రీళ్ల కోసం రోడ్డుపై బైకు స్టంట్, ఓ యువకుడు మృతి, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు
Hayathnagar_Khalsa, Telangana:సోషల్ మీడియాలో లైక్స్ కోసం విన్యాసాలు చేస్తున్న యువకులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు, నిన్న సాయంత్రం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పేట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు వర్షంలో తడుస్తూ బైక్ బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.విజయవాడ జాతీయ రహదారిపై పనులు కొనసాగుతుండగా, జాతీయ రహదారిపై ఉన్న వన్ లైన్ మరమ్మతుల కోసం తెరిచి ఉంచారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Pawan Kalyan: నన్ను రెచ్చగొట్టవద్దు.. మేం ఎదురుదాడి చేస్తాం: పవన్ కల్యాణ్
Rajamahendravaram, Andhra Pradesh:Prof Nageshwar Row: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో చర్చించిన అంశాలపై మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. 'అమిత్ షాతో మాట్లాడిన విషయాలు బయటవాళ్లకు ఎలా తెలుస్తాయి? వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని అడిగితే నాకు క్లాస్ తీసుకున్నారట. ఒకరు జైలుకి వెళ్తే పవన్ కల్యాణ్ ఎదుగుతారా.? జనసేన ఎదుగుతుందా..?' అని పవన్ కల్యాణ్ ఎదురు ప్రశ్నించారు. ఇలాంటి వారు లేనప్పుడే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
Also Read: Harish Rao: పెట్రోల్, డీజిల్పై రేవంత్ రెడ్డి వ్యాట్ తగ్గించాలి.. హరీశ్ రావు లేఖ
రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. 'అన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండి రాజకీయాల్లోకి వచ్చా. ఇలా నన్ను విమర్శించేవాళ్లు రాగలరా? మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకుంటారో చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నా' అని పవన్ కల్యాణ్ సవాల్ చేశారు. ఛాయిస్ మీకే ఇస్తున్నా అంతేగానీ తనను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు.
'వైసీపీ నాయకుడు (వైఎస్ జగన్) జైలుకు వెళితే పవన్ రాజకీయాల్లోకి ప్రవేశంపై వారి పిచ్చి లాజిక్ అర్థం కావడం లేదు' అని పవన కల్యాణ్ తెలిపారు. 'చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఇదే సరైన సమయం నేను ముఖ్యమంత్రి కావొచ్చని నేను అనుకోవచ్చు కదా? అలా అనుకుంటే అయిపోతామా అలా జరిగిపోతుందా?' అని ప్రశ్నించారు. తన విలువల సిద్ధాంతం అది కాదనేది గ్రహించాలని చెప్పారు. జైలుకు వెళ్తే తాను ఎదగనని.. శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతానని స్పష్టం చేశారు. 'సోషల్ మీడియా ద్వారా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. మేము కూడా ఎదురుదాడి చేస్తామని గుర్తుంచుకోవాలి' అని కొన్ని సోషల్ మీడియా, కొందరు ప్రముఖులకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
Also Read: YS Sharmila: పెట్రోల్ ధరల పెంపుపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ప్రధాని మోదీ లూటీదారుడు
టీడీపీతో జనసేన పార్టీకి ఏర్పడిన విబేధాలపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఒక కుటుంబం నడవాలంటే సర్దుకుంటూ వెళ్లాలని.. కూటమి మధ్య విభేదాలను చూసీచూడకుండా వెళ్లాలని జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీలో క్రమశిక్షణ కావాలని.. అలా అయితే కూటమిలో బలం రాదని గుర్తించాలని నాయకులకు సూచించారు. పార్టీ శ్రేణులపై పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. 'నాయకులకు పదవులు ఇస్తే ఉత్సాహంగా పనిచేస్తారనుకుంటే మాట్లాడడం మానేశరు. పదవులు ఇవ్వగానే అందరూ పెద్ద మనుషులు అయ్యారు. పదవుల కోసమే అయితే పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు' అని పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. కూటమి కోసం కొన్నిసార్లు తాను సర్దుకుంటామని.. ఇది ఐదు కోట్ల ప్రజల గురించి కొన్నిసార్లు భరిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
సమావేశానికి ముందు పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరంలో పర్యటించారు. గోదావరి నది పరిశుభ్రత, పరిరక్షణపై సమీక్ష చేశారు. గోదావరి పుష్కరఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. పుష్కరఘాట్ వద్ద ఏర్పాట్లు, ఫొటో ప్రదర్శన చూసి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పుష్కరఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోటులో ప్రయాణం చేశారు. గోదావరి నదిలో కాలుష్య నివారణకు ఘాట్ల వెంట తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు ఆదేశించారు. నల్లకాలువ వద్ద చెత్తశుద్ది ప్లాంటును బాగు చేయాలని చెప్పారు.
Harish Rao: పెట్రోల్, డీజిల్పై రేవంత్ రెడ్డి వ్యాట్ తగ్గించాలి.. హరీశ్ రావు లేఖ
Baddipadaga, Telangana:Harish Rao Letter: కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంటే రేవంత్ రెడ్డి వ్యాట్ను తగ్గించాలని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మాటలు దంచుడు కాదు రేవంత్ దమ్ముంటే ధరలు దించు అని సవాల్ చేశారు. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర పన్నుల భారం వెంటనే తగ్గించాలని కోరారు. పెరిగిన ఏడున్నర రూపాయల్లో రెండున్నర స్టేట్ వ్యాట్ ఉందని దానిని తగ్గించాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్లో కూల్ కూల్ వెదర్.. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం
'రూ.115 పెట్రోల్ ధరలో 35 శాతం స్టేట్ వ్యాట్, రూ.103 డీజిల్ ధరలో 27శాతం స్టేట్ వ్యాట్ ఉంది. ప్రజలపై నెలకు రూ. 162 కోట్లు, ఏటా రెండు వేల కోట్ల పన్నుల భారం పడుతోంది. మీది ప్రజా పాలన కాదు, పన్నుల దండుకునే ప్రజా పీడన పాలన. ఎన్నికల ముందు అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇప్పుడు స్టేట్ వ్యాట్ తగ్గించి ప్రజలకు మేలు చేయి' అని మాజీ మంత్రి హరీశ్ రావు హితవు పలికారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు లేఖ రాశారు.
Also Read: YS Sharmila: పెట్రోల్ ధరల పెంపుపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ప్రధాని మోదీ లూటీదారుడు
కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుంటే చోద్యం చూడటం ఆపి వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి.. ప్రజలకు ఉపశమనం కలిగించాలని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో రాష్ట్ర పన్నులు తగ్గించాలని గతంలో ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి నేడు అధికారంలో ఉండి ఎందుకు వ్యాట్ తగ్గించడం లేదని లేదని నిలదీశారు. ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు, దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి పెట్రోల్, డీజిల్ ధరలు దించాలని డిమాండ్ చేశారు.
మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు
వారంలో నాలుగు సార్లు ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోపితే.. రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజల నడ్డి విరిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన సాగు ఖర్చులు భరించలేక రైతులు సతమతమవుతుంటే.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు రైతుల పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా రంగం తీవ్ర సంక్షోభానికి లోను కావడంతో ద్రవ్యోల్బణం పెరిగి అన్ని వర్గాల ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
'పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, పన్నుల భారంతో పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు పొలం దున్నాలన్నా డీజిల్ భారం… సామాన్యుడు బైక్ తీయాలన్నా పెట్రోల్ భారం…ఆటో సోదరుడి బతుకు బండి నడవాలన్నా ఇంధన భారం.. పెరిగిన ధరలు ప్రజానీకానికి పెను శాపంగా మారింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు' అని తెలిపారు.
పైశాచిక ఆనందం
'పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ రేవంతు ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఖజానా నింపుకుంటూ సంబుర పడుతుంది. పైశాచిక ఆనందం పొందుతుంది. పెరిగిన ధరలతో ప్రతి నెలా రూ.162 కోట్లు, ఏడాదికి దాదాపు 2,000 కోట్ల అదనపు వ్యాట్ ఆదాయం వస్తుంట ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విడిచి పెట్టి ప్రచారాలకే పెద్ద పీట వేస్తున్నది' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు వ్యాట్పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి, రెండున్నరేళ్లుగా కేనీసం 0.1 శాతం వ్యాట్ కూడా తగ్గించకపోవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు. వెంటనే పెట్రోల్, డీజిల్పై కనీసం 10 శాతం వ్యాట్ తగ్గించి.. పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ పెంపుపై మొసలి కన్నీరు కార్చే రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ వ్యాట్ దోపిడీపై స్పందించాలని కోరారు.
CM Revanth Reddy: ఆస్తి కోసం సొంత చెల్లెళ్లను బయటకు గెంటేస్తున్నారు: తెలంగాణ సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:CM Revanth Reddy On KTR And YS Jagan: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై పరోక్ష విమర్శలు చేశారు. ఆస్తి కోసం సొంత చెల్లెళ్లను ఇంటి నుంచి బయటకు గెంటేశారని పేర్లను ప్రస్తావించకుండా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యల చేశారు.
తన రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాల్లోని ఆస్తి వివాదాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని రాజకీయ పరిణామాలు కుటుంబాలు, ఆస్తి పంపకాల చుట్టూనే తిరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
"సొంత చెల్లి కూడా భారమైందనుకుని, ఆస్తిలో వాటా అడుగుతుందనే భయంతో ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్న వైనాన్ని చూస్తున్నాం. ఆస్తి కోసం సొంత సోదరిని పంపించేస్తే.. ఆ తర్వాత అన్నపై ఆమె శాపనార్థాలు పెట్టే పరిస్థితులు నేటి రాజకీయాల్లో కనిపిస్తున్నాయి" అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పేరు చెప్పకపోయినా గురి ఎవరికో?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా నేరుగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు కానీ ప్రస్తావించలేదు. అయినప్పటికీ, గత కొంతకాలంగా వైఎస్ జగన్-షర్మిల మధ్య, అలాగే కేటీఆర్-కవితల మధ్య (ఆస్తి వివాదాలపై వస్తున్న వార్తల నేపథ్యంలో) నడుస్తున్న అంతర్గత పరిణామాలను దృష్టిలో ఉంచుకునే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత, కుటుంబ బలహీనతలను టార్గెట్ చేస్తూ రేవంత్ వేసిన ఈ పొలిటికల్ పంచ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
రేవంత్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో వేదికపై ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలు, మంత్రుల హావభావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబులు సీఎం పక్కనే ఉన్నారు. రేవంత్ రెడ్డి నేరుగా ఆస్తి వివాదాలు, చెల్లెళ్ల ప్రస్తావన తీసుకురావడంతో.. పక్కనే ఉన్న మంత్రులు ఈ వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో అని అక్కడున్న వారు ఎంతో ఆసక్తిగా చూశారు.
Also Read: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్..రేషన్ కార్డులను రద్దు చేస్తున్న ప్రభుత్వం..ఎందుకంటే?
Also Read: ఏపీ ప్రజలకు పిడుగులాంటి వార్త.. రాబోయే 3 గంటల్లో పిడుగులతో అల్లకల్లోలంగా వాతావరణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dharmendra Award: హేమమాలిని చేతికి ధర్మేంద్ర 'పద్మవిభూషణ్' అవార్డు..ప్రముఖుల ముందు వెక్కివెక్కి ఏడ్చిన కుటుంబం!
Hyderabad, Telangana:Dharmendra Padma Vibhushan: భారత చలనచిత్ర పరిశ్రమలో 'హీ-మ్యాన్' గా గుర్తింపు పొందిన దివంగత నటుడు ధర్మేంద్రకు దక్కిన అత్యున్నత పౌర పురస్కారం 'పద్మవిభూషణ్' వారి కుటుంబంలో తీవ్ర భావోద్వేగాలను నింపింది. ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డ్స్ 2026 ప్రధానోత్సవ వేడుకల్లో, ధర్మేంద్ర తరపున ఆయన భార్య, నటి హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ ప్రతిష్టాత్మక వేడుక కోసం హేమమాలిని తన చిన్న కుమార్తె అహానా డియోల్తో కలిసి లేత గులాబీ రంగు డిజైనర్ చీరలో హాజరయ్యారు. వేదికపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును స్వీకరించడానికి హేమమాలిని పేరు ప్రకటించగానే సభ అంతా చప్పట్లతో మారుమోగింది. ఆ సమయంలో ఆమె చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తూ, కళ్లల్లో నీళ్లతో వేదికపైకి నడిచారు. తండ్రిని గుర్తుచేసుకుంటూ కూతురు అహానా కూడా సదస్సులో కన్నీటి పర్యంతమైంది.
ఈ అవార్డు ప్రదానోత్సవానికి ముందు హేమమాలిని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ధర్మేంద్ర మరణానంతరం లభించిన ఈ గౌరవం తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. "ఇది నాకు మాటల్లో చెప్పలేనంత భావోద్వేగ క్షణం. నా వెంట అహానా వచ్చింది. ఈషా కూడా రావాలనుకుంది కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. ఈ గౌరవం పట్ల సన్నీ, బాబీలతో పాటు మా కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇది మా అందరికీ ఒక గొప్ప మరియు గర్వించదగ్గ క్షణం" అని ఆమె తెలిపారు.
పుట్టినరోజుకు కొన్ని వారాల ముందు..
భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ధర్మేంద్ర, తన 90వ పుట్టినరోజుకు కొన్ని వారాల ముందు, నవంబర్ 2025లో తన 89వ ఏట కన్నుమూశారు. దశాబ్దాల పాటు విభిన్న పాత్రలతో కోట్లాది మంది అభిమానులను అలరించిన ఆయన మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు మిగిల్చింది. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తరతరాలపై ఆయన చూపిన సాంస్కృతిక ముద్రను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ అవార్డును అందించింది.
దేశంలో అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'గా పరిగణిస్తారు. ఆ తర్వాత రెండో అత్యున్నత అవార్డుగా 'పద్మవిభూషణ్' నిలిచింది. ఈ పురస్కారాన్ని కళ, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సినిమా, ప్రజాసేవ వంటి రంగాల్లో విశిష్ట సేవలకు గానూ ఎంపిక చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 26కి ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు గ్రహీతల ఎంపికలను విడుదల చేస్తుంది.
ఈ ఏడాది వినోద రంగం నుండి ప్రకటించిన అవార్డులలో ధర్మేంద్రకు దక్కిన పద్మవిభూషణ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది ఆయన నటనకు మాత్రమే కాకుండా, భారతీయ సినిమాకు ఆయన అందించిన శాశ్వత వారసత్వానికి దక్కిన అసలైన గౌరవం అని బాలీవుడ్ అభిమానులు అంటున్నారు.
Also Read: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్..రేషన్ కార్డులను రద్దు చేస్తున్న ప్రభుత్వం..ఎందుకంటే?
Also Read: హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం.."నా ప్రపంచం ఇక శూన్యం" అంటూ ఎమోషనల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Rains: హైదరాబాద్లో చల్లబడిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం
Baddipadaga, Telangana:Sudden Rain In Hyderabad: వేసవికాలం కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండడంతో హైదరాబాద్ ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఎండి వేడిమితోపాటు ఉక్కపోతతో అలాడుతున్న హైదరాబాద్వాసులకు సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఊరట చెందారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఉదయం నుంచి ఎండలు మండుతూ ఉక్కపోతగా ఉండగా.. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వాతావరణం మారిపోయింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు ఎల్బీనగర్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, నాగోల్, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్, పెద్ద అంబర్పేట్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఈ భారీ వర్షంతో హైదరాబాద్ నగర ప్రజలు కాస్త ఉపశమనం పొందారు.
Also Read: YS Sharmila: పెట్రోల్ ధరల పెంపుపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ప్రధాని మోదీ లూటీదారుడు
మహబూబ్నగర్ జిల్లాలో..
భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం మహబూబ్నగర్ జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఈ వర్షంతో రైతులకు అపార నష్టం కలిగించింది. వర్షం ధాటికి ఎక్కడికక్కడ రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, మిడ్జిల్ మండలాలలో గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీస్తూ భారీ వర్షం కురవడంతో అపార నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షం కారణంగా జడ్చర్ల పట్టణంలో పలు కాలనీలు జలమయంగా మారి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన బలమైన గాలులు వీయడంతో జడ్చర్ల మార్కెట్ యార్డులో మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం ధాటికి భారీ వృక్షాలు రోడ్లపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ వర్షం ధాటికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై ఏర్పాటుచేసిన లక్షల రూపాయల విలువైన సోలార్ ప్యానల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మిడ్జిల్ మండలంలోని చేతికి వచ్చిన పంట పొలాల గాలి బీభత్సానికి నేలకొరిగాయి. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరిపోయాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో అపార నష్టాన్ని మిగిల్చింది.
Also Read: KKR vs DC: ఆఖరి మ్యాచ్లో కలకత్తాపై ఢిల్లీ విజయం.. ముగిసిన ఐపీఎల్ 2026 లీగ్ దశ
తడిసిన ధాన్యం
కామారెడ్డి జిల్లాలో ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలు తడిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లో ధాన్యం వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షానికి వరి ధాన్యం రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం తాటికి ధాన్యంపై కప్పిన కవర్లు ఎగిరిపోవడంతో ధాన్యం తడిసిపోయింది.
Rambha Father Death: హీరోయిన్ రంభ ఇంట్లో తీవ్ర విషాదం.."నా ప్రపంచం ఇక శూన్యం" అంటూ ఎమోషనల్!
Hyderabad, Telangana:Rambha Father Passed Away: తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన నటి రంభ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు హఠాత్తుగా కన్నుమూశారు. ఈ దుర్వార్తను రంభ స్వయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
"నాన్నా.. నా హృదయంలో నీ స్థానాన్ని ఇంకెవరూ భర్తీ చేయలేరు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నీ ముఖంపై చిరునవ్వును ఎప్పుడూ చెరిగిపోనివ్వలేదు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని విడిచి వెళ్లిపోవడంతో నా ప్రపంచం మొత్తం శూన్యమైపోయింది" అంటూ రంభ తన సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు ఆమె తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, రంభ కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు.
రంభ సినీ ప్రస్థానం
రంభ పక్కా తెలుగమ్మాయి. విజయవాడలో జన్మించిన ఆమె అసలు పేరు యూది విజయలక్ష్మి. తెలుగమ్మాయే అయినప్పటికీ, ఈమె హీరోయిన్గా మొదటి అవకాశం మాత్రం మలయాళ పరిశ్రమలో అందుకున్నారు. 1992లో వచ్చిన 'సర్గామ్' ఆమె తొలి చిత్రం.
తెలుగులో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాతో రంభ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టి, అందం, అభినయంతో కుర్రకారు మనసులు దోచుకున్నారు. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకున్నారు.
రంభ కెరీర్లోని కొన్ని సూపర్ హిట్ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయాయి. వాటిలో హిట్లర్, బావగారూ బాగున్నారా (చిరంజీవి), అల్లుడా మజకా (చిరంజీవి), అల్లరి ప్రేమికుడు (జగపతిబాబు), బొంబాయి ప్రియుడు (జెడి చక్రవర్తి), గణేష్ (వెంకటేష్), అరుణాచలం (రజనీకాంత్) వంటి సినిమాలతో రంభ అలరించింది.
హీరోయిన్గానే కాకుండా 'హలో బ్రదర్', 'దేశముదురు', 'యమదొంగ' వంటి భారీ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, బెంగాలీ, భోజ్పురి భాషల్లో నటించి మెప్పించింది హీరోయిన్ రంభ.
కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే రంభ 2010లో కెనడాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి కెనడాలో స్థిరపడ్డారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సినిమాలకు దూరమైనప్పటికీ, రంభ బుల్లితెరపై పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు టచ్లోనే ఉంటున్నారు. త్వరలోనే వెండితెరపైకి కూడా రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న తరుణంలో ఆమె ఇంట్లో ఈ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.
Also Read; Riddhi Kumar: పొట్టిపొట్టి బట్టల్లో ప్రభాస్ హీరోయిన్ అల్లాడిస్తుంది..కెవ్వుకేక అంతే!
Also REad: ఇంత అందంగా ఉన్నా.. వరుసగా 13 సినిమాల్లో నుంచి హీరోయిన్గా రిజెక్ట్ చేశారంట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Sharmila: పెట్రోల్ ధరల పెంపుపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ప్రధాని మోదీ లూటీదారుడు
Nuzendla, Andhra Pradesh:Petrol And Diesel Price Hike: 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లూటీదారు. దేశ ప్రజలను దోచడంలో మోడీని మించినోళ్లు లేరు. పెట్రోల్, డీజిల్ పేరుతో కేంద్ర ప్రభుత్వ దోపిడీ వాయిదాల పద్దతి. 10 రోజుల్లో వరుసగా నాలుగుసార్లు ఇంధనం ధరలు పెంచడం అత్యంత దారుణం' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రోజుకు రూ.వెయ్యి కోట్లు అదనపు భారం మోపుతున్నా మోడీ ఆకలి తీరలేదని ఇది సామాన్యుల సంపాదనను కాజేసి, పేదవారిని రోడ్డున పడేసి, దేశ ప్రజలకు బతుకు భారం చేసే కుట్ర' అని మండిపడ్డారు. ఇంధన సంక్షోభంపై సుంకాలు తగ్గించాల్సింది పోయి.. అదనంగా వడ్డించడం ప్రపంచ చరిత్రలో మోదీకే చెల్లిందని ఎద్దేవా చేశారు.
ఇంధనం ధరల భారం దృష్ట్యా ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ నిర్ణయాలు ప్రపంచానికి పాఠాలు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే ప్రజలపై మొత్తం భారం వద్దని.. పెరిగిన భారాన్ని మూడు భాగాలుగా చేసి, ఒక భారాన్ని ప్రభుత్వం, రెండో భారం ఆయిల్ కంపెనీలు, మూడో భారాన్ని ప్రజలపై అతి తక్కువగా వేశారు' అని వైఎస్ షర్మిల గుర్తుచేశారు. 'నేడు నష్టాల పేరు చెప్పి పూర్తి భారాన్ని ప్రజలపై రుద్దడం మోడీ దుర్మార్గపు పాలనకు నిదర్శనం. చమురు ధరలు తగ్గినప్పుడు లాభం పొంది.. ధరలు పెరిగాయని జనాలను దోచుకోవడం కేంద్ర ప్రభుత్వ నీచపు చర్యలకు అద్దం పడుతోంది' అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
'నాలుగోసారి పెరిగిన ధరలతో ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.19, డీజిల్ లీటర్ ధర రూ.104.88 పైసలకు చేరుకుంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు అధికం. రాష్ట్ర ప్రజలపై మోదీ సర్కార్ భరించలేని భారం మోపుతుంటే చంద్రబాబు మౌనం వహించడం సిగ్గుచేటు' అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. వ్యాట్ భారాన్ని తగ్గించాలని కోరుతున్నా పట్టింపు లేకపోవడం బాధాకరమని తెలిపారు. రాష్ట్రంలో అధికంగా వసూలు చేస్తున్న రూ.4 వ్యాట్, ఒక్క రూపాయి రోడ్డు సెస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇంధనం ధరలపై కొంత ఉపశమనం కల్పించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టగా.. ఏపీలో కూడా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. స్వయంగా ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమంలో షర్మిల పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ప్రొఫెసర్ నాగేశ్వర్పై స్పందన
మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్పై జనసేన పార్టీ నాయకులు చేస్తున్న దాడి.. కేసులపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. 'ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసులు పెట్టి వేధించడం దారుణం. ఇది కూటమి ప్రభుత్వానికి తగదు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాక కూడా కేసులు బనాయించడం సరికాదు. ఇది కక్ష్య పూరిత ధోరణికి నిదర్శనం' అని తెలిపారు. తక్షణం నాగేశ్వర్ గారిపై పెట్టిన కేసులు ఎత్తి వేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Telangana Ration Cards: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్..రేషన్ కార్డులను రద్దు చేస్తున్న ప్రభుత్వం..ఎందుకంటే?
Hyderabad, Telangana:Telangana Ration Card Cancellation: తెలంగాణలో అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నెలకు రూ.50 వేల నుండి రూ.2 లక్షల వరకు జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అధిక ఆదాయం ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గతంలో కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ తల్లిదండ్రుల కార్డుల్లోనే కొనసాగడం వల్ల వారి వివరాలు బయటకు రాలేదు. కానీ, ఇటీవల తల్లిదండ్రుల నుండి విడిపోయి ప్రత్యేకంగా కొత్త కార్డులు పొందడంతో, డేటా విశ్లేషణ ద్వారా వీరి అసలు ఆదాయ వివరాలు బహిర్గతమయ్యాయి. తప్పుడు సమాచారంతో ఇన్నాళ్లూ ప్రభుత్వ సబ్సిడీలను, పథకాలను పొందుతున్న ఇలాంటి వారి కార్డులను పౌరసరఫరాల శాఖ వెంటనే రద్దు చేస్తోంది.
ఎవరి రేషన్ కార్డులు కట్ అవుతాయి?
ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం కింది అర్హతలు దాటిన వారి రేషన్ కార్డులను అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం రద్దు చేస్తున్నారు. ఏడాదికి రూ.6 లక్షల కన్నా ఎక్కువగా ఆదాయం ఉన్నవారు.. అలాగే ప్రతిఏటా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో 3.20 ఎకరాల కంటన్నా ఎక్కువ భూమి (మాగాణి) లేదా 7.20 ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్న వారికి కూడా రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ముమ్మర తనిఖీలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఆధార్ లింకేజ్, ఐటీ రిటర్న్స్ ఆధారంగా అనుమానిత అకౌంట్లను స్క్రీనింగ్ చేస్తున్నారు. అర్హులైన పేద ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తూనే, వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ల్యాండ్ లార్డ్స్, ఐటీ పన్ను చెల్లింపుదారుల రేషన్ కార్డులను పూర్తిగా తొలగిస్తున్నారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Also Read: ఏపీ ప్రజలకు పిడుగులాంటి వార్త.. రాబోయే 3 గంటల్లో పిడుగులతో అల్లకల్లోలంగా వాతావరణం!
Also Read: విద్యార్థులకు బిగ్ అలర్ట్..మే 31తో వేసవి సెలవులు ముగింపు..జూన్ 1 నుంచి క్లాసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Thunders Alert: ఏపీ ప్రజలకు పిడుగులాంటి వార్త.. రాబోయే 3 గంటల్లో పిడుగలతో అల్లకల్లోలంగా వాతావరణం!
Vijayawada, Andhra Pradesh:AP Thunder Rain Alert: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాలులు ఒక్కసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భానుడి అగ్నిప్రవేశంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఉన్న దాదాపు 174 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కును దాటేశాయి.
ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాల మండలంలో రికార్డు స్థాయిలో 48.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీనితో పాటు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సైతం 48.1 డిగ్రీల మేర ఎండ తీవ్రత నమోదైంది. రాబోయే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఇవే పరిస్థితులు కొనసాగుతాయని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు స్పష్టం చేశారు.
అకస్మాత్తుగా మారిన వాతావరణం
తీవ్రమైన ఎండల నడుమే రాష్ట్రంలో వాతావరణం అకస్మాత్తుగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఈ వర్షాలతో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిస్థితి తీవ్రతను బట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ప్రఖర్ జైన్ ప్రజలకు కీలకమైన హెచ్చరికలు జారీ చేశారు.
"బలమైన ఈదురు గాలులు వీచే సమయంలో రోడ్లపై ప్రయాణించే వారు, బయట ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. చెట్లు, విద్యుత్ స్తంభాలు (పోల్స్), భారీ హోర్డింగ్స్ క్రింద అస్సలు నిలబడరాదు. పిడుగుపాటు ప్రమాదం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో ఉండటం సురక్షితం కాదు. పశువుల కాపరులు, రైతులు, కూలీలు పొలాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి" అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అన్నారు.
ప్రస్తుత విపత్కర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, అటు వడగాలుల నుండి, ఇటు పిడుగుపాటు మరియు ఈదురు గాలుల నుండి ప్రజలు తమను తాము కాపాడుకోవాలని, ప్రభుత్వ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.
Also Read: ఇలా చేస్తే 172 లీటర్ల పెట్రోల్ పూర్తిగా ఉచితం..వాహనదారులు ఎగిరి గంతేసే వార్త!
Also Read: విద్యార్థులకు బిగ్ అలర్ట్..మే 31తో వేసవి సెలవులు ముగింపు..జూన్ 1 నుంచి క్లాసులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Investment Plan: నెలకు రూ. 2వేల పొదుపు.. 30ఏళ్లలోనే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్..!!
Lakshmapur, Telangana:SIP vs PPF Wealth Calculation: డబ్బు ఆదా చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అందుకే చాలా మంది డబ్బులు పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎంత ఎందులో పెట్టుబడి పెట్టాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే మార్కెట్లో మనకు చాలా పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రిస్క్ ఉన్న వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్, రిస్క్ లేకండా మంచి రాబడి అందించేవి అయితే పీపీఎఫ్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ లో చాలా వరకు సిప్ ఇన్వెస్ట్ మెంట్ పై ఆసక్తి ఉంటుంది. ఇక్కడ ఆర్థిక క్రమశిక్షణతో నెలనెలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెడుతుంటే.. దీర్ఘకాలంలో మంచిరాబడిని ఆశించవచ్చు. అంతేకాదు పీపీఎఫ్ స్కీములో ఆర్దిక సంవత్సరంలో కనీసం రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక్కడ 7.10 శాతం వడ్డీ రేటు తోపాటు గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. రెండింటిలోనూ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా కాలం గడుస్తున్నా కొద్దీ మీ సంపద పెరుగుతూనే ఉంటుంది.
మీరు ప్రతి నెలా రూ. 2,000 పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే... దీర్ఘకాలంలో ఏ పెట్టుబడి విధానం పెద్ద మొత్తాన్ని సృష్టించగలదు? సుమారు 30 సంవత్సరాల సుదీర్ఘ పెట్టుబడి కాలపరిమితితో చూస్తే.. ఈ రెండు పెట్టుబడి విధానాల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. పూర్తి లెక్కను తెలుసుకుందాం.
పిపిఎఫ్ లో పెట్టుబడి పెట్టడానికి.. ఒక వ్యక్తి నెలకు రూ. 2,000 లేదా సంవత్సరానికి రూ. 24,000 జమ చేయాల్సి ఉంటుంది. పీపీఎఫ్ ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పెట్టుబడిని 30 సంవత్సరాల పాటు కొనసాగిస్తే.. మొత్తం డిపాజిట్ రూ. 720,000 అవుతుంది. దీని ద్వారా వడ్డీ రూపంలో సుమారుగా రూ. 17,52,146 లభించవచ్చు. అందువల్ల.. 30 సంవత్సరాల తర్వాత, మొత్తం మెచ్యూరిటీ మొత్తం సుమారుగా రూ. 24,72,146కి పెరుగుతుంది. మరోవైపు.. ఒక వ్యక్తి ప్రతి నెలా రూ. 2000 సంపాదిస్తే SIP అతను 30 సంవత్సరాల పాటు కొనసాగితే, అతని మొత్తం పెట్టుబడి రూ. 720,000 గానే ఉంటుంది. అయితే, 12శాతం అంచనా వార్షిక రాబడితో.. ఈ పెట్టుబడి సుమారుగా రూ. 5441,946 వడ్డీని అందిస్తుంది. ఫలితంగా మొత్తం మెచ్యూరిటీ మొత్తం సుమారుగా రూ. 6161,946 కు చేరుకునే అవకాశం ఉంటుంది.
Also Read: దేనిలో అత్యుత్తమ రాబడి వస్తుంది?.. గుడ్డిగా పెట్టుబడి పెడితే మునిగిపోవడం ఖాయం..!!
రెండింటిలో ఏది బెస్ట్ అంటే.. పీపీఎఫ్ అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే దాని భద్రత అని చెప్పాలి. ఇది ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం కాబట్టి.. మార్కెట్ ఒత్తిడికి లోనుకాదు. అంతేకాకుండా.. పీపీఎఫ్పై వచ్చే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది. అందుకే తక్కువ రిస్క్ తీసుకునే స్వభావం ఉన్న పెట్టుబడిదారులు.. సురక్షితమైన పెట్టుబడులను కోరుకునేవారు ఈ పెట్టుబడి ఎంపికను ఇష్టపడతారు.
ఇక SIP అనేది మార్కెట్తో ముడిపడి ఉన్న ఒక పెట్టుబడి విధానం.. దీనిలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెడతారు. SIPలలో రాబడులు స్థిరంగా ఉండవు. కానీ దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్ మెరుగైన వృద్ధిని అందించగలదు. దీర్ఘకాలిక సంపద సృష్టికి SIP ఒక బలమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం పాటు మార్కెట్ హెచ్చుతగ్గులను తట్టుకోగల యువ పెట్టుబడిదారులకు SIP ఒక మంచి ఎంపికగా ఉంది. అయితే.. ఇందులో మార్కెట్ రిస్క్ ఉంటుంది. రాబడులు పూర్తిగా మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటాయి. సురక్షితమైన, స్థిరమైన రాబడులను కోరుకునే వారికి PPF ఒక మంచి ఎంపిక అని చెప్పాలి. ఇది నష్టపోయే ప్రమాదాన్ని తొలగించడంతోపాటు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే.. PF రాబడులు SIP రాబడుల కంటే తక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPF vs PPF vs NPS vs SIP: దేనిలో అత్యుత్తమ రాబడి వస్తుంది?.. గుడ్డిగా పెట్టుబడి పెడితే మునిగిపోవడం ఖాయం..!!
Lakshmapur, Telangana:EPF vs. PPF vs. NPS vs. SIP: మనదేశ జనాభాలో అధిక శాతం మంది ఉద్యోగాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వారు తమ నెలలవారీ ఆదాయం నుంచి కొంత డబ్బు ఆదా చేసి.. తమ కుటుంబ భవిష్యత్తుకోసం ఏదొక పెట్టుబడి సాధనంలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. చాలా మందిలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. రాబడి పరంగా పెట్టుబడి ఎక్కడ అత్యంత లాభదాయకంగా, ఉత్తమంగా ఉంటుందని. అలాంటి వారి కోసం 4 ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPF), 2వది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), 3వది నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ (NPS), 4వది సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP). మీ జీతం, రిటైర్మెంట్ ప్లాన్ ఆధారంగా ఇందులో ఏదైనా ఎంచుకోవచ్చు. ప్రతి స్కీముకు తన స్వంత ప్రయోజనాలు, లాభాలు ఉన్నాయి. అయితే ఈ నాలుగింటిలో ఏది బెస్ట్. ఎందులో ఇన్వెస్ట్ చేయాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
PPF ఎవరికి బెస్ట్?
దీర్ఘకాలం పాటు పన్ను రహితంగా పొదుపు చేయాలనుకునే సంప్రదాయ పెట్టుబడిదారులకు PPF బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో చిన్న మొత్తాలను కూడా సులభంగా ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని అందిస్తుంది. ఈ స్కీము ప్రస్తుతం 7.1శాతం వడ్డీతో కూడిన రాబడిని అందిస్తుంది.
వార్షిక పెట్టుబడి: రూ. 1,50,000
కాల వ్యవధి (సంవత్సరాలలో): 30
వడ్డీ రేటు: 7.10శాతం
పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ. 45 లక్షలు
ఆర్జించిన వడ్డీ: రూ. 1.09 కోట్లు
మెచ్యూరిటీ విలువ: రూ. 1.54 కోట్లు
రిటైర్మెంట్ కోసం బెస్ట్ NPS ఏది?
ఎన్పిఎస్ ఈక్విటీ, డెట్ రెండింటిని అందిస్తుంది. ఎక్కువ మొత్తంలో రిటైర్మెంట్ ఫండ్ నిర్మించుకునేందుకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. అంతేకాదు పాత పన్ను విధానం కింద అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
పెట్టుబడిపై ఆశించిన రాబడి: 10శాతం
ప్రస్తుత వయస్సు: 30 సంవత్సరాలు
పదవీ విరమణ వయస్సు: 60 సంవత్సరాలు
యాన్యుటీ కొనుగోలు శాతం: 40శాతం
యాన్యుటీ నుండి ఆశించిన రాబడి: 8శాతం
పెన్షన్ ఆస్తులు: రూ. 2,84,91,567
పెట్టుబడి మొత్తం: రూ. 45,00,000
ఏకమొత్తంగా విత్ డ్రా చేసుకుంటే: రూ. 1,70,94,940
వార్షిక చెల్లింపు విలువ: రూ. 1,13,96,627
నెలవారీ పింఛను మొత్తం: రూ. 56,000
EPF ఎవరికి బెస్ట్?
EPF అనేది భారతీయ ఉద్యోగుల కోసం ఒక తప్పనిసరి పదవీ విరమణ పొదుపు పథకం. దీనిని EPFO నిర్వహిస్తుంది. ఇందులో ఉద్యోగి నెలవారీ మూల వేతనం ఆధారంగా, ఉద్యోగి, యజమాని ఇద్దరూ 12శాతం చొప్పున వాటా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం, ఇది 8.25శాతం రాబడిని అందిస్తుంది. నిర్దిష్ట సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన తర్వాత పన్ను రహితంగా మారుతుంది. ఈ పథకంలోని ఒక తెలివైన అంశం ఏమిటంటే, ఇది ఉద్యోగులు తమ వాటాలను పెంచుకోవడానికి కూడా అనుమతిస్తుంది. ఐచ్ఛిక పొదుపు పథకమైన వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) ద్వారా దీనిని చేయవచ్చు. ఇది ఉద్యోగులు తమ EPFకి తప్పనిసరి అయిన 12శాతం కంటే ఎక్కువ వాటా చెల్లించడానికి అనుమతిస్తుంది.
నెలవారీ మూల వేతనం: రూ. 50,000
వయస్సు: 30 సంవత్సరాలు
వార్షిక జీతం పెరుగుదల: 5శాతం
రాబడి: 8.25శాతం
60 ఏళ్ల వయస్సులో అంచనా వేయబడిన కార్పస్ విలువ: రూ. 2.6 కోట్లు
SIP ఎవరికి ఉత్తమమైనది?
దీర్ఘకాలంలో మార్కెట్తో ముడిపడిన బలమైన రాబడులను సంపాదించాలనుకునే, తక్కువ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారులకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (SIPలు) ఉత్తమమైనవి. మ్యూచువల్ ఫండ్లలో ప్రతి నెలా ఒక స్థిరమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టడానికి ఇది అత్యంత క్రమబద్ధమైన మార్గం. అంతేకాకుండా, SIPలు చాలా సౌకర్యవంతమైనవి. మీరు మీ పెట్టుబడి మొత్తాన్ని ఎప్పుడైనా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు లేదా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
నెలవారీ పెట్టుబడి: రూ. 12,500
కాల వ్యవధి (సంవత్సరాలలో): 30
అంచనా వేయబడిన వార్షిక రాబడి: 12శాతం
పెట్టుబడి పెట్టిన మొత్తం: రూ.45,00,000
మొత్తం అంచనా రాబడి: రూ. 4,21,24,013
అంచనా వేయబడిన మెచ్యూరిటీ మొత్తం: సుమారు రూ. 4.66 కోట్లు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Top 5 Upcoming SUV Cars: SUV మార్కెట్కు కొత్త కింగ్స్.. Maruthi నుంచి Hyundai వరకు రోడ్లపై దుమ్మురేపడానికి వస్తున్న TOP 5 Mass Cars ఇవే!
Lakshmapur, Telangana:Top 5 Upcoming SUV Cars: దేశీయ మార్కెట్లో SUVలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. కాబట్టి రాబోయే ప్రధాన లాంచ్లలో చాలా వరకు ఈ విభాగంలోనే ఉంటాయి. అంతేకాకుండా, మొత్తం కార్ల అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా పెరుగుతూనే ఉన్నందున, ఈ లాంచ్లలో EV మోడళ్లు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం భారతదేశంలో మారుతి సుజుకి, మహీంద్రా, టాటా, హ్యుందాయ్, కియా విడుదల చేసిన టాప్ ఐదు మోడళ్లను చూద్దాం.
మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్:
మారుతి సుజుకికి రాబోయే సంవత్సరం చాలా బిజీగా ఉండబోతోంది. ఈ కంపెనీ మిడ్-లైఫ్ ఫేస్లిఫ్ట్లు, కొత్త తరం వెర్షన్లు, సరికొత్త మోడళ్లతో సహా అనేక మోడళ్లను విడుదల చేయనుంది. వీటిలో బాలెనో ఫేస్లిఫ్ట్, కొత్త తరం వాగన్ఆర్, సరికొత్త మూడు వరుసల SUV ఉంటాయి. అయితే, అత్యంత ముఖ్యమైన లాంచ్ బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ కూడా ఉండబోతున్నట్లు సమాచారం. మారుతి సుజుకి SUV మార్కెట్లో తన వాటాను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ ప్రత్యేకంగా ముఖ్యమైనది. టాటా నెక్సాన్ నుండి ఉన్న తీవ్రమైన పోటీ కారణంగా బ్రెజ్జా అమ్మకాలు తగ్గాయి. కొత్త బ్రెజ్జా ఖచ్చితంగా కొత్త కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. SUV మార్కెట్లో మారుతి సుజుకి తన వాటాను పెంచుకోవడానికి సహాయపడుతుంది. 2026 బ్రెజ్జాలో బాహ్య అంతర్గత డిజైన్ మార్పులు, కొత్త ఫీచర్లు, టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్లిఫ్ట్:
భారత ఆటో మొబైల్ మార్కెట్లో మహీంద్రా అత్యధికంగా అమ్ముడయ్యే మూడు-వరుసల SUV కార్లలో స్కార్పియో ఎన్ ఫేస్లిఫ్టెడ్ వెర్షన్ ఒకటిగా నిలిచింది. ఈ SUV ఫేస్లిఫ్టెడ్ వెర్షన్ ఈ సంవత్సరం రెండవ లేదా మూడవ త్రైమాసికంలో విడుదల కానుంది. స్కార్పియో ఎన్ దాని రగ్గడ్ లుక్స్కు ప్రసిద్ధి చెందింది. మహీంద్రా దాని డిజైన్లో కొన్ని చిన్న మార్పులు చేస్తూ, ఈ ప్రత్యేకమైన శైలిని కొనసాగిస్తుందని చెప్పాలి. ఫీచర్లు పెరిగే అవకాశం ఉంది. కానీ ఈ ఎస్యూవీ ఇంజన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పు ఉండదు. మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్లిఫ్ట్, హ్యుందాయ్ అల్కాజర్, ఎంజి హెక్టర్ ప్లస్లకు పోటీగా నిలవనుంది.
టాటా సియెర్రా EV:
టాటా గతేడాది సియెర్రా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE) వెర్షన్ను విడుదల చేసింది. ఇప్పుడు, ఆ కంపెనీ ఈ SUV EV వెర్షన్ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.టాటా సియెర్రా.ఈవీ, 2027 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో విడుదల కానుంది. ఇప్పటి వరకు, చాలా టాటా ఈవీలు వాటి ఐసీఈ వెర్షన్ల మాదిరిగానే డిజైన్ను కలిగి ఉన్నాయి. సియెర్రా ఇప్పటికే వినియోగదారులకు ఒక ప్రముఖ ఎంపికగా ఉంది. కాబట్టి సియెర్రా.ఈవీ కూడా కొన్ని చిన్న ఈవీ-నిర్దిష్ట మార్పులతో అదే విధమైన డిజైన్ను కలిగి ఉంటుందని ఆశించవచ్చు. ఇది ఐసీఈ వెర్షన్ల అనేక ఫీచర్లను కూడా పంచుకోవచ్చు.టాటా సియెర్రా EV ఒకే ఛార్జ్పై సుమారు 500 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుందని అంచనా. ఇది మహీంద్రా BE 6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ మారుతి సుజుకి ఇ-విటారాలకు పోటీగా నిలుస్తుంది.
హ్యుందాయ్ కాంపాక్ట్ EV:
హ్యుందాయ్ ఈ సంవత్సరం రెండు కొత్త SUVలను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. వాటిలో ఒకటి ICE-పవర్డ్ మిడ్-సైజ్ SUV కాగా, మరొకటి దేశీయంగా తయారు చేసిన ఎలక్ట్రిక్ SUV. ఈ కార్ల తయారీ సంస్థ వద్ద ఇప్పటికే క్రెటా అనే మిడ్-సైజ్ SUV ఉంది, ఇది దాని సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్. రెండవ మిడ్-సైజ్ SUV రాక అమ్మకాలను ఖచ్చితంగా పెంచుతుంది. అయితే, హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకోలేకపోయినందున, దాని కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV అందరి దృష్టిని ఆకర్షించనుంది. కంపెనీ వద్ద క్రెటా ఎలక్ట్రిక్ అయోనిక్ 5 ఉన్నప్పటికీ, వాటి అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. హ్యుందాయ్ కాంపాక్ట్ ఎస్యూవీ, టాటా నెక్సాన్ ఈవీ మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ ఈవీలకు పోటీగా నిలవనుంది.
కియా సెల్టోస్ EV:
సైరోస్ ఐసిఇ వెర్షన్ దేశీయ మార్కెట్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికీ, సైరోస్ ఈవీ మెరుగ్గా రాణిస్తుందని మేము ఆశిస్తున్నాము. ఇప్పటివరకు, భారత మార్కెట్లో కియా ఎలక్ట్రిక్ వాహనాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ మోడళ్లు ఇంధన సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, వాటి ఊహించిన దానికంటే అధిక ధర అమ్మకాలను పరిమితం చేసింది. సైరోస్ EV భారతదేశంలో కియా అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ మోడల్ కానుంది. ఇది టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO EV రాబోయే హ్యుందాయ్ కాంపాక్ట్ EV లకు పోటీగా నిలుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Silver Rate Today: వారం రోజులుగా ఒడిదుడుకులు.. భారీగా తగ్గిన వెండి.. నేడు మే 25వ తేదీ ధరలివే..!!
Lakshmapur, Telangana:Silver Rate Today: అమెరికా ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వెండి ధర ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రస్తుతం ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 2,71,000గా ఉంది. అయితే ఎంసీఎక్స్ లో ఈ ఉదయం వరకు వెండి ధర 0.09శాతం అంటే రూ. 246 మేర తగ్గి, కిలోకు రూ. 2,71,600 వద్ద ఉంది. గత ట్రేడింగ్ రోజున ఇది కిలోకు రూ. 2,71,846 వద్ద ముగిసింది. జనవరి 29న వెండి ఫ్యూచర్ ధర కిలోకు రూ. 4,20,048 వద్ద రికార్డు స్థాయిలో ఉండటం గమనార్హం. గుడ్రిటర్న్స్ ప్రకారం వెండి ధర కిలోకు రూ. 2,85,000గా ఉంది. కాగా, ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, సోమవారం ఉదయం వరకు ఇది కిలోకు రూ. 2,67,433గా ఉంది.
అమెరికా-ఇరాన్ చర్చల నుంచి వచ్చిన తొలి సానుకూల సంకేతాల తర్వాత విలువైన లోహాల కొనుగోళ్లు తగ్గాయి. అయితే, హోర్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. శుక్రవారం జాతీయ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్లో వెండి ధరలు కిలోగ్రాముకు రూ. 2.71 లక్షల వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ సుమారు ఒక శాతం తగ్గి ఔన్సుకు $75.87కు చేరుకుంది.బలహీనమైన స్పాట్ డిమాండ్, వ్యాపారులు చేసే లావాదేవీల పరిమాణం తగ్గడం వల్ల శుక్రవారం ఫ్యూచర్స్ ట్రేడ్లో వెండి ధరలు తగ్గాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో జూలై డెలివరీ వెండి కాంట్రాక్ట్ ధర కిలోకు రూ. 1,883 లేదా 0.69 శాతం తగ్గి రూ. 2.73 లక్షలకు పడిపోయింది. ప్రపంచ మార్కెట్లో కూడా వెండిపై ఒత్తిడి కనిపించింది. న్యూయార్క్ మార్కెట్లో వెండి ధరలు 0.53 శాతం తగ్గి ఔన్సుకు $76.26కు పడిపోయాయి. మార్కెట్ నిపుణుల ప్రకారం, పెట్టుబడిదారులు అమ్మకాలు జరపడం వల్లే వెండి ఫ్యూచర్స్ ధరలు బలహీనపడ్డాయి.
మరోవైపు, హోర్ముజ్ జలసంధి గుండా జరిగే సముద్ర వాణిజ్యం ఎలాంటి అదనపు సుంకాలు లేకుండా కొనసాగాలని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రాథమిక పురోగతి సాధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సూచించారు. అయినప్పటికీ, ఈ చర్చలలో హోర్ముజ్ జలసంధి ఒక ప్రధాన సవాలుగా మిగిలి ఉందని ఆయన అంగీకరించారు. ఈ కారణంగానే మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
