జిల్లా మణికొండ పట్టణంలో పెద్ద పాము కనిపించింది
రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీ రోడ్ నెం.4లో 12 అడుగుల పొడవున్న పాము కనిపించింది. 12 అడుగుల పామును చూసిన ప్రజలు వెంటనే భయాందోళనకు గురై పాము పట్టేవారికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేహ 12 అడుగుల పామును చాకచక్యంగా పట్టుకుంది.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
King Cobra Virao Video: భయం లేదు.. బెరుకు లేదు.. సాహసమంటే ఎంతో ఇష్టపడే హీరోయిన్ సదా ఓ భారీ పామును ఒడిసిపట్టింది. జియోగ్రాఫిక్ చానల్లో చూసినట్టు అతి పేద్ద పామును హీరోయిన్ పట్టుకుంది. తనతోపాటు కొందరిని సహాయంగా తీసుకుని ఓ ఇంట్లో దూరిన పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. చూడగానే గగుర్పొడిచే 16 అడుగుల పామును హీరోయిన్ భయం లేకుండా సాహసం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ఆ వివరాలను హీరోయిన్ సదా విడుదల చేశారు.
Also Read: KTR Counter: ఖమ్మం గడ్డపై ముగ్గురు మంత్రులకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
జయం సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సదా అనంతరం అనేక విజయవంతమైన సినిమాలు చేసిన విషయం తెలిసిందే. సినిమాల తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న సదా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వైల్డ్ లైఫ్ను ఇష్టపడుతున్న ఆమె తరచూ సాహస యాత్రలు చేస్తూ ప్రకృతి ఒడిలో జీవితం గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొన్ని సినిమాలు చేయడమే కాకుండా పలు టీవీ షోలలో సదా పాల్గొంటున్నారు.
Also Read: Kavitha Congress: కాంగ్రెస్లోకి కేసీఆర్ గారాలపట్టీ కల్వకుంట్ల కవిత.. ఇదిగో ప్రూఫ్!
అలా ప్రేక్షకులకు దగ్గరైన సదా తన ప్రవృత్తి వైల్డ్ లైఫ్ను వదలలేదు. ఈ క్రమంలోనే కొన్ని నెలల కిందట ఓ పామును రక్షించారు. ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేశారు. విశాఖపట్టణం సమీపంలోని చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో సదా పర్యటించారు. పర్యటిస్తున్న సమయంలో ఓ చోట 16 అడుగుల పాము దాగి ఉందని తెలిసింది. వెంటనే ఆమె అక్కడకు వెళ్లారు. ఆ పాముపై స్థానికులు అప్రమత్తం చేశారు. అయితే తాను పామును ఎప్పుడూ నేరుగా చూడలేదని.. రెస్క్యూ ఆపరేషన్ కూడా చూడలేదని సదా అక్కడే ఉండి మొత్తం చూడడమే కాకుండా తన కెమెరాలో బంధించారు.
Also Read: KTR: ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీని ఉరి తీయాలి: కేటీఆర్
అక్కడ నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అతి పెద్ద పాము దూరింది. అక్కడ స్నేక్ క్యాచర్ వెంకట్ను పిలిపించి ఆ పామును పట్టించారు. అతి కష్టంగా 16 అడుగుల పామును వెంకట్ బృందం చాకచక్యంగా ఓ సంచిలోకి పంపించారు. అనంతరం దానిని తీసుకుని ఓ అటవీ ప్రాంతంలో వదిలేశారు. పాములను చంపరాదని.. వాటిని పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేయాలని సదా విజ్ఞప్తి చేశారు. వాటిని హాని చేయకపోతే అవి కూడా మనుషులను హానీ కలిగించవని సదా తెలిపారు. సదా పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 15 లక్షల మంది చూడగా.. 14 వేల మంది ఆ వీడియోకు లైక్ కొట్టారు.
మీరు ఆ వీడియో చూడాలంటే ఈ లింక్పై క్లిక్ చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Samantha Maa Inti Bangaram: స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ తన ఆరోగ్యంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ను అత్యంత వేగంగా, పక్కా ప్లానింగ్తో మొదలుపెట్టారు. పెళ్లైన 37 రోజులకే అభిమానులకు ఒక అదిరిపోయే శుభవార్త చెప్పారు.
నిర్మాతగా సమంత కొత్త అవతారం
సమంత కేవలం నటిగానే కాకుండా, ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఆమె సొంతంగా ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "మా ఇంటి బంగారం" పేరుతో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. అయితే ఈ సినిమాకు కథను సమంత భర్త రాజ్ నిడిమోరు అందిస్తున్నారు.
మళ్లీ వెండితెరపైకి 'బంగారం'
మైయోసైటిస్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల రెండేళ్ల పాటు వెండితెరకు దూరమైన సమంత, ఇప్పుడు "మా ఇంటి బంగారం" చిత్రంతో గ్రాండ్ కమ్బ్యాక్ ఇస్తున్నారు. ఈ చిత్రం ఆమె కెరీర్లో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దీనికి కథను తన భర్త అందించడమే కాకుండా, తానే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.
ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. జనవరి 9న ఈ చిత్ర టీజర్ను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ప్రథమార్థంలోనే (First Half) సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
సక్సెస్ ఫుల్ కెరీర్
'బృందావనం', 'దూకుడు', 'ఈగ' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సౌత్ ఇండియాలోనే టాప్ హీరోయిన్గా ఎదిగిన సమంత.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో స్థిరపడి, కెరీర్ను మరింత కొత్తగా మలుచుకుంటున్నారు. అటు హీరోయిన్గా, ఇటు నిర్మాతగా డ్యూయల్ రోల్లో ఆమె బిజీ బిజీగా గడుపుతున్నారు.
పెళ్లి తర్వాత సమంత తన ప్రొఫెషనల్ లైఫ్లో తీసుకున్న ఈ వేగవంతమైన నిర్ణయాలు చూస్తుంటే, ఆమె మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Telangana Movie Ticket Price Hike: తెలంగాణలో భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ ధరల విషయంలో నెలకొన్న సందిగ్ధానికి హైకోర్టు తెరదించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఇతర సినిమాలపై పడే ప్రభావం నుంచి తాజా చిత్రాలకు మినహాయింపునిస్తూ డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టు ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు..
గతంలో టికెట్ ధరల నియంత్రణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కేవలం 'పుష్ప-2', 'ఓజీ'(OG), 'గేమ్ ఛేంజర్', 'అఖండ-2' చిత్రాలకు మాత్రమే పరిమితమని కోర్టు స్పష్టం చేసింది. అలాగే టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై నిర్మాతలు ఇచ్చే వినతులను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ విన్నపాలపై సానుకూలంగా స్పందిస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
'ది రాజా సాబ్' నిర్మాతల విన్నపం ఏంటి?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది. వారి అభ్యర్థనలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానున్న నేపథ్యంలో ముందు రోజు అనగా జనవరి 8న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శించేందుకు అనుమతి కోరుతున్నారు.
ఆ ప్రీమియర్ షోలకు సింగిల్ స్క్రీన్స్లో రూ.800+జీఎస్టీ.. అలాగే మల్టీప్లెక్స్లో ప్రీమియర్ షో లకు రూ.1000 + జీఎస్టీ వరకు పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వానికి విన్నవించుకోనున్నారు. అలాగే విడుదల తేదీ జనవరి 9 నుంచి సింగిల్ స్క్రీన్ టికెట్లపై రూ.102, అలాగే మల్టీప్లెక్స్లో రూ.132 అదనంగా పెంచాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.
అయితే అదనంగా జనవరి 9న తెల్లవారుజామున 4 గంటల షోలకు కూడా అనుమతి కోరినట్లు తెలుస్తోంది. భారీ పెట్టుబడితో రూపొందించినందున ఈ పెంపు అత్యవసరమని నిర్మాతలు కోర్టుకు విన్నవించినట్లు సమాచారం.
సంక్రాంతి సినిమాలకు లైన్ క్లియర్!
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో టికెట్ ధరల పెంపు ఉండదని ప్రకటించిన నేపథ్యంలో, హైకోర్టు తాజా తీర్పు నిర్మాతలకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి కూడా ఈ తీర్పు సానుకూలంగా మారనుంది.
హైకోర్టు సూచనతో ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది. మరి ప్రభుత్వం ఎంత మేరకు ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో వేచి చూడాలి.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ద్వారా రూపొందించింది. సినిమా టికెట్ ధరలపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tanuja Viral Video: సెలబ్రిటీలను చూడగానే ఆగకుండా ఒక్కసారిగా వారి పైకి దూసుకెళ్లడం కామన్ అయిపోయింది. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో కూడా ఫ్యాన్స్ అదుపుతప్పుతున్నారు. సెలబ్రిటీలపై అభిమానం వెర్రి తలలు వేస్తోంది. నిధి అగర్వాల్, సమంత, అల్లు అర్జున్, విజయ్లను బెంబేలెత్తించిన ఫ్యాన్స్ తాజాగా బిగ్ బాస్ ఫేమ్ తనూజను కూడా హడలెత్తించారు. హైదరాబాద్లోని ఈవెంట్కు వెళ్లిన ఆమె కోసం ఒక్కసారిగా ఫ్యాన్స్ చుట్టూ ముట్టేశారు. నేను మీ కోసమే వచ్చా.. దయచేసి తోయొద్దు అని విజ్ఞప్తి చేసినా వినలేదు. ఆమెను చుట్టుముట్టేసి ఒక్కసారిగా అక్కడ తోపులాట కూడా జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దీంతో చూసినవారు అంత అభిమానం కాదు మూర్ఖత్వం అని నెటిజెన్లు సైతం ఫైర్ అవుతున్నారు.
అంతకు ముందు లుల్లు మాల్లో నిధి అగర్వాల్ ది రాజాసాబ్ ఈవెంట్ కోసం రాగా అక్కడ ఒక్కసారిగా ఆమెపై తోపులాట జరిగింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. అభిమానుల సెలబ్రెటీలు కనిపించగానే అదుపు చేసుకోలేక వారిపై దూసుకెళ్తున్నారు. ఆ తర్వాత సమంత ఒక షాప్ ఓపెనింగ్కు వచ్చిన సమయంలో కూడా ఆమెపై అలాగే దూసుకొచ్చారు. దీంతో సమంత కూడా కాస్త ఇబ్బంది పడింది. ఒక ఫ్యాన్ అయితే ఆమె చీరను కూడా తొక్కేశాడు. అదుపుతప్పితే సమంత కింద పడే ప్రమాదం కూడా జరిగేది.
ఇటీవలె బన్నీ భార్య స్నేహరెడ్డితోపాటు హైదరాబాద్లోని హైటెక్ సిటీ నీలోఫర్ కేఫ్ వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ కూడా చుట్టుముట్టారు. అభిమానులు మరోసారి మితిమీరి ప్రవర్తించారు. వారిని చూసి సెల్ఫీల కోసం ఫ్యాన్స్ గుమిగూడారు. అతి కష్టం మీద బన్నీ స్నేహ కేఫ్ నుంచి బయటికి వెళ్లారు. కారు ఎక్కడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు.
తాజాగా తనూజ కూడా ఇలాంటి ఛేదు అనుభవమే మిగిలింది. ఇక బిగ్ బాస్ 9 తెలుగు రన్నరప్గా తనూజ నిలిచింది. ఈమె పూర్తి పేరు తనూజ పుట్ట స్వామి. ఇండస్ట్రీలోని పలు సీరియల్స్ లో నటించింది. తెలుగు మాత్రమే కాదు కన్నడ సీరియల్ లో కూడా నటించింది. కర్నాటకలోని బెంగళూరు ఆమె స్వస్థలం. మొదటగా 2013లో కన్నడ హారర్ మూవీ నటించారు. జీ తెలుగు సీరియల్ ముద్దమందారంలో తను మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ సీరియల్ 1500 ఎపిసోడ్స్ కూడా పూర్తి చేసుకుంది. ఆ ఫేమ్ తర్వాత బిగ్ బాస్ తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. తనూజ పుట్టస్వామి తెలుగు బిగ్ బాస్ 9 లో ఈ 33 ఏళ్ల సెలబ్రిటీ అడుగుపెట్టి. ఆమె రన్నరప్ నిలవగా.. విన్నర్గా కళ్యాణ్ పడాలా ట్రోఫీ అందుకున్నారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tamanna 6 Crore Remuneration: భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా. కేవలం సినిమాలతోనే కాకుండా, తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లతో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ఈ 'మిల్కీ బ్యూటీ' పారితోషికం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. కేవలం 6 నిమిషాలకు రూ. 6 కోట్లు వసూలు చేసిందట. తమన్నా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి తాజా ఉదాహరణ ఇదే. ఇంతకీ ఆ విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. గోవాలో జరిగిన 2025 నూతన సంవత్సర వేడుకల్లో తమన్నా తన డ్యాన్స్తో అదరగొట్టారు. కేవలం 6 నిమిషాల స్టేజ్ పెర్ఫార్మెన్స్ కోసం ఆమెకు రూ.6 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే ఆమె నృత్యంలోని ప్రతి నిమిషానికి ఒక కోటి రూపాయలు వసూలు చేశారన్నమాట!
యూట్యూబ్ను వణికిస్తున్న చార్ట్బస్టర్స్
తమన్నా కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక అద్భుతమైన డ్యాన్సర్. 2024లో ఆమె నటించిన పాటలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించాయి. బాలీవుడ్లో రూపొందిన 'స్త్రీ 2' సినిమాలోని 'ఆజ్ కీ రాత్' సాంగ్ యూట్యూబ్లో ఏకంగా 90.1 కోట్లకు పైగా (901,784,667) వీక్షణలు సాధించి ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది.
అలాగే రజినీకాంత్ హీరోగా రూపొందిన 'జైలర్' సినిమాలోని 'కావాలయ్యా' సాంగ్లోని స్టెప్పులకు ఫిదా కాని వారు లేరు. ఈ ఒక్క పాట కోసం ఆమె సుమారు రూ.3 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో తమన్నా ఒకరు. ఆమె ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుండి రూ.5 కోట్ల వరకు వసూలు చేస్తారు. వివిధ నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ సుమారు రూ.110 కోట్లుగా ఉంది. 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా'తో మొదలైన తమన్నా సినీ ప్రయాణం.. 'హ్యాపీ డేస్', '100% లవ్', 'బాహుబలి', 'సైరా నరసింహ రెడ్డి' వంటి 89 చిత్రాలతో హీరోయిన్గా విజయవంతంగా కొనసాగుతోంది.
అవార్డులు
తన నటనకు గాను ఆమె మూడు సంతోషం ఫిల్మ్ అవార్డులు, రెండు సైమా అవార్డులతో పాటు ప్రతిష్టాత్మకమైన కళైమామణి అవార్డును కూడా అందుకున్నారు. 'బాహుబలి' వంటి చిత్రాలతో ఆమె పాన్-ఇండియా స్టార్గా ఎదిగారు.
Also Read: School Holiday: తెలంగాణలో సంక్రాంతి హాలీడేస్ ప్రకటన..ఏకంగా 9 రోజులు సెలవులు..ఎప్పటి నుంచి అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
School Holiday Tomorrow: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు శీతాకాల సెలవులను పొడిగిస్తున్నాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఏఏ రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులను ప్రకటించారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి 15 వరకు సెలవులు
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో చలి తీవ్రత, గాలి కాలుష్యం దృష్ట్యా, ఢిల్లీలోని పాఠశాలలు జనవరి 15, 2026 వరకు మూత పడనున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా ఉత్తరప్రదేశ్లో తీవ్రమైన చలితో పాటు దట్టమైన పొగమంచు కారణంగా వేర్వేరు జిల్లాల్లో సెలవులను పొడిగించారు. ఘజియాబాద్లో 8వ తరగతి వరకు విద్యార్థులకు జనవరి 10 వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. అలాగే లక్నోలోని కొన్ని స్కూళ్లకు జనవరి 8 వరకు సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే.
జార్ఖండ్లో సెలవుల పొడిగింపు
జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జనవరి 6 వరకు ఉన్న సెలవులను ఇప్పుడు జనవరి 8, 2026 వరకు పొడిగించింది. ఈ ఆదేశం నర్సరీ నుండి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలకు వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది.
పంజాబ్లో స్కూళ్ల సెలవులు ఇలా..
పంజాబ్ విద్యాశాఖ ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలోని పాఠశాలలు జనవరి 7 (ఈరోజు) వరకు మూసివేయబడ్డాయి. అయితే, వాతావరణ పరిస్థితులు ఇంకా మెరుగుపడకపోవడంతో సెలవులు మరింత పొడిగించే అవకాశం ఉందా లేదా అనేది ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.
త్రిపురలో సెలవుల పొడిగింపు..
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో కూడా చలి గాలులు తీవ్రంగా ఉండటంతో, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను జనవరి 10, 2026 వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
గమనిక: వాతావరణంలో మార్పుల వల్ల సెలవులపై నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి స్కూల్ మేనేజ్మెంట్ లేదా జిల్లా కలెక్టర్ ఇచ్చే అధికారిక సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోండి. కొన్ని చోట్ల పాఠశాలలు తెరిచినప్పటికీ, ఉదయం పూట చలి ఎక్కువగా ఉండటం వల్ల స్కూల్ ప్రారంభ సమయాలను (ఉదాహరణకు ఉదయం 10 గంటలకు) మార్చే అవకాశం ఉంది.
Also Read: School Holiday: తెలంగాణలో సంక్రాంతి హాలీడేస్ ప్రకటన..ఏకంగా 9 రోజులు సెలవులు..ఎప్పటి నుంచి అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Donald Trump-Greenland Controversy: ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్కు గురి చేసిన వెనిజులా అధ్యక్షుడి కిడ్నాప్ ఘటన తర్వాత.. అంతర్జాతీయ రాజకీయాల్లో మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది. ఈసారి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దృష్టి ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్పై పడినట్లు తెలుస్తోంది. ట్రంప్ తాజాగా గ్రీన్లాండ్ను అమెరికాతో విలీనం చేయాలన్న వ్యాఖ్యలు చేయడం యూరప్ దేశాల్లో కలకలం రేపుతోంది.
నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే గ్రీన్లాండ్ను అమెరికా కొనుగోలు చేయాలన్న ఆలోచనను బహిరంగంగా వెల్లడించారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఇప్పుడు వెనిజులా ఘటన తర్వాత ట్రంప్ మళ్లీ అదే అంశాన్ని తెరపైకి తేవడం గమనార్హంగా మారింది. గ్రీన్లాండ్ అమెరికాతో కలిస్తే యూరప్ భద్రతకు కూడా మేలు జరుగుతుందని ట్రంప్ వాదిస్తున్నారు.
కానీ అంతర్జాతీయ రాజకీయ నిపుణులు మాత్రం ట్రంప్ మాటల వెనుక అసలు కారణం వేరేనని అంటున్నారు. గ్రీన్లాండ్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. అలాగే ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న ఈ ద్వీపానికి వ్యూహాత్మకంగా చాలా కీలకమైన స్థానం ఉంది. ఇదే ట్రంప్ అసలు లక్ష్యమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో నాటో దేశాలు వెంటనే స్పందించాయి. మంగళవారం ఏడు నాటో దేశాలు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సహా పలువురు యూరోపియన్ నేతలు ఈ ప్రకటనకు మద్దతు ఇచ్చారు. గ్రీన్లాండ్ దాని ప్రజల సొంతం. దాని భవిష్యత్తును నిర్ణయించేది డెన్మార్క్ ప్రభుత్వం, గ్రీన్లాండ్ ప్రజలే అని వారు తేల్చి చెప్పారు.
ఇది ట్రంప్కు గట్టి రాజకీయ హెచ్చరికగా మారింది. అంతేకాదు, డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ మరింత స్పష్టంగా స్పందించారు. ఏదైనా నాటో మిత్రదేశంపై అమెరికా సైనిక చర్యలకు దిగితే, అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు. అలా జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన నాటో కూటమికే పెద్ద ముప్పు ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. కాగా గ్రీన్లాండ్ అంశం ఇప్పుడు అమెరికా–యూరప్ మధ్య కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ట్రంప్ ఈ విషయంలో ఎంతవరకు ముందుకెళ్తారు? నాటో దేశాలు ఎలా స్పందిస్తాయి? అన్నది రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే కీలక అంశంగా మారనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KTR Speech: 'తెలంగాణను 60 సంవత్సరాల పాటు రాచిరంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 60 ఏళ్ల కాంగ్రెస్ దుర్మార్గాన్ని, తెలంగాణకు చేసిన ద్రోహాన్ని తన దీక్షతో ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ సాధించిన కేసీఆర్పైన అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. నదులు, తెలంగాణపై కనీస అవగాహన లేని హౌలా గాడు రేవంత్ రెడ్డి' అని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Ponnala Laxmaiah: సాగునీటిపై రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ప్రజలు క్షమించరు: పొన్నాల లక్ష్మయ్య
జనగామ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల అభినందన సభ నిర్వహించగా.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'ఇంటింటికి నీళ్లు ఇచ్చినందుకు, అమ్మలక్కలకు ఆసరా పెన్షన్లు ఇచ్చినందుకు, ముసలివారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షన్ను 10 రెట్లు పెంచినందుకు, రైతన్నలకు రైతుబంధు ఇచ్చినందుకు, రైతు భీమా ఇచ్చినందుకు, సాగునీటి ప్రాజెక్టులు కట్టి దేశంలోనే పంటల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపినందుకు, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు కేసీఆర్ను శిక్షించాలా?' అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read: Polavaram Project: ఏపీ చేపట్టిన పోలవరం-నల్లమల్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం: తెలంగాణ నీళ్ల మంత్రి
మూటలు మోసుడు తప్ప రేవంత్ రెడ్డికి ఏం తెలవదు. కేసీఆర్కు రేవంత్ రెడ్డి నీళ్ల గురించి పాఠాలు చెప్తాడు. గోదావరి ఎక్కడుందో రేవంత్కు తెలియదు. భాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెబుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిపోయింది.. ఎలా ప్రజలను మోసం చేశారో ఆలోచించాలి' అని ప్రజలకు మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. రైతుల పరిస్థితులు ఎలా తయారయ్యాయో ఆలోచించాలని చెప్పారు. 'యూరియా కోసం చలిలో ఎదురు చూస్తున్నారు. ఎనకటి రోజులు తెస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.. అదే రాబందుల కాలం రేవంత్ రెడ్డి తెచ్చాడు. గ్రామాల్లో రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిడుతున్నారు' అని కేటీఆర్ వివరించారు.
Also Read: Retirement Age: ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు.. త్వరలో ఉత్తర్వులు
'వరంగల్ రైతు డిక్లరేషన్లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశాడు. ఎకరానికి రైతుబంధు రూ.15,000 ఇస్తా. రైతులతో పాటు కౌలుదారులకు రైతుబంధు ఇస్తా. ప్రతి పంటకు రూ.500 అదనపు బోనస్ చెల్లిస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. మరి రాహుల్ గాంధీ అనే హౌలాగాడిని నడిబజార్లో ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
'2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ అనే హౌలాగాడి మాటలు విని ప్రతి ఒక్క విద్యార్థి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు. విద్యార్థులను, నిరుద్యోగులను మోసగారి మాటలతో రెచ్చగొట్టిన రాహుల్ గాంధీ అనే హౌలాగాడిని ఉరితీయాలి. ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టే ముఖం లేని రేవంత్ రెడ్డి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వలేని రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తానంటున్నాడు. కనీసం తులం బంగారం అయినా ఆడబిడ్డలకు ఇచ్చారా?' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు పుస్తెలతాడు తాకట్టు పెట్టి బతికే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఎందుకు రేవంత్ రెడ్డి అంత పిచ్చిగా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి తన సొంత సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రజల ముందే కొడుతున్నాడు. అడ్డగోలుగా కోరుతున్నాడు, త్వరలో కరుస్తాడు కాబట్టి కట్టివేయమని రేవంత్ రెడ్డి భార్య గీతకు చెప్పినం' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'అధికారం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి ఇంకా ఏడుపు ఎందుకు? తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే రేవంత్ రెడ్డి లంగా పనులు చేసుకుంటూ.. పెయింటింగులు వేసుకుంటూ చదువుకోలేదు. దానికి నేనేం చేయాలి?' అని కేటీఆర్ ప్రశ్నించారు.
'కేసీఆర్ చెప్పు ధూళికి రేవంత్ రెడ్డి సరిపోడు. కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్కే ఆగమాగం అవుతున్నాడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అసెంబ్లీలోనే గుండె ఆగి సస్తాడు' అని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కారు గుర్తు కనిపిస్తే కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతోనే ఓటు వేసి గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాకేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Polavaram Nallamala Sagar Project: 'ప్రభుత్వాలు ఏవైనా వివాదాలేవైనా రాజ్యాంగం ఒక్కటే. రాజ్యాంగపరంగా ఏ పరిష్కారానికైనా సంస్థలను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా ఏర్టైన సంస్థలను, చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయి. చట్టాలకతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల్ల సాగర్పై తెలంగాణ వేసిన పిటిషన్పై ఏపీ వాదనలు విచిత్రంగా ఉన్నాయని చెప్పారు. 'హైదరాబాద్ తెలంగాణకు ఉంది కదా? ఏపీ సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోకూడదా? అని ఏపీ తరఫు అడ్వకేట్ ఎలా వాదిస్తారు? హైదరాబాద్ తెలంగాణలో ఉంటే ఏపీ ఏమైనా చేసుకోవచ్చా?' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై ఏం చేయాలో విభజన చట్టంలో ఉందని గుర్తుచేశారు.
Also Read: Polavaram Project: ఏపీ చేపట్టిన పోలవరం-నల్లమల్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం: తెలంగాణ నీళ్ల మంత్రి
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కీలక ప్రసంగం చేశారు. 'ఏపీ చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ విభజన చట్టంలో ఎక్కడ ఉంది? అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.'కేంద్ర ప్రభుత్వం ఎలా కమిటీలు వేస్తుంది? పోలవరం నల్లమల సాగర్కు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుమతి లేనప్పుడు కమిటీలు ఎలా వేస్తారు? మీటింగ్కే వెళ్లబోమని చెప్పిన వారు కమిటీకి ఎలా అంగీకరిస్తారు? సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత కమిటీకి తెలంగాణ సభ్యుల పేర్లు ఎందుకు పంపింది? కమిటీ వేసుకున్నారు కోర్టుకు వచ్చారు అని నిన్న సుప్రీంకోర్టు తెలంగాణను ప్రశ్నించింది. ప్రజలు అవకాశం ఇచ్చారు. దానిని ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలి. రాజ్యంగపరమైన ఇరిగేషన్ సంస్థలు ఉన్నాయి' అని వివరించారు.
Also Read: Harish Rao: ఫోన్ ట్యాపింగ్పై రేవంత్ రెడ్డికి బలమైన చెంపదెబ్బ: హరీశ్ రావు
'తెలంగాణ కృష్ణా, గోదావరి నదుల మధ్యలో ఉంది. తెలంగాణకు ఎత్తిపోతల పథకాలే శరణ్యం. సీమాంధ్ర పాలనలో తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేవు. నీరు రాకుండా కుట్రలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టులపై చిల్లర రాజకీయం చేస్తోంది. ఒకవైపు నదీజలాల పంపిణీ కమిటీల ఏర్పాటు చేసుకొని.. మరో వైపు తెలంగాణ ప్రాజెక్టుల పనులు ఆపడం దౌర్భాగ్యం' అని ఆవేదన వ్యక్తం చేశారు. 'కేంద్రం ఒత్తిడిలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వంగుతోంది. ప్రభుత్వం క్షుణ్నంగా చట్టాలను చదివి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలి' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సూచించారు.
'పాలమూరు ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నా. అవగాహన లేకుండా పీపీటీ అసెంబ్లీలో పెట్టారు. కేసీఆర్ మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా? అసెంబ్లీకి కేసీఆర్ రావడం లేదని చిల్లరగా మాటాడుతున్నారు. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి డాక్యుమెంట్లలోని పేరాగ్రాఫ్ విడిచిపెట్టి తనకు అనుకూలంగా ఉన్న వాటినే చదవడం దారుణం ఇదే నా సీఎం సంస్కారం?' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. కేసీఆర్ రాజకీయ జీవితం ముందు రేవంత్ రెడ్డి ఎంత అని ఎద్దేవా చేశారు. కేసీఆర్పై అవాకులు చవాకులు మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. సాగునీటిపై ప్రభుత్వం తీరు చాలా బాధిస్తుంది. చట్టసభలు చట్టాలు చేయడానికి ఉన్నాయి. కానీ పంచాయతీలు పెట్టడానికి కాదు. రేవంత్ రెడ్డి రాజీనామా చేసినా సాగునీటిపై ఆయన చేసిన మోసాలను ప్రజలు క్షమించరు. అసెంబ్లీని అసెంబ్లీలాగా నడపడం లేదు' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి