షాద్ నగర్ క్రైమ్ సీఐ నీ సర్వీస్ రిమూవ్ చేయాలని ఎల్ బి నగర్ లో బీఎస్పీ ఆందోళన
షాద్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో దళిత మహిళకు థర్డ్ డిగ్రీ ఇచ్చిన కేసులో సీఐ రాంరెడ్డిని తొలగించాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఎల్బీనగర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఈ ఘటనపై ఎందుకు విచారణ జరపడం లేదని బాధిత మహిళకు కూడా ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు నాయకులు సీఐ రాంరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించకపోతే ఊరుకోమని హెచ్చరించారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
AP Govt Teachers Salary Cut: ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఇకపై ఆలస్యంగా పాఠశాలలకు వస్తే మాత్రం వేతనాల్లో కోత పడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నాళ్లు పది నిమిషాలు ఆలస్యంగా వచ్చేలా గ్రేస్ పీరియడ్ అవకాశం ఉంది. ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు జీతం కట్ చేస్తామని ప్రభుత్వం ఆదేశించింది. ఉపాధ్యాయుల హాజరు నిబంధనలను పాఠశాల విద్యా శాఖ కఠినతరం చేసింది.
Also Read: Free Bus Scheme: ఫ్రీ బస్సుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఉత్తర్వులు జారీ!
ఉపాధ్యాయులు పాఠశాలలకు ఉదయం 9 గంటల తరువాత వస్తే ఆలస్యంగా (లేట్ ఇన్) ప్రభుత్వం ఇకపై వేతనాల్లో కోత పడేలా విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. 10 నిమిషాల వెసులుబాటు సమయం (గ్రేస్ పీరియడ్) ఉన్నప్పటికీ అది నెలలో ఒకట్రెండు రోజులు మాత్రమేనని స్పష్టం చేసింది. ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం పాఠశాలకు వచ్చేవారు ఒంటి గంట లోపు రావాలని.. ఆ తర్వాత హాజరు నమోదు చేస్తే లేట్ ఇన్ అని వస్తుంది.
Also Read: Gold Fruad: మేడమ్ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు
ఉదయం పాఠశాలకు హాజరై.. మధ్యాహ్నం సెలవు పెట్టిన టీచర్లు మధ్యాహ్నం 12.30 గంటల కంటే ముందుగా ఔట్ టైం నమోదు చేస్తే వేగంగా వెళ్లిపోయినట్లు విద్యా శాఖ గుర్తించింది. ఉపాధ్యాయులు చేస్తున్న టీచర్లు అలా చేయకుండా జీతం నుంచి కోత పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. నెలలో రెండు రోజులు మాత్రమే ఇలా చేస్తే సరిపోతుంది. అంతకు మించి అలా చేస్తే ఉపాధ్యాయుల వేతనాల్లో కోత పడే అవకాశం ఉంది.
ప్రాథమిక పాఠశాలల్లో సాయంత్రం 3.30 గంటల కంటే ఒక నిమిషం ముందు, ఉప ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం 4 గంటల కంటే ఒక్క నిమిషం ముందు ఔట్ టైం నమోదు చేసినా అది ఏర్లీ ఔట్ పరిగణిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. ఎవరైనా ఉదయం ఇన్ టైమ్ నమోదు చేసి.. ఔట్ టైం నమోదు చేయకపోతే ఉదయం హాజరు నమోదు చేసిన వెంటనే పాఠశాల ప్రాంగణాన్ని విడిచి వెళ్లి పోయినట్లుగా పరిగణించింది. దీంతో ఉపాధ్యాయులు ఇకపై ఆలస్యంగా వెళ్లినా.. తొందరగా వెళ్లినా ఉపాధ్యాయులు ఇక జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే జీతం కట్ అవుతుంది.
ప్రభుత్వ టీచర్ల ఆగ్రహం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వస్తే జీతం కట్ చేసే ప్రభుత్వం మరి తమ డిమాండ్లు, సమస్యలు పరిష్కారంలో ఆలస్యం చేస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు. 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే చర్యలు తీసుకునే ప్రభుత్వం మరి ఆలస్యంగా ఇచ్చే జీతాలు, ఆలస్యంగా ఇచ్చే డీఏలు, ఆలస్యంగా ఇచ్చే ఐఆర్, ఆలస్యంగా ఇచ్చే పీఆర్సీ, ఆలస్యంగా ఇచ్చే ఏరియర్లు, ఆలస్యంగా ఇచ్చే మెడికల్ బిల్లులు, ఆలస్యంగా ఇచ్చే రిటైర్డ్ బెనిఫిట్స్ వీటికి ఎవరు బాధ్యులు? అని టీచర్లు నిలదీస్తున్నారు. ఇవన్నీ ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ప్రభుత్వం ఇచ్చిన రోజు మాత్రమే ఒక్క నిమిషం ఆలస్యమైనా ఉద్యోగులపై చర్యలు తీసుకునే నైతిక అర్హత ఉంటుందని ప్రభుత్వ టీచర్లు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Stock Market Middle East tensions: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, గ్లోబల్ ఇంధన ధరలు ఎగసిపడటం వంటి అంశాలు పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీశాయి. ఫలితంగా భారత ఈక్విటీ సూచీలు గణనీయంగా క్షీణించాయి.
ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఉదయం 9:25 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 1,048 పాయింట్లు పడిపోయి 80,238 స్థాయిలో కొనసాగింది. అదే సమయంలో నిఫ్టీ 50 సుమారు 307 పాయింట్లు తగ్గి 24,871 వద్ద ట్రేడ్ అయింది. ప్రీ-ఓపెనింగ్ సెషన్లోనే సెన్సెక్స్ సుమారు 2,700 పాయింట్లు, నిఫ్టీ 530 పాయింట్ల వరకూ క్షీణించడం పెట్టుబడిదారుల్లో ఆందోళనకు కారణమైంది. ఆ తరువాత కొంతమేర కోలుకున్నప్పటికీ నష్టాలు పూర్తిగా తగ్గలేదు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 80 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతున్నాయి. సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో ధరలు మరింత పెరిగే అవకాశమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా చమురు ఆధారిత రంగాలపై స్పష్టంగా కనిపించింది. విమానయాన రంగానికి చెందిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లు దాదాపు 5 శాతం మేర పడిపోయాయి. అలాగే మారుతీ సుజుకీ, ఏషియన్ పేయింట్స్ వంటి ప్రముఖ సంస్థల షేర్లు కూడా నష్టాల్లోనే కొనసాగాయి.
కరెన్సీ మార్కెట్లోనూ ఒత్తిడి కనిపించింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 24 పైసలు తగ్గి 91.32 వద్ద ట్రేడ్ అయింది. విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కూడా మార్కెట్ భావోద్వేగాలను దెబ్బతీశాయి. గత ట్రేడింగ్ సెషన్లో వారు సుమారు రూ.7,536 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఈ పరిణామాలు మొత్తం మీద మార్కెట్లలో అస్థిరతను పెంచుతూ పెట్టుబడిదారులను జాగ్రత్త వైఖరికి మళ్లిస్తున్నాయి.
Also Read: Gold Rate: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే ఛాన్స్…ఇరాన్ - అమెరికా యుద్ధం దెబ్బతో గోల్డ్, సిల్వర్ కొత్త రికార్డులు తాకుతాయా..? ఇన్వెస్టర్లు ఏం చేయాలి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rahu Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చితో పాటు మే నెలకు కూడా చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మే 31 తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఛాయాగ్రహంగా చెప్పుకునే రాహువు శతభిషా నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు సంచారం కొన్నిసార్లు జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అంతేకాకుండా అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ రాహువు సంచారం చాలా కీలకమైంది గా చెప్పవచ్చు. ఈ సంచారం కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆ శుభ ఫలితాలకు బదులుగా.. అదృష్టం లభించబోతోంది. ముఖ్యంగా ఆయన రాశుల వారికి అనుకూలమైన ప్రయోజనాలు అన్ని కలుగుతాయి. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. అయితే, రాహువు నక్షత్ర సంచారంతో ఏ రాశుల వారికి ఎక్కువ లాభాలు కలుగుతాయో తెలుసుకోండి.
ముఖ్యంగా రాహువు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఆకస్మికతను లాభాలు కలుగుతాయి.. అవసరమైన ఖర్చులు కూడా పూర్తిగా తగ్గే ఛాన్సులు ఉన్నాయి. దీంతోపాటు ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించడమే కాకుండా.. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు విదేశీ పర్యటనలు మంచి లాభాలు కూడా పొందుతారు. అలాగే కొన్ని పనుల్లో అద్భుతమైన విజయాలు పొందుతారు. చట్టపరమైన సమస్యలేవైనా ఉంటే ఈ సమయంలో ఆయా రాశుల వారు పరిష్కారం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి ఊహించని ప్రయోజనాలు:
కన్యా రాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహు అద్భుతమైన సానుకూలమైన ప్రయోజనాలను అందించబోతున్నాడు. ముఖ్యంగా వ్యాపారాల్లో లాభాలు పెరగడమే కాకుండా ఆర్థిక స్థితిలో చాలావరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాకాలంలో పెండింగ్లో ఉన్న అప్పులు కూడా ఈ సమయంలో తప్పకుండా తీర్చగలుగుతారు దీని వల్ల వీరికి ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలున్నాయి అలాగే విపరీతమైన శాంతి పెరుగుతుంది.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా రాహు ప్రభావంతో జీవితంలో సానుకూలమైన మార్పులు కనిపిస్తాయి. ఆదాయం భారీ మొత్తంలో పెరగడం వల్ల అప్పులు తీర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయి. అదనంగా ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వివాహం కాని వారికి కొత్త ప్రతిపాదనలు కూడా వస్తాయి.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు జీతాలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి. అలాగే ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. వ్యాపార భాగస్వాములకు ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాస్తున్న వ్యక్తులకు మంచి మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. దీంతోపాటు ఆర్థికంగా జీవితంలో ముందుకు సాగుతారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Guru Aditya Raja Yoga Effect On Zodiac Telugu: మీనరాశిలో అరుదైన గ్రహాల సంయోగం జరగబోతోంది. ముఖ్యంగా గురు ఆదిత్య యోగం మార్చి 15న ఏర్పడబోతోంది. ఈ యోగం అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటి. దేవ గురు బృహస్పతి ప్రస్తుతం మీనరాశిలో సంచార దశలో ఉన్నాడు.. మార్చి 15వ తేదీన సౌర వ్యవస్థకు రాజుగా భావించే సూర్యుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తాడు.. ఫలితంగా సూర్యుడితో పాటు బృహస్పతి గ్రహాల కలయిక జరుగుతుంది. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన గురువు ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగ ప్రభావం మొత్తం ఐదు రాశుల వారికి అనుగ్రహాన్ని అందించబోతోంది. కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ ఫలితాలను అందిస్తుంది.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి
చాలాకాలంగా మేషరాశి వారికి సానుకూలమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. సామాజిక హోదా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనులు చేసే వ్యక్తులకు పదోన్నతులు లభించబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.
మిథున రాశి
మిథున రాశి వారికి కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. గొప్ప పురోగతి లభించడమే కాకుండా. వ్యాపారవేత్తలకు ఆర్థిక లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా కొత్త కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా.. అద్భుతమైన పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వీరు కొన్ని రకాల నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా అద్భుతంగా విజయవంతం అవుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించే వ్యక్తులకు కూడా అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రయాణాలు చేస్తున్న వ్యక్తులకు మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా ఉన్నత విద్యా లేదా పరిశోధనల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఊపందుకుంటాయి.
వృశ్చిక రాశి
గురు ఆదిత్య రాజయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి అద్భుతమైన శుభవార్త లభిస్తాయి. విద్యతో పాటు పిల్లలకు ఎన్నో రకాలు ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు పెరగడమే కాకుండా.. ఈ రాశి వారికి సృజనాత్మకత కూడా పెరుగుతుంది. అనుకున్న పనుల్లో ఊహించని ధన లాభాలు పొందుతారు.
మీనరాశి
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ శక్తివంతమైన రాజయోగంతో చాలావరకు కలిసి రాబోతోంది. మానసిక ప్రశాంతత కూడా మెరుగుపడడమే కాకుండా.. ఆరోగ్య పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. సామాజిక ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Power Cut Today: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్.. ఫుల్ డీటెయిల్స్..!
Power Cut Today In Hyderabad: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అత్యవసర నిర్వహణ పనులు, మరమ్మతుల కారణంగా మార్చి 2, సోమవారం రోజున విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రధానంగా ఆసిఫ్నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో మధ్యాహ్నం సమయంలో వేర్వేరు సమయాల్లో కరెంట్ కట్ చేయనున్నట్లు తెలిపారు.
విద్యుత్ అధికారులు వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం.. ఆయా కాలనీల్లో కోతలు విధించే సమయాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు నీరజా కాలనీ, చిత్రా ఎన్క్లేవ్, అక్బర్ బాగ్, మహబూబ్గార్డెన్, గ్రామర్ కాలనీ ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు హకీంపేట, యూసఫ్ టేకి, మీరా కాలనీ, అల్ హసనత్ కాలనీ, మిలిటరీ ఏరియా, టోలిచౌకి, డీలక్స్ కాలనీ, దౌలత్ గుల్షన్ కాలనీ, నిజాం కాలనీ, బడేజా నకి నగర్, మందార్ రెస్టారెంట్, కేఎఫ్సీ పరిసర ప్రాంతాల్లో కరెంట్ ఉండదు.
ఇక మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నదీమ్ కాలనీ, జ్యా కాలనీ, ఎస్ఏ కాలనీ, ఆదిత్య నగర్, రాయల్ పార్క్, జమాలి కుంట, అరుణ కాలనీ, రాహుల్ కాలనీ, కులీకుతుబ్ షా నగర్, సఫా హోటల్, గ్రామర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో కరెంట్ ఉండదు. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మెహదీపట్నం మిలిటరీ ఏరియా, పిల్లర్ బస్తీ, దాని పరిసర ప్రాంతాల్లో కరెంట్ ఉండదు.
కాగా ఎండా కాలం దృష్ట్యా కరెంట్ వినియోగం పెరగనుంది. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, క్రిందికి వేలాడుతున్న కరెంట్ తీగలను సరిచేయడం, సబ్స్టేషన్ల మరమ్మతుల కోసం ఈ ముందస్తు కోతలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత పెరిగే లోపే ఈ పనులను పూర్తి చేయడం ద్వారా భవిష్యత్తులో అంతరాయం లేని సరఫరాను అందించవచ్చని విద్యుత్ శాఖ భావిస్తోంది. మరిన్ని వివరాల కోసం లేదా ఏవైనా అత్యవసర ఫిర్యాదుల కోసం సంబంధిత ఏఈ లేదా విద్యుత్ శాఖ హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించవచ్చు.
Also Read: Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు.. ఈరోజు మంగళ ఆదిత్య యోగం ఏ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..!
Also Read: IND vs WI Live Score: విండీస్పై భారత్ ఎలా గెలిచింది..? ఏ ఓవర్లో ఏం జరిగింది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Ind vs WI T20 World Cup 2026 Highlights: టీ20 ప్రపంచకప్లో చివరి సూపర్ 8 మ్యాచ్లో వెస్టిండీస్ పై భారత్ మరోసారి ఆధిపత్యం చలాయించింది. సెమీస్ చేరాలనుకుంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కరీబియన్లు పోరాడి ఓడి టోర్నీ నుంచి వైదొలగగా.. టీమిండియా సెమీస్లోకి దూసుకెళ్లింది. టీ 20 ప్రపంచకప్ గెలవడానికి సెమీ ఫైనల్లో చేరాల్సిన మ్యాచ్లో భారత్ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. సంజూ శామ్ సన్ తుఫాను ఇన్నింగ్స్ తో ప్రత్యర్థి మెగా టోర్నీ నుంచి వైదొలిగింది. నాకౌట్లో ఓటమి లేకుండా ఆడిన భారత్.. సూపర్ 8లో మాత్రం ఒక ఓటమి, రెండు విజయాలతో టీ20 ప్రపంచకప్ సాధించడానికి రెండు అడుగుల దూరంలో నిలిచింది.
AlsO Read: IND vs ZIM: చెపాక్లో భారత్ చేతిలో జింబాబ్వే చిత్తు.. టీ20 ప్రపంచకప్ సెమీస్ ఆశలు సజీవం
జింబాబ్వేను ఓడించి జోరు మీదున్న భారత జట్టు ఎలాగైనా ఓడించాలని కసితో ఆడింది. క్వార్టర్ ఫైనల్స్లాంటి ఈ మ్యాచ్ లో భారత్ అన్నింటా చక్కటి ప్రదర్శన కనబర్చింది. గత మ్యాచ్లో బ్యాటింగ్లో లోపాలన్ని సరిదిద్దుకున్న టీమిండియా టీ20 ప్రపంచకప్లో గత రికార్డులను భయాన్ని తుడిచిపెట్టేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. 196 లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి భారత జట్టు మ్యాచ్ను కైవసం చేసుకుంది.
Also Read: Schools Holiday: విద్యార్థులకు పండగ మీద పండుగ.. మార్చిలో మొత్తం 13 సెలవులు
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లకు విండీస్ 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. తొలి పది ఓవర్లు పొదుపుగా ఆడిన విండీస్ బ్యాటర్లు ఓవర్లు ముగుస్తున్న కొద్దీ భారీగా పరుగులు తీశారు. తొలి ఆరంభం భారత్ పైచేయి సాధించగా.. ద్వితీయార్థం విండీస్ బ్యాటర్లు దుమ్మురేపారు. ఇక పరుగులపరంగా చూస్తే.. కెప్టెన్ షాయ్ హోప్ 32 పరుగులతో పర్వాలేదనిపించగా.. రోస్టన్ చేజ్ చేసిన 40 పరుగులు విండీస్ బ్యాటర్లలో అత్యధిక స్కోర్. షిమ్రోన్ హెట్మెయిర్ 27 పరుగులతో కట్టుదిట్టంగా ఆడుతున్న సమయంలో బుమ్రా వికెట్ తీశాడు. రూథర్ ఫోర్డ్ తక్కువ స్కోర్ (14) చేయగా.. పావెల్ 34, జేసన్ హోల్డర్ 37 పరుగులతో రాణించారు.
భారత ఔలింగ్ మళ్లీ అదుపు తప్పిందని కనిపించింది. ప్రారంభ ఓవర్లు పొదుపుగా వేస్తూ వికెట్లు తీయకపోయినా పరుగులను కూడా నియంత్రించారు. కానీ ఇన్నింగ్స్ ముగిసే సమయానికి చేతులెత్తేయడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. కుదుకున్న బ్యాటర్లను బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి ఔట్ చేశాడు. ఒక ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు.
భళా సంజూ శామ్సన్
టీ20 ప్రపంచకప్ సూపర్ 8 చివరి మ్యాచ్లో సంజూ శామ్సన్ అద్భుతంగా ఆడాడు. ఈ మెగాటోర్నీలో సంజూకు ఇదే భారీ ఇన్నింగ్స్. వరుస వైఫల్యాల తర్వాత విండీస్ మ్యాచ్లో గొప్ప ప్రదర్శన చేశాడు. వన్ డౌన్ వచ్చిన సంజూ శామ్సన్ ఆఖరు వరకు నిలిచి జట్టును గెలిపించాడు. ఈ ప్రదర్శనతో జట్టులో తన స్థానం విలువ ఏమిటో సంజూ చూపించాడు.
విండీస్పై భారత్ ఆధిపత్యం
వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్ల్లో రెండు జట్లు తలపడగా.. విండీస్ మూడుసార్లు గెలుపొందగా.. భారత్ రెండు మ్యాచ్ల్లో గెలిచింది. చివరిసారి 2016 వరల్డ్ కప్ సెమీస్లో తలపడి వెస్టిండీస్ గెలుపొంది ఫైనల్కు చేరగా.. తాజాగా సూపర్ 8లో ఓడిపోయి ఇంటికి వెళ్లగా.. భారత జట్టు సెమీస్లోకి దూసుకెళ్లింది.
Also Read: B Naidu Videos: అశ్లీల వీడియోలు నావి కావు.. అవి ఫేక్ డీప్ వీడియోలు: టీటీడీ చైర్మన్ నాయుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Karimnagar: తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పంచాయతీలను ఏకం చేస్తే తాను ప్రత్యేకంగా నిధులు ఇస్తానని చెప్పిన మాట ప్రకారం బండి సంజయ్ నిధులు ఇచ్చారు. తాను మాట నిలబెట్టుకున్నానని.. ఇక కాంగ్రెస్ను, రేవంత్ రెడ్డిని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులేవి? అని ప్రశ్నించారు. హామీలిచ్చి మోసం చేయడంలో రేవంత్ రెడ్డి రికార్డు సృష్టిస్తున్నాడని ఎద్దేవా చేశారు.
Also Read: Schools Holiday: విద్యార్థులకు పండగ మీద పండుగ.. మార్చిలో మొత్తం 13 సెలవులు
ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల ప్రోత్సహకాన్ని ఇస్తానంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏకగ్రీవమైన పీచుపల్లి, విజయనగర్ కాలనీ గ్రామ పంచాయతీలకు తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సహక నిధులు విడుదల చేశారు. గ్రామస్తుల సమక్షంలో నిధులకు సంబంధించి ప్రతులను సర్పంచ్లకు అందజేశారు.
Also Read: Sharadha Peetham Lands: శారద పీఠం భూముల వివాదంపై తెలంగాణ మంత్రి వివరణ ఇదే!
అనంతరం విజయనగర్ కాలనీ గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక ప్రసంగం చేశారు. భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకొస్తానని ప్రకటించారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని.. వీటితోపాటు ప్రజల కోసం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక నగదు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన 1,203 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.120.30 కోట్లు ఇవ్వాలని కోరారు. పంచాయతీ ఎన్నికలు ముగిసినా రేవంత్ రెడ్డి ఇంతవరకు నయాపైసా ఇయ్యలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
Also Read: TTD: బీఆర్ నాయుడు కాదు కామనాయుడు.. వెంటనే రాజీనామా చేయాలి: టీటీడీ మాజీ చైర్మన్
హామీలిచ్చి మోసం చేయడంలో రేవంత్ రెడ్డి అందరినీ మించిపోయాడని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ప్రోత్సాహక నిధులు ఎందుకు ఇవ్వడం లేదనే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి రేవంత్ రెడ్డి చిల్లీగవ్వ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్లు చేసిన పనులకు బిల్లులివ్వాలని తిరిగి తిరిగి ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు
మాజీ సర్పంచుల బిల్లులతోపాటు గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్రం ఇప్పటి వరకు పంచాయతీల అభివృద్ధి కోసం దశల వారీగా దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులు మంజూరు చేసిందని వెల్లడించా. ఆ నిధులతో కాస్తో కూస్తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
AP SSC Digital Automation 2026: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. పరీక్షల ప్రక్రియలో అత్యంత పారదర్శకతను పెంచేందుకు, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ఈ ఏడాది 'డిజిటల్ ఆటోమేషన్' విధానాన్ని ప్రవేశపెట్టింది.
మార్చి 16, 2026 నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల కోసం విద్యాశాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారుల కేటాయింపులో మానవ ప్రమేయం లేకుండా సాఫ్ట్వేర్ ఆధారిత ఆటోమేషన్ విధానాన్ని అమలు చేస్తోంది.
డిజిటల్ కేటాయింపులు
చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు (DO), ఇన్విజిలేటర్ల నియామకాలను కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా యాదృచ్ఛికంగా చేపట్టింది. ఎంపికైన అధికారుల నియామక ఉత్తర్వులను నేరుగా వారి వ్యక్తిగత ఈ-మెయిల్స్కు పంపారు. ఒకసారి విధులకు ఎంపికైన వారు తప్పనిసరిగా హాజరు కావాలని, అత్యవసరమైతే తప్ప ఎవరికీ మినహాయింపు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆటోమేషన్ విధానం వల్ల కొందరు ఉపాధ్యాయులకు 100 కిలోమీటర్ల దూరంలో కూడా విధులు పడ్డాయి. ఉదాహరణకు పొదిలి ఉపాధ్యాయులకు గిద్దలూరులో విధులు కేటాయించడంతో సర్దుబాటు కోసం వారు డీఈవో (DEO) కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
వీరికి మినహాయింపు..
మానవీయ కోణంలో పరీక్షల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో విద్యాశాఖ కింది వారికి విధుల నుండి మినహాయింపు ఇచ్చింది. కుటుంబ, వ్యక్తిగత కారణాలు.. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు.. పదో తరగతి పరీక్ష రాస్తున్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు (ఉపాధ్యాయులు).. గతంలో మాల్ప్రాక్టీస్కు పాల్పడిన వారు లేదా క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారు.. ప్రైవేట్ ట్యూషన్లు చెబుతున్న వారికి మినహాయింపులు ఇచ్చారు.
ఆరోగ్య కారణాలు..
వీటితో పాటు క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడి, మేజర్ న్యూరోసర్జరీ చేయించుకున్న వారు.. టీబీ (TB), వెన్నెముక సమస్యలు.. 70-90 శాతం వినికిడి లోపం.. 75 శాతం వైకల్యం ఉన్న పిల్లలు లేదా మానసిక వైకల్యం ఉన్న స్పౌజ్ (భార్య/భర్త) కలిగిన వారికి కూడా ఈ డ్యూటీ నుంచి మినహాయింపుని ఇచ్చారు. ఇక్కడ పేర్కొన్న మినహాయింపు పరిధిలోకి వచ్చేవారు పొరపాటున విధులకు ఎంపికైతే, తగిన వైద్య ధృవీకరణ పత్రాలతో డీఈవోను కలిసి మినహాయింపు పొందవచ్చు.
పేపర్ లీకేజీలకు కళ్లెం పడుతుందా?
డిజిటల్ ఆటోమేషన్ వల్ల ఏ అధికారి ఏ సెంటర్కు వెళ్తారో చివరి నిమిషం వరకు తెలియదు. దీనివల్ల స్థానిక ప్రభావం తగ్గి, పారదర్శకత పెరుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది. అలాగే అత్యవసర పరిస్థితుల కోసం ప్రతి మండలానికి ఇద్దరు అధికారులను రిజర్వ్లో ఉంచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sharadha Peetham Lands Issue: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శారదా పీఠానికి ఇచ్చిన భూములను మరో శాఖకు అప్పగించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర దుమారానికి తెరలేపింది. ఈ విషయం రాజకీయంగా వివాదాస్పదమవడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. శారదా పీఠం భూముల అంశంపై ప్రభుత్వం వెనక్కి తిరిగి పాత నిర్ణయమే అమలవుతుందని ప్రకటించింది. ఇంతలా వివాదాస్పదం కావడానికి గల కారణాలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. సమాచార లోపంతోనే శారదా పీఠం భూములపై గందరగోళం తలెత్తిందని వివరణ ఇచ్చారు.
Also Read: TTD: బీఆర్ నాయుడు కాదు కామనాయుడు.. వెంటనే రాజీనామా చేయాలి: టీటీడీ మాజీ చైర్మన్
'పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకునేందుకు మాకెలాంటి భేషజాలు లేవు. మతాన్ని అడ్డు పెట్టుకొని మాపై ప్రతిపక్షాల దుష్ప్రచారం. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అండగా ప్రభుత్వం ఉంటుంది' అని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ శివారు కోకాపేట్లోని నియో పోలీస్ ప్రాంతంలో జరుగుతున్న శారదా పీఠం నిర్మాణాలను పరిశీలించారు. శారదా పీఠాన్ని సందర్శించి అక్కడి రాజ శ్యామల అమ్మవారి ఆలయం, ఇతర నిర్మాణాలను చూశారు. అనంతరం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామీజీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భూమి లాక్కుంటామని ప్రకటించిన అధికారుల తరఫున మంత్రి శ్రీధర్ బాబు శారద పీఠం నిర్వాహకులతో మాట్లాడారు.
Also Read: B Naidu Videos: అశ్లీల వీడియోలు నావి కావు.. అవి ఫేక్ డీప్ వీడియోలు: టీటీడీ చైర్మన్ నాయుడు
కోకాపేట్లోని శారదా పీఠం భూముల వ్యవహారంలో సమాచార లోపంతోనే గందరగోళం తలెత్తిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఆ భూములు పీఠానికే చెందుతాయని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. పీఠం అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని, తప్పులు దొర్లితే ఎప్పటికప్పుడు సరిదిద్దుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
అసలు విషయం తెలిసిన వెంటనే శారదా పీఠం భూముల విషయంలో జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దుకున్నామని శ్రీధర్ బాబు వివరించారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మతాన్ని అడ్డు పెట్టుకొని కొందరు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాది బుల్డోజర్ సంస్కృతి కాదని... కబ్జాకోరుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడటం చూసి ఓర్వలేకే కొందరు తమపై కావాలనే బురద చల్లుతున్నారని విమర్శించారు. బాపుఘాట్ అభివృద్ధి విషయంలో ప్రజాభీష్టం మేరకే ముందుకెళ్తామని.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
BR Naidu Resignation: 'టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మహా ఘోరాతిఘోరం చేశారు. 94 సంవత్సరాల పాలకమండళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అనైతిక చర్యలకు బీఆర్ నాయుడు పాల్పడ్డారు. అలాంటి వ్యక్తిని టీటీడీకి చైర్మన్గా నియమించారు. ఆయన కామక్రీడలు సోషల్ మీడియాలో ప్రపంచమంతా తెలిసిపోయింది. ఆ వీడియోలు చూసి హిందూ భక్తులు మండి పడుతున్నారు' అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. 'వెంకటేశ్వర స్వామి పూజలు చేశాకే దినచర్య ప్రారంభిస్తానన్న చంద్రబాబు నియమించిన వ్యక్తి అనైతిక వీడియోలు వచ్చాయి. ప్రపంచమంతటా ఉన్న హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయి' అని చెప్పారు.
Also Read: B Naidu Videos: అశ్లీల వీడియోలు నావి కావు.. అవి ఫేక్ డీప్ వీడియోలు: టీటీడీ చైర్మన్ నాయుడు
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అశ్లీల వీడియోలు బయటకు రావడంతో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. 'వాత్సాయనుడికి వారసుడుగా బీఆర్ నాయుడు తయారయ్యారు. ఆయన బీఆర్ నాయుడు కాదు కామనాయుడుగా మారాడు. ఆ వీడియోలు ఏఐ అని బీఆర్ నాయుడు చెప్తున్నమాట అబద్దం. నేను కొందరు ఏఐ నిపుణులతో మాట్లాడా. ఆ వీడియోలు కరెక్టేనని చెప్పారు. బీఆర్ నాయుడుకి సిగ్గు ఉంటే మౌనంగా రాజీనామా చేసి పక్కకు వెళ్లాలి' అని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సవల్ చేశారు. అలా చేయకపోగా తన వర్గపు మీడియా ద్వారా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
Also Read: Gold Fruad: మేడమ్ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు
'తివారి ఫొటోలు బయటకు వస్తే రాజీనామా చేసి వెళ్లారు. ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ గురించి ఆడియో బయటకు రాగానే జగన్ అతడితో రాజీనామా చేయించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా బీఆర్ నాయుడితో రాజీనామా చేయించాలి' అని భూమన కరుణాకరరెడ్డి కోరారు. 'సిర్రిఅప్పన్ అనే అర్చకుడు అనైతిక కార్యకలాపాలు చేస్తే వధించారు. ఆ శాశనం తిరుమలలో ఉంది. అలాంటి ఆలయానికి ఛైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడి వీడియోలు బయటకు వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?' అని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు.
'వైఎస్ జగన్ కుటుంబసభ్యులను దూషించినందుకు ఆ స్వామే బీఆర్ నాయుడుకి శిక్ష విధించింది. ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగించకపోగా వైఎస్సార్ సీపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్టులకు పురిగొల్పటం సిగ్గుచేటు. ఇవేకాదు ఇంకా చాలా వీడియోలు బయటకు వస్తాయి' అని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. 'డీప్ ఫేక్ వీడియోలు అంటూ తప్పించుకోవాలనుకుంటే కుదరదు. పోలీసులకు కూడా అనైతిక బురదను అంటించే ప్రయత్నం చేస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టీటీడీ ఛైర్మన్ ఆఫీసులో కూడా ఇలాంటి కామ క్రీడలు చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది' అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సంచలన ఆరోపణ చేశారు.
ఇప్పటికైనా బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. లడ్డూ కల్తీ అయ్యాయని గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతారు? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు అనైతిక చర్యలను సమర్ధిస్తారా? అని నిలదీశారు. లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాపం ఊరికే పోదని పేర్కొన్నారు. 'బీఆర్ నాయుడు హిందూధర్మం అనే ఛానల్ కూడా నడుపుతున్నారు. వీఐపీలకు దేవుడి దర్శనం చేయించి వారితో తమ ఖాతాలో డబ్బులు వేయించుకుంటున్నారనే అనుమానం కలుగుతోంది' అని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
TTD Chairman Videos With Women: 'నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఏఐ సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించేలా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం' అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని.. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై నేను చట్ట ప్రకారం ముందుకెళ్తానని ప్రకటించారు.
Also Read: Free Bus Scheme: ఫ్రీ బస్సుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఉత్తర్వులు జారీ!
అనూహ్యంగా తెరపైకి వచ్చిన అతడి రాసలీలల వీడియోలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశా. నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదు' అని హెచ్చరించారు. 'పని పాట లేకుండా పరంబోకుల వ్యవహరించారు. హిందూ ధర్మం చానల్కి డబ్బులు మళ్లించానని నా మీద ఆరోపణలు. అన్ని రికార్డులు పెడతాం. మొత్తం మార్ఫింగ్ కాదు కొన్ని దగ్గర మార్ఫింగ్ చేశారు' అని బీఆర్ నాయుడు తెలిపారు.
'వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ ఘోరాతి ఘోరంగా నా మీద దాడి చేస్తున్నారు. మొదటి రోజు నుంచే నన్ను రాజీనామా చేయి అని కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎందుకంటే టీటీడీ చైర్మన్గా ఉన్నన్ని రోజులు కుంభకోణాలు చేశాడు. అవి ఎక్కడ బయట పెడతానో అని ఇలా మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నాడు' అని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆరోపించారు. కరుణాకర్ చేసిన అవినీతిని తాను బయట పెడతానిని భయపడుతూ నన్ను రాజీనామా చేయాలని ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. 'ఐదు సంవత్సరాలుగా వేల టికెట్స్ అమ్ముకున్నారు ప్రూఫ్ ఉంది. నేను భయపడేవాడిని కాదు గుర్తుపెట్టుకో' అని భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.
'టీటీడీ హిందూ ధర్మం కించపరచడం ఇష్టం లేక చంద్రబాబు చెప్పడంతో నిశ్శబ్దంగా ఉన్నా. కొన్ని వందల కుంభకోణాలు ఉన్నాయి. అన్ని రికార్డ్స్ ఉన్నాయి' అని బీఆర్ నాయుడు తెలిపారు. ఫేక్ డీప్ వీడియోలు ఎలా పెడతారు? అని మండిపడ్డారు. 'రాజకీయంగా ఇరు కుటుంబాలు 30 సంవత్సరాలుగా ఉన్నాం. మరి ఎలా చేస్తారు? అని నిలదీశారు. వైఎస్ జరరిఐలతైతౌఐతైఐతైటగన్ను ప్రశ్నించా. సతీసమేతంగా తిరుమలకు రారని ప్రశ్నించాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలానే చేశారు. అందుకే నామీద ఎలాంటి నీచపు పని చేస్తున్నారు' అని బీఆర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఈ విషయంపై మా కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఇవ్వాలి. వీళ్లకి ఏమి మా మీద పడి ఏడుస్తున్నారు. వీళ్లకి ఏమి పని లేదా? కరుణాకర్ రెడ్డి మద్రాస్లో ఏం చేశావో అన్నీ నాకు తెలుసు. నిన్ను, వైవీ సుబ్బారెడ్డిని వదలను' అని బీఆర్ నాయుడు హెచ్చరించారు. టీటీడీలో అన్ని అక్రమాలు చేశారు బయట పెడతా. వారికి మంచిది కాదని హితవు పలికారు.
'రేపు వన్ మ్యాన్ కమిటీ వస్తుండడంతో డైవర్ట్ పొలిటికల్ ట్రిక్స్ ఇవన్నీ. మార్ఫింగ్ వీడియోలు చేసి నన్ను భయపెట్టడం అనేది నా దగ్గర పని చేయవు' అని బీఆర్ నాయుడు తెలిపారు. కొత్తగా కరుణాకర్ రెడ్డి, వైఎస్ జగన్ మీద ఆరోపణలు చేయాల్సిన పనిలేదు. అందరికి తెలుసు రూ.లక్షల కోట్లు అవినీతి చేశారు. నాకు ఎన్నో అవకాశాలు ఉన్న టీటీడీలో సేవలు అందించాలని వచ్చా' అని బీఆర్ నాయుడు తెలిపారు. భగవద్గీత ప్రింట్లలో 50 కోట్లు అవినీతి చేసి వాటిని ఎవరికి ఇవ్వకుండా లక్ష యాభై వేలు కాపీలు గోడౌన్లో పెట్టేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి' అని బీఆర్ నాయుడు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Karachi Protest America Consulate: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం, ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల ప్రభావం పొరుగు దేశమైన పాకిస్థాన్పై తీవ్రంగా పడింది. ప్రస్తుతం పాక్ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రధాన నగరాలన్నీ యుద్ధ భూమిని తలపిస్తున్నాయి.
ఇరాన్ పాలకుడు ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్త పాకిస్థాన్లోని షియా సామాజిక వర్గంతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఆగ్రహాన్ని నింపింది. రాజధాని ఇస్లామాబాద్తో పాటు కరాచీ, లాహోర్, రావల్పిండి వంటి నగరాల్లో నిరసనకారులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. ఈ ఘటనలో 20 మందికి పైగా మరణించినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. అందులో పాకిస్తానీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
కరాచీలో ఉద్రిక్తత, కాన్సులేట్ ధ్వంసం
అందరికంటే ఎక్కువగా కరాచీలో నిరసనల తీవ్రత పెచ్చుమీరింది. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు కరాచీలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేశారు. భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోపలికి ప్రవేశించిన ఆందోళనకారులు కార్యాలయం అద్దాలను పగలగొట్టి, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. కార్యాలయంలోని కొన్ని భాగాలకు నిప్పు పెట్టడంతో దట్టమైన పొగ అలుముకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఈ హత్యకు ప్రధాన కారకుడిగా భావిస్తూ, ఆయన దిష్టిబొమ్మలను నిరసనకారులు తగులబెట్టారు. కేవలం పాకిస్థాన్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఈ వేడి కనిపిస్తోంది. ఇరాక్ బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల వేలాది మంది ప్రజలు చేరి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యప్రాచ్యంలో అస్థిరతకు అమెరికానే కారణమని వారు ఆరోపించారు.
మరోవైపు భారతదేశంలోని కాశ్మీర్లో రాంబన్ ప్రాంతంలో షియా ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఖమేనీ మరణం తమ వర్గానికి తీరని లోటని, అమెరికా-ఇజ్రాయెల్ కుట్రపూరితంగా ఈ హత్యకు పాల్పడ్డాయని షియా నాయకుడు సయ్యద్ సమర్ కాజ్మీ మండిపడ్డారు.
పాకిస్థాన్లోని పలు నగరాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ఈ సైనిక ఘర్షణలు సాధారణ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.
ఖమేనీ మరణానంతరం చెలరేగిన ఈ హింస ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఆందోళనలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రజల్లో ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Burj Khalifa Drone Attack News: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక భయానక వీడియో ప్రపంచాన్ని వణికిస్తోంది. దుబాయ్లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫా లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు దాడికి దిగాయంటూ సాగుతున్న ఈ ప్రచారం జరుగుతోంది.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల అనంతరం, ఇరాన్ తన ప్రతీకారాన్ని పది దేశాలపై క్షిపణుల రూపంలో ప్రదర్శించింది. ఈ క్రమంలోనే దుబాయ్లోని ఐకానిక్ టవర్ బుర్జ్ ఖలీఫా సమీపంలో డ్రోన్లు సంచరించినట్లు వార్తలు వస్తున్నాయి.
వైరల్ వీడియోలో ఏముంది?
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. బుర్జ్ ఖలీఫా భవనానికి అత్యంత సమీపంలో ఒక డ్రోన్ వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. భవనం పరిసరాల్లో నల్లటి పొగ దట్టంగా అలుముకున్నట్లు వీడియోలో చిత్రీకరించారు. డ్రోన్ బుర్జ్ ఖలీఫాను ఢీకొట్టిందని, తద్వారా భారీ నష్టం సంభవించిందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో వైరల్ అయినప్పటికీ, దుబాయ్ ప్రభుత్వం లేదా ఐక్య అరబ్ ఎమిరేట్స్ (UAE) భద్రతా దళాలు బుర్జ్ ఖలీఫాపై దాడి జరిగినట్లు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇరాన్ ప్రయోగించిన కొన్ని డ్రోన్లు దుబాయ్ గగనతలంలోకి ప్రవేశించిన మాట వాస్తవమే అయినప్పటికీ, అవి బుర్జ్ ఖలీఫాను ఢీకొట్టాయనే వార్తలకు ఇంకా సరైన ఆధారాలు లేవు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే దుబాయ్లోని పలు కీలక ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు.
ఒకవేళ దాడి జరిగితే?
ఒకవేళ ఇలాంటి దాడులు జరిగితే సంభవించే ఆర్థిక నష్టం ఊహాతీతం. 828 మీటర్ల ఎత్తుతో దుబాయ్ గర్వకారణంగా ఉన్న ఈ భవనం విలువ సుమారు 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12,500 కోట్లు). ఈ భవనాన్ని డెవలపర్ 'ఎమ్మార్ ప్రాపర్టీస్' దాదాపు 1.5 బిలియన్ డాలర్లకు బీమా చేయించింది. ఏదైనా విపత్తు సంభవించినా లేదా దాడి జరిగినా ఈ ఇన్సూరెన్స్ రక్షణ కవచంలా నిలుస్తుంది.
దుబాయ్ అప్రమత్తం
ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా యూఏఈ వైమానిక దళం హై అలర్ట్లో ఉంది. పౌరులెవరూ భయాందోళనలకు గురికావద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం కోరుతోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ సమయంలో ఇలాంటి సున్నితమైన కట్టడాల రక్షణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
