జిల్లా మణికొండ పట్టణంలో పెద్ద పాము కనిపించింది
Manikonda, Telangana:రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీ రోడ్ నెం.4లో 12 అడుగుల పొడవున్న పాము కనిపించింది. 12 అడుగుల పామును చూసిన ప్రజలు వెంటనే భయాందోళనకు గురై పాము పట్టేవారికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేహ 12 అడుగుల పామును చాకచక్యంగా పట్టుకుంది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
YS Sharmila: అన్న వైఎస్ జగన్ వైఎస్ షర్మిల ఆగ్రహం.. వైఎస్సార్ ఆశయాలకు వారసుడు కాదు
Vijayawada, Andhra Pradesh:YS Jagan MAVIGUN: మావిగన్ అంటూ రాజధానిపై కొత్త ప్రతిపాదన తీసుకువచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు మావిగన్ జోకర్ అని ప్రకటించారు. 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారని మండిపడ్డారు. వారసులం అని చెప్పుకునే జగన్ వైఎస్సార్ పేరును వాడుకున్నారు తప్పిస్తే.. ఆయన ఆశయాలకు వారసులు కాలేదని ప్రకటించారు.
Also Read: YSR Death Reason: తండ్రి వైఎస్సార్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం: అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు
వైఎస్సార్ చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు నేటికి 23 ఏళ్లు పూర్తవడంతో వైఎస్ షర్మిల 'ఎక్స్' వేదికగా స్పందించారు. 'వైఎస్సార్సీపీలో నిజంగా వైఎస్సార్ ఐడియాలజీ ఉంటే జగన్ సీఎం అయ్యి కూడా వైఎస్సార్ జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా ఎందుకు మారారు? దళితులపై, క్రిస్టియన్లపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఎందుకున్నారు? అని వైఎస్ షర్మిలా రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ ఐడియాలజీ కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రకటించారు.
Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
'ఏప్రిల్ 9, 2003లో తెలంగాణలోని చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాక ప్రజాహితమే పరమావధిగా సాగిన 1,457 కిలోమీటర్ల పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ అధికారంలో తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకం. కాంగ్రెస్ నాయకుడు, నాన్న వైఎస్సార్ ప్రజాప్రస్థానం తెలుగు ప్రజల గుండెల్లో ఈరోజుకు పదిలం' అని వైఎస్ షర్మిల తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆనాటి పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనం.. 23 ఏళ్లుగా సంక్షేమానికి మహానేత పెట్టిన చెక్కుచెదరని సంతకం అని కొనియాడారు. ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పించిన అభయహస్తం.. రాష్ట్ర దుర్భర పరిస్థితులను అంతమొందించిన స్వర్ణయుగం అని తన తండ్రి పాలనపై వైఎస్ షర్మిల ప్రశంసలు కురిపించారు.
Also Read: Nayanthara: తిరుమలలో హీరోయిన్ నయనతారపై ఎగబడ్డ అభిమానులు
'వారసులం అని చెప్పుకునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ పేరును వాడుకున్నారు తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసులు కాలేదు. మాట తప్పం మడమ తిప్పం అనే వైఎస్సార్ లైన్ వాడుకోవడం తప్పిస్తే పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి.. కల్తీ మద్యం అమ్మి ఓన్లీ క్యాష్ మాఫియా ఎందుకు చేశారు?' అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 'వైఎస్సార్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా ఎలా మారారు? ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే మౌనంగా ఎందుకున్నారు? దేశ వ్యాప్తంగా క్రిస్టియన్ మైనారిటీలపై ఆర్ఎస్ఎస్ వాదులు దాడులు చేస్తుంటే వైఎస్సార్ వారసుడిగా జగన్ ఎందుకు ఖండించలేదు?' అని నిలదీశారు.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
సంక్షేమానికి సారథి వైఎస్సార్. ఆయన ప్రతీ పథకం ప్రజల కష్టం కన్నీళ్ల నుంచి పుట్టిందే. ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ పక్కా ఇండ్లు, పావుల వడ్డీకే రుణాలు, 108/104 అంబులెన్స్ సేవలు ఇలా ప్రతీది ఒక చరిత్ర' అని వైఎస్ షర్మిల వెల్లడించారు. వైఎస్సార్ ఐడియాలజీ బతికి ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే.. ఆయన ఆశయాలు మళ్లీ కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Free House: వార్నీ.. ఇల్లు ఫ్రీ, ఉద్యోగం కూడా ఇస్తారట! యూరప్లో ఉన్న ఆ ఊరికి వెళ్తారా? ఓ కండిషన్ ఉందోయ్!
Hyderabad, Telangana:Free House And Job In Spain Village: ఎంతో మంది కలల దేశం యూరప్లో ఉచిత ఉద్యోగం, ఉండటానికి ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది? ఉదయం లేవగానే చుట్టూ కొండలు, ట్రాఫిక్, ఎలాంటి శబ్దం లేకుండా ఉండే వాతావరణం ఎవరికి ఇష్టం ఉండదు? స్పెయిన్లోని అరెనిల్లా అనే గ్రామం ఆ ఊళ్లో ఉంటే ఇల్లు, జాబ్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇది కేవలం ఫ్రీ హాలిడే కాదు.. సీరియస్ డీల్. రీయల్గా మీరు ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం పొందుతారు. కానీ, దీనికి ఒక కండీషన్ ఉంది.
అరెనిల్లాస్ ఉచితంగా ఇల్లు, జాబ్కు కండీషన్స్ ఏంటంటే?
అరెనిల్లాస్ స్పెయిన్లోని అత్యంత జనాభాల ఉండే సోరియా ప్రాంతానికి దూరంగా ఉన్న మారుమూల గ్రామం. దాదాపు అక్కడ ఓ 40 నివాసాలు ఉంటాయి. ఈ గ్రామానికి ఇంకో పేరు 'Empty Spain'. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే ఉండే ప్రజలు కనుమరుగైపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికే లోకల్ కౌన్సిల్ ఈ ఆఫర్ చేస్తోంది.
ఈ ఆఫర్ కేవలం ఫ్యామిలీస్కు మాత్రమే
అయితే, వారికి స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా ఉండాలి
వారు శాశ్వతంగా అక్కడే నివాసం ఉండాలి
అక్కడ ఓ విలేజ్ బార్ కూడా తప్పకుండా నడపాలి
స్థానిక మున్సిపల్లో కూడా వారు పనిచేయాలి అని కండీషన్స్ పెడుతోంది.
ప్రధానంగా 40 మందే ఉండటంతో ఆ ఊరి జనాభా పెంచడానికి ఈ ఉచిత ఇల్లు, జాబ్ ఆఫర్ అందిస్తోంది. అయితే, ఈ ప్రకటన చేసిన వెంటనే దాదాపు 100 దరఖాస్తులు కూడా ఇప్పటికే వచ్చాయట. ఈ ఇల్లు రినోవేట్ చేసిన ఏడు ఇళ్లలో ఒకటి కేటాయిస్తారు. మిగతా ఇల్లు ఒక్కోక్కటి నెలకు 100 యూరోలు. బాధ్యత ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉచితంగా అందిస్తున్నారు.
Also Read: ఇరాన్కు డొనల్డ్ ట్రంప్ చివరి హెచ్చరిక.. ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో..?
అరెనిల్లాస్ ఎందుకు ప్రత్యేకం..?
2026 ప్రారంభంలోనే ఈ ఆఫర్ ప్రకటించారు. దీంతో కేవలం వారంలోనే 100 అప్లికేషన్స్ కూడా వచ్చాయి. ఎందుకుంటే యూరప్లో ఫ్రీ ఇల్లు అంటే అది కలే.. దీనికి తోడు జాబ్ కూడా లభిస్తుంది. అది కూడా లైఫ్టైమ్ ఆఫర్.
అయితే ఇక్కడ సులభంగా బతకవచ్చు. ఇది కొండ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు కూడా కాస్త వెచ్చగానే ఉంటుంది. ఏప్రిల్ నెలలో 24 డిగ్రీలు నమోదు అవుతాయి.
అయితే, ఇక్కడ ఉన్న మరో కండీషన్ ఏంటంటే తాత్కాలికంగా కాదు.. ఇక్కడ శాశ్వతంగా నివాసం ఉండాల్సిందే.
ఇవి మర్చిపోకండి..
ఇది కల కాదు.. ఒకసారి నిజంగా ఆలోచించండి. శాశ్వతంగా అక్కడే మీరు ఉండిపోలరా? అని గుర్తుంచుకోండి. అరెనిల్లా ఊళ్లో జీవనం ఏకాంతంగా చాలా బాగుంటుంది. చలికాలంలో కాస్త ఇబ్బంది తప్పదు. అంతేకాదు ఈ ఊరికి రవాణా కూడా అంతంత మాత్రమే. కచ్చితంగా సొంత వాహనం ఉండాల్సిందే. ఇక్కడ స్కూళ్లు కూడా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రతిరోజూ ఉచితంగా రవాణా కూడా ఉంటుంది. కేవలం ప్రాథమికస్థాయిలో మాత్రమే ఆరోగ్య సేవలు లభిస్తాయి. అత్యవసర సీరియస్ సమయంలో టౌన్కు వెళ్లాల్సిందే. ఇక్కడ ఉద్యోగాలు కూడా అంత ఈజీగా దొరకవు.
ఇక్కడ మీరు విలేజ్ బార్ నడిపించినా అవి పెద్దగా లాభాలు ఇవ్వవు. సామాజిక బంధాలను సజీవంగా ఉంచడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. మున్సిపల్ వర్క్, ఇటుకలు పేర్చే పని కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి శారీరక శ్రమ ఎక్కువ. ఆ గ్రామంలో ప్రస్తుతం చాలా ఇల్లు రెనోవెట్ చేస్తున్నారు. కాబట్టి ఈ పని ఎంతో ముఖ్యం. మీరు గుర్తుంచుకోవాల్సిన మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్లు మీకు ఉచితంగా వీసా ఏమీ ఇవ్వరు. మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పటికే స్పెయిన్ వీసా ఉంటేనే అక్కడ ఉండగలరు.. పనిచేయగలరు.
అరెనిల్లాస్ ఎందుకు ఈ ఆఫర్ చేస్తోంది?
అరెనిల్లాస్ గ్రామం ఈ ఆఫర్ వెనుక పెద్ద కథ ఉంది. 1950 నుంచి ఇక్కడి ప్రజలు స్పెయిన్లోని వివిధ సిటీలోకి వలస వెళ్లిపోతున్నారు. గ్రామంలో కేవలం వయస్సు మళ్లిన వృద్ధులు మాత్రమే ఉంటున్నారు. మరికొన్ని ఇళ్లు అయితే, ఖాళీగానే మిగిలిపోయాయి. ఒక్కో సీజన్లో అయితే, ఈ అరెనల్లాస్ గ్రామంలో 300 మంది జనాభా ఏవైనా పండుగలు ఉన్నప్పుడు కనిపిస్తారు. కానీ, ఏడాదిలో ఎక్కువ రోజులు ఈ ఊరంతా ఖాళీగానే కనిపిస్తుంది. కొత్తగా ఎవరైనా ఇక్కడ ఉందామని వచ్చిన ఈ సమస్యలు చూపి వెళ్లిపోతున్నారు.
మీరు దరఖాస్తు చేసుకుంటారా?
మీకు కూడా సైలెంట్, ప్రకృతికి దగ్గరగా, కాంక్రీట్ జంగిల్కు దూరంగా ఉండాలంటే ఇవేం పెద్ద సమస్యలు కావు. కొంతమంది గ్రామంలో ఉండటం అంటే ఇష్టం వారికి బెస్ట్ ఛాన్స్. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కేఫ్స్ అందుబాటులో ఉండవు. సాధారణ యూరోపియన్ లైఫ్స్టైల్ ఇక్కడ కష్టం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
YSR Death Reason: తండ్రి వైఎస్సార్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం: అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు
Amaravathi, Andhra Pradesh:Amaravati: '2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యే నాటికి ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే. తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ డబ్బులు సంపాదించారనే విషయం కూడా అందరికీ తెలుసు. తండ్రిని కూడా జగన్ మోహన్ రెడ్డిని మానసిక క్షోభకు గురి చేశాడు. రాష్ట్రంలో జగన్ ఉంటే తనకు రాష్ట్రానికి నష్టమని నాడు వైఎస్సార్ ఆయన్ను బెంగళూరుకు పంపారు. ఈ విషయం రోశయ్యే చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు గన్నారు.. వైఎస్ ఉంటే తాను సీఎం కాలేరు. 2009లో వైఎస్సార్ తిరిగి సీఎంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తే హెలికాప్టర్ మిస్ అయింది.. అందరూ ఆందోళనలో ఉన్నారు' అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
నిన్న వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశారు. 'వైఎస్సార్ చనిపోయిన సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? వైఎస్సార్ చనిపోయిన రోజునే పోలవరం టెండర్లను ఆన్లైన్లోకి ఎక్కించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా వైఎస్ మరణం నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్ మరణం మీద చాలా మంది నాడే అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని ప్రస్తుతం వైసీపీలో ముఖ్యనేతగా ఉన్న బొత్స కామెంట్ చేశారు. ఆ రోజు మేం నమ్మలేదు.. సభ్య సమాజంలో ఇలా ఎందుకు చేస్తారని అనుకున్నాం. కానీ సైకోకు పదవీ వ్యామోహం ఉంటే తండ్రిని, తల్లిని, చెల్లిని, బాబాయినైనా వదలరని ఇప్పుడు జగన్ ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతోంది' అని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ మరణానికి రిలయెన్స్ సంస్థలే కారణమంటూ ఆ సంస్థల మీద జగన్ దాడులు చేయించారు.. తిరిగి వాళ్లకే రాజ్యసభ కట్టబెట్టారని గుర్తుచేశారు.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
'2014లో తండ్రి మరణం నుంచి సింపతీ పొంది.. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించాడు. 2019లో అధికారం కోసం సొంత బాబాయిని చంపారు. అధికారం దక్కించుకున్నారు. వివేకాను ఎవరు చెప్పారంటే రాష్ట్రంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారు. ఇప్పుడు తల్లి, చెల్లి కూడా జగన్ అసలు నైజం గురించి చెబుతున్నారు. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని తల్లి అడిగితే తల్లిని కూడా బయటకు పంపిన నైజం జగన్ మోహన్ రెడ్డిది. రోశయ్య చెప్పినా.. బొత్స చెప్పినా.. మాకు అనుమానాలున్నా మేం నిజం కాదేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవన్నీ నిజమేనని అనిపిస్తోంది' అని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్ జగన్
'సైకోకు పదవీ వ్యామోహం వస్తే ఎలా ఉంటారో జగన్ మోహన్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రం ఎలా ఉన్నా... కుటుంబం ఎలా ఉన్నా? సమాజం ఎలా ఉన్నా జగన్కు పర్వాలేదు.. అతనికి పదవే ముఖ్యం. నిలకడలేని వ్యక్తిత్వం ఉన్నవాళ్లని సైకో అంటారు. సీఎం పదవి కోసం కాంగ్రెస్ మీద దాడి చేశారు. బెయిల్ కోసం సోనియా కాళ్ల మీద పడ్డారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతికి అంగీకారం తెలిపారు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని పక్కన పడేసి మూడు రాజధానులని చెప్పారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య తగువు పెట్టడం జగన్ నైజం' అని వైఎస్ జగన్పై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద జగన్ మోహన్ రెడ్డికి ఎందుకింత కక్ష? రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరిగేలా పరిపాలన సాగిస్తున్నాం. పరిశ్రమలు తెస్తున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడుతున్నాం. సీమకు నీళ్లు ఇస్తున్నాం. ఇంత మంచి జరుగుతుంటే రాష్ట్రం మీద జగన్ కక్ష పెట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నాడు' అని మాజీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Video: కొండను మించిన పొడవు.. ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. వీడియో!
Hyderabad, Telangana:World's Longest King Cobra Viral Video: పకృతిలో ఎన్నో వింతలతో పాటు విశేషాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అడవిలో జంతువులకు సంబంధించిన వీడియోలతో పాటు కొన్ని పాముల వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాల్లో కనిపిస్తూ ఉంటాయి. తాజాగా కూడా ఓ పాముకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో అడవి మార్గంలో కొండ రాళ్ల మధ్య సంచరిస్తున్న ఒక భారీ కింగ్ కోబ్రాను వీడియో చూడొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
సాధారణంగా పాము కనిపిస్తేనే.. ఆమడ దూరం పారిపోయే జనం.. ఇంత పెద్ద పామును చూసి అక్కడే ఉంటూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు.. ఈ వీడియోలో కనిపిస్తున్న కింగ్ కోబ్రా సుమారు 15 నుంచి 25 అడుగుల పొడవు ఉండవచ్చని అంచనా.. కొండ రాళ్ల గుండా నెమ్మదిగా పాకుతూ వస్తున్న ఈ భారీ పాము, ఒక సందర్భంలో పడగను పైకి విప్పి చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తున్న తీరు చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. దాని శరీరంపై ఉన్న చారలతో పాటు, మెరిసే నలుపు రంగు అది ఎంతటి శక్తివంతమైనదో ఎంతో సులభంగా తెలియజేస్తోంది.
జీ ఫాక్ట్ అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ వస్తెన్నారు. చాలా మంది బాబోయ్.. ఇది పామా లేక కొండచిలువనా? అని అంటుంటే, ఇంత పెద్ద కోబ్రాను ఎప్పుడూ చూడలేదని మరికొందరు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో ఇలాంటి అరుదైన సర్పాలు సంచరించడం సహజమే అయినప్పటికీ.. ఇంత భారీ పరిమాణంలో ఉండటం మాత్రం విశేషమని వన్యప్రాణి నిపుణులు సైతం చెబుతున్నారు.
Also Read: Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!
ఈ వీడియోలో కనిపిస్తున్న కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన, పొడవైన సర్ప జాతికి చెందినదని కొంతమంది స్నేక్ క్యాచర్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇవి ప్రధానంగా ఆగ్నేయాసియాతో పాటు భారతదేశంలోని దట్టమైన అడవులలో జీవిస్తూ ఉంటాయి.. ఇతర పాములను ఆహారంగా తీసుకోవడంతో పాటు నదుల్లోని నీటిని తాగడం వీటి ప్రత్యేకత.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఏ ప్రాంతానికి సంబంధించిందో తెలిదు.. కానీ కొండలతో పాటు అటవీ నేపథ్యం చూస్తుంటే ఇది భారతదేశంలోని ఏదో ఒక ప్రదేశంలో జరిగి ఉండొచ్చని సమాచారం.
Also Read: Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nayanthara: తిరుమలలో హీరోయిన్ నయనతారపై ఎగబడ్డ అభిమానులు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Temple VVIPs Darshan: తిరుమలలో సాధారణ భక్తులు పోటెత్తుతుండగా.. వీవీఐపీల తాకిడి కూడా పెరుగుతోంది. రోజువారిగా దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుండగా.. అదే స్థాయిలో ప్రముఖులు ఆలయాన్ని సందర్శించడానికి వస్తున్నారు. గురువారం తిరుమలలో సినీ సందడి నెలకొంది. దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఎంపీ అప్పలనాయుడు కలిశెట్టి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సినీ నటుడు సప్తగిరి, ఆంధ్రప్రదేశ్ పేపర్ లీడ్స్ కమిటీ చైర్మన్ రవీంద్ర బాబు తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో నయనతార దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చున్నారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి పట్టు వస్త్రం తో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. నయనతార దంపతులు వచ్చారని తెలియడంతో భక్తులు, వారి అభిమానులు అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన నటిని దగ్గర నుంచి చూసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. నయనతార దంపతులు తరచుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. పెళ్లయినప్పటి నుంచి ప్రతి ముఖ్య సందర్భంలోనూ ఈ జంట తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతున్నారు.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు కలిశెట్టి, తెలంగాణ ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నటుడు సప్తగిరి వేరువేరుగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం ధ్వజస్తంభం వద్ద నమస్కరించి రంగనాయక మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యేలు, ఎంపీ సందడి చేశారు.
Also Read: Hyderabad: 14 సార్లు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చాం.. రేవంత్ రెడ్డిపై విమర్శలు సరికాదు
తిరుమల లడ్డూ రికార్డు
2025–26 వార్షిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విక్రయాల్లో మునుపెన్నడూ లేని ఘనతను నమోదు చేసింది. రోజుకి 4 లక్షల లడ్డూలు విక్రయం చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 13.95 కోట్ల లడ్డూలను విక్రయించి.. సుమారు రూ.567 కోట్లు టీటీడీకి లభించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Laddu Record Sales: ఎన్ని వివాదాలు ఉన్నా.. ఎంత రాజకీయం నడిచినా తిరుమల లడ్డూకు ఉన్న పవిత్రత ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే భక్తులు భారీగా లడ్డూలను కొనుగోలు చేస్తూ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే భక్తులకు అమితమైన విశ్వాసం. శ్రీవారి లడ్డూ రుచి, దానికున్న ప్రాముఖ్యత ప్రపంచ ప్రసిద్ధి. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ లడ్డూ విక్రయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో లడ్డూలు అమ్ముడయ్యాయి.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు తిరిగి వచ్చేటప్పుడు తనతో పాటు పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్లడం ఒక ఆనవాయితీ. కొండపై ఎంత రద్దీ ఉన్నా.. స్వామి లడ్డూ కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉంటారు. అయితే ఈ భక్తి విశ్వాసమే ఇప్పుడు సరికొత్త రికార్డులకు వేదికైంది. 2025–26 వార్షిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విక్రయాల్లో మునుపెన్నడూ లేని ఘనతను నమోదు చేసింది. రోజుకి 4 లక్షల లడ్డూలు విక్రయం చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 13.95 కోట్ల లడ్డూలను విక్రయించి.. సుమారు రూ.567 కోట్లు టీటీడీకి లభించింది.
Also Read: Hyderabad: 14 సార్లు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చాం.. రేవంత్ రెడ్డిపై విమర్శలు సరికాదు
తిరుమలలో భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమల స్వామిని దర్శించుకుంటుండటంతో.. వారి అవసరాలకు అనుగుణంగా టీటీడీ అత్యంత నాణ్యమైన లడ్డూలను అందిస్తోంది. సుమారు 200 ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం ఉన్న ఈ లడ్డూ ప్రసాదం కాలానుగుణంగా భక్తుల మన్ననలను పొందుతూనే ఉంది. 1790 నుంచి 1840 మధ్య కాలంలో తిరుమలలో లడ్డూ తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. మరాఠా రాజు రఘోజి భోంస్లే పాలనలో స్వామివారికి లడ్డూను నివేదించే సాంప్రదాయం మొదలైందని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి నేటి వరకు ఈ ప్రసాదం విశిష్టత ఏమాత్రం తగ్గలేదు.
Also Read: YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్ జగన్
సాంకేతికత పెరుగుతున్నా.. భక్తుల సంఖ్య లక్షలు దాటుతున్నా లడ్డూ రుచిలో, నాణ్యతలో రాజీ పడకుండా టీటీడీ ప్రత్యేక శ్రద్ధతో తయారుచేస్తోంది. నెయ్యి, శనగపిండి, చక్కెర, ఇలాచి, పచ్చకర్పూరం వంటి దినుసులను ఉపయోగించి పొటులో అత్యంత పవిత్రంగా లడ్డూలను తయారు చేస్తారు. పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయడంలో టీటీడీ యంత్రాంగం విజయం సాధించిందని ఈ రికార్డు విక్రయాలు నిరూపిస్తున్నాయి. మొత్తానికి శ్రీవారి లడ్డూ కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు కోట్లాది మంది భక్తుల నమ్మకం. ఈ ఏడాది నమోదైన రికార్డు విక్రయాలు తిరుమల వైభవాన్ని మరోసారి చాటిచెప్పాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hyderabad: 14 సార్లు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చాం.. రేవంత్ రెడ్డిపై విమర్శలు సరికాదు
Hyderabad, Telangana:Ponguleti Srinivas Reddy Land Scams: తెలంగాణలో జరుగుతున్న కీలక పరిణామాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డితోపాటు పొంగలేటి శ్రీనివాస రెడ్డి భూ కుంభకోణాలు, మంత్రివర్గ విస్తరణ తదితర వాటిపై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గాంధీభవన్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. 'జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి ఫామ్ ఇచ్చింది. పరిస్థితులను బట్టి ముందుకి వెళ్లాలి. జీవన్ రెడ్డి విమర్శలు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు' అని పేర్కొన్నారు.
'ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దిగిపోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు జీవన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి' అని మహేశ్ కుమార్ రెడ్డి సూచించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఎవరూ బాగుపడేది లేదు. మార్పు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పోయింది. పొంగులేటిపై వచ్చిన ఆరోపణలపై ప్రూఫ్ ఉంటే అప్పుడు కాంగ్రెస్ ఆలోచిస్తుంది. పొంగులేటిపై విమర్శలు కాదు. ఆధారాలు ఉంటే గాంధీ భవన్కు వచ్చి ఇవ్వండి. ఆధారాలు తీసుకొని చర్చకు రండి. నేను చర్చ సవాల్కు సిద్ధం' అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
'పస లేని ఆరోపణలు చేయొద్దు. నాదర్గుల్ భూముల కుంభకోణం గత హయాంలో జరిగింది. మా మీద బట్ట కాల్చివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మేము కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటిదాకా ఎక్కడ గీత కూడా పడలేదు' అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ తెలిపారు. 'మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి పరిధిలోని అంశం. నాకున్న సమాచారం ప్రకారం మంత్రి వర్గ విస్తరణలో ఇప్పట్లో ఉండదు' అని స్పష్టం చేశారు.
తామంతా కూడా ఎన్ఎస్యూఐ నుంచి వచ్చిన వాళ్లమే. ఇక్కడ ఉన్న నాతోపాటు పొన్నం ప్రభాకర్, వంశీ చంద్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శంకర్ నాయక్ అందరం కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్లమే. నాయకత్వాన్ని అందిస్తున్న ఒక కంపెనీ యువజన కాంగ్రెస్. ఆ సంస్థ నుంచి మంచి అవకాశం వచ్చింది' అని మహేశ్ కుమార్ వివరించారు. 'జీవన్ రెడ్డికి 14 సార్లు బీఫామ్లు తీసుకున్న సీనియర్ నాయకులు. కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్న జీవన్ రెడ్డి గతంలో బీఆర్ఎ్పై చేసిన విమర్శలను ఒకసారి గుర్తు చేసుకోవాలి' అని సూచించారు.
'రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదు. ఆయనను ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సీఎం. మంత్రులపై విమర్శలు చేసేవాళ్లు ఆధారాలు తీసుకురండి. నిందలు వేస్తాం బట్టకాల్చి వేస్తాం అంటే సరికాదు' అని తెలిపారు. పొంగులేటిపై చేస్తున్న విమర్శలపై ఆధారాలు ఉంటే తీసుకుని వస్తే గాంధీభవన్ వేదికగా చర్చిస్తామని ప్రకటించారు.
KKR vs LSG Preview: నేడే కేకేఆర్ Vs లక్నో మ్యాచ్..ప్లేయింగ్ 11 జట్లు ఇవే..వాళ్లిద్దరూ జట్టులో నుంచి ఔట్!
Kolkata, West Bengal:KKR vs LSG Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో ఆతిథ్య కోల్కతా నైట్రైడర్స్ జట్టు తలపడనుంది. సోమవారం ఇదే స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. నేడు గురువారం మరో మ్యాచ్ జరిగేందుకు మస్తాబయ్యింది.
కోల్కతా నైట్ రైడర్స్ తమ ప్రధాన స్పిన్నర్ల దళం వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లేకుండానే ఈ మ్యాచ్ ఆడనుంది. వేలికి గాయం కావడంతో ప్రపంచ నంబర్ 1 టీ20ఐ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ దూరం కానుండడంతో ఆ జట్టులో స్పిన్నర్ కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్ పడుతున్నప్పుడు వరుణ్ ఎడమ చేతి చిటికెన వేలికి గాయమైంది. చికిత్స చేసిన వైద్యులు అతడికి విశ్రాంతి అవసరమని సూచించారు.
మరోవైపు వెస్టిండీస్ మాజీ ఆల్-రౌండర్ సునీల్ నరైన్ కూడా అనారోగ్యం కారణంగా పంజాబ్ కింగ్స్తో ఆడాల్సిన మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే నేడు జరగబోయే మ్యాచ్కు కూడా అతను పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదని సమాచారం. దీంతో లక్నో సూపర్ జెయింట్స్తో జరగనున్న మ్యాచ్లోనూ సునీల్ నరైన్ ఆడడం డౌట్గానే కనిపిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంవలో భారీ షాట్లు కొట్టే సామర్థ్యం ఉన్న అనుకూల్ రాయ్ను జట్టులోకి తీసుకునేందుకు కోల్కతా నైట్రైడర్స్ సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ 2026 కోసం జరిగిన మినీ వేలంలో రూ.25.2 కోట్లకు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరాన్ గ్రీన్.. గురువారం రాత్రి జరిగే మ్యాచ్ నుంచి బౌలింగ్ చేసేంత ఫిట్గా ఉండవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.
మరోవైపు రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోని పేస్ బౌలింగ్ విభాగంలో ఆవేశ్ ఖాన్, మోసిన్ ఖాన్ల మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ నుంచి లక్నో జట్టులోకి ట్రేడ్ అయిన అర్జున్ టెండూల్కర్ కంటే సిద్ధార్థ్ను జట్టులోకి తీసుకునేందుకు ఆ టీమ్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. లక్నో టీమ్లో ఎవరికైనా గాయాల కారణంగా వైదొలగితే తప్పా.. అర్జున్ టెండూల్కర్ను జట్టులోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు.
నేడు జరగబోయే మ్యాచ్లో తుదిజట్ల అంచనా ఇదే..
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, M సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ రాఠి, ప్రిన్స్ యాదవ్.
కోల్కతా నైట్ రైడర్స్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజారబానీ.
Also REad: 8th Pay Commission Hike: ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త..రూ.46,000కు పెరగనున్న జీతం..పండగే పండగ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Youtuber Vaishnavi: శ్వేతనాగు రూపంలో వైష్ణవి? దశదిన కర్మలో జరిగిన ఆ వింత ఏంటి.. వీడియో..
Karimnagar, Telangana:Youtuber Vaishnavi Viral Video Watch: ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి అకాల మరణంతో ఒక్కసారిగా ఆమె కుటుంబాన్ని తీరని శోకంలోకి ముంచేసింది.. అయితే, ఆమె చనిపోయిన తర్వాత జరుగుతున్న కొన్ని వింత సంఘటనలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.. అలాగే ఇటీవలే వైష్ణవి తన సోదరుడి కలలోకి వచ్చిందని..తాను ఆత్మ రూపంలో ఆమెను చూశామని ఆమె సోదరులు షాకింగ్ విషయాలను ఓ యూట్యుబ్ ఛానెల్ ఇంటర్య్వూలో తెలిపారు.
వైష్ణవి సోదరుడు సాగర్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి చెల్లి నా కలలోకి వచ్చిందని.. అన్నా.. నువ్వు ఎందుకు అంతగా బాధపడుతున్నావు? నేను చనిపోలేదు, మీతోనే ఉన్నాను. మన ఊరిలోనే తిరుగుతున్నాను. నేను మళ్లీ తిరిగి వస్తాను.. అని చెప్పింది. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన బట్టలతో పాటు చీరలు ఎవరికీ ఇవ్వవద్దని.. తాను మళ్లీ జన్మిస్తానని వైష్ణవి కలలో కోరినట్లు సోదరులు తెలిపారు.
వైష్ణవి దశదిన కర్మల సమయంలో ఒక తెల్లటి నాగుపాము ఇంటి పరిసరాల్లోకి తిరగడం అందరినీ అశ్చర్యపరిచేలా చేసింది.. మా అమ్మ శివయ్యను ప్రార్థిస్తూ.. నా బిడ్డను ఏ రూపంలోనైనా పంపించు అని వేడుకుందని.. సరిగ్గా అదే సమయంలో ఒక తెల్లటి పాము అక్కడికి వచ్చిందని.. అది మమ్మల్ని ఏమీ చేయకుండా చాలా సేపు అక్కడే ఉండి.. వెల్లిపోయిందని.. అది చూశాక మా చెల్లి పాము రూపంలో వచ్చిందని మాకు అనిపించిందని సోదరులు తెలిపారు.
Also Read: Road Accident: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
వైష్ణవి మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని.. తమకు న్యాయం జరగాలని ఆమె సోదరులు డిమాండ్ చేస్తున్నారు. పాలకోవ ఇష్యూ జరిగితే.. ఇండస్ట్రీ అంతా స్పందించింది. కానీ.. ఒక ఆడబిడ్డ ప్రాణం పోతే ఎవరూ మాట్లాడటం లేదు. మా చెల్లికి జరిగిన అన్యాయం మరే ఇతర ఆడబిడ్డకూ జరగకూడదు అని వారు అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు తమ న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
Also Read: Road Accident: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున ఎట్టిపరిస్థితుల్లో ఈ పని చేయకండి! ఏవి కొనాలి? ఏవి కొని ఇంటికి తీసుకురాకూడదో తెలుసా?
Hyderabad, Telangana:Akshaya Tritiya Dos And Donts: ఈ ఏడాది పవిత్రమైన అక్షయ తృతీయ పర్వదినాన్ని ఏప్రిల్ 19న జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున కొత్త పనికి శ్రీకారం చుట్టేందుకు ఎంతోమంది సన్నాహాలు చేస్తుంటారు. మరికొందరు బంగారం, వెండి వస్తువులను కొని దేవుని గదిలో పెట్టి పూజిస్తారు. అక్షయ తృతీయకు ఉన్న ప్రత్యేక ఏమిటంటే.. ఆ రోజు ముహూర్తాలు చూడకుండానే ఏ సమయంలోనైనా ఏదైనా పనిని నిశ్చింతగా ప్రారంభించవచ్చు. ఎన్నో శుభకార్యాలు చేయవచ్చు. ఈ పర్వదినం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే.. ఇంట సిరిసంపదలు తెస్తుందని ప్రజల నమ్మకం. ఈ కారణంగా ప్రజలంతా బంగారం, వెండి లేదా ఇతర విలువైన వస్తువులను కొనేందుకు ఇష్టపడతారు. అయితే అక్షయ తృతీయ రోజున కొన్ని పనులు చేయకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల ప్రభావం వస్తుందని నమ్ముతారు. ఆ పనులు ఏంటి? ఎందుకు ప్రారంభించకూడదు అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అక్షయ తృతీయ నాడు ఏది శుభప్రదం!
అక్షయ తృతీయ నాడు రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీరు ఖరీదైన వస్తువులను కొనలేకపోయినా, మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఎన్నో చౌకైన వస్తువులను కొనేయోచ్చు. అక్షయ తృతీయ రోజు కింద పేర్కొన్న అనేక వస్తువులను ఎలాంటి అభ్యంతరం లేకుండా ఇంటికి తెచ్చుకోవచ్చు.
కళ్లు ఉప్పు: అక్షయ తృతీయ నాడు ఇంట్లోకి కళ్లు ఉప్పు తీసుకురావడం అప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.
పత్తి: ఇది స్వచ్ఛతకు, సానుకూల శక్తికి చిహ్నంగా పరిగణిస్తారు.
మట్టి పాత్రలు: ఇవి ఇంట్లో సంతోషాన్ని, శ్రేయస్సును పెంచుతాయని నమ్ముతారు.
బార్లీ, పసుపు, ఆవాలు: ఇవి శుభానికి, శ్రేయస్సుకు చిహ్నాలుగా ఉంటాయి.
తులసి మొక్క: ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని పెంచుతుంది.
చోళీలు, పాత్రలు: ఇవి సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉన్నాయని భావిస్తారు.
ఇవి అస్సలు కొనకండి!
అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులను కొనడం అశుభంగా పరిగణిస్తారు. వాటిలో ఇనుప వస్తువులు, ముళ్ల మొక్కలు, పదునైన లేదా మొనదేలిన వస్తువులు, నల్లని రంగు వస్తువులు, పాత మిఠాయిలు, విరిగిన లేదా పాత వస్తువులతో పాటు అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు ఆ పర్వదినం నాడు కొనకపోవడమే మంచిది.
అక్షయ తృతీయ నాడు దానధర్మాలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మీకు వీలైనప్పుడు.. ఈ వస్తువులను దానం చేయవచ్చు. పుచ్చకాయలు, దోసకాయలు, కల్కండూ, చేతి విసనకర్రలు, చాపలు, బూట్లు, బియ్యం, ఉప్పు, నెయ్యి, మట్టి కుండలు, కప్పులు, విల్లో ఆకులు, పండ్లు, గొడుగులు లాంటి ఇతర వస్తువులను కొని దానం చేయోచ్చు.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనేందుకు ఓ ఉత్తమమైన మార్గం ఉంది. ఏప్రిల్ 19న వచ్చే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడానికి ఉత్తమ సమయం ఉదయం 10:49 నుండి 5:51 వరకు ఉంటుంది.
ఉదయ ముహూర్తం (శుభ సమయం) - ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:20 వరకు
మధ్యాహ్న ముహూర్తం (శుభ సమయం) - మధ్యాహ్నం 01:58 నుండి సాయంత్రం 03:35 వరకు
సాయంత్ర ముహూర్తం (శుభ సమయం) - సాయంత్రం 06:49 నుండి రాత్రి 10:57 వరకు
(గమనిక : ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని పాటించే ముందు పండితుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: 8th Pay Commission Hike: ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త..రూ.46,000కు పెరగనున్న జీతం..పండగే పండగ!
Also Read: Jio 265 Recharge Plan: జియో బంపర్ ఆఫర్..రూ.265కే అపరిమిత కాల్స్, హైస్పీడ్ 5G ఇంటర్నెట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th Pay Commission Hike: ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త..రూ.46,000కు పెరగనున్న జీతం..పండగే పండగ!
Hyderabad, Telangana:8th Pay Commission Hike Update: 8వ వేతన సంఘంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతం పెరగనున్నట్లు సమాచారం. ఉద్యోగులకు జీతంతో పాటు ఉద్యోగ విరమణ చేసిన వారికి కూడా పెన్షన్ భారీ మొత్తంలో పెరగనుందని తెలుస్తోంది. దీని కోసం సుమారు 1.2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జీతం, పెన్షన్ ఏమాత్రం పెరుగుతుందని అందరూ అడుగుతున్న ప్రశ్న. దీనికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. జాతీయ మండలి ముసాయిదా కమిటీ ఏప్రిల్ 13న సమావేశం కానుందని సమాచారం అందుతోంది. ఆ మీటింగ్లో 8వ వేతన సంఘం ముసాయిదా సిఫార్సులను ఖరారు చేయనున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ ఇదో తీపికబురు అనే చెప్పాలి.
ఈ అత్యంత ముఖ్యమైన సమావేశం ఏప్రిల్ 13న జరగనుంది. ఇందులో భాగంగా 8వ వేతన సంఘం సిఫార్సులన్నింటినీ సవివరంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహించే ఈ కమిటీ అతి త్వరలోనే ఈ ముసాయిదాను సిద్ధం చేయనుంది. సుమారు 1.2 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల జీతం, పెన్షన్, అలవెన్సులు ఎంతమేర పెరుగుతాయనేది అందర్ని వెంటాడుతున్న ప్రశ్నగా మారింది. అయితే దీనిపై అతిత్వరలోనే ఓ నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.
ఈ ముసాయిదా కమిటీ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ప్రధాన వారధిగా పనిచేస్తుంది. సరైన వేతన విధానాన్ని నిర్ణయించడంలో వీరు ముఖ్యమైన సలహాలు అందిస్తారు. ప్రస్తుతం ఉద్యోగులు 8వ వేతన సంఘం అమలుతో పాటు ముఖ్యంగా 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్' విషయంపైనా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదే విషయమై ఉద్యోగులు, ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక పోర్టల్ను ప్రారంభించింది. అందువల్ల ఈ అనిశ్చితి త్వరలోనే ముగుస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
కొన్ని జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. 8వ వేతన సంఘం కనీస మూల వేతనాన్ని రూ.46,000 కంటే ఎక్కువగా నిర్ణయించే అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా పెన్షనర్లు కూడా కనీస పెన్షన్ రూ.25,000 కంటే పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. జీతాలు, పెన్షన్ల పెంపులో 'ఫిట్మెంట్ ఫ్యాక్టర్' చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 7వ పే కమిషన్ సమయంలో ఈ ఫ్యాక్టర్ విలువ 2.57గా ఉండేది. ఇది కనీస వేతనాన్ని రూ.7,000 నుండి రూ.18,000కు పెంపుదల చేసింది. అంతకుముందు 6వ వేతన సంఘం నిర్ధారించిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.86గా ఉండేది. అయితే ఈసారి 8వ వేతన సంఘం సిఫార్సుల్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.5 నుంచి 2.86 మధ్య ఉండనుందని నివేదికలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. పెన్షనర్లకు కనీసం పెన్షన్ రూ.9,000 నుంచి సుమారు రూ.25,740 వరకు పెరగొచ్చని ఆశిస్తున్నారు.
(గమనిక: ఈ పోస్ట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది. తాజా, అత్యంత కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లను సంప్రదించమని సిఫార్సు చేస్తున్నాము. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Jio 265 Recharge Plan: జియో బంపర్ ఆఫర్..రూ.265కే అపరిమిత కాల్స్, హైస్పీడ్ 5G ఇంటర్నెట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IPL 2026 DC vs GT: కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విధ్వంసం వృథా.. ఒక్క పరుగుతో గట్టెక్కిన గుజరాత్ టైటాన్స్!
New Delhi, Delhi:GT Won By One Run: ఒక్క బంతి.. రెండు పరుగులు. విజయమో.. పరాజయమో అని తేలాల్సిన ఒకే ఒక్క బంతిలో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తీవ్రంగా పోరాడాయి. సూపర్ ఓవర్కు వెళ్లాలని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నించగా.. వికెట్ లేదా ఒక్క పరుగు కూడా రాకుండా చేయాలని గుజరాత్ టైటాన్స్ ప్రయత్నించాయి. చివరికి అనూహ్యం పరిణామంతో గుజరాత్కు విజయం వరించింది. ఒకే ఒక్క పరుగుతో గుజరాత్ ఐపీఎల్ 2026లో తొలి విజయాన్ని అందుకుంది. అత్యంత ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ విశేషాలు ఇలా ఉన్నాయి.
Also Read: Husband Drinks Dettol: కాపురంలో లొల్లి.. భార్య వేధింపులు తాళలేక డెటాల్ తాగిన భర్త
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. కెప్టెన్ శుభమన్ గిల్ 45 బంతుల్లో 70 పరుగులు చేసి దుమ్మురేపాడు. వాటిలో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. వరుస ఓటములు చవిచూస్తున్న సమయంలో ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని శుభమన్ గిల్ తీవ్రంగా పోరాడాడు. దాని ఫలితంగానే అతడు భారీ స్కోర్ సాధించాడు. ఇక జోస్ బట్లర్ (52), వాషింగ్టన్ సుందర్ (55) అర్ధ శతకాలతో రాణించారు. ఓపెనర్ సుదర్శన్ 12 పరుగులకు పరిమితమవగా.. గ్లెన్ ఫిలిప్స్ (14), రాహుల్ తెవాటియా (1) నాటౌట్గా నిలిచారు. ఢిల్లీ బౌలింగ్ పరంగా చూస్తే ముకేశ్ కుమార్ 2 వికెట్లు తీయగా.. లుంగీ ఎంగిడి, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read: IPL 2026 RR vs MI: రాజస్థాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయం.. ఫోర్లతో చెలరేగిన యశస్వి
వరుస విజయాలతో జోష్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. విజయం సాధ్యం కానీ పక్షంలో సూపర్ ఓవర్ వెళ్లాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేకపోయాయి. 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి 92 పరుగులు చేసినా అతడి శ్రమ వృథాగా మారింది. 52 పరుగుల్లో శతకానికి చేరువైన రాహుల్ బంతులన్నీ బౌండరీలకు మళ్లించాడు. ఫలితంగా 11 ఫోర్లు బాదగా.. 4 సిక్సర్లు బాదాడు. పథూమ్ నిస్సాంక 24 బంతుల్లో 41 పరుగులు చేసి రాణించగా.. నితీశ్ రాణా (5), అక్షర్ పటేల్ (2), త్రిస్టన్ స్టబ్స్ (7), విప్రజ్ నిగమ్ (12), కుల్దీప్ యాదవ్ (1) అతి తక్కువ పరుగులకే ఔటవగా.. సమీర్ రిజ్వీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. జట్టు క్లిష్ట సమయంలో విజయం కోసం డేవిడ్ మిల్లర్ తీవ్రంగా శ్రమించాడు. ఆఖరి వరకు గ్రౌండ్లో ఉండి జట్టు గెలిపించేందుకు.. మ్యాచ్ను డ్రా చేసేందుకు పోరాడాడు. 20 బంతుల్లో 41 పరుగులు చేసి విజయానికి ఒక్క పరుగు దూరాన జట్టును నిలిపాడు.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
బ్యాటర్లు నిలిపిన స్కోర్ను గుజరాత్ టైటాన్స్ బౌలర్లు చాలా కష్టపడ్డారు. చెమటోడ్చి జట్టును చివరి బంతి వరకు తీసుకెళ్లి విజయం అందించారు. రషీద్ ఖాన్ మరోసారి అద్భుతంగా బంతులు వేసి అతి తక్కువ పరుగులు ఇవ్వడమే కాకుండా 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. 3 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చిన రషీద్ ఖాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ప్రసిధ్ కృష్ణ రెండు వికెట్లు తీయగా.. తెలంగాణ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ విజయంతో హ్యాట్రిక్ ఓటముల నుంచి గుజరాత్ టైటాన్స్ తప్పించుకుని ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. హ్యాట్రిక్ విజయాలు సాధించాలని కసితో ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్కు నిరాశతో ఈ సీజన్లో తొలి ఓటమిని చవిచూసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
Wadgaon, Maharashtra:Without Data Recharge Plans: నేటి సాంకేతిక యుగంలో డేటా అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తుండడంతో అన్నీ టెలికాం సంస్థలు తమ రీచార్జ్ ప్లాన్లలో మొబైల్ డేటాను తప్పనిసరి చేశాయి. ఇప్పుడు డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్లు లేవు. అయితే డేటా లేకుండా కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల ప్లాన్ల కోసం చూస్తున్నారు. అలాంటి వారికి ట్రాయ్ తీపి కబురు అందించింది. డేటా లేని రీచార్జ్ ప్లాన్లు అందించాలని ప్రతిపాదనలు చేసింది.
Also Read: Husband Drinks Dettol: కాపురంలో లొల్లి.. భార్య వేధింపులు తాళలేక డెటాల్ తాగిన భర్త
మొబైల్ రీఛార్జి ప్లాన్లపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కొత్త ప్రతిపాదనలు చేసింది. టెలికాం కంపెనీలు అన్ని రకాల కాలవ్యవధితో వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లు అందించాలని ట్రాయ్ ప్రతిపాదన చేసింది. టెలికామ్ వినియోగదారుల రక్షణ రెగ్యులేషన్స్ (టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్) 2026 పేరిట కొన్ని ప్రతిపాదనలు చేసింది. దీనిపై ఏప్రిల్ 28వ తేదీ వరకు అభిప్రాయాలను ట్రాయ్ సేకరించనుంది. ఇంటర్నెట్ (డేటా) వాడకుండా కేవలం వాయిస్ కాల్స్ కోసం మాత్రమే రీఛార్జి చేసుకునే వారికి ట్రాయ్ చేసిన ప్రతిపాదనతో రీఛార్జుల భారం తగ్గనుంది.
Also Read: YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్ జగన్
టెలికాం కంపెనీలన్నీ డేటాతోపాటు అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్లతో కూడిన ప్లాన్లు అందిస్తున్నాయి. అయితే వీటిలో డేటా వాడకపోయినా దానికి యూజర్లు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ఈ విషయం పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ట్రాయ్ కొత్త సిఫార్సులు చేసింది. డేటా లేకుండా 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల కాలవ్యవధితో ప్రత్యామ్నాయ రీచార్జ్ ప్లాన్లు తీసుకురావాలని సూచించింది.
ప్రస్తుతం కొన్ని కంపెనీలు కేవలం వాయిస్ ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే అవి 84 రోజులు లేదా ఒక సంవత్సరం వంటి సుదీర్ఘ కాలపరిమితితో ఉన్నాయి. ట్రాయ్ చేసిన కొత్త నిబంధనల ప్రకారం 28 రోజులు, 56 రోజులు వంటి అన్ని రకాల కాలపరిమితుల్లో డేటా లేని ప్లాన్లు అందుబాటులో ఉండాలి. అయితే ట్రాయ్ చేసిన ప్రతిపాదనలకు టెలికాం సంస్థలు ఆ కొత్త రీచార్జ్ ప్లాన్లు ఎప్పుడు తీసుకువస్తాయో వేచి చూడాలి.
ట్రాయ్ చేసిన కొత్త ప్రతిపాదనతో ఫీచర్ ఫోన్ వాడేవారికి.. డేటా వాడనివారికి ఎంతో దోహదం చేయనుంది. వాళ్లు ఇన్నాళ్లు కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే వాడినా కూడా డేటాకు కూడా చెల్లింపు చేస్తున్నారు. ట్రాయ్ చేసిన కొత్త ప్రతిపాదనలతో డేటా రహిత ప్లాన్లను టెలికాం కంపెనీలు తీసుకురావాల్సి ఉంది. ఈ ప్లాన్లు తీసుకువస్తే వృద్ధులు, ఫీచర్ ఫోన్ వాడేవారికి లబ్ధి జరగనుంది.
Also Read: Capital Amaravati: రాజధాని అమరావతికి బిగ్ బూస్ట్.. రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్మాణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Husband Drinks Dettol: కాపురంలో లొల్లి.. భార్య వేధింపులు తాళలేక డెటాల్ తాగిన భర్త
Hyderabad, Telangana:Wife And Husband Clashes: మ్యాట్రిమోనీ యాప్లో సంబంధం కుదుర్చుకుని వివాహం చేసుకున్న భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కాపురం పెట్టిన కొన్నాళ్లకే గొడవలు జరగడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని భర్త ఆరోపించాడు. ఎవరితో సంబంధం ఉందనే రుజువు చూపించాలని కోరగా.. భర్త భార్య ఫోన్, వాట్సప్ వివరాలు అడిగాడు. అయితే ఆమె ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో పోలీసుస్టేషన్లో పంచాయితీ జరగ్గా ఆ సమయంలో భర్త డెటాల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Capital Amaravati: రాజధాని అమరావతికి బిగ్ బూస్ట్.. రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్మాణం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన ఇటుకల మహేష్ (29) హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతడు విలాసాగరం సమత అనే యువతిని ఓ మాట్రిమోని యాప్లో చూసి సంబంధం మాట్లాడుకుని వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన తరువాత జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి కాలనీలో కాపురం పెట్టారు. అయితే కొన్ని రోజుల తరువాత మహేశ్కు అతడి భార్యపై అనుమానం పెంచుకుని గొడవ పడతుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
Also Read: YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్ జగన్
ఈ గొడవల కారణంగా మహేశ్, సమత ఇద్దరు కాపురం తీసేసి విడివిడిగా వేర్వేరు ప్రైవేటు హాస్టల్లో నివసిస్తున్నారు. దిల్సుఖ్నగర్లో వీరిద్దరూ హాస్టల్స్లో నివసిస్తుండగా ఫిబ్రవరిలో భార్యాభర్తలకు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. తన భార్యకు వేరే వారితో సంబంధం ఉందని ఆరోపించగా.. పంచాయితీ పెద్దలు సాక్ష్యాధారాలు చూపించాలని అడిగారు. దీంతో అతడు రెండు నెలల గడువు కోరాడు.
సాక్ష్యాధారాలు చూపించడానికి రెండు నెలల గడువు ముగియడంతో మహేష్ చైతన్యపురి పోలీస్ స్టేషన్కు వచ్చి భార్యపై ఫిర్యాదు చేశాడు. తన భార్య సీడీఆర్, వాట్సప్ చాట్ కావాలని అడుగగా ఇవ్వడానికి భార్య నిరాకరించింది. బయటకు వెళ్లి డెటాల్ను పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి మరోసారి భార్యకు సంబంధించిన చాట్ ఇవ్వాలని కోరాడు. ఇవ్వకపోవడంతో తన వెంట తెచ్చుకున్న డెటాల్ను తాగాడు. అది గమనించిన పోలీసులు వెంటనే నిలువరించి అతడి ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. మహేశ్ ఫిర్యాదు భార్యభర్తలకు సంబంధించిన విసయం కావడంతో కోర్టులో కానీ.. ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవాలని ఆ జంటకు పోలీసులు సూచించి పంపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్ జగన్
Tadepalli, Andhra Pradesh:YS Jagan Speech: ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనతో విద్య, వైద్యం, వ్యవసాయం, సుపరిపాలన, శాంతిభద్రతలు, సంక్షేమం, అభివృద్ధి.. ఇవన్నీ కూడా ఈరోజు తిరోగమనంలో కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఎక్కడా కూడా పలాన మంచి చేశామనే చెప్పుకునే పరిస్థితి పోయి ఈరోజు ఎక్కడ చూసినా కూడా తిరోగమనమే కనిపిస్తోందని ఆరోపించారు. 'ఏ వ్యవస్థ చూసినా ఎక్కడా మంచి కనిపించడం లేదు. అంతా తిరోగమనమే కనిపిస్తోంది. రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సినది ఏదీ నిర్వహించడం లేదు' అని చంద్రబాబు పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Unclaimed Money: మూలుగుతున్న రూ.లక్షా 2000 కోట్లు.. అందులో మీ డబ్బు ఉందా? అని తెలుసుకోవడం ఇలా
తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన అనంతరం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. చంద్రబాబు పాలనపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూనే ఈ ప్రభుత్వంపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అన్నింటికీ తాను ఉన్నానని భరోసానిచ్చారు. తాను పాదయాత్ర త్వరలో ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. పీఆర్సీ కోసం భారీ యాక్షన్ ప్లాన్
ప్రజలకు తోడుగా ఉన్నామని గర్వంగా చెబుతున్నారని పార్టీ శ్రేణులను వైఎస్ జగన్ అభినందించారు. 'విపత్కర పరిస్థితుల్లో ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ జెండాను చేత బట్టుకుని ప్రజలకు అండగా.. తోడుగా మేం ఉన్నామని గర్వంగా చెబుతున్ను. కళ్లు మూసుకుని తెరిచేలోపు ఐదేళ్లలో సగం కాలం అయిపోయింది. ఇక మిగిలింది సగం కాలమే' అని గుర్తుచేశారు. 'కూటమి పాలనకు సగం టర్మ్ అయిపోయింది. మిగిలింది ఒక సగం టర్మ్ మాత్రమే. ఇంకో సంవత్సరం దాటితే నా పాదయాత్ర కూడా ప్రారంభం అవుతుంది. దాని తర్వాత నేను రోడ్డు మీదకు వచ్చి ఒకటిన్నర సంవత్సరం ప్రజలతోనే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఉంటా' అని వైఎస్ జగన్ ప్రకటించారు. పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చంద్రబాబుకు ప్రతి రోజు సినిమా చూపిస్తామని పునరుద్ఘాటించారు.
Also Read: Capital Amaravati: రాజధాని అమరావతికి బిగ్ బూస్ట్.. రూ.2,534 కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్మాణం
'మనం 5 సంవత్సరాల కాలంలో రూ.3.31 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. వాటిలో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా బటన్లు నొక్కడం నా అక్కాచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోవడం చూశాం. ఆ రూ.2,73 లక్షల కోట్లు ఎవరి అకౌంట్లలోకి పోయాయని వారి ఆధార్ నంబర్లు ఏమిటి అనేది కూడా మనం ఇవ్వగలుగుతాం. అంతగా మనం రూ.3.31 లక్షల కోట్లు అప్పు తెస్తే రూ.2,73 లక్షల కోట్లు ఈ మాదిరిగా మనం జమా ఖర్చు కూడా ఇవ్వగలుగుతాం. ఆధార్ నంబర్లతో సహా' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.
'మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారు. ముఖ్యమైన రాయలసీమ లిఫ్టు వంటివి ప్రాజెక్టులు చేయకుండా ఆపేసిన కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. రైతులు, పిల్లలు, అక్కాచెల్లెమ్మల గురించి పట్టించుకునేవాడే లేడు. పథకాల కథ దేవుడెరుగు. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు కనీసం సున్నా వడ్డీ రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి. డ్వాక్రా సంఘాలన్నీ నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి' అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
'ప్రభుత్వ భూములు పప్పులూ, బెల్లాలకు అమ్మేస్తున్నారు. రూపాయికి షాపులో చాక్లెట్ వస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో రూపాయికి కోట్ల విలువ చేసే భూములు మాత్రం వస్తున్నాయి' అని చంద్రబాబు పాలనా తీరుపై మాజీ సీఎం వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. 'కళ్ల ఎదుటే రుషికొండకు ఎదురుగా 50 ఎకరాల ప్రభుత్వ భూమి చంద్రబాబు తన సమీప బంధువు, విశాఖపట్నం ఎంపీకి రూ.5 వేల కోట్లు విలువజేసే భూమిని ఉచితంగా ఇచ్చాడు. ఊరికే రెగ్యులరైజేషన్ చేశారు. అంత దారుణంగా రాష్ట్రానికి సంబంధించిన భూములు కాజేస్తున్నారు' అని ఆరోపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
