జిల్లా మణికొండ పట్టణంలో పెద్ద పాము కనిపించింది
Manikonda, Telangana:రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల హిల్స్ కాలనీ రోడ్ నెం.4లో 12 అడుగుల పొడవున్న పాము కనిపించింది. 12 అడుగుల పామును చూసిన ప్రజలు వెంటనే భయాందోళనకు గురై పాము పట్టేవారికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేహ 12 అడుగుల పామును చాకచక్యంగా పట్టుకుంది.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Janasena Rajya Sabha: జనసేన నుంచి రాజ్యసభకు వెళ్లే తొలి అభ్యర్థి ఇతనే! డిప్యూటీ సీఎం పవన్ అనూహ్య నిర్ణయం!
Chinnakakani, Andhra Pradesh:Janasena Rajya Sabha Candidate: ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలు కూటమికే దక్కడం ఖాయం కావడంతో, అభ్యర్థుల ఖరారుపై సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో భాగంగా టిడీపీకి మూడు స్థానాలు, జనసేనకు ఒక సీటు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.
అంతేకాదు 2024 ఎన్నికల సమయంలో జనసేన కొన్ని లోక్సభ స్థానాలు త్యాగం చేసినందుకుగానూ.. 2029 లోపు జనసేనకు మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు ఇచ్చేలా కూటమిలో ముందస్తు హామీ లభించింది. అందులో భాగంగా ఇప్పుడు దక్కే ఒక సీటుతో జనసేన పార్టీ తొలిసారి రాజ్యసభలు అడుగుపెట్టబోతుంది.
పవన్ ఎంపిక ఎవరు?
తొలిసారి దక్కుతున్న ఈ రాజ్యసభ స్థానం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను బేరీజు వేస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత పార్టీ వర్గాల్లో ఇద్దరి పేర్లు సుముఖంగా వినిపిస్తున్నాయి.
అందులో ఒకరు లింగమనేని రమేష్ పేరు వినిపిస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరొందిన ఈయన ఈ సీటు దాదాపు ఖరారు అయిందని ప్రచారం చాలా రోజులుగా సాగుతుంది. ఆర్థిక, సామాజిక సమీకరణాలపరంగా ఈయన పేరు ముందంజలో ఉంది.
మరోవైపు రాజ్యసభకు మెగా బ్రదర్ నాగబాబు కూడా రేసులో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఒకవేళ చివరి నిమిషంలో సమీకరణాలు మారితే నాగబాబుని ఢిల్లీకి పంపే యోజనలో పవన్ ఉన్నట్లు తెలుస్తుంది. నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందని భావించిన సాధ్యపడలేదు. ఆయన రాజ్యసభకు పంపేందుకు అప్పట్లో పెండింగ్లో పెట్టారని టాక్ కూడా ఉంది.
లింగమనేని రమేష్ లేదా నాగబాబు.. వీరిద్దరిలోనే ఒకరు జనసేన తరఫున మొదటి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తీసుకోబోయే అనూహ్య నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: జనసేనాని పవన్ కళ్యాణ్పై గద్దర్ కూతురు ఘాటు వ్యాఖ్యలు..సీఎం చంద్రబాబు మద్దతు!
Also Read: గుడ్న్యూస్! కేరళంను తాకిన నైరుతి రుతుపవనాలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kohli Livingstone: "కోహ్లీ అందుకే ఇండియాలో ఉండడానికి ఇష్టపడడు!" ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:Livingstone On Virat Kohli: క్రికెట్ మైదానంలో అడుగు పెడితే చాలు అగ్రెసివ్గా మారిపోయే విరాట్ కోహ్లీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. లండన్ వీధుల్లో సాధారణ వ్యక్తిగా తిరుగుతూ, కెమెరా కంటికి చిక్కకుండా ఉండటానికి ఆయన మొగ్గు చూపుతారు. తాజాగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ వ్యక్తిత్వం, లండన్ పట్ల ఆయనకున్న ఇష్టం, ఐపీఎల్ లో ఆయన ఆటతీరు మారటానికి గల కారణాలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్న అనుభవాన్ని లివింగ్ స్టోన్ గుర్తుచేసుకున్నారు. "విరాట్ అందరితో చాలా సరదాగా, ఫ్రెండ్లీగా ఉంటాడు. నేను చూసిన అత్యంత పోటీతత్వం గల ఆటగాడు కోహ్లీనే. ప్రత్యర్థులపై ఒత్తిడిని పెంచడంలో ఆయన స్టైలే వేరు. ఇండియాలో కోహ్లీకి ఉన్న క్రేజీ అంతా కాదు. ఎయిర్పోర్ట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు.. ఎక్కడికి వెళ్ళినా నిరంతరం మీడియా, అభిమానుల నిఘా ఆయనపై ఉంటుంది. ఈ విపరీతమైన అటెన్షన్ కోహ్లీకి కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది" అని లివింగ్ స్టోన్ అన్నాడు.
క్రికెట్ కు దూరంగా ఉన్నప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా, కుటుంబంతో ప్రశాంతంగా గడపడానికి కోహ్లీ ఇష్టపడతాడని లివింగ్ స్టోన్ వెల్లడించాడు. అందుకే నిరంతరం మీడియా ఫోకస్ నుంచి విరామం కోసమే ఆయన భారత్ నుంచి వచ్చి ఇంగ్లాండ్ లో కొంత సమయాన్ని గడుపుతున్నట్లు లివింగ్ స్టోన్ పేర్కొన్నాడు.
కోహ్లీ ఆట తీరు మారడానికి కారణం ఇదే?
ఇటీవల కాలంలో కోహ్లీ బ్యాటింగ్లో స్పష్టమైన మార్పు వచ్చింది. ముఖ్యంగా టీ20లో దూకుడుగా ఆడుతున్నాడు. దీనిపై కూడా లివింగ్ స్టోన్స్ స్పందించాడు. ఆర్సీబీ మేనేజ్మెంట్లో వచ్చిన మార్పులే దీని కారణమని చెప్పాడు.
"ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ల ఆధ్వర్యంలో కోహ్లీ తన ఆటను తదుపరి స్థాయికి తీసుకెళ్లాడు. పవర్ ప్లే లో మరింత టాకింగ్ ఆడటం స్పిన్నర్లపై భారీ షాట్లు కొట్టడం వెనక వీరి ప్రణాళికలు ఉన్నాయి" అని లివింగ్ స్టోన్ తెలిపాడు. మైదానంలో అగ్నిపర్వతంలా రగిలిపోయే కింగ్ కోహ్లీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం కుటుంబమే లోకంగా బతికే ప్రశాంతమైన వ్యక్తి అని లివింగ్ స్టోన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read: తెలుగు క్రికెటర్ సంచలన నిర్ణయం..32 ఏళ్ల రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్!
ALso REad: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అంతర్గత విభేదాలు..కావ్య పాపపై ఇంగ్లాండ్ ఆటగాడు ఫైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Maoist Devji: కత్తి కన్నా కలం గొప్పదని నిరూపించిన దేవ్జీ.. 60 ఏళ్ల వయసులో లాసెట్లో ఊహించని ర్యాంకు..
Hyderabad, Telangana:Former Maoist Devji: ఆయుధం పట్టిన చేతులు అక్షరం వైపు మళ్లాయి.. దశాబ్దాల పాటు అడవిని నమ్ముకొని.. విప్లవ పంథాలో ముందుకు సాగిన ఓ మాజీ మావోయిస్టు అగ్రనేత ఇప్పుడు న్యాయ శాస్త్రం వైపు అడుగులు వేస్తున్నారు. ఉద్యమ బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తిప్పరి తిరుపతి ఆలియాస్ దేవ్జీ.. తాజాగా విడుదలైన తెలంగాణ లాసెట్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు..
43 ఏళ్ల తర్వాత ఇంటర్ పూర్తి చేశారు..
తిరుపతి ప్రస్థానం అత్యంత స్ఫూర్తిదాయకం.. ఆయన సుమారు 43 ఏళ్ల క్రితమే కోరుట్లలోని ఇంటర్మీడియట్ చదువుకున్నారు.. అయితే అప్పట్లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులై అడవి బాట పట్టడంతో చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది.. ఆ సమయంలో ఆయన ఇంటర్మీడియట్లో తెలుగు పేపర్ బ్యాక్లాగ్గా ఉండిపోయింది. ఇటీవల జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆయన.. చదువుపై ఉన్న మక్కువతో ఆ పాత బాకీని తీర్చుకున్నారు. ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల్లో ఆ ఒక్క పేపర్ను రాసి.. నాలుగు దశాబ్దాల తర్వాత ఇంటర్ను అధికారికంగా పూర్తి చేశారు..
కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేయడమే కాకుండా.. న్యాయ శాస్త్రం చదవాలని బలమైన సంకల్పంతో ఆయన లాసెట్ పరీక్షకు హాజరయ్యారు.. నిన్న విడుదలైన ఫలితాల్లో తిరుపతి 57 మార్కులు సాధించి.. రాష్ట్రస్థాయిలో 349 ర్యాంకు కైవసం చేసుకున్నారు. 60 ఏళ్లకు పైబడిన వయస్సులో కూడా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ పుస్తకాలు పట్టి ఈ స్థాయి ర్యాంకు సాధించడం పట్ల విద్యార్థులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
పేదల కోసమే న్యాయం..
తన విజయానికి గల కారణాలను వివరిస్తూ తిరుపతి బాగోద్వేగానికి లోనయ్యారు.. అడవిలో ఉన్నప్పుడు ప్రజల సమస్య కోసం పోరాడారని.. ఇప్పుడు సమాజంలో ఉంటూ చట్టం ద్వారా పేదలకు అండగా ఉండాలనుకుంటున్నారన్నారు.. అందుకే లా చదవాలని నిర్ణయించుకున్నారని.. తనకున్న అనుభవంతో పాటు న్యాయ శాస్త్ర పరిజ్ఞానాన్ని జోడించి నిరుపేదలకు ఉచిత న్యాయ సహాయం చేయడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. తుపాకీ గొట్టం ద్వారానే మార్పు వస్తుందని నమ్మిన ఒకప్పటి అగ్రనేత.. నేడు రాజ్యాంగం కల్పించిన చట్టం ద్వారా మార్పు కోసం ప్రయత్నించడం ఇప్పుడు చర్చనీ అంశంగా మారింది.. కత్తికన్నా కలం గొప్పది.. అనే మాటను తిరుపతి నిజం చేసి చూపించారని పలువురు మేధావులు ప్రశంసిస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rahu Transit 2026: కుంభరాశిలో రాహు సంచారం.. డిసెంబర్ 5 వరకు ఈ 3 రాశుల వారికి కాసుల వర్షం, తిరుగులేని అదృష్టం!
Hyderabad, Telangana:Rahu Transit In Aquarius Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు గ్రహాన్ని అత్యంత ప్రమాదకరమైన ఛాయాగ్రహంగా పిలుస్తారు. దీనిని శని ఛాయగా కూడా చెప్పుకుంటారు. అయినప్పటికీ నవగ్రహాల్లో ఇది అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటిగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు ప్రభావం మానవ జీవితాలపై అకస్మాత్తుగా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాన్ని కలియుగానికి రాజుగా పిలుస్తారు. రాహువు పరిమితం లేకుండా పనిచేసే గ్రహంగా కూడా చెప్పుకుంటారు. కాబట్టి ఈ గ్రహం అప్పుడప్పుడు శుభ ఫలితాలను ఇస్తే.. అప్పుడప్పుడు ఫలితాలను అందిస్తుంది. కొన్నిసార్లు రాహువువు అకస్మాత్తుగా చురుకుగా మారి చాలా తక్కువ సమయాల్లోనే.. పేదవారిని సైతం ధనవంతులు చేస్తాడు..
ప్రతి నెలలో ఏదో ఒక గ్రహం సంచారం చేస్తూనే ఉంటుంది. అలాంటిది రాహువు గ్రహం కూడా అప్పుడప్పుడు తప్పకుండా సంచారం చేస్తుంది. ఈ గ్రహం ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలోనే కదులుతూ ఉంటుంది. ఈ రాహువు సంచారం కారణంగా మొత్తం 12 రాశులు ప్రభావితం అవుతా. అంతేకాకుండా జీవితంలో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే, ఈ ఛాయాగ్రహం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా విదేశీ ప్రయాణాలతో పాటు.. పని ప్రదేశాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి. ఇదిలా ఉంటే ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ వరకు రాహువు గ్రహం కుంభరాశిలోనే అంచార దశలో ఉండబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి రాహువువు దేవుడి అనుగ్రహం లభించబోతోంది. దీంతో ఆయా రాశుల వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ రాశులవారికి రాహువు అనుగ్రహం..
మేష రాశి
రాహువు కుంభరాశిలోకి వెళ్లడం కారణంగా మేష రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఏలినాటి శని ప్రారంభమైంది. కాబట్టి రాహువువు కుంభరాశిలోకి వెళ్లడం కారణంగా వీరి జీవితంలో సానుకూలమైన శక్తులు రావడం ప్రారంభమౌతాయి. వ్యాపార సమస్యలు కూడా క్రమంగా పరిష్కారం అవుతాయి. వృత్తితోపాటు వ్యక్తిగత జీవితాల మధ్య సరైన సమతుల్యత కూడా లభిస్తుంది. అంతేకాకుండా ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
తులారాశి
తులారాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం కూడా విపరీతంగా పెరుగుతుంది. వీరి పనిపై దృష్టి పెట్టి అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే అదృష్టం తోడుగా ఉండి అనుకున్న పనుల్లో భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ఏమైనా కోర్టు కేసులు ఉన్న వ్యక్తులు తప్పకుండా విజయాలు సాధించుతారు. జీవిత భాగస్వామితో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు పరిష్కారం కూడా దొరుకుతుంది. అంతేకాకుండా భాగస్వామి మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా రాహువువు శక్తివంతమైన ప్రభావంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. డిసెంబర్ ఐదవ తేదీ వరకు వీరికి జీవితంలో శాంతితో పాటు సంతోషం నెలకొంటుంది. ఉద్యోగపరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. అలాగే ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ముందుకు సాగించడం చాలా మంచిది. వీరికి సమాజంలో గౌరవంతో పాటు కీర్తి, ప్రతిష్టలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా పెద్దల నుంచి అద్భుతమైన సపోర్టు కూడా లభిస్తుంది. వీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలపై కూడా ఆసక్తి కనబరిస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Fortune After 30: అదృష్టం అంటే వీరిదే.. 30 ఏళ్లు దాటాక కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే!
Hyderabad, Telangana:Fortune After 30 Zodiac Signs Telugu: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి రాశి దాని సొంత లక్షణాలను తప్పకుండా కలిగి ఉంటుంది. కొందరు పుట్టుకతోనే రాజ్యసంతో ఉంటారు.. మరి కొంతమంది అదృష్టం వారి జీవితంలో ఒక్క నిర్దిష్ట సమయంలో మారడం మొదలవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల వారికి అదృష్టం నిజంగా వారి 30 ఏళ్ల తర్వాత ప్రారంభమవుతుంది. ఆ రాశుల వారికి 30 ఏళ్లు దాటగానే వారు జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా రాజ్య సంతోషంతో పాటు సౌకర్యాలు, బ్యాంకు బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ జీవితంలో కూడా అద్భుతమైన ధన లాభాలు పొందగలుగుతారు. వారు ఏది చేయాలనుకుంటే అది చేసి దిమ్మతిరిగే ధన లాభాలు పొందుతారు. అయితే, 30 ఏళ్ల తర్వాత కొన్ని రాశుల వారికి అదృష్టం ఎలా రావడం ప్రారంభం అవుతుందో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ జాక్ పాట్..
సింహరాశి
సింహరాశికి అధిపతి సూర్యుడుగా వ్యవహరిస్తాడు. ఈ రాశిలో జన్మించినవారు కష్టపడితే ఏ వయసులోనైనా అద్భుతమైన విజయాలను సాధించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 30 ఏళ్ల తర్వాత సింహ రాశి వారికి విజయ పథం మారుతుందని వారు చెబుతున్నారు. 30 ఏళ్లు వచ్చేవరకు వారు తమ అన్ని ప్రయత్నాల్లో పూర్తిగా విజయాలు సాధించలేరు.. కానీ 30 ఏళ్లు దాటిన తర్వాత అదృష్ట చక్రం తిరిగి వారి బ్యాంకు బ్యాలెన్స్ ఊహించని స్థాయిలో పెంచుతుంది. అంతేకాకుండా అనేక రూపాల్లో సంతోషం రావడం ప్రారంభం అవుతుంది..
మకర రాశి
కర్మ దేవుడిగా పిలిచే శని మకర రాశికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ రాశిలో జన్మించిన వారు స్వభావారీత్యా చాలా కష్టపడతారు. తమ లక్ష్యాలను అస్సలు వదులుకోరు.. అయితే శని ప్రభావం వల్ల వారి జీవితంలో విజయాలు కొంచెం నెమ్మదిగా వస్తూ ఉంటాయి.. మకర రాశి వారికి ఆర్థికంగా లాభపడే సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ.. అది 30 ఏళ్ల ఎస్ తర్వాత మాత్రమే నెరవేరుతుంది. ఈ వయస్సు తర్వాత కూడా వారి పూర్వీకుల నుంచి లేదా వారసత్వం ద్వారా వచ్చే ఆస్తులను కూడా పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వారి కష్టానికి తగిన ప్రతిఫలం 30 ఏళ్ల తర్వాతే దొరుకుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి చిన్న వయసులోనే వృత్తిపరమైన జీవితాన్ని నిర్మించుకునేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఈ సమయంలో అనేక రూపాల్లో డబ్బులు వచ్చినప్పటికీ కొన్ని ప్రతికూలమైన సమస్యలను ఎదుర్కొంటారు. చిన్న చిన్న అడవుల్లోనూ కూడా అడ్డంకులు వస్తూ ఉంటాయి. కానీ 30 ఏళ్ల తర్వాత మాత్రం జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి.. ఆయన ఆశీస్సులు 30 ఏళ్ల తర్వాత మెండుగా ఉంటాయి. దీని కారణంగా వీరు సంక్షోభాల మంచి ఉపశమనం పొందుతూ ఉంటారు. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా అంచలంచలుగా పెరుగుతూ వస్తాయి..
కన్య రాశి
కన్యా రాశి వారు కూడా వారికి 30 ఏళ్లు వచ్చిన తర్వాత ధన లాభాలు పొందడం ప్రారంభమవుతుంది. వీరు తప్పకుండా జీవితంలో 30 ఏళ్ల తర్వాత అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అదృష్టం వారికి పూర్తిగా అనుకూలించి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా డబ్బులు వేగంగా సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి. వీరి జీవనం కూడా ఒక్కసారిగా మెరుగుపడే అవకాశాలున్నాయి. అలాగే అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు కూడా సాధించగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees: ప్రమోషన్లపై ప్రభుత్వ లెక్చరర్ల ఆగ్రహం.. యూజీసీ నిబంధనలు అమలుచేయాలి
Baddipadaga, Telangana:Govt Lecturers Promotions: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) పదోన్నతులలో యూజీసీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రమోషన్ పొందేందుకు కనీస అర్హత జూనియర్ లెక్చరర్ సర్వీసును పరిగణనలోకి తీసుకోవడంపై తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం (టీజీసీటీఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2004 సంవత్సరంలో ఇచ్చిన జీఓ నంబర్-10ని 22 సంవత్సరాల తర్వాత జీఓ నంబర్ 21 ద్వారా పునరుద్ధరించడంతో యూజీసీ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆ సంఘం నాయకులు ఆరోపించారు.
'జూనియర్ లెక్చరర్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్గా పదోన్నతి పొందిన వారి జూనియర్ లెక్చరర్ సర్వీసును (N-5/2) అనే సూత్రం ప్రకారం లెక్కించారు. ఇందులో ఎన్ అనేది మొత్తం జూనియర్ లెక్పరర్ సర్వీసును సూచిస్తుంది. దీని నుంచి 5 సంవత్సరాల సర్వీసును తీసివేసిన తర్వాత, మిగిలిన 50 శాతం సర్వీసును కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) పదోన్నతి కోసం లెక్కించారు' అని తెలంగాణ ప్రభుత్వ అధ్యాపకుల సంఘం నాయకులు తెలిపారు.
'2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీఓ నంబర్ 10ని ఇప్పుడు మళ్లీ అమలు చేయమనడం అన్యాయం, యూజీసీ నిబంధనలను ఉల్లంఘించడం, రాజ్యాంగ విరుద్దం' అని టీజీసీటీఏ స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో ఉపాధ్యాయుల నియామకం కోసం యూజీసీ మార్గదర్శకాలలో నిర్దేశించిన అర్హతా ప్రమాణాల ప్రకారం ఒక పోస్టుకు నియామకం జరిగితే.. సీఏఎస్ పదోన్నతి కోసం గత సర్వీసును లెక్కించవచ్చుని యూజీసీ మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొంటున్నాయని గుర్తుచేసింది. ఈ అర్హతా ప్రమాణాల ప్రకారం సంబంధిత సబ్జెక్ట్లో పీజీ డిగ్రీతోపాటు నెట్/సెట్, పీహెచ్డీ తప్పనిసరి అని తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం నాయకులు వివరించారు. 'కానీ, జూనియర్ లెక్చరర్ నియామకం సంబంధిత సబ్జెక్టులో కేవలం పీజీ డిగ్రీ అర్హతతో జరుగుతుంది. జూనియర్ లెక్చరర్ సర్వీసును CAS పదోన్నతికి లెక్కించడం UGC మార్గదర్శకాల ప్రకారం ఒక స్పష్టమైన ఉల్లంఘన' అని వెల్లడించారు.
డిగ్రీ లెక్చరర్ పదోన్నతులకు ఫీడర్ కేడర్గా జూనియర్ లెక్చరర్ పోస్టు మార్పు, ఏ ప్రభుత్వ శాఖలోనూ ప్రమోషన్లకై ఫీడర్ క్యాడర్ సర్వీస్ వర్తించదని తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం నాయకులు స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 423 ద్వారా ఇంటర్మీడియట్ విద్యలోని జూనియర్ లెక్చరర్ కేడర్ నుంచి కళాశాల విద్యలోని డిగ్రీ లెక్చరర్ కేడర్కు ఒక పదోన్నతి మార్గాన్ని ఏర్పాటు చేసింది. దీంతో జూనియర్ లెక్పరర్ పోస్టు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని లెక్చరర్ పోస్టుకు ప్రమోషన్ పొందుటకు ఫీడర్ కేటగిరీగా ఉంది' అని వివరించారు.
ప్రమోషన్కు కావాల్సిన అర్హతలు
==> డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీ అధ్యాపకుల సీఏఎస్ పదోన్నతులకు యూజీసీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంది.
==> ఓరియంటేషన్ కోర్స్, రిఫ్రెష్ కోర్స్లను పూర్తిచేయడం రీసెర్చ్ పబ్లికేషన్స్ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
==> అసిస్టెంట్ ప్రొఫెసర్గా పీహెచ్డీ కలిగి ఉండి నాలుగేళ్ల సంవత్సరాల సర్వీస్ ఉండాలి.
==> ఎంఫిల్తో అయితే 5 సంవత్సరాల సర్వీస్ / నెట్, సెట్తో అయితే 6 సంవత్సరాల కనీస సర్వీస్ పూర్తి చేయాలి.
==> అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ వంటి సీఏఎస్ పదోన్నతులు పొందడానికి కూడా యూజీసీ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి.
సహజ న్యాయాన్ని నిలబెట్టడానికి.. యూజీసీ నిబంధనలను సక్రమంగా.. కచ్చితంగా అమలయ్యేలా తక్షణమే స్పందించి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం నాయకులు కోరారు. గతంలో ఎప్పుడో 2004లో ఇచ్చిన జీఓ నంబర్- 10ను డిగ్రీ లెక్చరర్గా పదోన్నతి పొందడానికి ఫీడర్ కేడర్ ఉన్న జూనియర్ లెక్చరర్ సర్వీసును సీఏఎస్ పదోన్నతులకు లెక్కించాలని కోరడం ప్రస్తుత సర్వీస్ నిబంధనలకు, యూజీసీ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. యూజీసీ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సర్వీసును మాత్రమే సీఏఎస్ పదోన్నతులకు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
Peddi Day 1 Collection: 'పెద్ది' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్..తొలి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Hyderabad, Telangana:Peddi Day 1 Collection News: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పెద్ది' నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్స్తో మొదలైంది. సూపర్ హిట్ టాక్తో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అయితే ప్రీమియర్స్తో కలుపుకొని తొలిరోజు కలెక్షన్స్ ఎంతమేర వస్తాయనే విషయంపై ట్రేడ్ వర్గాలు కొన్ని విశేషాలను బయటపెట్టాయి.KS Bharat Retirement: తెలుగు క్రికెటర్ సంచలన నిర్ణయం..32 ఏళ్ల రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్!
Hyderabad, Telangana:KS Bharat Retirement News: తెలుగు క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్కు చెందిన భారత వికెట్ కీపర్-బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ (కేఎస్ భరత్) అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేవలం 32 ఏళ్ల వయసులోనే ఆయన అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగభరితమైన పోస్ట్ ద్వారా వెల్లడించారు. దీంతో టీమిండియా తరఫున టెస్ట్ ఫార్మాట్లో ప్రాతినిధ్యం వహించిన ఒక తెలుగు ఆటగాడి అంతర్జాతీయ ప్రస్థానానికి ముగింపు పడింది.
భావోద్వేగానికి గురైన కేఎస్ భరత్:
తన రిటైర్మెంట్ నోట్లో భరతదేశం తరఫున ఆడటాన్ని అత్యున్నత గౌరవంగా భావిస్తూ ఇలా రాసుకొచ్చారు. "గర్వంతో, కృతజ్ఞతా భావంతో నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి విరమించుకుంటున్నట్లు ప్రకటిస్తున్నాను. నా దేశం కోసం ఆడటం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవం. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ, టెస్టుల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ప్రతి క్షణానికీ తగిన గౌరవాన్ని ఇచ్చింది. నా కలను సాకారం చేయడానికి అండగా నిలిచిన నా కుటుంబానికి, బీసీసీఐ, కోచ్లకు, సహచర ఆటగాళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని కేఎస్ భరత్ రాసుకొచ్చాడు.
కోహ్లీ, రోహిత్, ద్రవిడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు..
తన కెరీర్లో అత్యంత కీలక పాత్ర పోషించిన ముగ్గురు దిగ్గజాలకు భరత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడే అవకాశం ఇచ్చి, తన నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేలా చేసినందుకు ఆర్సీబీ అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసే అమూల్యమైన అవకాశం దక్కిందని భరత్ గుర్తుచేసుకున్నారు.
అదే విధంగా రాహుల్ ద్రవిడ్ కోచ్గా పనిచేసిన ఇండియా 'ఎ' జట్టు నుండి జాతీయ జట్టు వరకు ఆయన అందించిన గైడెన్స్, సపోర్ట్ వల్లే తాను టెస్టు క్రికెటర్గా ఎదగలిగానని కేఎస్ భరత్ కొనియాడారు.
కేఎస్ భరత్ క్రికెట్ ప్రస్థానం
ఫిబ్రవరి 2023లో నాగ్పూర్లో ఆస్ట్రేలియాపై జరిగిన టెస్టు మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన భరత్.. ఫిబ్రవరి 2024లో విశాఖపట్నంలో ఇంగ్లాండ్తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. అంతర్జాతీయ కెరీర్ స్వల్పంగానే సాగినప్పటికీ, దేశవాళీ క్రికెట్లో ఆయన ఒక దిగ్గజంగా నిలిచారు.
Also REad: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అంతర్గత విభేదాలు..కావ్య పాపపై ఇంగ్లాండ్ ఆటగాడు ఫైర్!
ALso REad: టీమ్ఇండియాకు భారీ షాక్..ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు కోహ్లీ దూరం..రోహిత్ డౌటే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kavya Maran SRH: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అంతర్గత విభేదాలు..కావ్య పాపపై ఇంగ్లాండ్ ఆటగాడు ఫైర్!
Hyderabad, Telangana:Kavya Maran Liam Livingstone: ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే సన్రైజర్స్ హైదరాబాద్ క్యాంపులో తీవ్ర కలకలం రేగింది. అద్భుత ప్రదర్శన చేసి ఈ జట్టు ప్లేఆఫ్స్ వరకు చేరినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ లియాన్ లివింగ్ స్టోన్ ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని ముఖ్యంగా కావ్య మారన్ను ఉద్దేశించి పరోక్షంగా చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు నెట్టింట హార్ట్ టాపిక్ గా మారాయి.
"స్టిక్ టు క్రికెట్" పాడ్కాస్ట్లో లివింగ్స్టోన్ మాట్లాడుతూ తనకు తుదిజట్టులో ఆడే అవకాశం రాకపోవడానికి గల కారణాన్ని బయటపెట్టాడు. "మినీ వేలంలో ముంబై ఇండియన్స్ కు అత్యవసరమైన ఓ దేశీ ఆటగాడిని మా ఫ్రెండ్ చేసి కొనుగోలు చేసింది. మా యజమాని పరిస్థితిలో బోలెడు డబ్బు ఉండటంతో భారీ ధర పెట్టి అతడిని సొంతం చేసుకుంది. మా యజమానులకు (కావ్య మారన్) అతనంటే చాలా ఇష్టం. అందుకే అతడ్ని జట్టులోకి తీసుకున్నారు. మా కోచ్ డేనియల్ వెటోరి స్వయంగా నాతో ఈ మాట చెప్పాడు. నాకు అప్పుడే అర్థమైంది. జట్టులో ఎవరో ఒకరు గాయపడితే తప్ప నా గురించి జట్టులో చోటు దక్కద"ని లివింగ్ స్టోన్ వెల్లడించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో సన్రైజర్స్ అభిమానులు షాక్కు గురవుతున్నారు.
లివింగ్ స్టోన్ టార్గెట్ చేసిన ఆటగాడు ఎవరు?
లివింగ్ స్టోన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యాజమాన్యానికి అంతగా నచ్చిన ఆ ప్లేయర్ ఎవరిని చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది. నెటిజెన్లు, విశ్లేషకులు ఎక్కువగా సలీల్ అరోరా పేరును తెరపైకి తెస్తున్నారు. పంజాబ్ కు చెందిన 23 ఏళ్ల వికెట్ కీపర్ బాటర్ సలీల్ అరోరా కోసం మినీ వేలంలో ముంబై, హైదరాబాద్ గట్టిగా పోటీ పడ్డాయి. చివరికి రూ.1.5 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అతడ్ని సొంతం చేసుకుంది.
ఈ సీజన్ ఆరంభంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సలీల్ అరోరా అరంగేట్రం చేశాడు. మొత్తం ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్ లో ఆడిన తర్వాత కేవలం 156 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడి నిరాశపరిచిన లివింగ్ స్టోన్ ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా రూ.13 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఇంత భారీ ధర పలికిన ఇంగ్లాండ్ హిట్టర్ ఈ సీజన్లో కేవలం రెండు మ్యాచ్లే ఆడగా.. అందులోనూ కేవలం 15 మార్కులు మాత్రమే చేశాడు, కనీసం బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు.
Also Read: టీమ్ఇండియాకు భారీ షాక్..ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు కోహ్లీ దూరం..రోహిత్ డౌటే!
Also Read: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఇవి గమనించారా? ఆర్సీబీ Vs జీటీ మ్యాచ్లో 5 వింత ఘటనలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Silver Import Duty: వెండి కొనే వారికి బ్యాడ్న్యూస్..భారీగా పెరగనున్న వెండి ధరలు..కేంద్రం ఝలక్!
Hyderabad, Telangana:Silver Import Duty News: బంగారం, వెండి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ చేదు నిజం ఇప్పుడే తెలుసుకోండి. దేశంలో రానున్న రోజుల్లో వెండి ధరలు రెక్కలు తొడగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వెండి దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశీయంగా రూపాయి విలువ బలహీనపడకుండా చూసేందుకు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు గాను కేంద్రం వెండి దిగుమతులపై కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది.
ఇకపై లైసెన్స్ తప్పనిసరి?
గత నెలలో వెండి కడ్డీలు, సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్పై ఆంక్షలు విధించిన కేంద్రం.. ఇప్పుడు మరికొన్ని ఉత్పత్తులను కూడా నియంత్రిత వర్గంలోకి చేర్చింది. కొత్త నిబంధన ప్రకారం.. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన వెండి పొడి (Silver Powder), రేణువులు (Silver Grains), పాక్షికంగా తయారైన వెండి ఉత్పత్తులను విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలంటే ఇకపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) నుండి ముందస్తుగా ప్రత్యేక లైసెన్స్ లేదా అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేయనున్నారు.
ప్రపంచంలోనే అత్యధికంగా వెండిని వినియోగించే దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ వెండి దిగుమతుల కోసం ఏకంగా రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేసింది. కేవలం ఏప్రిల్ నెలలోనే వెండి దిగుమతులు 157 శాతం మేర పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ భారీ దిగుమతులకు అడ్డుకట్ట వేయడానికే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ధరలు ఎందుకు పెరుగుతాయి?
ప్రభుత్వ అనుమతులు (లైసెన్స్) రావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల మార్కెట్లో వెండి సరఫరా తగ్గి, తాత్కాలికంగా తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడం వల్ల రాబోయే రోజుల్లో వెండి ధరలు తక్షణమే పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వెండిని కేవలం ఆభరణాలు, నాణేలు, పూజా సామాగ్రి కోసమే కాకుండా పారిశ్రామిక అవసరాల కోసం కూడా విరివిగా వాడుతుంటారు. ఈ కొత్త ఆంక్షల ప్రభావం సోలార్ ప్యానెల్స్ తయారీ, ఎలక్ట్రానిక్స్ రంగానికి చెందిన పరిశ్రమలపై తీవ్రంగా పడనుంది. ముడిసరుకు కొరత కారణంగా ఆయా రంగాల్లో తయారీ వ్యయం పెరిగే ప్రమాదం ఉంది.
వెండి ధర ఎంత ఉంది?
ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర సుమారు రూ.2.90 లక్షల వద్ద కొనసాగుతోంది. గతంలో ఇది గరిష్టంగా రూ.4 లక్షల మార్కును తాకగా.. ప్రస్తుతానికి స్థిరంగా ఉంది. అయితే కేంద్రం విధించిన తాజా ఆంక్షల నేపథ్యంలో ఈ ధరలు మళ్లీ రికార్డు స్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: భారత్లో ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది? గోల్డ్ రేట్ తగ్గిపోతుందా?
Also REad: బంగారం ప్రియులకు గుడ్న్యూస్..రూ.820 తగ్గిన బంగారం ధర..ఇప్పుడెలా ఉన్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Virat Kohli Injury: టీమ్ఇండియాకు భారీ షాక్..ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్కు కోహ్లీ దూరం..రోహిత్, హార్దిక్ కూడా డౌటే!
Hyderabad, Telangana:India Vs Afghanistan ODI 2026 News: ఆఫ్ఘనిస్తాన్తో జూన్ 14 నుండి ధర్మశాల వేదికగా ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గాయపడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోహ్లీ స్థానంలో ఐపీఎల్లోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను వన్డే జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇండియా 'ఎ' జట్టులో రజత్ పటీదార్కు చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
కోహ్లీకి 2 వారాలు విశ్రాంతి..
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛేజింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ హామ్స్ట్రింగ్ (కండరాల) గాయానికి గురయ్యాడు. ఆ సమయంలో వైద్య సహాయం తీసుకుని బ్యాటింగ్ కొనసాగించినప్పటికీ, తదుపరి పరీక్షలలో గాయం తీవ్రత బయటపడింది. ఈ క్రమంలో కోహ్లీకి కనీసం రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు.
జూన్ 20న జరిగే చివరి వన్డే సమయానికి కోహ్లీ కోలుకునే అవకాశం ఉన్నప్పటికీ, ముందున్న బిజీ షెడ్యూల్ (జూలైలో ఇంగ్లాండ్ పర్యటన) దృష్ట్యా సెలెక్టర్లు అతనికి రిస్క్ ఇవ్వకూడదని భావిస్తున్నారు.
రోహిత్, హార్దిక్ సంగతి ఏంటి?
కోహ్లీ గాయం ఒకవైపు ఆందోళన కలిగిస్తుండగా, కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాల ఫిట్నెస్పై కూడా సెలెక్టర్లు నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు. రోహిత్ శర్మ విషయానికొస్తే.. కండరాల గాయంతో ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లకు దూరమైన రోహిత్ను వన్డే జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫిట్నెస్ టెస్ట్ పాస్ కావాల్సి ఉంది. ఒకవేళ రోహిత్ అన్ఫిట్గా ఉంటే, కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి ఓపెనింగ్ చేయడానికి యశస్వి జైస్వాల్ రేసులో ముందున్నాడు. బ్యాకప్ ఓపెనర్గా ఇషాన్ కిషన్ కూడా అందుబాటులో ఉన్నాడు.
మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా దీర్ఘకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న పాండ్యా ప్రస్తుతం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పర్యవేక్షణలో ఉన్నాడు. అతను పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయగలిగితేనే జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
శనివారం సెలక్షన్ కమిటీ సమావేశం!
యునైటెడ్ కింగ్డమ్ (UK) పర్యటనతో పాటు ఆసియా క్రీడల కోసం భారత టీ20 జట్లను ఎంపిక చేయడానికి శనివారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్కు సంబంధించిన తుది మార్పులపై, రోహిత్-హార్దిక్ లభ్యతపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆల్-ఫార్మాట్ కెప్టెన్సీ రేసులో ఉన్న రుతురాజ్ గైక్వాడ్కు కోహ్లీ స్థానంలో వన్డే జట్టులో అవకాశం రావడం సీఎస్కే అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.
Also Read: న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమైన భారత జట్టు..కోహ్లీ, రోహిత్ శర్మతో 5 మ్యాచ్లు..
Also Read; వైభవ్ సూర్యవంశీకి తప్పిన ప్రమాదం..గుజరాత్ బౌలర్లపై మాజీ క్రికెటర్ పఠాన్ ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Uttar Pradesh: పాపం.. లంచం ఇవ్వలేదని నిరుపేద బాలిక కాలు విరగ్గొట్టిన డాక్టర్!
Hyderabad, Telangana:Uttar Pradesh Government Doctor News: సమాజంలో దేవుడిలా భావించే వైద్య వృత్తికే చెడ్డ పేరు తెచ్చే ఘోర ఉదాంతం ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల వెలుగు చూసింది. లంచం డబ్బులు ఇవ్వలేదని కక్షతో ఒక ప్రభుత్వ వైద్యుడు మానవత్వాన్ని మరిచిపోయి వింతగా ప్రవర్తించాడు. ప్రమాదంలో విరిగి.. ఇప్పుడిప్పుడే అతుక్కుతున్న ఒక 14 ఏళ్ల మైనర్ బాలిక కాలు ఎముకను సదరు డాక్టర్ ఉద్దేశపూర్వకంగా మళ్ళీ విరగగొట్టినట్లు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి..
బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం ప్రమాదానికి గురైన 14 ఏళ్ల బాలిక కాలు విరిగింది.. చికిత్స కోసం ఆమెను ముజఫర్నగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.. అయితే అక్కడ విధుల్లో ఉన్న ప్రభుత్వ డాక్టర్ బాలికకు చికిత్స చేయడానికి దాదాపు రూ.25 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న ఆ పేద కుటుంబం, ఎలాగోలా కష్టపడి దాదాపు రూ.8 వేల రూపాయలు వైద్యుడికి ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది. మిగిలిన డబ్బులు కూడా ఇస్తేనే పూర్తి చికిత్స అందిస్తామని.. లేదంటే డిశ్చార్జ్ చేస్తామని సదరు డాక్టర్ బాధితులను వేధించడం మొదలుపెట్టాడు..
జిల్లా కలెక్టర్ను కలిశారు..
వైద్యుడి వేధింపులు భరించలేక.. నిరుపేదలైన ఆ కుటుంబ సభ్యులు న్యాయం కోసం స్థానిక జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు.. బాధితుల పరిస్థితిని చూసి చలించిపోయిన కలెక్టర్.. బాలికకు తక్షణమే ఉచితంగా పూర్తి చికిత్స అందించాలని ఆసుపత్రి అధికారులతో పాటు వైద్యుడిని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో చేసేదేమీ లేక పైకి సరేనన్న ఆ డాక్టర్.. లోపల మాత్రం బాధితులపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు.. తనపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తారా అనే కోపంతో రగిలిపోయాడు..
ఎక్స్ర్రే అని చెప్పి..
కలెక్టర్ ఆదేశాల తర్వాత బాలికకు ఉచితంగా చికిత్స అందిస్తామని నమ్మ బలికిన ఆ డాక్టర్.. ఎక్స్ర్రేతో పాటు తదుపరి పరీక్షల పేరుతో బాలికను గదిలోకి పిలిపించాడు.. అక్కడ తల్లిదండ్రులు లేని సమయంలో చూసి.. లంచం డబ్బులు ఇవ్వనందుకు కక్ష సాధింపుగా.. ఇప్పుడిప్పుడే అతుక్కుంటున్న బాలిక కాలు ఎముకను గట్టిగా ఒత్తి మళ్లీ విరగగొట్టాడని.. బాలిక తల్లి కన్నీరు మునీరుగా ఆరోపిస్తున్నారు. గదిలో నుంచి బాలిక గట్టిగా కేకలు వేయడంతో లోపలికి వెళ్లిన తల్లిదండ్రులకు ఈ దారుణం అర్థమైంది..
Also Read: నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త! SBI బ్యాంకులో 7,150 ఉద్యోగాలు..నెలకు జీతం ఎంతంటే?
బాధిత తల్లి రోధణ..
మా వద్ద డబ్బులు లేక కలెక్టర్ గారిని వేడుకున్నామని.. ఆయన ఉచితంగా వైద్యం చేయమన్నా.. కూడా ఆ డాక్టర్ కోపం తగ్గలేదని.. పరీక్షలు చేస్తామని లోపలికి తీసుకెళ్లి నా కూతురు కాలును మళ్ళీ విరగగొట్టాడని బాధిత తల్లి రోధిస్తూ మీడియా తెలిపింది.. ఈ అమానుష ఘటనపై స్థానికంగా తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఒక ప్రభుత్వ వైద్యుడు ఇంతటి క్రూరత్వానికి ఒడిగట్టడంపై సోషల్ మీడియా వినియోగదారులతో పాటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ.. నిందితుడైన డాక్టర్ పై తక్షణమే విచారణ జరిపి.. కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు..
Also Read: నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త! SBI బ్యాంకులో 7,150 ఉద్యోగాలు..నెలకు జీతం ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Sheshnag Video: నిజంగానే భూమిపైకి శేషనాగు వచ్చిందా? రేర్ వీడియో..
Hyderabad, Telangana:Five-Headed Cobra Video Watch: ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ యుగంలో రోజుకు ఒక వింతైన ఆశ్చర్యం కలిగించే వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. తాజాగా ఒక అరుదైన పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. సాధారణంగా మనం పురాణాల్లో, సినిమాల్లో మాత్రమే చూసే ఐదు పడగల శేషనాగు నిజజీవితంలో దర్శనం ఇచ్చిందంటూ.. ఒక వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు..
భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు..
వైరల్ అవుతున్న వీడియోలు ఒక భారీ నాగుపాము ఒకచోట స్థిరంగా ఉండడం మీరు చూడొచ్చు.. ఆ పాము ఒక్కసారిగా తన ఐదు పడగలను విప్పి నిలబడటం కనిపిస్తుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు స్థానికులతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.. కొందరు ఈ సమయంలో భయాందోళనకు గురవ్యగా.. మరికొందరు మాత్రం దీన్ని ఒక దైవ శక్తితో కూడిన వింత అరుదైన పాముగా భావిస్తున్నారు.. సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ కొలువై ఉండే శేషనాగే భూమిపైకి వచ్చిందంటూ అక్కడికి వచ్చిన భక్తులు దండాలు పెట్టడంతో పాటు హారతులు పట్టడం కూడా ఈ వీడియోలో కనిపిస్తూ ఉంది. ఈ అరుదైన దృశ్యాలు చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు..
ఇది దైవలీలనా?
అయితే, ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. ఒక వర్గం ప్రజలు ఇది దైవలీల అని నమ్ముతుండగా.. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ఉన్న చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తూ ఉన్నారు.. ప్రస్తుత కాలంలో అందుబాటులోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ లేదా అధునాతన వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్స్ టూల్స్ను ఉపయోగించి ఈ వీడియోని సృష్టించారని కామెంట్లు పెడుతూ వస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ ఉపయోగించారా?
సాధారణ పాము వీడియోలు తీసుకొని.. దానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ సాంకేతికతతో ఐదు పడగలు ఉన్నట్లుగా ఎడిటింగ్ చేస్తున్నారని.. కొంతమంది సాంకేతిక తెలిసిన నిపుణులు చెబుతూ వస్తున్నారు. ప్రజల భక్తితో పాటు నమ్మకాలను ఆసరాగా చేసుకుని వ్యూస్ కోసం కొందరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. ఇలా చేయడం సరికాదని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు సైతం హెచ్చరిస్తున్నారు.. ప్రకృతిలో రెండు తలలో ఉండటం అనేది జన్యుపరమైన లోపం అయినప్పటికీ.. కానీ ఒక పాము కు ఐదు తలలు లేదా ఆరు తలలు ఉండడం అనేది సైన్స్ పరంగా అసాధ్యం.. కాబట్టి ఇలాంటి వీడియోలను నమ్మి మోసపోవద్దని.. మూడో నమ్మకాలను ప్రోత్సహించవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Cobra Video: నిద్రిస్తున్న యువకుడి షర్ట్లోకి దూరిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఏం జరిగిందంటే? వీడియో..
Hyderabad, Telangana:King Cobra Rare Viral Video Watch Here: సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలాది వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. వాటిల్లో నవ్వించేలా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తూ భయాందోళన కూడా కలిగిస్తూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.. ఒక యువకుడు అజాగ్రత్తగా చెట్టు కింద పడుకోగా.. అతని షర్టులోకి అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా దూరిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.
షర్టు లోపలికి దూరిన పాము..
వైరల్ అవుతున్న దృశ్యాల వివరాల ప్రకారం.. ఒక యువకుడు చెట్టు నీడన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు.. అయితే, అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక భారీ కింగ్ కోబ్రా నెమ్మదిగా అతని శరీరానికి పాకుతూ షర్టు లోపలికి దూరిపోయింది. ఆ యువకుడు నిద్రలేచి చూసేసరికి తన షర్టు లోపల పాము కదలడాన్ని గమనించి.. తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.. చిన్నపాటి పొరపాటు జరిగినా.. కాస్త కదిలినా.. ఆ విష సర్పం కాటేయడం ఖాయం.. దీంతో ఆ యువకుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. కదలకుండా అలాగే శవంలా పడుకొని ఉండిపోయాడు..
రంగంలోకి స్నేక్ క్యాచర్..
ఈ ప్రమాదకరమైన పరిస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఎక్స్పీరియన్స్ కలిగిన స్నేక్ క్యాచర్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించాడు. ఆ యువకుడికి ఎటువంటి హాని కలగకుండా.. పామును రెచ్చగొట్టకుండా చాలా నెమ్మదిగా యువకుడి షర్టు బటన్లు విప్పడం ప్రారంభించాడు..
షర్టులో నుంచి ఎలా తీశాడు?
ఆ సమయంలో ఒక్కొక్క క్షణం.. ఎంతో కీలకంగా మారింది. షర్టు విప్పుతున్న క్రమంలో ఆ కింగ్ కోబ్రా ఒక్కసారిగా తన పెద్ద పడగలను విప్పి.. కాటేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.. అక్కడున్న వారంతా కొద్ది దూరం జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఆ స్నేక్ క్యాచర్ అత్యంత నైపుణ్యంతో ఆ పాము దృష్టిని మళ్లించి.. దాన్ని షర్టులో నుంచి బయటకు లాగేసాడు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
షర్టులో నుంచి విజయవంతంగా బయటికి తీసిన ఆ ప్రమాదకరమైన నాగుపామును స్నేక్ క్యాచర్ చాకచక్యంగా ఒక కాళీ ప్లాస్టిక్ సీసాలో ఎక్కించి.. దానికి మూతను గట్టి బంధించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఆ యువకుడు భయంతో వణికిపోతూ.. తనకు పునర్జన్మ ప్రసాదించిన స్నేక్ క్యాచర్కు కృతజ్ఞత తెలిపినట్లు సమాచారం. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
SBI Apprentice 2026: నిరుద్యోగులు ఎగిరి గంతేసే వార్త! SBI బ్యాంకులో 7,150 ఉద్యోగాలు..నెలకు జీతం ఎంతంటే?
Hyderabad, Telangana:SBI Apprentice Recruitment 2026: బ్యాంకింగ్ రంగంలో తమ కెరీర్ ను ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సువర్ణ అవకాశాన్ని కల్పించింది. 2026-27 ఏడాదికి గాను దేశవ్యాప్తంగా మొత్తం 7,150 అప్రెంటిస్ (శిక్షణార్థులు) పోస్టుల భర్తీకి ఎస్బీఐ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఎప్పటికే ప్రారంభం అయ్యింది.
ఎస్బీఐ అప్రెంటిస్ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 7,150 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందుకోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా.. మే 19 దరఖాస్తు ప్రారంభ తేదీ కాగా, జూన్ 8న దరఖాస్తుకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పరీక్షను జులై నెలలో నిర్వహించేందుకు ప్రాథమికంగా వెల్లడించారు.
ఇది ఒక సంవత్సరం కాలం పాటు పరిమితి గల అప్రెంటిషిప్ శిక్షణ కార్యక్రమం మాత్రమే, శాశ్వత ఉద్యోగం కాదు. అయితే ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే భవిష్యత్తులో ఎస్బీఐతో పాటు ఇతర అనుబంధ సంస్థలు వచ్చే ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.
అర్హతలు, వయోపరిమితి
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పట్టభద్రత ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఏప్రిల్ ఒకటి 2026 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగుల గరిష్ట పరిమితులు సడలింపు ఉంటుంది.
తప్పనిసరి నిబంధనలు
1. అభ్యర్థులు గతంలో ఎక్కడా అప్రెంటిస్షిప్ శిక్షణ పొంది ఉండకూడదు.
2. ఒకే సంవత్సరం కంటే ఎక్కువ పని అనుభవం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు.
3. అభ్యర్థి ఏదైనా ఒక్క రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది.
4. దరఖాస్తు చేసుకునే రాష్ట్ర స్థానిక భాష పై పొట్టు ఉండాలి. స్థానిక భాషలోనూ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ..
ఈ పోస్టులను నియామక ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది. అందులో ఒకటి ఆన్లైన్ రాత పరీక్ష కాగా రెండోది స్థానిక భాషా పరీక్ష. వీటిలో ఉత్తీర్ణత పొందిన వారే అప్రెంటిస్షిప్ కి అర్హత సాధిస్తారు.
స్టైఫండ్, విరోచనాలు
ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 స్టైఫండ్ చెల్లిస్తారు. ఈ కాలంలో ఎస్బీఐ బ్యాంకింగ్ విధానాలు కస్టమర్ సర్వీస్ అనుభవం లభిస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికేట్ అందజేస్తారు.
ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి
1. మొదటగా అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ NAPS వెబ్సైట్లో తమ పేరు నమోదు చేసుకోవాలి.
2. ఆ తర్వాత ఎస్బిఐ అధికారిక వెబ్సైట్ లో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది.
3. హోం పేజీలో ఉన్న కెరియర్స్ విభాగంలోకి వెళ్లి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి.
4. అప్లికేషన్ ఫామ్ లో అడిగిన వివరాలను నింపి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.
5. దరఖాస్తు రుసుము చెల్లించి ఫారం ను సబ్మిట్ చేసి భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
6. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే యువతకు ప్రాక్టికల్ నాలెడ్జ్ సాధించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆసక్తి కల అర్హులైన అభ్యర్థులు జూన్ 8లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: రాజకీయాల్లోకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాజీ భార్య..బీజేపీలో చేరనున్న సంగీత!
ALso Read: తెలంగాణ ఏర్పాటుపై పవన్ కల్యాణ్ కీలక పోస్ట్..2009 నాటి వీడియో బయటపెట్టిన జనసేనాని!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
