాదాపు లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వ విప్ గా వేముల వీరేశంకు అవకాశం కల్పించి.. రాజ్ గోపాల్ రెడ్డికి చెక్ పెట్టారని ప్రచారం సాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
West Bengal Assembly Elections: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ నెలకొనగా.. ఇప్పటికే షెడ్యూల్ విడుదలై అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు, అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. వరుసగా నాలుగోసారి అధికారం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అదిరిపోయే మేనిఫెస్టోను ప్రకటించింది. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలను అమలుచేస్తూనే వాటికి మరింత పెంచుతూ పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయాలు ప్రకటించారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్ బడ్జెట్తో ఆరు గ్యారెంటీలకు ఘోరీ.. అందరికీ మొండి'చేయి': హరీశ్ రావు
ఓటర్లను ఆకర్షించి నాలుగోసారి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక 10 హామీలు ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపిస్తే రాబోయే ఐదేళ్లలో ప్రతి ఇంట్లో ఆనందం నింపాలనే ఆశయంతో పనిచేస్తామని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓటమిని ముందే ఖరారు చేసుకున్న బీజేపీ పశ్చిమ బెంగాల్లో అనధికార రాష్ట్రపతి పాలన విధించారని మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ను కాపాడుకునేందుకు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భయభ్రాంతులకు గురిచేసినా.. ధనప్రవాహంతో ప్రలోభ పెట్టినా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. 'మేం విభజన రాజకీయాలు చేయడం లేదు. అన్ని మతాల ప్రజలూ నాకు సమానమే' అని మమతా బెనర్జీ ప్రకటించారు.
Also Read: RK Roja: ఉగాది రోజు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీఆర్ నాయుడు గాడిదలు కాస్తున్నారా?
మేనిఫెస్టోలో ప్రధాన హామీలు ఇవే!
లక్ష్మీ భండార్ సహాయం పెంపు
ప్రస్తుతం అమలులో ఉన్న లక్ష్మీ భండార్ పథకం సహాయం పెంచుతామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సాధారణ మహిళలకు నెలకు అందిస్తున్న సహాయం మరో రూ.500 పెంచుతూ మొత్తం రూ.1,500 చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇక ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1,700 ఆర్థిక సహాయం టీఎంసీ ప్రకటించింది. ఇక నిరుద్యోగులకు అందిస్తున్న భృతి రూ.1,500 అందిస్తామని హామీ ఇచ్చింది.
==> పారిశ్రామికంగా పశ్చిమ బెంగాల్ మరింత అభివృద్ధి చెందేందుకు మరింత ప్రోత్సాహం ఇస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఎంఎస్ఎంఈలతో 1.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, పోర్టులు, వాణిజ్య మౌలిక వసతులు, అత్యాధునిక గ్లోబల్ ట్రేడ్ సెంటర్ను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని పెట్టుబడులు, వ్యాపారాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడం.
==> ‘దౌరే చికిత్స’ పేరిట ఇంటింటికీ ఆరోగ్య సేవలు ప్రారంభం. ఇంటి వద్దే నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య శిబిరాలు ఏర్పాటు.
==> రాష్ట్రంలోని వేలాది పాఠశాలలను ఈ-లెర్నింగ్ సౌకర్యాలతో ఆధునీకరణ
==> 7 నుంచి 8 కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తామని హామీ. బ్లాక్లు, కొత్త మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేయాలని మేనిఫెస్టోలో ప్రకటన.
==> అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశం. రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి, భూమిలేని రైతులకు మద్దతు ఇవ్వడానికి, వ్యవసాయ రంగాన్ని మరింత మెరుగుపరచడానికి రూ.30,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
==> అర్హులైన అందరికీ వృద్ధాప్య పింఛన్లు నిరంతరాయంగా అందించడం.
==> ప్రతి కుటుంబానికీ శాశ్వత ఇంటి నిర్మాణం.
==> ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీటి సరఫరా
కాగా పశ్చిమబెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 పోలింగ్ జరుగుతుండగా.. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana SSC Exams Cancelled: తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. నేడు అనగా మార్చి 20వ తేదీన డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్కు సంబంధించిన పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలపై ఆయన కీలక ప్రకటన చేశారని వార్తలు వచ్చాయి. వచ్చే విద్యాసంవత్సరం 2026-27 నుంచి పదో తరగతి బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్లు తాజాగా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే దీనిపై తెలంగాణ విద్యాశాఖ కమిషన్ ఓఎస్డీ డాక్టర్ జీనత్ స్పందించారు. పదో తరగతి పరీక్షలు రద్దు వెనుక అసలు నిజం ఇదే అని అధికారి జీనత్ క్లారిటీ ఇచ్చారు.
జరిగింది ఇదే?
10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని తాము సమర్పించిన నివేదికలో ఎక్కడా సిఫార్సు చేయలేదని తెలంగాణ విద్యా కమిషన్ స్పష్టం చేస్తోంది. SSC బోర్డును, BIEని విలీనం చేయాలని, అలాగే కేవలం 11వ తరగతి పబ్లిక్ పరీక్షలను మాత్రమే రద్దు చేయాలని కమిషన్ సిఫార్సు చేసినట్లు డాక్టర్ జీనత్ స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలని, ప్రజలకు కచ్చితమైన, ధృవీకరించబడిన సమాచారం మాత్రమే చేరేలా చూడాలని మేము మీడియాకు వెల్లడించారు.
అయితే అంతకుముందు మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి..తెలంగాణ విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో ఉన్న +2 విధానం అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోనూ అలాంటి మార్పులు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. ఈ క్రమంలో SSC బోర్డు లేనట్టేనని..దీంతో పదో తరగతి పరీక్షలు ఉండబోవని ఆయన ప్రకటన చేశారు.
మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యావ్యవస్థలో మార్పులపై ఏర్పాటు చేసిన కమిటీ అనేక అధ్యయనాలు చేస్తోందని అయన తెలిపారు. అయితే ఈ మార్పులపై విద్యాశాఖ కమిషన్ ఇచ్చేది తుదినివేదిక కాదని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టింది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ అని రేవంత్ అన్నారు. బడ్జెట్కు వ్యతిరేకంగా చెవిలో పువ్వులు పెట్టుకుని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతల తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ సెటైర్లు వేశారు. మాజీ సీఎం కేసీఆర్ బయటకి రాకుండా గృహ నిర్బంధం చేశారని.. తెలంగాణ జాతిపిత ఎవరో ప్రజలు డిసైడ్ చేయాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Beer Bottle Roti Viral Video Watch Here: మనం వంటింట్లో రొట్టెలు చేయాలంటే చపాతీ కర్ర ఉపయోగిస్తూ ఉంటాం.. కానీ ఈ రోజుల్లో టాలెంట్, చిట్కాలకు కొదవలేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక యువకుడు ఎటువంటి కోలా సహాయం లేకుండా కేవలం ఒక బీరు సీసా తో రొట్టెను ఒత్తుతున్న దృశ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఐడియాను చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు అదుర్స్ అంటున్నారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లో.. కొంతమంది యువకులు కలిసి ఒకచోట కూర్చుని ఉండడం చూడొచ్చు. బహుశా వాళ్లంతా బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్నారని భావించవచ్చు. అయితే వారిలో ఒక యువకుడు రొట్టెల పిండిని బాగా మిక్స్ చేయడం చూడొచ్చు. మరొక యువకుడు అయితే, రోటిని చేయడం మీరు గమనించవచ్చు. అయితే ఆ యువకుడు రొట్టెలను వింతగా చేస్తున్నాడు. రోటీల కోల అందుబాటులో లేకపోయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆ యువకుడు తన బుర్రకు పదును పెట్టాడు.. పక్కనే ఉన్న ఒక ఖాళీ బీరు సీసాను తీసుకున్నాడు. ఒక చిన్న ప్లేట్లు పిండి ముద్దను పెట్టి ఆ సీసాతో కూలలాగా వాడుతూ ఎంతో అద్భుతంగా గుండ్రని రొట్టెను తయారు చేశాడు.
ఇలా ఆ యువకుడు పదుల సంఖ్యలో బీరు సీసాను వినియోగించి రొట్టెలను తయారుచేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ రొట్టెలు కూడా చాలా గుండ్రంగా కనిపించడం మీరు చూడొచ్చు. అయితే అక్కడే ఉన్న అతని ఫ్రెండ్స్ ఈ వీడియోను మొబైల్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటినుంచి ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. అవసరాన్ని బట్టి ఐడియాలు వస్తుంటాయని మరోసారి నిరూపితమైందని కొంతమంది కామెంట్లు చేస్తూ వస్తున్నారు. బ్యాచ్యురల్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది ఏదో ఒక చిట్కా చేసి తప్పకుండా పని చేయాల్సిందే.. అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్తో పాటు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా షేర్ అవుతోంది. లక్షలు వ్యూస్ రావడమే కాకుండా వేలాల్లో లైక్స్ కూడా వస్తున్నాయి. వస్తువులు లేవని ఆగిపోకుండా.. అందుబాటులో ఉన్న వాటితో పాణి పూర్తి చేయడం ఆ యువకుడి నైపుణ్యానికి నిదర్శనమని సోషల్ మీడియా వినియోగదారులు కొనియాడుతున్నారు. ఏది ఏమైనా ఈ బీరు సీసా తో రొట్టె తయారీ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Fish Drinking Alcohol Video Watch Now: సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకు ఒక వింత వార్త వెలుగులోకి వస్తోంది. సాధారణంగా మనుషులు మద్యం సేవించడం మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో లేదా నిజజీవితంలో చూస్తూ ఉంటా. కానీ ఎప్పుడైనా ఒక చేప చిల్ అవుతూ మద్యం తాగడం చూశారా? వినడానికి వింతగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. అంతేకాదండోయ్ ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలు ఒక యువతి సరదాగా సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ చేసేందుకు చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ యువతి చేతిలో ఒక ప్లాస్టిక్ గ్లాస్లో మద్యం ఉండటమే కాకుండా మరో చేతిలో ఒక పెద్ద చేప ఉండడం మీరు చూడొచ్చు. ఆశ్చర్యమేంటంటే.. ఆ చేపకు తన చేతిలో ఉన్న మందు గ్లాసుతో నోట్లో కొద్దికొద్దిగా మందు పోసింది.. అయితే, ఆ చేప కూడా ఏమాత్రం భయం లేకుండా నోరు తెరిచి.. చాలా నెమ్మదిగా మందు తాగడం గమనించవచ్చు. అంతేకాకుండా ఆ చేప ఎంతో ఇష్టంగా మద్యాన్ని తాగడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు..
అయితే, ఆ యువతి గ్లాసులో ఉన్న మధ్యాన్ని ఆపకుండా నెమ్మదిగా చేప నోట్లో పోయడం మీరు గమనించవచ్చు.. ఆ గ్లాసులో ఉన్న మందు అయిపోయేంతవరకు చేప నోరు తెరుస్తూనే ఉంది. అంతేకాకుండా ఎంతో ఇష్టంగానే మద్యం తాగుతూనే కనిపించింది. అయితే, ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.. ఏంటి ఈ చేపకు కూడా మందు అలవాటు ఉందా అంటూ.. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
ఈ వీడియో పోస్ట్ చేసిన రోజుల వ్యవధిలోనే విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన చాలామంది ఫన్నీ కామెంట్ చేస్తూ వస్తున్నారు.. బహుశా ఆ చేపకు వీకెండ్ పార్టీ మూడు వచ్చిందేమో అని కొంతమంది కామెంట్ చేస్తే.. మనుషులకే కాదు జంతువులకు కూడా కిక్కు కావాలా అంటూ మరికొంతమంది ఫన్నీగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. అయితే ఇది చూసిన జంతు ప్రేమికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి జీవులకు హానికరమైన మద్యం పోయడం అస్సలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం ఈ వీడియో ఊహించని స్థాయిలో వైరల్ గా మారింది..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Congress Fake Promises: 'ఇది ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్. ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పుమోపారు. రూ.లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదు' అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు అందరినీ మోసం చేశారని ఆరోపించారు. 'కాంగ్రెస్ నాయకులు ఒకరిని మించి ఒకరు ఫేక్ తున్నారు. అందుకే ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం' అని అభివర్ణించారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్ బడ్జెట్తో ఆరు గ్యారెంటీలకు ఘోరీ.. అందరికీ మొండి'చేయి': హరీశ్ రావు
తెలంగాణ బడ్జెట్పై శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డ, రాహుల్గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. 'రాహుల్ గాంధీ మా హైదరాబాదీ సలీం ఫేక్ లాంటి వ్యక్తి. సలీం ఫేక్ తన ఫేక్ తో కనీసం ప్రజలను నవ్విస్తాడు.. రాహుల్ మా ప్రజలను ఏడిపిస్తున్నాడు. అందుకే ఇక నుంచి రాహుల్ గాంధీకి రాహుల్ ఫేక్ అని నామకరణం చేస్తున్నాం' అని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. 'రైజింగ్ తెలంగాణ అంటే నిరుద్యోగంలో రైజింగ్ అవుతున్నాం. మోడీ బడే భాయ్ అని ఢిల్లీకి పోయి వంద రూపాయలు కూడా తేలేదు. 56 శాతం జనాభా ఉన్న బీసీలకు ఇచ్చింది 4 శాతం నిధులే. తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించారు' అని కవిత ఏకరువు పెట్టారు.
Also Read: RK Roja: ఉగాది రోజు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీఆర్ నాయుడు గాడిదలు కాస్తున్నారా?
'తెలంగాణ బడ్జెట్ ఏ మాత్రం ప్రజామోదం పొందేలా లేదు. బీసీలు 56 శాతం ఉంటే వారికి 4 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు అంటూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇక్కడకు వచ్చి ఫేకారు. ఎంబీసీ మినిస్ట్రీ, ఎంబీసీలో వెనుబడిన కులాలకు కార్పొరేషన్లు అన్నారు. ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు' అని కవిత గుర్తుచేశారు. ఈ రాష్ట్రంలో గిరిజన మంత్రి లేని మొదటి ప్రభుత్వం ఇది అని.. కచ్చితంగా లంబాడా మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు.
'పేదల మీద ప్రేమ ఉన్నట్లు రాహుల్ గాంధీ మాట్లాడేదంతా ఫేక్. చాలా అంశాల్లో గతేడాది ఎంత కేటాయింపులు జరిపారో మళ్లీ వాటినే అక్షరం మార్చకుండా కేటాయించారు. మైనార్టీ, రైతు భరోసా, రైతు కూలీలకు ఇచ్చే సాయం, గృహా జ్యోతి ఇలా గతేడాది బడ్జెటే పెట్టారు. అందుకే ఇది విజన్ బడ్జెట్ కాదు. రీ విజన్ బడ్జెట్ మాత్రమే అంటున్నా' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 'బడేభాయ్ మోడీ అంటూ వందల సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ లను తెచ్చుకోలేకపోయారు. ఎందుకు ప్రధానితో బీసీ బిల్లు, అఖిలపక్షం భేటీ గురించి మాట్లాడటం లేదు. పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు చెప్పాలి?' అని కవిత ప్రశ్నించారు.
పైరవీలతో తమ వాళ్లకు పదవులు తెచ్చుకుంటున్నారు.. కానీ ప్రజలకు మాత్రం పైసలు తేవటం లేదని అని మాజీ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు బడ్జెట్ పైసా కేటాయించలేదు.. కొత్త పింఛన్లు లేవు.. కొత్త ఉద్యోగాల భర్తీ ఊసేలేదని వివరించారు. అంటే ఇది ఫేక్, ఫ్యాబ్రికేటేడ్ బడ్జెట్ అని స్పష్టంగా తెలిసిపోతోందని పేర్కొన్నారు. 'మొత్తంగా రాష్ట్రం అప్పు...8 లక్షల 64 వేల 198 కోట్లకు చేరింది. అంటే ఒక్కో వ్యక్తిపై రూ.2. 16 వేలు అప్పు ఉంది. ఒక్కో కుటుంబంపై దాదాపు రూ.9 లక్షల అప్పు ఉన్నట్లే' అని వివరించారు. అప్పు తెచ్చిన డబ్బులు ఏమైనా సంక్షేమ పథకాలు అమలు చేశారా అంటే అది లేదని మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Girl Drinks Full Bottle Video: సోషల్ మీడియా పుణ్యమా అని ఈ మధ్యకాలంలో వింతలతో పాటు విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యూస్ కోసం, లైకుల కోసం కొందరు యువత ప్రాణాలకు తెగించి స్టంట్లు చేస్తుంటే.. మరికొందరు తమ ఆరోగ్యాన్నిపణంగా పెట్టి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఓ యువతకి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. చూస్తుండగానే ఒక నిండు మద్యం చేశాను ఆమె ఖాళీ చేసిన తీరు చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. యువతులంతా ఓ చిన్న ప్రైవేట్ పార్టీ చేసుకుంటున్నారు.. అక్కడ ఒక యువతి తన ఫ్రెండ్స్ అందరూ చూస్తుండగానే Old Monk రమ్ ఫుల్ బాటిల్ను చేతిలోకి తీసుకుంది. సాధారణ ఆల్కహాల్ను నీళ్లు లేదా సోడా కడుక్కొని తాగుతారు.. కానీ ఈ యువతి మాత్రం ఏకంగా బాటిల్ మూత తీసి.. నోట్లో పెట్టుకుని ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా తాగడం మొదలుపెట్టడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు..
కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోని ఆ బాటిల్లోని మధ్యాన్ని మొత్తం కడుపులో పోసేసుకుంది.. పక్కనున్న స్నేహితులు ఆమెను ఆపాల్సింది పోయి.. తాగుమంటూ ప్రోత్సహించడం ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూడొచ్చు. బాటిల్ పూర్తయ్యాక ఆ యువతి ఏదో సాధించినట్లు నవ్వుతూ కనిపించడం గమనార్హం.. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
ఈ వీడియో సోషల్ మీడియాలోకి రాగానే నిమిషాల్లో వైరల్గా మారడం విశేషం. అయితే దీనిపై కొంతమంది నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇది ప్రతిభ కాదు ఆత్మహత్యతో సమానం.. అంటూ కొంతమంది కామెంట్ చేయగా.. మరి కొంతమంది అంత మోతాదులో ఆల్కహాల్ ఒక్కసారిగా శరీరంలోకి వెళ్తే లివర్ దెబ్బ తినే ప్రమాదం ఉందని.. మరి కొంతమంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. అయితే గతంలో కూడా కొంతమంది యువత ఇలా లిక్కర్ ఛాలెంజ్ లో భాగంగా.. గబగబా ఫుల్ బాటిల్ తాగి ప్రాణాల మీదికి తెచ్చుకున్న సంగతి తెలిసిందే.. మరి ఈ యువతి పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Man Smokes With Nose Video Watch: గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా ఫన్నీ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఫన్నీ ఫన్నీ గా రోడ్ల పైన చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో యువత ఎక్కువగా చూసి ఎందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే చాలామంది ఫన్నీ వీడియోలను తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించారు. కొంతమంది మగవారు లేడీ డ్రెస్లో వచ్చి రోడ్లపై ఫన్నీగా చేయడం.. ఇలాంటి వీడియోలు మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అయితే తాజాగా ఓ ఫన్నీ వీడియో అందరినీ ఎంతగానో అలరిస్తోంది. ఈ వీడియోలో ఆ వ్యక్తి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..
నేటి యువతలు చాలామందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది.. చాలామంది రోజులు రెండు నుంచి మూడుసార్లు అయినా తప్పకుండా సిగరెట్ తాగుతూ ఉంటారు.. కొంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ దీనిని తాగకుండా ఉండలేరు.. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఫన్నీ ఘటన కూడా దీనికి సంబంధించిందే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ రీల్ చూసి అందరూ పగలబడి నమ్ముకుంటున్నారు.. ఈ రీల్లో ఒక యువకుడు సిగరెట్ తాగడం మీరు గమనించవచ్చు.. అయితే అతను నోరు తో కాకుండా ఏకంగా ముక్కుతో సిగరెట్ తాగుతున్నాడు..
సాధారణంగా అందరూ సిగిరెట్ పొగను నోటితో పీల్చుకొని కొన్ని కొన్ని సందర్భాల్లో ముక్కుతో బయటికి వదులుతూ ఉంటారు.. కానీ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ముక్కు ఎడమ రంధ్రంలో సిగరెట్ పెట్టుకొని.. దాని నుంచి నేరుగా పీల్చుకొని నోటి నుంచి పొగను బయటికి వదులుతుండడం మీరు వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఆ వ్యక్తి వీడియోకు ఫోజులిస్తూ మరి.. రెచ్చిపోయి ముక్కుతో సిగిరెట్ పొగని ఎక్కువగా పీల్చుకోవడం మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ దృశ్యాలు చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఇదేం వింతరా బాబు అని.. కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే ఈ వీడియో చూసి బీభత్సంగా నవ్వుకుంటున్నారు..
అయితే, ఈ వీడియో చూసిన చాలా మంది వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.. కొంతమంది ఇలాంటి మనుషులు మన భారతదేశంలోనే ఉంటారని కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది ఇలా సిగరెట్ తాగడం చాలా డేంజర్ అని వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోని కొన్ని లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు లైక్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది వారి అభిప్రాయాలు కామెంట్లలో రాసుకొచ్చారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Water Melon For Diabetic Patients: వేసవిలో ఎండ నుంచి తట్టుకునేందుకు పుచ్చకాయ మంచి ప్రయోజనకారిగా పనిచేస్తుంది. ఎంతో ఇష్టంగా ఈ పండును తింటుంటారు. అయితే మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను తినేందుకు ఎంతో భయపడతారు. మధుమేహ రోగులు పుచ్చకాయ తినవచ్చా లేదా అనే విషయంపై మనలో చాలా మందికి అనేక అభిప్రాయాలు ఉన్నాయి. అయితే దీనిపై వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
పుచ్చకాయలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 72. ఇది అధిక వర్గంలోకి వస్తుంది. సాధారణంగా మధుమేహం ఉన్నవారు తక్కువ GI (గ్రైసెమిక్ ఇండెక్స్) ఉన్న ఆహారాలను తినాలి. కానీ పుచ్చకాయలో 90 శాతానికి పైగా నీరు ఉంటుంది. ఈ కారణంగా దీని గ్లైసెమిక్ లోడ్ (GL) కేవలం 5 మాత్రమే. అంటే, దీనిని తక్కువ పరిమాణంలో తీసుకుంటే, రక్తంలో చక్కెరపై దీని ప్రభావం పెద్దగా ఉండదు.
మధుమేహ వ్యాధిగ్రస్తులైన రోజుకు 100 నుండి 150 గ్రాముల కంటే ఎక్కువ పుచ్చకాయ ముక్కలను తినకపోవడం మంచిది. పుచ్చకాయ రసం తీయడం వల్ల దానిలోని పీచుపదార్థం తగ్గిపోతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవచ్చు. అందువల్ల.. షుగర్ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ జ్యూస్ కంటే ముక్కలను తినడం ఎంతో మంచిది.
పుచ్చకాయ ముక్కలను బాదం, వాల్నట్లు లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఇతర ఆహారాలతో కలిపి తినడం వల్ల సహజ చక్కెర శోషణ నెమ్మదిస్తుంది. అయితే పుచ్చకాయను తినే సమయం కూడా ఎంతో ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. వేసవిలో అయినా పుచ్చకాయను ఉదయం లేదా మధ్యాహ్నం తినడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రాత్రిపూట పండ్లు తినడం మంచిది కాదని చెబుతున్నారు.
పుచ్చకాయ ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ పండులో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుందట. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. అలాగే, దీనిలోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మధుమేహం ఉన్నవారు పుచ్చకాయను పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. అయితే, వారి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి వారు దీనిని పరిమితంగా తీసుకోవాలి. తీవ్రమైన మధుమేహం ఉన్నవారు తమ వైద్యుని సలహా మేరకు మాత్రమే ఈ పండును తినాలి.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల నుంచి సంగ్రహించింది. దీన్ని పాటించే సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OnePlus Nord 6 Price: స్మార్ట్ఫోన్ ప్రజలకు వన్ప్లస్ సంస్థ మరో అద్భుతమైన శుభవార్త అందించబోతోంది. మధ్యతరగతి వినియోగదారుల కోసం త్వరలోనే మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ వన్ప్లస్ నార్డ్ సిరీస్ లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది OnePlus Nord 6 పేరుతో మార్కెట్లోకి రాబోతోంది. అయితే, అధికారిక ప్రకటనకు ముందే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫీచర్స్ లీక్ అయ్యాయి.. అంతేకాకుండా ఇది మార్కెట్లోకి ఎంతో శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
లీకైన సమాచారం ప్రకారం.. వన్ప్లస్ నార్డ్ 6 ను భారత మార్కెట్లోకి ఏప్రిల్ ఏడవ తేదీన విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే కంపెనీ విడుదల చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లీకైన సమాచారం ప్రకారం ఈ మొబైల్ చాలా అద్భుతమైన డిజైన్తో పాటు కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ ఫీచర్స్ తో ఇది అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా వినియోగదారులకు అత్యుత్తమ లుక్కున అందించేందుకు మొబైల్ స్టైల్ కూడా మార్చినట్లు తెలుస్తోంది.
సాధారణ స్మార్ట్ఫోన్స్లో వన్ప్లస్ కంపెనీ ఇప్పటికీ కేవలం 5000mAh బ్యాటరీతో మాత్రమే మార్కెట్లోకి మొబైల్స్ను విడుదల చేసింది.. కానీ త్వరలో రాబోయే వన్ ప్లస్ నార్డ్ 6 ఏకంగా మోస్ట్ పవర్ఫుల్ 9000mAh భారీ బ్యాటరీతో రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. ఇది నిజమైతే ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం మూడు నుంచి నాలుగు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దీనికి తోడు సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తే అతి తక్కువ సమయంలోనే బ్యాటరీని ఎంతో సులభంగా ఫిల్ చేయొచ్చు..
లీకైన వివరాల ప్రకారం.. ఈ మొబైల్ 12GB ర్యామ్ వేరియంట్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. గేమింగ్ ప్రియులకు ఈ మొబైల్ ఎంతగానో సరిపోతుంది. అంతేకాకుండా ఇది 6.7 అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ మొబైల్లోని వెనుక భాగం కెమెరా 108MP అద్భుతమైన సెన్సార్తో విడుదల కాబోతోంది. దీంతోపాటు ఎంతో శక్తివంతమైన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ రూ.30 వేల లోపే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Budget: 'రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశ పరిచింది. ఆరు గ్యారెంటీలకు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి విజయవంతంగా ఘోరీ కట్టారు' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. '20 పేజీలు పెంచారు, రూ.20 వేల కోట్ల బడ్జెట్ పెంచారు తప్ప ఆరు గ్యారెంటీల ప్రస్తావన, నిధుల కేటాయింపు చేయలేకపోయారు. కాగితాల మీద అంకెలు ఉన్నాయి తప్ప, ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు' అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
Also Read: RK Roja: ఉగాది రోజు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీఆర్ నాయుడు గాడిదలు కాస్తున్నారా?
బడ్జెట్ 2026-27పై అసెంబ్లీ మీడియా హాల్లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల అభివృద్ది కోసం కాదన్నది బడ్జెట్ నిరూపించింది. గత బడ్జెట్లో చెప్పిన పథకాలు అమలు చేయలేదు, ఈసారి అవే పెట్టారు. పోయిన బడ్జెట్ మాదిరి ఈ బడ్జెట్లో రాజీవ్ యువ వికాసం కోసం రూ.6 వేల కోట్లు పెట్టారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనే అదే జరిగింది. ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క పైసా ఖర్చు చేయలేదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.
Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!
'ఈ బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరేదీ కాదు. కేటాయింపుల విషయంలో.. ఖర్చు విషయంలో చిత్తశుద్ది లేదు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేరు చెప్పి వారి ఆత్మ క్షోభించేలా చేస్తున్నారు. భట్టి బడ్జెట్ బోగస్ బడ్జెట్, బడా జూటా బడ్జెట్, ఇదొక వట్టి బడ్జెట్' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 'అభయహస్తం కాదు రిక్త హస్తం అని అర్థమైంది. తెలంగాణను, హైదరాబాద్ను మూడు ముక్కలు చేయడం తప్ప విషయం లేదు. పింఛన్ల పెంపు లేదు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ లేదు' అని గుర్తుచేశారు.
Also Read: Devuni Kadapa: ఉగాది ప్రత్యేకం.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లిం భక్తులు
'ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులకు మొండి చేయి. ముదిరాజులకు, గౌడన్నలకు, గొల్ల కుర్మలకు ఇలా అన్నబీసీ వర్గాలకు మొండిచేయి. ఎస్సీ, ఎస్టీలకు మొండి చేయి, మహిళలకు మొండి చేయి
ఆశా, అంగన్ వాడీలకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి చూపారు. సకల జనులకు దక్కింది గుండు సున్నా' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. అంకెల గారడీ మాటల గారడీ తప్ప పేదల పట్ల చిత్తశుద్ది లేదని ప్రకటించారు. 'మూడేళ్లు నిండకముందే రూ.మూడున్నర లక్షల కోట్ల అప్పలు చేశారు. కేసీఆర్ తెచ్చిన అప్పులను మూల ధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించాడు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మెడికల్ కాలేజీలు కట్టాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.
'మీరేం చేశారు? చరిత్రలో ఎన్నడూ లేనంత అప్పు పెరిగింది. 27 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను కూర్చొబెట్టుకొని అంబేడ్కర్ సూక్తులు మాట్లాడటం సిగ్గుచేటు' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పదేండ్ల కాలంలో బూడిద నుంచి ఫీనిక్స్ పక్షిలాగా ఎగిరింపచేసింది. ఆ ఫీనిక్స్ పక్షిని బూడిద చేసిన పాపం మీది' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కుంభకోణాలు తప్ప పథకాలు ఉన్నాయా? మేడారం టెండర్లలో ఏం జరిగిందో మీ క్యాబినెట్ మంత్రి కుమార్తెనే చెప్పింది. నాసిరకం పనులతో నాలుగు రోజులకే బయటపడ్డది. గురుకులాల్లో తిండి పెట్టే దిక్కు లేదు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్కూల్లు అంటూ ఆర్భాటాలు చేస్తున్నారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 'పెట్టుబడుల విషయంలో అవే కట్టు కథలు
ఏ కంపెనీ, ఎన్ని ఉద్యోగాలు, ఎంత పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేయాలి' అని డిమాండ్ చేశారు. 'విదేశాలకు వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు అక్రమ సంపాదన భద్రపరుచుకోవడానికి. దేశ సగటు కన్నా తెలంగాణ జీఎస్డీపీ అధికంగా ఉందని భట్టి విక్రమార్క చెబుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రం దివాళా తీసింది అంటాడు' అని గుర్తుచేశారు.
వంద రోజుల్లో చేస్తానన్న ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదు? అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'ఆరు గ్యారెంటీల విషయంలో గతేడాది రూ.56 వేల కోట్లు పెడితే ఈ బడ్జెట్లో రూ.50 వేల కోట్లకు కుదించారు' అని తెలిపారు. 'దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9శాతం ఎక్కువ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో 14 శాతం ఉంటే కాంగ్రెస్ పాలనలో 10 శాతం. అంటే నాలుగు శాతం తగ్గింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రస్తావించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook