రీళ్ల కోసం రోడ్డుపై బైకు స్టంట్, ఓ యువకుడు మృతి, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు
Hayathnagar_Khalsa, Telangana:సోషల్ మీడియాలో లైక్స్ కోసం విన్యాసాలు చేస్తున్న యువకులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు, నిన్న సాయంత్రం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పేట్ సమీపంలోని జాతీయ రహదారిపై ఇద్దరు యువకులు వర్షంలో తడుస్తూ బైక్ బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.విజయవాడ జాతీయ రహదారిపై పనులు కొనసాగుతుండగా, జాతీయ రహదారిపై ఉన్న వన్ లైన్ మరమ్మతుల కోసం తెరిచి ఉంచారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
రూ.450 కోట్ల అవినీతి.. ఖండించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
Mancherial, Telangana:Prem Sagar Rao: రూ.450 కోట్ల బకాయిలను అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే చెల్లించడంతో తీవ్ర అవినీతి ఆరోపణలు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై వచ్చాయి. ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఎట్టకేలకు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందించారు. ఈ సందర్భంగా అవినీతి ఆరోపణలను ఖండించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ దిన పత్రికలో వచ్చిన కథనాలను ఖండిస్తున్నట్లు చెప్పారు.
'నేను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. నాపై ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజా ప్రతినిధులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టను. త్వరలో కుట్రలు అన్ని బయటకు వస్తాయి' కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు చర్చలకు రావాలని సవాల్ చేశారు. 'నేను రూ.450 కోట్లు వాడుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదు. 2009-10లో బ్యాంక్ రూ.450 కోట్లు మంజూరు చేసింది. సాయినాథ్ ప్రయివేట్ లిమిటెడ్పై, భాగ్యనగర్ హోటల్స్ పేరుమీద బ్యాంక్ రుణం తీసుకున్నాం. రాష్ట్రవ్యాప్తంగా నేను 15 స్కూల్స్ కట్టించా' అని ప్రేమ్ సాగర్ రావు వివరించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా తాను అధికార దుర్వినియోగం చేయలేదని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. 'ఇసుక, భూమి తీసుకోవాలనుకుంటే అప్పుడే తీసుకునే వాణ్ణి. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న, పత్రికలపై లీగల్ యాక్షన్ తీసుకుంటా' అని ప్రకటించారు. తాను ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేయనని.. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నేను భూమి, ఇసుక, మట్టి మాఫియా చేయలేదని పేర్కొన్నారు.
'యూఎస్ ట్రేడింగ్ డౌన్ అయిన తర్వాత నేను రూ.160 కోట్లు నష్టపోయా. నిజానిర్ధారణ కమిటీ వేస్తే కమిటీ ముందు పూర్తి ఆధారాలు చూపిస్తా. రూ.450 కోట్లు అవినీతి చేస్తే బ్యాంక్ రూ.109 కోట్లకు ఎలా ఆక్షన్ వేస్తుంది?' అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రశ్నించారు. సాంక్షన్ ఆర్డర్స్ నేను క్రేయేట్ చేసినవి కాదని తెలిపారు. తమ ఆదిలాబాద్ జిల్లా నేతలు తనపై కుట్ర చేశారని ఆరోపించారు. మంత్రి పదవి చర్చ వచ్చిన ప్రతీ సారి ఇలాంటి వార్తలు వస్తున్నాయని.. తనపై వచ్చిన ఆరోపణలపై ఎక్కడ చర్చకు అయినా సిద్దమేనని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రకటించారు.
YS Sharmila: ‘విధ్వంసం నుంచి మరింత అగాధంవైపు చంద్రబాబు పాలన‘: వైఎస్ షర్మిల
Vijayawada, Andhra Pradesh:YS Sharmila vs Chandrababu: అబద్ధాన్ని అందంగా చెప్పడంలో సీఎం చంద్రబాబు చంద్రబాబు ఘనాపాటి. రెండేళ్ల పాలనపై కూటమి ప్రోగ్రెస్ రిపోర్టు ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్. ప్రగతి నివేదిక కాదది.. పూర్తిగా గతి తప్పిన నివేదిక‘ అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నాలుగు సూత్రాల పాలన అపహాస్యం.. అభివృద్ధి బూటకం.. సంపద సృష్టి మోసం.. అని ప్రకటించారు. ‘సమతుల్యత పచ్చి అబద్ధం. సంక్షేమం టోకరా. విధ్వంసం నుంచి మరింత అగాధంవైపు.. అధిక అప్పుల నుంచి ఇంకాస్త అంధకారం వైపు. ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రగతి నివేదిక‘ అని వైఎస్ షర్మిల అభివర్ణించారు.
‘రెండేళ్ల కూటమి పాలన 24 మోసాల మయం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్. ఎన్నికల హామీలకు పంగనామాలు. మ్యానిఫెస్టోకి మంగళం’ అని చంద్రబాబు వైఫల్యాలను వైఎస్ షర్మిల ఏకరువు పెట్టారు. ‘అమలు చేశామని చెప్పే పథకాలు అరకొర. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన బెట్టి, చెల్లని రూపాయితో చిల్లు రాజకీయం తప్పా రెండేళ్లుగా చంద్రబాబు ఉద్ధరించింది శూన్యం. అందుకే బాబు షూరిటీ - భవిష్యత్ కి లేదిక గ్యారెంటీ‘ అని షర్మిల విమర్శించారు.
‘భరోసా పేరుతో సగానికి సగం పెన్షన్లలో కోతలు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని మాట తప్పారు. 3 వేల నిరుద్యోగ భృతి, లేదా 20 లక్షల ఉద్యోగాలు అంటూ 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకి 15 వందలు ఇస్తామని 2 కోట్ల మంది మహిళలను నమ్మించి నయవంచన చేశారు‘ అని వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. ‘దీపం పథకం రాష్ట్రంలోని సగం కుటుంబాలకే పరిమితం చేస్తే, గొప్పలు చెప్పుకుంటున్న సుఖీభవ పథకం కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. ఇచ్చేదాంట్లో కేంద్రంతో సంబంధం లేకుండా అని మాట మార్చారు. 20 వేలు ఇస్తామని పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో అన్యాయంగా లింక్ పెట్టారు‘ అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
‘ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అన్ని రూ.15 వేలు అని హామీ ఇచ్చి.. 20 లక్షల మంది బిడ్డలకు దారుణ మోసం చేస్తున్నారు. ఇస్తున్న వారికి రూ.2 వేలు చొప్పున తగ్గించి ఎన్నికల్లో హామీని గాలిలో కలిపారు. ఆరోగ్యశ్రీ కి రూ.4 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి రూ.10 వేల కోట్లు బకాయిలు పెట్టి, రూ.6 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకోవడం కూటమి సర్కారుకే చెల్లింది‘ అని చంద్రబాబు మోసాలను వైఎస్ షర్మిల వివరించారు.
రూ.32 వేల కోట్ల మేర సబ్సిడీలు విద్యుత్ కింద ప్రజలకు ఇస్తే మరి 15 వేల కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని ఎందుకు మోపినట్లు? కూటమి ప్రభుత్వాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రూ.12 వందల కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడితే, రాష్ట్ర రైతాంగం పండించిన పంటలను రూపాయికి అమ్ముకోలేక చెత్తకుప్పలో ఎందుకు పారబోసినట్లు? నిలదీశారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి పరుగులు పెడితే, అభివృద్ధిలో అట్టడుగున అప్పుల్లో ప్రథమ స్థానంలో ఎందుకున్నట్లు? అని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల కడిగి పారేశారు. ‘తలసరి ఆదాయం పెంచడం పక్కన పెడితే గత 12 ఏళ్లుగా తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలిసి ఒక్కో తలపై పెట్టిన అప్పు సరాసరి రూ.2 లక్షలు‘ అని షర్మిల వెల్లడించారు. ‘2024-26 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గసాధించిన ప్రగతి మళ్లీ అరచేతిలో వైకుంఠమే. పెట్టుబడుల పేరుతో జిమ్మిక్కులే. అమరావతి ముసుగులో మాయాజాలమే. అభివృద్ధి అజెండాతో మరో 3 లక్షల కోట్ల అప్పులే. ఎన్నికల హామీల పేరుతో మాటల గారడీలే. ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి శ్వేతపత్రం‘ అని చంద్రబాబు రెండేళ్ల రిపోర్ట్ పై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు చేశారు.
Plastic Notes In India: మార్కెట్లోకి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..చలామణీ ఎప్పటినుంచి అంటే?
Mumbai, Maharashtra:Plastic Notes In India News: ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న కాగితపు కరెన్సీ నోట్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సన్నాహాలు చేస్తోంది. ఈ నూతన విధానంపై ప్రజల్లో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టమైన ప్రకటన చేశారు.
ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి?
ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలిపారు. ఆయన ప్రకటనను బట్టి 2027 ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఈ ప్లాస్టిక్ నోట్లు మార్కెట్లోకి వచ్చే సూత్రప్రాయమైన ప్రణాళిక ఉంది. అయితే, ఇది ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉందని, ఈ ప్రయోగ ఫలితాల ఆధారంగానే వీటిని పెద్ద ఎత్తున అమలు చేయడంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ నోట్ల ప్రత్యేకతలు
కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.10, రూ.20 డినామినేషన్లలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 2 బిలియన్ల (200 కోట్లు) పాలిమర్ నోట్లను ముద్రించడానికి ఆర్బీఐకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతానికి కాగితపు నోట్లను పూర్తిగా రద్దు చేసే ప్రణాళికలు ఏవీ లేవు. పాలిమర్, కాగితపు నోట్లు రెండూ ఏకకాలంలో సమాంతరంగా చలామణిలో ఉంటాయి.
సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్ల కాలపరిమితి రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ. తరచుగా చేతులు మారుతూ త్వరగా అరిగిపోయే చిన్న నోట్ల (రూ.10, రూ.20) సమస్యకు ఇది చక్కటి పరిష్కారంగా మారుతుంది.
ప్లాస్టిక్ నోట్ల అవసరం ఎందుకు ఏర్పడింది?
దేశంలో ఆర్థిక వ్యవస్థ పరిమాణం పెరుగుతున్న కొద్దీ నగదు లావాదేవీల అవసరం కూడా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు గత 30 ఏళ్లుగా పాలిమర్ నోట్లను విజయవంతంగా వాడుతున్నాయి.
నోట్ల భద్రత, నిర్వహణ, ముద్రణ కోసం ప్రతి ఏటా సుమారు రూ.5,000 కోట్లు ఖర్చవుతున్నాయి. గణాంకాల ప్రకారం 2016-17 నుంచి జారీ చేసిన ప్రతి 100 కొత్త నోట్లలో 71 పాత నోట్లను వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అలాగే గత దశాబ్దంలో దాదాపు రూ. 50 బిలియన్ల విలువైన పాత నోట్లను ఉపసంహరించుకున్నారు. నకిలీ నోట్ల బెడదను అరికట్టి భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు ఇవి దోహదపడతాయి.
భారత వాతావరణం, పర్యావరణం, బ్యాంకింగ్ వ్యవస్థకు ఇవి ఎంతవరకు అనుకూలంగా ఉంటాయో క్షేత్రస్థాయిలో పరీక్షించిన తర్వాతే రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నోట్లు చలామణిలోకి రానున్నాయి.
Also REad: రేపు మంగళవారం బ్యాంకులకు సెలవు..ఆగస్టు 4వ తేదీన అక్కడ ఈ బ్యాంకులు బంద్! ఎందుకంటే?
Also REad: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్లో చీరలు ఎందుకు అమ్మరు? ఇదే బిజినెస్ టాప్ సీక్రెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iqoo నుంచి మరో మైండ్ బ్లోయింగ్ స్మార్ట్ఫోన్.. iQOO Z11 ఫుల్ డీటైల్స్ లీక్!
Hyderabad, Telangana:Iqoo Z11 Launching In India: టెక్ ప్రియులకు నిద్రలేకుండా చేసే అదిరిపోయే వార్త రానే వచ్చేసింది.. భారతదేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి.. యంగ్ జనరేషన్ను ఆకట్టుకోవడానికి వివో (Vivo) సబ్బ్రాండ్ ఐకూ (iQOO) దిమ్మతిరిగే డిజైన్తో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. తన ఫ్లాగ్షిప్ వేరియంట్లో అందుబాటులోకి రాబోతున్న iQOO Z11 స్మార్ట్ఫోన్ డిజైన్ను అధికారికంగా టీజ్ చేస్తూ టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఐకూ ఇండియా CEO నిపుణ్ మార్యా తమ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విడుదల చేసిన టీజర్ ఇప్పుడు టెక్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. గతంలో మార్చి నెలలో చైనాలో విడుదలైన మోడల్తో పోలిస్తే.. భారత వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని.. దీని డిజైన్లో ఊహించని మార్పులు చేశారు.
ఈ ఫోన్ వెనుక భాగంలో క్లాసీగా కనిపించే హారిజంటల్ పిల్-షేప్డ్ కెమెరా మోడ్యూల్తో పాటు దానిలో రెండు పెద్ద ప్రధాన కెమెరా రింగ్స్, అలాగే అద్భుతమైన సర్క్యులర్ LED రింగ్ లైట్ అందించారు. 3D కర్వ్డ్ రియర్ ప్యానెల్తో చేతిలో పట్టుకుంటే ఒక అద్భుతమైన ప్రీమియం అనుభూతిని ఇచ్చేలా దీనిని తీర్చిదిద్దిన్నట్లు తెలస్తోంది.. ముఖ్యంగా కళ్లకు కట్టిపడేసే బ్లూ (Blue), గ్రీన్ (Green) అనే రెండు క్యూట్ అండ్ స్టైలిష్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభించబోతోంది.
స్పీడ్తో పాటు పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీపడేదే లేదంటోంది ఐకూ.. భారతదేశంలో ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 7500 టర్బో (MediaTek Dimensity 7500 Turbo) ప్రాసెసర్తో అందుబాటులోకి రాబోతోంది. హెవీ గేమింగ్ ఆడేవారికి, మల్టీ టాస్కింగ్ ప్రియులకు ఈ ప్రాసెసర్ ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
భారత మార్కెట్లో 3D కర్వ్డ్ డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతున్న ఈ ఫోన్ టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకోనుంది. ఇక చైనా వేరియంట్ ఫీచర్లను గమనిస్తే.. ఇందులో 6.83-అంగుళాల AMOLED స్క్రీన్తో పాటు 165Hz రిఫ్రెష్ రేట్, 50MP OIS ప్రధాన కెమెరా, 16GB ర్యామ్తో పాటు 512GB స్టోరేజ్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.. ఇది భారత మార్కెట్లోకి ఈ నెలలోనే అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ iQOO Z11 స్మార్ట్ఫోన్, మిడ్-రేంజ్ విభాగంలో ఇతర దిగ్గజ బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
భారత్లోకి Moto G Max ఎంట్రీ.. రూ.30 వేల బడ్జెట్లో అదిరిపోయే ఫీచర్లు.. పూర్తి వివరాలు ఇవే!
Hyderabad, Telangana:Motorola Moto G Max Price: ప్రముఖ ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) భారతీయ వినియోగదారుల కోసం మరో పవర్ఫుల్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మోటో G మాక్స్ (Moto G Max) పేరుతో రాబోతున్న ఈ కొత్త ఫోన్ అతిత్వరలోనే భారత్లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ ఫోన్ ఆగస్టు 15న భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్తో పాటు స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భారత్లో Moto G Max స్మార్ట్ఫోన్ ధర సుమారు రూ.30,000 నుంచి ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది.. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఫోన్ను 8 GB ర్యామ్తో పాటు 256 GB స్టోరేజ్ అనే ఒకే ఒక్క వేరియంట్లో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ఇది అజుల్ క్లారో (Azul Claro), గ్రాఫైట్ (Grafite) అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో విడుదల కాబోతున్నాయి..
ఫీచర్లు వివరాలు..
గ్లోబల్ మార్కెట్తో పోలిస్తే.. భారతీయ వేరియంట్లో మోటోరోలా కొన్ని కీలక మార్పులు చేయనున్నట్లు తెలిసింది. అంతర్జాతీయంగా మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్సెట్తో విడుదలైనప్పటికీ.. భారత్లో వచ్చే మోటో G మాక్స్ ఫోన్లో పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 6s జెన్ 4 (Snapdragon 6s Gen 4) ప్రాసెసర్తో అందుబాటులోకి రాబోతోంది.
ఈ ఫోన్లో 6.8-ఇంచుల 1.5K రిజల్యూషన్ కలిగిన బిగ్ డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది.. ఇది గేమింగ్తో పాటు వీడియో చూడడానికి చాలా అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ను కూడా కలిగి ఉంటుంది.. ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది.. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఏర్పాటు చేసిన్నట్లు తెలుస్తోంది.
ఈ ఫోన్లో మోస్ట్ పవర్ఫుల్ 5,200 mAh సామర్థ్యం కలిగిన శక్తివంతమైన బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతోంది.. ఇది 32W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. మోటో G మాక్స్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో UI (Hello UI) ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. వినియోగదారులకు 2 సంవత్సరాల OS అప్డేట్లతో పాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్లను కంపెనీ హామీగా ఇస్తున్నట్లు తెలిపింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మోటోరోలా ఇటీవలే భారత మార్కెట్లో మోటో G37తో పాటు మోటో G37 పవర్ ఫోన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు రూ.30,000 బడ్జెట్లో రాబోతున్న మోటో G మాక్స్ స్మార్ట్ఫోన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jantar Mantar ISI: జంతర్ మంతర్లో ఉగ్రవాదుల కుట్రభగ్నం..ఐఎస్ఐ ఉగ్ర ముఠాల గుట్టురట్టు..9 మంది అరెస్ట్!
New Delhi, Delhi:Jantar Mantar ISI Terror Plot: సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్లో ఉగ్రవాద మూలాలను పెకలించివేసే క్రమంలో రాష్ట్ర పోలీసులు భారీ విజయం సాధించారు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న రెండు ప్రమాదకర సరిహద్దు ఉగ్రవాద ముఠాలను పంజాబ్ పోలీసులు విజయవంతంగా భగ్నం చేశారు. ఈ ఆపరేషన్లో నలుగురు మైనర్లతో సహా మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్ట్ చేయగా, వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఆపరేషన్ విశేషాలు, స్వాధీనం చేసుకున్నవి..
అమృత్సర్ కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో నిందితుల నుంచి 3 అక్రమ పిస్టళ్లు, 4 పెట్రోల్ బాటిల్ బాంబులు, 9 సజీవ తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) గౌరవ్ యాదవ్ తెలిపారు.
ఉగ్రవాదుల ముఠాలో వంశ్ కుమార్, అన్మోల్ సింగ్, హర్మన్ సింగ్ అలియాస్ హమ్ము, సుఖ్దేవ్ సింగ్, సుఖ్మన్ సింగ్తో పాటు మరో నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జంతర్ మంతర్ దాడికి కుట్ర, పాకిస్థాన్ లింక్..
ప్రాథమిక విచారణలో నిందితులు సంచలన విషయాలు వెల్లడించారు. విదేశాల్లో ఉన్న ఐఎస్ఐ హ్యాండ్లర్లు స్థానిక యువతకు డబ్బు ఆశ చూపి ఉగ్ర కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నట్లు తేలింది. ఇటీవలి విద్యార్థి నిరసనల సమయంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విధ్వంసం సృష్టించే బాధ్యతను ప్రధాన నిందితుడు సుఖ్మన్కు పాకిస్థాన్ హ్యాండ్లర్లు అప్పగించారు.
సుఖ్మన్ తన సహచరులతో కలిసి ఢిల్లీకి వెళ్లినప్పటికీ, అక్కడ ఉన్న భారీ భద్రత కారణంగా వారి కుట్ర విఫలమై తిరిగి పంజాబ్కు చేరుకున్నారు. ఈ ఉగ్ర నెట్వర్క్ వెనుక పాకిస్థానీ గ్యాంగ్స్టర్ కమాండ్, ఉగ్రవాది షాజాద్ భట్టి ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. నిందితులు వాట్సాప్ చాట్ల ద్వారా విదేశీ హ్యాండ్లర్లతో టచ్లో ఉన్నారు.
రైల్వే ట్రాక్లపై రెక్కీ, సీసీటీవీల గుట్టు రట్టు..
ఉగ్రవాదుల గ్యాంగ్ రెండవ ముఠాకు సంబంధించిన విచారణలో రైల్వే ట్రాక్ల భద్రతకు సంబంధించిన కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత నెలలో రైల్వే ట్రాక్ల సమీపంలో అనుమానాస్పద రీతిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలపై పోలీసులు దర్యాప్తు జరపగా, ఆ కెమెరాల లైవ్ ఫుటేజీని విదేశీ హ్యాండ్లర్లకు చేరవేస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా, పంజాబ్లోని పోలీస్ స్టేషన్లు, కీలక భవనాలు, పోలీస్ సిబ్బంది కదలికలపై రెక్కీ నిర్వహించే బాధ్యతను కూడా ఈ ముఠాకు అప్పగించినట్లు విచారణలో స్పష్టమైంది. అమృత్సర్ సెంట్రల్ జైలు కేంద్రంగా సాగిన ఆర్థిక లావాదేవీల కోణంలోనూ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
Also Read: అన్నీ వస్తువులు దొరికే డీమార్ట్లో చీరలు ఎందుకు అమ్మరు? ఇదే బిజినెస్ టాప్ సీక్రెట్!
Also REad: రేపు మంగళవారం బ్యాంకులకు సెలవు..ఆగస్టు 4వ తేదీన అక్కడ ఈ బ్యాంకులు బంద్! ఎందుకంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రికార్డ్ బ్రేకింగ్ ఫీచర్లతో Redmi K100 Pro సిరీస్ లాంచ్.. మార్కెట్లో కాకరేపుతున్న ఫీచర్లు!
Hyderabad, Telangana:Redmi K100 Pro Series Telugu News: ప్రసిద్ధ మొబైల్ తయారీ సంస్థ Redmi తన ఫ్లాగ్షిప్ సిరీస్ Redmi K100 Proను మార్కెట్లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. మైక్రోబ్లాగింగ్ వేదిక వైబో (Weibo)లో Redmi షేర్ చేసిన సమాచారం ప్రకారం.. ఈ సిరీస్ను ఆగస్టు 11న చైనాలో అధికారికంగా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ సిరీస్లో Redmi K100 Proతో పాటు Redmi K100 Pro Max అనే రెండు ప్రీమియం మోడల్స్తో అందుబాటులోకి రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Redmi K100 Pro స్మార్ట్ఫోన్ను కంపెనీ ఆక్టా-కోర్ కస్టమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 వి-సిరీస్ (Custom Snapdragon 8 Elite Gen 5 V Series) చిప్సెట్తో పనిచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. గేమింగ్ అనుభవాన్ని పెంచేందుకు ఇందులో ప్రత్యేకమైన AI గేమింగ్ గ్రాఫిక్స్ చిప్, Raging Engine సాంకేతికతను కూడా కంపెనీ అందించింది. కంపెనీ ఇంటర్నల్ పరీక్షల్లో (Internal Testing) ఈ ఫోన్ AnTuTu బెంచ్మార్కింగ్ ప్లాట్ఫారమ్పై ఏకంగా 40,95,000 కంటే ఎక్కువ స్కోర్ను సాధించడం విశేషం..
ఫోన్ అధికంగా వేడెక్కకుండా ఉండేందుకు థర్మల్ మేనేజ్మెంట్ కోసం 3D సర్క్యులేటింగ్ కోల్డ్ పంప్ కూలింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. ఇది భారీ గేమింగ్తో పాటు మల్టీటాస్కింగ్ సమయంలో ఫోన్ను వేగంగా కూల్ అవుతుంది.. అలాగే Redmi K100 Pro మోడల్లో 6.59 అంగుళాల ఫ్లాట్ డిస్ప్లే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది 185Hz వరకు రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది.
వెనుక వైపు రెక్టాంగ్యులర్ మోడ్యూల్లో LED ఫ్లాష్తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ను కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. దీని విశేషమేమిటంటే.. ఈ కెమెరా ఐలాండ్పై ప్రముఖ ఆడియో బ్రాండ్ Sound by Bose బ్రాండింగ్ కూడా రాబోతోంది.. ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే చైనాలో ఈ ఫోన్కు సంబంధించిన విక్రయాల ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
రెడ్మి K100 ప్రో మాక్స్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వివరాల్లోకి.. ఈ టాప్ వేరియంట్ Redmi K100 Pro Max కేబర్నెట్ రెడ్ (Cabernet Red) కలర్ ఆప్షన్లో మెటల్ ఫ్రేమ్తో అందుబాటులోకి రాబోతోంది. ఇది 6.9 అంగుళాల పెద్ద OLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇది ఏకంగా 9,000 mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశం ఉందని సమాచారం. చైనా లాంచ్ తర్వాత ఈ సిరీస్ అంతర్జాతీయ మార్కెట్లలో Poco F9 Proతో పాటు Poco F9 Ultra పేర్లతో రీబ్రాండ్ అయి రీలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
వైష్ణోదేవి సన్నిధిలో అద్భుతం.. ఐదేళ్ల క్రితం తప్పిపోయిన కొడుకును కలుసుకున్న తల్లి.. వీడియో!
Hyderabad, Telangana:Missing Son Found Viral Video: కన్నపేగు మమకారం కలిస్తే.. ఎలాంటి అద్భుతాలైనా జరుగుతాయని నిరూపించేలా ప్రముఖ పుణ్యక్షేత్రం వైష్ణోదేవి సన్నిధిలో ఒక భావోద్వేగ సంఘటన చోటుచేసుకుంది. గత ఐదేళ్లుగా నిరంతరం వెతుకుతూ.. ఆశలు వదులుకోక ఓపికతో వేచి చూస్తున్న ఒక తల్లి, చెల్లెలిను వైష్ణోదేవి అమ్మవారు మళ్లీ వారి ఒడికి చేర్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళ్తే.. సదరు తల్లితో పాటు కుమార్తె భక్తిశ్రద్ధలతో అమ్మవారి దర్శనం కోసం వైష్ణోదేవి ఆలయానికి వచ్చారు.. కిటకిటలాడే భక్తుల రద్దీలో నడుస్తుండగా.. ఉన్నట్టుండి అమ్మ దృష్టి ఒక యువకుడిపై పడింది. వేలాది మంది జనం మధ్యలో నడుస్తున్న ఆ యువకుడి రూపం.. నడక శైలి ఆమెకు అనుమానం కలిగించేలా ఉండడంతో పక్కనే ఉన్న కుమార్తె కూడా ఆ యువకుడిని చూసి.. ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కళ్లెదురుగా నిలబడి ఉన్నది ఐదేళ్ల క్రితం దూరమైన తమ సొంత రక్తమేనని వారికి క్షణాల్లో అర్థమైంది..
అది కలనా లేక నిజమా అని ఆలోచించే.. వ్యవధి కూడా ఇవ్వకుండా.. ఆ తల్లి, సోదరి ఆ యువకుడి వైపు పరిగెత్తారు.. దగ్గరకు వెళ్లి చూడగా.. తమ గుండెల్లో దాచుకున్న కొడుకేనని స్పష్టమైంది.. ఐదేళ్ల తర్వాత.. గుండెల్లో దాచుకున్న ఆవేదన అంతా ఒక్కసారిగా కన్నీటి రూపంలో బయటకు వచ్చింది.. ఆ యువకుడిని గట్టిగా పట్టుకుని ఆ తల్లి ఏడుస్తున్న తీరు అక్కడ ఉన్న ఇతర భక్తులను చలించేలా చేసింది. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఈ దృశ్యాన్ని చూసి తమ కళ్లను తామే నమ్మలేకపోయారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఐదేళ్ల క్రితం అనుకోకుండా కుటుంబానికి దూరమైన.. ఈ యువకుడి కోసం ఆ కుటుంబం పడని తాపత్రయం లేదు.. ఎన్నో పోలీసు స్టేషన్లు, అనేక నగరాలు తిరిగినా ఫలితం దక్కలేదు.. అయినా సరే.. ఏదో ఒక రోజు నా కొడుకు తిరిగి వస్తాడు అనే ఆశతో ఆ తల్లి ప్రతిరోజూ ప్రార్థిస్తూనే ఉంది.. చివరకు ఆ తల్లి సహనానికి, నమ్మకానికి వైష్ణోదేవి అమ్మవారి ఆలయం వేదికగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్స్ కళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
వామ్మె.. పామునే మింగేసిన కప్ప.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Giant Snake Video Viral: ప్రపంచంలో ఎప్పుడు ఏ జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.. సాధారణంగా మనందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం ఏమిటంటే.. పాము కనిపిస్తే కప్ప భయంతో గజగజ వణుకుతుంది. పాము క్షణాల్లో కప్పను ఆహారంగా మార్చుకుంటుంది. చిన్నప్పటి నుంచి మనం విన్నది.. చూసింది కూడా ఇదే.. కానీ, ప్రకృతి నియమాలను తలకిందులు చేస్తూ.. ఒక ఊహించని వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. పాముకే ఇతర జీవులు ఎరగా మారుతుంటే.. ఇక్కడ మరొక జీవికి అదే ఎరగా మారింది. ఏకంగా ఒక కప్పే పామును సజీవంగా మింగేస్తున్న షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలుఇ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అసలేం జరిగింది?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. ఒక పెద్ద కప్ప ఒక చిన్న పామును తన నోటితో గట్టిగా పట్టుకుంది. పాము తోక భాగం నుంచి మెల్లమెల్లగా లోపలికి మింగేయం మొదలు పెట్టింది. నోటి నుంచి తప్పించుకోవడానికి ఆ పాము తీవ్రంగా శ్రమించింది. తన పడగ విప్పి.. సర్వశక్తులు ఒడ్డి కప్ప పట్టు నుంచి బయటపడటానికి విఫలయత్నం చేసింది. అయితే, ఆ కప్ప మాత్రం తన పట్టును ఏమాత్రం వదలేకుండా ఉండడం మీరు గమనించవచ్చు. పాము ఎంత విలవిలలాడినా వదలకుండా కొద్దికొద్దిగా పామును ప్రాణాలతోనే గుటకలేస్తూ తినే ప్రయత్నం చేస్తోంది.. ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ తమ కళ్ళను తామే నమ్మలేకపోతున్నారని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు..
बल्कि मेंढक ही साँप को निगलने लगा है। pic.twitter.com/Bp1TYQlqLc
— नई सोच (@NayiSochHQ) August 1, 2026
ఈ అరుదైన దృశ్యాన్ని @NayiSochHQ అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వీడియోకు ఇది కలియుగం సామీ.. ఇక్కడ పాము కప్పను తినడం లేదు.. కప్పే పామును మింగేస్తోందని రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ రోజు పాముకు టైమ్ అస్సలు బాగున్నట్లు లేదు.. అని కొందరు వ్యాఖ్యానించగా.. మరికొందరు ప్రకృతిలోని సర్వైవల్ అఫ్ ది ఫిట్టెస్ట్ నియమానికి ఇది నిదర్శనమని అంటున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సాధారణంగా బుల్ఫ్రాగ్ (Bullfrog) రకానికి చెందిన పెద్ద కప్పలు తమ నోటికి చిక్కిన చిన్నపిట్టలు, ఎలుకలు, పురుగులతో పాటు చిన్నపాములను కూడా తింటాయని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట లక్షలాది మంది వీక్షణలతో ట్రెండింగ్లో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ వీడియోను చాలా మంది సోషల్ మీడియాల్లో షేర్ చేస్తూ వస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ప్రేమకు వయసుతో పనేంటి? 81 ఏళ్ల బామ్మ.. 24 ఏళ్ల కుర్రాడు.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Elderly Woman Young Man Relationship Video Watch: ప్రేమకి సరిహద్దులు లేవు.. వయసుతో అసలే పనేలేదు.. అనే మాటను మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఈ జంటను చూస్తే మాత్రం ఆ మాట వందకు వంద శాతం నిజమేనని ఒప్పుకోక తప్పరు.. ఒకరి వయసు శతాబ్దానికి దగ్గరగా ఉంటే.. మరొకరు ఇప్పుడిప్పుడే 25 ఏళ్ల వయస్సులోకి అడుగుపెట్టారు. సమాజం ఏమనుకున్నా సరే.. తమ బంధమే తమకు ముఖ్యమని నిరూపించిన ఈ విచిత్ర ప్రేమజంట ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సోషల్ మీడియా వేదికగా మొదలైన ఒక సాధారణ చాటింగ్.. వీరిద్దరినీ అంత దగ్గర చేస్తుందని బహుశా వారు కూడా ఊహించి ఉండరు.. 81 ఏళ్ల వయసున్న మహిళ.. 24 ఏళ్ల యువకుడితో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. మొదట్లో కేవలం స్నేహంగా ప్రారంభమైన వీరి చాటింగ్, రోజులు గడిచేకొద్దీ మంచి ప్రేమగా మారాయి. వయసులో ఏకంగా 57 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ.. మనసులు కలవడమే ముఖ్యమని భావించిన ఈ జంట.. తమ అనుబంధాన్ని మరింత అద్భుతమైన స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
వీరి లవ్ స్టోరీ గురించి తెలిసిన వెంటనే.. నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వచ్చాయి.. కొందరు ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్ చేయగా.. మరికొందరు డబ్బు కోసమే యువకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని విమర్శించారు.. అయితే, ఎలాంటి నెగిటివ్ వ్యాఖ్యలను పట్టించుకోకుండా ఈ జంట ఒకటయ్యారు.. తమ మధ్య ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమేనని.. ఒకరికొకరు తోడుగా ఉండటమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
వీరిద్దరూ కలిసి ఉన్న వీడియోలు, రీల్స్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వీరి కెమిస్ట్రీ చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. లక్షలాది మంది ఈ వీడియోలను వీక్షించడమే కాకుండా.. విపరీతంగా షేర్ చేస్తున్నారు. నిజమైన ప్రేమకు రూపం.. వయసుతో సంబంధం లేదని కొందరు నెటిజన్లు వీరికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Amaravati Book Launch: ఉపరాష్ట్రపతితో టీడీపీ ఎంపీల బృందం భేటి.. 'అమరావతి' ప్రత్యేక పుస్తకం ఆవిష్కరణ!
New Delhi, Delhi:Vice-President Amaravati Book Launch: భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్ గారిని పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తన సహచర తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీలతో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రయాణం, దాని చారిత్రక ప్రాధాన్యతను తెలియజేసే "Amaravati: Built by the People, Secured by Destiny" (అమరావతి) అనే ప్రత్యేక పుస్తకాన్ని వారు ఉపరాష్ట్రపతికి అందజేశారు. ఈ పుస్తకాన్ని చూసి ఉపరాష్ట్రపతి అభినందించినట్లు సమాచారం.
పుస్తకంలో పొందుపరిచిన ముఖ్యాంశాలు..
చారిత్రక ఉద్యమ గాథ.. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాల వారసత్వం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఈ పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావించారు.
రైతుల సుదీర్ఘ పోరాటం అనగా.. రాజధాని పరిరక్షణ కోసం అమరావతి ప్రాంత రైతులు, తల్లులు, మహిళలు ఎండనక, వాననక అప్రతిహతంగా 1,631 రోజుల పాటు చేసిన శాంతియుత సుదీర్ఘ పోరాట విశేషాలను ఇందులో కళ్ళకు కట్టినట్లు వివరించారు.
ఏకైక రాజధానిగా పునరుజ్జీవనం: 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా పునరుద్ధరించిన చారిత్రక పరిణామాలు, ప్రజల ఆకాంక్ష నెరవేరిన వైనాన్ని ఈ గ్రంథంలో స్పష్టంగా పొందుపరిచారు.
ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి..
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో కూడిన అద్భుతమైన నాయకత్వం, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పూర్తి మద్దతు, సహకారంతో అమరావతిని కేవలం ఒక పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, అగ్రగామిగా నిలిచే ప్రపంచ స్థాయి (గ్లోబల్) రాజధానిగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్ తరాలకు ఈ రాజధాని ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.
Also Read: విద్యార్థులకు పండగ లాంటి వార్త..ఈ వారంలో వరుసగా 3 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
Also REad: ఏపీ, తెలంగాణ ఎల్నినో బారి నుంచి బయటపడినట్టేనా? రైతులు తప్పకుండా తెలుసుకోవాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రాత్రి వేళ ఆటో నడుపుతూ పో**ర్న్ చూసిన డ్రైవర్.. నిలదీసిన యువతి! వీడియో
Hyderabad, Telangana:Auto Driver Viral Video: ఢిల్లీకి చెందిన సుకన్య అనే యువతి రాత్రి వేళ సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు ర్యాపిడో (Rapido) యాప్ ద్వారా ఆటోను బుక్ చేసుకుంది. సఫ్దర్జంగ్ నుంచి మోడల్ టౌన్ వరకు వెళ్లేందుకు రాత్రి సుమారు 8:48 గంటల ప్రాంతంలో ఆమె ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అంతా సవ్యంగానే ఉందనుకున్న సమయంలో, ప్రయాణం మధ్యలో ఒక ఊహించని షాకింగ్ దృశ్యం వెలుగులోకి వచ్చింది. అసలేంటి? ఏం జరిగి ఉంటుంది.? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆటో ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగా.. పక్కనే బైక్పై వెళ్తున్న మరొక యువతి సుకన్యను అప్రమత్తం చేసింది. ఆటో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూనే తన మొబైల్ ఫోన్లో అశ్లీల వీడియో చూస్తున్నాడని సైగల ద్వారా చెప్పింది. సుకన్య వెంటనే గమనించడంతో భయపడిన డ్రైవర్, కలవరపడి ఫోన్ను దాచేందుకు ప్రయత్నించాడు. గమ్యస్థానానికి చేరుకోవడానికి ఇంకా అర గంట సమయం ఉందనగా.. అదే ఆటోలో నెమ్మదిగా సుకన్య ప్రయాణాన్ని మధ్యలోనే ఎక్కడ ఆపకుండా ధైర్యంగా తన స్థాపింగ్ పాయింట్ వరకు చేరుకుంది.
గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే సుకన్య డ్రైవర్ను నిలదీసింది. ఫోన్లో ఏం చూస్తున్నావు? అని గట్టిగా ప్రశ్నించగా.. ఆ డ్రైవర్ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా బేషరమ్గా ఫారెన్ వీడియో చూస్తున్నాను అని సమాధానమిచ్చాడు. దాంతో సుకన్య అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి.. కుటుంబ సభ్యులను పిలుస్తానని హెచ్చరించడంతో డ్రైవర్ నోట మాట రాలేదు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ ఘటన సమయంలో సుకన్య ర్యాపిడో ఇన్-యాప్ (In-App) అత్యవసర సేఫ్టీ టీమ్ను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ.. కంపెనీ నుంచి ఎలాంటి తక్షణ స్పందనా లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సుకన్య ఇదే సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజన్లు నెగెటివ్ కామెంట్లతో విరుచుకుపడ్డాక.. ర్యాపిడో కస్టమర్ సపోర్ట్ టీమ్ స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళల భద్రత పట్ల ఆన్లైన్ క్యాబ్, ఆటో సంస్థలు చూపుతున్న అలసత్వంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రాహువు ధనిష్ఠా నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి రాజయోగం, బంపర్ లాభాలు!
Hyderabad, Telangana:Rahu Transit In Dhanishta Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన ఛాయా గ్రహంగా భావించే రాహువు సంచారం ఎప్పుడూ అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావాన్ని చూపుతుంది. ఆగస్టు 2న అర్ధరాత్రి 12:08 గంటలకు రాహువు ధనిష్ఠ నక్షత్రంలోకి సంచారం చేసింది.. ఈ అద్భుత సంచార మార్పు ఫలితంగా దశాబ్దాల కష్టాలకు ముగింపు పడుతూ.. ప్రధానంగా 4 రాశుల వారి ఊహించని ప్రయోజనాలను చూపుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఇది అద్భుతంగా మారుతుంది.
ధనిష్ఠ నక్షత్రంలోకి రాహువు సంచారంతో ఈ కింది రాశులవారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా కోరుకుంటున్న వ్యక్తులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి విముక్తి కలుగుతుంది. అనుకుంటున్న పనుల్లో విశేషమైన లాభాలు పొందుతారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి (Aries)
ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు ఇక వేగవంతం కాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఆకస్మిక ధనలాభాలతో పాటు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు దక్కుతాయి. చాలాకాలంగా విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కల నెరవేరేందుకు ఇదే సువర్ణావకాశంగా మారుతుంది.. అనుకుంటున్న పనులు కూడా సులభంగా చేస్తారు.
మిథున రాశి (Gemini)
రాహువు ధనిష్ఠ సంచారంతో మిథున రాశి వారికి అత్యంత శుభఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. తీవ్ర మానసిక ఒత్తిడికి కారణమైన ఆర్థిక టెన్షన్లు నుంచి విముక్తి లభిస్తుంది. పెండింగ్లో ఉన్న కీలక వ్యవహారాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చి బాకీలు వసూలవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రాశి వారికి మనశ్శాంతితో పాటు భౌతిక సుఖసంతోషాలు కలిగే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. నూతన ఇల్లు లేదా ఆస్తులు కొనుగోలు చేసేవారికి ఈ సమయం చాలా అద్భుతమైన లాభాలను అందిస్తుంది. కుటుంబంలో, సమాజంలో ఉన్న విభేదాలు కూడా సులభంగా తొలగిపోతాయి. కెరీర్లో ఊహించని పురోగతి సాధ్యమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రేమ సంబంధాల్లో బాంధవ్యాలు మరింత బలపడతాయి.
మకర రాశి (Capricorn)
కష్టాల సుడిగుండంలో ఉన్న మకర రాశి వారికి ఈ సంచారం ఒక గొప్ప ఊరటను అందించే ఛాన్స్లు కనిపిస్తుంది.. చిక్కుముడిగా మారిన కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. దీర్ఘకాలిక అప్పుల భారం తల మీద నుంచి దిగిపోతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. రావలసిన బాకీలు తిరిగి చేతికి అందడంతో ఆర్థికంగా స్థిరపడతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
12 ఏళ్ల తర్వాత అరుదైన పుష్య అమృత యోగం.. ఈ 5 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం..
Hyderabad, Telangana:Pushya Amrita Yoga Effect On Zodiac: పవిత్రమైన శ్రావణ మాసంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకోబోతోంది. సుమారు 12 సంవత్సరాల తర్వాత శ్రావణ మాసంలో పుష్య అమృత యోగం ఏర్పడింది.. జ్యోతిష్య ప్రకారం.. ఈ అత్యంత శుభప్రదమైన రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి విశేష ఫలితాలు కలుగుతాయి. కొత్త పనులు సులభంగా మొదలవుతాయి. అంతేకాకుండా బంగారం, స్థిరాస్తుల కొనుగోలు, వ్యాపార పెట్టుబడులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా మారుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో పుష్య నక్షత్రానికి అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ నక్షత్రం ప్రత్యేక శుభ యోగాలతో కలిసినప్పుడు దానిని పుష్య అమృత యోగం అని పిలుస్తారు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన దీర్ఘకాలిక విజయాన్ని, సుఖసంతోషాలను పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎంత శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ 5 రాశుల వారికి లక్కీ టైమ్..
వృషభ రాశి (Taurus)
ఈ వృషభ రాశి వారికి ఉద్యోగ, వృత్తి రంగాల్లో నూతన బాధ్యతలు లేదా పదోన్నతి (Promotion) లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తయ్యే చాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మీన రాశి (Pisces)
ఆర్థిక వృద్ధితో పాటు మానసిక ప్రశాంతత విపరీతంగా లభిస్తుంది. కొత్త ఆస్తులతో పాటు వాహనాలు లేదా బంగారం కొనుగోలు చేయడానికి ఇది బంగారం లాంటి సమయంగా భావించవచ్చు. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత దృఢపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
సింహ రాశి (Leo)
సమాజంలో గౌరవ ప్రతిష్టలు విశేషంగా పెరుగుతాయి. వ్యాపారం, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో శుభ వార్తలు కూడా తప్పకుండా వింటారు. ముఖ్యమైన నిర్ణయాల్లో విజయం మీ సొంతమవుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా తొలగిపోతుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశివారికి ఈ సమయం ఊహించని అదృష్టాన్ని అందిస్తుంది. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభ ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మికతో పాటు ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. అనుకుంటున్న పనులు సులభంగా చేసే అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి (Libra)
ఆదాయానికి కొత్త మార్గాలు సుగమమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారంలో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ లాభాలు కలుగుతాయి. దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయడానికి ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు. వ్యక్తిగత సంబంధాలలో సానుకూల మార్పులు వస్తాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
2031 వరకు ఈ 3 రాశులకు శని రాజయోగం.. తిరుగులేని ధనలాభం!
Hyderabad, Telangana:Saturn Transit 2027 To 2031: నవగ్రహాలలో కర్మఫల ప్రదాత, న్యాయదేవుడైన శనిభగవానుడి రాశి సంచారానిరి జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. సాధారణంగా శనిదేవుడు ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచారం చేస్తాడు. అయితే, 2027వ సంవత్సరంలో శని భగవానుడు మీన రాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆ తర్వాత 2031 వరకు అదే రాశిలో సంచార దశలో ఉంటాడు. దాదాపు నాలుగేళ్ల పాటు సంచారం కొన్ని రాశుల వారికి అపారమైన శుభఫలితాలను అందించడమే కాకుండా గోల్డెన్ పిరియడ్ లాగా మారనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సంచారంలో ఏయే రాశుల జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి శని అనుగ్రహం..
తులా రాశి (Libra)
తులా రాశి వారికి ఈ సమయంలో శని భగవానుడు ప్రతి పనిలోనూ విజయాన్ని అందిస్తాడు. ముఖ్యంగా వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు ఇది అత్యంత లాభదాయకమైన సమయంగా భావించవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి పెద్ద పెద్ద డీల్స్ కుదిరే అవకాశముంది. కొత్త పెట్టుబడుల నుంచి ఊహించని స్థాయిలో రాబడులు వస్తూ ఉంటాయి. పాత అప్పుల భారం తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన వివాదాలు పరిష్కారమై మీకు అనుకూలంగా మారుతాయి. సమాజంలో హోదా, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
మిథున రాశి (Gemini)
మిథున రాశివారికి ఈ శని సంచారం తిరుగులేని భాగ్యోదయ సమయాన్ని తెచ్చిపెట్టబోతోంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సంచలనాత్మక పురోగతిని సాధించే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్, ప్రశంసలు అందుతాయి. ఒకదాని కంటే ఎక్కువ మార్గాల్లో కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉన్నత విద్య లేదా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి రాబోయే కొన్నేళ్లు ఆర్థికంగా ఎంతో అద్బుతంగా ఉంటుంది. శని దేవుని శుభ దృష్టి కారణంగా వీరి జాతకంలో పెద్ద ఎత్తున ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పాత బాకీలు, రావలసిన డబ్బు హఠాత్తుగా చేతికి అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో పాటు వేతన పెరుగుదల లభించే అవకాశం ఉంది. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి ఇది అత్యంత అనుకూల సమయంగా భావంచవచ్చు. కొత్త ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
