వేములవాడలో వన మహోత్సవం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు
వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో జరిగిన వన మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆయన ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అంతరించిపోతున్న అడవులను రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Mana Shankara Vara Prasad Movie Ticket Price Hike: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శివశంకర్ వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్కు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే సంక్రాంతి కానుకను అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. స్పెషల్ షోలతో పాటు టికెట్ రేటును ఎంత మేర పెంచిందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా సినిమాలు విడుదల రోజున సందడి మొదలవుతుంది, కానీ మెగాస్టార్ సినిమా కోసం ఒక రోజు ముందే థియేటర్లు ముస్తాబవుతున్నాయి. జనవరి 11వ తేదీ రాత్రి 8:00 PM కి ప్రీమియర్ షోలు ప్రదర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక షో కోసం టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించారు.
టికెట్ ధరల పెంపు వివరాలు
సంక్రాంతి రద్దీతో పాటు సినిమాపై ఉన్న అంచనాలను దృష్టిలో ఉంచుకుని, వారం రోజుల పాటు (జనవరి 12 నుండి 18 వరకు) పెంచిన ధరలు అమలులో ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాను సింగిల్ స్క్రీన్ టికెట్పై రూ.50..అలాగే మల్టీప్లెక్స్ల్లో ఒక్కో టికెట్పై రూ.100 పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ చిత్రబృందానికి అనుమతిని ఇచ్చింది. ఈ పెంపు జనవరి 18వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత సాధారణ ధరలు వర్తిస్తాయి.
మెగాస్టార్ బాక్సాఫీస్ మేనియా
చిరంజీవి అసలు పేరుతో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఈ ధరల పెంపు చిత్ర వసూళ్లకు పెద్ద ఎత్తున ఊతమివ్వనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ వెసులుబాటుతో మెగా అభిమానులు పండగకు ఒక రోజు ముందే థియేటర్ల వద్ద హంగామా చేయడానికి సిద్ధమవుతున్నారు.
ముఖ్య గమనిక: ప్రభుత్వం కేవలం వారం రోజుల పాటు మాత్రమే ఈ ధరల పెంపునకు అవకాశం కల్పించింది. కాబట్టి, పండగ సెలవుల్లో సినిమా చూడాలనుకునే వారు ఈ మార్పులను గమనించి టికెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం.
Also Read: Ladki Bahin Yojana: మహిళలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.3,000..పండక్కి ఆడవాళ్లకు వరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Broccoli For Weight Loss: బరువు తగ్గడానికి కఠినమైన డైట్ లేదా జిమ్ కోసం వెతకాల్సిన అవసరం లేకుండా, మన ఆహారంలో ఒక చిన్న మార్పు ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. అదే బ్రోకలీ. చూడ్డానికి క్యాలీఫ్లవర్ లాగే ఉండే ఈ ఆకుపచ్చని కూరగాయ ఆరోగ్యానికి ఒక సంజీవిని వంటిది. శరీరాన్ని దృఢంగా, చురుకుగా ఉంచుకోవాలనుకునే వారికి బ్రోకలీ ఎంత అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వేగంగా బరువు తగ్గడం (Weight Loss)
బ్రోకలీలో కొవ్వు (Fat) చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. దీనిని తిన్న తర్వాత కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. తద్వారా అనవసరమైన చిరుతిళ్లు తినకుండా నియంత్రించవచ్చు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు జీవక్రియను వేగవంతం చేసి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.
2. మధుమేహ నియంత్రణ (Sugar Control)
బ్రోకలీలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రించుకోవచ్చు.
3. గుండె ఆరోగ్యం (Heart Health)
బ్రోకలీలో పొటాషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలోనూ, రక్తపోటును (Blood Pressure) అదుపులో ఉంచడంలోనూ తోడ్పడతాయి. పరిశోధనల ప్రకారం.. బ్రోకలీని తరచుగా తినేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది.
4. ఎముకల పుష్టి (Strong Bones)
కాల్షియం, విటమిన్ K నిల్వలు అధికంగా ఉండే బ్రోకలీ ఎముకలను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను నివారించడానికి ఇది ఒక సహజ సిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది.
5. రక్తహీనత నివారణ
శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు (Anemia) బ్రోకలీని తీసుకోవడం వల్ల ఐరన్ అందుతుంది. ఇది రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.
బ్రోకలీని ఎలా తీసుకోవాలి?
దీనిని పూర్తిగా ఉడకబెట్టడం కంటే, లైట్గా స్టీమ్ (ఆవిరి మీద ఉడికించడం) చేసి తింటే పోషకాలు అలాగే ఉంటాయి. సలాడ్లు, సూప్లు లేదా కూరల్లో కూడా దీనిని వాడుకోవచ్చు.
(గమనిక: ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా లేదా కొత్త డైట్ ప్రారంభించాలనుకున్నా తప్పనిసరిగా వైద్యుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Ladki Bahin Yojana: మహిళలకు ప్రభుత్వం సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.3,000..పండక్కి ఆడవాళ్లకు వరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shani Dev Transit Effect 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు రాశి సంచారంతో పాటు నక్షత్ర మార్పులకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కొన్ని గ్రహాల సంచారాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అందులో శని గ్రహానికి మరింత ప్రత్యేకత ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జనవరి 20వ తేదీన శని ఉత్తరభాద్రపదంలోకి ప్రవేశిస్తుంది. ఈ నక్షత్రానికి శనీశ్వరుడే అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి కొన్ని రాశుల వారిపై ప్రభావం రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మరికొన్ని రాశుల వారికి సమస్యలు కూడా రావచ్చు.
ఉత్తరభాద్రపదంలోకి శని ప్రవేశించడం చాలా శుభ్రమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జనవరి 20వ తేదీన నక్షత్ర సంచారం జరగడంతో ఈ క్రింది రాశుల వారికి పురోగతి లభించడమే కాకుండా కొత్త ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికపరమైన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే అనుకున్న పనుల్లో ఆకస్మాత్తుగా విజయాలు కూడా సాధించగలుగుతారు.
ఈ రాశులవారిపై శని అనుగ్రహం
మకర రాశి
శని గ్రహం నక్షత్ర సంచారంతో మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ధైర్యం విశ్వాసం ఊహించిన స్థాయిలో పెరగబోతోంది. అలాగే పనుల్లో పురోగతి కూడా సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత పనుల ద్వారా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. తోబుట్టువుల సపోర్టుతో ఎన్నో రకాల మంచి పనులు చేయగలుగుతారు. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మిథున రాశి
శని గ్రహ సంచారంతో మిధున రాశి వారికి చర్య పరంగా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు లభించడమే కాకుండా. వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల నుంచి ఆస్తులు కూడా పొందగలిగే అవకాశాలు కల్పిస్తున్నాయి. తల్లిదండ్రులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవించగలుగుతారు. గత కొద్ది రోజుల నుంచి వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. దీంతోపాటు ఆరోగ్యం కాస్త కుదుటుపడే అవకాశాలున్నాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. నిలిచిపోయిన పనులన్నీ ముందుకు సాగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులు తప్పకుండా ఈ సమయాల్లో విదేశాలకు వెళ్లగలుగుతారు. అంతేకాకుండా వీరికి సామాజిక హోదా కూడా పెరుగుతుంది. చదువుతున్న విద్యార్థులకు ఈ సమయంలో సానుకూలమైన ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. విదేశాల్లో చదవాలనుకుంటున్న వారి కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించగలుగుతారు.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ladki Bahin Yojana Payment Status: మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం 'ముఖ్యమంత్రి లడ్కీ బహిన్ యోజన' లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన నిధులు, పండుగ వేళ మహిళల ఖాతాల్లోకి చేరే అవకాశం కనిపిస్తోంది.
ఒకేసారి రెండు నెలల డబ్బు?
ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఆర్థిక సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల నిబంధనల వల్ల గత నెలలో నిధుల విడుదల ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్, జనవరి నెలలకు కలిపి మొత్తం రూ.3,000 ఒకేసారి జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 14 లేదా 15 తేదీల్లో ఈ నగదును లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలలోని మహిళలకు ఈ ప్రయోజనం చేకూరుతుంది.
ఎన్నికల కోడ్, రాజకీయ దుమారం..
నిధుల విడుదలపై క్షేత్రస్థాయిలో సన్నాహాలు జరుగుతున్నప్పటికీ, దీనిపై రాజకీయంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 15న మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఇప్పుడు నగదు పంపిణీ చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Code of Conduct) ఉల్లంఘించడమేనని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి.
ఓటర్లను ప్రభావితం చేసేలా ఈ చర్య ఉండకూడదని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాయి. దీనివల్ల పండుగకు ముందే డబ్బు వస్తుందా లేక ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఖాతాల్లో జమ అవుతుందా అనేది ఉత్కంఠగా మారింది.
అధికారిక ప్రకటన కోసం నిరీక్షణ
ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి లోపే నిధులు విడుదల చేయాలని చూస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ వెలువడలేదు. ఎన్నికల కమిషన్ అనుమతి పొందితేనే జనవరి 14న మహిళల ఖాతాల్లోకి నగదు చేరుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Panchagrahi Raja Yoga 2026 Effect On Zodiac Telugu: ఈ ఏడాది ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తేదీల్లో మకర సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు.. ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మకర రాశిలో సూర్యుడితో పాటు మరో నాలుగు గ్రహాల కలయిక జరగబోతోంది. దీనికి కారణంగానే పంచగ్రహి రాజయోగం ఏర్పడుతుంది.
జనవరి 19వ తేదీన సూర్యుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, కుజుడు గ్రహాలు మకర రాశిలో కలయిక జరపబోతున్నాయి. దీని కారణంగానే పంచగ్రహ రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల నాలుగు రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికంగా లాభాలు కలగడమే కాకుండా ఆయా రాశుల వారికి అదృష్టం సహకరించి సంపాదన కూడా పెంచుకోగలుగుతారు. అయితే సంక్రాంతి తర్వాత ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
పంచగ్రహి రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆదాయం వృద్ధి కోసం కొత్త కొత్త అవకాశాన్ని లభించే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో రాబడులు కూడా పొందగలుగుతారు. అలాగే కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించి ఎన్నో రకాల లాభాలు పొందుతారు. జీవితంలో సమతుల్యత కూడా పెరుగుతుంది. భవిష్యత్తులో అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయగలుగుతారు.
కర్కాటక రాశి
పంచగ్రహి రాజయోగం ప్రభావంతో కర్కాటక రాశి వారికి కూడా ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి పాత అప్పుల నుంచి పూర్తిగా ఉపయోగం లభించబోతోంది. సృజనాత్మకత కూడా విపరీతంగా పెరిగి.. పిల్లలనుంచి కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటారు. ప్రేమలో మాధుర్యం కూడా విపరీతంగా పెరిగి అనుకున్న పనులు మానసిక ప్రశాంతతతో చేయగలుగుతారు. అలాగే అకస్మాత్తుగా శుభవార్తలు కూడా వింటారు.
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
తులారాశి
తులారాశి వారికి కూడా పంచగ్రహి రాజయోగం వల్ల కెరీర్ వ్యాపారాలపరంగా చాలావరకు కలిసి రాబోతోంది. ముఖ్యంగా వ్యాపారాల్లో అనుకున్న పురోగతి కూడా సాధించగలుగుతారు ఉద్యోగాలతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో కొత్త కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో విశ్వాసం కూడా విపరీతంగా పెరుగుతుంది. వీరికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన పాత వివాదాలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తులు కూడా పొందగలుగుతారు. అనేక రకాల తగాదాలు కూడా పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. బంగారంతో పాటు వెండి, ఆస్తుల్లో పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు సామాజికంగా కూడా సేవలు చేసే సూచనలు ఉన్నాయి. అనుభవం కలిగిన వ్యక్తులతో సంబంధాలు ఏర్పడి.. భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు పొందుతారు.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Almont Kid Cough Syrup Ban: పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్నపిల్లల్లో అలర్జీలు, ఆస్తమా, హే ఫీవర్ వంటి సమస్యల చికిత్సకు వాడే 'అల్మాంట్-కిడ్' (Almont-Kid) సిరప్ను తక్షణమే వాడటం నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఔషధ నియంత్రణ మండలి (DCA) కఠిన ఆదేశాలు జారీ చేసింది.
నిషేధానికి గల కారణం ఏమిటి?
తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ శనివారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ సిరప్లో 'ఇథిలీన్ గ్లైకాల్' (Ethylene Glycol) అనే రసాయనం ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. మోతాదుకు మించి ఉన్న ఇథిలీన్ గ్లైకాల్ పిల్లల ప్రాణాలకే ముప్పు కలిగించవచ్చు. ఇది మూత్రపిండాల వైఫల్యం, తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
కల్తీ గుర్తింపు..
బీహార్కు చెందిన 'ట్రిడస్ రెమెడీస్' (Tridus Remedies) అనే సంస్థ తయారు చేసిన ఈ సిరప్లో కల్తీ జరిగినట్లు తొలుత బెంగాల్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత అప్రమత్తమైన తెలంగాణ అధికారులు పరీక్షలు నిర్వహించగా కల్తీ నిజమేనని తేలింది.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
ఔషధ నియంత్రణ మండలి అధికారులు తల్లిదండ్రులకు, మెడికల్ షాపుల యాజమాన్యాలకు కీలక సూచనలు చేశారు. మీ పిల్లలకు ఈ 'అల్మాంట్-కిడ్' సిరప్ను వాడుతుంటే వెంటనే ఆపేయండి. ఇప్పటికే ఈ సిరప్ బాటిల్ మీ ఇంట్లో ఉంటే దానిని పారవేయండి. మీ పిల్లలకు ఇప్పటికే ఈ సిరప్ ఇచ్చినట్లయితే, ముందు జాగ్రత్తగా ఒకసారి శిశువైద్యులను (Pediatrician) సంప్రదించి పరీక్షలు చేయించడం మంచిది.
అధికారుల చర్యలు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫార్మసీలు, డ్రగ్ స్టోర్ల నుండి ఈ సిరప్ నిల్వలను వెంటనే ఉపసంహరించుకోవాలని (Recall) ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించి ఈ సిరప్ను విక్రయించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
గమనిక: మీ పరిసరాల్లో ఎవరైనా ఈ సిరప్ను విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chiranjeevi Sankranthi Movies: ఎప్పటిలాగే మన టాలీవుడ్ హీరోలు సంక్రాంతి పండుగకి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. మంచి కథలతో తమ అభిమానులను ఖుషీ చేసేందుకు థియేటర్లలో వచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే ఈ సంక్రాంతికి మునుపటి కంటే సినిమాల పోటీ ఎక్కువగానే ఉంది. ఏకంగా 5 సినిమాలు.. 'ది రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'అనగనగా ఒక రాజు', 'నారీనారీ నడుమ మురారి' విడుదల కానున్నాయి.
అయితే వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఇంతకు ముందు ఎన్నో సంక్రాంతి పండుగలకు తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. సినిమాలతో అలరించడమే కాకుండా సూపర్ హిట్స్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా విడుదల కానున్న క్రమంలో చిరు సంక్రాంతి సెంటిమెంట్ కొనసాగుతుందా? తన కెరీర్లో సంక్రాంతి రేసులో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి? ఎన్ని హిట్స్ కొట్టాయనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవికి, సంక్రాంతి పండుగకు విడదీయలేని అనుబంధం ఉంది. బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సెంటిమెంట్ చిరంజీవికి చాలా బాగా కలిసొచ్చింది. తన కెరీర్లో దాదాపు 15 కి పైగా చిత్రాలు సంక్రాంతి సీజన్లో విడుదల కాగా, అందులో మెజారిటీ సినిమాలు బ్లాక్బస్టర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం విడుదల కాబోతున్న 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా నేపథ్యంలో, గతంలో సంక్రాంతి రేసులో నిలిచిన చిరంజీవి సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
| సినిమా పేరు | విడుదల సంవత్సరం | ఫలితం (Result) | విశేషాలు |
| వాల్తేరు వీరయ్య | 2023 | బ్లాక్బస్టర్ | చిరంజీవి వింటేజ్ మాస్ లుక్తో బాక్సాఫీస్ను ఊపేసింది. |
| ఖైదీ నంబర్ 150 | 2017 | బ్లాక్బస్టర్ | 10 ఏళ్ల విరామం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చి రికార్డులు సృష్టించింది. |
| అంజి | 2004 | యావరేజ్ / ఫ్లాప్ | గ్రాఫిక్స్కు ప్రశంసలు దక్కినా, కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. |
| మృగరాజు | 2001 | డిజాస్టర్ | భారీ అంచనాలతో వచ్చి నిరాశపరిచింది. |
| అన్నయ్య | 2000 | హిట్ | ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పించి మంచి వసూళ్లు రాబట్టింది. |
| స్నేహం కోసం | 1999 | హిట్ | చిరంజీవి ద్విపాత్రాభినయం మరియు సెంటిమెంట్ బాగా పండింది. |
| హిట్లర్ | 1997 | బ్లాక్బస్టర్ | చిరంజీవి కెరీర్లో మర్చిపోలేని కమ్బ్యాక్ మూవీ ఇది. |
| ముఠా మేస్త్రి | 1993 | బ్లాక్బస్టర్ | మాస్ ఆడియన్స్లో చిరు ఇమేజ్ను శిఖరాగ్రానికి చేర్చింది. |
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద 'మెగా' రికార్డులు..
సక్సెస్ రేట్: చిరంజీవి సంక్రాంతికి వస్తున్నారంటే థియేటర్ల వద్ద సందడి వేరే స్థాయిలో ఉంటుంది. ఆయన సంక్రాంతి సినిమాల్లో 70% కంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. రాజకీయాల తర్వాత చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది 'ఖైదీ నంబర్ 150'తో సంక్రాంతికే కావడం విశేషం. గత ఏడాది (2023) 'వాల్తేరు వీరయ్య'తో మరోసారి సంక్రాంతి మొనగాడు అనిపించుకున్నారు.
ఈ ఏడాది పోటీ..
ఈసారి సంక్రాంతికి 'ది రాజాసాబ్' (ప్రభాస్) వంటి భారీ చిత్రాలతో పోటీ ఉన్నప్పటికీ, చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ ఆశలు ఉన్నాయి. టైటిల్ సెంటిమెంట్, సంక్రాంతి ట్రాక్ రికార్డ్ చూస్తుంటే ఈసారి కూడా చిరంజీవి తన సక్సెస్ పరంపరను కొనసాగించేలా కనిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nanda's Journey Conspiracy Latest News: ప్రముఖ ట్రావెల్ బ్లాగర్ నందాస్ జర్నీ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు నంద తనపై జరుగుతున్న కుట్రలకు సంబంధించిన అంశాలను బయట పెడుతూ సంచలన వీడియోను యూట్యూబ్లో విడుదల చేశారు.. గత కొద్ది రోజుల నుంచి తన వెనుక కొందరు వ్యక్తులు తిరుగుతూ.. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటమే కాకుండా.. ఛానల్ ను డిలీట్ చేయడమే కాకుండా, తన ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన వీడియో రూపంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఈ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో కూడా ఆయన ఓ పోస్ట్ ని పెట్టారు. ఎవరో కావాలని తనపై కుట్ర చేస్తున్నారని ఇందులో పేర్కొన్నారు. దీంతో అప్పటినుంచి తన సబ్స్క్రైబర్స్ వరుసగా ఏం జరిగిందని కామెంట్లు పెట్టడం ప్రారంభించారు.
ఆవేదన వ్యక్తం చేస్తూ విడుదల చేసిన వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఈ ఛానల్ తనది కాదని.. తనొక కూలిగా పనిచేస్తున్నానని కొందరు ప్రచారం చేస్తున్నారని.. కానీ ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి విడుదలయ్యే ప్రతి ఒక్క వీడియో ఐడియా నుంచి ఎడిటింగ్ వరకు అన్ని తానే స్వయంగా చూసుకుంటున్నారని నంద స్పష్టం చేశారు. థంబ్ నెయిల్స్ తప్ప మిగిలిన అన్ని రకాల పనులన్నీ తానొక్కడే చేస్తున్నట్లు ఈ వీడియోలో తెలిపారు. తనకు, ఈ యూట్యూబ్ ఛానల్ కు వెనకాల ఎవ్వరూ లేరని.. కానీ కొంతమంది కావాలనే తాము కూడా ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు.
కావాలని తన పేరు చెప్పుకొని లాప్ట్యాప్తో పాటు ఫోన్ కొనుక్కోవడానికి కొందరు దాతల నుంచి డబ్బులు వసూలు చేశారని.. కానీ అతనికి దాతల నుంచి ఎలాంటి డబ్బులు అందలేదని ఈ వీడియోలో స్పష్టం చేశారు. ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలకు అతను వాడుతున్న అన్ని రకాల వస్తువులను యూట్యూబ్ సంపాదనతో కొనుగోలు చేశారని చెప్పారు. అంతేకాకుండా యూట్యూబ్ నుంచి వచ్చే సంపాదన ను ఇంటికి ఇవ్వకుండా జల్సాలకు ఖర్చు చేస్తారని వస్తున్న ఆరోపణలను కూడా అతను ఖండించారు. ప్రతి నెల నంద తన ఇంటికి ఖర్చులకోసం రూ.20 వేల వరకు ఇంటికి పంపిస్తున్నట్లు ఆధారాలు కూడా చూపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు తనపై ఎన్నో రకాల కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Sankranti Bonus: ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్.. సూపర్ బోనస్ ప్రకటించిన కేంద్రం
అలాగే కేదార్నాథ్ పర్యటన చివరి కోరికగా కొందరు చిత్రీకరించారని.. అంతేకాకుండా ఈ జర్నీలో కొందరు యాక్సిడెంట్ రూపంలో చంపడానికి, ఛానల్ ను పూర్తిగా రిమూవ్ చేయడానికి స్కెచ్ వేశారని కూడా నంద ఈ వీడియోలో తెలిపారు. అంతేకాకుండా తను ఎప్పుడు ఒక యూట్యూబర్ అని చెప్పుకొని.. హోటల్స్లో తోపాటు రెస్టారెంట్లలో డబ్బులు ఎగ్గొట్టలేదని.. ఒకవేళ చెప్పుకొని తిని ఉన్నట్లు నిరూపిస్తే.. ఛానల్ ను మూసేస్తానని సవాల్ విసిరారు. అంతేకాకుండా వీడియో వివరణ.. తనకు ఏమైనా జరిగితే అది సహజ మరణం కాదని.. తన వెనుక ఉన్న కుట్ర దారులు చేసిన పనేనని హెచ్చరిస్తూ ప్రేక్షకుల మద్దతు కోరారు..
Also Read: Sankranti Bonus: ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్.. సూపర్ బోనస్ ప్రకటించిన కేంద్రం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Budget 2026: ఫిబ్రవరి 1వ తేదీ 2026న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్కు సంబంధించిన అంచనాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా పన్ను సంస్కరణలపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి మధ్యతరగతి, జీతభత్యాల ఉద్యోగులు, పెట్టుబడిదారులకు ఊరటనిచ్చే ప్రకటనలు చేస్తారని అంచనా వేస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ 2025 లో పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ :
గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, స్వచ్ఛందంగా పన్ను చెల్లింపులను ప్రోత్సహించడం, పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. 2020 బడ్జెట్లో కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం, ఆ తర్వాత దాన్ని ఆకర్షణీయంగా మార్చేందుకు స్టాండర్డ్ డిడక్షన్ను పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంది. 2024 బడ్జెట్లో క్యాపిటల్ గెయిన్స్ పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేసి పెట్టుబడిదారులకు ఊరటనిచ్చింది. ఇక 2025 బడ్జెట్లో అయితే ఏటా రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా ప్రకటించడం ద్వారా పెద్ద చర్చకు దారి తీసింది.
క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులకు ట్యాక్స్ నుంచి రిలీఫ్?
ఇప్పుడు 2026 బడ్జెట్లో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని పన్ను నిపుణులు చెబుతున్నారు. 2022 బడ్జెట్లో క్రిప్టో లావాదేవీలపై 1 శాతం TDS, లాభాలపై 30 శాతం ఫ్లాట్ ట్యాక్స్ విధించడం వల్ల ఈ రంగం తీవ్రంగా ప్రభావితమైంది. లాభాలపై నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం లేకపోవడం కూడా పెట్టుబడిదారులను నిరుత్సాహపరిచింది. ఈ నేపథ్యంలో క్రిప్టో పరిశ్రమ ప్రభుత్వం వద్ద పన్ను ఉపశమనం కోరుతోంది. ఈసారి బడ్జెట్లో కనీసం TDS రేటును తగ్గించడం లేదా నష్టాల సర్దుబాటుకు అవకాశం కల్పించడం వంటి మార్పులు రావచ్చన్న ఆశలు ఉన్నాయి.
స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లపై గుడ్ న్యూస్?
ఇక స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడిదారులకు కూడా శుభవార్త వచ్చే అవకాశముంది. ప్రస్తుతం దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను రహిత పరిమితి రూ.1.25 లక్షలుగా ఉంది. దీనిని 2026 బడ్జెట్లో రూ.2 లక్షలకు పెంచే ఆలోచనపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా జరిగితే చిన్న, మధ్యస్థ పెట్టుబడిదారులకు పెద్ద ఊరట లభించడంతో పాటు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
కొత్త విధానంలో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితి పెరగవచ్చు:
కొత్త ఆదాయపు పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితి కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రూ.4 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ఉంది. దీన్ని రూ.5 లక్షలకు పెంచితే తక్కువ ఆదాయ వర్గాలకు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా కొత్త విధానాన్ని ఎంచుకున్న ఉద్యోగులు, యువతకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: Budget 2026: బడ్జెట్పై గంపెడు ఆశలు పెట్టుకున్న సీనియర్ సిటిజన్లు? అందులో రాయితీ దక్కుతుందా..??
కొత్త విధానంలో టర్మ్, ఆరోగ్య బీమాపై కూడా తగ్గింపు:
అదే విధంగా కొత్త పన్ను విధానంలో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై కూడా తగ్గింపులు అనుమతించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ మినహాయింపులు పాత విధానంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొత్త విధానంలో కూడా 80C, 80D తరహా ప్రయోజనాలు కల్పిస్తే మరింత మంది కొత్త విధానానికి మారే అవకాశం ఉంటుంది.
డెట్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు ఈ బడ్జెట్ కీలకం:
డెట్ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులకు కూడా ఈ బడ్జెట్ కీలకంగా మారొచ్చు. 2023 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల వల్ల డెట్ ఫండ్ల లాభాలపై పన్ను భారం పెరిగింది. దీంతో ఈ విభాగంపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది. 2026 బడ్జెట్లో ఈ నిబంధనలను సడలించి, మళ్లీ డెట్ ఫండ్లకు ఆకర్షణ తీసుకురావాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని సమాచారం.
మొత్తానికి 2026 కేంద్ర బడ్జెట్ పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారులు, మధ్యతరగతి ప్రజలకు కీలకంగా మారనుంది. ఫిబ్రవరి 1న వచ్చే ప్రకటనలు నిజంగా ఊరటనిస్తాయా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Accidental Insurance Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒక పెద్ద ఊరటనిచ్చే ప్రకటన చేశారు. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 5.14 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఉద్యోగుల కుటుంబాలకు బలమైన ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన వివరించారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. ఈ నిర్ణయం కేవలం ప్రకటనల వరకే పరిమితం కాదని స్పష్టం చేశారు. ఈ బీమా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ఇప్పటికే రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం విస్తృతంగా చర్చలు జరిపిందని తెలిపారు. ఉద్యోగుల జీతాలు ఏ బ్యాంకులో జమ అవుతున్నాయో.. అదే బ్యాంకు ద్వారా బీమా కవరేజ్ అందించేలా ప్రత్యేక శాలరీ ప్యాకేజీలను రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియలో ఉద్యోగులపై ఒక్క రూపాయి కూడా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని భట్టి విక్రమార్క వెల్లడించారు.
రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎప్పటికీ విస్మరించలేదని ఆయన స్పష్టం చేశారు. గత పాలనలో పేరుకుపోయిన బకాయిలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలనెలా చెల్లిస్తూ వస్తోందని గుర్తు చేశారు. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం లేకుండా చూడటంతో పాటు, పదవీ విరమణ ప్రయోజనాలు, అలవెన్సులు తదితర అంశాలను కూడా క్రమబద్ధంగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ఈ ప్రమాద బీమా పథకం ప్రధాన ఉద్దేశం ఉద్యోగి విధి నిర్వహణలో గానీ, ఇతర కారణాల వల్ల గానీ అనుకోని ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతే, ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలుకాకుండా చూడడమేనని డిప్యూటీ సీఎం చెప్పారు. ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు మాత్రమే కాకుండా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన సందర్భాల్లో కూడా ఈ బీమా కింద పరిహారం లభించేలా నిబంధనలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఇప్పటికే రాష్ట్రంలోని కీలక రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇలాంటి బీమా రక్షణ అమలులో ఉందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్న సుమారు 38 వేల మంది రెగ్యులర్ కార్మికులకు, అలాగే ట్రాన్స్కో, జెన్కో వంటి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 71 వేల మందికి పైగా ఉద్యోగులకు ఇప్పటికే కోటి రూపాయలకుపైగా ప్రమాద బీమా అందుతోందని చెప్పారు. అదే తరహాలో ఇప్పుడు సాధారణ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 5.14 లక్షల మంది ఉద్యోగులకూ ఈ రక్షణ కవచాన్ని విస్తరించబోతున్నామని స్పష్టం చేశారు.
త్వరలోనే ఈ బీమా పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, అర్హతలు, క్లెయిమ్ విధానాలను అధికారికంగా ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ఉద్యోగులను ప్రభుత్వ కుటుంబ సభ్యులుగానే భావించి, వారి భద్రత, భవిష్యత్తు కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నామని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Sankranti Gift: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతి కానుక అందించింది. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని.. మరో మూడు విడతలుగా ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని తెలంగాణ మంత్రి ప్రకటించారు. ఆ ఇందిరమ్మ ఇల్లు పేదలకు ఇచ్చాకే తాము అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇల్లందు గడ్డపైనే నుంచి ప్రతిపక్షాలకు ఝలక్ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Pay Revison Commission: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి గిఫ్ట్.. పీఆర్సీపై కీలక ప్రకటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీ బలరాం నాయక్తో కలిసి పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రసంగం చేశారు. రానున్న మూడేళ్లలో పల్లెలు పట్టణాల్లో మూడు విడతలగా ఇందిరమ్మ ఇళ్ళను ఇవ్వడం జరుగుతుందని ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు.
Also Read: Tirumala Darshan: 10 రోజుల్లో 7.83 లక్షల మందికి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం
మరో ఐదేళ్లు ఇందిరమ్మ ప్రభుత్వమే ఉంటుందని పొంగులేటి జోష్యం చెప్పారు. రానున్న మున్సిపల్ ఇతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో 68 నుంచి 69 శాతం సర్పంచులు ఉప సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Tirumala: ఈ ఒక్క నంబర్కు 'హాయ్' అంటే చాలు.. తిరుమల వివరాలు మీ ఫోన్లోకి
ఏ ప్రభుత్వం చేయని విధంగా సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని పొంగులేటి శ్రీనివాస రెడ్డి వివరించారు. మున్సిపాలిటీ పరిధిలో 76వ జీవో సమస్య పరిష్కరిస్తానని తెలిపారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో నిర్వహించి ఇల్లందు పట్టణాన్ని అద్దంలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లోను ఇల్లందులో ప్రతి వార్డులో పర్యటిస్తానని పొంగులేటి చెప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ నియోజకవర్గం లో వందకు పైగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు గెలుచుకోవడం జరిగిందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని ఈ సందర్భంగా సర్పంచులకు ఎమ్మెల్యే తెలిపారు. రానున్న మున్సిపల్ జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Konda Surekha vs Ponguleti: తెలంగాణ గిరిజన కుంభమేళా.. సమ్మక్క- సారక్క జాతరకు ఏర్పాట్లు శరవేంగా సాగుతున్నాయి.. వన జాతరలో ప్రత్యేక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు చేస్తోంది. దాదాపు నెలరోజులుగా మేడారం అభివృద్ది పనులు జరుగుతున్నాయి. మేడారం జాతరను గతంలో ఎప్పుడు లేని రీతిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా మేడారం జాతర విశిష్టత ప్రపంచానికి తెలిసేలా మేడారం నిర్మాణం పనులు చేస్తున్నారు. అయితే జాతర ఏర్పాట్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఎప్పటికప్పుడు పరామర్శిస్తున్నారు. జాతర ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు లేకుండా దిశానిర్ధేశం చేస్తున్నారు. కానీ మేడారం అభివృద్ధి పనులకు మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. మంత్రి సురేఖ మేడారం అభివృద్ది పనులకు ఎందుకు దూరంగా ఉన్నారని నేతలు తెగ చర్చించుకుంటున్నారు.
Also Read: Tirumala Darshan: 10 రోజుల్లో 7.83 లక్షల మందికి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం
అయితే మేడారం జాతర విషయంలో వరంగల్ జిల్లా మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరేలా చేశాయని తెలుస్తోంది. నెలాఖరులో జరగనున్న సమ్మక్క సారక్క కోసం మేడారంలో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అయితే జిల్లాకే చెందిన..దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న సురేఖ... జాతర పనుల్లో జోక్యం చేసుకోవడం లేదు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వారానికోసారి మేడారం వెళ్లి రివ్యూ చేస్తున్నారు. అయితే దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నకొండా సురేఖ వెళ్లడం లేదు. అయితే సీతక్క, పొంగులేటితో విభేదాల కారణంగానే సురేఖ వెళ్లడం లేదా అన్న చర్చ జరుగుతోంది. లేదా గతంలో జరిగిన గొడవ కారణంగా సీఎం రేవంతే ఆమెను దూరంగా ఉండమని చెప్పారా అన్నది తెలియడం లేదు. కారణం ఏదైనా దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ.. మేడారం జాతరను పట్టించుకోకపోవడం చర్చగా మారింది.
Also Read: Tirumala: ఈ ఒక్క నంబర్కు 'హాయ్' అంటే చాలు.. తిరుమల వివరాలు మీ ఫోన్లోకి
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు. మేడారం జాతర ఉండటంతో.. అక్కడ పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. అలాగే మేడారం డెవలప్ మెంట్ కోసం నిధులు మంజూరు చేశారు. దాంతో అధికారులు టెండర్లను పిలిచారు. ఇక్కడే ఇద్దరు మంత్రుల మధ్య వివాదం మొదలైంది. మేడారం టెండర్లలో ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకున్నారని మంత్రి సురేఖ అరోపించారు. అంతేకాదు దేవాదాయ శాఖకు సంబంధించిన 71 కోట్ల రూపాయాల టెంటర్ను తన మనిషికి ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. తన శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. గతంలోనూ కొండా మురళీ మంత్రి పొంగులేటితో తమకు ఇబ్బందిగా ఉందని అధిష్టానానికి లేఖ రాశారు. ఇప్పుడు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. చివరకు మంత్రి సురేఖ క్షమపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Also Read: Pay Revison Commission: ఉద్యోగులకు సీఎం చంద్రబాబు సంక్రాంతి గిఫ్ట్.. పీఆర్సీపై కీలక ప్రకటన
కొద్దిరోజులుగా కొండా సురేఖ తీరుపైన అనేక విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సొంత పార్టీ నేతలనే ఇబ్బంది పెడుతున్నారనే చర్చ ఉంది. ఇటీవల మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి జిల్లా ఎమ్మెల్యేలను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కడియం శ్రీహారిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత వరంగల్ భద్రకాళి ఆలయం కమిటీ వ్యవహారంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో ఢీ అంటే ఢీ అన్నారు. తనకు సంబంధించిన ఇద్దరు నేతలకు ఉన్నత పదవులు కట్టబెట్టడంపై ఎమ్మెల్యే వర్గం భగ్గుమంది. అటు పరకాలలో మంత్రి పెత్తనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గానికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ ఉంది. మరోవైపు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితోనూ కొండా సురేఖ వివాదం పెట్టుకుంటున్నారు. వేం నరేందర్ రెడ్డి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు.. అలాంటి నేతతోనే కొండా సురేఖ గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారని జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తంమీద మేడారం విషయంలో మంత్రి కొండా సురేఖ సైలెంట్ గా ఉండటం వరంగల్ జిల్లా పాలిటిక్స్లో చర్చనీయాశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
MLC Ananta Babu: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రూటు మార్చారు. ఎన్నికల సమయం తరహాలో అక్కడ టిడిపి ఎమ్మెల్యే మిరియాల శిరీష దంపతుల దోపిడీపై విమర్శలు చేస్తున్నారు. దీనికి టిడిపి ఎమ్మెల్యే సైతం గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో రచ్చ జరుగుతోంది. ఇటీవల వైసిపి అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ అనంత బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే శిరీష రంపచోడవరం నియోజకవర్గంలో దోచుకో... పంచుకో అనే స్థితిలో ఉన్నారనీ... రాష్ట్రంలోనే ఆమె కరప్షన్ లో నెంబర్ వన్ అంటూ ఫైర్ అయ్యారు. ఒక సర్పంచ్ కు ఉన్న ఆదరణ కూడా ఎమ్మెల్యేకు లేదనీ మండిపడ్డారు. ఆ వ్యాఖ్యల పై టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Also Read: RTC Good News: సంక్రాంతి పండుగకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. అద్దె బస్సుల సమ్మె విరమణ
అయితే ఈ డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుండగానే.. ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి రెచ్చిపోయారు. ఎమ్మెల్యే దంపతులు నియోజకవర్గంలోని ప్రజలను పట్టి పీడిస్తున్నారనీ.. అడ్డతీగల మండలంలో జరుగుతున్న రంగు రాళ్ల తవ్వకాల్లో ఎమ్మెల్యే భర్తకు సంబంధాలు ఉన్నాయనీ విమర్శించారు. ఎమ్మెల్యే దంపతుల అవినీతి బాగోతం పరాకాష్టకు చేరుకుందనీ.... ప్రభుత్వ ఇళ్ల లబ్ధిదారుల వద్ద తమ ఏజెంట్ల ద్వారా మామూళ్లు వసూలు చేస్తున్నారనీ తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ అనంత బాబు తోపాటు అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి సైతం టీడీపీ ఎమ్మెల్యే పై దుమ్మెత్తి పోశారు. ఎమ్మెల్యే దంపతులు లక్షలు దోచుకుని వేలల్లో అంబులెన్స్ సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారనీ అన్నారు. తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు వ్యక్తిగత మాటలతోనే మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి కౌంటర్ ఇచ్చారు.
ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తనను టార్గెట్ చేయడంతో టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష సైతం ఘాటుగానే సమాధానం చెబుతున్నారు. డోర్ డెలివరీ అనంతబాబుకు తమ పార్టీ కార్యకర్తలతో బుద్ధి చెబుతామని అన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ధనలక్ష్మిని డమ్మీ చేసి ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు చేశారనీ.. ఢిల్లీలో ఆస్తులు, చేపల చెరువులను సంపాదించారనీ విమర్శించారు. తాను ఊక లారీల్లో గంజాయి, రంగురాళ్లు, అక్రమ కలప వ్యాపారాలు చేయలేదని అన్నారు. ఇప్పటికే రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చామనీ.. అసెంబ్లీలో మాట్లాడి పోలవరం నివాసితుల కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు కృషి చేసినట్లు ఎమ్మెల్యే శిరీష చెబుతున్నారు.
కొద్దిరోజులుగా రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు అన్ని తానై వ్యవహరిస్తున్నారు. ఇక 2014 నుంచి 2019 ఎన్నికల్లో అనంతబాబు బలం తోడవ్వడంతో మహిళా అభ్యర్థులైన వంతల రాజేశ్వరి, నాగులపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్యేల గెలుపుకు దోహదపడింది. 2024 ఎన్నికల్లో టిడిపి టికెట్ ను అనూహ్యంగా దక్కించుకున్న అంగన్వాడి కార్యకర్తల మిరియాల శిరీష ఇక్కడ విజయం సాధించడంతో అనంతబాబుకు బ్రేక్ పడింది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిరీష, ఆమె భర్త విజయ్ భాస్కర్ ల హవా కొనసాగుతోంది. డోర్ డెలివరీ కేసు.. పార్టీ అధికారంలో లేకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల అనంతబాబు కొత్త పంథాలో వెళ్తున్నారు.
వైసీపీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలో లేక నియోజకవర్గంలో పట్టు కోసమో గానీ టీడీపీ ఎమ్మెల్యేపై దోపిడీ విమర్శలు మొదలు పెట్టారు. ఇకనైనా ఎమ్మెల్యే దంపతులు తీరు మార్చుకుని వారి గురించి రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఆలోచించాలనీ సూచిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఇక్కడ జరిగే దోపిడీ వ్యవహారాలు.. అసాంఘిక కార్యకలాపాలపై అనంతబాబు ఇలాగే రచ్చ చేస్తూ వెళతారా అనేది చూడాలి. ఏదీఏమైనా ఇప్పటికే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో నియోజకవర్గంలో ఏం జరుగుతుందో బహిరంగం అయ్యింది. గతంలో వైసిపి ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్యే మధ్య రగడలో ఇకపై ఏం జరుగుతుందో చూడాలి మరి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి