Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rajanna Sircilla505302

వేములవాడలో వన మహోత్సవం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు

Jul 22, 2024 18:58:55
Vemulawada, Telangana

వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో జరిగిన వన మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అంతరించిపోతున్న అడవులను రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Feb 24, 2026 08:57:36
Hyderabad, Telangana:

Motorola Edge 70 Fusion Launch Date In India Telugu: ఇప్పుడు భారత మార్కెట్లో మోటరోలా మొబైల్స్‌కి ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే చాలా తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న స్మార్ట్‌ఫోన్స్‌ బ్రాండ్లలో మోటరోలా కూడా ఒకటి. ఈ కంపెనీ విడుదల చేసే మొబైల్స్ చాలా తక్కువ ధరల్లోనే ప్రీమియం డిజైన్‌తో అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో లభిస్తూ ఉంటాయి. అయితే, దీనిని గుర్తించిన యువత ఎక్కువగా ఈ బ్రాండ్ కు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మోటరోలా కంపెనీ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్స్‌ను మార్కెట్లోని వినియోగదారులకు పరిచయం చేస్తూనే వస్తోంది. ఇదిలా ఉంటే.. మోటరోలా కంపెనీ అతి త్వరలోనే మరో స్మార్ట్ ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఏంటో? దీనికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మోటరోలా కంపెనీ మార్కెట్లోకి తమ కొత్త ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ మొబైల్‌కు సంబంధించిన కొన్ని వివరాలు ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాండింగ్ పేజీలో ప్రత్యక్షమవుతున్నాయి. దీనిని కంపెనీ వచ్చే నెలలోనే విడుదల చేయబోతున్నట్లు కూడా ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే, మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. ఇది డిజైన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్  స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లాంచింగ్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ మార్చి రెండవ తేదీన అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫీచర్స్ కూడా అప్పుడే వెళ్లడయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ మొబైల్ మొత్తం నాలుగు రంగుల్లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాంటోన్ సిల్హౌట్ లెదర్ ఇన్‌స్పైర్డ్, పాంటోన్ బ్లూ సర్ఫ్ లెదర్ ఇన్‌స్పైర్డ్ కలర్స్ హైలెట్ అవుతాయి.ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని మొట్టమొదటిసారిగా కంపెనీ OIS సపోర్ట్‌తో సోనీ LYT-710 50-మెగాపిక్సెల్ కెమెరాతో విడుదల చేయబోతోంది..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

అలాగే ఈ మొబైల్ కెమెరా కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉండబోతోంది. ముఖ్యంగా తక్కువ లైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫోటోలను అందించేందుకు స్పెషల్ ఫీచర్స్ కూడా లభిస్తాయి. దీంతోపాటు వీడియోల కోసం కొన్ని రకాల స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఫ్రంట్ భాగంలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది ఫోర్ కె రికార్డుకు కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీతో లాంచ్ కాబోతోంది. అలాగే దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టును కూడా అందిస్తోంది. దీంతోపాటు మరెన్నో ఫీచర్స్ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన ధరను మార్చి రెండవ తేదీనే అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 24, 2026 08:05:58
Hyderabad, Telangana:

Nirmala Sitharaman Telugu Latest News: గత కొద్ది రోజుల నుంచి బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న మిస్ సేలింగ్ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఖాతాదారులకు వారి అవసరంతో సంబంధం లేకుండా.. బ్యాంకింగ్ సేల్స్ విభాగం బలవంతంగా బీమా పాలసీలను విక్రయించడంపై మంత్రి బ్యాంకర్లను హెచ్చరించారు.. భారత రిజర్వు బ్యాంకు కేంద్ర బోర్డు సమావేశం అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో భాగంగా ఆమె ఈ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యల వెనక ఏం జరిగి ఉంటుంది? కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై పూర్తి సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలోని అన్ని బ్యాంకులు తమ ప్రధాన విధులను విస్మరిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అసహనం వ్యక్తం చేశారు. చాలా బ్యాంకులు తమకు వచ్చి లాభాల కోసం లేదా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే కమిషన్ల కోసం ఖాతాదారులపై ఒత్తిడి తెస్తున్నాయని ఫిర్యాదులు అందుతున్నట్లు ఆమె మీడియా సమావేశంలో భాగంగా పేర్కొన్నారు. బ్యాంకులకు వచ్చే సర్వసాధారణ సామాన్యుడికి బీమా పాలసీలు అవసరమా లేదా అనేది చూడకుండా.. వాటిని బలవంతంగా అంటగట్టడం ఏమాత్రం సరికాదు.. ఇలాంటి పద్ధతులను తక్షణమే నిలిపివేయాలని ఆమె మీడియా ముఖంగా స్పష్టం చేశారు.

అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడుతూ బ్యాంకుల ప్రాథమిక బాధ్యతలను గుర్తు చేస్తూ పలు సూచనలు చేశారు.. ప్రజల నుంచి పొదుపును ప్రోత్సహించి డిపాజిట్లను పెంచడంపై బ్యాంకర్లు దృష్టి సాధించాలన్నారు. అంతేకాకుండా అర్హులైన వారికి ముఖ్యంగా చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలకు సకాలంలో రుణాలు అందేలా చూడాలని తెలిపారు. అలాగే వినియోగదారులకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా బ్యాంకులను నడపాలని సూచించారు.

Also Read: Maoist Ganapathi: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యం.. ఇప్పుడు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా?

రుణాల మంజూరు సమయంలోనే కస్టమర్లతో ఇన్సూరెన్స్ పేపర్లపై సంతకాలు చేయించుకోవడం, ఇన్సూరెన్స్ తీసుకుంటేనే లోన్ వస్తుందని బెదిరించడం వంటి చర్యలు చట్ట విరుద్ధమని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ గుర్తు చేశారు. ఇలాంటి అక్రమ విక్రయాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠినంగా వ్యవహరిస్తుందని.. బ్యాంకులు తమ నైతిక విలువలను కాపాడుకోవాలని ఆమె తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం పెరగాలంటే.. అది కేవలం లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో పని చేయాలని నిర్మల సీతారామన్ బ్యాంకులకు చెప్పారు.

Also Read: Maoist Ganapathi: మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ లభ్యం.. ఇప్పుడు ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
IPInamdar Paresh
Feb 24, 2026 07:36:47
Hyderabad, Telangana:

Man dies after risky snake stunt in navapur Mumbai: సోషల్ మీడియాలో ఇటీవల కొంత మంది ఫెమస్ అయ్యేందుకు నానా పాట్లు పడుతున్నారు. కొంత మంది క్రూర జంతువులు, జలపాతాలు, ఎత్తైన కొండల దగ్గరకు వెళ్లి రీల్స్ చేస్తున్నారు. అంతే కాకుండా తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి మరీ రీల్స్ చేస్తున్నారు. దీంతో వారి ప్రాణాలు కూడా కొన్నిసార్లు పొయిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి.  ముఖ్యంగా పాములకు ఇటీవల నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయని ఒకప్పుడు పాములంటే భయపడిన వారు కూడా ఇప్పుడు ఫోన్ లు తీసుకుని కోబ్రాల వీడియోలను రికార్డు చేస్తున్నారు.

 

ఆ తర్వాత దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రంమలో దాన్ని ముద్దులు పెట్టుకొవడం, మెడలో వేసుకొవడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ఇటీవల కొంత మంది పాము కాటుకు గురయ్యారు. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

 ముంబైలోని విరార్ వెస్ట్‌లోని నవాపూర్‌లో  రాజు చందు బరాద్ అనే 40 ఏళ్ల  వ్యక్తి పామును పట్టుకున్నాడు. దాన్ని ఆతర్వాత మెడలో వేసుకుని స్టంట్ లకు దిగాడు. అందరి ముందు హీరోలా ఫోజులకు దిగాడు. అంతటితో ఆగకుండా దానికి ముద్దులు కూడా పెట్టాడు. అతగాడు తాగిన మైకంలో ఉన్నట్లు అక్కడి వారు చెబుతున్నారు.

ఇంతలోపాము అతని చెయి నుంచి విడిపించుని పలు మార్లు కాటు వేసింది. ఈ ఘటనతో అతను రెప్పపాటులో కుప్పకూలీపోయాడు. పాము చెట్లలోకి వెళ్లిపోయింది. అక్కడివారు అతడ్ని ఆస్పత్రికి తరలించారు.

Read more: Video Viral: ఓర్నాయనో.. పబ్లిక్‌లో రెచ్చిపోయిన యువతి.. ప్రియుడ్ని ఇష్టమున్నట్లు కొడుతూ.. వీడియో వైరల్..

కానీ అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మొత్తంగా కాపాడిన పాముతో డెంజర్ రిస్క్ చేసి దానిచేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు పోయేకాలం వస్తే ఇలానే చేస్తారు అంటూ తాగుబోతును తిట్టిపోస్తున్నారు.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 24, 2026 06:15:54
Hyderabad, Telangana:

Maoist Ganapathi Telugu Latest News: భారత మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే ఒక అత్యంత కీలక అధ్యయనం ముగింపు దశకు చేరుకుందని మనం భావించవచ్చు.. దశాబ్దాల పాటు నిషేధిత మావోయిస్టు పార్టీని నడిపించిన మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి అచూకీని పోలీసులు గుర్తించారు.. గత కొంతకాలంగా ఆయన ఎక్కడ ఉంటున్నారనే దానిపై ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ.. ప్రస్తుతం ఆయన నేపాల్ లో ఉంటున్నట్లు పోలీసులకు విశ్వనీయ సమాచారం అందింది. అయితే, గణపతి అక్కడ ఉండడానికి గల కారణాలేంటి? భారతదేశాన్ని వదిలి నేపాల్ వెళ్లిపోవడం వెనక ఉన్న అసలైన రీజన్ ఏంటో? మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గణపతి గత కొన్ని ఏళ్ల నుంచి అండర్ గ్రౌండ్ లో పనిచేస్తూ ఉన్నారు. అయితే వయస్సు పెరగడంతో వృద్ధాప్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.. గత కొద్ది రోజుల నుంచి తీవ్ర అనారోగ్యం కారణంగా గణపతి 2018 లో పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.. ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నారని, వైద్య సహాయం కోసం నేపాల్ ను ఆశ్రయించారని తెలుస్తోంది.  మానవీయ కోణంలో ఆయనను భారత్కు రప్పించి.. తెలంగాణ పోలీసుల ఎదుట నింగి పోయేలా చేసేందుకు ఉన్నత అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.. ఈ దిశగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు మధ్యవర్తులతో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది..

మరోవైపు బాబు ఈస్ట్ పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఒక్కొక్కరిగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.. తాజాగా అందిన సమాచారం ప్రకారం తెలంగాణ పోలీస్ ఎదుట నలుగురు అత్యంత కీలకమైన రావోయిస్టు నేతలు లొంగిపోవడానికి సిద్ధమయ్యారట.. అందులో తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జి పార్టీ సెంట్రల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.. ఈయనపై కోటి రివార్డు కూడా ఉంది. అలాగే దామోదర్ అలియాస్ బడే చొక్కా రావు తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ.. అంతేకాకుండా సంగ్రామ్ ఆలియాస్ మల్లా రాజిరెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడు,  నరసింహారెడ్డి కేంద్ర కమిటీ సభ్యుడు వీరంతా అతి త్వరలోనే పోలీసుల ముందు లొంగిపోబోతున్నట్లు తెలుస్తోంది. 

నక్సిలిజాన్ని తొలగించే దిశగా కేంద్రం చేపడుతున్న ప్రత్యేకమైన ఆపరేషన్లలో భాగంగా వీరంతా లొంగిపోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 2026 సంవత్సరం మార్చి గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయి నేతలు లొంగిపోవడం పార్టీకి కోలుకో లేని దెబ్బగా మారింది.. గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లతో పాటు అగ్ర నేతల మరణాలు, అంతర్గత విభేదాల వల్ల పార్టీ కేడర్ పూర్తిగా దెబ్బ తింటూ వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా వీరి లొంగుబాటుతో పార్టీ బలహీనంగా మారే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు..

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 24, 2026 05:43:53
Hyderabad, Telangana:

HYDRAA Commissioner: హైడ్రా కమిషనర్ రంగనాథ్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌లా పని చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేశారు. 'సున్నం చెరువులో 5 ఎకరాల భూమిని వదిలేసి మళ్లీ ఫెన్సింగ్ వేశారు. కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్‌లో సర్వే నెంబర్ 29, 30 ప్రభుత్వ భూమిపై అసోసియేషన్‌ సభ్యులు ఆర్టీఏ పెట్టారు. 2017లో తమ ప్రభుత్వం  కోట్ల రూపాయలతో చెరువులకు ఫెన్సింగ్ వేశాం. అల్లాపూర్ డివిజన్‌లో సున్నం చెరువు రూ.47 లక్షల తో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నివేదికతో ఫెన్సింగ్ వేస్తాం. ఇప్పుడు కమిషనర్ 5 ఎకరాలు వదిలేస్తున్నారు' అని ఆరోపించారు.

Also Read: Russells Viper: తీవ్ర విషపూరితమైన పాము నుంచి కొడుకును రక్షించిన తండ్రి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. '2017లో అధికారులు ఇచ్చిన సమాచారం వదిలేసి 2014 ఇచ్చిన దానిని ప్రామాణికం తీసుకోవడం ఏమిటి? సున్నం చెరువుపై పూర్తి విచారణ జరపాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేగా మేము భూమిని కాపాడాలని కోరుతుంటే ఏకంగా  వదిలిపెడుతున్నారని హైడ్రా కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇంట్లో ఉన్న వారిని బయట పడేసి ఇండ్లు కూల్చారు. చదువుకునే  పిల్లలను కూడా వేడుకుంటే వినలేదు. హైదరాబాద్‌లో ఉన్న టాప్ 10 బిల్డర్‌ను కూడా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు.. స్పందించారు' అని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు.

Also Read: Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. అదనంగా రూ.10 లక్షలు

'సున్నం చెరువు, మైసమ్మ చెరువును పట్టించుకోరు. ఐడీఎల్‌ను అభివృద్ధి చేస్తే అక్కడ లైట్స్ వెలగవు. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై కక్ష సాధింపు చేస్తున్నారు. ఆల్విన్ కాలనీలో ఫెన్సింగ్ వేశారు. ఎవరు కూడా అక్కడ కబ్జా పెట్టలేదు.. అక్కడ పేదలు కూరగాయలు పెట్టుకునే అమ్ముకుంటే ఫెన్సింగ్ వేసి ఇబ్బంది పెట్టారు' అని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిని ప్రభుత్వంతో మాట్లాడి ప్రజా వినియోగంలోకి తీసుకొని వచ్చానని గుర్తుచేశారు. ఐదు ఎకరాలు ఉన్న భూమి ఎందుకు వదిలేసి ఫెన్సింగ్ వేశారో ప్రజలకు హైడ్రా కమిషనర్ సమాధానం చెప్పాలని కోరారు.

Also Read: Lack Of 108 Ambulance: ఏపీలో దారుణం.. 108 అంబులెన్స్‌ లేక ఎడ్లబండిపై భార్య తరలింపు

'ప్రజల కట్టిన డబ్బుతో మీరు జీతం తీసుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి. కమిషనర్ తీరుపై సెంట్రల్ విజిలెన్స్‌తోపాటు  ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకటించారు. 'అల్లాపూర్‌లోని ముస్లిం శ్మశానవాటిక విషయంలో కమిషనర్ తానే ఇస్తానని చెప్పడం ఏమిటి? నువ్వు వచ్చి ఇస్తానని చెప్పడానికి నువ్వు ఏమైనా ముఖ్యమంత్రివా?' అని హైడ్రా కమిషనర్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. 'హైదరాబాద్‌లో 90 శాతం పైగా భూములు భారీగా ఉన్నాయి. హైడ్రా అభివృద్ధికి ఎమ్మెల్యేగా సహకరిస్తా. కానీ పేదల జోలికి వస్తే ఊరుకోను' అని హెచ్చరించారు. సున్నం చెరువు పై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 24, 2026 05:26:54
Hyderabad, Telangana:

Malavya Yoga Effect On Zodiac Telugu: మార్చి 2026లో అనేక గ్రహాలు కదలికలు చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు అరుదైన నక్షత్రాల్లోకి ప్రవేశించబోతున్నాయి. ఈ సమయంలో శుక్రుడులాంటి అద్భుతమైన గ్రహం కదలికలు జరపడం విశేషం.. ముఖ్యంగా మార్చి రెండవ తేదీన శుక్రుడు కుంభరాశి నుంచి బయలుదేరి.. మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలోనే ఎంతో శుభప్రదమైన మాలవ్య రాజయోగం ఏర్పడబోతోంది. మార్చి 15వ తేదీన సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ సూర్యుడు, శుక్రుడు, శని గ్రహాల కలయిక జరుగుతుంది. ఇక ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన త్రిగ్రహి రాజయోగం ఏర్పడుతుంది. హోలీ సమయంలో ఈ గ్రహ కలయికల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతోంది. ఆర్థికంగా ఎంతో మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రాశులవారికి ఊహించని రాశి ఫలాలు:
వృషభ రాశి 
ముఖ్యంగా శుక్రుడు సంచార ఫలితంగా వృషభ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి శుక్రుడు ఉన్నత స్థానంలో ఉండడం వల్ల ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. మార్చి నెలలో అద్భుతమైన పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు.. ఈ సమయంలో విస్తరణలు కూడా జరుగుతాయి. కొత్త ఆదాయ వనరులు కూడా లభించడంతో.. కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. సన్నిహితుల సపోర్టుతో అన్ని రంగాల్లో బాగా రాణించగలుగుతారు. 

మిథున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అత్తిక స్థితి చాలా వరకు మెరుగుపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. పనుల్లో పాల్గొనే వ్యక్తులకు సృజనాత్మకత కూడా పెరుగుతుంది. గరిష్ట స్థాయిలో లాభాలు కూడా పొందుతారు. పనుల్లో ప్రశంసలు లభించడమే కాకుండా.. సామాజిక హోదా కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధిస్తారు.

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది.. పోటీ పరీక్షలు రాయాలనుకుంటున్న వ్యక్తులు ఈ సమయంలో మంచి జ్ఞానంతో.. పరీక్షలు రాసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబంలో శుభ సంఘటనలు ఏర్పడే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏవైనా పనులు ప్రారంభించడం వల్ల అనుకున్న విజయాలు కూడా సాధించగలుగుతారు. దీంతోపాటు ఆర్థికంగా చాలా మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

కుంభరాశి 
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శుక్రుడు ప్రభావంతో అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అలాగే సామర్థ్యం కూడా విపరీతంగా పెరిగి అద్భుతమైన ప్రయోజనాలు ముందే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా గుర్తింపు పొందగలుగుతారు. విదేశీ వ్యాపారాలు చేస్తున్న వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆరోగ్య పరిస్థితిని కూడా కొంతవరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 24, 2026 05:10:47
Hyderabad, Telangana:

March Lucky Zodiac Sign 2026 Telugu: మార్చి నెల ప్రారంభం కావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాబోయే మార్చి నెల చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా మార్చి రెండవ తేదీ నుంచి 5వ తేదీ మధ్య అనేక ప్రధాన గ్రహాలు నక్షత్ర మార్పులతో పాటు రాశి సంచారాలు జరుపుతాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన గ్రహాలు ఈ సమయంలో కదలికలు జరపడం విశేషం..మార్చి రెండున శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు.. ఆ తర్వాత మూడో తేదీన కుజుడు శతభిషా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు.. ఆ తర్వాతిరోజే శుక్రుడు మళ్ళీ ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా మార్చి ఐదున సూర్యుడు పూర్వభాద్ర పాద నక్షత్రంలోకి, మార్చి ఐదున సూర్యుడు అదే నక్షత్రంలోకి సంచారం చేస్తాయి. ఈ సమయంలో అనేక గ్రహాలు సంచారం చేయడం కారణంగా.. కొన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. 

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మిథున రాశి 
మిధున రాశి వారికి ఈ సమయంలో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గణనీయమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా.. కష్టపడి పనులు చేసే వారికి అద్భుతమైన ప్రశంసలు లభిస్తాయి. అలాగే ఈ సమయంలో బహుమతులు కూడా పొందవచ్చు.

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు రెండింటిలోనూ పురోగతి సాధించే అవకాశాలున్నాయి. అలాగే కోపంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ.. కొన్ని రకాల మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తులారాశి 
తులారాశి లో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఊహించని విజయాలు కలగడమే కాకుండా.. కెరీర్ పరంగా స్థిరత్వం చాలా వరకు పెరుగుతుంది. ముఖ్యంగా నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఇంటర్వ్యూ లేదా పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడమే కాకుండా.. నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆర్థికంగా చాలా వరకు బలం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కొత్త అవకాశాలు లభించడమే కాకుండా.. పదోన్నతులు కూడా తిరిగి పొందుతారు. కొత్త కొత్త బాధ్యతలను పొంది జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. 

మకర రాశి 
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం ఎంతో అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ముఖ్యంగా పదోన్నతులకు సంబంధించిన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి ఆర్థిక పరిస్థితులు బలంగా మారుతాయి. జీవితం మరింత సమతుల్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా అనుకుంటున్న పనులు కూడా చేయగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 24, 2026 03:42:16
Hyderabad, Telangana:

Russells Viper Attack: ఇంటి ముందు ఆడుకుంటున్న తన కుమారుడిపైకి అత్యంత విషపూరితమైన పాము రక్తపింజరి దూసుకొచ్చింది. పాము తనపై దాడి చేసేందుకు ప్రయత్నించగా.. 'నాన్న పాము' అంటూ ఆ కొడుకు ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లి తన నాన్నకు చెప్పాడు. అది చూసి విస్తుపోయిన తండ్రి పాము బారి నుంచి తన కొడుకుతోపాటు తన కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆ తండ్రి భావించాడు. సాహసంతో అత్యంత విషపూరితమైన ఆ పాము నుంచి కుటుంబాన్ని కాపాడాడు. ఈ పోరాటంలో రక్తపింజరి చనిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Lack Of 108 Ambulance: ఏపీలో దారుణం.. 108 అంబులెన్స్‌ లేక ఎడ్లబండిపై భార్య తరలింపు

హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఎర్రబోడ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వాచ్‌మెన్‌ రమేశ్‌ కుటుంబం నివసిస్తోంది. ఉదయం కావడంతో ఇంటి ముందు అతడి మూడేళ్ల కుమారుడు ఆడుకుంటూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అకస్మాత్తుగా అత్యంత విషపూరితమైన రక్తపింజరి అక్కడకు వచ్చింది. ఆటలో లీనమైన ఆ బాలుడు పామును పట్టించుకోలేదు. కానీ బుసలు కొడుతూ ఆ పాము దాడి చేసేందుకు ప్రయత్నించింది.

Also Read: Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. అదనంగా రూ.10 లక్షలు

అప్రమత్తమైన మూడేళ్ల బాలుడు వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయాడు. భయంతో అరుస్తూ తండ్రి రమేశ్‌ వద్దకు పరుగెత్తాడు. నాన్న పాము వచ్చిందని చెప్పడంతో ఆ కుటుంబం భయాందోళనకు గురయ్యింది. అప్రమత్తమైన వాచ్‌మెన్ వెంటనే పెద్ద కర్ర తీసుకుని బయటకు వచ్చాడు. కుటుంబాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించి పామును తరిమేందుకు ప్రయత్నించాడు. కర్రతో దాడి చేయడంతో రక్తపింజరి పాము తీవ్రంగా గాయపడి అక్కడే చనిపోయింది.

Also Read: Nara Lokesh: ఇందాపూర్‌ డెయిరీకి.. హెరిటేజ్‌కు సంబంధం లేదు: నారా లోకేశ్‌

పాము చనిపోవడంతో ఆ కుటుంబంతోపాటు అక్కడి స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆటలో లీనమైన కుమారుడిని పాము బారి నుంచి తండ్రి రమేశ్‌ తప్పించడంతో బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. అయితే తరచూ పాముల సంచారం పెరిగిపోయిందని.. ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉంటున్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని పాముల బెడద నుంచి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటనతో చిన్నపిల్లలను ఒంటరిగా బయట ఉండనివ్వొద్దని నిర్ణయం తీసుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Feb 24, 2026 03:37:01
Secunderabad, Telangana:

Mumbai Dharavi Slum Business: ముంబైలో.. ఆకాశహర్మ్యాల నీడలో..  టిన్ షీట్లు.. ఆస్బెస్టాస్ పైకప్పులతో విస్తరించిన ఒక ప్రపంచం ఉంది. బయటివారికి అది మురికివాడ. కొందరికి బతుకుదెరువుకు బాసటగా నిలిచే ప్రదేశం. మరికొందరికి సినిమాలు.. నవలలు సృష్టించిన ఒక ప్రతీక. కానీ ఈ ఇరుకైన వీధుల్లో అడుగు పెట్టిన క్షణం నుంచి ఆ అభిప్రాయాలు ఒక్కొక్కటిగా కూలిపోతాయి. ఎందుకంటే ఇది కేవలం పేదరికం కథ కాదు. ఇది పట్టుదల, ప్రతిభ, వ్యాపార మేధస్సు, అసాధారణ జీవన శక్తి కథ.

ముంబైలో దాదాపుగా 593 పైచిలుకు ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రాంతమే ధారవి. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది జనాభా నివసిస్తారు. నిజానికి ఇది ఒకప్పుడు మురికివాడ కాదు. 19వ శతాబ్దానికి ముందు ధారవి ప్రాంతం ఒక పెద్ద పల్లెటూరుగా ఉండేది. చేపలు పట్టుకుని బతికే కోలి కులస్తులు ఇక్కడ ఉండేవారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని కోలివాడ అని కూడా పిలిచేవారు. 1850 తర్వాత దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి  పెద్ద సంఖ్యలో ప్రజలు ముంబై నగరానికి రావడం మొదలైంది.

ఇలా వచ్చిన నిరుపేదలంతా ధారవిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. తొలి రోజుల్లో తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ధారవి ప్రాంతానికి వచ్చి సెటిలయ్యారు. అందుకే ధారవిని చోటా తమిళనాడు అని కూడా అనేవారు. తర్వాతి కాలంలో  దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వచ్చారు. దీంతో ధారావీ ఒక మినీ ఇండియాగా మారిపోయింది. 

ప్రఖ్యాత రచయిత Salman Rushdie..  ధారావిని అర్థం చేసుకోవాలంటే అక్కడ నెలల తరబడి జీవించాల్సిందే అని చెప్పారు. ఆయన చెప్పిన మాటలో సత్యం ఉంది. ఇక్కడి వాస్తవం ఒక రోజు పర్యటనతో కనిపించదు. ఇరుకైన గల్లీలు, తడి గోడలు, మూసుకుపోయిన కాలువలు.. ఇవి ఒక వైపు. మరోవైపు, అదే గల్లీలలో నడుస్తున్న కోట్ల రూపాయల వ్యాపారం. ఇది ఒక కాలువ.. కానీ అది బంగారంతో తయారు చేసింది అని ఇక్కడే జన్మించిన ప్లంబర్ రాజు హనుమంత అంటాడు. అతని మాటల్లో అతిశయోక్తి లేదు. ఎందుకంటే కేవలం 2.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో.. సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. అంచనాల ప్రకారం వార్షిక టర్నోవర్ రూ. 9,000 కోట్లకు మించి ఉంటుంది.

ధారావిని  సిటీ వితిన్ ఎ సిటీ  అంటారు. ఎందుకంటే ఇక్కడే పుట్టి..  ఇక్కడే పెరిగి.. ఇక్కడే పనిచేసి జీవితాన్ని ముగించే లక్షలాది మంది ఉన్నారు. కానీ ఈ చిన్న నగరం ముంబై మహానగరానికి ఒక గొప్ప శక్తి కేంద్రం. దక్షిణ ముంబైలోని Ballard Estate లేదా Bandra Kurla Complex లో ఒప్పందాలు కుదురుతుంటే, వాటి మూలాలు చాలాసార్లు ధారావి గల్లీల్లోనే మొదలవుతాయి. ఇక్కడ భూమి చవక అని అనుకోవడం పెద్ద పొరపాటు. నివాస గదులు నెలకు రూ. 3,000 నుంచి రూ. 7,000 వరకు ఉంటాయి. కొత్తగా ముంబైకి వచ్చే కార్మికులకు ఇది పెద్ద ఊరటగా అనిపిస్తుంది. ఇక్కడ నివసించాలంటే పోలీస్ వెరిఫికేషన్ అవసరం లేదు. ఎక్కువ ప్రశ్నలు అడిగేవారు ఉండరు. ఒకే షరతు నెలవారీ అద్దె నగదుగా చెల్లించాలి.

కానీ వాణిజ్య దుకాణాల విషయానికి వస్తే  పూర్తిగా మారుతుంది. 1,200 నుంచి 1,800 చదరపు అడుగుల షాప్‌కు నెలకు రూ. 1.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రాథమిక సౌకర్యాలు లేకున్నా, వ్యాపారం బలంగా ఉండటం వల్లే ఈ రేట్లు. ప్రతి అంగుళం భూమి ఇక్కడ విలువైనదిగా మారింది. ధారావి ఆర్థిక హృదయం అంటే తోలు పరిశ్రమ. 19వ శతాబ్దం చివరలో ప్రారంభమైన ఈ వృత్తి ఇప్పటికీ ఇక్కడ ప్రధాన ఆధారం. వేలాది చిన్న వర్క్‌షాపుల్లో బ్యాగులు, జాకెట్లు, బూట్లు, సాడిల్స్ తయారవుతాయి. ఈ ఉత్పత్తులు యూరప్, అమెరికా మార్కెట్లకు చేరతాయి. ఒక్కో సంచిపై కార్మికుడికి రూ. 200–రూ. 300 లాభం వచ్చినా, భారీ ఉత్పత్తి వల్ల మంచి ఆదాయం వస్తుంది. కొందరు వ్యాపారులు రోజుకు రూ. 20,000 వరకు సంపాదిస్తారు.

తోలు కాన్పూర్, చెన్నై వంటి నగరాల నుంచి వస్తుంది. ఇక్కడి చేతివృత్తులవారు దానిని విలువైన ఉత్పత్తులుగా మారుస్తారు. ప్రభుత్వ మద్దతు, ఆధునిక యంత్రాలు ఉంటే గూచీ, ప్రాడా వంటి బ్రాండ్‌లకు పోటీ ఇవ్వగలమని స్థానిక శిల్పులు చెబుతారు. కేవలం తోలు మాత్రమే కాదు. కుంహర్వాడ ఆసియాలోనే అతిపెద్ద కుండల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. గుజరాత్‌కు చెందిన కుటుంబాలు తరతరాలుగా ఇక్కడ మట్టి కళను కొనసాగిస్తున్నాయి. దీపాలు, పూలకుండలు, అలంకార వస్తువులు దేశమంతటా సరఫరా అవుతుంటాయి. దీపావళి సమయానికి ఇక్కడ పగలు-రాత్రి తేడా ఉండదు. అయితే ఫర్నేస్‌ల నుంచి వచ్చే పొగ కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇది ఈ విజయానికి ఉన్న మరో చేదు నిజం వంటిది.

Also Read: Gold Rate Today: ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం -వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?  

ధారావి వీధుల్లో తెల్లవారుజామునే జీవితం మొదలవుతుంది. ఉదయం 2:30కే ఇడ్లీ, వడ తయారీ ప్రారంభమవుతుంది. 5 గంటలకల్లా వేల కిలోల ఆహారం సిద్ధమై ముంబై అంతటా పంపిణీ అవుతుంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి వచ్చిన కుటుంబాలు ఈ ఆహార వ్యాపారాన్ని నడుపుతున్నాయి. ఇది నగరానికి కనిపించని కానీ కీలకమైన ఆర్థిక వ్యవస్థ అని చెప్పాలి. ఇంకా ఒక గొప్ప శక్తి.. రిసైక్లింగ్ పరిశ్రమ. ముంబై చెత్తలో దాదాపు 80శాతం ఇక్కడే పునర్వినియోగం అవుతుంది. రోజుకు వేల టన్నుల వ్యర్థాలు వర్గీకరిస్తారు. ప్లాస్టిక్‌ను శుభ్రపరచి, కట్ చేసి, ఎండబెట్టి మళ్లీ వినియోగానికి సిద్ధం చేస్తారు. ఇది ప్రమాదకరమైన పని.. పాత సూదులు, గాజు ముక్కలు గాయాలకు కారణమవుతాయి. అయినప్పటికీ లక్షలాది కుటుంబాల జీవనోపాధి దీనిపై ఆధారపడి ఉంది.

ధారావి విస్తీర్ణం బాంద్రా, మాహిమ్, మాతుంగా, సియోన్, కుర్లా, చునాభట్టి, కింగ్స్ సర్కిల్ ప్రాంతాల వరకు వ్యాపించింది. బాంద్రా స్టేషన్ పశ్చిమ వైపు విలాసవంతమైన బంగ్లాలు ఉంటే, తూర్పు వైపు కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ధారావి ప్రారంభమవుతుంది. ఒకే నగరంలో రెండు విభిన్న ప్రపంచాలు. ఇప్పుడు పునరాభివృద్ధి ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. కొందరికి ఇది ఆశ. మరికొందరికి భయం. కొత్త భవనాలు నిర్మిస్తే ఉద్యోగాలు, గుర్తింపు కోల్పోతామేమో అన్న ఆందోళన ఉంది.  భవనాలు మారవచ్చు, కానీ ధారావి ఆత్మ మారదు..  అని స్థానికులు అంటున్నారు.

ధారావి అంటే మురికివాడ మాత్రమే కాదు. అది శ్రమ, స్వప్నం, ఆత్మగౌరవం. ప్రతి రోజూ ముంబై నగరాన్ని తన భుజాలపై మోసే వేలాది కార్మికుల కథ. బయటివారికి ఇది కాలువలా కనిపించవచ్చు. కానీ లోపలికి వెళ్లి చూడగానే తెలుస్తుంది... ఇది నిజంగా బంగారంతో తయారైన ఒక ప్రపంచం అని.

Also Read:  EPFO: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హయ్యర్ పెన్షన్ రీస్టార్ట్..!!  

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 23, 2026 18:19:20
Nunna, Vijayawada, Andhra Pradesh:

AP Housing Scheme Release Date: ఏపీలో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) - గ్రామీణ్ 2.0 పథకం కింద కొత్త ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ నెలలో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
 
ఈ ప్రక్రియలో భాగంగా గత ఏడాది డిసెంబర్ వరకు దరఖాస్తులను స్వీకరించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన తుది దశకు చేరుకుంది. మార్చి 3 వరకు కేంద్ర ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి ఆమోదం తెలపనుంది. ఏప్రిల్ నెలలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు.

దరఖాస్తుల గణాంకాలు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10.42 లక్షల మంది ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం (స్థలం ఉన్నవారు) 8.29 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. స్థలంతో పాటు ఇంటి కోసం దరఖాస్తు చేసినవారు 2.13 లక్షల మంది ఉన్నారు. 

అందులో సామాజిక వర్గాల విభజన ఆధారంగా ఎస్సీలు 2.16 లక్షలు, ఎస్టీ 1.43 లక్షలు, దివ్యాంగులు 4,965తో పాటు ఇతర సామాజిక వర్గాల వారు 6.92 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుమారు 60 వేల దరఖాస్తులను వివిధ కారణాల వల్ల తిరస్కరించి, వారిని అనర్హులుగా ప్రకటించింది.

పథకం అమలు తీరు & ప్రాధాన్యత
నివాస స్థలం లేని పేదలకు 3 సెంట్ల స్థలం కేటాయించి, అందులో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. అలాగే ఇప్పటికే స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణ దశల వారీగా నిధులను నేరుగా వారి ఖాతాల్లోకి విడుదల చేస్తారు. అత్యంత పేదలు, వితంతువులు, ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు మొదటి విడతలో ఇళ్లను కేటాయిస్తారు.

జిల్లాల వారీగా స్పందన
అత్యధిక దరఖాస్తులు వెల్లువచ్చిన జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా (77,353) మొదటి స్థానంలో ఉండగా, శ్రీకాకుళం (75,117), అన్నమయ్య (68,508) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ పథకం కోసం అత్యల్పంగా విశాఖపట్నం జిల్లా నుంచి కేవలం 7,433 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం అధికారులు పంపిన జాబితాపై కేంద్రం ఆమోదం ముద్ర వేయడమే తరువాయి. ఏప్రిల్ నుంచి ఏపీలో ఇంటి నిర్మాణాల సందడి మొదలుకానుంది.

Also Read: Nara Lokesh On Jagan: "పులివెందుల MLAకి భారీ ఆఫర్..మ్యాచ్ టికెట్ నేనే ఇప్పిస్తా!" ఏపీ మంత్రి నారా లోకేష్!

Also Read: Holi Holidays: హోలీ సెలవులు వచ్చేస్తున్నాయి! ఏకంగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎక్కడెక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 17:53:19
Hyderabad, Telangana:

Telangana Employees And Pensioners: ఉద్యోగులు, పింఛన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విధుల్లో ఉన్న ఉద్యోగి అనారోగ్యంతో.. ప్రమాదవశాత్తు ఎలా మరణించినా కూడా బాధిత కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు రూ.10 లక్షల చొప్పున బాధిత కుటుంబానికి చెల్లించేలా తెలంగాణ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Also Read: Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలు.. కీలక అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశం దాదాపు ఐదు గంటలపాటు సాగింది. మంత్రిమండలిలో కూడా కీలక అంశాలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. మెట్రో రైల్‌ స్వాధీనంతోపాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు తదితర అంశాలపై మంత్రిమండలి నిర్ణయాలు తీసుకుంది. మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. వాటిలో ఉద్యోగులకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి.

Also Read: Lack Of 108 Ambulance: ఏపీలో దారుణం.. 108 అంబులెన్స్‌ లేక ఎడ్లబండిపై భార్య తరలింపు

ప్రభుత్వ ఉద్యోగులు 60 ఏళ్లలోపు చనిపోతే వారికి రెగ్యులర్‌ బెనిఫిట్లతోపాటు అదనంగా రూ.10 లక్షలు వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం వస్తున్న ఆర్థిక ప్రయోజనాలకు అదనంగా రూ.10 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ప్రమాదాల విషయంపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు, పింఛనర్లకు భారం కాకుండా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటన చేశారు.

Also Read: Adulterated Milk: కల్తీపాల మృతులకు రూ.10 లక్షల పరిహారం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన

'తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, పింఛన్‌దారులు మొత్తం కలిపి 7.56 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగి చనిపోతే ఇప్పుడు చెల్లిస్తున్న బెనిఫిట్లకు అదనంగా రూ.10 లక్షలు ఇచ్చేలా పథకం తీసుకొస్తాం' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. 'ఇక డిజిటల్‌ హెల్త్‌ ఎంప్లాయ్‌ కార్డులు 17.7 లక్షల మంది ఉద్యోగులు, ఫింఛనర్లకు అందిస్తాం. దాదాపు అన్నీ వ్యాధులకు రాష్ట్రంలోని 652 ఆస్పత్రుల్లో వైద్య చికిత్స అందేలా ఏర్పాట్లు. త్వరలోనే ఎంప్యానల్‌ ఆస్పత్రుల్లో చికిత్సకు ఏర్పాట్లు' అని మంత్రి వెల్లడించారు. ఉద్యోగుల కనీస వేతనం (బేసిక్‌ పే) నుంచి 1.5 శాతం ట్రస్తుకు జమయ్యేలా  మొత్తం రూ.528 కోట్లు సేకరిస్తాం. దీనికి ప్రభుత్వం మరో రూ.528 కోట్లు అందించి ట్రస్టు ఖాతాలో జమచేస్తాం. ఈ ట్రస్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణ ఉంటుంది’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. 

Also Read: KTR Statement: నా పేరుతో ఎవరైనా సంఘాలు పెడితే ఊరుకోను: కేటీఆర్

మంత్రిమండలి తీసుకున్న తాజా నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులకు కొంత ప్రయోజనం చేకూరనుండగా.. అసలైన డిమాండ్లు, సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉండడం.. కరువు భత్యం చెల్లింపు, వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ), రిటైర్మెంట్‌ బెనిఫిట్లపై మాత్రం మంత్రిమండలిలో చర్చ జరగలేదు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు కంటి తుడుపు చర్యగా ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఈ మంత్రిమండలి సమావేశంలోనూ తమకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోవడంపై ఉద్యోగ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. దీనిపై త్వరలోనే ఉద్యోగులు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 23, 2026 16:43:39
Hyderabad, Telangana:

Telangana Cabinet Decisions: హైదరాబాద్‌ మెట్రో రైలు, ఇళ్ల గణనతోపాటు బడ్జెట్‌ సమావేశాలపై తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్‌ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం మొదలైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొన్ని గంటల పాటు సాగింది.

Also Read: Lack Of 108 Ambulance: ఏపీలో దారుణం.. 108 అంబులెన్స్‌ లేక ఎడ్లబండిపై భార్య తరలింపు

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జన గణనను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. నిర్ణిత షెడ్యూల్ ప్రకారం తొలి విడత  జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9వ తేదీ వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు వివరించారు. హౌజ్ లిస్టింగ్‌కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను వివరించారు. రాష్ట్రంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జన గణన ప్రక్రియలో పాలుపంచుకుంటారు. రెండో దశ జన గణన ప్రక్రియ వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరిలో చేపడుతారు. హైదరాబాద్ మెట్రోను ఎల్& టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

Also Read: Adulterated Milk: కల్తీపాల మృతులకు రూ.10 లక్షల పరిహారం.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన

మెట్రో రైలు స్వాధీనం
ఎల్‌ అండ్‌ టీ ఆధీనంలో ఉన్న హైదరాబాద్‌ మెట్రో రైలును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో మంత్రిమండలి చర్చించింది. హైదరాబాద్‌ మెట్రో రైలును ఎల్‌ అండ్‌ టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని మంత్రివర్గం చర్చించింది. గతేడాది రూ.2 వేల కోట్ల ఈక్విటీని.. ఏకమొత్తంగా ఎల్‌ అండ్‌ టీకి చెల్లించేలా రూ.13 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం బదలాయించుకునేలా అవగాహనకు వచ్చింది.

Also Read: KTR Statement: నా పేరుతో ఎవరైనా సంఘాలు పెడితే ఊరుకోను: కేటీఆర్

ఎల్‌ అండ్‌ టీ నుంచి హైదరాబాద్‌ మెట్రో రైలును స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోనే ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు. మంత్రివర్గ సమావేశం తీసుకున్న నిర్ణయంతో మెట్రో రైలు స్వాధీనం ప్రక్రియ పూర్తి కానుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Feb 23, 2026 16:16:08
Nunna, Vijayawada, Andhra Pradesh:

Nara Lokesh Comments On Jagan: టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పర్యటన, హెరిటేజ్ సంస్థపై వస్తున్న విమర్శలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తూనే, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒక ఆసక్తికరమైన ఆఫర్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

"జగన్ వస్తానంటే టికెట్ నేనే ఇప్పిస్తా"
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వీక్షించేందుకు విదేశాలకు వెళ్లడంపై వైసీపీ విమర్శించగా, లోకేష్ ఇలా స్పందించారు. "నాకు దేశభక్తి ఉంది, అందుకే ఇండియా మ్యాచ్ చూడటానికి వెళ్లాను. టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరితే మళ్లీ వెళ్తాను" అని స్పష్టం చేశారు. ఒకవేళ పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా మ్యాచ్ చూడాలని అనుకుంటే, ఆయనకు కూడా టికెట్ ఇప్పించి తనతో పాటు తీసుకెళ్తానని చమత్కరించారు.

హెరిటేజ్ వివాదంపై వివరణ
హెరిటేజ్ సంస్థకు, ఇందపూర్‌కు మధ్య ఉన్న సంబంధంపై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. పన్నీర్, చీజ్ తయారీలో మాత్రమే హెరిటేజ్, ఇందపూర్ కలిసి పనిచేస్తున్నాయని, అది కేవలం వ్యాపారపరమైన ఒప్పందం మాత్రమేనని వివరించారు.

హెరిటేజ్ ఒక లిస్టెడ్ కంపెనీ అని పేర్కొంటూ.. "సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు కో-పార్టనర్‌కు (భాగస్వామి), కో-మాన్యుఫ్యాక్చరర్‌కు (తయారీదారు) తేడా తెలియకపోవడం విచారకరం" అని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వానికి సంబంధం లేదు!
ఒక ప్రైవేట్ వ్యాపార సంస్థకు, ప్రభుత్వానికి ముడిపెట్టడం సరికాదని ఆయన ప్రశ్నించారు. మంత్రి లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. విమర్శలకు సమాధానం ఇస్తూనే, ప్రత్యర్థి పార్టీ నేతపై ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Holi Holidays: హోలీ సెలవులు వచ్చేస్తున్నాయి! ఏకంగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎక్కడెక్కడంటే?

Also REad: Holi Lunar Eclipse: హోలీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 3 లేదా మార్చి 4 ఎప్పుడు? గ్రహణ ప్రభావం ఎలా ఉండబోతుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top