Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500089

జిల్లా మణికొండ పట్టణంలో పెద్ద పాము కనిపించింది

Jun 19, 2024 06:15:40
Manikonda, Telangana

రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీ రోడ్ నెం.4లో 12 అడుగుల పొడవున్న పాము కనిపించింది. 12 అడుగుల పామును చూసిన ప్రజలు వెంటనే భయాందోళనకు గురై పాము పట్టేవారికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేహ 12 అడుగుల పామును చాకచక్యంగా పట్టుకుంది.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Feb 08, 2026 19:29:03
Sangareddy, Telangana:

Municipal Elections: 'గల్లీల్లో పారే మురుగు నీరు కన్నా.. రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చే మురికి మాటలు మరింత కంపు కొడుతున్నాయి. కమీషన్ల కోసం రూ.40,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ఉన్నాయి కానీ ఉద్యోగులు, పేదలకు ఇవ్వడానికి రేవంత్ దగ్గర డబ్బులు లేవు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం గులాబీ జెండానే ఎగురుతోందని జోష్యం చెప్పారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కోహీర్, నర్సాపూర్, మెదక్.. మున్సిపాలిటీ ఏదైనా గెలిచేది కారు గుర్తేనని హరీశ్‌ రావు ప్రకటించారు.

Also Read: YS Sharmila: నామ్ నరేందర్.. కాం సరెండర్: ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలో బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక ప్రసంగం చేశారు. 'మోసం చేసిన వాళ్లకు ఓటేస్తామా? అన్నం పెట్టిన కేసీఆర్‌కు ఓటేస్తామా? హామీల పేరుతో జనాలకు సున్నం పెట్టిన రేవంత్ రెడ్డికి ఓటేద్దామా? ప్రజలు ఆలోచించుకోవాలి' అని విజ్ఞప్తి చేశారు. 'తెలంగాణ సాధిస్తానంటే సాధించి చూపించింది కేసీఆర్ రూ.2000 పింఛన్ ఇస్తానంటే ఇచ్చింది కేసీఆర్. కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష, కేసీఆర్ కిట్ కింద రూ.13,000 ఇచ్చి చూపించింది కేసీఆర్. ఇదీ అసలు నాయకుడి లక్షణం' అని వివరించారు.

Also Read: Forensic Lab: నేరగాడే సీఎం కావడంతోనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ప్రమాదం.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్‌

'సంగారెడ్డి పట్టణ అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగింది. రూ.34 కోట్లతో ఇంటింటికి తాగునీళ్లు ఇచ్చి అక్కచెల్లెళ్ల కష్టాలు తీర్చాం. చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు రోడ్లు, లైట్లు, డివైడర్లు  అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయింది. సంగారెడ్డిలో ఎక్కడైనా ఒక్క రూపాయి పని చేశారా?' అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం శాంక్షన్లు, టెండర్లు లేకుండా కొబ్బరికాయలు కొట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

Also Read: Harish Rao: బూతుల రేవంత్‌ రెడ్డికి పోలింగ్ బూత్‌లో  బుద్ధి చెప్పాలి: హరీశ్ రావు

'రేవంత్ రెడ్డిది కమీషన్ల ప్రభుత్వం. రూ.95 వేల కోట్ల టెండర్లు పిలిచి డబ్బులు ఇవ్వడానికి ఉన్నాయి. రూ.40,000 కోట్లు కాంట్రాక్టర్లకు, మిత్రుకు కమీషన్లు తీసుకోవడానికి డబ్బులు ఉన్నాయి కానీ.. రిటైర్డ్ ఉద్యోగులకు, పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవా?' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తారు.. రిటైర్డ్ ఉద్యోగులు కమీషన్లు ఇవ్వరని వాళ్లకు ఇవ్వడం లేదా? అని నిలదీశారు. 'రుణమాఫీ పేరుతో దేవుళ్ల మీద ఒట్టేసి మోసం చేశారు. ఆగస్టు 15 కల్లా చేస్తానన్నాడు.. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా రైతులు ఆందోళన చేస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా.. రేవంత్ రెడ్డి నువ్వు ఏ ఊరికైనా రా.. లేదా కొడంగల్ కు రమ్మన్నా వస్తా.. రుణమాఫీ పూర్తిగా జరిగిందో లేదో తేల్చుకుందాం' అని రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు సవాల్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 08, 2026 16:20:04
Hyderabad, Telangana:

England Vs Nepal Match Result: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్-సి మ్యాచ్‌లో పెను సంచలనం తృటిలో తప్పింది. పవర్‌హౌస్ ఇంగ్లాండ్‌ను పసికూన నేపాల్ గడగడలాడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ఇంగ్లాండ్ కేవలం 4 పరుగుల స్వల్ప తేడాతో బయటపడింది. ఓడినా కూడా ప్రపంచ క్రికెట్ అభిమానుల హృదయాలను నేపాల్ గెలుచుకుంది.

ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నేపాల్ ప్రదర్శన చూసి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. అసోసియేట్ దేశమైనా, ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు దీటైన పోటీని ఇచ్చింది.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నేపాల్ బౌలర్ల ధాటికి స్టార్ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ త్వరగానే పెవిలియన్ చేరారు. జాకబ్ బెథెల్ (55) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 

ఇన్నింగ్స్ చివరలో విల్ జాక్స్ కేవలం 18 బంతుల్లోనే 39* పరుగులు చేసి స్కోరును 184/7 కి చేర్చాడు. దిపేంద్ర సింగ్ ఐరీ (2/23), నందన్ యాదవ్ (2 వికెట్లు) అద్భుతమైన స్పెల్స్‌తో ఇంగ్లీష్ బ్యాటర్లను కట్టడి చేశారు.

నేపాల్ వీరోచిత పోరాటం
185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ ఏ దశలోనూ తగ్గలేదు. ఓపెనర్లు ఆసిఫ్ షేక్, కుశల్ భుర్తేల్ జట్టుకు బలమైన పునాది వేశారు. కెప్టెన్ రోహిత్ పౌడెల్ (39), ఆల్‌రౌండర్ దిపేంద్ర సింగ్ ఐరీ (44) ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా ఐరీ ఆడిన రివర్స్ స్వీప్‌లు, ఇన్నోవేటివ్ షాట్లు వాంఖడే స్టేడియాన్ని హోరెత్తించాయి. చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు అవసరం కాగా, ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ సామ్ కరన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో నేపాల్ 180/6 వద్ద ఆగిపోయింది.

రికార్డులు
టీ20 ప్రపంచకప్ చరిత్రలో నేపాల్ సాధించిన అత్యధిక స్కోరు (180/6) ఇదే. ఇంగ్లాండ్ వంటి అగ్రశ్రేణి జట్టును ఓటమి అంచు వరకు తీసుకెళ్లిన నేపాల్ టీమ్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.

అనుభవం లేకపోయినా, అద్భుతమైన పోరాట పటిమను కనబరిచిన నేపాల్, భవిష్యత్తులో పెద్ద జట్లకు ముప్పుగా మారుతుందని నిరూపించింది. ఇంగ్లాండ్ విజయం సాధించినప్పటికీ, ఈ మ్యాచ్ 'నేపాల్ రైజ్'ను ప్రపంచానికి చాటిచెప్పింది.

Also Read: Samsung 183 Ltr Refrigerator: అమెజాన్ సమ్మర్ ధమాకా.. రూ.23,000 శామ్‌సంగ్ ఫ్రిజ్..ఇప్పుడు కేవలం రూ.15 వేలకే!

Also Read: Gold Silver Price Prediction: మహిళలకు తీపికబురు..లక్షకు పైగా దిగివచ్చిన వెండి ధర...భారీగా తగ్గిన బంగారం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 08, 2026 15:43:37
Hyderabad, Telangana:

Amazon Samsung Refrigerator: అమెజాన్ సమ్మర్ సేల్‌లో భాగంగా మధ్యతరగతి వినియోగదారులకు శామ్సంగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న Samsung 183 లీటర్, 4 స్టార్, డిజిటల్ ఇన్వర్టర్ రిఫ్రిజిరేటర్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.

వేసవి కాలం మొదలవుతున్న తరుణంలో కొత్త ఫ్రిజ్ కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. అత్యుత్తమ రేటింగ్ ఉన్న ఈ శామ్సంగ్ మోడల్‌పై ధర తగ్గింపుతో పాటు అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ 'లిమిటెడ్ టైమ్ డీల్' ద్వారా లభిస్తున్న ప్రయోజనాలు ఇవే! ఈ ఫ్రిజ్ అసలు ధర రూ.22,999 కాగా.. ప్రస్తుతం 30% డిస్కౌంట్‌తో రూ.15,990కే అందుబాటులో ఉంది. ఆర్డర్ చేసే సమయంలో అదనంగా రూ.1,000 కూపన్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీంతో ధర మరింత తగ్గుతుంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. బడ్జెట్ ఇబ్బంది ఉన్న వారికి నెలకు కేవలం రూ.562 నుండి ప్రారంభమయ్యే 'నో కాస్ట్ ఈఎంఐ' సౌకర్యం కూడా ఉంది.

ఈ ఫ్రిజ్ ఎందుకు ప్రత్యేకమైనది? (కీ ఫీచర్లు)
కేవలం ధర మాత్రమే కాదు, ఫీచర్ల పరంగా కూడా ఇది బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఇది వోల్టేజ్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా పని చేస్తూ విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తుంది. దీని కంప్రెసర్‌పై ఏకంగా 20 ఏళ్ల వారంటీని కంపెనీ ఇస్తోంది. ఎనర్జీ సేవింగ్‌లో ఇది మేటి. తక్కువ కరెంటు బిల్లుతో ఎక్కువ కూలింగ్ అందిస్తుంది.

ఫ్రిజ్ కింద ఉండే అదనపు డ్రాయర్‌లో ఉల్లిపాయలు, బంగాళదుంపలు వంటి చల్లదనం అవసరం లేని వస్తువులను భద్రపరుచుకోవచ్చు.'కామెల్లియా పర్పుల్' కలర్, ఫ్లోరల్ డిజైన్ మీ కిచెన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది.

తక్కువ ధరలో బ్రాండెడ్, నాణ్యమైన రిఫ్రిజిరేటర్ కావాలనుకునే వారికి ఈ శామ్సంగ్ 183 లీటర్ల మోడల్ సరైన ఛాయిస్. అయితే ఇది లిమిటెడ్ టైమ్ డీల్ మాత్రమే, కాబట్టి స్టాక్ ముగిసేలోపే నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

Also Read: Gold Silver Price Prediction: మహిళలకు తీపికబురు..లక్షకు పైగా దిగివచ్చిన వెండి ధర...భారీగా తగ్గిన బంగారం!

Also Read: Telangana Municipal Elections: తెలంగాణలో మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. భారీగా నగదు పట్టివేత..ఎన్ని కోట్లు సీజ్?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 08, 2026 15:24:49
Hanamkonda, Telangana:

Forensic Lab Fire Accident: ఓటుకు నోటు కేసు సాక్ష్యాధారాలను చెరిపేందుకే రేవంత్‌ రెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం కుట్ర చేశాడని మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఎఫ్ఎస్‌ఎల్ ప్రమాదం ముమ్మాటికీ కుట్రనే అని ప్రకటించారు. ఓటుకు నోటు సాక్ష్యాధారాలను శాశ్వతంగా తొలగించేందుకే ఈ ప్రమాదం అనే నాటకమని ఆరోపించారు. ఎఫ్ఎస్‌ఎల్ ప్రమాదంపైన అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. నేరగాడే ముఖ్యమంత్రి కావడంతోనే ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Also Read: YS Sharmila: నామ్ నరేందర్.. కాం సరెండర్: ప్రధానిపై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

హన్మకొండలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ అగ్నిప్రమాదంపై స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు రేవంత్‌ రెడ్డి మంటలు పెట్టారని ఆరోపించారు. ఢిల్లీలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు ఏమైనా దీని వెనుక ఉన్నారా అనే విషయం నిగ్గుతేల్చాలి అని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి పాత్రపైన నిష్పాక్షిక విచారణ జరగాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Harish Rao: బూతుల రేవంత్‌ రెడ్డికి పోలింగ్ బూత్‌లో  బుద్ధి చెప్పాలి: హరీశ్ రావు

'ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో రేవంత్ రెడ్డితో పాటు వేలాది మంది ఘోరమైన నేరస్తుల కేసుల తాలూకు సాక్ష్యాలు దగ్ధమయ్యాయి. వారంతా ఈరోజు సమాజంలో స్వేచ్ఛగా తిరిగే అవకాశం లభిస్తుంది. రేవంత్ రెడ్డికి, బడే భాయ్ (బీజేపీ)కి సంబంధం లేకుంటే ఈ అంశంపై విచారణకు ఆదేశించాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోరారు. తెలంగాణ ప్రజలు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక కుట్రగా భావిస్తున్నారు

'అగ్ని ప్రమాదానికి కారణం ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రే కుట్ర చేసి సాక్ష్యాధారాలను దగ్ధం చేశారు' అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 'ఓటుకు నోటు కేసు దాదాపు ముగింపు దశకు వచ్చి శిక్ష పడుతుందన్న కారణంగానే హోం శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ప్రమాదం వెనుక ఉన్నారు' అని తెలిపారు. ఇదే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్, దొంగ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడంతో అనేక దుర్మార్గాలను తెలంగాణ ప్రజలు రెండేళ్లు చవిచూస్తున్నారని వివరించారు. అలాంటి వరుస సంఘటనల్లో భాగంగానే తాజాగా ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Also Read: KT Rama Rao: తెలంగాణకు కాంగ్రెస్‌, బీజేపీలు చేసిందేమీ లేదు: కేటీఆర్‌

'ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి ఆ కేసులోని ఆధారాలన్నింటినీ భద్రపరిచిన ఫోరెన్సిక్ లాబొరేటరీని కుట్రపూరితంగా ఆధారాలన్నీ ధ్వంసం చేసేటట్టు అగ్ని ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారు. మూడు అంతస్తుల భవనంలో జరిగిన ప్రమాదాన్ని, మొదటి అంతస్తులో ఉన్న అగ్నికీలలను ఆర్పడానికి మూడున్నర గంటల సమయం పట్టింది అంటే ఇంతకు మించి కుట్ర అనడానికి వేరే విషయం అవసరం లేదు' అని కేటీఆర్‌ వివరించారు. ఈ ప్రమాదం జరిగిన తీరుపై కేటీఆర్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. 

'అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఫోరెన్సిక్ ల్యాబ్‌లో చలికాలం అగ్ని ప్రమాదం జరగడం, 24 గంటలు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఉద్యోగులు ఎవరూ లేరని చెప్పడం, నిన్న ప్రమాదం పెద్దగా జరగలేదని చెప్పిన ప్రభుత్వం ఈరోజు మొత్తం 2015 నుంచి పదేళ్ల పాటు అనేక కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రకటించడం చూస్తుంటే ఇది కచ్చితంగా రేవంత్ రెడ్డి చేయించిన పనే' అని మాజీ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 13:25:58
Hyderabad, Telangana:

Venomous Snake Viral Video Watch: ప్రస్తుతం చాలా పాములు అడవుల్లో నుంచి జనాలు తిరిగే ప్రదేశాల్లోకి సంచారం చేస్తున్నాయి. ముఖ్యంగా చాలామంది వాటిని చంపకుండా రక్షించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది స్నేక్యాచెస్ వీటిని పట్టుకోవడంలో ఎంతగానో సహాయపడుతున్నారు. అయితే, కొంతమంది స్నేక్ క్యాచర్స్ ప్రతిరోజు మూడు నుంచి నాలుగు పాములను పట్టుకుంటున్నారు. ఇలా పట్టుకున్న పాములను అడవిలో సురక్షితంగా వదిలేస్తున్నారు. తాజాగా ఓ స్నేక్ క్యాచర్ ఇలా వదిలేస్తున్న పాములను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఈ షార్ట్ వీడియో వైరల్‌గా మారింది. 

KP SNAKE EXPRT అనే ఛానల్ నుంచి పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి వివిధ గ్రామాల్లో పట్టుకున్న పాములను డబ్బాలో బంధించి.. ఓ సురక్షితమైన అడవిలో వదిలి పెడుతున్న దృశ్యాలను షేర్ చేశారు. ఇక ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి ప్లాస్టిక్ డబ్బాలో ఏడు నుంచి పది వరకు అత్యంత ప్రమాదకరమైన పాములతో పాటు గుడ్లు గుడ్లను భద్రపరిచి ఉండడం చూడొచ్చు. అయితే, ఆ వ్యక్తి డబ్బాను పట్టుకొని ఓ సురక్షితమైన ప్రదేశంలో దాని మూతాను విప్పడం మీరు చూడొచ్చు. 

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

ఆ వ్యక్తి ఆ మూతను విప్పుతూ పాములన్నింటినీ.. ఎంతో నెమ్మదిగా ఆ నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టేసాడు. అయితే, ఇందులో ఆశ్చర్యం ఏంటంటే.. అందులో నుంచి చిన్న చిన్న గుడ్లు కూడా బయటికి పడ్డాయి. వీటిని బాగా పరిశీలించి చూస్తే.. ఇవి పాము గుడ్లుగా తెలుస్తోంది. ఇందులోనే ఉన్న కొన్ని పాములు ఆ డబ్బాలు గుడ్లను పెట్టినట్లు సమాచారం. అయితే, ఆ డబ్బాలో నుంచి పాములను బయటికి వేయగానే.. అక్కడి నుంచి అవన్నీ సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోయాయి. 

ఇక ఆ డబ్బా బోర్లించిన తర్వాత పాములు వెళ్ళిపోగా.. గుడ్లు మాత్రం అక్కడే ఉండిపోవడం మీరు వీడియోలో చూడొచ్చు. అయితే ఇందులో కొన్ని చిన్న పిల్లలు మాత్రం చాలా నెమ్మదిగా వాకుతూ సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడం మీరు క్లియర్‌గా ఈ వీడియోలో చూడొచ్చు. ఈ పాములన్ని విషపూరితమైన కావా అన్న విషయాలు తెలియనప్పటికీ.. ఇందులో ఉన్న కొన్ని పాములు మాత్రం అత్యంత ప్రమాదకరమైనవని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ షార్ట్ వీడియో ఓ ప్రముఖ స్నేక్ క్యాచర్ కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 13:15:18
Hyderabad, Telangana:

Two Cobras Video Watch Now: ప్రకృతిలోని కొన్ని భయంకరమైన దృశ్యాలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా నెటిజన్లను ఊహించని స్థాయిలో వణికిస్తోంది. ఈ వీడియోను "KP SNAKE EXPRT" అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన రెండు కింగ్ కోబ్రాలు ఒక రోడ్డుపై పూసలు కొడుతూ కనిపించడం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు. రోడ్డుపై ఇలా ప్రమాదకరమైన రెండు తాగు పాములు ఉండడం ఏంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో? ఈ వీడియోని ఎవరు తీశారో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ షార్ట్ వీడియోలో రెండు ప్రమాదకరమైన నాగు పాములు పడగవిప్పి గాల్లోకి లేచి ఓ రోడ్డుపై నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. ఈ పాములను చూస్తుంటే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అంతేకాకుండా ఆ పాములు భయంకరంగా శబ్దం చేయడం కూడా మీరు చూడొచ్చు. రెండు పాములు ఒకదాని ముందు మరొకటి నిలబడి ఉండటం.. అలాగే శబ్దం చేయడం చూస్తుంటే ఈ రెండు పాములు అతిధారణంగా దాడి చేసుకునే అవకాశాలు ఉన్నాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. పాములు ఒకదానిపై ఒకటి దాడి చేసుకునే క్రమంలో ఇలా సంకేతాలు ఇచ్చుకుంటాయని వారి తెలుపుతున్నారు.

ఈ రెండు ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలు ఒకదానికొకటి పోటీగా ఉన్నట్లుగా.. ఎవరు పై చేయి సాధిస్తారనే రీతిలో ఒకదానిపై ఒకటి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియో చూస్తే తెలుస్తుంది. పాములు బుసలు కొడితే ఏ జంతువైనా కాస్త భయపడుతూ ఉంటుంది. కానీ రెండు ఎదురెదురుగా ఒకదానికొకటి పాములే ఉండడంతో ఏమాత్రం భయపడలేకపోయాయి. అంతేకాకుండా ఆ పాములు కొద్దిసేపు అలాగే ఎదురెదురుగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

ఈ వీడియో షార్ట్ వీడియో అయినప్పటికీ.. దాదాపు 3.5 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను లక్షలాదిమంది లైక్ చేసి.. వేల సంఖ్యలో కామెంట్లు చేసినట్లు మీరు చూడొచ్చు. సాధారణంగా చాలామంది పాములకు సంబంధించిన ఆశ్చర్యపరిచే వీడియోలు చూడడమే కాకుండా షేర్ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా వీడియోలు భారీ మొత్తంలో వ్యూస్ సంపాదిస్తున్నాయని సమాచారం.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 13:03:52
Hyderabad, Telangana:

Oppo K14x 5g Price In India Launch Date News: ఒప్పో నుంచి భారత మార్కెట్‌లోకి మరో కొత్త మొబైల్ విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ OPPO K14x 5G పేరుతో ఈ మొబైల్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ కామర్స్ వెబ్సైట్‌లో ఈ మొబైల్‌పై ప్రత్యేకమైన మైక్రో సైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే దీనిని కంపెనీ ఫిబ్రవరి 10వ తేదీన భారతదేశంలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి.. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టును కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారత మార్కెట్‌లోకి OPPO K14x 5G స్మార్ట్ ఫోన్ ఫిబ్రవరి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఒప్పో కంపెనీ ఓ ప్రత్యేకమైన ఈవెంట్లో భాగంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మరిన్ని ఎలక్ట్రానిక్స్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో ప్రత్యేకమైన 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 1125 నిట్‌ల గరిష్ట బ్రైట్నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు 6500mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 22 గంటల పాటు నాన్ స్టాప్ ప్లే బ్యాక్ అందిస్తుంది. అంతేకాకుండా 11 గంటలకు పైగా గేమింగ్ చేయవచ్చు.

OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్ వెనక భాగంలో ఉండే కెమెరా మాడ్యూల్ అద్భుతంగా ఉంటుంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. దీంతోపాటు మరో రెండు అదనపు కెమెరాలను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ మొత్తం 2 స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా రెండు కలర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు OS 15 సపోర్ట్‌తో ఇది అందుబాటులోకి రాబోతోంది. ఇందులో కంపెనీ ప్రత్యేకంగా రివర్స్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే వాటర్ రెసిస్టెంట్ సపోర్టు కూడా ఉంటుంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఈ OPPO K14x 5G మొబైల్ ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేసి.. అతి త్వరలోనే ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మొదటి సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే ఏకంగా కార్డ్ ఆఫర్స్ పై రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే దీనిపై అదనంగా ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్‌ బోనస్‌ను కూడా అందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారు దాదాపు మరో రెండు వారాలపాటు వేచి చూడాల్సి ఉంటుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 08, 2026 12:17:31
Hyderabad, Telangana:

Telangana Municipal Elections Money Seized: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న నగదు, మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుండి గత వారం రోజుల్లోనే భారీ మొత్తంలో ఆస్తులను సీజ్ చేసి రికార్డు సృష్టించారు.

ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు, నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన ఏడు రోజుల్లోనే కోట్లాది రూపాయల విలువైన నగదు, మద్యం మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఎన్నికల సంఘం (EC) వెల్లడించిన గణాంకాల ప్రకారం సీజ్ చేసిన వస్తువుల జాబితా ఇలా ఉంది.  సుమారు రూ.89.30 లక్షల లిక్విడ్ క్యాష్.. రూ.84.89 లక్షల విలువైన మద్యం సీసాలు.. రూ.14.69 లక్షల విలువైన విలువైన లోహాలు (బంగారం & వెండి), అన్నీ కలుపుకొని వారం రోజుల్లో రూ.2 కోట్లకు పైగా ఆస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

'టార్గెట్ మనీ'పై పోలీసుల నిఘా
ఈసారి ఎన్నికల్లో పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. కేవలం నగదు మాత్రమే కాకుండా ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన ఇతర వస్తువులపైనా నిఘా పెట్టారు. తనిఖీల్లో బియ్యం బస్తాలు, చీరలు, ల్యాప్‌టాప్‌లు, క్రీడా సామాగ్రి, అక్రమంగా తరలిస్తున్న వాహనాలను కూడా సీజ్ చేశారు. ప్రతిరోజూ పట్టుబడుతున్న సొమ్ము వివరాలను పోలీసులు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి నివేదిస్తున్నారు.

ముమ్మరంగా తనిఖీలు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ (ఫిబ్రవరి 11) దగ్గర పడుతుండటంతో పోలీసులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. లెక్కచూపని నగదును తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లే వారు తప్పనిసరిగా సరైన ఆధారాలను చూపాలని సూచించారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ తనిఖీలు మరింత తీవ్రతరం కానున్నాయి.

Also Read: Peddi Second Song Release: 'పెద్ది' సెకండ్ సాంగ్ రెడీ! మాస్ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌కు పూనకాలే..రిలీజ్ ఎప్పుడంటే?

Also Read: India Vs Pakistan Revenue: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ ఆగిపోతే ఎంత నష్టమో తెలుసా? వేల కోట్ల ఆదాయానికి గండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 08, 2026 11:39:52
Hyderabad, Telangana:

Peddi Second Single Release Date: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పాట 'చికిరి చికిరి' సృష్టించిన ప్రభంజనం తర్వాత, ఇప్పుడు సెకండ్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి సెకండ్ సాంగ్ విడుదలకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫిబ్రవరి 14న రిలీజ్?
సినిమా వర్గాల సమాచారం ప్రకారం..ఫిబ్రవరి 14న (ప్రేమికుల దినోత్సవం) కానుకగా ఈ సెకండ్ సింగిల్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మొదటి పాట మెలోడీ టచ్‌తో అలరించగా, ఈ రెండో పాట మాత్రం పక్కా మాస్ సాంగ్‌ అని, థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ 200 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో రెండో పాటపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

వృద్ది సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పలువురు దిగ్గజ నటులు నటిస్తున్నారు.  కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో మెరవనున్నారు. రత్నవేలు (సినిమాటోగ్రఫీ), నవీన్ నూలి (ఎడిటింగ్) వంటి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తున్నారు.

రిలీజ్ డేట్ ఖరారు
సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న 'పెద్ది' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. రామ్ చరణ్ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: India Vs Pakistan Revenue: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ ఆగిపోతే ఎంత నష్టమో తెలుసా? వేల కోట్ల ఆదాయానికి గండి!

Also Read: Tirumala Laddu Issue: "తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఎక్కడుంది? నిరూపిస్తే దేనికైనా సిద్ధమే" వైసీపీ నేత వెల్లంపల్లి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 08, 2026 11:03:38
Hyderabad, Telangana:

India Vs Pakistan Match Revenue: ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్-పాక్ టీ20 ప్రపంచకప్ పోరుపై సందిగ్ధత కొనసాగుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం తన పట్టు వీడకపోవడంతో, క్రికెట్ ప్రపంచంలో అత్యంత విలువైన ఈ మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే ఐసీసీ (ICC)కి, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి ఎంత నష్టం వాటిల్లుతుందనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్థాన్ ప్రభుత్వం భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించడమే కాకుండా, ఐసీసీకి అధికారికంగా లేఖ రాస్తూ 'ఫోర్స్ మేజర్' క్లాజ్‌ను తెరపైకి తెచ్చింది.

'ఫోర్స్ మేజర్' అంటే ఏమిటి?
ఇది ఒక చట్టపరమైన నిబంధన. యుద్ధాలు, ప్రకృతి విపత్తులు లేదా ప్రభుత్వ ఆదేశాల వంటి అనివార్య కారణాల వల్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేనప్పుడు దీనిని ఉపయోగిస్తారు. కేవలం భారత్‌తో మ్యాచ్‌కే ఈ నిబంధన ఎలా వర్తిస్తుందని ఐసీసీ ప్రశ్నిస్తోంది. మిగతా జట్లతో ఆడుతున్నప్పుడు లేని 'అనివార్య పరిస్థితి' భారత్‌తోనే ఎందుకు వస్తుందని పీసీబీని నిలదీసింది.

ఆర్థికంగా ఎవరికి ఎంత నష్టం?
ఈ ఒక్క మ్యాచ్ రద్దయితే కలిగే నష్టం ఊహాతీతం.  భారత్-పాక్ మ్యాచ్ ద్వారా సుమారు రూ.2,200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ఈ మ్యాచ్‌లో కేవలం 10 సెకన్ల యాడ్ కోసం రూ.40 లక్షల వరకు వెచ్చిస్తారు. మ్యాచ్ లేకపోతే దాదాపు రూ.250 కోట్ల ప్రకటనల ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది.

ఐసీసీతో భారీ ఒప్పందం కుదుర్చుకున్న జియోస్టార్ (JioStar) వంటి సంస్థలకు ఇది కోలుకోలేని దెబ్బ. ఒకవేళ ఐసీసీ దీన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తే, పాకిస్థాన్‌కు అందాల్సిన వార్షిక నిధులపై కోత విధించడమే కాకుండా భారీ జరిమానా వేసే అవకాశం ఉంది.

రాజకీయ రంగు..చర్చల పర్వం
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా బహిష్కరణను సమర్థించడంతో ఈ వ్యవహారం రాజకీయ మలుపు తీసుకుంది. ప్రస్తుతం ఐసీసీ-పీసీబీ మధ్య నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఘర్షణ వైఖరి కంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐసీసీ మొగ్గు చూపుతోంది.

టీమ్ ఇండియా ప్లాన్ ఏంటి?
భారత జట్టు షెడ్యూల్ ప్రకారమే కొలంబోకు వెళ్లనుంది. ఫిబ్రవరి 15న భారత ఆటగాళ్లు కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియానికి చేరుకుంటారు. ఒకవేళ నిర్ణీత సమయానికి పాక్ జట్టు రాకపోతే, అంపైర్లు, మ్యాచ్ రిఫరీ పరిశీలించి భారత్‌ను విజేతగా ప్రకటిస్తారు. దీనివల్ల భారత్‌కు పాయింట్లు లభిస్తాయి కానీ అభిమానులు మాత్రం నిరాశ చెందుతారు.

వాణిజ్య ప్రయోజనాలు, క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని దృష్టిలో ఉంచుకుంటే పాక్ చివరి నిమిషంలో మనసు మార్చుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఫిబ్రవరి 15న టాస్ పడుతుందా లేదా అనేది ఇప్పుడు కోట్లాది మంది ఎదురుచూస్తున్న ప్రశ్న.

Also Read: Tirumala Laddu Issue: "తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఎక్కడుంది? నిరూపిస్తే దేనికైనా సిద్ధమే" వైసీపీ నేత వెల్లంపల్లి!

Also Read: India Vs USA Match: టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం..పోరాడి ఓడిన యూఎస్ఏ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 08, 2026 10:27:58
Hyderabad, Telangana:

Telangana RTC Employees: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆర్టీసీ ఉద్యోగులను భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు కుటుంబంలో తీవ్ర విషాదం ఏర్పడితే ఆ కుటుంబం తీవ్ర కష్టాల్లో పడకుండా ఆర్థిక ఊరట కలిగించేలా ప్రభుత్వం బీమా సదుపాయం కల్పిస్తోంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాలకు రూ.కోటి పరిహారం దక్కుతోంది. తాజాగా ఓ ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందించింది. సంస్థ సిబ్బందికి యూబీఐ సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ చాలా మేలు చేస్తోందని ప్రభుత్వం ప్రకటించింది.

Also Read: Harish Rao: బూతుల రేవంత్‌ రెడ్డికి పోలింగ్ బూత్‌లో  బుద్ధి చెప్పాలి: హరీశ్ రావు

రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబానికి తెలంగాణ ఆర్టీసీ అండగా నిలిచింది. ప్రమాదంలో మృత్యువాత పడిన ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్స్ కుటుంబాలకు  ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. కుషాయిగూడ, ఉప్పల్ డిపోలకు చెందిన డ్రైవర్స్ వెంకటేశ్, డీఆర్ గౌడ్‌ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తమ కుటుంబానికి ఆధారమైన వారు మృతి చెందడంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. ఆర్టీసీ గతంలో తీసుకున్న యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాలకు భారీ ప్రయోజనం కల్పించింది. ఆర్థిక ప్రయోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండడంతో ఉచిత ప్రమాద బీమా పథకం ఆ ఉద్యోగులకు వర్తించింది.

Also Read: YS Jagan: మూడేళ్లలో వచ్చేది మా ప్రభుత్వమే.. ఎవరినీ వదలి పెట్టబోం: వైఎస్‌ జగన్‌

సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ బ్యాంకు అకౌంట్‌తో ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండడంతో ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించింది. ప్రమాదాలకు గురయిన వారికి సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద యూబీఐ రూ.కోటి అందుతోంది. దీంతో ఆ ఇద్దరు కుటుంబాలక రూ. కోటి చొప్పున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ అమ్రేష్ ప్రసాద్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి అందించారు.

Also Read: Bandi Sanjay: కాంగ్రెస్‌ ఓడిపోతుందని రేవంత్‌ రెడ్డి పారిపోయాడు: బండి సంజయ్‌

ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్స్ అకాల మరణం చెందటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యమిస్తోందని.. పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబసభ్యులకు ఆర్టీసీ అండగా నిలుస్తుందని, ఆత్మస్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో భరోసా కల్పిస్తోందని వివరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ శ్రీమతి పుష్ఫకుమారి, ఉషాదేవి, యూబీఐ అధికారులు చీఫ్ జనరల్ మేనేజర్ రవీంద్ర బాబు పాల్గొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 10:18:13
Hyderabad, Telangana:

Honor X80 Specifications Leak News: చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హానర్ అత్యంత తక్కువ ధరలోని ఎంతో శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ హానర్ X80 పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది ఎంతో శక్తివంతమైన 10,000 mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని మోస్ట్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్ కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో? ఇటీవల సోషల్ మీడియాలో మీకైనా ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

హానర్ X80 స్మార్ట్ ఫోన్ ఇప్పటికే చైనా మార్కెట్‌లో విడుదల చేసిన హానర్ X70 స్థానంలో అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇది చాలా ప్రత్యేకమైన 6.79-అంగుళాల 1.5K డిస్‌ప్లే కలిగి ఉండబోతోంది. దీంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్, 6,000 నిట్‌ల గరిష్ట బ్రైట్నెస్ సపోర్టును కలిగి ఉంటుంది. అయితే, చైనా మార్కెట్లో విడుదలైన.. స్మార్ట్ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇందులోని హైఎండ్  256 ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చింది. 

అంతేకాకుండా ఇది మోస్ట్ పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 15 ఆధారంగా MagicOS 9.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే ఇది వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా లభిస్తోంది. అలాగే ఇది అదనంగా 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ రకాల కలర్ ఆప్షన్స్‌లో చైనాలో విడుదలైంది. ఇప్పుడు ఈ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఇక ఈ Honor X80 స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 8,300mAh బ్యాటరీ 80W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 512GB వేరియంట్ 80W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే హై ఎండ్ వేరియంట్ మాత్రం 10,000mAh బ్యాటరీలతో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో చాలా ప్రత్యేకమైన బ్లూటూత్, వై-ఫై, NFC కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు ఎన్నో రకాల కొత్త ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కంపెనీ గతంలో విడుదల చేసిన అన్ని మొబైల్స్ మోడల్స్ కంటే ఇందులో అద్భుతమైన కొత్త కలర్ ఆప్షన్స్‌లో తీసుకురాబోతోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Feb 08, 2026 10:03:06
1
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 08, 2026 10:01:41
Hyderabad, Telangana:

Nagamani Stone Video Watch Here: పాముల గురించి సమాజంలో ఉన్న అనేక అపోహాల్లో నాగమణి కూడా ఒకటి.. ఈ నాగమణి నాగుపాముల తలపై పెరుగుతుందని.. ఇది ఎంతో విలువైనదని చాలా వరకు పల్లె ప్రాంతాల్లో ఉండే కొంతమంది నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది అయితే దీనిని ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని.. ఊళ్లో జనాలను నమ్మించి వారికి విక్రయిస్తూ ఉంటారు. ఇలా కొంతమంది లక్షల రూపాయలు సొమ్ము చేసుకున్నారు. నిజానికి ఇందులో ఏ మాత్రం నిజం లేదని ఇటీవలే ఒక స్నేక్ క్యాచర్ తన వీడియో ద్వారా సమాజానికి తెలిపారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది.

ఈ వైరల్ అవుతున్న వీడియోలు స్నేక్ క్యాచర్ మాట్లాడుతూ.. నాగుపాముల తల మీద అరుదైన వజ్రం ఉంటుందనేది కేవలం ఒక భ్రమ అని స్నేక్ క్యాచర్ కొట్టిపారేశారు. కొంతమంది గిరిజనుల్లో స్వార్ధపరులు అమాయక ప్రజలను నమ్మించి వారి నుంచి వేల రూపాయల డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ సమయంలో వారు పాములను హింసిస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పాము తలపై ఒక కత్తితో గాయం చేసి అందులో ఆ రాయిని ఉంచి.. జనాలను రత్నంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆ పామును వీడియోలో చూపిస్తూ.. తెలిపారు.

అంతేకాకుండా ఈ వీడియోలో స్నేక్ క్యాచర్ మున్నా నాగమణి నాటకం కోసం కొంతమంది పాములను ఎంతగా హింసిస్తున్నారో కూడా వివరించారు. పాముల తల వెనుక భాగాన్ని కట్ చేసి.. అందులో  ఆ నలుపు రంగు రాళ్ళను ఉంచి.. ఒక రసాయన పదార్థంతో మళ్లీ ఆ గాయాన్ని మూసేసి.. కుట్లు వేస్తున్నారని తెలిపారు.. దీనివల్ల పాములు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురై చనిపోతున్నాయని వారు తెలిపారు.. డబ్బు కోసం ఇలాంటి మూడవ నమ్మకాలను ప్రచారం చేస్తూ పాములను బలి తీసుకుంటున్నారని ఆయన వీడియోలో వెల్లడించారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

ఈ వీడియోలో జనాలకు అవగాహన కల్పించడమే కాకుండా.. మున్నా తను పట్టుకున్న ప్రమాదకరమైన మూడు భారీ పాములను సురక్షితమైన ప్రదేశంలో వదిలిపెట్టడం మీరు చూడొచ్చు. ఇలా ప్రకృతి కోసం అతను దాదాపు రోజులోనే మూడు నుంచి నాలుగు పాములను పట్టుకుంటున్నారని వీడియోలో తెలిపారు. ఈ ప్రమాదకరమైన పాములు పర్యావరణ సమతుల్యతకు ఎంతో అవసరమని.. వాటిని ఇంటి పరిసర ప్రాంతాల్లో చూస్తే సమాచారం అందించాలని ఆయన కోరారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top